breaking news
Yadadri
-
భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య
నాగారం : పాత కక్షలు, భూ తగాదాల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.కొత్తపల్లి గ్రామానికి బయ్యం యాకస్వామి (43), బయ్యం నవీన్ వరుసకు చిన్నాన్న, పెద్దనాన్న కొడుకులు. గతంలో వీరి తండ్రులైన బయ్యం భిక్షం, బయ్యం అర్వపల్లి మధ్య భూ పంపకాల సమయంలో అవకతవకలు జరిగానే నెపంతో ఇరు కుటుంబాలు తరచూ గొడవలు పడుతుండేవారు. మంగళవారం బయ్యం యాకస్వామి తన గొర్రెలను వివాదంలో ఉన్న భూమిలో మేపుతుండగా బయ్యం నవీన్ తల్లి ధనమ్మ గమనించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బుధవారం కూడా యాకస్వామి తన గొర్రెలను వివాదాస్పద భూమిలో మేపుతుండగా.. మరోసారి ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బయ్యం యాకస్వామి.. నవీన్ తల్లిని తిట్టడంతో కోపోద్రిక్తుడైన నవీన్ తన దగ్గర ఉన్న గొడ్డలి తీసుకొని యాకస్వామి తలపై బలంగా కొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడే కుప్పకూలాడు. నవీన్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాకస్వామిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగ అరెస్ట్
సూర్యాపేట టౌన్ : కోదాడ పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను కోదాడ పట్టణ, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన పట్నంశెట్టి రాజు అలియాస్ రాజిరెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తూ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాల బాటపట్టాడు. 2021 నుంచి కోదాడలో మొత్తం 10 ఇళ్లలో చోరీలు చేయగా, ఈ ఏడాదిలోనే ఏడు ఇళ్లలో దొంగతనాలు చేశాడు. హైదరాబాద్ నుంచి ప్రయాణికులను కోదాడకు తీసుకొచ్చిన అనంతరం రాత్రి వేళ అక్కడే ఉండి, కారును నిర్మానుష్య ప్రాంతంలో పార్కింగ్ చేసేవాడు. తెల్లవారుజామున తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, స్క్రూడ్రైవర్తో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదును అపహరించేవాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన కారు అసలు నంబర్కు బదులుగా నకిలీ నంబర్ ప్లేట్ను ఉపయోగించేవాడు. బుధవారం ఉదయం కోదాడ పట్టణంలో చేపట్టిన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన రాజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి కారును తనిఖీ చేయగా 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు లభించిందన్నారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు ఉపయోగించిన స్క్రూడ్రైవర్లు, షూ సాక్స్లు, కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించగా, మరికొన్నింటిని కరిగించారని, ఇంకొన్నింటిని ఫైనాన్స్ సంస్థల్లో కుదవపెట్టి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినట్లు అదేవిధంగా అప్పుల చెల్లింపులకు వినియోగించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ రూ.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ -
చర్చలతోనే మానసిక సమస్యలపై అపోహలు దూరం
భువనగిరి (బీబీనగర్) : మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలను నిరంతరం చర్చించడం ద్వారానే తొలగించవచ్చని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. బుధవారం బీబీనగర్ ఎయిమ్స్లో నిర్వహించిన ఆత్మహత్యల నివారణ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మానసిక ఒత్తిడి, తీవ్ర కుంగుబాటుకు గురైన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న వారిని ముందస్తుగానే గుర్తించేలా ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులకు ‘గేట్ కీపర్ ట్రైనింగ్’ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం ‘వాల్ ఆఫ్ హోప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర లక్కిరెడ్డితో పాటు పలువురు వైద్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ -
క్రికెట్లో మెరిసిన గిరిబాబు
మెట్ల మార్గంలో పైకప్పు నిర్మాణానికి శంకుస్థాపనఐఐటీ–హెచ్ను సందర్శించిన ఎంజీయూ అధ్యాపకులు ఫ అక్టోబర్ 1 నుంచి పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి టీ10 పోటీలకు ఎంపిక సంస్థాన్ నారాయణపురం : పట్టుదల, నిరంతర సాధనతో సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సుక్క గిరిబాబు జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 7న హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి టీ–10 క్రికెట్ ఎంపిక పోటీల్లో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో టీ–10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్లోని బటాలాలో అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 3వ సీనియర్ నేషనల్ టీ–10 క్రికెట్ ఛాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. గ్రామం నుంచే క్రీడా ప్రస్థానం.. న్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న గిరిబాబు.. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ వస్తున్నారు. నారాయణపురంలోని జెడ్పీహెచ్ఎస్లో పాఠశాల విద్యను, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చౌటుప్పల్లోని మాతశ్రీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. క్రీడలనే భవిష్యత్తుగా ఎంచుకుని తంగడపల్లిలోని కళాశాలలో బీపీఈడీ, ఎంపీఈడీ అభ్యసిస్తూనే క్రికెట్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు.. రాష్ట్ర స్థాయి ఎంపికల్లో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికై న గిరిబాబు.. పంజాబ్లో జరిగే సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్నారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయికి ఎదగడం పట్ల గ్రామస్తులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిబాబు ఎంపిక పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, గ్రామ పెద్దలు, స్నేహితులు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలోనూ రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రికెట్ ఆడుతున్న గిరిబాబు వందేళ్ల పుట్టినరోజు వేడుకలుచిలుకూరు : మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన రెణబోతు రాములమ్మ వందేళ్ల పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వేడుకల్లో ఆమె ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు, మనవళ్లు, మునిమనవలు, మనవరాళ్లు, మునిమనవరాళ్లు పాల్గొన్నారు.యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం వరకు భక్తులకు నీడను కల్పించేందుకు ఏర్పాటు చేయనున్న పైకప్పు(టెన్సిల్ కానోపి) పనులకు బుధవారం ఈఓ భవానీశంకర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ఎం.ఎస్. అగర్వాల్ ఫౌండ్రీస్ సంస్థ తరఫున ప్రమోద్ అగర్వాల్ రూ.1.50 కోట్లతో ఈ పైకప్పు నిర్మాణ పనులను చేయిస్తున్నారని వెల్లడించారు. సదరు కంపెనీ ప్రెసిడెంట్ సుజయ్ సమక్షంలో ఈ శంకుస్థాపన పూజలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే ఈ పనులను ప్రారంభించి, పూర్తి చేయనున్నట్లు ఈఓ వివరించారు. నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) అధ్యాపకుల బృందం మంగళవారం హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఐఐటీలోని వివిధ విభాగాలలో కొనసాగుతున్న అత్యాధునిక పరిశోధనలు, అక్కడ అందుబాటులో ఉన్న మెరుగైన విద్యా వసతుల గురించి అక్కడి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎంజీయూ, ఐఐటీహెచ్ సంయుక్తంగా చేపట్టదగిన పరిశోధనా అంశాలపై అధ్యాపకులు చర్చించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాళ్లు అరుణప్రియ, హరీష్కుమార్, వై. ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.ప్రస్తుతం గిరిబాబు నారాయణపురం గిరిజన గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు లక్ష్య సాధన కోసం మైదానంలో నిరంతరం శ్రమిస్తున్నారు. విధులు ముగిసిన తర్వాత క్రికెట్ ప్రాక్టీస్కు సమయం కేటాయిస్తూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు. -
అస్వస్థతతో కూలీ మృతి
చిట్యాల : ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలికట్టె గ్రామానికి చెందిన గొలనుకొండ లింగయ్య(59) ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఫాం పాండ్ పనులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. నిజాయితీ చాటుకున్న కరాటే మాస్టర్ హాలియా : ఏటీఎంలో మరొకరు మర్చిపోయిన నగదును తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ కరాటే మాస్టర్. హాలియాలోని ఎస్బీఐ ఏటీఎంలో ఈ నెల 6న సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి రూ.43,000 నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చారు. ఏటీఎంలో నగదు డిపాజిట్ అయిందని భావించిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఆ నగదు ఏటీఎం నుంచి తిరిగి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆయన వెనుకనే ఉన్న కరాటే మాస్టర్ తంగేళ్ల సత్యనారాయణరాజు ఆ డబ్బును గమనించారు. ఆ రూ.43000 నగదును భద్రంగా తనవద్దే ఉంచుకుని.. బుధవారం ఎస్బీఐ మేనేజర్ లావూరి మోహన్నాయక్ సమక్షంలో సంబంధిత వ్యక్తికి అందజేశారు. సత్యనారాయణరాజు నిజాయితీని బ్యాంకు మేనేజర్ లావూరి మోహన్నాయక్ అభినందించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎం.డీ ఇమ్రాన్ భువనగిరిటౌన్ : కరీంనగర్లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల్లో భువనగిరికి చెందిన ఎం.డీ ఇమ్రాన్ రెండోసారి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇమ్రాన్ ఎంపిక పట్ల స్థానిక కార్మిక వర్గాలు, ఏఐటీయూసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యచండూరు : అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండలం బోడంగిపర్తిలో బుధవారం జరిగింది. బోడంగిపర్తి గ్రామానికి చెందిన మహ్మద్ జానీ(42) తనకున్న అర ఎకరంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడంతో పంట పూర్తిగా వాడుపట్టి ఎండుతుందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గతేడాది, ఈసారి కలిసి రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది కూడా పంట చేతికి రాదని గ్రహించిన ఆయన అప్పులు కట్టే మార్గం లేక బుధవారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో జానీని మునుగోడు ఆస్పత్రికి.. అక్కడి నుంచి అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. బైక్, ఆటో ఢీ.. ఒకరు మృతిమేళ్లచెరువు : బైక్, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చింతలపాలెం మండలం శోభనాద్రిపురం పరిధిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభనాద్రిగూడెం గ్రామానికి చెందిన ఆకారపు సత్యనారాయణ(35) మేళ్లచెరువులో నివాసముంటూ స్థానికంగా ఓ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. బుధవారం తన అత్తగారి ఊరైన చింత్రియాలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. శోభనాద్రిగూడెం గ్రామ పరిధిలోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న గోతినితప్పించబోయి ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు. మృతుడికి భార్య ఉంది. -
తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి
నకిరేకల్ : రాష్టంలో కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం రాత్రి ఆయన నకిరేకల్లో విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుతూ చావు డప్పు కొట్టించి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడం చూస్తే సీఎం రేవంత్రెడ్డి, డీజీపీ కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగిందని అనిపిస్తోందన్నారు. రేవంత్రెడ్డి సీఎం హోదాలో ఉండి కూడా అనేక సందర్భాల్లో బండబూతులు మాట్లాడతున్నారని అన్నారు. కేసీఆర్ చావును కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే అని గుర్తుంచుకోవాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. వీరందరు కూడా కేసీఆర్ రాజకీయ భిక్షతో వచ్చి ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి తన 1000 రోజుల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని, బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి ఆయన ఇంటి ముందు చావు డప్పు కొట్టలేమా అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్రెడ్డి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టకుండా అసెంబ్లీని సజావుగా నడపాలని కోరారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య -
సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం పోరాడాలి
ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి యాదగిరిగుట్ట : యువత ప్రజా ఉద్యమాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా బుధవారం రెండో రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సోషలిస్టు సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత ముందుకు సాగాలన్నారు. అమరుల త్యాగాలను స్మరించడమే కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి అన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేశ్వరీ మాట్లాడుతూ.. ఉద్యోగాలు, విద్య, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రశ్నిస్తున్న జెన్–జీ యువతను దిమాగీ నక్సల్స్ అంటూ ముద్ర వేయడం చాలా బాధకరమన్నారు. యువతకు ఉపాధిని హక్కుగా కల్పించేందుకు ఏఐవైఎఫ్ ప్రతిపాదిస్తున్న భగత్సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు యానాల దామోదర్రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, సీనియర్ నాయకుడు రేగు సిద్దయ్య అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ ప్రతినిధుల సభకు అధ్యక్ష వర్గంగా వలి ఉల్లా ఖాద్రీ, గంగోత్రి, ఉమా, మమత, కునుకుట్ల శంకర్, తీర్పారీ వెంకటేశ్వర్లు, బిజ్జా శ్రీనివాసులు, పేరబోయిన మహేందర్ వ్యవహరించారు. సౌహార్ధ సందేశాలను ఏఐవైఎఫ్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, యుగంధర్, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమీద్ది శ్రీనివాస్, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు రోషన్ కుమార్ సిన్హా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు లింగం రవి, టి. సత్యప్రసాద్, శ్రీమాన్, యుగంధర్, చేవూరి కొండల్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు నహీం, బద్దుల శ్రీనివాస్, శేఖర్రెడ్డి, కల్లెపల్లి మహేందర్, బబ్బూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ
చౌటుప్పల్, చిట్యాల : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి వెంబడి చౌటుప్పల్, చిట్యాల పరిధిలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, కేఫ్లలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్రెడ్డి, జిల్లా డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పి. స్వాతి తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. కుళ్లిన మాంసం.. ఆహార పదార్ధాలు.. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని చాచా దాబాలో కుళ్లిన మాంసం నిల్వలను అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నేలపై పడేయడం, సింథటిక్ కలర్స్ వినియోగించడం, ఫ్రిజ్లలో ఫంగస్, పరిసరాలలో మురికి పేరుకుపోవడాన్ని గుర్తించి దాబాను సీజ్ చేసి, లైసెన్స్ సస్పెండ్ చేశారు. కుళ్లిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేయడంతో పాటు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు.అదేవిధంగా మల్కాపురంలోని సంగం హోటల్లోనూ ఫంగస్ సోకిన కూరగాయలు, ఉష్ణోగ్రత నియంత్రణ లేని ఫ్రిజ్లు, కుళ్లిపోయిన మాంసం, కూరగాయలను గుర్తించి ధ్వంసం చేశారు. చిట్యాల పట్టణంలోని బ్లూఫాక్స్ మినర్వా కేఫ్లో ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయకపోవటం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంట గదిలో పరిశుభ్రత లోపించడం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు 55 కిలోల నాణ్యత లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేసి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆహార పదార్థాలకు సంబంధించిన ఆరు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి నాసిరకం ఆహార పదార్థాలతో వ్యాపారం చేయడం ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుట్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార తయారీలో నాణ్యతతో పాటు పరిశుభ్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని, మాంసాన్ని నిల్వ చేసి తిరిగి మరుసటి రోజు వాడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ హైదరాబాద్–విజయవాడ హైవేపై గల హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో లోపాలను గుర్తించిన అధికారులు ఫ పలు హోటళ్ల సీజ్, నోటీసులు జారీ -
బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
ఆలేరురూరల్ : బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన రాంపాక శ్రీధర్(23) హైదరాబాద్లోని నేరేడ్మెట్లో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన కలకోటి నివాస్(22) కూడా పెయింటింగ్ పనిచేస్తూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. శ్రీధర్, నివాస్ స్నేహితులు. వారిద్దరు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి స్టేషన్ ఘనపూర్కు బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ శివారులోని భాను మెస్ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్, నివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాల్ని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీధర్ తండి పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ ఉదయ్కిరణ్ తెలిపారు. ఫ ఇద్దరు యువకులు దుర్మరణం -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మేళ్లచెరువు : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మేళ్లచెరువు కేంద్రంలోని ఎన్ఎస్పీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోగం ఏసుబాబు (30) రెండు రోజుల క్రితం మేళ్లచెరువు మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఏసుబాబుతో పాటు అతడి బంధువులైన ఏడుకొండలు, ప్రవీణ్ కలిసి మంగళవారం సాయంత్రం మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని ఎన్ఎస్పీ ముక్త్యాల బ్రాంచ్ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏసుబాబు వల విసరగా, అది నీటిలో ఎక్కడో చిక్కుకుంది. ఆ వలను బయటికి తీసేందుకు ఏసుబాబు కాలువలోకి దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయన కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు. రైలు కింద పడి దుర్మరణంమిర్యాలగూడ : విష్ణుపురం–కొండ్రపోల్ రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడు పచ్చ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ రామకృష్ణ అన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ అభినవ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు 87126 58595, 87125 13805 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. -
30 మంది పాత నేరస్తుల బైండోవర్
కనగల్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కనగల్, చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలకు చెందిన 30 మంది పాత నేరస్తులను పోలీసులు బైండోవర్ చేశారు. తొలుత కనగల్ పోలీస్ స్టేషన్లో చండూరు సీఐ రాము వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలన్నారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్ల ఎదుట పాత నేరస్తులను బైండవర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కె. రాజీవ్రెడ్డి, శివకుమార్, శోభన్బాబు పాల్గొన్నారు. -
గణేశ్ మండపాలకు ఆన్లైన్లో అనుమతి
వినాయక చవితి ఉత్సవాల వేళ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు తగిన భద్రతా నిబంధనలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. పండుగ సంబరాల్లో విద్యుత్ భద్రతపై సంస్థ ప్రత్యేక అవగాహన మార్గదర్శకాలను విడుదల చేసింది. భువనగిరిటౌన్ : వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల కోసం నిర్వాహకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసు శాఖ సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్సవాల నిర్వహణ అనుమతుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఈ–పోర్టల్ సేవలను ప్రారంభించింది. డిజిటల్ ఎన్ఓసీ పొందే విధానం పోలీసు శాఖ మార్గదర్శకాలు ● ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో పాదచారులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలి. ● మండపాల వద్ద పూజా సామగ్రి, అగ్గిపెట్టెలు, హారతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అగ్నిమాపక జాగ్రత్తలు అందుబాటులో ఉంచాలి. ● అనుమతించిన సమయంలో మాత్రమే మైకులు వాడాలి. డీజేలు, అధిక శబ్ధాలు చేసే స్పీకర్లను పూర్తిగా నివారించి ధ్వని కాలుష్య నిబంధనలు పాటించాలి. ● స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. ● ఏవైనా సమస్యలు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే నిర్వాహకులు, ప్రజలు డయల్ 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహకారం తీసుకోవాలి. నిర్వాహకులు పాటించాల్సిన జాగ్రత్తలు ● విద్యుత్ లైన్లకు తగినంత దూరంలో మాత్రమే మండపాలను ఏర్పాటు చేయాలి. లైన్ల కింద లేదా వాటికి దగ్గరగా మండపాలు, అలంకరణలు చేయొద్దు. ● విద్యుత్ తీగలను తాకేలా ఎలాంటి లైటింగ్, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయొద్దు. ● విద్యుత్ స్తంభాలకు జెండాలు, బ్యానర్లు, అలంకరణ సామగ్రి కట్టడం అత్యంత ప్రమాదకరం. ● ప్రతి మండపంలో సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవడంతో పాటు షార్ట్ సర్క్యూట్లు, షాక్ నివారణకు ఈఎల్సీబీ లేదా ఆర్సీసీబీ పరికరాలను తప్పనిసరిగా అమర్చాలి. ● ఎక్కడైనా తీగలు తెగిపడినా, స్పార్కింగ్ లేదా విద్యుత్ లీకేజీ గమనించినా వెంటనే అధికారులకు తెలపాలి. ఫ సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పోలీసు శాఖ ఫ డిజిటల్ ఎన్ఓసీ పత్రాన్ని నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం -
ఫిర్యాదుల పరిష్కారమేదీ!
ఈయన గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన మలిపెద్ది మాధవరెడ్డి. తన తల్లి పేరిట నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, తహసీల్దార్ సహకారంతో 4 ఎకరాల 1 గుంట భూమిని తన బంధువు అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఇంత వరకు అతడిపై చర్యలు తీసుకోలేదని మాధవరెడ్డి పేర్కొంటున్నాడు. ఇలా పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి ఫిర్యాదులో జిల్లావ్యాప్తంగా 71 శాతం ఉన్నాయి. సాక్షి, యాదాద్రి : ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ ప్రజాభవన్, జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నా, వాటికి సరైన పరిష్కారం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే 2023 డిసెంబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 09 వరకు మొత్తం 2,152 దరఖాస్తులు రాగా అందులో కేవలం 624 (29 శాతం) పరిష్కరించారు. మిగతావి పెండింగ్లోనే ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులే అధికంగా ఉండడం గమనార్హం. 2023 డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు మొత్తం దరఖాస్తులు 2,152 పరిష్కరించినవి 624 పెండింగ్లో ఉన్నవి 1,528 చర్యలు ప్రారంభించినవి 1,432ప్రజావాణి అర్జీలపై అలసత్వం ఫ సమస్యలు విని పెడచెవిన పెడుతున్న అధికారులు ఫ రెండున్నరేళ్లలో వచ్చిన అర్జీలు 2,152 ఫ ఇప్పటి వరకు 29 శాతమే పరిష్కారం ఫ అత్యధికంగా భూ సమస్యలఫిర్యాదులే పెండింగ్ -
జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
యాదగిరిగుట్ట రూరల్ : జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామని నాబార్డు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ ఝాన్సీ అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో అజీవ ఫార్మర్స్, ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జీవ వైవిధ్యం ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి పంటలను సాగు చేయాలన్నారు. స్థానిక పంటలను సంప్రదాయ విత్తనాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని అందించవచ్చన్నారు. జీవ వైవిధ్యమే పరిరక్షణ లక్ష్యంగా నాబార్డు ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీస్ సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య, ఏఓ సుధారాణి, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, నెమ్మాని సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ అనురాధ, అజీవ ఏపీఓ సీఈఓ మహేష్, కోర్డినేటర్ వినోద్, డైరెక్టర్ కె.అరుణ, ఎల్లుబాయ్, స్వరూప, మౌనిక, లావణ్య, సుగుణమ్మ, లక్ష్మి, సునీత పాల్గొన్నారు. -
‘త్రిఫ్ట్’ ఆశలపై నీళ్లు
మాకు మగ్గమే జీవనాధారం. మగ్గం నేయగా వచ్చిన ఆదాయం నుంచి భార్యాభర్తలిద్దరం ప్రతినెలా 2,400 త్రిఫ్ట్ కట్టుకుంటున్నాం. ప్రభుత్వం నెలకు రెండింతలు డబ్బులు జమ చేయాలి. కానీ రెండు నెలలు మాత్రమే వేసింది. గత సంవత్సరం జూన్ నుంచి డబ్బులు పడలేదు. వెంటనే బకాయి మొత్తాన్ని జమ చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – మంగళపల్లి శ్రీహరి, చేనేత కార్మికుడు, భూదాన్పోచంపల్లిప్రభుత్వం మే నెల వరకు చేనేత కార్మికుల ఆర్డీ–2 ఖాతాలో డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం నెలనెలా జమచేయకపోయినా కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆలస్యమైనా ప్రభుత్వం ఒకేసారి డబ్బులను జమ చేస్తుంది. కార్మికులు మాత్రం క్రమం తప్పకుండా నెలనెలా పొదుపు డబ్బులు కట్టుకోవాలి. – శ్రీనివాస్రావు, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ భూదాన్పోచంపల్లి: చేనేత వృత్తిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న త్రిఫ్ట్ (పొదుపు) పథకం లక్ష్యం నీరుగారుతోంది. కార్మికులు క్రమం తప్పకుండా తమ వాటా చెల్లిస్తున్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 15 నెలలుగా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఏకంగా రూ.32.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో చేనేత కార్మికులకు ఈ పథకం నామమాత్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10,690 మంది కార్మికులు చేనేత ప్రభావిత మండలాలు, గ్రామాలలో త్రిఫ్ట్ పథకంపై అధికారులు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,690 మంది మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు ఈ పథకంలో చేరారు. ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ 15 నెలలుగా ప్రభుత్వ వాటా కింద చేనేత కార్మికుల ఆర్డీ–2 అకౌంట్లో జమచేయాల్సిన డబ్బులను చెల్లించలేదు. పథకం అమలు ఇలా.. చేనేత కార్మికులు తమ ఆదాయం నుంచి 8 శాతం వాటాను రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ అకౌంట్–1)లో జమచేస్తే, ప్రభుత్వం ఆ మొత్తానికి రెండింతలు అనగా 16 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఆర్డీ–2 అకౌంట్లో జమ చేస్తుంది. గరిష్టంగా నెలకు రూ. 1200 (అనుబంధ కార్మికుడైతే రూ. 800) బ్యాంకులో జమచేసుకోవచ్చు. పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం సమాన వాటా (1:1) ఇస్తుంది. కార్మికుడు గరిష్టంగా నెలకు రూ. 1000 (అనుబంధ కార్మికుడు రూ. 600) జమచేస్తే, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్డీ–2లో జమ చేస్తుంది.రెండేళ్ల అనంతరం జమ అయిన మొత్తం డబ్బును కార్మికుడు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. మరో 6 నెలల్లో ముగియనున్న పథకం రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ పథకం మెచ్యూరిటీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. గత సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం 2026 మార్చితో ముగుస్తుంది. మరో ఆరు నెలల్లో పథకం ముగుస్తుండటంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు తమ వాటా కింద ప్రతినెలా రూ.కోటి 85 లక్షలు జమ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తన వాటా కింద నెలకు రూ.2.17 కోట్ల చొప్పున జమ చేయాల్సి ఉండగా, గత సంవత్సరం జూన్ నెల నుంచి ఆ నిధులు పెండింగ్లోనే ఉన్నాయి.ఫ 15 నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ వాటా నిధులు ఫ జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన రూ.32.55 కోట్ల బకాయిలు ఫ మరో ఆరు నెలల్లో ముగియనున్న పథకం గడువు ఫ ఆందోళనలో 10 వేల మందికి పైగా చేనేత కార్మికులు -
12న జాతీయ లోక్ అదాలత్
భువనగిరిటౌన్ : జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 12న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత తెలిపారు. లోక్ అదాలత్ ఏర్పాట్లపై బుధవారం ఆమె పోలీస్ అధికారులు, న్యాయవాదులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హనుమంతుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. భువనగిరి బార్ అసోసియేషన్లో సభ్యులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.విద్యాసాగర్, న్యాయవాదులు పాల్గొన్నారు. 15 వరకు ఓపెన్ స్కూల్ దరఖాస్తుల గడువుభువనగిరి : ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు 2026–27 విద్యా సంవత్సరానికి ఎటువంటి అపరాద రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుంధతి తెలిపారు. బుధవారం ఆమె భువనగిరికి వచ్చిన సందర్భంగా ఓపెన్ స్కూల్కు సంబంధించిన పోస్టర్ను డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఈఓ భిక్షపతి, డీఐఈఓ సురేష్రెడ్డిలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు’కు ఆమోదం హర్షణీయంసాక్షి యాదాద్రి : ఘట్కేసర్ నుంచి ఖాజీపేట వరకు రైల్వే మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్ట్యా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు రూ.2,419 కోట్ల నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఖాజీపేట వరకు సబర్బన్ రైలు సర్వీసుల విస్తరణకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. తాజా నిర్ణయంతో ఘట్కేసర్–ఖాజీపేట మార్గంలో అదనపు లైన్లు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఈ మల్టీ ట్రాకింగ్ పనులను 2029 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర మంత్రివర్గానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. -
అభివృద్ధి పనులకు నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం శాసనసభలోని సీఎం పేషీలో కలిశారు. ఆలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు 15వ ప్యాకేజీ కాలువ తవ్వకం పనుల రాజాపేట మండలం జాలసింగారం వరకు వేగవంతం పూర్తిచేయాలని కోరారు. రూ.45 కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా దాదాపు 100 చెరువులను నింపడంతో పాటు 7,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని సీఎంకు వివరించారు. ప్రధాన రహదారులకు అనుసంధానంగా గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులకు రూ.5కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన ఐలయ్య ఆలేరు మండలం కొలనుపాకలోని సోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించాల్సిందిగా కోరగా మంత్రి విడుదల చేసినట్టు ఐలయ్య పేర్కొన్నారు. ఫ సీఎం రేవంత్రెడ్డికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విజ్ఞప్తి -
యోగాసనాలతో ఏకాగ్రత
యోగాసన పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు భువనగిరి : యోగాసనాల ద్వారా క్రీడాకారుల్లో ఏకాగ్రత పెరుగుతుందని భువనగిరి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ చంద్రమౌళి అన్నారు. బుధవారం భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో 55వ కేవీఎస్ 2026–27 జాతీయ క్రీడాపోటీలు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. తొలిరోజు యోగాసనాల విభాగంలో బాలుర అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు కొనసాగాయి. కార్యక్రమంలో కేవీ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పోల్గొన్నారు. -
నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
సాక్షి, యాదాద్రి : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్లో గణేశ్ నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14న ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి రూట్ మ్యాపులు, అవసరమైన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ అక్షాంక్ యాదవ్ మాట్లాడుతూ గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో కమిటీ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నిమజ్జనం వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణిరవికుమార్, భువనగిరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పసుపునూరి నాగభూషణం, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషిచేద్దాం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్ బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి ధనంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరిస్తున్న అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అధికారులుఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
జూలూరు–రుద్రవెల్లి బ్రిడ్జికి మోక్షం ఎప్పుడో?
భూదాన్పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్య మూసీ నదిపై చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పదేళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే దర్శనమిస్తోంది. నిధులు మంజూరవుతున్నా, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్ల పనులు టెండర్ల దశ దాటడం లేదు. మూడుసార్లు నిధులు.. నిజాం కాలం నాటి పాత లోలెవల్ బ్రిడ్జి శిథిలంకావడంతో, 2016 జూన్లో నాబార్డు కింద రూ.8.50 కోట్లతో పనులు ప్రారంభించారు. కానీ భూసేకరణ జాప్యం వల్ల 2021 నాటికి నిధులు ల్యాప్స్ అయ్యాయి. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్–ప్లాన్ కింద రూ.10.50 కోట్లు మంజూరు చేయగా, కేవలం 8 పిల్లర్లు నిర్మించిన కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదంటూ పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇటీవల ప్రభుత్వం హెచ్ఎండీఏ కింద రూ.18.50 కోట్లు కేటాయించింది. మొదటిసారి టెండర్లకు ఎవరూ రాకపోగా, రెండోసారి పిలిచిన టెండర్లు ప్రస్తుతం పరిశీలన దశలోనే మూలుగుతున్నాయి. వర్షాకాలంలో రాకపోకలు బంద్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల ప్రజలకు ఈ రోడ్డే ప్రధాన మార్గం. మూసీ నదికి వరద వచ్చిన ప్రతీసారి లోలెవల్ బ్రిడ్జి మునిగిపోతోంది. దీనివల్ల రుద్రవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు జూలూరు జెడ్పీ హైస్కూల్కు వెళ్లలేక బంద్ అవుతున్నారు. బీబీనగర్లోని పరిశ్రమలకు వెళ్లే స్థానిక యువకులు, వ్యాపారులు గమ్యస్థానాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఫ పదేళ్లుగా సాగుతున్న పనులు ఫ మూసీ నది ఉప్పొంగితే నిలిచిపోతున్న రాకపోకలు ఫ హెచ్ఎండీఏ ద్వారా రూ.18.50 కోట్లు మంజూరైనా ముందుకుసాగని టెండర్ల ప్రక్రియ ప్రభుత్వాలు మారినా పదేళ్లుగా జూలూరు–రుద్రవెల్లి మూసీ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ప్రతి వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నిధులు మంజూరైనా పనులు ఎందుకు చేపట్టడం లేదో అధికారులు చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని పనులు త్వరగా పూర్తి చేయించాలి. – దిండు బాలరాజు, జూలూరు టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం టెండర్ల పరిశీలన ప్రక్రియ నడుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే నెల రోజుల్లో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం. – వెంకన్న, హెచ్ఎండీఏ ఏఈ -
కారు ఢీకొని గేదె మృతి
త్రిపురారం : కారు ఢీకొని గేదె మృతిచెందింది. ఈ ఘటన 165వ నంబర్ జాతీయ రహదారిపై త్రిపురారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వలసాని రమ్య, శ్రీను దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సీజన్లో సాగు నీరు లేకపోవడంతో జీవనోపాధి నిమిత్తం గేదెను కొనుగోలు చేశారు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం గేదెను మేత కోసం పొలాల్లోకి తోలారు. రాత్రయినా గేదె ఇంటికి రాకపోవడంతో గేదెను వెతుక్కుంటూ వెళ్లేసరికి త్రిపురారం గ్రామ పరిధిలో సాగర్ రోడ్డుపై కారు ఢీకొని గేదె చనిపోయి కనిపించింది. మరికొన్ని రోజుల్లో ఈనడానికి సిద్ధంగా ఉన్న గేదె మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత రైతు రమ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గేదెను రూ.1,30,000తో కొనుగోలు చేశామని, తాము జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తికి జైలుశిక్ష రామగిరి(నల్లగొండ) : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎన్. రోజారమణి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... కనగల్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన బైరు గణేష్ ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి నిలదీయడంతో పెద్దలు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. దీంతో ఆ యువతి 2020 నవంబర్ 11న కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ సతీష్రెడ్డి కేసు నమోదు చేయగా.. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి విచారణ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి ఎన్. రోజారమణి నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం ● పంచాయతీ సెక్రటరీపై ఎంపీడీఓకు ఫిర్యాదుమేళ్లచెరువు : ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకొని మోసం చేసిన పంచాయతీ సెక్రటరీపై బాధితుడు సోమవారం గ్రీవెన్స్లో ఎంపీడీఓకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు అజ్మీర శ్రీనివాస్కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ రూ.లక్ష తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా.. తన డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతుండడంతో పంచాయతీ సెక్రటరీపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. విద్యుదాఘాతంతో మహిళ మృతి త్రిపురారం : ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన త్రిపురారం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ గైకూరి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీకి చెందిన ఇస్లావత్ సేలి(52) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగా సోమవారం ఇంట్లో దుస్తులు ఉతికి ఇనుప తీగపై ఆరేస్తుండగా.. కరెంట్ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఇంట్లో రేకుల కింద ఉన్న విద్యుత్ వైరుకు దుస్తులు ఆరేసే తీగ ఆనుకొని ఉండడంతో విద్యుత్ సరఫరా జరిగి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఆమె కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రూ.20 లక్షల విలువైన ఫోన్ల రికవరీ: ఎస్పీ
భువనగిరి: సీఈఐఆర్ వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వల్లే జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వేగంగా రికవరీ చేయగలుగుతున్నామని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. జిల్లా పోలీసులు రికవరీ చేసిన రూ. 20 లక్షల విలువైన 100 మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు ఆయన స్వయంగా అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు అందగానే వివరాలను సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తూకం వేయకుండానే బియ్యం సరఫరా చేశారు భువనగిరిటౌన్ : జిల్లాలోని రేషన్ దుకాణాలకు తూకం వేయకుండానే ఆగస్టు మాసం బియ్యం సరఫరా చేశారని రేషన్ డీలర్ల సంఘం ఆరోపించింది. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగల రాజయ్య ఆధ్వర్యంలో కలెక్టర్తో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. దుకాణాలకు సరఫరా చేసే క్రమంలో తూకం వేయకపోవడం వల్ల బియ్యం పరిమాణం తగ్గి లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గత 2025 ఏప్రిల్ నెల నుంచి రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం స్టాక్ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిలగూడెం వెంకటేష్, రాష్ట్ర మాజీ కార్యదర్శి రేపాక రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మన్నె యాదగిరి, రాష్ట్ర మాజీ కోశాధికారి గంగాదేవి మహేష్, జిల్లా సభ్యుడు శ్రీనివాస్, మోత్కూరు ఐఎంజీ పాయింట్ అధ్యక్షుడుసైదులు, వివిధ మండలాల అధ్యక్షులు హరి కిషన్, బుచ్చయ్య, దశరథ, నవీన్, సోమకాని రాజు, ప్రధాన కార్యదర్శులు నరసింహ, కృష్ణ, కూరాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మల్లేష్, సత్యం, కోశాధికారి పగిడిపల్లి ఆంజనేయులు, డీలర్లు అమతమ్మ, కృష్ణవేణి, పిట్టల అశోక్, వెంకట్ రెడ్డి, అంజయ్య, కుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు. కేంద్ర వేతన సలహా బోర్డులో సీఐటీయూను చేర్చాలిభువనగిరిటౌన్ : కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో సీఐటీయూ, ఏఐటీయూసీ , ఐఎన్టీయూసీ వంటి ప్రధాన సెంట్రల్ ట్రేడ్ యూనియన్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ డిమాండ్ చేశారు. భువనగిరి మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్లకు కొమ్ముకాసే బీఎంఎస్ వంటి సంఘాలకు మాత్రమే బోర్డులో చోటు కల్పించి, కార్మికుల పక్షాన నిలిచే యూనియన్లను పక్కన పెట్టడం దారుణమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు గాయపాక శీను, బానోత్ శంకర్, మన్నే రాజు, ఇటికల రాజలింగం, కొండ యాదమ్మ, కంచనపల్లి సునీత, కుశంగల నిర్మల, రంగా ఎల్లమ్మ పాల్గొన్నారు. -
ఎన్హెచ్ 930పీ పరిహారంపై రైతుల నిరసన
భువనగిరిటౌన్ : గౌరవెల్లి–భద్రాచలం ఎన్హెచ్ 930పీ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు 2022 నాటి పాత రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని పోచంపల్లి, వలిగొండ మండలాల బాధిత రైతులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రైతుల ప్రధాన డిమాండ్లు బాధిత రైతులు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉండగా, ప్రభుత్వం 2022 నాటి పాత విలువల ఆధారంగా నామమాత్రపు పరిహారం నిర్ణయించడం సరికాదన్నారు. పోచంపల్లి మండలంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.24–25 లక్షలు ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ కేవలం రూ.11–13 లక్షలుగానే ఉందని, వలిగొండ మండలంలో రూ.28–29 లక్షలుగా చూపించారన్నారు. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు పరిహారంతో 5 గుంటల భూమి కూడా కొనలేమని ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలో రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు ఎకరాకు రూ.38 లక్షల నుంచి రూ1.20 కోట్ల వరకు పరిహారం ఇస్తూ, ఎన్హెచ్ 930పీ రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారన్నారు. గతంలో కలెక్టర్తో జరిగిన చర్చల్లో 80 శాతం వరకు అదనపు పరిహారం వచ్చేలా చూస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనికోరారు. ఈ నిరసనలో బాధిత రైతులు వారాల శేఖర్రెడ్డి, పాక మల్లేష్యాదవ్, కోడ రామచంద్రారెడ్డి, మల్గా రవీందర్, వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, మల్గా వెంకటేశ్, రాములు, రామచందర్, మహేష్, బాణాల ఎల్లారెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి, నొముల మహేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, కర్ణాటి ధనుజయ్, పాండు తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారమేచెల్లించాలని కలెక్టర్కు వినతి -
హైదరాబాద్ వైపు వాహనాల బారులు
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజులుగా విజయవాడ మార్గంలో రద్దీ నెలకొనగా.. సోమవారం మాత్రం హైదరాబాద్ మార్గంలో వాహనాలు బారులదీరాయి. వివాహాలు, గ్రామ దేవతల పండుగలకు గ్రామాలకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవ్వడంతో హైదరాబాద్ వైపునకు వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్న చౌటుప్పల్, ధర్మోజిగూడెం, తూప్రాన్పేట గ్రామాల వద్ద వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
శిథిలావస్థలో రంగనాథ రంగశాల
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లకు వినోదాన్ని అందించేందుకు హిల్కాలనీలో నిర్మించిన రంగనాథ రంగశాల నేడు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడిన ఈ ప్రాంగణం ప్రస్తుతం కంపచెట్లతో నిండిపోయి కనుమరుగయ్యే దుస్థితికి చేరింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాన్ని కాపాడి, ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. నాడు కళలకు కాణాచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాగర్లోని మూడు కాలనీల్లో సుమారు 30వేల మంది నివసించేవారు. చుట్టుపక్కల గ్రామాలు, తండాల ప్రజలు సైతం ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములయ్యారు. వీరికి వినోదం కోసం ఏర్పాటు చేసిన ఈ రంగనాథ రంగశాల కళలకు కాణాచిగా పేరొందిందని పాతతరం వారు గుర్తు చేసుకుంటున్నారు. పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. అప్పటి ప్రముఖ నటీనటులు నూతనప్రసాద్, సావిత్రి, రేలంగి, జగ్గారావు, గిరిజ, రాజనాల తదితరులు ఇక్కడ నాటకాలు ప్రదర్శించారని చెబుతున్నారు. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు సైతం ఇక్కడి నాటకాలను వీక్షించి అబ్బురపడేవారు. కంపచెట్ల మధ్య కనుమరుగు సాగర్ కాలనీల్లో సినిమా థియేటర్ల రాకతో క్రమంగా రంగనాథ రంగశాలలో నాటకాల ప్రదర్శనలు తగ్గిపోయాయి. అనంతరం కొంతకాలం సభలు, సమావేశాలకు ఉపయోగించారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో సుమారు రూ.50 లక్షలు వెచ్చించి విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్, వాష్రూమ్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సరైన నిర్వహణ లేకపోవడంతో రంగశాల ఆవరణ అంతా కంపచెట్లతో నిండిపోయింది. విద్యుత్ బోర్డులు, ఫ్యాన్లు అపహరణకు గురయ్యాయి. బస్టాండ్కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మినీ థియేటర్గా మారిస్తే.. గతంలో సాగర్ కాలనీల్లో మూడు సినిమా థియేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఒక్కటి కూడా లేదు. దీంతో వినోదం కోసం స్థానికులు హాలియా, మాచర్ల, మిర్యాలగూడ వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రంగనాథ రంగశాలను అద్దెకు ఇచ్చి మినీ థియేటర్గా అభివృద్ధి చేస్తే.. ప్రజలకు వినోదం అందడంతో పాటు భవనానికి నిరంతర నిర్వహణ ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు. సాగునీటి శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ఫ నిర్వహణ లేక కనుమరుగవుతున్న నాగార్జునసాగర్లోని చారిత్రక వేదిక ఫ ఒకప్పుడు ప్రముఖ నటీనటుల నాటకాలతో కళకళ ఫ ప్రస్తుతం కంపచెట్లు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా ఫ మినీ థియేటర్గా మార్చాలని స్థానికుల విజ్ఞప్తి -
అక్షర పూదోట.. ప్రగతిబాట
బొమ్మలరామారం మండలం రాముని తండా ప్రాథమిక పాఠశాల 2022– 24 వరకు మూతపడి ఉంది. ఏకోపాధ్యాయురాలు నీలం శ్రీదేవి ఈ పాఠశాలకు పునరుజ్జీవం పోశారు. 2024– 25లో తండాలోని ప్రతి ఇంటికి తిరిగి 27 మంది విద్యార్థులతో పాఠశాలను పునః ప్రారంభించారు. 2025– 25లో విద్యార్థుల సంఖ్య 30కి చేరుకుంది. పాఠశాలలోని కిచెన్ గార్డెన్లోని ఆర్గానిక్ కూరగాలతో పాటు సన్నబియ్యంతో మధ్యాహ్నం రుచికరమైన భోజనం వండిపెట్టడం ద్వారా విద్యార్థులను పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తున్నారు. సాక్షి యాదాద్రి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు విద్యాశాఖ పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తోంది. సర్కారు కల్పిస్తున్న మౌలిక వసతులు, బ్రేక్ఫాస్ట్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల నిబద్ధతతో.. మూతబడిన స్కూళ్లు సైతం తెరుచుకుని నడుస్తున్నాయి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లాలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక కథనం. ఉపాధ్యాయుల సర్దుబాటు ఏ ఒక్క విద్యార్థీ చదువులో వెనుకబడకూడదన్న సంకల్పంతో విద్యాశాఖ సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. పది నుంచి ఇరవై వరకు విద్యార్థులున్న పాఠశాలలకు అదనంగా మరో ఉపాధ్యాయుడిని కేటాయించారు. పది లోపు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ బడుల్లో టీచర్ అత్యవసర సెలవు పెడితే, సీఆర్పీలతో నడిపిస్తున్నారు. డ్రాపౌట్స్కు చెక్.. బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకుండా చూడటమే లక్ష్యంగా వేసవిలో నిర్వహించిన ప్రత్యేక సర్వే సత్ఫలితాలనిచ్చింది. బడి మానేసిన పిల్లలను వయస్సును బట్టి సాధారణ విద్యా స్రవంతిలోకి తీసుకొచ్చారు. బాలికలను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ), బాలురను స్థానిక జెడ్పీ, గురుకుల, వసతి గృహ పాఠశాలల్లో చేర్పించడంతో జిల్లాలో బడి మానేసే వారి శాతం గణనీయంగా తగ్గింది. పునాది అభ్యసన బలోపేతానికి.. పునాది అభ్యసనం బలోపేతానికి ఎంపిక చేసిన 150 సముదాయ పాఠశాలల్లో ప్రత్యేక పరిశీలన బృందాలు తరగతులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అభ్యాస దీపికలు, సూచిక పుస్తకాలు, నల్లబల్ల సాధనతో పాటు ఉపాధ్యాయులు స్వయంగా పిల్లల పక్కన కూర్చుని అక్షరాలు దిద్దించడం, పదాలు చదివించడం చేస్తున్నారు. లెక్కల్లో కూడికలు, తీసివేతలపై పట్టు సాధించేలా విద్యార్థులను దత్తత తీసుకుని వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. అక్షరాస్యత సాధనలో సవాళ్లు.. జిల్లాలో అక్షరాస్యత 65.53శాతం ఉండగా ఇందులో స్త్రీల అక్షరాస్యత 55.02శాతంగా ఉంది. వందశాతం అక్షరాస్యత సాధనకు అడ్డంకిగా మారిన ప్రధాన సమస్యలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బాలికల డ్రాపౌట్కు ప్రధాన కారణమైన బాల్యవివాహాలను అరికట్టి, అనాథ,పేద బాలికలను కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నారు. చౌటుప్పల్, మోత్కూర్, ఆలేరు, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు ప్రాంతాల్లో పత్తి ఏరే పనులకు పిల్లలను తీసుకెళ్లే ధోరణిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మిల్లుల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక విద్యా ఏర్పాట్లు చేశారు. ఫ రూపురేఖలు మారిన సర్కారు బడులు ఫ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, ఉచిత పుస్తకాల పంపిణీ ఫ బోధనకు ఆటంకం లేకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు ఫ బడి మానేసిన వారిపై ప్రత్యేక దృష్టి ఫ ప్రైవేట్ నుంచి సర్కారు బడిబాట పడుతున్న విద్యార్థులుప్రభుత్వ పాఠశాలలు 656విద్యార్థుల సంఖ్య 39,447బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నభోజనంతో 12 శాతం పెరిగిన హాజరు డ్రాపౌట్స్ 3 శాతం కంటే తక్కువ తండాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల బడులల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల అకడమిక్ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి లేదా సమీప బడుల నుంచి రొటేషన్ పద్ధతిలో టీచర్లను డిప్యుటేషన్పై పంపించాం. విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా బోధన అందిస్తున్నాం. అక్షరాస్యత శాతం పెంచడానికి కృషి చేస్తున్నాం. – భిక్షపతి, డీఈఓ -
నృసింహుడి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు, దుర్గాప్రసాద్శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 77 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 53 , సర్వే ల్యాండ్స్ 5 శిశు సంక్షేమ 5, మున్సిపాలిటీ 3, డీపీఓ 2, హౌసింగ్ 2, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్య, మత్స్య, విద్యుత్, లీడ్ బ్యాంకు, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, డిప్యూటీ కలెక్టర్ కతిక పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు సాక్షి, యాదాద్రి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల తనిఖీల్లో అలసత్వం వహించినా, ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేసుకోకపోయినా, ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించే అధికారులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నాటికి కూడా నిర్దేశించిన హాస్టళ్ల తనిఖీలు పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 1205 మంది ఉద్యోగులకు గాను ఇప్పటివరకు 995 మంది మాత్రమే ఈ విధానంలో నమోదయ్యారైనట్లు కలెక్టర్ తెలిపారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
బాకీ డబ్బులు అడిగిన వృద్ధురాలిపై దాడి
నేలకొండపల్లి : బాకీ డబ్బులు తిరిగి చెల్లించాలని కోరిన వృద్ధురాలిపై దంపతులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి ధరావత్ బిచ్చు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని శంకరగిరి తండాకు చెందిన తేజావత్ చిట్టిబాబు–శామిని దంపతులకు రూ.12 వేలు అప్పుగా ఇచ్చింది. సోమవారం బిచ్చు శంకరగిరి తండాలోని తన కుమార్తె ఇంటికి వచ్చిన సందర్భంగా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని చిట్టిబాబు దంపతులను అడిగింది. దీంతో వారు తమకు డబ్బే ఇవ్వలేదంటూ వృద్ధురాలిపై దాడి చేశారు. ఈ మేరకు వృద్ధురాలి కుమార్తె శారద ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడి హల్చల్భువనగిరి(బీబీనగర్) : బిహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేంర్ సోమవారం మద్యం మత్తులో బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని కిందకు దింపి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతు సోదరుల ఆత్మహత్యాయత్నం ● తమ భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తుండటంతో ట్యాంక్ ఎక్కి ఆందోళన మునగాల : తమకు వారసత్వంగా వస్తున్న సాగు భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించడాన్ని నిరసిస్తూ ఇద్దరు రైతు సోదరులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మునగాల మండలంలోని ముకుందాపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పందిరి సత్యనారాయణరెడ్డి, పందిరి పుల్లారెడ్డి సాధారణ మధ్య తరగతి రైతులు. వీరికి ఉన్న భూమిలో కొంత ఎన్ఎస్పీ కాలువ కింద పోగా, మిగిలిన భూమిలో సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితం వారి భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఈ క్రమంలో సోమవారం మండల ఆర్ఐ, ఆర్అండ్బీ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు కొందరు వార్డు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో భూమిలో ఉన్న గడ్డివాములను తొలగించారు. తమ భూమిలో భవనం నిర్మించవద్దని ఎంత వారించినా అధికారులు వినలేదని రైతులు వాపోయారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి తీరుతామని స్పష్టం చేయడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఉరేసుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని నచ్చజెప్పడంతో వారు కిందికి దిగివచ్చారు. -
కోళ్లను చంపిన భార్యభర్తలపై కేసు నమోదు
పెన్పహాడ్ : కోళ్లకు మందు పెట్టి చంపిన భార్యాభర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం తంగెళ్లగూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన కాకునూరి బాబురావుకు చెందిన రెండు కోళ్లను అదే గ్రామానికి చెందిన కానుగు ఉపేందర్, అతడి భార్య సునీత కలిసి మందు పెట్టి చంపారని బాబురావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. పెద్దకాపర్తి చెరువులో డెవిల్ ఫిష్లు ప్రత్యక్షంచిట్యాల : మండలంలోని పెద్దకాపర్తి చెరువులో సోమవారం చేపలు పట్టేందుకు స్థానిక మత్స్యకారులు వలలు విసరగా డెవిల్ ఫిష్లు చిక్కాయి. మరోవైపు చెరువులోకి తాము వదిలిన రవ్య, బొచ్చ, బురదమట్టలు వంటి చేపలు పెరగాల్సిన సైజులు పెరగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చెరువుపై సుమారు వంద మత్స్యకార్మికులు ఆధారపడి ఉన్నారు. డెవిల్ ఫిష్ల నివారణకు అధికారులు తగిన చర్యలు, తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
15 ఏళ్ల క్రితమే పింఛన్ మంజూరు.. ఒక్క రూపాయి చేతికిరాలే!
భువనగిరిటౌన్ : ప్రభుత్వ రికార్డుల్లో 15 ఏళ్ల క్రితమే పింఛన్ మంజూరైనట్లు చూపిస్తున్నా, ఆ నగదు ఇప్పటివరకు ఏ ఒక్క నెల కూడా తన చేతికి అందలేదని బాధితుడు రామగిరి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజావాణిలో ఆయన కలెక్టర్ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటూ వినతిపత్రం అందజేశారు. విషయం ఏమిటంటే.. ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న రాంబాబు ఇటీవల కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లాడు. అక్కడ అధికారులు ఆయన ఆధార్ నంబర్ నమోదు చేయగా, ఇప్పటికే పింఛన్ మంజూరై అందుతున్నట్లు పోర్టల్లో స్పష్టంగా చూపించింది. పోర్టల్ వివరాల ప్రకారం 15 ఏళ్లుగా పింఛన్ మంజూరై ఉన్నప్పటికీ, వాస్తవానికి తనకు రూపాయి కూడా అందలేదని, ఈ విషయాన్ని తాను వారం రోజుల క్రితమే గుర్తించానని బాధితుడు వాపోయాడు. ఈ సమస్యపై మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే నేరుగా కలెక్టర్ను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపాడు. తన పేరిట రికార్డుల్లో జమ అవుతున్న పింఛన్ సొమ్ము ఇన్నాళ్లూ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రామగిరి రాంబాబు కోరారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో లక్షపుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం లక్ష పుష్పార్చన పూజలను అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సుగ్రంధ పరిమళాలు వెదజల్లె రంగురంగుల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. తులసీ దళాలతో శ్రీస్వామి అమ్మవార్లను విశేషంగా పూజించారు. ఇక ఆలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య పూజలు విశేషంగా జరిపించారు. ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవలను వైభవంగా నిర్వహించారు. శివాలయంలో విశేష పూజలుయాదగిరి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. శ్రీస్వామి వారికి నిత్య పూజలు జరిపించి, మండపంలో నిత్య రుద్ర హవనం పూజను పూజారులు నిర్వహించారు. ఇక మహాశివుడికి అభిషేక, అర్చనలు జరిపించారు. శివ గర్భాలయంలో, ముఖ మండపంలోని స్పటిక లింగానికి పూజలు చేసి, హారతినిచ్చారు. సాయంత్రం ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల సేవోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. -
అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుంది
రంగనాథ రంగశాలను అద్దెకిస్తే నిరంతర నిర్వహణ ఉంటుంది. భవనం వినియోగంలోకి వస్తుంది. ప్రాజెక్టు అధికారులు కూడా అవసరమైనప్పుడు ఇక్కడ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. – శివ, స్థానిక వ్యాపారి మినీ థియేటర్ ఏర్పాటు చేస్తా రంగనాథ రంగశాలను అద్దెకిస్తే మినీ థియేటర్ ఏర్పాటు చేస్తానని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తు అందజేశాను. అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అనుమతిస్తే మినీ థియేటర్గా అభివృద్ధి చేసి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. – మహేశ్వర్రెడ్డి, స్థానికుడు -
కిడ్నీ తొలగింపు ఘటన.. నర్సింగ్ హోం సీజ్
ఆలేరు: బాధితురాలి కిడ్నీ తొలగించిన ఘటనపై వైద్యాధికారులు, పోలీసులు ఉమ్మడిగా కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆలేరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అర్పిత నర్సింగ్ హోంను సోమవారం రాత్రి అధికారులు సీజ్ చేశారు. వైద్య సేవల నిలిపివేత – కేసు నమోదు ఈ వ్యవహారంలో ఆలేరు ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ హోం నిర్వాహకుడు డాక్టర్ ప్రభాకర్తో పాటు శస్త్రచికిత్స నిర్వహించిన హైదరాబాద్కు చెందిన డాక్టర్ మహేష్పై కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలోని రెండు వార్డులను, కన్సల్టేషన్ గదిని డీఎంహెచ్ఓ మనోహర్, డీసీహెచ్ఎస్ సూర్యశ్రీ, తహసీల్దార్ ఆంజనేయులు సమక్షంలో తాళాలు వేసి సీజ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కొత్త ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ నమోదు చేయకూడదని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులను వెంటనే డిశ్చార్జ్ చేసి ఇతర ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. అనుమతులపై ఆరా కిడ్నీ వంటి కీలకమైన అవయవాలకు శస్త్రచికిత్స చేయడానికి అర్పిత నర్సింగ్ హోంకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన అనుమతులు, తగిన మౌలిక వసతులు, నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే అంశమే ప్రస్తుతం విచారణలో ప్రధానాంశంగా మారింది. అర్హత లేకుంటే ఇటువంటి ఆపరేషన్లు ఎలా నిర్వహించారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.అనుమానాస్పద రీతిలో కిడ్నీ తొలగించిన తీరును రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు తీవ్రంగా పరిగణించారు. స్థానిక అధికారులు సేకరించిన ప్రాథమిక ఆధారాలు, నివేదిక ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలోని రాష్ట్రస్థాయి నిపుణుల బృందం తదుపరి విచారణను వేగవంతం చేయనుంది. ఫ ఆలేరులోని అర్పిత నర్సింగ్ హోంలో వైద్య సేవల నిలిపివేత ఫ ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు ఫ అవయవ శస్త్రచికిత్సల అనుమతులపై అధికారుల ఆరా ఫ డీఎంఈ పర్యవేక్షణలో రాష్ట్రస్థాయికి చేరిన విచారణ -
హామీల అమలుకు పోరాటం
భువనగిరిటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతూ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఏడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల వెంకటేశ్వర్లు, కొలుపుల అమరేందర్, జడల అమరేందర్గౌడ్ పాల్గొన్నారు. హైవేపై రాస్తారోకో భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం రాయగిరి పరిధిలో గల హైదరాబాద్–వరంగల్ హైవేపై రాస్తారోకో చేశారు. సీఎం ఫ్లెక్సీని దహనం చేయబోతుండగా పోలీసులు ఽఅడ్డుకున్నారు. రాస్తారోకోను విరమించుకోవాలని కోరినా ససే మిరా అనడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో శేఖర్రెడ్డితో పాటు మొత్తం 18 మందిని అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో చింతల వెంకటేశ్వరరెడ్డి, అమరేందర్, ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, కిష్టయ్య, అబ్బగాని వెంకట్, వీరేషం, జక్కా రాఘవేందర్రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్
ఫ యువకుడికి తీవ్ర గాయాలు యాదగిరిగుట్ట : బైక్పై వెళ్తున్న యువకుడు పోలీసు వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బేగంపేటకు చెందిన అరవింద్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా సోమవారం బైక్పై యాదగిరిగుట్టకు వచ్చిన అతడు.. ఎంపీడీఓ కార్యాలయం వద్ద యూటర్న్ తీసుకుంటున్న పోలీసు వాహనాన్ని వస్తున్న ఢీకొని పక్కనే ఉన్న ఆటో కిందపడిపోయాడు. దీంతో అరవింద్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం వెనుక అద్దం పగిలిపోయింది. వెంటనే స్థానికులు అరవింద్ను రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. సమయానికి రాని అంబులెన్స్.. 108 అంబులెన్స్ సమయానికి ఘటనా స్థలానికి రాకపోవడంతో 30 నిమిషాలకు పైగా అరవింద్ రక్తస్రావంతో అక్కడే పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు వైద్యుడి సహాయంతో ప్రథమ చికిత్స అందించి ఆటోలో భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అప్పు డబ్బులు తిరిగిరాక గుండెపోటుతో మహిళ మృతి
నాగారం : సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం కూలీ పనులు చేసి కూడబెట్టిన డబ్బులను అప్పుగా ఇస్తే.. తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నాగారం మండలం పసునూర్ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పసునూర్ గ్రామానికి చెందిన పుట్టబంతి రాంబాబు, ఉమ(42) దంపతులకు నవీన్, ప్రభాస్ ఇద్దరు కుమారులు. భర్త రాంబాబు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోగా, ఉమ కూలీ పనులు చేసుకుంటూ కుమారులను పోషిస్తోంది. వీరికి సొంత ఇల్లు లేకపోవడంతో, ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో కూలీ పనులు చేస్తూ సుమారు రూ.5 లక్షల వరకు ఆదా చేసి, గ్రామంలోని పలువురికి అప్పుగా ఇచ్చింది. కాగా, ఇటీవల ఆమెకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి బేస్మెంట్ వరకు పూర్తి చేసింది. ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరం ఉండటంతో, తాను అప్పుగా ఇచ్చిన వారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని ఉమ కోరింది. అయితే, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఇంటి నిర్మాణం బేస్మెంట్ దశలోనే నిలిచిపోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె అనారోగ్యం పాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఉమకు పుట్టింటి, అత్తింటి వైపు నుంచి ఎలాంటి బంధుగణం లేకపోవడంతో ఆమె ఇద్దరు కుమారులు అనాథలుగా మారారు. పెద్ద కుమారుడు నవీన్ ఇటీవల డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కుమారుడు ప్రభాస్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. తల్లి మృతితో ఆ కుమారులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అనంతరం సర్పంచ్, గ్రామస్తులు చందాలు సేకరించి ఉమ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఫ సొంతింటి కోసం దాచుకున్న రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చిన వైనం ఫ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుణగ్రస్తులు ఫ మనస్తాపంతో గుండెపోటుకు గురైన బాధితురాలు ఫ అనాథలైన ఇద్దరు కుమారులు.. చందాలు సేకరించి అంత్యక్రియలు -
అనారోగ్య కారణాలతో మాజీ వైస్ ఎంపీపీ ఆత్మహత్య
పెద్దవూర : అనారోగ్య కారణాలతో పెద్దవూర మండల మాజీ వైస్ ఎంపీపీ గోన వివేక్రావు(59) సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గోపాల్రావు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోన వివేక్రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివేక్రావు భార్య సుకన్య, కుమార్తె ఐశ్వర్య గత పదేళ్లుగా హైదరాబాద్లో నివాసముంటున్నాడు. వివేక్రావు మాత్రం తన తల్లి గోన యాదమ్మతో కలిసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున వివేక్రావు పురుగుల మందు తాగి తన భార్య సుఖన్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తన బావగారైన విష్ణువర్ధన్రావుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. విష్ణువర్ధన్రావు పక్క ఇంటి వాళ్లకు సమాచారం అందించడంతో వాళ్లు వెళ్లేసరికి వివేక్రావు తన ఇంటి మిద్దైపె నుంచి దూకాడు. వివేక్రావును చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు. పలువురు నివాళి.. వివేక్రావు భౌతికకాయానికి నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని వివేక్రావు పాడె మోశారు. అదేవిధంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి కూడా నివాళులర్పించారు. -
విగ్రహాల తరలింపునకు విఘ్నాలు
చిట్యాల : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికే రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. వినాయకచవితి ఉత్సవాల కోసం హైదరాబాద్లోని ధూల్పేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు భారీ విగ్రహాలను వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులోని రైల్వే అండర్పాస్ వద్ద విగ్రహాల తరలింపునకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అండర్పాస్ ఎత్తు తక్కువగా ఉండటంతో.. వాహనాల్లో వస్తున్న భారీ విగ్రహాలు అండర్పాస్ దాటలేక గంటల తరబడి నిలిచిపోతుండటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సుమారు ఐదారు గంటల పాటు పలు విగ్రహాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ ఎత్తుతో అవస్థలు.. ధూల్పేట నుంచి 15 నుంచి 20 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాలను భారీ డీసీఎంల్లో ఏపీకి రవాణా చేస్తున్నారు. చిట్యాల రైల్వే అండర్పాస్ వద్దకు రాగానే ఎత్తు సరిపోక ఇరుక్కుపోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని విగ్రహాలు పైకప్పుకు తగిలి ధ్వంసమవుతున్నాయి. దీంతో చేసేది లేక వాహనాలపై ఉన్న విగ్రహాలను భారీ క్రేన్ల సహాయంతో కిందకు దించి, నేలపై చక్రాలతో నడిచే ట్రాలీపై ఉంచి తాళ్లతో లాగుతూ నెమ్మదిగా అండర్పాస్ దాటిస్తున్నారు. కొందరు నిర్వాహకులు విగ్రహాల ఎత్తు తగ్గించేందుకు ఏకంగా వినాయకుడి తల భాగంలో కిరీటం కొంత కట్ చేసి తరలించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేపై ట్రాఫిక్ జామ్.. విగ్రహాలను అతికష్టం మీద బయటకు తీసే క్రమంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు, ఉత్సవ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఇష్టంగా, భారీ ఖర్చుతో తయారు చేయించిన విగ్రహాలు అండర్పాస్ వద్ద ధ్వంసమవుతుండటంతో నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో విగ్రహాల రవాణా మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. భారీ విగ్రహాల తరలింపునకు అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిట్యాల రైల్వే అండర్పాస్ వద్ద నిలిచిపోతున్న భారీ విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి అవస్థలు కొన్నిసార్లు ధ్వంసమవుతున్న ప్రతిమలు -
బెండ సాగు.. లాభాలు బాగు
త్రిపురారం : ప్రత్యామ్నాయ పంటల సాగులో తక్కువ నీటితో రైతులకు 45 రోజుల్లో చేతికి వచ్చే పంట బెండ. సెప్టెంబర్ నెలలో సైతం బెండ సాగు చేపట్టి నికర ఆదాయం పొందవచ్చు. సరైన సాగు పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు, పంటకు వైరస్ సోకిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు సూచనలు ఆమె మాటల్లోనే.. ● భూమి తయారీ విధానంఎర్ర నేలలు, నీరు నిల్వ ఉండని నల్లరేగడి నేలలు బెండ సాగుకు అనుకూలం. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్కిలో 40 కేజీల సూపర్ పాస్పేట్, 10 కిలోల పొటాష్ వేసుకొని కలియ దున్నుకోవాలి. తయారైన ప్రధాన పొలంలో 6 అడుగులకు ఒక్క అడగు లోతు కాల్వను తీసుకోవాలి. ● విత్తనాల ఎంపికఅర్కనామిక, పర్బని క్రాంతి, వరద నుర్వి రకాలు మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. ఎకరానికి 3.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తే ముందు కిలోకు రెండు గ్రాముల కార్బండిజమ్, రెండు గ్రాముల థైరంతో శుద్ధి చేసుకోవాలి. సాళ్ల మధ్య 60 సెం.మీ., 30 సెం.మీ. దూరం ఉండాలి. గింజను ఎక్కువ లోతులో విత్తకుండా జాగ్రత్తపడాలి. లోతు ఎక్కువ అవ్వడం వల్ల నీరు నిలబడి గింజ కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. ● నీరు, ఎరువుల యాజమాన్యంబెండ సాగు చేయడానకి తక్కువ నీరు ఉన్నా సరిపోతుంది. క్రమం తప్పకుండా తేమ ఉండేలా చూసుకోవాలి. విత్తనం విత్తిన వెంటనే ఒక తడి, తర్వాత 7 నుంచి 8 రోజులకు పూత, కాయ దశలో 5 నుంచి 6 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఎక్కువ నీరు ఇవ్వకూడదు. అలా చేస్తే పూత రాలిపోతుంది. పూత మొదలైనప్పుడు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. పూత దశలో ఎకరాకు 55 గ్రాముల చిలేటెడ్ జింక్, 500 గ్రాముల బోరాన్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత రాలడం తగ్గి కాయలు ఎక్కువగా వస్తాయి. నత్రజని ఎరువులు తక్కువగా వినియోగించాలి. ● కలుపు యాజమాన్యంబెండ సాగు చేసిన 30 నుంచి 40 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 నుంచి 40 రోజులకు రెండు సార్లు కలుపు తీయాలి. విత్తిన మూడు రోజుల్లో ఎకరాకు 80 మి.లీ. పెండీమిథలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు రాదు. తెగుళ్లు – నివారణ చర్యలు 1. పసుపు నరాల మొజాయిక్ తెగులు : ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకుల నరాలు పసుపు రంగులోకి మారి మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు ఎల్లోవీన్ మోసాయిక్ వైరస్ నిరోధక రకాలు వేయాలి. విత్తిన 10 రోజులకు ఒకసారి వేప నూనె పిచికారీ చేసుకోవాలి. తెగులు వచ్చిన మొక్కలను వంటనే పీకేయాలి. 2. బూడిద తెగులు : ఆకులపై తెల్లని పొడ ఉంటే 2 గ్రాముల సల్ఫర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 3. ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు వల్ల ఆకులపై గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు ప్రధాన పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటికే తెగులు సోకిన మొక్కలు ఉన్నట్లయితే ఆకులను తొలగించి భూమిలో పూడ్చి వేయాలి. 4. వేరు కుళ్లు తెగులు : ఈ తెగులు వల్ల మొక్కల వేర్లు కుళ్లిపోతాయి. మొక్కలు వాడిపోతూ క్రమంగా ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మంచి విత్తనం ఎంచుకోవాలి. నీటి తడి ఇచ్చేటప్పుడు మంచి నీరు అందించాలి. పంట మార్పిడి పాటించడం ఉత్తమం.పురుగులు – నివారణ చర్యలు 1. చెన్న పురుగు : ఈ పురుగులు మొక్కపై ఆకులను అంచుల నుంచి తినేస్తాయి. దీని నివారణకు ఎకరాకు 5 కిలోల వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే 2 మి.లీ. ఫ్రోఫినోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 2. ఫ్రూట్ బోరర్ : ఈ పురుగు పంట చేతికి వచ్చే సమయంలో కాయకు రంధ్రం చేసి కాయల్లోకి చొరబడి గుజ్జును తింటుంది. దీని నివారణకు గాను దెబ్బతిన్న కాయలను తుంచి పూడ్చి వేయాలి. తీవ్రత అధికంగా ఉంటేనే 2 మి.లీ. క్లోరాంగ్రానిలిప్రోల్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కోతకు 7 రోజుల ముందు ఏ రసాయనిక మందు పిచికారీ చేయరాదు. కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు సూచనలు -
యాదగిరీశుడి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, కొండ కింద ఆధ్యాత్మిక వాడ భక్తులతో కిటకిటలాడాయి. కార్లతో కొండ పైన పార్కింగ్ నిండిపోవడంతో రింగ్ రోడ్డులోని టోల్గేట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. కొండపైన వాహనాల రద్దీ తగ్గిన తర్వాతే మళ్లీ వాహనాలను పైకి అనుమతించారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. స్వామిని 50వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.61,09,833 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. స్వామి వారిని దర్శించుకున్న 50వేల మందికి పైగా భక్తులు -
విద్యుదాఘాతంతో ఆర్టిజన్ మృతి
మీర్పేట : ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఆర్టిజన్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతిపురి తండాకు చెందిన కర్నాటి కృష్ణకాంత్(43) రంగారెడ్డి జిల్లా మీర్పేట సెక్షన్ పరిధిలో ఆర్టిజన్ (జూనియర్ లైన్మెన్)గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నందిహిల్స్ రోడ్ నం–2లోని ఓ ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆన్లైన్లో ఫిర్యాదు రావడంతో కృష్ణకాంత్కు ఏఈ ఫోన్ చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో అతను వెంకటాద్రి హోమ్స్ అపార్ట్మెంట్ ముందున్న ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడగా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహంతో ఆందోళన విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య శాంత ఆరోపించారు. న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు సముదాయించినప్పటికీ వినకపోవడంతో అంబులెన్స్లో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సెక్టార్ తన భర్త పరిధిలోనిది కాదని, అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పంపించారని ఫిర్యాదులో పేర్కొంది. ఏఈ వివరణ మరమ్మతుల కోసం వెళ్లిన కృష్ణకాంత్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయాల్సింది మరో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశాడని, సరైన అవగాహన లేకే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఏఈ బాలాగౌడ్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన మృతుడి స్వస్థలం చింతపల్లి మండలం ప్రశాంతిపురి తండా -
రమణేశ్వరంలో దేవతా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ
భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల రమణేశ్వరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలకు ఆదివారం సిద్ధగురు రమణానంద మహర్షి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, బగలాముఖ అమ్మవారు, అయ్యప్ప స్వామి, హయగ్రీవస్వామి, ప్రత్యంగిరాంబ దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం విశేష ద్రవ్యాలతో కుంభాభిషేకం చేశారు. వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న రమణానంద మహర్షి -
ప్రణయ్రాజ్.. ప్రపంచ రికార్డు
మోత్కూరు : ఉచిత సమాచార విజ్ఞాన వ్యాప్తిలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన తెలుగు వికీపీడియన్ ప్రణయ్రాజ్ వంగరి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించారు. వరుసగా పదేళ్ల పాటు ప్రతిరోజూ కనీసం ఒక వికీపీడియా వ్యాసాన్ని రాస్తూ 3,652 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో తెలుగు వికీపీడియాలో ఏకంగా 11,500కు పైగా కొత్త వ్యాసాలను సృష్టించి చరిత్ర పుటల్లోకెక్కారు. 2016 సెప్టెంబర్ 8న ‘100 రోజులు–100 వికీ వ్యాసాలు’ ఛాలెంజ్తో ప్రారంభమైన ఆయన ప్రయాణం ఎలాంటి ఆటంకం లేకుండా పదేళ్ల మైలురాయికి చేరింది. 2026 సెప్టెంబర్ 7 నాటికి ఒక్కరోజు కూడా విరామం లేకుండా వ్యాసాలు రాసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. మైలురాళ్లు ఇలా.. 100 రోజులు–100 వ్యాసాలు: 2016 సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 16 వరకు తొలి ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేశారు. వికీవత్సరం: 365 రోజుల్లో 365 వ్యాసాలు రాసి 2017 సెప్టెంబర్ 7న తొలి ఏడాది మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనతకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలపగా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సత్కరించారు. తెలంగాణ ఐటీ శాఖ అవార్డు: 2018 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఐటీ శాఖ అందించిన ‘లోకలైజేషన్’ అవార్డును అందుకున్నారు. 1000 నుంచి పదేళ్ల వరకు : 2019 జూన్ 4న వెయ్యి రోజులు (1000 వ్యాసాలు), 2020 అక్టోబర్ 17న 1500 రోజులు, 2022 మార్చి 1 నాటికి 2000 రోజుల్లో 3,015 వ్యాసాలను పూర్తి చేశారు. తాజాగా 3,652 రోజుల్లో 11,500కు పైగా వ్యాసాలతో పదేళ్ల మహా రికార్డును నెలకొల్పారు. కొచ్చిలో ఘన సత్కారం.. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం కేరళలోని కొచ్చిలో జరిగిన ‘వికీ కాన్ఫరెన్స్ ఇండియా–2026’లో వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు లోరెంజో లోసా, విక్టోరియా డోరోనినా పాల్గొని ప్రణయ్రాజ్కు జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషలకు చెందిన సుమారు 250 మంది వికీమీడియన్లు పాల్గొన్నారు. వరుసగా పదేళ్ల పాటు ప్రతిరోజూ వికీపీడియాలో వ్యాసాల రచన 3,652 రోజుల్లో 11,500కు పైగా కొత్త ఆర్టికల్స్ సృష్టి -
ఐదు కిలోమీటర్లకు గంట సమయం
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది. వీకెండ్తో పాటు గ్రామ్లాల్లో బోనాలు ఉన్న నేపథ్యంలో పట్టణవాసులు పెద్దఎత్తున పల్లెబాట పట్టడంతో హైవేపై వాహనాలు బారులుదీరాయి. ఈ రద్దీ ప్రధానంగా విజయవాడ మార్గంలో బంపర్ టు బంపర్ కొనసాగింది. చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామ శివారు నుంచి చౌటుప్పల్ పట్టణ శివారులోని ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించేందుకు వాహనదారులకు గంట సమయం పట్టింది. దీంతో అటు వాహనదారులు, ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ కారణంగా స్థానిక ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడింది. సమయానికి అనుగుణంగా, సరిపడా బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ -
అత్యాచారం కేసులో ఇద్దరు యువకుల అరెస్టు
హుజూర్నగర్ : అత్యాచారం కేసులో ఇద్దరు యువకులను హుజూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఇటీవల ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అత్యాచారానికి పాల్పడిన కాంపాటి విరామ్ అలియాస్ రాము, పాముల ఆకాష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. లారీ ఢీకొని వస్త్ర వ్యాపారి మృతి చిట్యాల : చిట్యాల పట్టణంలో ఆదివారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక వస్త్ర వ్యాపారి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని హరిక్రిష్ణ వస్త్రాలయం యజమాని బండారు జనార్దన్(67) సంతోష్నగర్లోని తన ఇంటి నుంచి సర్వీస్ రోడ్డులో వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రోడ్డుపై పడిపోగా.. ఆయన పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జనార్దన్ మృతి పట్ల సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ సంతాపం తెలిపారు. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు ● ముగ్గురికి గాయాలు మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. కారులో ప్రయాణిస్తున్న శ్వేత, భార్గవ్ దంపతులతో పాటు వారి రెండేళ్ల కుమార్తెకు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు ● 8 మందిపై కేసు నమోదుచివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులోని గిరిదుర్గంలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉమామహేశ్వరస్వామి ఆలయం ముందు శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం గుంపుల, వల్లభాపురం, ఉండ్రుగొండతో పాటు సూర్యాపేటకు చెందిన పచ్చిపాల మధు, సైదులు, శివ, శ్రీకాంత్, వేదాద్రి, తుకారం, గోపి, ప్రణయ్, తిర్పయ్య, మరో ఇద్దరు కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని 8మందిని ఆదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చకిలం కృష్ణకుమార్ ఫిర్యాదు మేరకు 8మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. దుండగుల వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
గంధమల్లతోనే ఆలేరు సస్యశ్యామలం
యాదగిరిగుట్ట : గంధమల్ల రిజర్వాయర్ను త్వరలోనే పూర్తి చేసి 58వేల ఎకరాలకు సాగు అందించి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి గతేడాది తిర్మలాపురంలో సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రైతులకు నష్టపరిహారం అందించిన తరువాతే భూమి పూజ చేసినట్లు తెలిపారు. పదేళ్ళు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎందుకు గంధమల్ల పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ మధుసూధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్యరెడ్డి, ఆత్మ చైర్మన్ ఎనగందుల సుధాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారుఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
కాంగ్రెస్ పాలనలో రైతుల కన్నీటి గోస
గుండాల : కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీటి గోస పెడుతున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై ఆదివారం గుండాల మండలం అనంతారం గ్రామ బిక్కేరు వాగులో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతోనే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరాన్ని ఎండబెట్టి మిగులు జలాలు సముద్రం పాలు చేస్తున్నారన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుండాల మండలాన్ని సస్య శ్యామలం చేసేందుకు రూ.140 కోట్లు విడుదల చేసి కాల్వవలు తవ్వించినప్పటికీ దేవాదుల నీరును ఎందుకు విడుదల చేస్తలేరని ప్రశ్నించారు. 15 రోజుల్లో రైతులకు నీటిని విడుదల చేయకపోతె అఖిలపక్షంతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కుర్మిళ్ల కవిత, ఆలకుంట్ల సుధాకర్, వినోద్, అల్లంశెట్టి మహేష్, నాయకులు మందడి రామకృష్ణారెడ్డి, మద్దుల బాల్రెడ్డి, శ్రీనివాస్, మొగులాల్, ఉప సర్పంచ్ నగేష్, సీపీఐ నాయకులు హరిశ్చంద్ర, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రైతు వేదికలకు సౌర వెలుగులు!
ఆలేరురూరల్ : రైతు వేదికలకు సౌర వెలుగులు తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో సౌర పలకల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. సౌర పలకలు అమర్చేందుకు ప్రభుత్వం రంగ సంస్థ అయిన హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా)కి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా రైతు వేదికల భవనాల పరిస్థితిపై నివేదికలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు నివేదికలు తయారు చేసే పని నిమగ్నమయ్యారు. నిధుల్లేక నిర్వహణ భారంగా.. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని ఉద్దేశంతో వివిధ పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2021లో జిల్లా వ్యాప్తంగా 92 క్లస్టర్లలో ఒక్కోదానికి రూ.22 లక్షలు వెచ్చించి మొత్తం రూ.20.24 కోట్లతో వేదికలు నిర్మించింది. వీటి నిర్వహణకు నెలకు రూ.9వేలు మంజూరు కాగా 2023 సెప్టెంబర్ నుంచి నిధులు మంజూరు కావడంలేదు. దీంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు భారంగా మారింది. రక్షణ లేక చోరీలు వేదికలకు రక్షణ లేకపోవడంతో రాత్రిళ్లు చోరీలు జరుగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. చాలాచోట్ల ఎలక్ట్రిక్ పరికరాలు, బ్యాటరీలు, విలువైన వస్తువులు తదితరాలు చోరీ చేశారు. దీనికితోడు రైతు వేదికల్లో నీటి వసతి లేక రైతులు, వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వేదికలను శుభ్రం చేసుందుకు, సమావేశాలకు కుర్చీలు వేసేందుకు స్వీపర్లు కూడా లేరు, అన్నీ ఏఈఓలే చూసుకుంటున్నారు. పైగా కొన్ని రైతు వేదికలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు విద్యుత్ సౌకర్యమైనా కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం రైతు వేదికల్లో సోలార్ పలకలు ఏర్పాటు చేసి నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. అయితే జిల్లా స్థాయి నుంచి నివేదికలు అందిన వెంటనే ఒక్కో రైతు వేదికలో సౌర పలకల ఏర్పాటుకు బడ్జెట్ ఎంత అవుతుందనే అంచనా వేసి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఫ భవనాల పరిస్థితిపై నివేదికలు కోరిన ప్రభుత్వం ఫ జిల్లా వ్యాప్తంగా 92 రైతు వేదికలు -
సమన్వయంతో పనిచేద్దాం
యాదగిరిగుట్ట : ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతిఒక్కరి పేరు జాబితాలో ఉండేలా అధికారులమంతా సమన్వయంతో పనిచేద్దామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి సూచించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 148 పోలింగ్ స్టేషన్ను ఆయన ఆదివారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లు, దరఖాస్తూదారులు తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలన్నారు. అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం 6, ఫారం7, ఫారం 8 ద్వారా క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ సమర్పించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, తహసీల్దార్ గణేష్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ ఉన్నారు. యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రథమ ప్రాకార మండపంలో ఆదివారం అర్చకులు శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని భక్తుల నడుమ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం చేపట్టారు. అనంతరం స్వయంభూ పంచనారసింహులకు బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపి సహస్రనామార్చన విశేషంగా చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు విశేషంగా జరిపించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో వేద ఆశీర్వచనం పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. జిల్లా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలిభువనగిరిటౌన్ : జిల్లాలోని దీర్ఘకాలిక పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై శాసనసభ సమావేశాల్లో జిల్లా ఎమ్మెల్యేలు గళమెత్తాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున వారిని నిలదీస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చర్లగూడెం రిజర్వాయర్ పురోగతిపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా పరిధిలో మూసీ ప్రక్షాళన, గోదావరి జలాల అనుసంధానం, ఫీడర్ ఛానళ్ల ఏర్పాటుపై చర్చించాలని కోరారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధనకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతికోసం పోరాడుదాంసూర్యాపేట అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం, హింస, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుదామని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఏఐపీఎస్ఓ) రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్లో నిర్వహించిన ఏఐపీఎస్ఓ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధాల వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, మహిళలు, పిల్లలు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐపీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు తొగిట్టి మురళి, గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్, కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలపై ప్రచారమేదీ?
భువనగిరిటౌన్ : అప్పుడే గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 14న చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సారి పర్యావరణహిత మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ఎలాంటి ప్రచారం చేయడం లేదు. రసాయన రంగులతో తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలు వాడొద్దంటూ గతంలో మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి యంత్రాంగం ముమ్మర ప్రచారం నిర్వహించేది. ఈ సారి ఎక్కడా ఆ ఊసే కనిపించడం లేదు. ఉత్సవాలకు కొద్దిరోజులే సమయం ఉన్నప్పటికీ ఎక్కడా మట్టి విగ్రహాల ప్రస్తావనే వినిపించడం లేదు. ఫలితంగా భువనగిరి జిల్లాకేంద్రంతో పాటు చౌటుప్పల్, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లిలో పీవోపీ విగ్రహాలే విక్రయానికి దర్శనమిస్తున్నాయి. గతంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని.. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇళ్లల్లో పూజలు చేసే విగ్రహాల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. వీటిలో అధిక శాతం పీవోపీ ప్రతిమలే ఉంటాయి. ఉత్సవాల అనంతరం స్థానిక చెరువులు, కుంటలు, మూసీ పరీవాహక ప్రాంతాలు, కాలువల్లో వీటిని నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితం కావడంతోపాటు వ్యర్థాల తొలగింపు పంచాయతీలు, మున్సిపాలిటీలకు తీవ్ర భారంగా మారుతోంది. గతంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రధాన కూడళ్లు, రహదారులపై మట్టి గణపతులను ప్రదర్శించి ప్రజలను ఆలోచింపజేశారు. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ఉచిత పంపిణీ జరిగేనా.. గతంలో జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే పట్టణాలు, గ్రామాల వారీగా ప్రతిమల పంపిణీ జరిగేది. అయితే ఈ ఏడాది ఆ రెండు నియోజకవర్గాల్లో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ ఉంటుందా లేదా అనే విషయంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి మట్టి విగ్రహాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఫ పండుగొస్తున్నా.. పట్టని యంత్రాంగం ఫ అప్పుడే మొదలైన పీవోపీ ప్రతిమల విక్రయాలు ఫ ఉచిత విగ్రహాల పంపిణీపైనా ఊసేలేదు -
ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి
రాజాపేట : ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని దీర్ఘకాలికంగా దిగుబడితోపాటు అధిక లాభాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారి స్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,196 మంది రైతులు దాదాపు 5,196 ఎకరాల్లో ఆయిల్ పామ్తోటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా రాజాపేట మండలంలో 109 మంది రైతులు మొత్తం 553 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాత స్థానంలో ఆ తర్వాత స్థానంలో వలిగొండ, ఆత్మకూర్(ఎం), మోత్కూరుమండలాలు ఉన్నాయి. మొక్కలకే కాకుండా నాటేందుకు నీటి సరఫరా చేసేందుకు డ్రిప్ పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. పైగా ఆయిల్ పామ్ సాగులో అంతర్ పంటల సేద్యానికి వీలు ఉంది. ఈ పంట ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకై నా ఆయిల్ పామ్ సాగు తట్టుకోవడం, ఒక్కసారి నాటితే 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయి. అయితే ఎకరానికి 10నుంచి 12 టన్నుల దిగుబడి రావడం మొక్కలు ఇచ్చిన డిపార్టుమెంట్ వారే పంటను కొనడం, సమీపంలోనే ఫ్యాక్టరీ ఉండడంతో రైతులు ఈ పంట సేద్యంపై మక్కువ చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఆయిల్ పామ్ సాగు కోసం ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు డ్రిప్ కోసం 70 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. మొక్కల కోసం ప్రతి రైతుకు 80 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ అందజేయగా 20 శాతాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రైతుకు ఎకరాకు ప్రభుత్వం చెల్లించే రైతుబంధు, రైతు బీమా యథావిధిగా ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లిస్తారు. టన్ను పంటను రూ.23,400 ధరతో కొనుగోలు చేస్తారు. ఇలా ఒక్క రైతు 10 ఎకరాలు సాగు చేస్తే కాత దిగుబడి సమయంలో ఒక సాఫ్టువేర్ ఉద్యోగి సంపాదించినంతగా లాభం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగు ఇలా.. మండలం రైతుల విస్తీర్ణం సంఖ్య (ఎకరాలు) అడ్డగూడూరు 64 227.275 ఆలేరు 119 440.075 ఆత్మకూరు(ఎం) 92 465.475 పోచంపల్లి 30 157.225 భువనగిరి 62 272.475 బీబీనగర్ 29 150.25 బొమ్మలరామారం 76 297.475 చౌటుప్పల్ 83 335.925 గూండాల 60 244.6 మోటకొండూరు 58 237.525 మోత్కూరు 84 446 నారాయణపూర్ 55 199.55 రాజాపేట 109 553.125 రామన్నపేట 63 279.75 తుర్కపల్లి 59 242.45 వలిగొండ 109 489.275 యాదగిరిగుట్ట 44 158.525 మొత్తం 1,196 5,196.975 ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాకాలను అందజేస్తోంది. ఇందులో అంతర్ పంటలు సాగుచేసుకుని ప్రత్యామ్నాయ ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలుపుతాం. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – మౌనిక, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ నేను 25 ఎకకాల్లో ఆయిల్ పామ్ తోట సాగుచేశాను. ఎరువులు అందుబాటులో ఉండేచూడాలి. క్రాఫ్కు ప్రస్తుతం గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ రైతులకు మార్కెటింగ్ సులభతరం చేయాలి. ఆయిల్ పామ్ సాగు రైతులకు పంట బీమా పెంచి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహించాలి. – వంచ వీరారెడ్డి, ఆయిల్ పామ్ రైతు, చల్లూరు ఫ జిల్లాలో 5,196 ఎకరాల్లో పంట సాగు ఫ రాజాపేట మండలంలో అత్యధికంగా 553 ఎకరాల్లో సేద్యం ఫ 70 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఫ వివరాలకు 9100964625 నంబర్ను సంప్రదించాలంటున్న అధికారులు -
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
భూదాన్పోచంపల్లి : ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో రెడ్డి భవన్ను నిర్మించాలని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం భూదాన్పోచంపల్లిలో నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కులస్తులకు అన్ని శాఖలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వేర్వేరు సంఘాలు కాకుండా ఒకే రెడ్డి సంఘం నిర్మాణమై తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల సంజీవరెడ్డి, ప్రధానకార్యదర్శులు కొట్టం మధుసూధన్రెడ్డి, ఎన్నపల్లి లింగారెడ్డి, నాయకులు గంగిడి సుదర్శన్రెడ్డి, సగ్గు మల్లారెడ్డి, జిల్లా నాయకులు మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్రెడ్డి, పాటి సుధాకర్రెడ్డి, మద్ది అంజిరెడ్డి, కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్రెడ్డి -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యారాధనలు సంప్రదాయంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, ఆరాధన, స్వయంభువులకు నిజాభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. ఇక ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన వంటి పూజలు జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవోత్సవం వంటి పూజలను జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. కాగా శనివారం ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రావణ మాసంలో శ్రీస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. -
గురువుకు ఎమ్మెల్యే సామేల్ పాదాభివందనం
మోత్కూరు : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తన గురువు కల్వల ప్రకాష్ రాయుడును మోత్కూరులోని ఆయన నివాసంలో శనివారం కలిసి ఘనంగా సన్మానించారు. గురువుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువును కలిసి సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తన విద్యాభ్యాస కాలంలో గురువు ప్రకాష్రాయుడు చేసిన విద్యా బోధన, అందించిన మార్గదర్శకత్వం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో గురువుల ప్రోత్సాహం, ఆశీస్సులు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. కల్వల ప్రకాష్రాయుడు మాట్లాడుతూ తన శిష్యుడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. గురువులను గౌరవించే సంప్రదాయం కొనసాగాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్, కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, డాక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి, బద్దం నాగార్జున్రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, విజయ భాస్కర్రెడ్డి, గడ్డం సోమనర్సయ్య, గనగాని నర్సయ్య, అవిశెట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనతో ఒరిగిందేమీలేదు
సాక్షి, యాదాద్రి : నకిరేకల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నయా పైసా లాభం లేదని జగదీష్రెడ్డి అన్నారు. నాలుగు బూతులు తిట్టడం తప్ప ఏం లాభం లేదన్నారు. వెయ్యిరోజుల కాంగ్రెస్ దగా పాలనపై శనివారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువజన, విద్యార్థుల ర్యాలీకి ఆయన హాజరై ప్రసంగించారు. అనంతరం విలేకరులతో కూడా మాట్లాడారు. తెలంగాణలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ‘ఇటీవల తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. అధిష్టానానికి కొందరు ఫిర్యాదులు కూడా చేశారు. ఉత్తమ్ కుమార్రెడ్డిని సీఎంగా పెడతాం అంటున్నారు. కానీ, ఉత్తమ్ అంటే రేవంత్రెడ్డి ఒప్పుకోడు. ఆయన పేరు చూపించి.. కొంత హడావుడి చేసి, తర్వాత జానారెడ్డిని తెస్తారనేది ప్రచారంలో ఉంది. సీఎంగా రేవంత్ను తీస్తే తీయొచ్చు. ఆయన్ను తీసేస్తే, ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ బతకదు’ అని జగదీష్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డిని సీఎంగా ఉండనిస్తే పార్టీ ఉండదన్న విషయం కాంగ్రెస్ వాళ్లకు కూడా స్పష్టంగా అర్థమైందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎన్నికలకు ముందే బయటకు పోతాడన్నారు. రేవంత్రెడ్డి పార్టీలోనే ఉండి.. కొన్ని బీజేపీ సీట్లు గెలిచేటట్టు చేస్తారు. కొన్ని చోట్ల సొంత వాళ్లను కొంత గెలిపించుకుంటాడన్నారు. ఎన్నికల తెల్లారి గ్యాంగ్ను తీసుకుని బీజేపీలోకి వెళ్తాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా అవుతుందని అని చెప్పారు. నకిరేకల్లో సీఎం టూర్ కోసం వందలాది పచ్చని చెట్లను అడ్డగోలుగా నరికేశారన్నారు. పంపకాల్లో వాటా అడిగినందుకే కొండా సురేఖ బర్తరఫ్ పంపకాల్లో వాటా అడిగినందుకే మాజీ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆరోపించారు. ముఖ్య మంత్రి 18 గంటలు పనిచేస్తుంది డబ్బుల సంపాదన, భూముల ఆక్రమణ, వాటాల పంపికం కోసమేనని విద్యార్థి, యువజన విభాగం చెబుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు బంధు మాజీ కన్వీనర్ కొలుపుల అమరేందర్, చింతల కిష్టయ్య,ఏవి కిరణ్, రచ్చ శ్రీనివాస్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. ఫ రేవంత్రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ బతకదని అధిష్టానానికి తెలుసు ఫ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి వ్యాఖ్య -
గ్యాస్కు కొత్త కష్టాలు!
భువనగిరి, సంస్థాన్ నారాయణపురం: పశ్చిమాసియాలో సంక్షోభం ముగిసినప్పటికీ, దాని ప్రభావం వంటగ్యాస్ సరఫరాపై ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్యాస్ ఏజెన్సీల ద్వారా నూతన కనెక్షన్లు జారీ చేయడం, రెండో సిలిండర్ మంజూరు చేయడాన్ని అధికారులు నిలిపివేశారు. గత నాలుగు నెలలుగా సంబంధిత వెబ్సైట్ సైతం పనిచేయకపోవడంతో కొత్త కనెక్షన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కొత్తగా పెళ్లయి వేరు కాపురం పెట్టినవారు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో చేరినవారు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరైనవారికి వంటగ్యాస్ కనెక్షన్లు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సిలిండర్తో తీవ్ర అవస్థలు కొత్త కనెక్షన్ల సమస్య ఒకవైపు ఉంటే, ఉన్న కనెక్షన్కు సంబంధించి ఒకే సిలిండర్ ఉన్న కుటుంబాలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ ఖాళీ అయితే వెంటనే మరో సిలిండర్ అందే పరిస్థితి లేకపోవడంతో పెద్ద కుటుంబాల్లో వంట నిలిచిపోతోంది. అదనపు సిలిండర్ సరఫరాపై స్పష్టత ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. రీఫిల్కు తప్పని నిరీక్షణ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్కు సంబంధించి మార్చి 25న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం.. రీఫిల్ బుకింగ్ వ్యవధి పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ కాలపరిమితి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.రీఫిల్ బుకింగ్ సమయం అధికంగా ఉండటంతో అత్యవసర సమయాల్లో వినియోగదారులు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణ బుకింగ్ విధానంలో సిలిండర్ ధర రూ.1,000 నుంచి రూ.1,050 వరకు ఉండగా, బ్లాక్ మార్కెట్లో రూ.1,300 నుండి రూ.1,500 వరకు తీసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, గోదాములు, డెలివరీ వాహనాలపై అధికారులు నిఘా పెంచి అక్రమ విక్రయాలను అరికట్టాలని, నూతన కనెక్షన్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ పశ్చిమాసియా యుద్ధంతో కొత్త కనెక్షన్లకు బ్రేక్ ఫ అదనపు సిలిండర్, నూతన కనెక్షన్ల కోసం ఎదురుచూపులు ఫ రీఫిల్కు 45 రోజుల వరకు గడువు నిబంధన ఫ బ్లాక్ మార్కెట్లో రూ.1,300 నుంచి రూ.1,500 వరకు వసూలుజిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు ఏజెన్సీలు 20మొత్తం కనెక్షన్లు 2,92,487గృహ అవసరాలు 1,85,070వాణిజ్య అవసరాలు 2,354దీపం 53,920ఉజ్వల 13,777ఇతర కనెక్షన్లు 37,366 -
విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్లే కీలకం
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానంభువనగిరి: విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నవారిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందన్నారు. సమాజనంలోఉపాధ్యాయుల స్థానం ఎంతో పవిత్రమైందన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది గురువులని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధ్యాయులకు అధిక ప్రాధాన్యమిస్తూ ఇప్పటి వరకు సుమారు 28వేల మందికి పదోన్నతులు కల్పించామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించడంలో అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, విలువలను నేర్పిస్తూ వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, జెడ్పీసీఈఓ శోభరాణి, డీఈఓ భిక్షపతి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హామీల అమలులో విఫలం
యాదగిరిగుట్ట రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 10న ఎల్బీ నగర్లో నిర్వహించే ఉద్యోగుల హక్కుల సాధన సభకు సంబంధించిన పోస్టర్ను శనివారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ఆరు డీఏలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయని, ఓపీఎస్లను గాలికి వదిలేశారని, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, పెన్షన్ విడుల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రతీ గ్రామంలో ఉద్యోగులు ముందుంటున్నారని, అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా గాలికి వదిలేసిందన్నారు. ఎల్బీనగర్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.ఉద్యోగులు హక్కుల సాధనకు ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణేష్ నాయక్, డీటీ సత్యనారాయణ, టీఆర్ఈఎస్ఏ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్, ట్రెజరర్ కె.శ్రీకాంత్, కో చైర్మన్ శ్రీనివాస్, పాండు, ఆంజనేయులు, మల్లేశం, అనిల్, నర్సింహ, శశికాంత్, గురునాథ్, సునీల్, ఆనంద్, సైదులు పాల్గొన్నారు. ఫామ్ పాండ్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపువలిగొండ: ఫామ్పాండ్ నిర్మాణంతో భూ గర్భజలాలు పెరుగుతాయని డీఆర్డీఓ టి. నాగిరెడ్డి పేర్కొన్నారు. వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన ఫామ్ పాండ్ పనులను ఆయన పరిశీలించి మాట్లా డారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట ఏపీఓ పరశురాములు, విక్రమ్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసు,ి ఫీల్డ్అసిస్టెంట్ విజయ, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్నేహలత తదితరులు ఉన్నారు. వైద్య సేవలు మెరుగుపర్చాలికట్టంగూర్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే సేవలను మెరుగు పరచాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీఎంఎస్ఐడీసీ (తెలంగాణ వైద్య సేవలు, మౌళివ వసతుల అభివృద్ధి సంస్థ) ఎండీ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని విభాగాలను, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి రాపోలు జమున, సిబ్బంది చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
భౌతికశాస్త్ర బోధనలో వేణుగోపాల్ మార్క్
రామగిరి(నల్లగొండ): భౌతికశాస్త్ర బోధనలో వినూత్న విధానాలు, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ బాలుర జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ గోన వేణుగోపాల్. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపకుడిగా సేవలందిస్తున్న ఆయన.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దక్పథం, భావనాత్మక అవగాహనను నింపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల వనరుల రూపకల్పన పాఠాలను కంఠస్థం చేయడం కంటే సూత్రాలను, భావనలను లోతుగా అర్థం చేసుకోవడం పైనే ఆయన ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రథమ సంవత్సర పాఠ్యపుస్తకాలు, ప్రయోగాత్మక (ప్రాక్టికల్) పుస్తకాలు, కాన్సెప్చువల్ స్టడీ మెటీరియల్, ప్రశ్నాబ్యాంకులు, సంఖ్యాత్మక సమస్యల సాధన పత్రాలను రూపొందించడంలో ఆయన విశేష పాత్ర పోషించారు. కరోనా సమయంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడినప్పటికీ విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా దూరదర్శన్ ద్వారా ప్రసారమైన విద్యా తరగతులకు కంటెంట్ క్రియేటర్గా వ్యవహరించారు. విద్యార్థులకు పాఠం చెప్పామా అన్న దానికంటే వారు నిజంగా ఆ భావనను అర్థం చేసుకున్నారా? అనే దానికే ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెబుతారు. -
స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
భువనగిరి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మదనవేణుగోపాలస్వామి, పద్మావతి అమ్మవార్లకు నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మానేపల్లి రామారావు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు. జాతీయ క్రీడాకారిణులకు మంత్రి పొన్నం ప్రశంసలుచిట్యాల: కౌలాలంపూర్లో గత నెలలో జరిగిన సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ చాంఫియన్షిప్–2026 పోటీల్లో కాంస్య పతకం సాధించిన జాతీయ లాక్రోస్ జట్టు సభ్యుల్లో చిట్యాల మున్సిపాలిటీకి చెందిన చిర్రబోయిన సంగీత, నల్లగొండకు చెందిన గోపికలు సభ్యులుగా ఉన్నారు. వీరు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. ఈ సందర్భంగా వీరిని ఆయన సన్మానించారు. గురుకులాల సొసైటీ తరపున ఒక్కొక్కరికి రూ.లక్షా 76వేలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగుల సైదులు, ఫిజికల్ డైరెక్టర్లు అంజలి, మమత, శోభ, కోచ్లు శివకుమార్, అకాష్, తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్ అధ్యక్షుడు లతీపుద్దిన్, జనరల్ సెక్రటరీ భానుచందర్ పాల్గొన్నారు. చెరువులో పడి వ్యక్తి మృతియాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. కొత్త గుండ్లపల్లికి చెందిన ముక్కెర్ల సత్తయ్య (70) గురువారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యాడు. శుక్రవారం గ్రామానికి సమీపంలోనే నల్ల చెరువులో చేపలకు వేసే గాలానికి చిక్కుకొని మృతిచెంది ఉన్నాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కేటీఆర్ మందలించలేదు.. ఎవరితోనూ విభేదాలు లేవు
సాక్షి, యాదాద్రి : బీఆర్ఎస్ పార్టీలో అందరిని కలుపుకుని ముందుకుపోతామని ఎవరితోనూ విభేదాలు లేవని డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి ఉన్నామని పేర్కొన్నారు. పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి తాము ఎల్లప్పుడు విశ్వసనీయంగా ఉంటామని చెప్పారు. టెలీకాన్ఫరెన్స్లో కేటీఆర్ తమను మందలించలేదని, కేసీఆర్, కేటీఆర్ తమ పట్ల ఆప్యాయతగా ఉంటారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటీ చేయలేదని, తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కోక వేణు ఆలిండియా సివిల్ సర్వీసెస్ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 3న భువనగిరిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్న ఆయన బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ మూడు క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చారు. దీంతో వేణును రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కోక వేణును ఎంఈఓ రాందయాకర్రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ప్రతినిధులు అభినందించారు. వైభవంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవోత్సవాన్ని ఆచార్యులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఆండాల్ అమ్మవారిని ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని జరిపించారు. మహిళా భక్తులు మంగళహారతులతో సేవకు స్వాగతం పలికారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. -
ఉత్తమ టీచర్లుగా 79 మంది ఎంపిక
భువనగిరి : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జాబితాను విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. జిల్లా నుంచి మొత్తం 79 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 44 మంది, ఎస్జీటీలు 27 మందితోపాటు కేజీబీవీకి చెందిన మరో ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గతేడాది కేవలం 32 మందే ఎంపిక కాగా ఈ సారి దరఖాస్తులు చేసుకున్న వారందరినీ ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లో జరిగే గురుపూజోత్సవంలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు ఎమ్మెల్యేల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే.. డి.రోజారాణి (ఎంఈఓ, జెడ్పీహెచ్ఎస్ బొమ్మలరామారం), కె.రఘురాంరెడ్డి (ఎంఈఓ, జెడ్పీహెచ్ఎస్ మోటకొండూరు), కె.ఉదయ (జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, జనగాం, నారాయణపూర్), ఎ.పద్మజ (జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, సీతారామపురం, గుండాల), ఎం.బాలగంగాధర్రెడ్డి (జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ చాడ), నవీన్కుమార్ (ప్రిన్సిపాల్, టీజీఎంఎస్, పోచంపల్లి), డాక్టర్ ఎం.వినోదరాణి (పీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీఎంఎస్ తుర్కపల్లి), డాక్టర్ కె.రమేష్ (పీజీటీ బయోసైన్స్, టీజీఎంఎస్, గుండాల), సీహెచ్.నాగరాజు (పీజీటీ ఇంగ్లిష్, టీజీఎంఎస్ నారాయణపూర్), బి.హేమలత (పీజీటీ గణితం, టీజీఆర్ఎస్ బాలికల రామన్నపేట), కె.శేఖర్రెడ్డి (పీజీటీ గణితం బాలురు సర్వేల్), బి.రజనీ (పీజీటీ జువాలజీ, టీజీఎంఎస్ నారాయణపూర్), నీలా గుప్త(పీజీటీ జువాలజీ, టీజీఎంఎస్ బొమ్మలరామారం), ప్రసన్నకృష్ణ (పీజీటీ అర్థశాస్త్రం, టీజీఎంఎస్ వలిగొండ), కె.సరస్వతి (పీజీటీ తెలుగు, టీజీఎంఎస్, చౌటుప్పల్), టి.బాబి పద్మజ (టీజీటీ సైన్స్, టీజీఆర్ఎస్ బాలికల చౌటుప్పల్), ఎ.అనిత (ఎస్ఏ బయోసైన్స్, జెడ్పీహెచ్ఎస్ రాజాపేట), మణి (ఎస్ఏ బయో సైన్స్, జెడ్పీహెచ్ఎస్ మాసాయిపేట), ఆర్.వీరస్వామి (ఎస్ఏ బయోసైన్స్, జెడ్పీహెచ్ఎస్ అరూర్), ఎం.గీతరాణి (ఎస్ఏ ఇంగ్లిష్, జెడ్పీహెచ్ఎస్ డి.నాగారం), ఏటీ సాంబశివ (ఎస్ఏ ఇంగ్లిష్ జెడ్పీహెచ్ఎస్ చందుపట్ల), బి.చంద్రశేఖర్ (ఎస్ఏ ఇంగ్లిష్ జెడ్పీహెచ్ఎస్ దుప్పల్లి), టి.శ్రీనివాస్ (ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ శారాజీపేట), ఈ రామ్ప్రసాద్ (ఎస్ఏ ఇంగ్లిష్, జెడ్పీహెచ్ఎస్ మోత్కూర్), బి మల్లయ్య (ఎస్ఏ ఇంగ్లిష్, జెడ్పీహెచ్ఎస్ మేడిపల్లి), బి.వెంకటేశ్వర్లు (ఎస్ఏ, హిందీ, జెడ్పీహెచ్ఎస్, దూదివెంకటాపూర్), ఎ.సత్యవతి (ఎస్ఏ హిందీ, జెడ్పీహెచ్ఎస్ కొలనుపాక), ఎస్.లింగస్వామి (ఎస్ఏ గణితం, జెడ్పీహెచ్ఎస్ పోడిచేడు), ఎస్కే.బిక్కం సాహెబ్ (ఎస్ఏ గణితం, జెడ్పీహెచ్ఎస్ వీరారెడ్డిపల్లి), ఎం.వెంకటేశ్వర్లు (ఎస్ఏ గణితం, జెడ్పీహెచ్ఎస్ బీఎన్ తిమ్మాపురం), జి.స్వామిరాజ్ (ఫిజికల్ ఎడ్యుకేషన్, జెడ్పీహెచ్ఎస్ వలిగొండ), ఎ.నర్సిరెడ్డి (ఫిజికల్ ఎడ్యుకేషన్, జెడ్పీహెచ్ఎస్ వెల్మజాల), పి.రాజు(ఎస్ఏ ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ చొల్లేరు), బి.శ్రీనివాస్ (ఎస్ఏ ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ టంగుటూరు), పి.వెంకటేశ్వర్రావు (ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ అమ్మనబోలు), ఎన్ఎల్.పద్మావతిదేవి (ఎస్ఏ సోషల్, జెడ్పీహెచ్ఎస్ బొమ్మలరామారం), బి.అశోక్రెడ్డి (ఎస్ఏ సోషల్, యూపీఎస్ వాయిళ్లపల్లి), పి.లక్ష్మమ్మ (ఎస్ఏ తెలుగు, జెడ్పీహెచ్ఎస్ జలాల్పూర్), ఎన్.రఘుపాల్రెడ్డి (ఎస్ఏ తెలుగు, జెడ్పీహెచ్ఎస్ పంతంగి), ఎస్.విజయరాణి(ఎస్ఏ తెలుగు, జెడ్పీహెచ్ఎస్ యాదగిరిగుట్ట), పి.అశోక్రెడ్డి (ఎస్ఏ, తెలుగు, జెడ్పీహెచ్ఎస్ గూడూరు), ఎస్.వెంకట్రెడ్డి (ఎస్ఏ తెలుగు, జెడ్పీహెచ్ఎస్ టేకులసోమారం), పి.వేణు (ఎస్ఏ తెలుగు, జెడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్(ఎం)), డి.వెంకన్న (ఎస్ఏ తెలుగు, జెడ్పీహెచ్ఎస్ పాటిమట్ల), జె.అరుణ (పీఎస్ హెచ్ఎం, తుర్కపల్లి), సీహెచ్.లక్ష్మీకుమారి (పీఎస్ హెచ్ఎం, శారాజీపేట), కె.లలిత (పీఎస్ హెచ్ఎం, దుబ్బాక), బి.స్వరూప (పీఎస్ హెచ్ఎం, దూదివెంకటాపూర్), సీహెచ్.పద్మ (ఎస్జీటీ, బంజారాహిల్స్, భువనగిరి), జి.వెంకటేశం(ఎస్జీటీ, బండసోమారం), వి.జనార్ధన్ (ఎస్జీటీ, బీసీ కాలనీ, రామన్నపేట), ఆర్.కవిత(ఎస్జీటీ, డినాగారం, చౌటుప్పల్), ఈ.సుధాకర్ (ఎస్జీటీ, బండకొత్తపల్లి, గుండాల), జి.మాధవరెడ్డి (ఎస్జీటీ, నారాయణపూర్), ఎం. నరేందర్రెడ్డి (ఎస్జీటీ, సర్వేల్), ఎస్.గీత (ఎస్జీటీ, మక్తాఅనంతారం), కె.సందీప్కుమార్ (ఎస్జీటీ, జనంపల్లి), ఎ.ప్రసాద్ (ఎస్జీటీ, తంగడపల్లి), డి వెంకటరమణ(ఎస్జీటీ, బడ్డుతండా, తుర్కపల్లి), కె.నగేష్ (ఎస్జీటీ, కొయ్యలగూడెం), ఎం.వేణుగోపాల్రావు (ఎస్జీటీ, వాసాలమర్రి), పి.రజిత (ఎస్జీటీ పీఎస్, ముత్తిరెడ్డిగూడెం), పి.రామకృష్ణ (ఎస్జీటీ, పోతిరెడ్డిపల్లి), కె.యాకస్వామి (ఎస్జీటీ, కంచనపల్లి), పి.సుచరిత (ఎస్జీటీ, కొలనుపాక), పి.విజయరాణి (ఎస్జీటీ, ఎస్వీ పత్తికంపెనీ, భువనగిరి), బి.కృష్ణమూర్తి (ఎస్జీటీ, బండకాడిపల్లి), పి.జానయ్య (ఎస్జీటీ, చౌళ్లగూడెం), జి.మల్లేశం (ఎస్జీటీ, కొమ్మాయిపల్లి), ఎం.గోవర్ధన్ (ఎస్జీటీ, మాటూర్), ఎండి నియంత (ఎస్జీటీ, పయ్యారం), జి.సుజన (ఓకేషనల్ ఇన్స్క్ట్రర్, జెడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్(ఎం)), పి.యాకలక్ష్మీ (బొమ్మలరామారం), భవాని (కేజీబీవీ, చౌటుప్పల్), కె.వనిత (పీజీసీఆర్టీ, కేజీబీవీ అడ్డుగూడూరు), వెన్నెల( పీజీసీఆర్టీ ఇంగ్లిష్, కేజీబీవీ భువనగిరి), వైష్ణవి (సీఆర్టీ ఇంగ్లిష్, యూఆర్ఎస్ భువనగిరి), ఎస్.పద్మ (సీఆర్టీ కేజీబీవీ పోచంపల్లి), సుజాత (ఐఈఆర్పీ, బీబీనగర్), టి.సంధ్యారాణి (ఐఈఆర్పీ, రాజాపేట) ఉన్నారు. ఫ స్కూల్ అసిస్టెంట్లు 44, ఎస్జీటీలు 27 మంది ఫ కేజీబీవీలకు చెందిన వారు 8 మంది ఫ జిల్లా స్థాయి జాబితాను విడుదల చేసిన విద్యాశాఖ ఫ నేడు రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డుల ప్రదానం -
చెదురుతున్న అక్షర బంధం
ఫ గురుశిష్యుల పవిత్రబంధానికి బీటలు ఫ సామాజిక మాధ్యమాల ప్రభావంతో పెడదారి పడుతున్న విద్యార్థులు గురువులంటే కేవలం చదువు చెప్పేవారు మాత్రమే కాదు. ఒక భావితరాన్ని నిర్మించే శక్తి. వారు చూపే మార్గంలో పెరిగే విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. సమాజంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే. కానీ ప్రస్తుతం మారుతున్న కాలంలో విలువలు కూడా మారుతున్నాయి. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్రబంధానికి బీటలు వారుతున్నాయి. సామాజిక మధ్యమాల ప్రభావంతో పాటు ఉరుకుల పరుగుల జీవితంలో తమ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గిపోవడంతో పెడదారి పడుతున్నారు. తప్పులు చేస్తున్న విద్యార్థులపై ఉపాధ్యాయుల చిరు మందలింపును కూడా తట్టుకోలేకపోతున్నారు. గురువులను ఎదురించడమే కాదు భౌతిక దాడులకు కూడా వెనకాడని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు.. సమాజానికి దిక్చూచిలా ఉండాల్సిన కొందరు గురువులు వృత్తి ధర్మాన్ని మరిచి విద్యార్థినులను చెరపడుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకోవడం బాధాకరం. గురుశిష్యుల మధ్య నమ్మకం, గౌరవం, స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. విద్యార్థులను గురువులు తమ సొంత పిల్లలుగా చూసుకోవాలి. విద్యార్థులు కూడా గురువులను మార్గదర్శకులుగా గౌరవించినప్పుడే గురుశిష్యుల మధ్య బంధం పదిలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే గురువులకు.. గురువులను దేవుళ్లుగా భావించే గౌరవించే విద్యార్థులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. – సాక్షి నల్లగొండ డెస్క్ -
గణపయ్య రూపం.. సైబర్ పాఠం
భువనగిరిటౌన్, సూర్యాపేటటౌన్ : వినాయక చవితి పండుగ వేళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బొజ్జ గణపయ్య స్వరూపం నుంచే సైబర్ రక్షణ పాఠాలు నేర్చుకోవచ్చంటూ రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్ ఆలోచింపజేస్తోంది. ‘వినాయకుడు మనకు నేర్పే పాఠాలు – సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్లు అన్ని వినాయకుల మండపాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా మండపాలకు పోటెత్తే భక్తులు, యువతలో సైబర్ భద్రతపై విస్తత అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైబర్ నేరం ఎవరికై నా జరగవచ్చని, కానీ సరైన అవగాహన మాత్రమే ప్రతి ఒక్కరినీ రక్షిస్తుందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, బ్యాంక్ ఓటీపీల వివరాలు అడిగే సందేశాలు, ఆకర్షణీయమైన బహుమతుల పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతే కాలయాపన చేయకుండా గోల్డెన్ అవర్లోగా 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ www.cyber crime.gov.in లో ఫిర్యా దు నమోదు చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఫ ల్యాప్టాప్తో బొజ్జ గణపయ్య దర్శనం ఫ అవయవాల విశిష్టతతో సైబర్ సూత్రాల అనుసంధానం ఫ పోస్టర్లు రూపొందించిన పోలీస్ శాఖ ఫ గణేష్ మండపాల వద్ద ఏర్పాటు ఫ ఈ వినూత్న పోస్టర్లో.. విఘ్నేశ్వరుడు చేతిలో ల్యాప్టాప్తో దర్శనమిస్తూ, ఆయన అవయవాల ప్రత్యేకతలను సైబర్ సూత్రాలకు ముడిపెట్టి వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఫ పెద్ద చెవులు : సైబర్ నిపుణులు, పోలీసులు ఇచ్చే భద్రతా హెచ్చరికలను శ్రద్ధగా ఆలకించాలి. ఫ చిన్న కళ్లు : ఆన్లైన్లో వచ్చే నకిలీ లింకులు, మోసపూరిత ప్రకటనలను వెంటనే నమ్మకుండా పరిశీలించాలి. ఫ అభయ హస్తం : ఆన్లైన్ అనుమానాస్పద లింకులు, యాప్లు, కోడ్లను క్లిక్ చేయవద్దు. ఫ పెద్ద తల : టెక్నాలజీ వినియోగంలో ఆవేశం కాకుండా వివేకంతో, తెలివిగా వ్యవహరించాలి. ఫ పొడవైన తొండం : కొత్త తరహా సైబర్ ముప్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి, పరిస్థితులకు తగినట్లు అప్రమత్తం కావాలి. ఫ చేతిలోని కలం: ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ముఖ్యమైన ఆన్లైన్ లావాదేవీల వివరాలను నమోదు చేసుకుని, అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే స్పందించండి. ఫ మోదకం : ఓటీపీ, పిన్, పాస్వర్డ్లు, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దు. ఫ మూషిక వాహనం : డిజిటల్ సమాజంలో ఎంత ఎదిగినా అణకువ, క్రమశిక్షణ పాటించాలి. మొబైల్, ఇంటర్నెట్ను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉపయోగించండి. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పెద్దవూర : విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతిచెందాడు. సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం లింగపల్లి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. అనుముల మండలం కొట్టాల గ్రామానికి చెందిన బైరు రామలింగయ్య(25) పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. శుక్రవారం కౌలుకు తీసుకున్న భూమిలో వరి నాట్లు వేయడానికి కూలీలను పిలిచాడు. గురువారం రాత్రి తన స్నేహితుడు కొప్పెర నాగరాజుతో కలిసి బోరు మోటార్ ద్వారా నీళ్లు పెట్టడానికి కౌలు భూమి వద్దకు వెళ్లాడు. బోరు మోటార్ ఆన్ చేసినా నీళ్లు రాకపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా ఉందో లేదో తెలుసుకోవడానికి స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు రామలింగయ్య విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే స్నేహితుడు నాగరాజు.. రామలింగయ్య తండ్రి వెంకటేశ్వర్లు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఆసుపత్రికి తరలించారు. రామలింగయ్య తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు. -
ఉపాధ్యాయుడి నుంచి ఎస్పీగా..
ఫ గురువుల ప్రోత్సాహమే నా లక్ష్య సాధన ఫ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : సాధారణ కుటుంబ నుంచి ఎదిగి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆయన.. అనంతరం పోలీసు శాఖలో చేరి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎస్పీ నరసింహ నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. తన ఎదుగుదలలో గురువుల పాత్ర ఎంతో కీలకమని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా 1996 నుంచి 1998 మధ్య తనకు గణితం బోధించిన రాములు సార్ అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని నరసింహ పేర్కొన్నారు. పాఠ్యాంశాలను బోధించడంతో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ రాములు సార్ తనను ముందుకు నడిపించారని చెప్పారు. మురళీకృష్ణ సార్ కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని నరసింహ తెలిపారు. ఇంటర్ పూర్తయిన తర్వాత టీటీసీ రాస్తే ఉపాధ్యాయ ఉద్యోగం పొందవచ్చని చెప్పి తనకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. గురువుల ప్రోత్సాహంతో తాను కూడా ఉపాధ్యాయుడిగా మారాలనే ఆలోచనకు వచ్చానని పేర్కొన్నారు. మొదట ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తాను కాలక్రమంలో పోటీ పరీక్షల వైపు అడుగులు వేశారు. పట్టుదలతో పోలీసు శాఖలో చేరి నేడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, ఇదంతా గురువుల ప్రోత్సాహంతోనే సాధ్యమైందని, గురువుల మాటలను గౌరవించాలని చెబుతున్నారు. ఆ రోజుల్లో గురువులు ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం నా జీవితంలో ఎంతో ప్రభావం చూపాయి. -
డిపాజిట్ రుసుం ఇవ్వరా!
భువనగిరి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు ఇప్పటికీ డిపాజిట్ రుసుం తిరిగివ్వలేదు. గత డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులుగా చాలా మంది పోటీచేసి నామినేషన్లు సమర్పించారు. సర్పంచ్లు, వార్డు సభ్యులుగా పలువురు గెలుపొందారు, మరికొందరు స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇంకొందరు డిపాజిట్లు కోల్పోయారు. గెలుపొందిన వారితో పాటు ఓటమి పాలై డిపాజిట్ దక్కించుకున్న వారిలో కొందరు ఎన్నికల ఖర్చు లెక్కలు సమర్పించకపోవడంతో అధికారులు డిపాజిట్ రుసుం తిరిగి చెల్లించనట్టు తెలుస్తోంది. జిల్లాలో 1,567 మంది పోటీ ఏకగ్రీవాలు పోనూ మిగతా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు సుమారు 1,567 మంది పోటీ చేశారు. వార్డు సభ్యుల స్థానాలకు 7 వేలకుపైగా పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం జమైన నగదులో సగం వరకు రిఫండబుల్ కేటగిరీలోకి వస్తుంది. ఎన్నికల బరిలో నిలిచి పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు వచ్చిన వారికి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ కోల్పోయిన వారికి మాత్రం ఇవ్వరు. కొందరు పోటీచేసిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే వచ్చేవి తక్కువ డబ్బులే కధా అని వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి గురించి అధికారులు కూడా లెక్కలు చెప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఖర్చుకు నిధులు ఇవ్వకపోవడంతో.. జిల్లాలో 2025 డిసెంబర్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలలు అవుతోంది. ఫలితాల తర్వాత డిపాజిట్లు కోల్పోయిన వారిని మినహాయించుకుని మిగిన వారందరికీ డిపాజిట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆ డబ్బులు అధికారుల వద్దనే ఉంచుకున్నారు. కొందరు అడిగితే మాత్రం ఎన్నికల ఖర్చులో చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతి మండలానికి ఎన్నికల ఖర్చు కింద రూ.5 లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వాలి. వాటిని నేటికీ ఇవ్వకపోవడంతో డిపాజిట్ డబ్బులను అధికారులే వాడుకున్నట్టు తెలుస్తోంది. వాడుకున్న డబ్బులు రూ.లక్షల్లో ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి పోటీచేసిన అభ్యర్థులకు డిపాజిట్ డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీలు 427వార్డు స్థానాలు 3704 సర్పంచ్ అభ్యర్థులు 1567 వార్డు అభ్యర్థులు 700O సర్పంచ్ డిపాజిట్ (జనరల్) రూ.2000ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. రూ.1000వార్డు సభ్యులు (జనరల్) రూ.500ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. రూ.250 పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల డిపాజిట్ చెల్లించలేదనే విషయం మా దృష్టికి రాలేదు. డిపాజిట్ తిరిగి ఇవ్వని అభ్యర్థుల వివరాలు తెలుసుకుంటాం. ఎందుకు ఇవ్వలేదో పరిశీలన చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎంపీడీఓ కార్యాలయాల్లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను నిబంధనల ప్రకారం సమర్పించి, తమ ధరావతు సొమ్మును తిరిగి పొందవచ్చు. – శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఫ పంచాయతీ ఎన్నికల్లో డిపాజిట్ చేసిన అభ్యర్థులకు తిరిగిరాని సొమ్ము ఫ తొమ్మిది నెలలవుతున్నా స్పందన కరువు ఫ అడిగితే ఎన్నికల ఖర్చుల కిందచూపెడుతున్న అధికారులు -
మంత్రి పదవికి లైన్క్లియర్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ జోరందుకుంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఖాళీ ఏర్పడటంతో కొత్తవారికి మంత్రి పదవుల అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా లంబాడా కోటాలో తనకు మంత్రి ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో రెడ్డి సామాజికవర్గం నుంచి రాజగోపాల్రెడ్డికి అవకాశం దక్కవచ్చని ఆయన అనుచరులు, కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్కు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు కూడా మంత్రి పదవులు ఇస్తారన్న చర్చ నేపథ్యంలో వారిద్దరికి ఇస్తే రెడ్డి సామాజికి వర్గం నుంచి రాజగోపాల్రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. బాలునాయక్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఇప్పుడు కేబినెట్ విస్తరణ చర్చ జరుగుతుండటంతో ఆయన కూడా తనకు మంత్రి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు తెలిసింది. సాఫ్ట్ మూడ్లోకి... తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి వ్యవహారశైలిలోనూ మార్పు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వ విధానాలపై, పార్టీ వ్యవహారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే ప్రస్తుతం కొంత సాఫ్ట్ మూడ్లో ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. దీంతో మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఇచ్చిన హామీని ఈసారి నిలబెట్టుకోవాలని రాజగోపాల్రెడ్డి అధిష్టానం పెద్దలను కోరినట్లు తెలిసింది. వారి నుంచి కూడా కొంత సానుకూలత వ్యక్తం అయినట్లు చర్చ జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లోనే? కేబినెట్ విస్తరణపై అధికారిక షెడ్యూల్ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, రెండు, మూడు రోజుల్లో లేదా అసెంబ్లీ సమావేశాల తరువాత జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎవరెవరికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు రాజగోపాల్రెడ్డికి అటు బాలు నాయక్లలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది? అసలు మూడో మంత్రి పదవిని జిల్లాకు ఇస్తారా? లేదా? అన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఫ రాజగోపాల్రెడ్డికి బెర్త్ దక్కుతుందని రాజకీయవర్గాల్లో చర్చ ఫ కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు అవకాశాలు ఫ తాజా పరిణామాలతో సాఫ్ట్ మూడ్లోకి వచ్చేసిన రాజగోపాల్రెడ్డి ఫ లంబాడా కోటాలో మంత్రి పదవి అడుగుతున్న బాలునాయక్ -
సమాజానికి మేల్కొలుపుతూ..
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుడంటే కేవలం తరగతి గదిలో పాఠాలు చెప్పేవాడు కాదు.. సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచేవాడు అనే పదానికి నిదర్శనం రాచకొండ ప్రభాకర్. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసముంటూ మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభాకర్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, జాగ్రత్తగా వాహనాలు నడపడం వంటి అంశాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉపయోగపడేలా శ్రీచేయూత దుస్తుల బ్యాంకుశ్రీ ఏర్పాటు చేసి దాతల నుంచి దుస్తులు సేకరిస్తున్నారు. దాతల సహకారంతో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు సేకరించి పేద విద్యార్థులకు అందిస్తూ వారి చదువుకు అండగా నిలుస్తున్నారు. విద్య అంటే పుస్తకాల్లోని పాఠం మాత్రమే కాదు.. జీవితాన్ని, సమాజాన్ని మార్చే శక్తి అనే ఆలోచనకు ఆయన సేవా కార్యక్రమాలు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. -
యాదగిరి క్షేత్రంలో కణ్ణన్ తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయంలో శుక్రవారం కణ్ణన్ తిరునక్షత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో విష్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, నవకలశ స్నపనం చేసి విశేష పూజలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహ, మహాలక్ష్మి, సుదర్శన, వాసుదేవ మూలమంత్ర హవనం పూజను జరిపించారు. సాయంత్రం వేళ శ్రీస్వామిని అధిష్టించి తిరునక్షత్ర పూజలు జరిపించి, వేద పఠనం చేపట్టారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ భవాని శంకర్, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. యాదగిరీశుడి సేవలో ప్రముఖులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అల్పనా దూబే, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు తమ కుటుంబ సభ్యులతో శుక్రవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రముఖులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవాని శంకర్ లడ్డూ ప్రసాదం అందజేశారు. అల్పనా దూబేకు ఆశీర్వచనం చేస్తున్న అర్చకుడు నవ కలశ స్నపనం నిర్వహిస్తున్న అర్చకులు -
శిథిలావస్థలో రామన్నపేట ఆస్పత్రి
రామన్నపేట : యాభై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి భవనం నేడు శిథిలావస్థకు చేరింది. భవనాల పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. వర్షం వస్తే చాలు గదుల్లోకి నీరు చేరుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, వార్డుల్లో రోగులు ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఎనిమిది మండలాలకు పెద్దదిక్కు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి భవనాలను 1970లో నిర్మించారు. అప్పటి ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 30 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. కాలక్రమంలో దీని స్థాయిని 50 పడకలకు పెంచారు. రామన్నపేటతో పాటు నకిరేకల్, మునుగోడు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల ప్రజలకు ఈ ఆస్పత్రే పెద్దదిక్కు. ఇక్కడికి నిత్యం 400 మంది వరకు రోగులు ఓపీ కోసం వస్తుంటారు. స్థాయి పెంచాలి.. కొత్త భవనాలు కట్టాలి నిత్యం వందలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న రామన్నపేట ఆస్పత్రి స్థాయిని మరింత పెంచి, శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలన్న డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే మౌలిక వసతులు కల్పించడం అత్యవసరం. జూలై 12న రామన్నపేటలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఆస్పత్రి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, నెలలు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నెల 5న నకిరేకల్లో వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రామన్నపేట ఆస్పత్రి నూతన భవనాలకు కూడా నిధులు మంజూరు చేస్తారనే ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఫ 55 ఏళ్ల నాటి భవనం.. నిత్యం భయంభయం ఫ నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ ఫ నేడు నకిరేకల్ రానున్న సీఎం రేవంత్రెడ్డి ఫ నిధులు ప్రకటిస్తారని ప్రజల్లో ఆశ -
వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని..
సూర్యాపేటటౌన్ : అనారోగ్యానికి గురైన నాలుగు నెలల బాలుడిని ప్రైవేట్ ఆస్పత్రిలో చూయించి, ఇంటికి వెళ్లిన అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామానికి చెందిన రాము, ప్రీతి దంపతుల నాలుగు నెలల కుమారుడు జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైమ్ పిల్లల హాస్పిటల్కు తీసుకువచ్చి చూపించారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం బాబును ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. తమ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని వారి ఆందోళనను విరమింపజేశారు. ఫ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన -
సరళ రీతిలో పాఠాలు
నాగారం : నాగారం మండలం వర్థమానుకోటలోని పాటిమీదిగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వర్దెల్లి మల్లయ్య ‘వినూత్న ఆలోచన– స్వీయ అభ్యాసం’ అనే భావనలతో ‘ఇన్ స్కూల్ యాక్టివిటీస్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గత 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సైతం ఉపయోగకరమైన ఆన్లైన్ వీడియోలను అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ యూట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు నవోదయ, గురుకుల, సైనిక, స్పోర్ట్స్ పాఠశాలల వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన గణిత రీజనింగ్, మానసిక సామర్థ్య పరీక్ష, గణితంలో ప్రాథమిక భావనలు వంటి ఉపయోగకరమైన అంశాలను సులభ పద్ధతిలో అందిస్తున్నారు. విద్యార్ధులు ప్రాథమిక సామర్థ్యాలు పెంచుకోవడానికి ఉపయోగపడే విషయాలను, గణితం, ఇంగ్లిష్, తెలుగు, పరిసరాల విజ్ఞానం విషయాలకు సంబంధించి డిజిటల్ పాఠ్యాంశాల వీడియోలు అందిస్తూ.. విద్యార్థుల్లో పోటీ వాతావరణన్ని పెంచుతూ, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగిస్తున్నారు. -
విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తూ..
ఆలేరు రూరల్ : ఆలేరు మండలం గొలనుకొండ ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్ టీచర్ జ్యోతిర్మయి పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంగ్లిష్ అంటే భయపడే విద్యార్థుల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫోనెటిక్స్ ఆధారంగా ఆంగ్ల బోధనకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఏఐ ఆధారిత వీడియోలు, డిజిటల్ కంటెంట్ను రూపొందించి పాఠాలను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అంతేకాకుండా ‘చూసి నేర్చుకోవడం– చేసి నేర్చుకోవడం’, సృజనాత్మక వ్యక్తీకరణ విధానాలను అనుసరిస్తూ ఆమె సొంత డబ్బులతో పిల్లలతో కలిసి గోడలపై పెయింటింగ్స్ వేస్తున్నారు. పెద్దవూర: మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఉపాధ్యాయుడు తూడి వెంకట్రెడ్డి. ఎక్కువకాలం గుర్తుండేలా సృజనాత్మకమైన బోధన అందించేందుకు కార్యకలాప ఆధారిత అభ్యసన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆటలు, చిత్రలేఖనం, అక్షరాలు–పదాల గుర్తింపు, వస్తువులను ఉపయోగించి విద్య నేర్పుతున్నారు. తరగతి గదిని కేవలం పాఠ్య పుస్తక బోధనకే పరిమితం చేయకుండా, ‘చేస్తూ నేర్చుకోవడం–ఆడుతూ నేర్చుకోవడం’ అనే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. -
తరగతి గదికే పరిమితం కాకుండా..
సూర్యాపేటటౌన్: సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ బానోతు వాసు విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, కళాశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారు. మలబార్ గోల్డ్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ల రూపంలో రూ.20 లక్షలకు పైగా ప్రయోజనం చేకూరేలా సంబంధిత సంస్థలతో సమన్వయం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడంలో చొరవ చూపారు. కళాశాలలో క్రమశిక్షణ, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు విస్తృతంగా ప్రచారం చేశారు. వివిధ పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్మీడియట్ విద్య ప్రాముఖ్యత, ప్రభుత్వ కళాశాలల్లోని సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. బోధనను తరగతి గదికే పరిమితం చేయకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. కళాశాలల్లో తనదైన శైలిలో విద్యార్థులను మోటివేట్ చేయడంతో పాటు కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా కళాశాలల్లో మొక్కలు నాటడం అంశాలపై తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. బానోతు వాసు -
కారు అద్దం పగులగొట్టి సెల్ఫోన్లు, వెండి ప్లేట్ అపహరణ
● యాదగిరి కొండపై ఘటన యాదగిరిగుట్ట : పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులగొట్టి అందులోని సెల్ఫోన్లు, చిన్న వెండి ప్లేట్లు అపహరించిన సంఘటన సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన చోటు చేసుకుంది. ఎస్పీఎఫ్ సీఎస్ఓ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కారులో యాదగిరీశుడిని దర్శనానికి వచ్చాడు. శివాలయానికి వెళ్లే దారిలోని ర్యాంప్ సమీపంలో కారును పార్క్ చేశాడు. దర్శనానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారు వెనక భాగంలో అద్దం పగులగొట్టి, అందులో ఉన్న రెండు సెల్ఫోన్లు, అన్న ప్రాసన చేసే చిన్న వెండి ప్లేట్ను అపహరించారు. ఈ విషయమై బాధితుడు కొండపైన ఈఓ భవాని శంకర్కు తెలిపారు. ఇప్పటికే ఓ వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సీఎస్ఓ పేర్కొన్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్యగుర్రంపోడు : మండలంలోని పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి యాదగిరి(43) సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం యాదగిరి పదేళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో తన అనారోగ్యం గురించి ఆలోచిస్తూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వ్యవసాయం చేయడంతోపాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి తమ్ముడు బైరి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రియాక్టర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ మరొకరు మృతిభూదాన్పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో ఆగస్టు 21న అర్ధరాత్రి రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వేదుల చెన్నకేశవులు (38) ఆదివారం మృతిచెందాడు. పోస్ట్మార్టమ్ అనంతరం పోలీ సులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా వేదుల చెన్నకేశవులు హెజిలో ఫార్మా కంపెనీలో 2021లో కెమిస్ట్రీగా విధుల్లో చేరాడు. మృతుడికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న చెన్నకేశవులు మృతిచెందడంలో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. కాల్వలోపడి మేకలకాపరి మృతినిడమనూరు : సాగర్ కాల్వ వెంట మేకల మేపుతున్న కాపరి మైనర్ కాల్వలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన కంసాని దుర్గయ్య(59), భార్య అంజమ్మతో కలిసి సాగర్ ఎడమకాల్వ వెంట నారెళ్లగూడెం మేజర్ వద్ద మేకలు మేపుతుండగా మైనర్ కాల్వలో జారిపడ్డాడు. గుర్తించిన భార్య అంజమ్మ సాయమందించే సరికే నీటి ప్రవాహానికి కొట్టుకపోయి, నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దుర్గయ్య కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
రెండు ఆటోలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
కేతేపల్లి : రెండు ఆటోలు ఢీకొనడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం నకిరేకల్ నుంచి ప్రయాణికులతో సూర్యాపేటకు వెళ్తున్న ఆటోను కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం శివారులోని 65 జాతీయ రహదారి గల సాయికృష్ణ హోటల్ సమీపంలో వెనకాల వస్తున్న ట్రాలీ ఆటో ఢీకోట్టింది. ఇదే సమయంలో ఆటోల వెనకాలే హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తున్న సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని గ్రహించి బస్సును కుడి వైపుకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్పైకి ఎక్కి నిలిచిపోయింది. ప్రమాదానికి కారణమైన రెండు ఆటోలు రోడ్డు పక్కనే ఉన్న గుంతల్లోకి దూసుకెళ్లి పల్టీకొట్టాయి. ఈప్రమాదంలో ముందున్న ఆటోలో ప్రయాణిస్తున్న ఎన్.సైదులు, మహమ్మద్లకు తీవ్రగాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్టయ్యింది. క్షతగాత్రులను 108 వాహనంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేతేపల్లి పోలీసులు ప్రమాద ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. డివైడర్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. డివైడర్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు -
సాగర్ నుంచి సోమశిలకు ‘పంటు’
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయ తీరంలో రూ.4 కోట్ల వ్యయంతో మొత్తం మూడు పంట్ల (లాంచీ ఎక్కేందుకు వినియోగించేవి) తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో రెండు పంట్లను నాగార్జునసాగర్ పర్యాటకుల కోసం కేటా యించగా, వాటిలో ఒకటి నాగార్జునకొండ వద్ద, మరొకటి సాగర్ తీరంలో ఉంటాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. మూడో పంటును సోమశిల ప్రాజెక్టు కోసం తయారు చేశారు. ఈ పంటు నిర్మాణం పూర్తి కావడంతో సోమవారం దానిని లారీలో సోమశిల వద్దకు తరలించారు. విశాఖపట్నానికి చెందిన మా తారా మైరెన్ అండ్ షిప్యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇండియన్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఈ పంట్ల నిర్మాణానికి ఆర్డర్ ఇచ్చింది. వారు ఈ పనులను కోల్కతాకు చెందిన బ్లూవేస్ మ్యాన్పవర్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ సిబ్బంది సాగర్ తీరంలోనే ఉంటూ ఒక పంటును పూర్తిచేశారు. మిగిలిన రెండింటిని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అధునాతన సౌకర్యాలతో..ప్రస్తుతం సాగర్లో పర్యాటకులు లాంచీలు ఎక్కేందుకు వినియోగిస్తున్న పంట్ల కంటే, నూతనంగా తయారవుతున్న పంట్లు ఒక్కొక్కటి 6 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల పొడవుతో పెద్దగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఇంజిన్లు కూడా అమర్చనున్నా రు. దీంతో అవసరాన్ని బట్టి కొంత దూరం వరకు నీటిలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. వీటిపై కార్లు, జేసీబీల లాంటి భారీ యంత్రాలను తరలించవచ్చు. ప్రస్తుతానికి పర్యాటకులు లాంచీ ఎక్కేందుకు, దిగేందుకు వీటిని వినియోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఈ నూతన పంట్లు అందుబాటులోకి వస్తే సాగర్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.4 కోట్లతో మూడు పంట్ల తయారీకి నిర్ణయం ఇప్పటికే ఒకదాని పనులు పూర్తి మిగతా రెండు తయారైతే సాగర్ జలాశాయానికి కేటాయింపు -
ఒకేరోజు మూడిళ్లలో చోరీ
మర్రిగూడ : తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో ఒకేరోజు చోరీలు జరిగాయి. మర్రిగూడ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాలు.. మర్రిగూడ మండలం శివన్నగూడెం, ఖుదాబక్ష్పల్లి గ్రామాల్లో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు ఒకే రోజు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామన్నారు. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తే పోలీసులకు, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అమరవరంలో మరో ఇంట్లో.. హుజూర్నగర్ : తాళం వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి రూ.15 వేల నగదును అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన సోమవారం హుజూర్నగర్ మండలం అమరవరంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన చేపూరి రామారావు తన ఇంట్లో కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. అతను తన కంటి ఆపరేషన్ నిమిత్తం ఈనెల 22న హైదరాబాద్కు వెళ్లి అక్కడ వైద్యం చేయించుకున్నాడు. ఆసుపత్రి నుంచి ఆగస్టు 30న ఇంటికి వచ్చి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వెనకాల ఉన్న తలుపుని తెరిచి గడ్డపారతో ఇనుప బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. తగ్గని వాహనాల రద్దీచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం కూడా హైదరాబాద్ మార్గంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులుదీరాయి. పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో వాహనాలను సర్వీస్ రోడ్ల మీదుగా మళ్లించారు. అయినా అర్ధరాత్రి వరకూ రద్దీ ఏ మాత్రమూ తగ్గలేదు. ఫలితంగా వాహనదారులు, స్థానిక ప్రజానీకం నానా అవస్థలకు గురయ్యారు. -
కాలుష్య భూతంపై ‘ఫ్లెక్సీ’తో అవగాహన
భూదాన్పోచంపల్లి : మండలంలోని అంతమ్మగూడెం గ్రామంలో కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రసాయన కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పరిఽధిలోని రసాయన కంపెనీలు వెదజల్లుతున్న పలు రకాల కాలుష్య రసాయనాల కారకాలపై పీసీబీ ఇచ్చిన రిపోర్టులను ఫ్లెక్సీలపై ముద్రించారు. అయితే గ్రామంలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన చుట్టాలు, గ్రామస్తులు ఫ్లెక్సీలను ఆసక్తి తిలకించారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
వ్యక్తి అదృశ్యం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఆగస్టు 26న అదృశ్యమైన ఓ వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం రాఘపట్నం గ్రామానికి చెందిన గంట వెంకటరామయ్య (42) రాడ్ బెండింగ్ పనుల నిమిత్తం సూర్యాపేటకు వచ్చి అదృశ్యమయ్యాడు. వెంకటరామయ్య తనకు పరిచయస్తుడైన బుల్ల బాలుతోపాటు మరో తొమ్మిది మందితో కలిసి సూర్యాపేటకు వచ్చి ఉంటున్నారు. గతనెల 26న ఉదయం సుమారు 9.30 గంటలకు తాళ్లగడ్డ ప్రాంతంలో అందరూ కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మిగిలిన వారంతా తమ గదికి తిరిగి వెళ్లగా, వెంకటరామయ్య మాత్రం వారితో వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆచూకీ లభించలేదు. పరిచయస్తులు, బంధువులు పరిసర ప్రాంతాలు, తెలిసిన ప్రదేశాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సూర్యాపేట టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వెంకట రామయ్య ఆచూకీ తెలిసిన వారు, ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే సూర్యాపేట టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం ఫోన్ 9948691481, 8712680134 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఇంగ్లిష్ వర్క్బుక్ రూపకల్పనలో శశికుమార్ ప్రతిభ
మోత్కూరు : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 8వ తరగతి ఇంగ్లిష్ వర్క్ బుక్ రూపకల్పనలో మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మేకల శశికుమార్ భాగస్వామ్యమై తనదైన ప్రతిభ కనబర్చి ప్రశంసాపత్రం అందుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి రూపొందించిన 8వ తరగతి ఇంగ్లిష్ వర్క్బుక్లో కంటెంట్ డెవలపర్గా ఆయన సేవలందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, అంతర్లీన శక్తులను వెలికి తీసేలా అయన రాసిన డిస్కవరీ ట్రెజరీ విత్ ఇన్ యూ అనే కవిత ఆ వర్క్బుక్లో చోటు దక్కించుకుంది. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ వర్క్బుక్కు కంటెంట్ డెవలపర్గా ఎంపికై పాఠ్యాంశ రూపకల్పనలో తన వంతు కృషి చేసిన మేకల శశికుమార్ను మోత్కూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం డి.అరవిందరాయుడు, సిబ్బంది సోమవారం అభినందించారు. -
పత్తిలో సమతుల్య పోషకాలు కీలకం
గరిడేపల్లి: వర్షాధారంగా సాగు చేసే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి. పత్తిలో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పత్తిని పొందాలంటే సమతుల్య పోషక యాజమాన్యం ఎంతో కీలకం. మొక్కకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో, సరైన సమయంలో అందించకపోతే మొక్క ఎదుగుదల, పూత, పిందె, కాయల అభివృద్ధి, పత్తి నాణ్యత, చివరికి దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలపైనా రైతులు శ్రద్ధ చూపాలి. ప్రధాన పోషకాల నిర్వహణ ● పత్తి పంటకు సాధారణంగా ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అందేవిధంగా సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును పాటించాలి. నేల పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదులను సర్దుబాటు చేసుకోవడం మరింత సమర్థవంతమైన విధానం. ● భాస్వరం పంట ప్రారంభ దశలోనే వేర్ల అభివృద్ధికి అవసరమవుతుంది. అందువల్ల సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం మోతాదును సాధారణంగా చివరి దుక్కిలో లేదా విత్తిన 15 రోజులు లోపు వేయాలి. విత్తిన తర్వాత పైపాటుగా భాస్వరం వేయడం సాధారణంగా అవసరం ఉండదు. ● నత్రజని పత్తి మొక్కలో శాఖల అభివృద్ధి, ఆకుల పెరుగుదల, పూత, పిందె, కాయల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. నత్రజనిని అధికంగా వేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి, పూత–కాయల ఏర్పాటులో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సిఫార్సు చేసిన నత్రజని మోతాదును ఒకేసారి కాకుండా పంట దశను బట్టి విడతలుగా అందించాలి. ● పొటాష్ మొక్కలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాయల అభివృద్ధి, పత్తి నాణ్యత, నీటి ఎద్దడి వంటి వివిధ ఒత్తిడి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. వర్షాధార పత్తిలో పొటాష్ను నిర్లక్ష్యం చేయకుండా సిఫార్సు చేసిన మోతాదులో అందించడం ముఖ్యం. ● నత్రజని–పొటాష్ను విడతలుగా బీటీ పత్తిలో సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్ మోతాదులను 20, 40, 60, 80 రోజులలో నాలుగు విడతలుగా అందించవచ్చు. ఎకరాకు ప్రతి విడతలో సుమారు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయడం ద్వారా అవసరమైన నత్రజని, పొటాష్ను అందించవచ్చు. ఈ విధంగా విడతలుగా అందించడం వల్ల పోషకాల వినియోగ సామర్థ్యం మెరుగుపడి, మొక్కకు అవసరమైన దశలో పోషకాలు అందే అవకాశం ఉంటుంది. నీటి లభ్యత, నేల స్వభావం, పంట స్థితిని బట్టి ఎరువుల నిర్వహణలో మార్పులు చేసుకోవాలి. ద్వితీయ, సూక్ష్మ పోషకాల లోపాలు, యాజమాన్యం ● జింక్ లోపం ఒకే పంటను పదేపదే సాగు చేయడం, చౌడు ప్రభావం ఉన్న నేలలు, భాస్వరం ఎరువులను అధికంగా ఉపయోగించడం వంటి పరిస్థితుల్లో జింక్ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. జింక్ లోపం వల్ల ఆకులు చిన్నవిగా, ముడతలుగా మారి, కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ లోపాన్ని నివారించేందుకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ● మెగ్నీషియం నేలలో పొటాష్ అధికంగా ఉండటం వంటి పరిస్థితుల్లో మెగ్నీషియం అందుబాటు తగ్గి లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ పోషక లోపం వలన ముదురు ఆకుల అంచులు మారుతాయి. తరువాత ఆకులు ఎరబ్రడి ఎండి రాలిపోతాయి. ఆకుల ఈనెలు మాత్రం రంగు మారక ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని నివారించేందుకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి వారం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ● బోరాన్ సున్నం అధికంగా ఉన్న నేలల్లో, అలాగే నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితుల్లో బోరాన్ లోప లక్షణాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. బోరాన్ లోపం వల్ల పూత, పిందె, చిన్న కాయలు రాలడం, పూలు చిన్నవిగా మారడం, మొక్క ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లోపాన్ని నివారించేందుకు లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ కలిపి ఒకటి లేదా రెండు సార్లు 7–10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితుల్లోనూ పోషక యాజమాన్యం ముఖ్యం పత్తిలో పోషకాల లభ్యత, మొక్క వాటిని గ్రహించి వినియోగించే సామర్థ్యంపై వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. నీటి ఎద్దడి, బెట్ట పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమలో మార్పులు వంటి పరిస్థితుల్లో మొక్కలో సహజ శారీరక ప్రక్రియలు దెబ్బతిని పత్తిలో కూడా, పూత, పిందె, చిన్న కాయలు రాలే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా పొలంలో నీటి లభ్యతను మెరుగుపరచడం, సాధ్యమైన చోట రక్షక నీటిపారుదల అందించడం, నేలలో తేమను సంరక్షించే చర్యలు చేపట్టడం ముఖ్యం. దీర్ఘకాలిక బెట్ట పరిస్థితుల్లో పత్తిలో పూత, కాయ రాలడాన్ని తగ్గించేందుకు ప్లానోఫిక్స్ (10 పిపియం) ద్రావణాన్ని 5 లీటర్ల నీటికి ఒక మి.లీ చొప్పున కలిపి 10– 15 రోజులో రెండుసార్లు పిచికారి చేయాలి. ● పూత, పిందె దశలో మొక్కకు తగిన పోషకాలు అందించేందుకు అవసరాన్ని బట్టి యూరియా లేదా ఈఅ్క వంటి నీటిలో కరిగే ఎరువులను 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయవచ్చు. లేదా మార్కెట్లో లభ్యమయ్యే నానో యూరియా, నానో డీఏపీ వంటివి కూడా పిచికారి చేసుకోవచ్చు. ● బెట్ట పరిస్థితుల్లో మొక్కల ఒత్తిడిని కొంతవరకు తగ్గించేందుకు 13:0:45 (పొటాషియం నైట్రేట్) లేదా 19:19:19 వంటి నీటిలో కరిగే ఎరువులను 5 నుండి 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పంట దశ, వాతావరణ పరిస్థితులను బట్టి ఆకులపై పిచికారీ చేయవచ్చు.ఫ పోషక యాజమాన్యంపై కేవీకే శాస్త్రవేత్త సూచనలు -
ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 47, సర్వే, ల్యాండ్స్ 5, ఉపాధి కల్పన 3, గ్రామీణాభివృద్ధి 2, పంచాయతీ 2, మున్సిపాలిటీ 2, ఎంపీడీఓలు 2, బీసీ వెల్ఫేర్ 2, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, సంక్షేమ, ఉద్యానవన, ఎల్డీఎం, చేనేత–జౌళి, మార్కెటింగ్, కో–ఆపరేటివ్, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ పాల్గొన్నారు. హైవేల వెంట భారీ వాహనాలు పార్కింగ్ చేయొద్దు సాక్షి, యాదాద్రి : జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్లో ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రోడ్డుపై ఆక్రమణలు జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రోడ్లు, భవనాల అధికారి సరిత, జిల్లా రవాణా అధికారి నరేష్, హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. -
సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం
భువనగిరిటౌన్ : పదేళ్లుగా నిలిచిపోయిన పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే నిజం చేసి చూపిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పనులను పూర్తి చేయించి మొదటి విడతలో 120 మందిరి కేటాయించామన్నారు. భువనగిరి నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే 3,000 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై, 1,650 గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి నియోజకవర్గానికి కొత్తగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించబోతున్నామని పేర్కొన్నారు. 45 రోజుల్లో భువనగిరిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణిరవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన గత ప్రభుత్వంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపికై న 444 మందికి ఒకేసారి ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. డబుల్బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ సభ ముగింపు దశకు వచ్చే సమయంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా ఆందోళనకు దిగారు. సభా ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఫ సింగన్నగూడెంలో120 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం -
సీపీఎస్ రద్దుకు ఉపాధ్యాయుడి దీక్ష
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ నిరసన దీక్ష చేపట్టారు. ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు 40 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవుపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాగవెల్లి ఉపేందర్ ఆగస్టు 23న మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని గౌరీశంకర్ ఆలయం వద్ద గుండు కొట్టించుకొని పాదరక్షలు లేకుండా నల్ల చొకా వేసుకొని ఈ దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా చలనం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు ఉపాధ్యాయుడు ఉపేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల వరకు సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని వారి ఆశలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తన దీక్షతోనైనా ప్రభుత్వ పెద్దల మనస్సు మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గుండుకొట్టించుకొని.. పాదరక్షలు లేకుండా నల్లచొక్కతో విధులకు -
బీఆర్ఎస్ పోరాట ఫలితమే ‘డబుల్’ ఇళ్ల పంపిణీ
భువనగిరి టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలంటూ తమ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గృహప్రవేశాలు సాధ్యమయ్యాయని బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సొంతింటి కల సాకారమైనందుకు కృతజ్ఞతగా లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్ ఆలోచన, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి చొరవతో భువనగిరిలో 444 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హులైన నిరుపేదలను లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేసి పట్టాలు అందజేసినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం చివరకు మొదటి విడత గృహప్రవేశాలు చేయించిందన్నారు. మిగిలిన 10 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, రెండో విడత లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, ఖాజా అజిమోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించాలి
భువనగిరిటౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టుల నిధుల సాధనకు ఈనెల 29న చేపట్టిన చలో హైదరాబాద్ పాదయాత్ర సోమవారం ఇందిపార్కు వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురవుతున్న బీఎన్తిమ్మాపూర్, నాయక్ తండా నిర్వాసితులకు రూ.420 కోట్ల నష్టపరిహారానికి రూ.206 కోట్లు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు కుదించినా నిర్మాణ పనులకు బడ్జెట్ ఇవ్వలేదని, చర్లగూడెం పనులు పదేళ్లుగా సాగుతున్నా అతీగతి లేదని మండిపడ్డారు. రాచకొండ ఎత్తిపోతల పథకానికి వెంటనే డీపీఆర్ ఖరారు చేసి నిధులు మంజూరు చేయాలన్నారు. బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలను త్వరితగతిన పూర్తి చేయాలని, మూసీ ప్రక్షాళన పనులకు డీపీఆర్ ప్రకటించి ఎస్టీపీలు ఏర్పాటు చేసి గోదావరి జలాలను అనుసంధానించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.డీ. జహంగీర్, నాయకులు డీజీ నరసింహారావు, కొండమడుగు నరసింహ, వెంకటరాములు, ఆనగంటి వెంకటేష్, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాస చారి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్ పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఫ ఇందిరాపార్క్ వద్ద ధర్నా -
ఆస్తులపై హక్కులు
సాక్షి, యాదాద్రి: ఏళ్ల తరబడి తమ సొంత ఇళ్లను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు కాక అవస్థలు పడుతున్న వేలాది మంది ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వివాదాస్పద 22 ఏ (నిషేధిత భూముల) జాబితాలోని ఇళ్లు, ఇళ్ల స్థలాలకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సవరణ ప్రక్రియకు తెరతీసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సవరణకు ఉపక్రమించిన ప్రభుత్వం జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 319 రెవెన్యూ గ్రామాలు, 422 గ్రామ పంచాయతీల్లో 22 ఏ నిషేధిత జాబితాను రూపొందించారు. ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలను అడ్డుకునే లక్ష్యంతో రిజిస్ట్రేషన్ చట్టం 1908, సెక్షన్ 22 ఏ కింద అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇనామ్, అటవీ భూములతో పాటు చెరువులు, రోడ్లను ఇందులో చేర్చారు. అయితే, ఈ క్రమంలో 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమి (కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లు, పట్టా భూములు) కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ జాబితాలో చేరాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం సవరణలకు ఉపక్రమించింది. జీఓ నంబర్ 59 తరహాలోనే.. నిషేధిత జాబితాలో ఉండిపోయిన ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రజలకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 59 తరహాలోనే, కొత్తగా మరో జీఓను తీసుకువచ్చి నామమాత్రపు ధరకు భూమిని అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ నిషేధిత భూముల వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా లెక్కలు తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు, వాటి విస్తీర్ణం, బాధిత రైతుల సంఖ్యను బయటకు తీస్తోంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తాము కూడా అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తూ విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు భువనగిరి కలెక్టరేట్లో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది రెండు రోజులుగా సవరణలు చేస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్లను తొలగించారు. అధికారిక పోర్టల్లో కేవలం సర్వే నంబర్, అందులో ఎంత భూమి ఉందన్న వివరాలు మాత్రమే ఉంచుతున్నారు. దీనివల్ల, గతంలో మాదిరిగానే ఇంటి నంబర్ ఆధారంగా సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ప్రజలకు కలగనుంది. ఫ నిషేధిత జాబితా నుంచి కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్ తొలగింపు ఫ ఇకపై కేవలం సర్వేనంబర్, భూమి విస్తీర్ణం వివరాలు మాత్రమే ఫ రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరిలో ప్రయోగాత్మకం -
ఎల్నినో ప్రభావంతో 15 మండలాల్లో కరువు ఛాయలు
మూడు నెలల్లో కురవాల్సిన, కురిసిన వర్షం వివరాలు మిల్లీ మీటర్లలో మండలం కురవాల్సింది కురిసింది లోటు వర్షపాతం తుర్కపల్లి 326.4 232.2 –29 రాజాపేట 341.3 202.5 –41 ఆలేరు 390.8 214.9 –45 మోటకొండూరు 386.6 227.1 –41 యాదగిరిగుట్ట 397.9 264.2 –34 భువనగిరి 431.9 221.8 –49 బి.రామారం 359,7 281.2 –22 బీబీనగర్ 390.3 211.8 –46 పోచంపల్లి 386.4 263.2 –32 చౌటుప్పల్ 311.7 211.7 –32 నారాయణపురం 237.5 198.0 –17 రామన్నపేట 379.8 188.3 –50 వలిగొండ 407.5 292.8 –28 ఆత్మకూర్– ఎం 340.6 285.7 –16 మోత్కూరు 435.0 322.4 –28 అడ్డగూడూరు 429.9 309.3 –28 గుండాల 437.3 246.5 –44 మొత్తం 375.9 245.5 –35 సాక్షి, యాదాద్రి: వరుణుడు ముఖం చాటేశాడు. వానాకాలం సీజన్లో మూడు నెలలు దాటినా చినుకు జాడ కన్పించడంలేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సాధారణం కంటే 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 17 మండలాలకు గాను ఏకంగా 15 మండలాలు కరువు జాబితాలోకి వెళ్లాయి. దీంతో పంటలు ఎదిగే దారిలేక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. సాధారణం కంటే పడిపోయిన వర్షపాతం జూన్, జూలై, ఆగస్టు 31 నాటికి జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయింది. సాధారణంగా ఈ మూడు నెలల్లో కలిపి 375.9 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 245.5 మి.మీ మాత్రమే కురిసింది. ఈ సీజన్ మొత్తంలో జిల్లాలోని 17 మండలాల్లో కేవలం రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయణపూర్లో (–17శాతం), ఆత్మకూర్–ఎంలో 16శాతం లోటువర్షపాతం ఉంది. ఈరెండు మండలాలను సాధారణ వర్షపాతం పరిధిలో చేర్చారు. తీవ్ర లోటు ఉన్న మండలాలు15 జిల్లాలోని 15 మండలాలు తీవ్ర వర్షాభావంతో లోటు జాబి తాలో చేరాయి. రామన్నపేట మండలంలో అత్యధికంగా 50శాతం లోటు నమోదు అంటే (సాధారణం 379.8 మిమీ కి గాను 188.3 మిమీ మాత్రమే), భువనగిరి మండలంలో 49 శాతం లోటు వర్షపాతం (221.8 మిమీ). బీబీనగర్ 46శాతం, ఆలేరు 45శాతం, గుండాల 44శాతం లోటు వర్షపాతం నమో దైంది. అంటే ఆయా మండలాలు కరువు పరిస్థితుల్లోకి వెళ్లాయి. తీవ్రవర్షాభావ లోటు మెట్ట, తరిపంటలపై ప్రభావం పడింది. పంటల సాగు అంచనాలు తలకిందులు జిల్లాలో ఈ సారి పంటల సాగులో వ్యవసాయ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. అన్ని పంటలు కలిపి4,66,604 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా 3,80,145 ఎకరాల్లో సాగు చేశారు. వీటిలో వరి 2,03,744 ఎకరాల్లో సాగు అయ్యింది. వీటిలో మూసీ ఆయకట్టులోనే 96,564 ఎకరాలు కాగా మిగతాదంతా వర్షాలు, భూగర్భ జలాలమీదనే ఆధారపడి సాగు చేశారు. పత్తిసాగు మీద వర్షాకాలం ప్రభావం తీవ్రంగా పడింది. 1,12,079 పత్తిసాగైంది. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా కందుల సాగు 16,375 ఎకరాల్లో సాగు చేశారు. చుక్క నీరు లేక చెరువులు వెలవెల జిల్లాలోని 1,155 నీటి వనరుల్లో మూసీ నది పరివాహక ప్రాంతంలోని 90 చెరువులు మినహా మిగిలినవన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలోని చెరువులన్నీ నిండితే 10 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండేది, కానీ ప్రస్తుతం కేవలం 3 టీఎంసీలు అందుబాటులో ఉంది. అలుగులు పోసిన చెరువులు 12, 75శాతం నుంచి వందశాతం నిండినవి 78, 50శాతం నుంచి 75శాతం నిండినవి 178, 25శాతం నుంచి 50శాతం నిండినవి 217, 25శాతం కంటే తక్కువ నిండినవి 670 చెరువులు ఉన్నాయి.ఫ జిల్లాలో 35శాతం లోటు వర్షపాతమే ఫ ఆశలు వమ్ము చేసిన ఆగస్టు ఫ దిక్కుతోచని స్థితిలో రైతాంగం -
సీనియర్ సిటిజన్లకు అండగా పోలీస్ శాఖ
భువనగిరి: సీనియర్ సిటిజన్లకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల మండల కమిటీల జాబితాను సోమవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగుంట వెంకటేశం, జిల్లా టాస్క్ సభ్యుడు కరిపే నర్సింగ్రావు, నాయకులు సత్యనారాయణరెడ్డి, దశరథ, నర్సింగ్రావు, రవీందర్, లక్ష్మీనారాయణ, రాములు, శ్రీరామ్ సత్తయ్య, రోమన్, రాజిరెడ్డి పాల్గొన్నారు. పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని వినతిచౌటుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకోవాలని కోరుతూ పలువురు సింగిల్విండోల చైర్మన్లు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది క్రితమే పదవీకాలం ముగియగా ప్రభుత్వం రెండు పర్యాయాలు పొడిగించిందన్నారు. అయితే చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నామినేషన్ ప్రక్రియ ద్వారా పాలకవర్గాలను నియమించి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వెంటనే నామినేషన్ పద్ధతిని నిలిపివేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్లు చింతల దామోదర్రెడ్డి, సుర్కంటి వెంకట్రెడ్డి, జి.బాలచందర్, కందాటి భూపాల్రెడ్డి, వి.లక్ష్మీనర్సయ్య, దౌడ యాదిరెడ్డి, డి.రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలియాదగిరిగుట్ట: బయో సైన్స్లో మెళకువలను విద్యార్థులకు అర్థమయ్యే రితీలో బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బయో సైన్స్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బయో సైన్స్ ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శరత్ యామిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి వెల్లంకిలో మద్యం అమ్మకాలు నిషేధం రామన్నపేట: అఖిలపక్షం తీర్మానం మేరకు మంగళవారం నుంచి వెల్లంకి గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధమని, దీనికి అందరూ సహకరించాలని సర్పంచ్ ఇడెం రాధాశ్రీనివాస్ కోరారు. మద్యం అమ్మకాల నిషేధానికి మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం వెల్లంకిలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం నిర్ణయానికి వ్యతిరేకంగా మద్యం అమ్మితే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవనగంటి నాగేష్, బర్ల గణేష్, పాశం సతీష్, నకిరేకంటి నరేందర్, వీఓఏ విజయలక్ష్మి, ఆవనగంటి మల్లేశం, శ్రీనివాస్, మహేష్, తాటిపాముల శ్రీశైలం, నవీన్, చెరుపల్లి శ్రవన్, పాలెం స్వామి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి
మిర్యాలగూడ టౌన్ : వేర్వేరు చోట్ల చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ ఘటనలు మిర్యాలగూడ, నిడమనూరు మండలాల పరిధిలో పరిధిలో చోటుచేసుకున్నారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్కు చెందిన కొమెర సైదమ్మ(39) తన భర్త గణేష్ను మద్యం సేవించవద్దని చెప్పినా వినకపోవడంతో మనస్థాపానికి గురై ఆగస్టు 30న పురుగుల మందు తాగింది. గమనించిన భర్త గణేష్, ఆయన కుమారుడు సాయితేజ ఆటోలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తల్లి పిట్టల జ్యోతి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిడమనూరులో ఒకరు..నిడమనూరు : ఆర్థిక ఇబ్బందులతో వివాహిత తల్లిగారింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల ప్రకారం నిడమనూరు చెందిన గోగుల లింగయ్య కుమార్తె సూజత(37)ను, నార్కట్పల్లి మండల ఎల్లారెడ్డిగూడేనికి చెందిన వరికుప్పల కృష్ణతో 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఇటీవల తల్లిగారింటికి వచ్చిన సూజత ఈనెల 28న పేరుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సూజతకు ఇద్దరు కుతూర్లు ఉండగా ఒకరికి వివాహమైందిది. మృతురాలి తండ్రి గోగుల లింగయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
సాగునీటికి మరో ఉద్యమం
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని సాగు భూములకు సాగునీటి విడుదల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా వెలుగొందిందని, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన మిర్యాలగూడ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రా ప్రాంతం వారు నీటిని తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఆయకట్టు రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించిన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దద్దమ్మలుగా మిగిలిపోయారన్నారు. సాగునీటి విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎడమకాల్వకు నీటి విడుదల చేసేది లేదని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతు మహా ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని, అయినా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లిస్తే రైతులు ఆనందంగా పండించుకున్నారని, అలాంటి ఇప్పుడు ఈ ప్రాంత రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ గేట్లను బద్దలు కొటైనా నీటిని తీసుకుంటామన్నారు. కృష్ణా జలాల హక్కుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నికర జలాలను వాడుకొని 17 పర్యాయాలు రైతుల శ్రేయస్సు కోసం నీటిని విడుదల చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, నోముల భగత్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్, దుర్గంపూడి నారాయణరెడ్డి, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, కడారి అంజయ్య, ఎండి.యూసుఫ్, నిమ్మల నవీన్రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, ఫహీమొద్దిన్, ఇలియాస్,మట్టపల్లి సైదులుయాదవ్, నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, హాతీరాంనాయక్, ఎండి.షోయబ్, మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. ఫ సాగర్ నీటి విడుదల కోసం పోరాటం చేస్తాం ఫ ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’.. ఇప్పుడు ఎడారిగా మారింది ఫ నల్లగొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు ఫ సాగునీరు తరలించుకుపోతున్నా పట్టించుకోవట్లేదు ఫ రైతు మహాధర్నాలో కేటీఆర్ -
ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన వెంకట్రెడ్డి
పెద్దవూర: మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తూడి వెంకట్రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందుతూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకట్రెడ్డి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రీసోర్స్ పర్సన్గా, పాఠ్య పుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వినూత్న బోధన నైపుణ్యాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పొందిన అవార్డుల ఆధారంగా తూడి వెంకట్రెడ్డిని ఏప్రిల్ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్ దేశ పర్యటనకు ఎంపిక చేశారు. ఆలేరురూరల్ : వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ విద్యార్థులు ఆంగ్లభాషలో మంచి నైపుణ్య సాధించేలా కృషిచేసిన ఆలేరు మండలం గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ జ్యోతిర్మయి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉద్యాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. విద్యార్థులకు ఫోనెటిక్స్, అక్షరాలు సౌండ్స్తో బోధన, టీఎల్ఎం, ఎచ్టీఎంఎల్ పద్ధతి, ప్లైబేసిడ్, పేంటింగ్ ద్వారా బోధన, సొంతంగా రాయడం, చదవడం ఆటాపాటలతో విద్యాబోధన అందించారు. 2001 సంవత్సరంలో రాజాపేట మండలం రేణుకుంట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయులిగా చేరిన ఆమె అక్కడే 10 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం చిన్నకందుకూరు, పటేల్గూడెం నుంచి గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో 2014 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. తనకు వచ్చే జీతంలో ప్రతినెలా విద్యార్థుల అవసరాలకు, విద్యాబోధనలకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. పని చేసిన ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన అందించారు. క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుండడం వల్లే తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వరించిందని జ్యోతిర్మయి పేర్కొన్నారు. -
నడకదారి మూసివేతపై ఆందోళన
చౌటుప్పల్ : చౌటుప్పల్లో అండర్పాస్ నిర్మాణంలో భాగంగా నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రారంభ పాయింట్ నుంచి వలిగొండ రోడ్డు వరకు పనులు సాగుతున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్టాండ్, చిన్నకొండూర్ రోడ్డు, తంగడపల్లి రోడ్డు వద్ద జంక్షన్లను మూసివేశారు. ఆ ప్రాంతాల మీదుగా వాహనాలు వెళ్లకుండా సిమెంట్ దిమ్మెలు అడ్డుగా పెట్టారు. ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద జనం కాలినడకన రాకపోకలు సాగించేందుకు చిన్నపాటి దారి కేటాయించారు. గురువారం సాయంత్రం కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులు అకస్మాత్తుగా ఆ దారిని మూసివేశారు. ప్రజలు నడిచి వెళ్లకుండా అడ్డంగా గొయ్యి తవ్వించారు. తూర్పున వలిగొండ క్రాస్రోడ్డు, పడమర లక్కారం పీయూపీ వద్ద నుంచి రాకపోకలు సాగించాలంటూ కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కొంత మంది మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వాటిని దాటేందుకు యత్నించగా కిందపడిపోయారు. బీజేపీ నాయకుల రాస్తారోకో బస్టాండ్ వద్ద తలెత్తిన సమస్య బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి ఆలె చిరంజీవితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపై కాంట్రాక్టు సంస్థ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులతో కలిసి సర్వీస్ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ మన్మథ కుమార్ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
విశిష్ట సేవలందిస్తున్న బత్తిని నాగరాజు
రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న బత్తిని నాగరాజు లైఫ్ సైన్సెస్లో ఆలిండియా 162వ ర్యాంక్ సాధించిన ఆయన, డిసెంబర్ 2011లో ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ విభాగంలో పీహెచ్డీ పరిశోధన చేస్తున్నారు. ఆయన రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేయడమే కాకుండా, డిగ్రీ స్థాయి మైక్రోబయాలజీకి సంబంధించి 6 పాఠ్యపుస్తకాలను రచించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధనా పత్రాలను ప్రచురించడమే కాకుండా 5 జాతీయ సదస్సులలో సెషన్ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం కళాశాలలో అకడమిక్ కోఆర్డినేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అకడమిక్ కౌన్సిల్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బత్తిని నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజీ -
ఆర్గానిక్ కృష్ణ మందిరం
తాళ్లవెల్లెంలలో ఆకట్టుకుంటున్న పరమాత్మ సన్నిధి చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిలారావాలు.. నగర జీవితంలోని ఉరుకులు పరుగులకు పూర్తిగా భిన్నమైన వాతావరణం. కొద్దిదూరం నడవగానే ప్రకృతి ఒడిలో ఓ చిన్న గోపురం.. లోపలికి వెళ్తే వేణుగోపాలుడి రూపంలో దర్శనమిచ్చే శ్రీకృష్ణుడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామంలోని ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రత్యేకత ఇది. ప్రకృతితో మమేకమై పరమాత్మను స్మరించేలా తీర్చిదిద్దిన ఈ మందిరం వద్ద, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు నచ్చినన్ని రోజులు ఉండే వెసులుబాటు ఉంటుంది. చిట్యాల : తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన పానుగుళ్ల యాదయ్య–జయమ్మ దంపతుల ఏకై క కుమారుడు వెంకటేశ్వర్లుది వ్యవసాయ ఆధారిత కుటుంబం. స్వయంకృషితో ఐఐటీ గువహటిలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన, ఐఐటీ హైదరాబాద్లో పీహెచ్డీ చేశారు. అనంతరం డీఆర్డీఓ (పుణె)లో, యూఏఈలోని పలు ఇంటర్నేషనల్ విద్యాసంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం నారాయణ కాలేజీలో ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. చదువుకునే రోజుల్లోనే శ్రీకృష్ణుడిపై భక్తిభావం పెరగడంతో ద్వారక, ఉడిపి, పూరీ, మధుర, బృందావన్ లాంటి ఆలయాలను దర్శించారు. భక్తికి వైభవం, ఆర్భాటం కంటే భావం ముఖ్యమనే ఉద్దేశంతో.. ఐఐటీ స్నేహితులు, దాతల సహకారంతో తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పన్నెండేళ్ల క్రితం ఆర్గానిక్ కృష్ణ మందిరాన్ని నిర్మించారు. భక్తులే అర్చకులు.. ఈ మందిరంలో నల్లరాయితో చెక్కిన ముగ్ధ మనోహరమైన కృష్ణుడి విగ్రహంతో పాటు వినాయకుడు, హనుమంతుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, నంది, సరస్వతీదేవి, నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతి నెలా ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణాష్టమి, హోలీ, కార్తికమాసం, ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రణవానంద స్వామి లాంటి ప్రముఖులు ఇక్కడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మందిరంలో ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ అర్చకులు ఎవరూ ఉండరు. భక్తులే స్వయంగా స్వామిని దర్శించుకుని పూజించుకోవచ్చు. దేవుడికి, భక్తుడికి మధ్య ఎవరూ అవసరం లేదని, హృదయంలోంచి వచ్చే ప్రార్థనే అసలైన పూజ అని చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మందిరంలో బస చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆరు గదులతో పాటు భోజన ఏర్పాట్లు చేసే సహాయకులు సైతం అందుబాటులో ఉంటారు. ప్రకృతి మధ్యలో కనువిందు చేస్తున్న ఆర్గానిక్ కృష్ణ మందిరంఫ పూజారుల ప్రమేయం లేకుండా పూజలు చేసుకునే అవకాశం ఫ మందిరాన్ని నిర్మించిన ఐఐటీ పూర్వ విద్యార్థి వెంకటేశ్వర్లు ఫ భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం -
పరిశోధనా ప్రావీణ్యుడు మునిస్వామి
రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అర్థశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డి. మునిస్వామి బోధన, పరిశోధనల్లో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్డీ పూర్తిచేసి, యూజీసీ నెట్ సాధించిన మునిస్వామికి బోధనా రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్స్లో 30కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు, భారత ప్రభుత్వం నుంచి సుమారు 10 పేటెంట్లను పొందడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం. యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఉచితంగా కోచింగ్ అందించారు. కళాశాలలో అకడమిక్ కోఆర్డినేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పరిశోధనా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ మునిస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజీ -
విస్తృత పరిశోధనలకు చిరునామా
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ అమృత వసంత సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో ఆలిండిడియా 297వ ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హరి పద్మశ్రీ మార్గదర్శకత్వంలో నానో కాంపోజిట్ అంశంపై విస్తృత పరిశోధనలు చేసి 2024లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆమె పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పలు జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. తన పరిశోధనలకు గుర్తింపుగా రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేశారు. డిగ్రీ విద్యార్థుల కోసం 5 పాఠ్య పుస్తకాలను, పోటీ పరీక్షల నిమిత్తం మరొక పుస్తకాన్ని ఆమె రచించారు. జనవరి 2026లో నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో అంతర్జాతీయ సెమినార్లను ఆమె విజయవంతంగా నిర్వహించారు. అలాగే పలు అంతర్జాతీయ, జాతీయ సెమినార్లలో చైర్పర్సన్గా వ్యవహరిస్తూ పరిశోధనా పత్రాలను సమర్పించారు. అమృత వసంత, ప్రభుత్వ మహిళా ఉమెన్స్ కళాశాల, నల్లగొండ -
ఉత్తమ జాబితాపై ఉత్కంఠ
సాక్షి, యాదాద్రి : సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను సముచితంగా గౌరవించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అవార్డుల ప్రదానోత్సవం చేపట్టింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఉత్తముల జాబితా ఇప్పటికే కలెక్టర్కు చేరింది. ఆయన సంతకం కాగానే అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. విశేష సేవలు అందించిన బోధకులను గుర్తించి సత్కరించే ఈ ప్రక్రియలో పారదర్శకంగా నిబంధనలు పాటించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎంపికలో ఆరోపణలు.. మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఎంఈఓల ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను డీఈఓ కార్యాలయానికి పంపించింది. వీటిలో నుంచి జిల్లా స్థాయి కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. అయితే, ఈ ఎంపికల్లో లోపాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో కనీస సమన్వయ సమావేశం నిర్వహించకుండానే పేర్లను ఖరారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఈ అవార్డుల ఎంపికపై పలు వివాదాలు చెలరేగాయి. గతేడాది ప్రకటించిన తొలి జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో చాలామంది పేర్లను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఒత్తిళ్ల కారణంగా చివరి నిమిషంలో మరో 15 నుంచి 20 మంది పేర్లను జాబితాలో చేర్చడం వంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కలెక్టర్ ఆమోదమే తరువాయి.. జిల్లా ఎంపిక కమిటీ రూపొందించిన ఉపాధ్యాయుల ప్రతిపాదనలను కలెక్టర్ ముందుంచారు. ఆ యన జాబితాను సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలుపుతారు. బడ్జెట్ పరిమితులు, నిబంధనల దృష్ట్యా ప్రతి కేటగిరీలో (స్కూల్ అసిస్టెంట్, పండితులు, హెడ్ మాస్టర్లు, ఎస్జీటీలు, పీఈటీలు) నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే అవార్డులను ఖరారు చేస్తారు. అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు అవార్డు గ్రహీతల వివరాలను గోప్యంగా ఉంచుతారు. వేడుకలకు అరకొర నిధులు టీచర్స్ డే సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే, మండలాల వారీగా వేడుకలకు రూ.5 వేలు, జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి కేవలం రూ.15 వేలు మాత్రమే మంజూరు చేయడం గమనార్హం. ఫ తుది దశకు చేరిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ఫ కలెక్టర్ ఆమోదం కోసం వేచిచూస్తున్న విద్యాశాఖ ఫ ఎంపికలో ఏఐ, డిజిటల్ బోధన, వందశాతం ఉత్తీర్ణతకు ప్రాధాన్యం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం పలు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పదో తరగతి, వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత, 9+ జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య, ‘బడిబాట’ ద్వారా విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడం లాంటివి పరిశీలిస్తున్నారు. అలాగే బోధనలో ఏఐ, డిజిటల్ విద్యా విధానాల వినియోగం, సరళమైన బోధనా సామగ్రి, రూపకల్పన, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి దాతల సాయం తీసుకురావడం, సైన్స్ఫేర్లు, కిచెన్ గార్డెన్ పెంపకం, క్రీడల్లో ప్రోత్సాహం వంటి అంశాలకు మార్కులు కేటాయిస్తున్నారు. -
డిజిటల్ కంటెంట్ తయారీలో దిట్ట
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ బాలుర జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జి. వేణుగోపాలరావు డిజిటల్ కంటెంట్ అందించడంలో దిట్ట. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి డిజిటల్ కంటెంట్ తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలకు అందించారు. దూరదర్శన్లోనూ డిజిటల్ కంటెంట్ అందించారు. ఏఐ ఛాన్సల్కు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. జి. వేణుగోపాలరావు, ఫిజిక్స్ లెక్చరర్, కేపీఎం ప్రభుత్వ కళాశాల నల్లగొండ -
వినూత్న రీతిలో విద్యాబోధన
వలిగొండ : వలిగొండ మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పరుశురాములు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డు ఎంపికయ్యారు. ఈయన మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో జన్మించారు. ఈయన ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీతో పాటు పీహెచ్డీ పూర్తి చేశారు. సుమారు 14 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో తనదైన రీతిలో విద్యాబోధన చేస్తూ వస్తున్నారు. ఆయన సేవలకు ఉత్తమ అధ్యాపకుడి అవార్డు వరించింది. పరశురాములు, సివిక్స్ లెక్చరర్, ప్రభుత్వ కళాశాల వలిగొండ -
42 ఏళ్లుగా అంకితభావంతో..
నకిరేకల్ : నలభై రెండేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపునకు ఎంతగానో శ్రమించిన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కుల్లో బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ముస్కు కవిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. కవిత 1985లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించి శాలిగౌరారం మండలం రామగిరి ప్రాథమిక పాఠశాలలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ మండలం నడిగూడెం, చందుపట్ల పాఠశాలల్లో పనిచేశారు. 2005 స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి రావడంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి జెడ్పీ హైస్కూల్కు బదిలీ అయ్యారు. 2009లో అక్కడ నుంచి నకిరేకల్ జెడ్పీ హైస్కూల్కు బదిలీపై వచ్చారు. 2018లో స్వగ్రామైన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కూల్లో చేరారు. మరో రెండు నెలల్లో పదవి విరమణ పొందనున్న సమయంలో తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
రూ.114కోట్లతో రోడ్ల అభివృద్ధి
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గంలో రూ.114కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. ఈ రోడ్ల అభివృద్ధితో మునుగోడు నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతుందన్నారు. గురువారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆర్అండ్బీ నిధులతో డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సర్వేల్ గ్రామంలో మూడు ప్రధాన రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. పొర్లగడ్డ తండా నుంచి పీసీ తండా క్రాస్ రోడ్డు వరకు, పొర్లగడ్డ తండా నుంచి గరికగడ్డ తండా వరకు, కేలోతు తండా నుంచి బండలేమునూరు (రంగారెడ్డి జిల్లా)వరకు చేపట్టనున్న రోడ్డు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిమల్కాపూర్ నుంచి చల్మెడ వరకు సర్వేల్ మీదుగా డబుల్ రోడ్డు, నారాయణపురం నుంచి సర్వేల్ వరకు, సర్వేల్ నుంచి పలివెల వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా.. పొర్లగడ్డతండాలో ప్రొటోకాల్ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, రెడ్యానాయక్, ఎనుముల శంకర్రెడ్డి, జక్కలి ఐలయ్యయాదవ్, కుక్కల నర్సింహ, చిలకరాజు చందన, రాజు, ఉప్పల లింగస్వామి, లోడే రఘు, గుత్త ఉమాదేవి, మన్నే శ్రీనివాస్రెడ్డి, కరెంటోతు భిక్షపతి నాయక్, గడ్డం యాదగిరి, రవి, రాహుల్ తదితరులున్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
దేవుడికి మనసును అర్పించడమే భక్తి..
భక్తి అంటే పూజలు చేయడం, కానుకలు ఇవ్వడం కాదు.. దేవుడి ముందు మనసును ఉంచి ప్రశాంత పరుచుకోవడమే. ఈ ఉద్దేశంతోనే ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రకృతి ఒడిలో ఉండేలా తీర్చిదిద్దాం. శ్రీకృష్ణ భక్తిని పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం, సనాతన ధర్మ విలువలను భవిష్యత్తు తరాలకు అందించడమే నా జీవిత లక్ష్యం. ఈ సంకల్పంతోనే మందిరాన్ని ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. – పానుగుళ్ల వెంకటేశ్వర్లు, ఆర్గానిక్ కృష్ణ మందిరం వ్యవస్థాపకుడు -
గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే కిడ్నీ మాయం !
ఆలేరు రూరల్ : గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన మహిళకు గర్భసంచితో పాటు కిడ్నీని కూడా తొలగించారు వైద్యులు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కమలమ్మ 45 రోజుల క్రితం గర్భసంచి సమస్యతో ఆలేరు పట్టణంలోని అర్పిత నర్సింగ్ హోమ్లో చేరింది. గర్భసంచిలో కణితి ఉందని, వెంటనే తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. మూడు రోజుల క్రితం రెగ్యులర్ చెకప్ కోసం తిరిగి ఆ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్ కొన్ని పరీక్షలు, స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. దీంతో జనగామలోని ప్రైవేట్ ల్యాబ్లో కమలమ్మ పరీక్షలు చేయించుకోగా, శరీరంలో కుడి వైపు కిడ్నీ లేదని తేలింది. దీంతో షాక్కు గురైన కుటుంబ సభ్యులు అర్పిత నర్సింగ్ హోమ్కు వచ్చి డాక్టర్ను నిలదీశారు. ఆపరేషన్కు ముందు రెండు కిడ్నీలు ఉన్నట్లు స్కానింగ్ నివేదికల్లో స్పష్టంగా ఉందని, తమకు చెప్పకుండా కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీకి కొవ్వు పేరుకుపోయిందని, దానిని కొవ్వు గడ్డ అనుకుని పొరపాటున తొలగించామని డాక్టర్ తెలిపినట్లు బాధితులు వాపోయారు. కిడ్నీని బయట విక్రయించాలనే దుద్దేశంతోనే ఆస్పత్రి వర్గాలు ఇలా కిడ్నీని మాయం చేశాయని కమలమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురువారం ఆస్పత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు ఆస్పత్రి డాక్టర్కు ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. బాధితురాలి వైద్య రికార్డులను పరిశీలించి, అర్పిత నర్సింగ్ హోమ్పై జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఫ ఆస్పత్రి ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళన -
ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు
● ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్ : ఫార్మసీ రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఎంజీయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ కోర్సులో చేరిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విషయ పరిజ్ఞానం, ప్రాయోగిక, వృత్తి నైపుణ్యం, పరిశోధనా దృక్పథం పెంపొందించుకున్న విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 34 మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ కోర్సులో చేరడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ విభాగాధిపతి జ్యోతి, ఆర్ఎస్.అన్నపూర్ణ, వై.ప్రశాంతి, డి.రమేష్, కళ్యాణి, అమరేందర్, జి.ఉపేందర్, హైమావతి, మద్దిలేటి, శంకరాచారి, శ్రీధర్రావు, తిరుపతి పాల్గొన్నారు. క్రీడా పోటీల క్యాలెండర్ ఆవిష్కరణనల్లగొండ టూటౌన్: నల్లగొండలోని ఎంజీయూలో గురువారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంతర్ కళాశాల క్రీడా పోటీల క్యాలెండర్ను వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల క్యాలెండర్ విడుదల చేయడం విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఒక ముందడుగు అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ పసుపుల మద్దిలేటి, యూనిర్సిటీ సిబ్బంది ఆకుల రవి, శివరాం, శ్రీదేవి, ప్రశాంతిరెడ్డి, ఆర్. మురళి, వై. శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపికరామన్నపేట : పాండిచ్చేరిలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న 37వ సౌత్జోన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థిని తోటకూరి శివాని ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాహత్ఖానం తెలిపారు. ఆగస్టు 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో శివాని 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. శివానిని గురువారం ప్రిన్సిపాల్, పీడీ ఎం. రవీందర్రావు అభినందించారు. మహిళ ఆత్మహత్యచిలుకూరు : ఇంట్లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన మంద భాగ్యలక్ష్మి(35)కి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి భర్త, ఇద్దరు పిల్లు ఒక గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన భాగ్యలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మోహన్బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అప్పల రంగయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నోటీసుల జారీ పకడ్బందీగా నిర్వహించాలి
భువనగిరి: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేసిన నోటీసుల విచారణను పకడ్బందీగా నిర్వహించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలకురాలు విజయేంద్రా అన్నారు. గురువారం భువనగిరి మండలం, అనంతారం గ్రామంలో చేపట్టిన సర్ నోటీసుల జారీ విచారణ ప్రక్రియను పరిశీలించారు. అంతకు ముందు గ్రామంలో 11, 12పోలీంగ్ కేంద్రాలను సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, ఏరోప్లేన్ ప్రణయ్కుమార్ తదితరులున్నారు. 10న చలో హైదరాబాద్ భువనగిరిటౌన్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్– ఉద్యోగుల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట సభ వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు చికూరి జగన్మోహన్ ప్రసాద్, డీఏఓ రమణారెడ్డి, టీజీఓ కార్యదర్శి సీహెచ్ శ్రీనివాస్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు కృష్ణ, డీఎంహెచ్ఓ మనోహర్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖాదిర్, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతతభువనగిరి: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కలుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు అన్నారు. భారత ప్రభుత్వం నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2026–27కు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. -
ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ జూని యర్ లెక్చరర్ బానోతు వాసు 2005లో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికై కొన్నాళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2012లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. పలుచోట్ల పనిచేసిన ఈయన 2024లో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు. బోధనతో పాటు విద్యార్థుల సంక్షేమం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. మలబార్ గోల్డ్ సంస్థ, సీఎస్ఆర్ నిధుల ద్వారా కళాశాల విద్యార్థులకు రూ.20 లక్షలకు పైగా ప్రయోజనం చేకూరేలా సంబంధిత సంస్థలతో సమన్వయం చేశారు. బానోతు వాసు, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్, సూర్యాపేట -
విద్యాభివృద్ధిలో కీలకపాత్ర
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వై. ప్రశాంతి యూనివర్సిటీలో వివిధ రకాల ప్రాజెక్టులు రూపొందించి విద్యార్థుల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు, పబ్లికేషన్స్, సోషల్ సర్వీస్ చేయడం ద్వారా ఆమెకు ఉత్తమ అవార్డు రావడానికి దోహదపడ్డాయి. యూనివర్సిటీలో ఉద్యోగాల కల్పన కోసం కూడా ఆమె వివిధ కంపెనీలతో మాట్లాడి చొరవ తీసుకోవడంతో ఎంతోమంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. వై. ప్రశాంతి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంజీయూ -
మద్యం మత్తులో ఉరేసుకుని బలవన్మరణం
సూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో గురువారం జరిగింది. సూర్యాపేట రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపేట గ్రామానికి చెందిన బానోత్ తావూర్య(44) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు వారం రోజులుగా భార్య, కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నాడు. గురువారం ఉదయం ఊరి బయట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి అతడు కాలువ పక్కన వేప చెట్టుకు లుంగీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి భార్య సైదమ్మ, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మద్యం మత్తులోనే తావూర్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిచౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. గురువారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లక్ష్మిదుర్గ హోటల్ సమీపంలో ఆగస్టు 31న గుర్తుతెలియని వ్యక్తిని(45–55 ఏళ్లు) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్సనిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో లేదా 87126 62744 నంబర్కు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. భక్తుల కార్లే టార్గెట్.. ఫ 11 ఏళ్ల బాలుడు అరెస్ట్ యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కార్లను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యాదగిరి కొండపైన కారు అద్దాలు పగులగొట్టి సెల్ఫోన్లు, అన్నప్రాసన చేసే వెండి ప్లేట్ చోరీ చేశారు. అలాగే బుధవారం యాదగిరి కొండ కింద వాహనాల పూజలు చేసే ప్రాంతంలో పార్కింగ్ చేసిన కారు అద్దం పగులగొట్టి అర్ధ తులం బంగారం, రూ.6 వేలు అపహరించారు. ఈ ఘటనలపై అనుమానంతో 11 ఏళ్ల బాలుడిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కొండపైన సీసీ కెమెరాలతో పాటు కొండ కింద అనుమానాస్పదంగా కనిపించిన ఆ బాలుడిని విచారించగా.. గులేర్ సహాయంతో కారు అద్దాలు పగులగొట్టి, అందులోని విలువైన వస్తువులు, నగదు తానే అపహరించినట్లు ఒప్పుకున్నట్లు సీఐ వెల్లడించారు. గతంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ కార్యాలయం కిటికీ నుంచి దూకి కూడా ఆ బాలుడు నగదు అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ బాలుడి తండ్రి శ్మశానవాటికలో ఉంటాడని, బాలుడు సైతం రోడ్లపైనే తిరుగుతూ ఇలాంటి చోరీలకు అలవాటు పడినట్లు తెలిపారు. బాలుడిని భువనగిరిలోని చైల్డ్ కేర్ హోమ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
30 ఏళ్ల అనుభవజ్ఞుడు
నాంపల్లి : నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న గంధం మోహన్వు 1991 ప్రత్యేక డీఎస్సీలో ఉద్యోగం సాధించి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగంలో చేరారు. పదేళ్లలోనే జూనియర్ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడిగా ప్రమోషన్ పొందారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడి చేరి 2001 నుంచి 2006 వరకు పనిచేశారు. అనంతరం హుజూర్నగర్, నేరేడుచర్లలో 2021 వరకు కామర్స్ అధ్యాపకులుగా పనిచేశారు. 30 సంవత్సరాల అనుభవంతో 2021లో ప్రిన్సిపాల్గా ప్రమోషన్ పొంది నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మోహన్రావు సొంతూరు మిర్యాలగూడ. – గంధం మోహన్రావు, ప్రిన్సిపాల్, నాంపల్లి జూనియర్ కళాశాల -
‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : ఉద్యోగుల హక్కుల సాధనం కోసం ఈ నెల 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి తదితరులు పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో చలో హైదరాబాద్ కార్యక్రమంపై సూర్యాపేట, నల్లగొండ జిల్లాల టీజేఏసీ ప్రతినిధులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలలో అందరూ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా హక్కులను సాధించుకుందామన్నారు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరినీ తీసుకురావాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ స్కీంను సమదర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి, కన్వీనర్ యాదగిరి, నాయకులు జే. శేఖర్రెడ్డి, చేపూరి నర్సింహాచారి, లక్ష్మయ్య, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఫ టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ -
ఎన్రోల్మెంట్లో అగ్రస్థానంలో నిలిపి..
కోదాడ : మూడేళ్లుగా వందల సంఖ్య విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచుతూ వినూత్న కార్యక్రమాల ద్వారా కోదాడ ప్రభుత్వ బాలుర పాఠశాలను అగ్రస్థానంలో నిలిపిన ప్రధానోపాధ్యాయుడు, కోదాడ మండల ఇన్చార్జి ఎంఈఓ సలీంషరీఫ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి అవార్డు వరించింది. 1996 డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన సలీంషరీఫ్ 1998లో మేళ్లచెరువు మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు. 2014–2024 వరకు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు ఇన్చార్జి ఎంఈఓగా పనిచేశారు. 2023 నుంచి కోదాడ బాలుర పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గడిచిన మూడేళ్లుగా 500 దాటించి స్కూల్ను టెన్త్ ఉత్తీర్ణతలోనూ అగ్రస్థానంలో నిలిపారు. అధ్యాపకులకు అవార్డులు -
దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలి
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నల్లగొండ టౌన్ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో భాగంగా బీసీ కులగణన కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన గణనలో బీసీ కుల గణన కూడా చేపడతామని ప్రధాని మోదీ క్యాబినేట్ సమావేశంలో ప్రకటించారని, కానీ ఇప్పుడు బీసీ కుల గణన నిర్వహించడం లేదన్నారు. బీసీలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జనాభా గణనలో స్పష్టంగా కులం, మతం కాలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జన గణన ప్రశ్నావళిలో బీసీ కులం కాలమ్ ఏర్పాటు చేసిన తర్వాతే జన గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓబీసీ కాలమ్ పెట్టాలని కేంద్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు. బీసీలకు జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఏకమై త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమించి బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఈ నెల 20న హైదరాబాద్లో జరిగే బీసీల జాతీయ సదస్సులో తమ కార్యచరణను ప్రకటిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నాయకులు కంది సూర్యనారాయణ, జాజుల లింగంగౌడ్, నకిరేకంటి కాశయ్యగౌడ్, కేశబోయిన శంకర్ముదిరాజ్, నల్ల మధు తదితరులు పాల్గొన్నారు. -
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రాజీనామా చేస్తారా? అధిష్టానం ఆమెను భర్తరఫ్ చేస్తుందా? అనే ఎపిసోడ్పై స్పందించారాయన. ఇందులో తమ నిర్ణయమంటూ ఏదీ ఉండదని.. ఈ అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గమే చూసుకుంటుందని చెప్పారాయన.సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని మీడియాతో దాటవేత ధోరణిలో మాట్లాడారు. అయితే చివరకు కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందించిన రాజగోపాల్రెడ్డి.. ఈ అంశాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం చూసుకుంటుందని తెలిపారు. దీనిపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని, పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.‘‘కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదన వినిపించారు. ఈ ఇష్యూపై అధిష్టానం వద్ద పూర్తి సమాచారం ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. అందరం కట్టుబడి ఉండాలి. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీపై నమ్మకం ఉంది.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. నేను కాంగ్రెస్ కార్యకర్తల గురించే ఆలోచిస్తా’’ఆ నిర్ణయమే ఫైనల్కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ తరఫున తామంతా దానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాలని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా గత కొంతకాలంగా సీఎం రేవంత్రెడ్డి తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తానే పదేళ్లు సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్రెడ్డి గతంలో ఖండించారు. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానం, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. నిన్న సైతం ‘‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెల్లగొడతారా?’’ అంటూ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు.ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోనూ.. కొండా సురేఖ రేవంత్.. రేవంత్ కుటుంబం, అలాగే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె.. తన కూతురు వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, అయితే అధిష్టానం చెప్పకుండా తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు’ అంటూ రాజగోపాల్రెడ్డి కాస్త స్వరం తగ్గించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: రాజీనామా చేయమని ఖర్గేనే చెప్పారా? -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కేయూ క్యాంపస్ : స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు తీసుకెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన గుగులోత్ భరత్(21) కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ మూడో సంవత్సరం చదువుతూ అక్కడే కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. భరత్కు హనుమకొండ బస్టాండ్ సమీపంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులతో పరిచయం ఉంది. వారు అర్జెంట్గా రక్తం కావాలని భరత్కు ఫోన్ చేశారు. దీంతో భరత్ తన సేహితుడు సాయినికేతన్తో రక్తదానం చేయించేందుకు అదే కళాశాలకు చెందిన వేరే వ్యక్తి బైక్పై మంగళవారం అర్ధరాత్రి బ్లడ్ బ్యాంక్కు వెళ్లారు. సాయినికేతన్ రక్తదానం చేస్తుండగా కొంత సమయం పడుతుందని భావించిన భరత్.. ఆ బైక్ను సదరు వ్యక్తికి ఇచ్చి వస్తానని అంబేడ్కర్ సెంటర్ రోడ్డు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పబ్లిక్గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. బుధవారం ఎంజీఎంలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మి తెలిపారు. భరత్ మృతితో తల్లిదండ్రులకు శోకసముద్రంలో మునిగిపోయారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో ఘటన మృతుడు సూర్యాపేట జిల్లావాసి -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
దేవరకొండ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన దేవరకొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఎండీ బందగీ(41) కొండమల్లేపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్లో ఆర్టిజెన్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా తన విధుల్లో భాగంగా బుధవారం తన ద్విచక్ర వాహనంపై కందుకూరు నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. దేవరకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి సోదరుడు రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కొండముచ్చు దాడి.. భార్యాభర్తలకు గాయాలు ఆత్మకూరు(ఎం) : కొండముచ్చు దాడి చేయడంతో భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లి గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన కళ్లెం వెంకన్న, అతడి భార్య సైదమ్మ బుధవారం ఉదయం బైక్పై గజ్వేల్కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా... ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లి గ్రామ స్టేజీ వద్దకు రాగానే రోడ్డు దాటే క్రమంలో కొండముచ్చు ఒక్కసారిగా బైక్పై దాడి చేసింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో వెంకన్న, సైదమ్మ దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108 అంబులెన్స్లో మోత్కూరుకు తరలించారు. చికిత్స పొందుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి భూదాన్పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన యెల్లంకి గోవిందాచారి, రాజమణి దంపతుల కుమారుడు శివప్రసాద్ (24) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 21న రాత్రి బైక్పై ఇంటికి వస్తుండగా.. పోచంపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో బైక్ హ్యాండిల్ కడుపులో గుచ్చుకుంది. శివప్రసాద్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బ్యాంకు రుణం ఎగవేత.. సమన్లు జారీ భువనగిరిటౌన్ : కెనరా బ్యాంకు, భువనగిరి శాఖలో తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో శ్రీమాత మహిళా పొదుపు సంఘం సభ్యులకు హైదరాబాద్లోని డెట్స్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ–2) సమన్లు జారీ చేసింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.21,21,906 బకాయి పడ్డారు. బ్యాంకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో, ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. ఆగస్టు 20న సంఘం సభ్యులకు సమన్లు జారీ చేసింది. 30 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 21న ప్రతివాదులందరూ హైదరాబాద్లోని డీఆర్టీ రిజిస్ట్రార్ ఎదుట స్వయంగా లేదా న్యాయవాది ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. -
కారు అద్దం పగులగొట్టి బంగారం, నగదు చోరీ
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారు అద్దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. హైదరాబాద్లోని మూసాపేటకు చెందిన కె. అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. అక్కడి తులసీ కాటేజీలో విడిది చేసిన వారు బుధవారం ఉదయం కారులో సత్యనారాయణస్వామి వ్రతం చేయించేందుకు వెళ్లారు. కారును వాహన పూజల సమీపంలో పార్కింగ్ చేశారు. వ్రతం పూర్తయ్యాక తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు కారు సైడ్ అద్దం పగులగొట్టి అందులోని అర తులం బంగారు ఆభరణం, రూ.6,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు అంజయ్య వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీప ప్రాంతాల్లో గాలించగా, అంజయ్య కుటుంబ సభ్యులకు చెందిన ఖాళీ పర్సును చెట్ల పొదల్లో పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు చోరీలు జరగడంతో భక్తుల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. పర్యవేక్షణ లోపమే కారణమా? గతంలో ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుని పార్కింగ్ను పర్యవేక్షించేవారు. కానీ యాదగిరి కొండ దిగువన ఉన్న సెంట్రల్ పార్కింగ్ను ఆరు నెలలుగా దేవస్థానమే స్వయంగా నిర్వహిస్తోంది. అక్కడ ఎలాంటి పర్యవేక్షణ, సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఫ యాదగిరీశుడి సన్నిధిలో మరో ఘటన -
బంతి సాగులో మెళకువలు
ఫ కోదాడ ఉద్యానవనశాఖ అధికారి పూసపాటి అనిత సూచనలు బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయడం మంచిది. పువ్వులు కోసే ముందు నీరు ఇచ్చినట్లయితే పువ్వులు తాజాగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు పూలు కోస్తుంటే దిగుబడి పెరుగుతుంది. కోసిన తరువాత పువ్వులను తడిపిన గోనె లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డతో కప్పి మార్కెట్కు తరలించాలి. సాధారణంగా ఆఫ్రికన్ రకాలు ఎకరానికి 4–5 టన్నుల పూల దిగుబడినిస్తాయి. నడిగూడెం : బంతి పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో సన్న, చిన్నకారు రైతులు బంతి సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో బంతి సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని కోదాడ ఉద్యానవన శాఖ అధికారి పూసపాటి అనిత సూచించారు. రైతులు అనుసరించాల్సిన సాగు విధానం, మెలకువలు ఆమె మాటల్లోనే.. వాతావరణం – నేలలు వాతావరణ పరిస్థితులను బట్టి బంతిని వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. బంతి 14–28 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద బాగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద మొక్క పెరుగుదల తగ్గి, తక్కువ పరిమాణం గల పువ్వులు ఉత్పత్తి అయ్యి దిగుబడి తగ్గుతుంది. నీడ ప్రదేశాలు బంతి సాగుకు అనుకూలం కావు. దీనివల్ల మొక్కలు శాఖీయ దశలోనే ఉండి పూలు సరిగ్గా పూయవు. బంతి సాగుకు గరప నేలలు అత్యంత అనుకూలమైనవి. బరువైన నేలల్లో కూడా మురుగు నీటి వసతి ఉన్నప్పుడు బంతిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక ( ఞఏ) 7.0–7.5 మధ్య గల నేలలు ఎంతో అనుకూలం. రకాలు మన ప్రాంతంలో బంతి సాగు చేసే రైతులు ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి రకాలు, ఫ్రెంచి బంతి రకాలు సాగు చేస్తుంటారు. వాణిజ్య పరంగా ఆఫ్రికన్ బంతి రకాలకు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆఫ్రికన్ బంతి : ఇవి ఏపుగా, ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్కలు. వీటిలో వివిధ రంగులు గల పెద్ద పూల రకాలున్నాయి. పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా, ఈమధ్య విడుదలైన ఆర్కా బంగార (పసుపు) మరియు ఆర్కా అగ్ని (నారింజ) రకాలు మంచి దిగుబడిని ఇస్తున్నాయి. అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. ఈ రకాలలో విత్తనాలు ఉండవు. ఇవి కాక ప్రైవేటు సంస్థలు రూపొందించిన హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రెంచి బంతి : ఈ రకం మొక్కలు పొట్టిగా, దృఢంగా ఉండి సింగిల్ లేదా డబుల్ పూలను కలిగి ఉంటాయి. ఇవి ఆఫ్రికన్ బంతి రకాలకన్నా త్వరగా కోతకు వస్తాయి. నాటే సమయం – దూరం బంతిని అన్ని కాలాల్లో సాగు చేసినప్పటికీ, జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకుంటే అక్టోబర్–ఏప్రిల్ నెలల్లో మార్కెట్కు పువ్వులను సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా పండుగ సీజన్కు పూలు వచ్చేటట్లు నాటుకుంటే రైతులు ఎక్కువ లబ్ది పొందవచ్చు. సాధారణంగా పండుగ రోజుకు 60 రోజులు ముందుగా నాటుకోవాలి. సెప్టెంబర్–అక్టోబర్లో నాటుకున్న పంట నుంచి నాణ్యమైన పువ్వులు, విత్తనాలు పొందవచ్చు. ఆఫ్రికన్ రకాలు వరుసకు వరుసకు 60 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 45 సెం.మీ. దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ఫ్రెంచి రకాలైతే మొక్కకు మొక్కకు మధ్య 25 సెం.మీ., వరుసకు వరుసకు మధ్య 25 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. 3 లేదా 4 ఆకులు కలిగి 25 రోజుల వయస్సున్న దృఢమైన బంతి నారు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. నారు తీయడానికి ఒకరోజు ముందు నారుమడికి నీరు ఇచ్చినట్లయితే మొక్కల వేర్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో ఎకరానికి 8–10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వీటితో పాటు ఎకరానికి 30 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 30 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను అందించాలి. అంటే 66 కిలోల యూరియా, 185 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 50 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి. సిఫారసు చేసిన మోతాదులో సగం నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా నత్రజనిని నాటిన 30–40 రోజుల తరువాత పైపాటుగా అందించాలి. బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడనంత తేమ భూమిలో ఉండాలి. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే పెరుగుదల మరియు పూత దెబ్బతింటాయి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి తడులు ఇవ్వాలి. ఆఫ్రికన్ బంతి రకాలలో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూ మొగ్గ ఏర్పడుతుంది. ఆ తర్వాతే పక్క కొమ్మలు వస్తాయి. అందువల్ల మొక్కలను నాటిన 40 రోజులకే తలలు త్రుంచినట్లయితే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడి, మొక్క మంచి ఆకారాన్ని సంతరించుకుని ఎక్కువ మోతాదులో ఒకే పరిమాణంలో పూలు వస్తాయి. హైబ్రిడ్ రకాలలో మాత్రం 20 రోజులకే తలలు తుంచాలి. -
విద్యార్థుల హక్కులు కాలరాస్తే ఉద్యమం
నల్లగొండ టౌన్ : పాలకులు విద్యార్థుల హక్కులు కాలరాస్తే ఉద్యమాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు విద్యార్థులను ‘పరాన్నజీవులు’ అనడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. శ్రమజీవుల పిల్లలు పరాన్నజీవులుగా మారాలని కోరుకోరని పేర్కొన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడి, ఆటపాటలను త్యాగం చేసి చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆడుకుంటోందని, ప్రభుత్వం సైతం విద్యార్థుల భవిష్యత్ను కార్పొరేట్ వ్యాపారులకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. పోటీ పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీల వల్ల మనోవేదనకు గురై 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, డి.కిరణ్, ఎం.మమత, ఆకారపు నరేష్, కె.శంకర్, మల్లం మహేష్, కుర్ర సైదానాయక్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, ఆదిల్, నవదీప్, జగదీష్, జగన్, వీరన్న, ప్రసన్న, యశ్వంత్ పాల్గొన్నారు. ఫ ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ -
తనిఖీల పేరిట మిల్లర్లను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ : ఆక్షన్ ప్యాడీకి సంబంధించి నల్లగొండ జిల్లాలో డిఫాల్ట్ అయిన ఏడు మిల్లుల నుంచి బకాయిలను వెంటనే వసూలు చేసుకోవాలని, అంతేకానీ క్రమం తప్పకుండా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇచ్చే మిల్లుర్లను తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేయొద్దని జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు అధికారులను కోరారు. బుధవారం నల్లగొండలోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ. 190 కోట్ల బకాయిలు ఏడు మిల్లులవే.. 2014 నుంచి 2022 వరకు జిల్లాలో కేవలం ఆక్షన్ ప్యాడీకి సంబంధించి ఏడు మిల్లులు మాత్రమే డిఫాల్ట్లో పడ్డాయని వారు వివరించారు. జిల్లాలో మొత్తం రూ.600 కోట్లకు గాను ఇప్పటికే మిల్లర్లు రూ.420 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ.190 కోట్లు ఆ ఏడు మిల్లుల నుంచే రావాల్సి ఉందన్నారు. 2023 నుంచి ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని తీసుకుని గడువులోగా తిరిగి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే 2025–26 రబీ సీజన్లో తమ మిల్లుల కెపాసిటీని మించి రెట్టింపు ధాన్యాన్ని అధికారులు బలవంతంగా అప్పగించారని తెలిపారు. ఆ సమయంలో రబీలో రా రైస్ ఇస్తే నూకలు వస్తాయని, బాయిల్డ్ రైస్ ఇస్తామని చెప్పడంతో అధికారులు అంగీకరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎఫ్సీఐ రా రైస్ మాత్రమే కావాలని మెలిక పెట్టగా, తాము ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు విన్నవించిన అనంతరం బాయిల్డ్ రైస్ తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ రా రైస్ ఇవ్వాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా గడువు ఉంది.. తమకు సీఎంఆర్ చెల్లించేందుకు ఇంకా గడువు ఉందని, ఈలోపు లోటున్న బియ్యాన్ని సొంతంగా ధాన్యం కొనుగోలు చేసి అయినా ప్రభుత్వానికి అప్పగిస్తామని, బకాయిల పేరిట డబ్బులు కట్టాలని ఒత్తిడి తేరాదని కోరారు. అధికారులు తనిఖీల పేరిట వేధిస్తే వచ్చే సీజన్ నుంచి ధాన్యం తీసుకోమని, అవసరమైతే మిల్లులను బంద్ చేసుకుంటామని హెచ్చరించారు. ఏళ్ల తరబడి మిల్లర్లకు రావాల్సిన వర్కింగ్ ఛార్జీలతో పాటు రవాణా ఛార్జీలు, డ్యామేజ్, కస్టోడియన్, హమాలీ తదితర బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఇంద్రారెడ్డి, శ్రీను, వీరమల్లు, రమణ, వెంకన్న, విశ్వనాథం, యాదగిరి, శ్రీనివాస్, కేశవరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఫ డిఫాల్ట్ మిల్లులపై చర్యలు తీసుకోండి ఫ సక్రమంగా ఉన్నవారిని వేధించొద్దు ఫ గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇస్తాం ఫ నల్లగొండ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ -
భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల బాహాబాహీ
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ముందుగా బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి క్యాంప్ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్రెడ్డిల ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులపై పెట్రోల్, డీజిల్, ఆయిల్తో పాటు కాషాయ రంగును చల్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేవైఎం దాడికి నిరసనగా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు భువనగిరి పట్టణ పరిధిలోని నల్లగొండ బైపాస్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్–బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో ఇరువర్గాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.రాష్ట్ర బీజేపీకి అండగా ఉంటాం: నితిన్నబీన్ తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబీన్ ఆరా తీశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుకు ఫోన్ చేసిన నబీన్ ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి, నేతలకు జాతీయ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని రాంచందర్రావుకు నితిన్నబీన్ భరోసా ఇచ్చారు. ⇒ ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటీ?’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.⇒ ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన..వెయ్యి మోసాల దగా కోరు పాలన. ఇది ప్రజా పాలన కాదు. చేతల్లో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన’అని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. డీజీపీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీజేఎల్పీ ఉపనేత పాయల్శంకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. యూత్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు బీజేపీ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సంత్ శిరోమణి రవిదాస్ చిత్రపటాల పోస్టర్లపై నల్లరంగు పూసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టాలని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఫిర్యాదు చేశారు.ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు సాక్షి, నెట్వర్క్: బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మంగళవారం ట్యాంక్బండ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్గౌడ్లను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మలక్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావును మంగళవారం పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డిని పరామర్శించేందుకు వెళుతుండగా, రాంచందర్రావును అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ రాంచందర్రావును అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. -
భువనగిరిలో రణరంగం.. బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులు
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయ ఘర్షణలతో యాదాద్రి భువనగిరి జిల్లా అట్టుడికింది. భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఫ్లెక్సీపై నల్లరంగు చల్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపైనా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికా?” అంటూ ప్రశ్నించారు. 60 ఏళ్ల మహిళపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు.భువనగిరి ఘటనకు నిరసనగా చౌటుప్పల్లో బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ సీనియర్ నేత మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు చండూరులో మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే బీజేవైఎం కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఒకే జిల్లాలో వరుసగా దాడులు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇదీ చదవండి: ‘ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ -
జనంపై భారం పడకుండా చూడాలి
రహదారి నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు తలెత్తకుండా నిర్మాణం జరగాలి. 800 మీటర్ల దూరం తిరిగి రాకపోకలు సాగించాలంటే రెండు వైపులా కలుపుకుంటే కిలోమీటరున్నర దూరం అవుతుంది. జనంపై ఎలాంటి భారం పడకుండా ఉండేలా ప్రతి ఐదు వందల మీటర్ల ఒకటి పీయూపీ ఇవ్వాలి. వ్యాపారులు, దుకాణాదారుల పొట్టకొట్టొద్దు. – సుర్కంటి రాజిరెడ్డి, వ్యాపారి, చౌటుప్పల్ రహదారి నిర్మాణం చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు తప్పనిసరిగా స్థానిక ప్రజలు, వ్యాపారుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి. ఎవరికివారు సొంత ప్లాన్ రూపొందించి నిర్మాణం చేయడం మూలంగా జీవితాంతం ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అందరిని దృష్టిలో ఉంచుకొని అండర్పాస్ను నిర్మించాలి. – బొడ్డు అంజిరెడ్డి, చౌటుప్పల్ -
స్కూల్ పరీక్షల మూల్యాంకనంలో కొత్తవిధానం
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్ది మార్కులు వేసేవారు. ఇక నుంచి మూల్యాంకన ప్రక్రియ పదో తరగతి తరహాలోనే కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రాల్లో వాల్యుయేషన్ కేంద్రాలు జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 45,296 మంది విద్యార్థులు చదువుతున్నారు. నూతనంగా అమలులోకి రానున్న ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ విధానంలో భాగంగా సమాధాన పత్రాలు దిద్దేందుకు మండల కేంద్రాల్లో వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రంలో పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులచే కాకుండా ఇతర ఉపాధ్యాయుల చేత కూడా దిద్దించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ–1 (అర్ధవార్షిక) ఎస్ఏ–2 (వార్షిక), పరీక్షలకు పదో తరగతికి ఎస్ఏ–1కు ఇది వర్తించనుంది. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతుల సమాధాన పత్రాలను దిద్దేందుకు ఒక్కో పేపరుకు రూ. 2, 6నుంచి 10వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలు దిద్దేందుకు రూ. 3 చెల్లించనున్నారు. అదేవిధంగా ఒక్కో ఎంఆర్సీకి రూ.10వేల చొప్పున ఇవ్వనున్నారు. ఫ సమాధాన పత్రాలు దిద్దేందుకు మండలాల్లో వాల్యుయేషన్ కేంద్రాల ఏర్పాటు -
అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో, భర్తతో విడిపోయి ఏడాది గడిచిన ఒంటరి మహిళలతో పాటు అవివాహిత మహిళలు (గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్లు పైబడిన వారు) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దివ్యాంగులు సదరం లేదా యూడీఐడీ పత్రం ద్వారా 40 శాతం (వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం) వైకల్యం ఉండాలని, తలసేమియా, సికిల్ సెల్ డిసీస్, హీమోఫీలియా బాధితులు కూడా అర్హులని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన కల్లుగీత, చేనేత కార్మికులు సంబంధిత శాఖల ధవీకరణ పత్రాలతో, గ్రేడ్–2,3, ఫైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు ఫారాలను cheyutha.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నింపిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. సామూహిక గృహప్రవేశాలకు పకడ్బందీ ఏర్పాట్లుభువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో సోమవారం నిర్వహించనున్న సామూహిక గృహప్రవేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహప్రవేశాల సన్నాహక ఏర్పాట్లు, లబ్ధిదారులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. కాలనీలో నిరంతర తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల అమరికతో పాటు పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, గృహనిర్మాణ శాఖ పీడీ (హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్) అలివేలు, మున్సిపల్, గృహనిర్మాణ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యూజీసీ నెట్–జేఆర్ఎఫ్లో మేస్త్రీ కూతురి సత్తాఫ 98.4 పర్సంటైల్ సాధించిన శ్రీవిద్య మోత్కూరు : మోత్కూరుకు చెందిన బోడ శ్రీవిద్య ఇటీవల వెలువడిన యూజీసీ నెట్–జేఆర్ఎఫ్ ఫలితాల్లో 98.4 పర్సంటైల్ సాధించి విశేష ప్రతిభ చాటింది. మోత్కూరుకు చెందిన మేస్త్రి బోడ శ్రీరాములు కుమార్తె అయిన శ్రీవిద్య ఈ ఘనత సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఆమె రాయ్పూర్లోని ఐజీకేవీలో ఎంఎస్సీ పూర్తి చేసింది. సెట్లో 6వ ర్యాంకు సాధించిన ఆమె.. ప్రస్తుతం అదే ఐజీకేవీలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో పీహెచ్డీ చేస్తోంది. 2025లో ఏఎస్ఆర్బీ నెట్, యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించిన శ్రీవిద్య.. తాజాగా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్లో 98.4 పర్సంటైల్ సాధించి సత్తా చాటింది. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా ఎంపికై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని శ్రీవిద్య వెల్లడించింది. ఉపాధ్యాయులు ఆమెకు అభినందనలు తెలిపారు. -
మరో పీయూపీ ఇవ్వాల్సిందే..
ఫ చౌటుప్పల్లో పెడెస్ట్రెయన్ అండర్పాస్ కోసం జనం పోరుబాట ఫ భాస్కర్ టాకీస్ నుంచి వలిగొండ క్రాస్రోడ్డు నడుమ నిర్మించాలని డిమాండ్ ఫ ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న నినాదంతో ఉద్యమం ఫ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసేందుకు సిద్ధమవుతున్న స్థానికులు చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో జరుగుతున్న బ్లాక్స్పాట్ పనులు స్థానిక వ్యాపారులు, నివాసితులకు సమస్యగా మారాయి. నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు అండర్పాస్ పనులు ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. భాస్కర్ టాకీస్ వద్ద ఒక పీయూపీ (పెడెస్ట్రెయన్ అండర్పాస్) మంజూరు చేసినప్పటికీ, అక్కడి నుంచి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు సుమారు 800 మీటర్ల మధ్య దూరం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటి మధ్య మరొక పీయూపీ ని నిర్మించాలనే డిమాండ్తో ప్రజలు పోరుబాట పట్టారు. వలిగొండ క్రాస్ రోడ్డు వరకు దూరం ఉంటున్నందున.. పట్టణంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్స్టేషన్ ఎదుట వీయూపీ (వెహికల్ అండర్పాస్), చిన్నకొండూర్ చౌరస్తా, తంగడపల్లి చౌరస్తాలను కలుపుతూ ఏడు పిల్లర్లతో ఆరు ఓపెన్ వీయూపీలతోపాటు వలిగొండ చౌరస్తాలో మరో వీయూపీ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భాస్కర్ టాకీస్ ముందు స్థానిక జనాలు, చిన్నచిన్న వాహనదారులను దృష్టిలో ఉంచుకొని ఒక పీయూపీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు దూరం ఉంటున్నందున అదనంగా మరో పీయూపీ ఏర్పాటు చేస్తే భవిష్యత్లో సమస్యలు తలెత్తవని ప్రజలు పేర్కొంటున్నారు. భాస్కర్ టాకీస్ నుంచి వలిగొండ క్రాస్రోడ్డు నడుమ మధ్య పాయింట్ చూసుకొని ఎక్కడైనా పీయూపీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈమేరకు ఆయా వర్గాలు కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే పలు శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. పీయూపీ సాధన ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు.తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలు పీయూపీ నిర్మాణం లేకుంటే చాలా రంగాలకు ఇబ్బందిగా మారనుంది. ఈ 800 మీటర్ల మధ్య ప్రాంతంలో ఫైర్ స్టేషన్, కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాల, బస్తీ దవాఖానా, పెట్రోల్బంకు, వందలాది దుకాణాలు, వ్యాపార సంస్థలు, నాలుగు బ్యాంకులు, రెండు పాఠశాలలు, ఈఎస్ఐ ఆస్పత్రి, ఎనిమిది కాలనీలు, ప్రభుత్వ హాస్టల్ భవనం, జూనియర్ సివిల్జడ్జి కోర్టు, ఇండోర్ స్టేడియం, వాహనాల మరమ్మతులు, విక్రయాలకు సంబంధించిన ఆటోనగర్, ఫంక్షన్హాల్, శ్రీనివాస్ టాకీస్, ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాల కాలంపాటు సేవలందించే ఈ రహదారిని ఇప్పుడే ప్రణాళికలతో నిర్మాణం చేయాలని, అందులో బాగంగా అదనంగా మరో పీయూపీ నిర్మించాలని కోరుతున్నారు. -
ప్రశాంతంగా నీట్ పీజీ
ఫ 179 మంది హాజరు నల్లగొండ : నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 180 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 179 మంది హాజరుకాగా ఒకేఒక్క అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సెంటర్ ఇన్చార్జితో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు సూపరింటెండెంట్ రమేష్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, పరీక్షల ఇన్చార్జి, ప్రొఫెసర్ ఉపేందర్ ఉన్నారు. -
డబ్బులిస్తే మీసేవ!
కోర్టు కేసుల కారణంగా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన మీసేవా కేంద్రాల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్ మండలాలకు సంబంధించిన కోర్టు కేసులు ఇటీవల పరిష్కారమయ్యాయి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం త్వరలోనే ఐదు మండలాల్లోని అభ్యర్థులకు ఒకేసారి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాతపరీక్ష పూర్తయింది. దరఖాస్తుదారులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ఐదు మండలాల్లో ఒకేసారి ఇంటర్వ్యూలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఉద్యోగం, ఉపాధి ప్రకటన ఏది వచ్చినా.. కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామంటూ గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వసూళ్లకు తెగబడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలతో పాటు కొత్త మీసేవా కేంద్రాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అదనుగా అక్రమార్కులు నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. 8 మీసేవ కేంద్రాల కేటాయింపు పట్టణాలు, పల్లెల్లో పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లాలోని ఐదు మండలాల్లో 8 నూతన మీసేవా కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. చౌటుప్పల్లో 3, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్ (ఎం)లలో ఒక్కో కేంద్రం చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. రూ.4 లక్షల దాకా డిమాండ్ నూతన మీసేవా కేంద్రాల కేటాయింపును ఆసరాగా చేసుకుని అక్రమార్కులు భారీగా దండుకుంటున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు ప్రాంతాల్లో ఒక్కో పోస్టుకు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికార పార్టీ నేతలమని, ఉన్నతాధికారులతో చెప్పించి మీసేవా కేంద్రం మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతూ ముందస్తుగా అడ్వాన్స్లు కూడా స్వీకరించినట్లు తెలుస్తోంది. ఉపాధి లభిస్తుందన్న ఆశతో బాధితులు అప్పులు చేసి మరీ దళారులకు డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఫ మీసేవ కేంద్రం మంజూరు చేయిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న దళారులు ఫ ఒక్కో కేంద్రానికి రూ.4 లక్షల వరకు డిమాండ్ ఫ అధికార పార్టీ నేతలమంటూ అడ్వాన్స్ స్వీకరణ -
హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఉన్న ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. వివాహాది శుభకార్యాలు, గ్రామదేవతల పండుగలు, వీకెండ్ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. దీనికి తోడు పలుచోట్ల రోడ్డు పనులు జరుగుతుండటంతో హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నెలకొంది. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట, ధర్మోజిగూడెం, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా చోట్ల రోడ్డు ఇరుకుగా మారి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మోజిగూడెం నుంచి విజయవాడ మార్గంలో చౌటుప్పల్ వరకు ఉన్న కేవలం 5 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు వాహనాలకు ఏకంగా అరగంట సమయం పట్టింది. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఉన్న ఎస్ఎంఆర్ ఫంక్షన్హాల్ వరకు వాహనాలు బారులుదీరాయి. ఫ కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు ఫ శుభకార్యాలు, వీకెండ్ తోడవ్వడంతో పోటెత్తిన రద్దీ -
నెరవేరనున్న సొంతింటి కల
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదల సుదీర్ఘకాల సొంతింటి నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సింగన్నగూడెం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు అధికారికంగా అందజేయనున్నారు. మౌలిక వసతుల కల్పనతో మార్గం సుగమం గత ప్రభుత్వ హయాంలో 444 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, కనీస మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థలను పట్టించుకోలేదు. దీంతో పంపిణీ నిలిచిపోయి నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల పనులను పూర్తి చేయించి ఇళ్ల పంపిణీకి మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా సర్వే లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం 360 డిగ్రీల సమగ్ర సర్వేను నిర్వహించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ఈ విచారణ ద్వారా.. గతంలో అక్రమంగా జాబితాలోకి వచ్చిన అనర్హుల పేర్లను తొలగించారు. నిజమైన నిరుపేదలకు ఇళ్లు దక్కేలా అత్యంత పారదర్శకమైన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రెండు విడతల్లో పంపిణీ సముదాయంలోని మొత్తం 444 ఇళ్లలో మొదటి విడత కింద 408 ఇళ్ల తాళాలను సోమవారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. మిగిలిన 36 ఇళ్లను రెండో విడతలో పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏళ్ల తరబడి కాగితాలకే పరి మితమై, నిర్మాణం పూర్తయినా పంపిణీకి నోచుకోని ఇళ్లు ఇప్పుడు లబ్ధిదారుల చేతికి రానుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు పండుగ వాతావరణంలో గృహప్రవేశాలకు సన్నద్ధమవుతున్నారు. ఫ సింగన్నగూడెంలో నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫ పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఫ ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చేతులమీదుగా అందించేందుకు ఏర్పాట్లు -
యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకతో పాటు సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణ కట్ట, పుష్కరిణి, అన్న ప్రసాద కేంద్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. -
జాబ్మేళాలో 15మంది ఎంపిక
భువనగిరి: జాబ్మేళాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి పద్మ కోరారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఉదిత ఓకేషనల్ జూనియర్ కళాశాలలో ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 45 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఎంపికై న 15మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ కంపెనీ, నవత కంపెనీల మేనేజర్లు, జిల్లా ఉపాధికల్పన కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ నవనీత, పావం అలివేలు, చేగూరి రమణవాసు, పి. విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు రూ.171కోట్లు విడుదల
సాక్షి యాదాద్రి: జిల్లాలోని బి.ఎన్. తిమ్మాపురం (బస్వాపురం), గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోయినవారితో పాటు హైలెవల్ కెనాల్ కోసం రూ.171కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో బస్వాపురం, వడపర్తి, బి.ఎన్. తిమ్మాపురం పరిధిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోయిన వారి కోసం రూ. 75 కోట్లు మంజూరు చేసింది గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూ బాధితుల కోసం రూ. 87 కోట్లు విడుదలయ్యాయి (గతంలో పరిహారం కింద రూ. 27 కోట్లు అందించిన విషయం తెలిసిందే). అలాగే భువనగిరి నుంచి బీబీనగర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన హై లెవల్ మెయిన్ కెనాల్ పనుల కోసం రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. క్రీడలతో క్రమశిక్షణభువనగిరి: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి కె. ధనుంజనేయులు అన్నారు. శనివారం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మేజర్ ద్యాన్ చంద్ను నేటితరం యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ తర్వాత క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు షీల్డ్, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది జానకిరాము, మురళి, జయ, రేణుక, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్ : నిజామాబాద్లో సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 1న నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్యా స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2011 నుంచి 31–12–2012 మధ్య జన్మించిన బాలికలు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 82470 45667, 94403 74027 నంబర్లను సంప్రదించాలన్నారు. యాదగిరి కొండపై పనిచేయని లిఫ్టుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో ఉన్న లిఫ్టు పని చేయడం లేదు. వీఐపీలు, బ్రేక్ దర్శనం భక్తులు, వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రొటోకాల్ కార్యాలయం సమీపంలో రెండు లిఫ్టులను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ 10 రోజులుగా ఈ రెండు లిఫ్టుల్లో ఒక లిఫ్టు పని చేయడం లేదు. దీంతో వీఐపీ ప్రొటోకాల్ దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపైకి లిఫ్టులో వెళ్లేందుకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అధికారులు త్వరితగతిన లిఫ్టును బాగు చేయించాలని కోరుతున్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి భువనగిరి: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రైతు బజార్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలంతో చెలగాటం ఆడుతోందన్నారు. ఎన్నికకు ముందు విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్రెడ్డి, ఏలె చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, నాయకులు పట్నం శ్రీనివాస్, యాదిరెడ్డి, నరసయ్య, కృష్ణ, వేముల నరేష్, మల్లారెడ్డి, కోటేష్, రామకృష్ణ, నరసింహారావు, బలరాం, జగన్మోహన్రెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
సర్వేల్ గురుకులంను దత్తత తీసుకుంటా
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాలను దత్తత తీసుకుని, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్రెడ్డి ప్రకటించారు. తాను చదువుకున్న సర్వేల్ గురుకుల పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వచ్చారు. ‘కలిసి ఎదుగుదాం.. కలిసి సాధిద్దాం’ అనే లక్ష్యంతో శనివారం పాఠశాలలో ‘5ఎస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5ఎస్ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ, పరిశుభ్రత, అనవసర వస్తువుల తొలగింపు, పూర్వ విద్యార్థులతో అనుసంధానం, కలిసి ఎదుగుదాం–కలిసి సాధిద్దాం అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన స్పోర్ట్స్ డేలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల 1976 ఎస్ఎస్సీ బ్యాచ్ (శ్రీరంగం) విరాళంగా అందించిన 28 ట్యాబ్లు, రెండు ఇన్వర్టర్లను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా, క్రీడా వాతావరణం కల్పించేందుకు పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఉషారాణి.. మహేందర్రెడ్డికి రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ.శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ గంగారం, డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ పాండు, సర్వేల్ సర్పంచ్ చిలకరాజు చందనరాజులు పాల్గొన్నారు. ఫ మాజీ డీజీపీ మహేందర్రెడ్డి -
అక్టోబర్ నాటికి భూ సర్వే పూర్తి
ఫ డిసెంబర్లో రెండో విడతకు సిద్ధం కావాలి ఫ దసరాలోపు తొలి విడత ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయించాలి ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఫ హాజరైన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సూర్యాపేట : రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన భూముల రీ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేయాలని, డిసెంబర్లో రెండో విడత సర్వే చేపట్టేందుకు సంసిద్ధం కావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. మొదటి విడత 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా నిర్వహించి గ్రామ సరిహద్దులు నిర్ధారించడంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యక్షంగా వీటిని పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను చట్టానికి లోబడి పరిష్కరించాలన్నారు. భూములకు సంబంధించి 45 దరఖాస్తులు తన లాగిన్లోనే ఎక్కువ రోజులు ఉంచుకోవడంపై యాదాద్రి జిల్లా అడ్డగూడూరు తహసీల్దార్ను వివరణ కోరాలని మంత్రి ఆదేశించారు. దసరాలోపు ఇళ్లు పూర్తిచేయించాలి ఇందిరమ్మ పథకంలో మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఉన్న ఇళ్లను దసరాలోపు పూర్తిచేయించాలని, నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ కింద 500 గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గుర్తించి 15 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లడ్ల మంజూరులో మిగిలిపోయిన, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దసరాలోపే లబ్ధిదారులకు ఇచ్చేలా చూడాలన్నారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు, గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్ వారి శాఖలకు సంబంధించిన అంశాలను వివరించారు. నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వారి జిల్లాలకు సంబంధించిన పలు విషయాలను మంత్రులకు వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్లో సూర్యాపేటకు మంజూరైన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవన నిర్మాణాలకు మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఫ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ భూభారతి ద్వారా పేదవారి భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఫ ప్రభుత్వ విప్లు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ఎల్–3 మస్యలు పరిష్కరించాలన్నారు. ఫ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ శాలిగౌరారం మండలం మాదారం చెరువు శిఖం భూమి ఆక్రమణ, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీలు, తహసీల్దార్లు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
భువనగిరిటౌన్ : జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు,సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చేపట్టిన పాదయాత్రను శనివారం భువనగిరి పట్టణంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తా వద్ద వారు జెండాలు ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో సీతారాములు మాట్లాడుతూ రూ. 20 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వందల కోట్లకు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వరుణ యాగాలు చేస్తున్నారని, గోశాలలకు రూ.50 కోట్లు ఇస్తారు కానీ రైతుల సాగునీటికి నిధులు ఇవ్వరని ఎద్దేవా చేశారు. విషపూరిత మూసీ నీటితో ప్రజలు, పశువులు రోగాల పాలవుతుంటే సుందరీకరణ పేరుతో హైదరాబాద్ లో పర్యాటక హంగులు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, గోదావరి అనుసంధానం చేస్తే 7 జిల్లాలకు మేలు జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి కలలు కనే ఫ్యూచర్ సిటీపై పెట్టే శ్రద్ధలో సగం ఈ ప్రాజెక్టులపై పెడితే యాదాద్రి ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న 9 డిమాండ్లను అసెంబ్లీలో చర్చించాలన్నారు. ఈనెల 31న హైదరాబాద్లో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో 22 ప్రాజెక్టులు, కాల్వలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, నేతలు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,ముత్యాలు, అంజిరెడ్డి, వెంకటేశు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఫ భువనగిరిలో సీపీఎం పాదయాత్ర ప్రారంభం -
ఆయా పోస్టుకు రూ.50 వేలు.. టీచర్కు రూ. లక్ష!
సాక్షి, యాదాద్రి : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దళారుల పైరవీలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్థానిక నాయకులు అమాయక అభ్యర్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పోస్టుకో రేటు నిర్ణయించి దండుకుంటున్నారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో.. ఆలేరు, భువనగిరి, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ ఆయా పోస్టులకు రూ. 50వేలు, టీచర్ పోస్టులకు రూ. లక్ష వరకు దళారులు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు తాము అత్యంత సన్నిహితులం అని నమ్మబలుకుతూ అడ్వాన్సులు సైతం తీసుకుంటున్నారు. మోత్కూరు, గుండాల, ఆలేరు, వలిగొండ, రాజాపేట తదితర మండలాల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. దళారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల గ్రామ పంచాయతీల్లో అధికారులు ప్రాథమికంగా అర్హుల జాబితాను ప్రదర్శించడంతో ఈ దందా బయటపడింది. స్థానికత లేకపోవడం, వయోపరిమితి వంటి కారణాలతో స్క్రూటినీలో పలువురి పేర్లను తొలగించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని దళారుల చుట్టూ తిరుగుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన ఆన్లైన్లో అందిన ధ్రువపత్రాల ప్రాథమిక పరిశీలన ముగిసింది. అభ్యర్థి వాస్తవంగా ఆ గ్రామంలోనే నివసిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు సీడీపీఓల ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతోంది. లోకల్,నాన్–లోకల్ జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు వారం రోజుల సమయం ఇస్తారు. 10 శాతం వెయిటేజీ అభ్యర్థి నియామక ప్రక్రియలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. 90 మార్కులు అభ్యర్థి అర్హతలు, కేటగిరీ ఆధారంగా సాఫ్ట్వేరే ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. ఇందులో వితంతువులకు 5, వికలాంగులకు 5, అనాఽథలకు 10, మార్కులు కేటాయిస్తారు. ఇందులో ఇంటర్వ్యూలో 10మార్కులు కలుపుతారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీ (డీడబ్ల్యూఓ, డీఎంహెచ్ఓ, డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరుగుతుంది సెప్టెంబర్ రెండో వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. కేవలం మెరిట్ ఆధారంగానే పారదర్శకంగా ఎంపిక ఉంటుంది. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. దళారులపై పోలీస్ కేసులు నమోదు చేస్తాం. – చిలుకూరు శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమాధికారిఅంగట్లో అంగన్వాడీ కొలువులు ఫ అధికార పార్టీ నేతల పేరుతో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు ఫ ప్రాథమిక జాబితాల ప్రకటనతో వెలుగుచూసిన అక్రమాలు ఫ అర్హత, మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తామంటున్న అధికారులు -
మహిళా ఉపాధికి ఈ–వాహనాలు
ఆలేరురూరల్ : స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ‘సీ్త్రనిధి’ వెన్నుదన్నుగా నిలుస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పెరుగుతున్న కాలుష్య కారకాలను నియంత్రించేందుకు ప్రభుత్వం పర్యావరణ హితం కోసం ఈ–వాహనాలు (ఈ–ఆటో, ఈ–బైక్లు)అందిస్తోంది. ఇందుకోసం సీ్త్రనిధి ద్వారా రుణాలు విడుదల చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే సభ్యురాలి ఖాతాలో నగదు జమవుతున్నాయి. మంజూరైన ఈ–వాహనాలపై మహిళలు వివిధ రకాల చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 మిల్లెట్ ఈ–వాహనాలను పంపిణీ చేశారు. లక్ష్యం లేకున్నప్పటికీ ఔత్సాహిక మహిళలను ఇటువైపు మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఐదు రకాల రుణాలు జిల్లాలో 14,875 సంఘాల్లో 1,62,546 మంది సభ్యులు కొనసాగుతున్నారు. ఏటా సీ్త్రనిధిలో రూ.60 కోట్లకుపైగా రుణాలు అందిస్తున్నారు. సీ్త్రనిధిలో ఐదు రకాల రుణ సదుపాయం కల్పిస్తున్నారు. సువిదలో రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు, ప్రగతిలో 50వేల నుంచి లక్ష వరకు, అక్షయలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, సౌభాగ్యలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, ఐశ్వర్యలో రూ.5లక్షల వరకు రుణాలు పొందుతున్నారు. అర్హతలు ఇవే..అర్హులైన ప్రతి సభ్యురాలు ఈ–వాహనాల కొనుగోలుకు రుణం పొందే అవకాశం ఉంది. రుణాలు పొందేవారు గతంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు చెల్లించకుండా పెండింగ్ ఉండవద్దు. సభ్యుల కుటుంబాల్లోని ఎవరికై నా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎంచుకున్న వాహనాల కొటేషన్ తీసుకుని సీ్త్రనిధి అధికారులకు అందిస్తే మంజూరు చేస్తున్నారు. ఈ–ఆటోకు రూ.3లక్షల రుణం ఉంటే ప్రతినెలా రూ.6,700 కిస్తీ చొప్పున 60 నెలలు, ఈ–బైక్కు రూ.లక్ష రుణం ఇస్తే నెలకు రూ.2,660 కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. సీ్త్రనిధి ద్వారా మహిళలకు ఈ–వాహనాలకు రుణ సౌకర్యం అందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 10 మిల్లెట్ ఈ–వాహనాలను అందించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా సంఘాల సభ్యులు దరఖాస్తులు చేసుకుంటే రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఫ స్వయం సహాయక సంఘాల పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం ఫ సీ్త్రనిధి రుణాలతో ఈ–ఆటో, ఈ–బైక్లు ఫ ఇప్పటి వరకు పది మిల్లెట్ ఈ–వాహనాలు పంపిణీ ఫ చిరు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణాలు -
గోదాముల్లోనే ధాన్యం నిల్వ
సాక్షి, యాదాద్రి : ఈ వానాకాలం ధాన్యం మిల్లులకు ఇవ్వకుండా గోదాముల్లో నిల్వ చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్కు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులతో నిండి ఉన్న గోదాములను గడువులోగా ఖాళీ చేయించి కొత్త ధాన్యంం నిల్వకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అయితే మిల్లుల్లో ధాన్యం నిల్వకు చోటు లేలేదని తాము దించుకోలేమని మిల్లర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు కొందరు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని చీకటి బజారుకు తరలిస్తున్నారు. కలెక్టర్లకు పూర్తి అధికారాలు ధాన్యం నిల్వకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడైనా, ఏ రేటుకై నా గోదాములను అద్దెకు తీసుకునేలా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైస్ మిల్లుల్లోని ప్రైవేట్ గోదాములను సైతం అద్దెకు తీసుకోనున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం మిల్లర్లకు కాకుండా ప్రత్యామ్నాయంగా నిల్వ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే మిల్లుల్లో నిండుగా ధాన్యం ఉండడంతో ప్రైవేట్ గోదాములు, జర్మన్ టెంట్లకింద నిల్వ చేయడానికి పరిశీలిస్తున్నారు. మొత్తంగా మిల్లర్లకు వీలైనంత తక్కువ ధాన్యం ఇచ్చేలా సివిల్ సప్లయ్ శాఖ నిర్ణయించింది. బాయిల్డ్ రైస్ సేకరణలో జాప్యం జిల్లాలో బాయిల్డ్ రైస్ తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఎఫ్సీఐ కేవలం రారైస్ను మాత్రమే తీసుకుంటోంది. దీంతో మిల్లుల్లో ధాన్యం లోడింగ్ ఆలస్యమై రైస్ మిల్లర్లలో ఆందోళన మొదలైంది. ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐకి రారైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సీజన్లో రా రైస్ మిల్లింగ్ చేయడం వల్ల నూకశాతం పెరిగి నష్టం వస్తుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. తాము కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వగలమని మిల్లర్లు అంటున్నారు. ఇటీవల అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం, నాగిరెడ్డిపల్లి రైల్వే పాయింట్ల వద్ద ఈనెల 24, 25 తేదీల్లో లోడింగ్ ప్రారంభమైంది. నాగిరెడ్డిపల్లి నుంచి రెండు విడతలుగా 2,000 టన్నుల చొప్పున బాయిల్డ్ బియ్యం ర్యాక్ ద్వారా తరలించడంతో ఆయా ప్రదేశాలు ఖాళీ అవుతున్నాయి. ఈ సీజన్లో మిల్లులపై ఆధారపడకుండా కార్యాచరణ ఫ ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యం వేలం ద్వారా విక్రయం ఫ బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ఈ సారి సీఎంఆర్ ధాన్యం ఫ ప్రత్యామ్నాయంపై ప్రభుత్వ దృష్టిరాష్ట్రస్థాయిలో గోదాముల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ధాన్యం బహిరంగ వేలానికి నిర్ణయించింది. గోదాముల్లో ఇప్పటికే ఉన్న పత్తి, మక్కల తరలింపు, ప్రత్యామ్నాయ నిల్వ మార్గాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో 7.5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉండగా, రైస్ మిల్లుల్లో మరో 10 లక్షల టన్నులతో కలిపి మొత్తం 17.5 లక్షల టన్నులు ఉంది. ఇందులో మన జిల్లాలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాముల్లో, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం ఓపెన్ టెండర్ల ద్వారా వేలంలో విక్రయించి గోదాములను ఖాళీ చేయిస్తోంది. సెప్టెంబర్ ఆఖరి నాటికి నిల్వలను పూర్తిగా ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా జిల్లాలో ఉన్న గోదాముల్లో సుమారు 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు నిల్వ చేసే సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ సీజన్లో ధాన్యం వివరాలు (మెట్రిక్ టన్నుల్లో..) దిగుబడి అంచనా 4,00,000 కొనుగోలుకు అవకాశం 3,00,000 జిల్లాలో ప్రస్తుత ధాన్యం నిల్వలు గోదాముల్లో 1,30,000 మిల్లుల్లో 13,000 -
డ్యూటీ షిఫ్ట్లు పాటించాల్సిందే..
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విధులు నిర్వహించే హోంగార్డులు డ్యూటీ షిఫ్ట్ల సమయాలను కచ్చితంగా పాటించాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్, హోంగార్డ్స్ ఆర్గనైజేషన్, డీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జిల్లా అధికారులు సర్క్యులర్ మెమోను విడుదల చేశారు. ఇటీవల హోంగార్డుల విధుల విషయానికి సంబంధించి ఆలయ ఈఓతో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గుట్టలో విధులు నిర్వహించే 16 పురుషులు, ఏడుగురు మహిళా హోంగార్డులు మొత్తం 23 మంది సకాలంలో హాజరై 8 గంటల డ్యూటీ సమయాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. డ్యూటీ సమయం పూర్తి కాకముందే విధి ప్రదేశం విడిచి వెళ్లడం, ఆలస్యంగా విధులకు హాజరు కావడం, అనుమతి లేకుండా గైర్హాజరు కావడం, షిఫ్ట్ సమయాలను స్వయంగా మార్చుకోవడం పూర్తిగా నిషేధించినట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు. అధికారులు ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో హోమ్ గార్డులను విధుల నుంచి తొలగించడంతో పాటు నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని సర్క్యులర్లో పేర్కొన్నారు. పది రోజుల క్రితమే ఆదేశాలు పది రోజుల క్రితం హోమ్ గార్డులకు ఉదయం 5గంటలకు అభిషేకం సమయం నుంచి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇంతలోనే సుప్రభాతం సమయం నుంచి విధులకు హోం గార్డులు హాజరు కావాలని సర్క్యులర్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అయితే హోం గార్డులందరికీ ఐదు షిఫ్ట్ల్లో డ్యూటీలు ఉంటాయి. అయితే సుప్రభాతం సమయంలో అంటే వేకువజామున 3గంటలకు విధులకు హాజరు కావాలంటే ఇబ్బందిగా ఉంటుందని మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వేకువజామున 3గంటలకు విధులకు హాజరు కావాలంటే మధ్య రాత్రి ఇంటి నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇంటి దగ్గర తమకు పిల్లలు ఉంటారని, వారిని పాఠశాలకు పంపించే సమయం సైతం తమకు లేకుండా పోతుందని, దీంతో కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో మార్పులు చేయాలని మహిళా హోంగార్డులు కోరుతున్నారు. ఫ ‘గుట్ట’ దేవస్థానంలో హోంగార్డులకు సర్క్యులర్ జారీ ఫ 8 గంటల విధులు తప్పనిసరి ఫ నియమాలు ఉల్లంఘిస్తే డ్యూటీ నుంచి తొలగింపే.. ఫ వేకువజామున 3గంటలకే విధులకు రావాలని ఆదేశాలు ఫ ఆందోళనలో మహిళా హోంగార్డులు -
ప్రమాదాల నివారణకే అండర్ పాస్
భువనగిరిటౌన్ : ప్రమాదాల నివారణకే భువనగిరి మండలం సింగన్నగూడెం చౌరస్తా వద్ద నూతనంగా అండర్ పాస్ నిర్మించ తలపెడుతున్నామని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అంతుకుముందు బహార్పేట్ పాఠశాలలో చెట్టు కొమ్మ కూలి చనిపోయిన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు కూర వెంకటేశ్, అవైస్చిస్తీ, బర్రె జహంగీర్, మహ్మద్ అతహార్, బొంతల నర్సింగ్ రావు, ఈరపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
కళతప్పిన రాయగిరి చెరువు
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి చెరువు పర్యాటక కళను కోల్పోయి బోసిపోతోంది. గడచిన ఐదు నెలలుగా చెరువులో బోటింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం 2025 జూన్ 2న రాయగిరి వద్ద మినీ శిల్పారామాన్ని ప్రారంభించారు. ఇందులో పిల్లల ఆట వస్తువులు, ఫొటో పాయింట్లు, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 18 మంది సామర్థ్యం గల పెద్ద బోటు, స్పీడ్ బోటు, పెడల్ బోట్లను అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతుల్లో పెద్ద బోటు ఐదు నెలల క్రితం 18 మంది ప్రయాణించే పెద్ద బోటు సాంకేతిక లోపంతో మరమ్మతులకు గురైంది. రిపేర్ కోసం హైదరాబాద్ తరలించారు. ఇప్పటివరకు తిరిగి తీసుకురాలేదు. మరోవైపు ఇటీవల చెరువులో నీటిమట్టం బాగా తగ్గడంతో నలుగురు ప్రయాణించే స్పీడ్ బోటు సేవలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం ఒక్క పెడల్ బోటు మాత్రమే అరకొరగా నడుస్తోంది. కళ తప్పిన శిల్పారామం గతంలో ప్రతి శని, ఆదివారాల్లో పర్యాటకుల కోసం కూచిపూడి, భరతనాట్యం, కథకళి వంటి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం మే 10వ తేదీ తర్వాత నుంచి ఈ ప్రదర్శనలను కూడా నిలిపివేశారు. వారాంతాల్లో రద్దీ ఉన్నా తప్పని తిప్పలు శిల్పారామానికి సాధారణ రోజుల్లో 250 నుంచి 300 మంది, శని, ఆదివారాల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి 500 – 600 మంది వరకు సందర్శకులు వస్తుంటారు. వినోదం కోసం వచ్చిన పర్యాటకులు బోటింగ్, నృత్య ప్రదర్శనలు లేకపోవడంతో కేవలం పిల్లల ఆట స్థలానికే పరిమితమైంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెద్ద బోటును అందుబాటులోకి తెచ్చి, సాంస్కృతిక ప్రదర్శనలను పునరుద్ధరించాలని సందర్శకులు కోరుతున్నారు.ఫ చెరువులో ఐదు నెలలుగా నిలిచిన బోటింగ్ ఫ మరమ్మతులకు గురైన పెద్ద బోటు.. మూలనపడ్డ స్పీడ్ బోటు ఫ వారాంతాల్లో నృత్య ప్రదర్శనలకూ బ్రేక్ -
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంతోపాటు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు భాజాభజంత్రీల నడుమ తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. సేవకు ముందు మహిళలు మంగళ హారతులతో నీరాజనం పలికారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి, పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పూజలు చేసి, హారతినిచ్చారు. అమ్మవారికి ఇష్టమైన నాదస్వరాన్ని వినిపించారు. అమ్మవారి సేవలో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలిచౌటుప్పల్ : అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. శుక్రవారం ఆమె చౌటుప్పల్ మండలం దామెర గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని, వీబీజీ రామ్జీ పథకం కింద నిర్మించిన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మిగిలిన కొంత రోడ్డు భాగాన్ని పూర్తి చేయించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. అనంతరం జూమ్ మీటింగ్ నిర్వహించి చౌటుప్పల్, రామన్నపేట, నారాయణపురం మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి మిర్యాలగూడ : కృష్ణా, గోదావరి నదుల జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. నదీజలాల వినియోగంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ రిపోర్టును బయటపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రాల మధ్య జల తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్రం నాన్చుడు ధోరణి వీడాలన్నారు. ఆయన శుక్రవారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని చెరువులు, కుంటలను నింపకపోతే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందన్నారు. సమావేశంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, శ్రీను, రామ్మూర్తి, పాండు, రాంరెడ్డి, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లులో తనిఖీలు మిర్యాలగూడ : విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద గల శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్లో తనిఖీలు నిర్వహించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి రూ.80 లక్షల విలువైన కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం పక్కదారిపట్టినట్టు తనిఖీల్లో తేలిందని సమాచారం. విజిలెన్స్ అధికారులు రైస్మిల్లులోని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రయాణికుల కిటకిట
భువనగిరి : రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం భువనగిరి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. మహిళలు, యువతులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కోసం బస్టాండ్కు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులతో సందడి కనిపించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా బస్సులు నడిపిప్పటికీ సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ప్రధానంగా భువనగిరి నుంచి నల్లగొండ, మోత్కూరు వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు వందలాదిగా నిరీక్షించారు. వచ్చిన ఒకటి రెండు బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం
రామన్నపేట: రైతులు ఏ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారో అత్యంత కచ్చితత్వంతో నమోదు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డిజిటల్ క్రాప్ సర్వేకు జిల్లాలో మంగళవారం శ్రీకారం చుట్టాయి. జియోఫెన్సింగ్, శాటిలైట్ సాంకేతికత ఆధారంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే సిబ్బంది పొలం హద్దుల వద్దకు వెళ్తేనే డిజిటల్ క్రాప్ సర్వే యాప్ పనిచేస్తుంది. సర్వే ఉద్దేశం ఏమిటంటే.. దేశవ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందో ముందే అంచనా వేయడం సులభమవుతుంది. దిగుబడులకు తగినట్లుగా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, మద్దతు ధర నిర్ణయించడానికి అవకాశం కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు జరిగిన పంట నష్టాన్ని పక్కాగా నిర్ధారించడానికి వీలవుతుంది. ప్రతి సబ్డివిజన్ ఫొటో నమోదు తప్పనిసరి పంటల నమోదు కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఎంపిక చేసిన సర్వేయర్లు (వలంటీర్లు) తమ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమకు కేటాయించిన సర్వే నంబర్ల (పంటచేల) వద్దకు వెళ్లి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి ఒకే సర్వే నంబర్లోని సబ్డివిజన్ల (ఫామ్ ఫీల్డ్స్) వారీగా పంటచేల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన డేటాను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైనల్ చేస్తారు. ప్రతి ఫొటో నమోదుకు ప్రభుత్వం సర్వేయర్కు రూ. 7 చొప్పున చెల్లిస్తుంది. మ్యాప్ లేని భూములు, ఎన్డీఎస్ ఖాతాల వివరాలను కూడా నేరుగా నమోదు చేస్తున్నారు. అలసత్వం వహిస్తే రైతులకు నష్టం డిజిటల్ క్రాప్ సర్వేలో పంట వివరాలను నమోదు చేయించడంలో రైతులు అలసత్వం వహిస్తే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలన్నా లేదా సీసీఐ ద్వారా పత్తిని సేకరించాలన్నా ఈ సర్వే వివరాలే ప్రామాణికం కానున్నాయి. కాబట్టి రైతులు సర్వేయర్లకు సహకరించి తమ పంట వివరాలు యాప్లో నమోదయ్యేలా చూసుకోవాలి.ఫ ఆధునిక సాంకేతికతతో పంటల నమోదు ఫ ఉపగ్రహ చిత్రాలు, జియోఫెన్సింగ్ ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే ఫ సర్వే నంబర్ల సబ్డివిజన్ల వారీగా ఫొటో తీస్తేనే యాప్లో అప్లోడ్ ఫ వలంటీర్లు అప్లోడ్ చేసే ప్రతి ఫొటోకు రూ.7 చెల్లింపు ఫ సర్వేలో వివరాలు నమోదు కాకపోతే రైతులకు ఇబ్బందులు -
నాణ్యమైన విద్య అందించాలి
భువనగిరి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. గురువారం భువనగిరిలోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల భద్రత ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతకు ముందు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతి, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పోలీస్స్టేషన్ తనిఖీభూదాన్పోచంపల్లి: శాంతిభద్రతల విషయంలో పోలీస్సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం పోచంపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్సిబ్బంది హాజరు, వారి పనితీరు, స్టేషన్ డైరీ, కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు, పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ జగన్, మహిళా ఎస్ఐ లైలా, పోలీస్సిబ్బంది తదితరులున్నారు. రేపు జాబ్మేళా భువనగిరి: నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. కనీసం 10వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదిత ఒకేషనల్ జూనియర్ కళాశాలలో హాజరుకావాలని కోరారు. దరఖాస్తులకు ఆహ్వానం భువనగిరి: జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పానాధికారి పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీటీ లేదా ఎంపీటీ చదివి, 43 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్ట్రర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగు నీరందించాలిఆలేరురూరల్ : అశ్వరావుపల్లి ప్రాజెక్టు నుంచి దేవాదుల కాల్వ ద్వారా సాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. గురువారం ఆలేరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేక, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గండంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వరావుపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తే పటేల్గూడెం, గండ్లగూడెం, కందిగడ్డతండా, తూర్పుగూడెం, గొలనుకొండ, శారాజీపేట ఇతర ప్రాంతాలకు, కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందుతాయన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో చలో హైదరాబాద్లో ఇందిరాపార్క్ వద్ద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినాదంతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఎం.ఎ ఇక్బాల్, మండల అధ్యక్షులు దూపటి వెంకటేష్, తుసలయ్య, పిక్క గణేష్, మిట్ట శంకరయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ నుంచి లక్కారంలోని అండర్పాస్ బ్రిడ్జి వరకు బారులుదీరిన వాహనాలు లక్కారంలోని అండర్పాస్ బ్రిడ్జ్జి వద్ద నెలకొన్న వాహనాల రద్దీచౌటుప్పల్ : రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వలిగొండ క్రాస్రోడ్డు నుంచి లక్కారం గ్రామంలోని అండర్పాస్ బ్రిడ్జి దాటిన తర్వాత వీవీ రెస్టారెంట్ వరకు వాహనాలు జామ్ అయ్యాయి. జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. లక్కారం అండర్పాస్పై ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు సర్వీస్ రోడ్డులోకి తమ వాహనాలను మళ్లించారు. దీంతో అక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


