breaking news
Yadadri
-
ఆర్ఐ, పాలడుగు కార్యదర్శి సస్పెన్షన్
సాక్షి,యాదాద్రి : మోత్కూర్ మండలం పాలడుగు పంచాయతీ కార్యదర్శి శోభన్, ఆర్ఐ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు చేయడంలో కారణం కావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్రమైన విచారణ చేయాలని భువనగిరి ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. దాచారం కార్యదర్శి సస్పెన్షన్ ఎత్తివేతమోత్కూరు : మండలంలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యదర్శి బొడ్డు యాదగిరి సస్పెన్షన్ ఎత్తివేస్తూ కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డెయిలీ శానిటేషన్ రిపోర్ట్ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఫేక్ పంపారని ఇటీవల యాదగిరిని సస్పెండ్ చేశారు. ఈయనతో పాటు జిల్లాలో మరో 8 మందిని కూడా సస్పెండ్ చేశారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 2, 3 గ్రామాలు అదనపు బాధ్యతలు విధులు నిర్వహిస్తున్నామని తమపై భారం మోపి సస్పెన్షన్ చేస్తే ఎలా అని కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తిరిగి కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీఓ బాలాజీ తెలిపారు. పునఃప్రారంభమైన ఆర్జిత సేవలు యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశేష పర్వాలు జరిగిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ అధికారులు గురువారం ఉదయం ఆర్జిత సేవలను పునఃప్రారంభించారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షం భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉండడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూర్ మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. అడ్డగూడూరు మండలంలో 122, వలిగొండ 105, చౌటుప్పల్ 100, గుండాల 81, ఆలేరు 77, నారాయణపురం 76, రామన్నపేట 76, మోత్కూర్ 60, మోటకొండూరు 50, భువనగిరి 49, రాజాపేట 45, బొమ్మలరామారం 38, బీబీనగర్ 36, పోచంపల్లి 27, తుర్కపల్లి 15, యాదగిరిగుట్ట 12, చౌటుప్పల్లో 87 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. -
కాలానికి అనుగుణంగా డిజైన్లు రూపొందించాలి
భువనగిరిటౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాయగిరి క్రాస్ రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు చేపట్టిన ర్యాలీని, కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఏడీ హ్యాండ్లూమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. చేనేత కళను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కత్ వస్త్రాలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయన్నారు. ఫ్యాషన్కు తగ్గట్టుగా వస్త్రాలు తయారు చేస్తే మార్కెటింగ్ బాగా పెరుగుతుందని తెలిపారు చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవిధంగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత, నేతన్న బీమా చెక్కులను అందజేశారు. చేనేత రంగంలో విశేష కృషి చేసిన నేతన్నలను సన్మానించి, మెమొంటో అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ జల్ది రాములు, కార్మిక సంఘ నాయకుడు లక్ష్మీనరసయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సుధాకర్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ సుధాకర్ సుదర్శన్, డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
15లోగా పెండింగ్ కేసుల పరిష్కారం
సాక్షి,యాదాద్రి : సమాచార హక్కు చట్టం కింద పెండింగ్లో ఉన్న పిటిషన్లు ఈ నెల 15లోగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన గురువారం భువనగిరి వివేరా హోటల్లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పిటిషన్లు 18,000 పెండింగ్లో ఉండగా, వీటిలో ఇప్పటివరకు 2300 పిటిషన్లను పరిష్కరించామన్నారు. మొత్తం 29 డిపార్ట్మెంట్లలో పెండింగ్లో ఉన్న పిటిషన్లలో 15 శాఖల్లో క్లియర్ చేశామని చెప్పారు. మిగిలిన 14 శాఖల్లో దరఖాస్తులను పరిష్కరించేందుకు ముమ్మర చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా మున్సిపల్ రెవెన్యూ శాఖలో ఉన్న 50 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఆయాశాఖలకు ఆదేశాలిచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్లు విధిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట సహ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, నెర్ల వైష్ణవి మొహిసిన్ పర్వీన్ ఉన్నారు. ఫ సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి -
నృసింహుడి ఆలయ భద్రతపై ఆందోళన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఆలయంలో చింతపండు దొంగతనం, ఆలయ పరిసరాల్లోని గిరి ప్రదక్షిణ, పాతగోశాలలోని డార్మింటరీ హాల్లో వైర్ల చోరీలు జరిగాయి. అయినా ఆలయ పోలీసులు, అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రస్తుతం ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను చోరీ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు రంపంతో కోసారు. గతేడాది బిగించినప్పటికీ.. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సుమారు రూ.20లక్షల వ్యయంతో ఈసీఐఎల్ కంపెనీతో సుమారు 100 విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలను బిగించారు. గతేడాది ఇవి బిగించినప్పటికీ వీటి పర్యవేక్షణపై ఎస్పీఎఫ్ పోలీస్, స్థానిక పోలీసులు సరైనా నిఘా పెట్టడం లేదు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గంలో బిగించిన విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 10 నుంచి 15 చోట్లా రంపంతో కట్ చేశారు. గుర్తించిన విద్యుత్ సిబ్బంది ఆ స్తంభాలను ఆలయ మీటర్ యార్డు గదిలో భద్రపరిచారు. మరికొన్ని చోట్ల అలాగే వదిలేశారు. వాటిని సైతం రాత్రి సమయంలో దుండగులు దొంగిలించేందుకు యత్నిస్తున్నారు. గతంలో సైతం.. ఆలయ సన్నిధిలోని పాత గోశాలలో గతంలో భద్రపరిచిన విద్యుత్ వైర్ను దొంగిలించుకుపోయారు. ఇటీవల సుమారు 120 మీటర్లకు పైగా వైర్ను సైతం దుండగులు అపహరించుకుపోయారు. గత మూడు నెలల క్రితం ఆలయ ప్రసాద విభాగంలో సైతం చింతపండును దొంగిలిస్తూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్టుబడ్డారు. ఇందంతా సరైన పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతోనే జరుగుతుందనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈసీఐఎల్ కంపెనీకి బిల్లులు ఇవ్వకపోవడంతో.. ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఈసీఐఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల పనులకు అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు వీటి నిర్వహణను ఆలయ అధికారులకు అప్పగించలేదని సమాచారం. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగినా, ఎవరైనా దొంగిలించినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈసీఐఎల్ కంపెనీకి దేవస్థానం బిల్లులు చెల్లిస్తే, వీటి నిర్వహణ ఆలయ అధికారులు చూసుకునే అవకాశం ఉంది. ఫ గతంలో ఆలయ ప్రసాద విభాగంలో చింతపండు, పాతగోశాల డార్మింటరీ హాల్లో వైర్ల చోరీ ఫ ఇటీవల గిరి ప్రదక్షిణ మార్గంలో విద్యుత్ స్తంభాలు అపహరించేందుకు యత్నం ఫ పర్యవేక్షణ లోపించడంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నారని భక్తుల ఆరోపణ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం గిరి ప్రదక్షిణ మార్గంలో ఈఓతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఈ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదనే నెపంతో ఈసీఐఎల్ కంపెనీ పూర్తి స్థాయిలో నిర్వహణ చేయలేకపోతోంది. రాత్రి సమయాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందితో గిరి ప్రదక్షిణ మార్గంలో నిఘా ఏర్పాటు చేస్తాం. రంపంతో కోసి పక్కన పెట్టిన విద్యుత్ స్తంభాలను మీటర్ యార్డు గదిలో భద్రపరిచాం. – రామారావు, ఈఈ విద్యుత్ విభాగం -
కాంగ్రెస్ది ఓటు బ్యాంకు రాజకీయం
సాక్షి, యాదాద్రి, భువనగిరి : బీసీ రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత గురువారం తొలిసారిగా ఆయన జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా భువనగిరిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడారు. ముస్లిం ఓటుబ్యాంకుతో రాహుల్గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందే తప్ప కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయడం చేతకావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి భారీగా సీట్లు వస్తాయనే సంకేతాలున్నాయన్నారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రక్షాళన చేస్తా అనే మాటలు కార్యరూపం దాల్చలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండు ఒక్కటేనని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదన్నారు. భువనగిరి నుంచి ధర్మయుద్ధం ప్రారంభించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు అధికారం ఇచ్చిన ప్రజలు ఒకసారి బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం బీజేపీ శ్రేణులు రాంచందర్రావును ఘనంగా సత్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రమేందర్రెడ్డి, జిల్లా ప్రభారి చాడ శ్రీనివాస్రెడ్డి, సంస్థాగత జిల్లా స్థానిక ఎన్నికల ప్రభారి పాశం భాస్కర్,బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, పోతంశెట్టి రవీందర్, దాసిర మల్లేష్, నర్ల నర్సింగ్రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, జాతీయ దళిత మోర్చా కార్యవర్గసభ్యులు వేమలు అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, పట్టణ, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. భారీ బైకు ర్యాలీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు ఆ పార్టీ నేతలు స్థానిక పాత బస్టాండ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి వినాయక, ప్రిన్స్ చైరస్తా మీదగా ఆజాద్ రోడ్డు మార్గంలో సమ్మద్ చౌరస్తా మీదుగా ఎంఎన్ఆర్ గార్డెన్కు చేరుకున్నారు. ఫ కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఎక్కడ ఫ కార్యరూపం దాల్చని మూసీ ప్రక్షాళన ఫ భువనగిరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
‘వరలక్ష్మి’ సెల్ఫీలకు ఆహ్వానం
ఇసుక దందాను అరికట్టేందుకే.. ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం జరుపుకునే మహిళలూ.. మీ ఫొటోలను ‘సాక్షి’ పత్రికలో చూసుకోవాలను కుంటున్నారా.. మీరు పూజలో కూర్చున్న ఫొటో సెల్ఫీ తీసి ఈ కింద నంబర్కు వాట్సప్ చేయండి. శనివారం సంచికలో ప్రచురిస్తాం. లేటెస్ట్ సెల్ఫీ ఫొటోతో పాటు మీ పేరు, చిరునామా కూడా పంపాలి. - 8లో- 9లో80962 93702సెల్ఫీ పంపాల్సిన వాట్సప్ నంబర్ -
బ్లాక్స్పాట్లపై నజర్
యాదగిరిగుట్ట రూరల్: హైదరాబాద్– వరంగల్ ప్రధాన జాతీయ రహదారి – 163 యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పరిధి నుంచి ఆలేరు ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యేడాది కాలంలో 110 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 13 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 8 బ్లాక్స్పాట్ల గుర్తింపు యాదగిరిగుట్ట మండల పరిధిలో 8 బ్లాక్ స్పాట్ (ప్రమాదాలు జరిగే ప్రాంతం)లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వంగపల్లి గ్రామం లోపలికి వచ్చే రహదారి, వంగపల్లి బైపాస్, రామాజీపేట గ్రామం, తాళ్లగూడెం బస్స్టాప్, బాహుపేట స్టేజీ, చిన్నకందుకూరు స్టేజీ, పెద్దకందుకూరు గ్రామం, ఆలేరు ఎగ్జిట్ ప్రదేశం ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రదేశాల్లో బ్లాక్అండ్ ఎల్లో హాజార్డ్, డెలిరేషన్ బోర్డులు, మీడియన్ స్టార్టింగ్ బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, ప్లాస్టిక్ స్టాపర్లు, పవర్ బ్లింకర్లు, గో స్లో, ఆక్సిడెంట్ ఇండికేషన్లు, వంటి బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అతివేగంతో వచ్చి ప్రమాదాల బారిన..ఆలేరురూరల్: ఆలేరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో సాయిబాబ గుడి సమీపంలో, కందిగడ్డ తండా సమీపంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడగా.. 14 మంది త్రీవంగా గాయపడ్డారు. స్పీడ్ బ్రేకర్లు వేసిన చోట్ల రేడియంతో గుర్తులు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు అతివేగంతో వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. వీటి నివారణకు హైవే, పోలీస్ శాఖ దృష్టి సారించింది. అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బోలోర్స్, రేడియం స్టిక్కర్లు, సూచికలు తదితర ఏర్పాట్లు, స్పీడ్ గన్లు ఏర్పాటు చేయనున్నారు.స్పీడ్గన్లు ఏర్పాటు చేస్తాం వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిలో ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కంటే ప్రమాదాల సంఖ్య తగ్గించాం. ప్రమాదాలు జరిగే చోట బ్లాక్ స్పాట్లను గుర్తించి, ఇండికేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. వాహనాలు 80 స్పీడ్ దాటితే జరిమానాలు పడేలా, స్పీడ్ గన్లను కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా రాచకొండ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్లను గుర్తించాం. ఇప్పటికే కొన్ని ఇండికేషన్ బోలోర్స్ కూడా పెట్టాం. – యెలగొండ కృష్ణ, ట్రాఫిక్ సీఐ, యాదగిరిగుట్ట సర్కిల్ ఫ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు ఫ నివారణపై దృష్టి సారించిన హైవే, పోలీస్ శాఖ ఫ ఆయా ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు, సూచిక బోర్డుల ఏర్పాటుకు సన్నాహాలు -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కోదాడరూరల్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం కోదాడ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణ పరిధిలోని చేపల మార్కెట్ వెనుక కట్టబజార్కు చెందిన ఉప్పతల శ్రీను, లక్ష్మి(40) దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. శ్రీను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మిని శ్రీను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. మూడు రోజుల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకోవడం లేదు. బుధవారం రాత్రి వారి కుమార్తె హాసిని, బంధువుల పాప కలిసి ఓ గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన లక్ష్మి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుమార్తె హాసిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. శ్రీను మరో మహిళతో వివాహేత సంబంధం పెట్టుకొని లక్ష్మిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. పెళ్లి కుదరడం లేదని బలవన్మరణండిండి: పెళ్లి కుదరడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం డిండి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రంలోని డీఎన్టీ కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మయ్య, జంగమ్మ దంపతుల కుమార్తె రూప(26) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టుమిషన్ నడుపుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు రూపకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రూప బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం పోలీసులు ఘుటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిచారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కళాకారులు
భూదాన్పోచంపల్లి: చేనేత సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసినందుకు గాను హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్ స్కీమాటిక్ ఇంప్లిమెంటేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్, సహాయ మంత్రి పబిత్ర మార్గరేటా తదితరుల చేతులమీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. పుట్టపాక కళాకారులు.. సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ యువ చేనేత విభాగంలో, జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. వారికి ప్రశంసాపత్రం పత్రం, మెమొంటోతో పాటు నగదు పురస్కారం అందజేశారు. -
న్యాక్ ఏ గ్రేడ్ కోసం ప్రణాళిక రూపొందించాలి
● మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్లో ఏ గ్రేడ్ సాధించేలా అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం యూనివర్సిటీలో వివిధ విభాగాల ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాక్కు అందించే సెల్ఫ్ స్టడీ నివేదికలోని అంశాలపై అధ్యాపకులు అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రతి విభాగం వారు విధిగా వర్క్షాపులు, సెమినార్ల నిర్వహణతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్డీ విద్యార్థులు తమ పరిశోధనా కాలంలో కనీసం 2 పరిశోధనా పత్రాలు పరిశీలించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విభాగాల వారీగా ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేస్తామన్నారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలన్నారు.ఽ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రేమ్సాగర్, డాక్టర్ కె. అరుణప్రియ, సీహెచ్. సుధారాణి, శ్రీదేవి, రేఖ, అంజిరెడ్డి, ఆకుల రవి, హరీష్కుమార్, డాక్టర్ వై. ప్రశాంతి, మిర్యాల రమేష్, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నియామకం నల్లగొండ టూటౌన్: ఎంజీయూలో వివిధ విభాగాల్లో సిలబస్ కూర్పు, పాఠ్యాంశాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ విధానం, వివిధ విద్యాంశాల ప్రణాళిక రూపకల్పనకు గాను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను నియమిస్తూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బిజినెస్ మేనేజిమెంట్ విభాగం చైర్మన్గా మారం వెంకటరమణారెడ్డి, సోషల్ వర్క్ చైర్మన్గా డాక్టర్ శ్రీధర్(ఓయూ), హిస్టరీ అండ్ టూరిజం విభాగం చైర్మన్గా కె. విజయ్బాబు(కాకతీయ యూనివర్సిటీ), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్గా ఏవీఎన్.రెడ్డి(అంబేద్కర్ యూనివర్సిటీ)ని నియమించారు. -
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు
రామన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. బీసీలను మభ్యపెట్టడానికే రేవంత్రెడ్డి 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని, మేధావులను, ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఆర్డినెన్స్ను రూపొందించారని ఆరోపించారు. రేవంత్రెడ్డిపై నమ్మకం లేకనే ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 42శాతం నామినేటెడ్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు బద్దుల రమేష్, సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్బాబు తదితరులు ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఎంజీయూలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
నల్లగొండ టూటౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంజీయూ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు 20 అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ యూనివర్సిటీ సూచన ప్రకారం విద్యార్థుల జాబితా సిద్ధం చేసి ఈ నెల 15 లోగా usbmguict 2025@gmail.com మెయిల్ కు పంపాలని సూచించారు.వాగులో పడి మహిళ మృతిఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): వాగులో పడి మహిళ మృతిచెందిన ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరులో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన పచ్చిపాల నాగమ్మ(45) మూడ్రోజుల క్రితం మోతె మండలం సర్వారంలో బంధువుల దశదినకర్మకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ.. ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామ పరిధిలోని వాగులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు దిగి కాలు జారి వాగులో పడింది. గురువారం ఉదయం స్థానికులు వాగు వద్దకు వెళ్లగా మహిళ మృతదేహం నీటిపై తేలుతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చేనేతకు ప్రభుత్వాలన్నీ అన్యాయం చేశాయి
భూదాన్పోచంపల్లి: గత ప్రభుత్వాలన్నీ చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ టి.చిరంజీవులు అన్నారు. గత పదేళ్ల కాలంలో రూ.18లక్షల 12వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు ఖర్చు చేసింది కేవలం రూ.229 కోట్లు మాత్రమేనని అన్నారు. అలాగే ఈ సంవత్సరం 50లక్షల 512 వేల కోట్ల కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా చేనేతకు రూ.2400 కోట్లు కేటాయించడం దయనీయ పరిస్థితికి అద్దంపడుతోందని అన్నారు. గురువారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవులు పాల్గొని మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వాలకు చేతులు రావడం లేదన్నారు. అదే గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం బడాపారిశ్రామిక వేత్తలకు రూ.16లక్షల 24వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. 1950 నుంచి ఇప్పటి వరకు 23 మంది మాత్రమే పద్మశాలీలు ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. వాస్తవానికి 69 మంది ఎమ్మెల్యే కావాలన్నారు. అందరూ ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పద్మశాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది చేనేత కార్మికులను సన్మానించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, చేనేత నాయకులు భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, సీత శ్రీరాములు, భోగ భానుమతి, కర్నాటి అంజమ్మ, మెరుగు శశికళ, కార్మిక సంఘం నాయకులు హరిశంకర్, భూషణ్, బిట్ల గణేశ్, రుద్ర సూర్యప్రకాశ్, వేణుకుమార్, శ్యామ్సుందర్, కూరపాటి భాస్కర్, శివరాజు, రాజేశ్వరీ, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు -
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలి
భూదాన్పోచంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుతో కలిసి భూదాన్పోచంపల్లిని ఆయన సందర్శించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత సహకార సంఘం, చేనేత గృహాలను సందర్శించారు. చేనేత వస్త్రాలు, మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నది చేనేత పరిశ్రమనే అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే చేనేత కార్మికుల వస్త్రోత్పత్తులకు మార్కెటింగ్ పెరుగుతుందన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని, సబ్సిడీపై నూలు, ముడిసరుకును అందించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి పోచంపల్లికి మెగా చేనేత క్లస్టర్ మంజూరుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించారని వివరించారు. చేనేత సహకార సంఘాలకు ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. చేనేత పరిశ్రమలో 70శాతం మహిళలు పనిచేడం గొప్పవిషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు. దేశంలో తెలంగాణ నుంచే రూ.3లక్షల కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయంటే మన చేనేత వస్త్రాలకు ఉన్న డిమాండ్ అర్థమవుతుందని అన్నారు. అనంతరం పలువురు చేనేత నాయకులు, కార్మికులు బండారు దత్తాత్రేయను సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో చేనేత రాష్ట్ర నాయకులు కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, భారత లవకుమార్, సతీష్, నోముల గణేశ్, భారత వాసుదేవ్, చిక్క కృష్ణ, అంకం పాండు, సీత శ్రీరాములు, సీత సత్యనారాయణ, కర్నాటి బాలరాజు, రుద్ర అంజనేయులు, మెరుగు శశికళ, కర్నాటి అంజమ్మ, గంజి బస్వలింగం, ఏలే శ్రీనివాస్, కేసారం కృష్ణారెడ్డి, బడుగు శ్రీకాంత్, కడవేరు శేఖర్, ఇంజమూరి యాదగిరి, భారత అంజనేయులు పాల్గొన్నారు. ఫ హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
ఇసుక దందాను అరికట్టేందుకే ‘సాండ్ బజార్’
మిర్యాలగూడ: ఇసుక అక్రమ దందాను అరికట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఇసుక అందించడానికే సాండ్ బజార్ను ఏర్పాటు చేసినట్లు అన్నారు. రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఎక్స్రోడ్డు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో రాష్ట్ర మైనింగ్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాండ్ బజార్లో టన్ను ఇసుక రూ.1250కు అందుబాటులో ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకా తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తక్కువ ధరకు ఇసుకతో పాటు స్థానిక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలతో మాట్లాడి సిమెంట్ బస్తాకు రూ.50 చొప్పున తగ్గింపు ధరలో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటుకలు కూడా మార్కెట్ ధర కంటే ఒక రూపాయి తక్కువకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏడీ జాకోబ్, తహసీల్దార్ సురేష్కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
యాదగిరిగుట్ట: చేనేత కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకొని, అనంతరం పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం విదేశీ మోజులో చేనేత దుస్తులను ఎవరూ ధరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు చేనేత కార్మికులు వెళ్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణాలు అందించి ఆదుకుంటుందన్నారు. చేనేత వస్త్రాలను విదేశాలకు పంపించే అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ కల్పించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు ధరించాలనే సంకల్పం ప్రతి వ్యక్తిలో రావాలన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన పథకాలు అమలు చేయడంలేదన్నారు. పవర్లూమ్స్ కార్మికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. మొదటిసారి యాదగిరిగుట్టకు ఆయనకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, వట్టిపల్లి శ్రీనివాస్గౌడ్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, చేనేత విభాగం మాజీ కన్వీనర్ కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, మచ్చ సుధాకర్, రచ్చ శ్రీనివాస్, గంజి బసవలింగం, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
విద్యార్థిగా కలెక్టర్..
బీబీనగర్: కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిగా మారారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులతో కలిసి కూర్చొని ఉపాధ్యాయుడు బోధిస్తుండగా పాఠం విన్నారు. బీబీనగర్ మండలం గూడూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ను బుధవారం ఆయన సందర్శించారు. 10వ తరగతికి వెళ్లి విద్యార్థులతో కలిసి జూవాలజీ పాఠం విన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులువైన రీతిలో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైకిళ్లు బహుమతిగా అందజేస్తానని కలెక్టర్ తెలిపారు. -
100 రోజులు పని కల్పించాలి
రాజాపేట: ప్రతి కూలీకి 100 రోజు పనిదినాలు కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేష్ సూచించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాజాపేట మండలంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని స్పష్టం చేశారు. పనుల కొలతల్లో వ్యత్యాసం ఉండటంతో టెక్నికల్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఉపేందర్రెడ్డి, మేనేజర్ ఆదిత్యవర్థన్, ఎంపీడీఓ నాగవేణి, ఈసీ కర్ణాకర్ పాల్గొన్నారు. -
గొల్లభామ చీరల కాపీ
గొల్లభామ చీరలకు సిద్ధ్దిపేట ప్రసిద్ధి. ఇక్కడ కాటన్, పట్టు గొల్లభామ చీరలను కొన్ని దశాబ్దాలుగా చేనేత కార్మికులు నేస్తున్నారు. కానీ ఇటీవల పవర్ లూమ్ సంస్థలు గొల్లభామ చీరలను కాపీ చేస్తున్నాయి. తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఒక్క చీర నేయడానికి రూ. 1000 నుంచి రూ. 1500 కూలి ఇస్తున్నాం. అలాంటిది కాపీ చీరలను మార్కెట్ లో తక్కువ కు అమ్ముతున్నారు. ఇది మార్కెట్ మీద ప్రభావం పడుతోంది. –తుమ్మ ప్రవీణ్, సిద్ధిపేట, గొల్లభామ చీరల వ్యాపారి -
ముగిసిన పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ముగిశాయి. ఈ నెల 4వ తేదీన ఆలయంలో శ్రీస్వామి వారి పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. రెండ్రోజుల పాటు ఆలయంలో వివిధ పూజలు నిర్వహించిన అర్చకులు, బుధవారం ఉదయం ప్రాకార మండపంలోని యజ్ఞశాలలో హోమాధి పూజలు జరిపించి, మహా పూర్ణాహుతి చేపట్టారు. ఉదయం 8.30గంటల నుంచి ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర, పరివార శాంతి, ప్రాయశ్చిత హోమం, శాలాబలి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను, పవిత్రమాలలను ఊరేగింపుగా ప్రధానాలయానికి తీసుకెళ్లారు. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులు, సువర్ణ పుష్పార్చన ఉత్సవమూర్తులు, ఆళ్వారులకు పవిత్ర మాలలను ధరింపజేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. వేడుకల్లో ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చకులు, పారాయణీకులు, పండితులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో సైతం పవిత్రోత్సవాలను వైభవంగా ముగించారు. నేటి నుంచి నిత్యపూజలు పునఃప్రారంభం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరిగిన పవిత్రోత్సవాల సందర్భంగా మంగళ, బుధ వారాల్లో శాశ్వత, నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన నేపథ్యంలో గురువారం నుంచి ఈ పుజలను పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
చేనేతకు కొత్త బ్రాండ్
సృజనాత్మకతకు పెద్దపీట ఫ కాలానుగుణంగా నూతన డిజైన్ల రూపకల్పన ఫ దేశ, విదేశాల్లో చేనేతకు ఆదరణ ఫ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు నేడు జాతీయ చేనేత దినోత్సవంప్రింటెడ్ బెడద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జియోగ్రాఫికల్ ఐడెంటిటీ(పేటెంట్ హక్కులు) ఉన్న పోచంపల్లి ఇక్కత్ , సిద్ధిపేట గొల భామ, గద్వాల చీరలకు ప్రింటెండ్ బెడదతప్పడంలేదు. చేనేత వస్త్రాలైన పట్టు చీరలు, రుమాలు, కార్పెట్, బెడ్షీట్స్, మ్యాట్లను పవర్లూమ్పై తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గొల్లభామ కొచ్చి, ఆంధ్రప్రదేశ్, పోచంపల్లి చేనేతలకు బెంగళూరు, సూరత్, తమిళనాడు, గద్వాల చీరలను తమిళనాడు,కర్ణాటకలో పవర్ లూమ్లపై డూప్లికేట్ తయారు చేస్తున్నారు. దీని వల్ల చేనేత బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు 2003లో, గద్వాల చీరలకు 2009లో కేంద్ర ప్రభుత్వం జీయోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(పేటెంట్) హక్కులను ఇచ్చింది. పోచంపల్లి చేనేత 11 డిజైన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈచేనేతలను ఎవరైనా డూప్లీకేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన ఈపూరి భాస్కర్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కరోనా లాక్డౌన్లో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఐదు మగ్గాలు నిర్వహిస్తూ నూతన డిజైన్లతో పోచంపల్లి చేనేత చీరలు నేస్తున్నాడు. తనతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలోని మైక్రోబయాలజీ విభాగంలో తిరిగి ఉద్యోగంలో చేరాడు. చేనేత వృత్తిని వీడలేక ఉద్యోం చేస్తూనే కొనసాగిస్తున్నానని, కొత్తదనానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని భాస్కర్ అంటున్నాడు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాజాపేట : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాజాపేట మండలంలోని దూదివెంకటాపురంలో పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.తాగునీరు, రవాణా సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధిహామీ పనులు, మహిళా సంఘాలకు రుణాలు, రేషన్కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, రెవెన్యూ, విద్యుత్ తదితర పథకాలు అమలుతీరుపై చర్చించారు. కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ కల్లా విద్యుత్ సబ్ స్టేషన్, హెల్త్ సబ్సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలీవరీలు చేయించుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎదురయ్యే ఇబ్బందులను గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం గ్రామంలోనే బస చేశారు. గురువారం ఉదయం గ్రామంలో తిరిగి సమస్యలు తెలుసుకుంటానని, వనోమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు ఫ దూదివెంకటాపురంలో పల్లెనిద్ర -
సంప్రదాయ డిజైన్లకు ఫ్యాషన్ జోడించాలి
చేనేత రంగంలోకి వచ్చే యువతను ప్రోత్సహించాలి. ముఖ్యంగా నిఫ్ట్ ద్వారా నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించాలి. ఇక్కత్లో సంప్రదాయ డిజైన్లలో ఫ్యాషన్లను జోడించి వినూత్నంగా తయారు చేస్తే మార్కెటింగ్ అవకాశాలకు కొదవ ఉండదు. పోచంపల్లి ఇక్కత్ కు అంతర్జాతీయంగా పేరుంది. కానీ అందుకనుగుణంగా పబ్లిసిటీ లేదు. అందుకే ఎయిర్ హోస్టేస్ తప్పని సరిగా చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలి. దేశంలోని ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రధాన నగరాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్ను ప్రమోట్ చేయాలి. కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయంతో పాటు పట్టు చీరను ప్రభుత్వం ఇవ్వాలి. –సాయిని భరత్, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, పోచంపల్లి -
కృష్ణా తీరాన శైవ క్షేత్రం
000పెద్దమునిగల్లోని కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన మహాశివుడి విగ్రహంఫ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పెద్దమునిగల్లోని కృష్ణా తీరం ఫ నాలుగేళ్లుగా గంగా హారతి చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ కృష్ణా తీరంలో మహా శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామస్తులు విరాళాల రూపంలో రూ.50లక్షలు సేకరించి శివాలయాన్ని నిర్మించి, మహాశివుడి ప్రతిమ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ గంగా హారతి నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక వైపు కృష్ణా హారతి.. మరో వైపు మహా శివునికి ప్రత్యేక పూజలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కృష్ణా తీరంలోని వైజాగ్ కాలనీ అందాలు వీక్షించేందుకు వెళ్లే పర్యాటకులు పెద్దమునిగల్ కృష్ణా తీరాన గల మహాశివుని దేవాలయాన్ని సైతం దర్శించుకుంటుండడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. గంగా హారతి ఇక్కడి ప్రత్యేకత కార్తీక మాసంలో ప్రతి ఏడాది ఇక్కడ శివుడికి నిర్వహించే గంగా హారతి ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుంది. గ్రామస్తులందరం కలిసి సుమారు రూ.50లక్షలు విరాళాలు సేకరించి, మహాశివుడి దేవాలయాన్ని నిర్మించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. – కోతి యుగేంధర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ -
పోచంపల్లి చీరలకు మంచి డిమాండ్
పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్లు, కలర్స్ చాలా బెస్ట్గా ఉంటాయి. కుటీర పరిశ్రమలా ఇక్కడే చీరలను తయారు చేస్తారు. క్వాలిటీ, కలర్స్,డిజైన్లు మనసును హత్తుకునేలా ఉన్నాయి. ఇక్కడ కొత్తదనం ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. నేసే వారి దగ్గర చీరలు కొనుగోలుచేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. –ప్రవళిక, ఆన్లైన్ చీరల వ్యాపారి, మెహదీపట్నం, హైదరాబాద్ -
పొంగిన వాగులు
రెండు గంటల పాటు భారీ వర్షం ఫ అత్యధికంగా పోచంపల్లిలో 99 మి.మీ ఫ వాగులకు పోటెత్తిన వరద ఫ ముక్తాపూర్లో పాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లిన నీరు ఫ నేడు, రేపూ వర్షాలు ఫ పలు మండలాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలుభువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. పలు చోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అత్యధికంగా భూదాన్పోచంపల్లిలో 99.3 మి.మీ, మోటకొండూరు 63మి.మీ, చౌటప్పుల్ 49మి.మీ, భువనగిరి 47మి.మీ, బీబీనగర్ 20మి.మీ, వలిగొండ 14 మి.మీ, బొమ్మలరామారం 10 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 3.39 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని, ఈ సీజన్లో ఇదే అధిక వర్షపాతం. రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశ ఉండటంతో పలు మండలాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూదాన్పోచంపల్లి: మండల వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సుమారు రెండుగంటల పాటు వర్షం కురిసింది. దాంతో చిన్నేరకు వరద ఉధృతి పెరిగి మెహర్నగర్–జలాల్పురం మధ్య ఉన్న లోలెవల్బ్రిడ్జి పైనుంచి ప్రవహించింది. వరదనీటితో భారీగా గుర్రపుడెక్కాకు కొట్టుకొచ్చి బ్రిడ్జి పై చేరింది. ఫలితంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం మెహర్నగర్ గ్రామస్తులు జేసీబీతో బ్రిడ్జిపైన చేరిన గుర్రపుడెక్కను తొలగించారు. పంటపొలాలకు వచ్చే కాలువకు వరద ఉధృతి పెరిగి ముక్తాపూర్ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోకి నీరు చేరింది. పోచంపల్లి జెడ్పీస్కూల్ ఆవరణలో భారీగా వర్షపునీరు నిలిచి మడుగును తలపించింది. అలాగే కిచెన్ గార్డెన్ను వరదనీరు ముంచెత్తింది. మోటకొండూర్: వర్షానికి మోటకొండూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు, కాటేపల్లి, చాడ, కొండాపూర్ గ్రామాల పరిధిలో బిక్కేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో మోటకొండూర్ – సికింద్రనగర్, కాటేపల్లి–సికింద్రనగర్, చందేపల్లి–చాడ, కొండాపురం–కాల్వపల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు చుట్టూ తిరిగి గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఆత్మకూరు(ఎం): మండల పరిధిలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొరిపిరాల, కొరటికల్, పోతిరెడ్డిపల్లి, టి. రేపాక కాజ్వేల పైనుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.చెక్డ్యాంలు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నాయి. ఎంపీడీఓ రాములునాయక్, సూపరింటెండెంట్ లోకేశ్వర్రెడ్డి, ఎంపీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శి శేఖర్లు సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు. -
ఫ తరగతి గదుల్లోకి వర్షపు నీరు
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ డంపింగ్మోత్కూరు : మోత్కూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కొంత మంది ట్రాక్టర్ల యజమానులు ఇసుకను అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. పాటిమట్ల గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల కోసం సదర్శాపురం బిక్కేరు నుంచి ఇసుకను తీసుకువచ్చేందుకు తహసీల్దార్ అనుమతులు పొంది వాటికి అదనంగా తరలిస్తూ రహస్య ప్రాంతాల్లో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇసుకను రాత్రి వేళల్లో లారీల ద్వారా తరలించేందుకు పాటిమట్ల కొత్త కాలనీ వద్ద ఇసుక డంపింగ్ చేశారని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాటిమట్ల, సదర్శాపూర్ గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలుచౌటుప్పల్ : మండల పరిఽధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో బుధవారం బస్సు ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఏపీకి చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వ్యక్తి అదృశ్యంచౌటుప్పల్ : చౌటుప్పల్లో బుధవారం వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన పాశం వంశీ(40) అనారోగ్యానికి గురవడంతో చికిత్స నిమిత్తం సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందిన మరుసటి రోజు మంగళవారం చౌటుప్పల్లోని తన అత్తగారి ఇంటికి వెళ్లాడు. అదే రోజు తెల్లవారుజామున బాత్రూమ్ కోసమని వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో అతడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. టాస్క్ఫోర్స్ టీం దాడులుభువనగిరిటౌన్ : భువనగిరి టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనన్ టీం బుధవారం భువనగిరి పట్టణంలోని చేపట్టిన దాడుల్లో 70 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిని సమాచారం మేరకు భువనగిరి పట్టణంలోని బ్రహ్మణవాడ నివాసం ఉంటున్న కాసీం షేఖ్ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఖాసీం షేఖ్ గంజాయిని వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకువచ్చిన భువనగిరిలో విక్రయించే వాడని పోలీసులు గుర్తించారు. అతడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ రాధాకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు శ్రీనివాస్, టీం బృందం నర్సిరెడ్డి, దుర్గయ్య, లింగస్వామి, నిహారిక, సురేష్ తనిఖీల్లో తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
భువనగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 7.10 గంటలకు బీబీనగర్కు చేరుకుంటారు. 7.30 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం గుట్టలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ నివాసానికి వెళ్లనున్నారు. ఆ తరువాత చేనేత దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్టలో చేనేత సహకార సంఘంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. 11.45 గంటలకు భువనగిరికి వస్తారు. పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగే జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవతంం చేయాలని కోరారు. యాదగిరి క్షేత్రంలో సీసీ కెమెరాల పరిశీలన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నాయుడు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అంతకుముందు ఆలయ ఈఓ వెంకట్రావును కలిసి భక్తులు, ఆలయ భద్రతపై చర్చించారు. ఆయన వెంట పట్టణ సీఐ భాస్కర్, ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. నేడు పోచంపల్లికి దత్తాత్రేయ రాకభూదాన్పోచంపల్లి: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భూదాన్పోచంపల్లికి రానున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత సహకార సంఘం భవనంలో చేనేత కార్మికులతో ముఖా ముఖి సమావేశం నిర్వహించనున్నారు. అదే విధంగా కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పో చంపల్లి చేనేత సంఘం నాయకులు తెలిపారు. గుట్టలో ఫుడ్ ఫెస్టివల్ యాదగిరిగుట్ట: వంద రోజుల ప్రణాళికలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక అంగడిబజార్లో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మహిళా సంఘాలు, మెప్మా సిబ్బంది, వీధి వ్యాపారులు ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు హాజరై వంటకాలను రుచి చూశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, అధికారులు ఉన్నారు. -
నారుమడిపై కలుపు మందు పిచికారీ
నడిగూడెం : మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన గుండు సుభద్ర వ్యవసాయ క్షేత్రంలోని వరి నారుమడిపై గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారు. దీంతో ఆమె బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్.చంద్రశేఖర్, డాక్టర్ సంధ్యారాణిలను పిలిపించి, నారుమడిని పరిశీలించి, పొలంలోని నారు, మట్టి నమూనాలు సేకరించినట్లు ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్, ఏఈఓ ఉప్పయ్య ఉన్నారు. ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు నమోదుమునగాల: మునగాల మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చంద్రమౌళి చేసిన చికిత్స వికటించడంతోనే బరాఖత్గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు(35) మృతిచెందాడని ఆయన సోదరుడు వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ బుధవారం తెలిపారు. వెంకటేశ్వర్లు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా అతడి భార్య శిరీష మంగళవారం మండల కేంద్రంలోని ఆర్ఎంపీ వైద్యుడు చంద్రమౌళి క్లినిక్కు చికిత్స నిమిత్తం తీసుకువచ్చింది. చికిత్స పొందుతుండగా వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో ఆయన సోదరుడు వీరబాబు సాయంతో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మునగాలతో పాటు మృతుడి స్వగ్రామమైన బరాఖత్గూడెంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచింతపల్లి: అప్పుల బాధతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చింతపల్లి మండల పరిధిలోని వింజమూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వింజమూర్ గ్రామానికి చెందిన భీనమోని మహేందర్ (35)గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు డ్రైవర్ గా చేస్తూ జీవనం సాగించేవాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు. దిక్కుతోచని స్థితిలో గత నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. బంధువులు గమనించి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
ఊరంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు
నడిగూడెం: కాలానుగుణంగా వ్యవసాయంలో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడంతో పాటు కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విత్తనాలు వేసే దగ్గర నుంచి ఎరువుల వాడకం, కలుపు తీయడం, పంట కోసే వరకు ఒక్కో రైతు ఒక్కో విధంగా వ్యవసాయం చేస్తున్నారు. కానీ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపుంర గ్రామ రైతులు మాత్రం అందుకు భిన్నం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రామాపురం రైతులు వరి సాగు భిన్నంగా చేపట్టారు. దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా చల్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఊళ్లోని రైతులంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. రామాపురంలో బోర్లు, బావులు, సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా కొమరబండ మేజర్ కాల్వ, ఆర్–9 ఎత్తిపోతల పధకం ద్వారా సాగునీటి సౌకర్యం ఉంది. ఉన్న నీటి వనరులతో ఏకంగా ఆ ఊరంతా దాదాపు 3500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ విధానంలో వారం రోజుల ముందుగానే పంట కోతకు వస్తుందని, నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు రూ.2500 నుంచి రూ.3500 వరకు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఈ విధానంలో ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో కాండం ధృడంగా పెరుగుతుందని, రైతుకు ఇష్టమైన ఏ రకమైనా సాగు చేసుకోవచ్చని, నీటి యాజమాన్యం కూడా చాలా సులువు అని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడెకరాల్లోనూ వెదజల్లే పద్ధతిలో.. మూడెకరాల్లో వరి సాగు చేపట్టాను. అది కూడా వెదజల్లే పద్ధతిలో నేరుగా వరి విత్తనాలు చల్లాను. దీంతో విత్తన మోతాదు, నారు పెంచే ఖర్చులు, నాట్లు వేసే ఖర్చులు తగ్గాయి. దాదాపు రూ.3000 వరకు ఆదా అయ్యాయి. కూలీల సమస్య కూడా లేదు. – మారిశెట్టి నర్సింహారావు, రైతు, రామాపురం వెదజల్లే పద్ధతి చాలా సులువు రోజురోజుకూ వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ముందుకు వెళ్లాఇ. దమ్ము చేసిన తర్వాత నేరుగా పొలంలో విత్తనాలు వెదజల్లడం వలన మొక్క ధృడంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కూలీల సమస్యను కూడా అధిగమించవచ్చు. – రాయపు దేవప్రసాద్, మండల వ్యవసాయాధికారి, నడిగూడెం ఫ భిన్నంగా ఆలోచించిన నడిగూడెం మండలం రామాపురం గ్రామ రైతులు ఫ పెట్టుబడి ఖర్చులు తగ్గి కూలీల కొరత లేదంటున్న అన్నదాతలు -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావుతో కలసి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు నిర్వహిస్తున్నందున అందుకు అనుగుణంగా వేదిక, వీఐపీలు, అధికారులకు, ఇతరులకు అనుకూలంగా సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం పాల్గొన్నారు. రసాయన, ఔషధ ఫ్యాక్టరీలు తనిఖీ చేయాలి జిల్లాలోని అన్ని రసాయన, ఔషధ ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా ఫైర్ ఆఫీసర్, ఇండస్ట్రీస్ ఆఫీసర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పాశ మైలారం ప్రాంతంలో జూన్లో జరిగిన భారీ విస్పోటన ఘటనకు గురైన తర్వాత భద్రతా సమస్యలపై చర్చించారు. జిల్లాలోని పరిశ్రమ పురోగతిని సమీక్షించేందుకు 19వ తేదీన రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ భువనగిరి కలెక్టర్ హనుమంతరావు -
విద్య నేర్పుతూ.. కళను పంచుతూ..
తిప్పర్తి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు తనకున్న కళను విద్యార్థులకు పంచుతున్నాడు తిప్పర్తి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జల్లెల వెంకటేశ్వర్లు. చిత్రలేఖనం ద్వారా అర్థమయ్యే రీతిలో విద్యా బుద్ధులు నేర్పించడంతోపాటు, యోగా, కోలాటం తదితర రంగాల్లో విద్యార్థులకు మెళకువలు నేర్పుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. గత 24 సంవత్సరాల సర్వీసులో ఇప్పటి వరకు మూడు పాఠశాలల్లో పనిచేశారు. ప్రథమంగా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామం నుంచి తన ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. అక్కడ నుంచి అనుముల మండల కుపాస్పల్లిలో చేశాడు. ప్రస్తుతం తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 27 పాఠశాలలో చిత్రాలు గీశారు. తాను పనిచేసిన పాఠశాలలోనే కాకుండా ఇతర పాఠశాలలకు కూడా ఆహ్వానం మేరకు వెళ్లి చిత్రాలు గీశారు. 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు. రాష్ట్ర కార్టూన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన గీసిన చిత్రాలు పాఠ్యపుస్తకాల్లో ప్రచురితమయ్యాయి. పీవీ నర్సింహరావు శత జయంతి సందర్భంగా ఆయన గీసిన చిత్రానికి 2023లో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అవార్డు అందుకున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర్లు గీసిన చిత్రాలు ఆస్ట్రేలియాలో తెలుగు అసోసియేషన్ రూపొందించిన 2024 క్యాలెండర్లో ప్రచురితమయ్యాయి. నా కళను విద్యార్థులకు పంచుతున్నా నాకు చిన్నతనం నుంచి చిత్రలేఖనం ఎంతో ఇష్టం. నేను పనిచేస్తున్న పాఠశాలతో పాటు వేరే పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చిత్రాలను గీశాను. రాజకీయ నాయకులు, దేశ నాయకులు చిత్రాలను గీసి వారికి బహుమతులుగా అందజేశాను. – వెంకటేశ్వర్లు, తిప్పర్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఫ విద్యార్థులకు చదువుతోపాటు చిత్రలేఖనం, యోగా, కోలాటంలో శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయుడు -
ప్రపంచ చెస్ చాంపియన్ ఆనంద్ను కలిసిన కరుణాకర్రెడ్డి
నల్లగొండ టూటౌన్: ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథ్ ఆనంద్ను జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డి బుధవారం చైన్నెలో కలిశారు. చైన్నెలో జరిగిన చెస్ ఎగ్జిబిషన్ నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో చెస్ క్రీడాకారుడి పేరు మీద స్టేడియం ఏర్పాటు చేయడం అభినందనీయమని, త్వరలోనే తాను స్టేడియం సందర్శిస్తానని ఆనంద్ చెప్పినట్లు కరుణాకర్రెడ్డి తెలిపారు. ఫ్లైఓవర్కు పగుళ్లు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠద్వారం వరకు వేసిన ఫ్లైఓవర్కు పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్డు విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఫ్లైఓవర్ను నిర్మించింది. ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి గాంధీ నగర్కు వెళ్లే దారిలో స్లాబ్కు పగుళ్లు రావడంతో ఆర్అండ్బీ అధికారులు దృష్టి పెట్టి, ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
ఆత్మకూరు(ఎం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేలా సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులు ఉంటే గుర్తించి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారికి మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములునాయక్, ఎంపీఓ పద్మావతి, సూపరింటెండెంట్ ఎలిమినేటి లోకేశ్వర్రెడ్డి, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు. -
అక్రమాలపై కొనసాగిన విచారణ
సాక్షి,యాదాద్రి: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం, ఎన్ఫోర్స్మెట్ అధికారులు చేపట్టిన విచారణ బుధవారం మూడో రోజు కొనసాగింది. కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. వలిగొండ మండలం సంగెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో లావాదేవీలకు సంబంధించిన రికార్డులను విచారణ అధికారులు పరిశీలించారు. ట్రక్షీట్లు, రైతులకు బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రిజస్టర్ జిరాక్స్ ప్రతులు తీసుకున్నారు. ట్రక్ షీట్లలో రైతుల పేర్ల మార్పు, చెల్లింపులు తదితర వాటిపై సివిల్ సప్లై కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని విచారించారు. అలాగే బీబీనగ్ మండలంలోని రుద్రవెళ్లి, చినరావులపల్లి, రాఘవాపురంతో పాటు మరికొన్ని గ్రామాల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగిన కొనుగోళ్ల వివరాలు సేకరించారు. సీఎంఆర్పైనా..కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేశారు. సీజన్ వారీగా మిల్లర్లకు అప్పగించిన ధాన్యం, మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చిన సీఎంఆర్ వివరాలు సేకరించారు. ఫ సీఎంఆర్, ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై రికార్డుల పరిశీలన -
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
రోడ్డ ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ‘వరలక్ష్మి’ సెల్ఫీలకు ఆహ్వానంశ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం జరుపుకునే మహిళలూ.. మీ ఫొటోలను ‘సాక్షి’ పత్రికలో చూసుకోవాలను కుంటున్నారా.. మీరు పూజలో కూర్చున్న ఫొటో సెల్ఫీ తీసి ఈ కింద నంబర్కు వాట్సప్ చేయండి. శనివారం సంచికలో ప్రచురిస్తాం. లేటెస్ట్ సెల్ఫీ ఫొటోతో పాటు మీ పేరు, చిరునామా కూడా పంపాలి. - 9లో80962 93702సెల్ఫీ పంపాల్సిన వాట్సప్ నంబర్ -
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ?
జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి పరీక్షించారు. అతను మద్యం తాగినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. అయితే ఆ సమయంలో బైక్తోపాటు అతని సెల్ఫోన్ను కూడా లాక్కొని పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడున్న హోంగార్డు, మరో కానిస్టేబుల్ మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతని మరణానికి కారణం పోలీసుల దురుసు ప్రవర్తనేనని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. విచిత్రం ఏంటంటే.. ఆ వ్యక్తి తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేశారు.చింతపల్లి మండలం కూర్మేడ్ గ్రామంలో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటూ టీవీ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్ యాకయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎదుటి వారితో కుమ్మకై ్క భూవివాదం సెటిల్ చేసుకోవాలంటూ తమ వేధిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఉన్నా పోలీసుల సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గతేడాది శాలిగౌరారం ఎస్సైపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదంలో పోలీసుస్టేషన్కు వెళ్లిన మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైపై ఎస్పీ విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్లీ పోలిసింగ్ గాడి తప్పుతోంది. కొందరు పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. బాధితుల ఫిర్యాదులతో బయటకు వస్తున్న సంఘటనలు కొన్నే. పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు, సెటిల్మెంట్లు చేస్తూ దండుకుంటున్న వారు కొందరైతే, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. అదీ చాలదన్నట్లు ఇంకొందరైతే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సస్పెండ్ చేయడం, ఎస్పీ కార్యాలయాలకు అటాచ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. పైగా రాజకీయ పలుకుబడితో కొద్దిరోజుల్లోనే తిరిగి పోస్టింగ్ పొందుతున్నారు.ముడుపులే లక్ష్యంగా దందాలుకొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రాజకీయ నేతల అండదండలతో అవినీతి దందా కొనసాగిస్తున్నారు. ఏదైనా కేసు విషయంలో పోలీసు స్టేషనన్కు వెళితే చాలు న్యాయ అన్యాయాలు పట్టించుకోకుండా, ముడుపులు ముట్టజెప్పిన వారికి వంతపాడుతూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు ఎదురు తిరిగిన వారిపై చేయి చేసుకోవడం బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులను పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని ముసిపట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్లో బంధించి చితకబాదడమే కాకుండా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైనా చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.చర్యలు చేపడుతున్నా తీరు మారట్లే..⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంధ్యకు యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని మరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే ఎస్సై తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మే నెల 20వ తేదీన ఆమె మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో మృతురాలి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఎస్సైని బదిలీ చేశారు.⇒ సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థ సారధి రూ. 16లక్షలు లంచం డిమాండ్ చేసి మే 12న ఏసీబీకి పట్టుబడ్డారు.⇒ నూతనకల్ మండలం మిర్యాలలో చక్రయ్యగౌడ్ హత్య కేసులో అప్పటి డీఎస్పీ డబ్బులు తీసుకొని నిందితులను ప్రోత్సహించడంతో పాటు హత్య కేసులో పాల్గొన్న నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని కాదని తుంగతుర్తి సీఐకి బాధ్యతలు అప్పగించడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీని డీజీపీ ఆఫీస్కు, సీఐని ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు.⇒ నూతనకల్ పోలీస్ స్టేషనన్లో పనిచేసిన ఎస్ఐ వి.ప్రవీణ్కుమార్ అదే పోలీస్ స్టేషనన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను లైంగికంగా వేధించడంతో సదరు మహిళా కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ ప్రవీణ్కుమార్ను శనివారం డీఐజీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.⇒ నేరేడుచర్ల మండలం మేడారంలో ఓ భూవివాదంలో తమ హత్యకు కుట్ర చేశారంటూ ఒక వర్గం వారు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మరోవర్గం వారిపై నేరేడుచర్ల ఎస్సై రవీందర్నాయక్ కేసు నమోదు చేసి స్టేషన్కి పిలిపించి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆరోపించారు. అంతేకాదు అదే మండలంలోని కందులవారిగూడెంలో భూవివాదంలో ఎస్సై రవీందర్నాయక్ ఒక వర్గం వారిని విచారణ పేరుతో బాధితులను కొడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. విచారణ పేరుతో ఎందుకు కొడుతున్నారని అడిగితే తమపైనా దురుసుగా ప్రవర్తించారంటూ స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.⇒ గతేడాది భూవివాదంలో గుర్రంపోడు మండలంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో ఎదుటివారితో కుమ్మకై ్క సూసైడ్ కేసుగా నమోదు చేశారు. ఆ కేసును ఎస్పీ శరత్చంద్రపవార్ విచారణ జరిపించారు. ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఆ తరువాత సీఐపైనా విచారణ జరిపించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొట్టిన విషయంలో సీఐపై విచారణ జరిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.వివాదాల కేంద్రంగా చింతపల్లిచింతపల్లి మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదంలో జోక్యం చేసుకున్నారు. ఆ కేసులో ఓ వృద్ధున్ని పోలీసు స్టేషనన్కు తీసుకువచ్చి కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆ వృద్ధుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వృద్ధునికి గుండెపోటు వచ్చిందని, పోలీసులు కొట్టినందున ఆయన చనిపోలేదని, గుండెపోటు కారణంగానే అతను చేనిపోయాడని తేల్చారు. అయితే సదరు ఎస్సైని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయినా కొద్దినెలలకే రాజకీయ పలుకుబడితో ఆయన మరో కీలకమైన పోస్టింగ్ తెచ్చుకోగలిగారు.డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసుల అత్యుత్సాహంపోలీసుల అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణ కేంద్రాల్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగినా, తాగకపోయినా తనిఖీల సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనంతోపాటు సెల్ ఫోన్లు లాక్కోవడం, ఇష్టానుసారంగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నిబంధనల ప్రకారం ఏం చేయాలన్నది కాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
మంత్రిపదవి ఇస్తరా.. ఇవ్వరా మీ ఇష్టం: రాజగోపాల్రెడ్డి
సంస్థాన్ నారాయణ పురం: ‘ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచు కుంటా.. వారి కోసం ఎంత దూరమైనా పోతా.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తా’ అని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంగళవారం విద్యుత్ సబ్సేష్టన్లను ప్రారంభించారు. అనంతరం రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నేను మాట్లాడితే మంత్రిపదవి రాలేదు కాబట్టే మాట్లాడుతున్నానని కొందరు ఆరోపిస్తున్నారు. మంత్రిపదవి కావాలనుకుంటే నేను ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేవాడిని. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివద్ధి కోసమే నేను ఇక్కడి నుంచి పోటీచేశాను. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. అదష్టం ఉండి నాకు పెద్ద పదవి వస్తే ..అది మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుంది. పైరవీలకు పోయి, దోచుకొనేటోడిని కాను. రాజకీయాలు అడ్డం పెట్టుకొని వచ్చి రూ.వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి. రాజగోపాల్రెడ్డికి ప్రజలు కావాలి..వారి అభివద్ధి, సంక్షేమం కావాలి. ప్రజల కోసం పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన. మీరు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇస్తారా.. ఇవ్వరా మీ ఇష్టం, నేను సీనియర్ను కాబట్టి..తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన జూనియర్లకు పదవులు ఇచ్చారు. మీరు ఎంపీని గెలిపించమంటే గెలిపించాను. పార్టీలోకి రమ్మంటే, పార్టీని నమ్ముకొని వచ్చినా. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి బతిమిలాడే మనసు చంపుకొని దిగజారే రకం కాదు. అది బతికుండగా కాదు. నా వెనకాల ప్రజలు ఉన్నారు. నాకు కావాల్సింది ప్రజలు.. వాళ్ల బాగోగులు, నియోజకవర్గ అభివద్ధి. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. లేకపోతే ప్రజల మధ్యనే ఉంటా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా’అని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఏదైనా ప్రజల కోసమే..‘పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ల దగ్గరకు తీసుకొచ్చిన. నేను రాజీనామా చేసి.. 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల వద్దకు తీసుకొచ్చినాను. అవసరమైతే అంత దూరమైనా పోతా. నేను భయపడను. ఏదైనా మంచి పనిచేస్తే మీ కోసం చేస్తాను. త్యాగమైనా, పోరాటమైనా మీరు తలదించుకొనే పని ప్రాణం పోయినా చేయను. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి రూ.5వేల కోట్ల నిధులు అభివద్ధికి తీసుకొని పోతే నాకు నిద్ర పట్టలేదు. పదవి లేకున్నా పైసలు మునుగోడు నియోజకవర్గ అభివద్ధికి రావాలి. ఈ విషయంలో రాజీపడేది లేదు’అని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, నాయకులు కరంటోతు శ్రీనివాస్నాయక్, గుత్త ఉమాదేవి, ప్రేంచందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం దిగమింగారు!
సాక్షి, యాదాద్రి : ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. సీఎంఆర్ ఇవ్వాల్సిన పలువురు మిల్లర్లు చేతులెత్తేయడం, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. ఈనేపథ్యంలో సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ వలిగొండ మండలం సంగెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో బోగస్ రైతుల పేరుతో ట్రక్ షీట్తో ధాన్యం తూకం వేయకుండానే మిల్లుకు ఎగుమతి చేసినట్లు రికార్డు చూపించారు. అధికారుల విచారణలో రూ. 4.64 లక్షల దుర్వినియోగం బయటపడింది. ఇందులో 4.11 లక్షలు రికవరీ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరికొన్ని కొనుగోలు కేంద్రాలు రైతుల వద్ద రూ.1800 నుంచి రూ.2 వేల వరకు కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఇందులో మిలర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. అదేవిధంగా జిల్లాలోని పీఏసీఎస్ రుద్రవెళ్లి, చిన్నరావులపల్లి, ఆలేరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో ప్రతియేటా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. సీఎంఆర్ టెండర్ ధాన్యం ఎగవేత 2022–23 యాసంగికి సంబంధించి 4,10,911 మెట్రిక్ టన్నులు ధాన్యం మిల్లులకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 1,86,180 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి మిల్లులకు అప్పగించింది. అయితే ఇందులో మిల్లులు ఆ ధాన్యాన్ని బహిరంగంగానే విక్రయించారు. దీంతో రెండేళ్లుగా రికవరీ చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఆయా మిల్లులకు సీఎంఆర్ ఇవ్వమని ముందుగా ప్రకటించి ఆ తర్వాత యథావిధిగా ధాన్యం కేటాయించారు. టెండర్ ధాన్యం ఇంకా ప్రభుత్వానికి 32,314 వేల ఽమెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ మిల్లుల వద్ద ఇందుకు సంబంఽధించిన ధాన్యం లేదు. 2024–25 వానాకాలం సీజన్లో 2.22,444 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తే ఇందులో మిల్లర్ల నుంచి ఇప్పటివరకు 48.135 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మాత్రమే వచ్చింది. ఇంకా 1.02, 458 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉంది. 2024– 25 యాసంగి సీజన్లో 3,76,363 మెట్రిక్ టన్నుల ధాన్నాన్ని మిల్లులకు ఇచ్చారు. ఇందులోంచి 1.92, 611 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ రావాల్సి ఉంది. ధాన్యం దిగుమతి చేసుకున్న 25 మిల్లులు కిలో సీఎంఆర్ కూడా ఇవ్వని జాబితాలో ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్ వలిగొండ : వలిగొండ మండలం సంగెంలోని వలిగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై యుగంధర్ మంగళవారం తెలిపారు. సివిల్ సప్లయ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కొనుగోలు కేంద్రంలో ట్యాబ్ ఆపరేటర్గా పనిచేస్తున్న పబ్బతి శేఖర్, ట్యాబ్ ఆపరేటర్ అసిస్టెంట్ కాసుల బాలకిషన్ను అరెస్ట్ చేసి రామన్నపేట న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఫ సీఎంఆర్ ఇవ్వడంలో చేతులెత్తేసిన పలువురు మిల్లర్లు ఫ ధాన్యం కేంద్రాల్లో చేపట్టిన కొనుగోళ్లలో వెలుగుచూసిన అక్రమాలు ఫ విచారణ చేస్తున్న సివిల్ సప్లయ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫ వలిగొండ పీఏసీఎస్ కేంద్రంలో ట్యాబ్ ఆపరేటర్తోపాటు, ఆయన అసిస్టెంట్ అరెస్ట్ రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు చేసినా.. 2022–23వానాకాలంలో గుండాల మండలం అనంతారంలోని ఎల్ఎన్ రెడ్డి బిన్ని రైస్ మిల్లుకు కొనుగోలు కేంద్రాల నుంచి 1975 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేశారు. సీఎంఆర్ ఇవ్వకుండానే 1715 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించకుండానే మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాని విలువ రూ.4.18 కోట్లు. అధికారులు మిల్లు యజమానిపై రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు చేశారే కాని ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. పోచంపల్లి మండలంలోని ముక్తాపూర్లో ఎల్ఎన్ ఆగ్రో రైస్ మిల్లులో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే వరి ధాన్యం మాయమైంది. -
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయొద్దని, ఎప్పటికప్పుడు అధికారులు ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని యాదగిరిపల్లిలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇళ్ల వచ్చాయని మున్సిపల్ కమిషనర్ లింగస్వామిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.. ఇంకా ప్రారంభించనివి ఎన్ని, ప్రారంభించకపోవడానికి కారణాలు ఏమిటని అడిగారు. యాదగిరిపల్లిలో స్లాబ్ దశలో పనులు జరుగుతున్న గుంటిపల్లి రేణుక ఇంటిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మేసీ్త్రలకు స్క్వేర్ ఫీట్కు రూ.300 కంటే ఎక్కువ ఇవ్వొద్దన్నారు. ఇటుక, సిమెంట్, స్టీల్ ఎక్కడ నుంచి ఎంత ధరకు తెచ్చుకుంటున్నారని ఆరా తీశారు. ప్రభుత్వమే ఇసుక ఉచితంగా ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, మున్సిపల్ అధికారులున్నారు. మహిళా సమాఖ్య భవనం పరిశీలనభువనగిరి టౌన్: కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణ దశలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనం పనులను కలెక్టర్ హనుమంతురావు మంగళవారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అక్టోబర్ వరకు పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిరాజాపేట : ీసజనల్ వ్యాధులపై అప్రమత్తంగా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ, సాధారణ డెలివరీల వివరాలు, రోగులకు అవసమైయ్యే మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించే విధంగా చూడాలని ఎంపీడీఓ నాగవేణికి సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్ ప్రవీన్కుమార్, ఆయూష్ డిస్పెన్సరీ డాక్టర్ చందన, సిబ్బంది తదితరులున్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
కాళేశ్వరంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్
భువనగిరి : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్రావు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లో పార్టీ నేతలు వీక్షించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని ఇతర మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు ప్రజెంటేషన్ విక్షించేందుకు తరలివచ్చారు. కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాయాల సంస్థ చైర్మన్ జడల అమరేందర్, మాజీ రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్ పాల్గొన్నారు. ఫ వీక్షించిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు -
తుది దశకు తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ప్రస్తుతం జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో తనిఖీలు జరుగుతున్నాయి. తనిఖీల ప్రక్రియ పూర్తి కాగానే పూర్తి వివరాలతో ఉన్నత అధికారులకు అందజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మనోహర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భువనగిరి: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు తుది దశకు చేరుకున్నాయి. గత నెలలో నిబంధనలకు విరుద్ధంగా మూడు అబార్షన్లు, ఒక చోట తల్లి, మరొక చోట శిశువు మృతి చెందడంతో అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేసేందుకు ప్రోగ్రాం ఆఫీసర్లతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గత నెల 20వ తేదీ నుంచి తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ అంశాలపై తనిఖీ జిల్లాలో ప్రస్తుతం 171 ప్రైవేట్ ఆస్పత్రులు, 80 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 70 శాతం వరకు పూర్తి కాగా డయాగ్నస్టిక్ సెంటర్లు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన 30 శాతానికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. తనిఖీల్లో గుర్తించిన అంశాలకు సంబంధించి నివేదికను జిల్లా వైద్యాధికారికి అందజేశారు. నివేదికలో చాలా వరకు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగానే నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు సమాచారం. రిజిస్ట్రర్ సమయంలో పేర్లు ఉన్న వారుకాకుండా మరొకరు వైద్య సేవలందించడం, బయోమెడికల్ వేస్ట్ మెనేజ్మెంట్ నిర్వహణ లేకపోవడం, ఆర్ఎంపీలు లేదా ఆయూష్ వైద్యుల ద్వారా వైద్య సేవలందించడం, శిక్షణ లేని పారామెడికల్ సిబ్బంది ఉండటం, వెలుతురు, గాలి, నీటి సౌకర్యం లేకుండా ఆస్పత్రుల నిర్వహణ, ఫైర్ సిస్టం లేకపోవడం వంటి వాటిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక వైపు తనిఖీలు.. మరో వైపు పైరవీలు ప్రత్యేక బృందాలు ఒక వైపు తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రుల వివరాలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీటి నిర్వాహకులు రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయడం ప్రారంభించారు. ఫోన్ చేసి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే వదిలేస్తారా.. సాధారణంగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకొకసారి ప్రత్యేక అధికారులు బృందం ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. అవసరమైతే సీజ్ చేస్తారు. అయితే వివిధ ప్రయత్నాలు చేసి ఆస్పత్రుల నిర్వాహకులు తిరిగి యథావిధిగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో గత నెలలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బృందాలు గుర్తించిన అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారా లేదా గతంలో మాదిరిగానే వదిలేస్తారా అని పట్టణ వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఫ ఇప్పటివరకు 70శాతం ఆస్పత్రుల్లో తనిఖీలు పూర్తి ఫ ఉన్నతాధికారులకు నివేదిక అందజేత -
కొనసాగుతున్న ఆలయ భూముల సర్వే
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భూములు, ఆస్తుల వివరాలను పటిష్టంగా ఉంచేందుకు చేపట్టిన డీజీపీఎస్ సర్వే కొనసాగుతోంది. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యోగానంద నిలయం, బస్టాండ్ ముందు గల దేవస్థానం స్థలంతో పాటు ఇతర భవనాలకు సంబంధించిన కొలతలు తీసుకుని సర్వే చేపట్టారు. ఈ సర్వేలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అఽథారిటీ, దేవస్థానం భూముల పట్ల అవగాహన ఉండేందుకు ప్రస్తుతం జూనియర్ సిబ్బందితో ప్రత్యేక కమిటీ వేసి శిక్షణ ఇస్తున్నామని ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. సుమారు 15మంది దేవస్థానం క్లరికల్ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారని తెలిపారు. -
నేడు జయశంకర్ జయంతి
భువనగిరి టౌన్: కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి సాహితీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నామని అధికారులు పాల్గొనాలని కోరారు. నేడు దూదివెంకటాపురంలో కలెక్టర్ పల్లె నిద్ర రాజాపేట : గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పల్లెల్లో రాత్రి బస చేయడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం అధికారులతో కలిసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటామని తెలిపారు. ఒకేరోజు 2.50 లక్షల మొక్కలు నాటుదాం భువనగిరి టౌన్ : వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒకే రోజు జిల్లాలో 2.50 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 20 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించగా.. ఇప్పటివరకు 14 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యిందని పేర్కొన్నారు. గురువారం ప్రతి గ్రామంలో 500 మొక్కలు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో 300 మొక్కల చొప్పున మొత్తంగా 2.50 లక్షల మొక్కలు నాటడం పూర్తి చేయాలని తెలిపారు. ఈమేరకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. దివ్యాంగుల పూరిగుడిసె పరిశీలనగుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో దివ్యాంగులైన బొంత ఎల్లయ్య, లక్ష్మి దంపతులు పూరి గుడిసెలో నివాసం ఉంటుండగా. వారి ధీనస్థితిపై సాక్షి దినపత్రికలో మంగళవారం ‘నీడ లేదు...గూడు ఇప్పించరూ’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన ఎంపీడీఓ దేవేందర్రావు బుధవారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. నివేదికను కలెక్టర్కు పంపిస్తామని తెలిపారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి మంద బాలలక్ష్మి ఉన్నారు. ప్రజా కళలు పోరాట ఆయుధాలురామన్నపేట: ప్రజా కళలు పోరాట ఆయుధాలు అని, అనేక ఉద్యమాలను కళాకారులే ముందుండి నడిపారని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, జానపద వీధి నాటకోత్సవాల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఈనెల 20, 21 తేదీల్లో రామన్నపేటలో జరగనున్న జానపద వీధి నాటకోత్సవాల సన్నాహక సమావేశంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. జానపద కళలను పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జానపద వృత్తికళాకారులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, కందుల హన్మంతు, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, కల్లూరి అంజయ్య, వనం ఉపేందర్, బోయిని ఆనంద్, కల్లూరి నగేష్, మేడి పృథ్వీ, గంటెపాక శ్రీకృష్ణ, నాగటి లక్ష్మణ్, మేడి ముకుందం తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడు అభివృద్ధి నా బాధ్యత
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంగళవారం 33/11 విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమన్నారు. లోఓల్టేజీ సమస్య లేకుండా నియోజకవర్గవ్యాప్తంగా మరో 10 సబ్స్టేషన్లు తీసుకురావడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఏడీ పద్మ, ఏఈ దివ్య, కరంటోత్ శ్రీనివాస్, గుత్త ఉమాదేవి, దోనూరి జైపాల్రెడ్డి, గుత్త ప్రేమ్చందర్రెడ్డి, జక్కలి ఐలయ్య, భిక్షపతి, భానుమతి, బుజ్జి, ఉప్పల లింగస్వామి పాల్గొన్నారు. గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య లేకుండా చేస్తా చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలోని ఎనగంటితండాలో నూతనంగా నిర్మించనున్న 11కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో కరెంట్ సమస్యలు లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ, నాయకులు వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
న్యూ మ్యాట్రిక్ టిల్ శారీ ఎంతో స్పెషల్
చండూరు: న్యూ మ్యాట్రిక్ టిల్ ఇక్కత్ విధానంలో చీర నేసి చండూరు మండల కేంద్రానికి చెందిన కర్నాటి సద్గురు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ స్పెషల్ ఇక్కత్ చీర నేసేందుకు ఐదు నెలల సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. డిజైన్ ఫైనల్ చేయడం, మగ్గంపై డిజైన్ నూలుపై సెట్ చేయడానికే రెండు నెలల సమయం పట్టిందన్నారు. 25 ఏళ్లుగా మగ్గం నేస్తున్నానని, తనకున్న అనుభవంతో కొత్త డిజైన్లతో చీరలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ చీర ధర రూ.25వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తరహా చీర నల్లగొండ జిల్లాలో తానొక్కడినే చేశానని, అంత ప్రత్యేకం కాబట్టే అవార్డుకు ఎంపికై ందని ఆయన తెలిపారు. సబ్సిడీ ముడి సరుకుల డిపో నల్లగొండ లేదా చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
● ఇబ్బందులు పడిన వాహనదారులుచౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట గ్రామంలో ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి నల్లగొండ వైపు నుంచి సిమెంట్ లోడ్తో హైదరాబాద్కు వెళ్తున్న లారీ తూప్రాన్పేట గ్రామంలో హైవేపై మరమ్మతులకు గురైంది. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ట్రాఫిక్ జాం కాకుండా వాహనాలను పంపించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోవడంతో మధ్యాహ్నం వరకు తూప్రాన్పేట గ్రామంలో హైదరాబాద్ వెళ్లే వైపు సుమారు 2 కి.మీ. మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని రోడ్డు పక్కకు తొలగించడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలిలాయి. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణంచివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బైక్ వస్తున్న కానిస్టేబుల్ ట్రాక్టర్ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్ తండా గ్రామానికి చెందిన ధరావతు సోమాని(55) సూర్యాపేట సబ్ జైలులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్పై సూర్యాపేటకు వెళ్తుండగా.. మార్గమధ్యలో బీబీగూడెం వద్ద మండల కేంద్రం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వెనుక నుంచి బైక్పై వస్తున్న సోమాని అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొని కిందపడ్డాడు. అదే సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న మరో బైక్ సోమాని పైనుంచి వెళ్లడంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. రైలు ఢీకొని వృద్ధురాలు మృతివలిగొండ: వలిగొండ మండలం ఏదుళ్లగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజపూర్కు చెందిన గుళ్ళని పోచమ్మ (90) ఏదుళ్లగూడెంలో తన బంధువుల ఇంటికి వస్తుండగా.. గ్రామ సమీపంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇటీవల కురిసిన వర్షానికి నీరు నిలిచి ఉండడంతో బ్రిడ్జి పైనుంచి రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
పదహారు ఆకృతులతో తేలియా రుమాల్పై..
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ పదహారు ఆకృతులతో తేలియా రుమాల్ అనే వస్త్రంతో చీర తయారుచేసి కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ చీర బంతిపూలు, రథం, త్రీడీ డిజైన్తో పాటు అనేక డిజైన్లతో కూడి ఉంటుంది. మడతలు పడకుండ మృదవైన పట్టును వాడినట్లు ఆయన తెలిపారు. రంగు వెలవని ఈ చీర తయారీకి రూ.75వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే చీరకు ఆయన జాతీయ చేనేత అవార్డు కూడా అందుకోనున్నారు. జాతీయ, రాష్ట్ర అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
నకిరేకల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 300మంది పోలీస్ సిబ్బంది కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తాటికల్ రోడ్డులోని ఎస్సీ కాలనీ, వడ్డెర కాలనీ, మొండివారి కాలనీల్లోని ఇళ్లను తనిఖీ చేశారు. ఉదయం 7 గంటల వరకు ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను, గంజాయి అనుమానితులను, వివిధ కేసుల్లో ఉన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కార్డెన్ సెర్చ్ ముగిసిన తర్వాత నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ నకిరేకల్కు చేరుకుని తాటికల్ రోడ్డులోని ఎస్సీ కమ్యూనిటీ హల్ నందు ఉంచిన పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ముందుస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగానే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలను సమన్వయం చేస్తూ శాంతిభద్రతలను కాపాడటం కోసం కార్డెన్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్డెన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని 130 బైక్లు, 10 ఆటోలు, మరో 120 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 8 మంది పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 18 మంది గంజాయి అనుమానితులను కూడా పట్టుకున్నామన్నారు. ముగ్గురు నేపాల్ దేశస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఒక షెడ్డులో 15 గోవులను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఆయా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం, చండూరు, నల్లగొండ ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల సీఐలు కొండల్రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, వివిధ మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. 300 మంది పోలీసులతో సోదాలు 250 ద్విచక్ర వాహనాలు స్వాధీనం గంజాయి అనుమానితుల అరెస్ట్ పాత నేరస్తుల గుర్తింపు -
కొత్త డిజైన్ అవార్డు తెచ్చింది
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొలను శంకర్ లెనిన్ డబుల్ ఇక్కత్ చీర తయారుచేశారు. లెనిన్ డబుల్ ఇక్కత్ చీర నేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ చీర 15 షేడులు, సున్నితమైన దారాలతో రంగు వెలిసిపోని చీర. ఈ చీర డిజైన్ కోసం సంవత్సరం కాలం పట్టిందని శంకర్ తెలిపారు. చీర తయారీకి రూ.50వేలు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన 30సంవత్సరాల అనుభవంలో ఎన్నో రకాల చీరలు తయారు చేశానని, కానీ అవార్డు కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఈ చీరకు దరఖాస్తు చేసుకోవడంతో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
మన చేనేత.. ఘనత
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు 13 మంది చేనేత కార్మికులు ఎంపికజాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేతలో విశేష ప్రతిభ కనబర్చిన కళాకారులను ప్రతి యేటా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సత్కరిస్తోంది. ఈ అవార్డుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పుసర్కరించుకుని హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చేతులమీదుగా వారు రూ.25వేల నగదు పురస్కారం, మెమొంటో, ప్రశంసా పత్రం అందుకోనున్నారు. జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా మడ్తాస్ ఇక్కత్ చీర భూదాన్పోచంపల్లి: పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు మంగళపల్లి శ్రీహరి వినూత్న డిజైన్లతో మడ్తాస్ ఇక్కత్ చీరను రూపొందించి ఉత్తమ వీవర్గా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది పాటు కష్టపడి 234 కొయ్యలు, రిపిట్ లేకుండా ఆరు వరుసల్లో వైట్ బేస్ చీరలో ప్రకృతి అందాలతో పరవశించి నృత్యం చేస్తున్న అంబారీ, నెమలిని రూపొందించారు. అంతేకాక మధ్యమధ్యన మన తెలంగాణ పండుగను ప్రతిబించేలా బతుకమ్మ, పద్మాల డిజైన్లను వేశారు. డిజైన్లు స్పష్టంగా కన్పించేలా వైట్ బేస్ చీరలో ఆనంద, బ్లాక్, మెరూన్, పసుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించారు. డిజైన్లును రూపొందించడం, వాటిని గ్రాఫ్పై గీయడం, అందుకనుగుణంగా చిటికి కట్టడం, మగ్గం నేయడం కోసం మూడు నెలలు కష్టపడినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఆయన నాలుగు మగ్గాలను పెట్టి నాలుగు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితంగట్టుప్పల్: గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు గుర్రం యాదయ్య గత 50 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. చేనేతలో కొత్త కొత్త డిజైన్లు తయారు చేస్తేనే మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుందని గుర్తించి.. తన భార్య జయమ్మ సహకారంతో పోచంపల్లి డబుల్ ఇక్కత్ మల్బరీ సిల్క్తో వైరెటీ చీర తయారు చేశారు. ఇందుకు గాను ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. నలభై ఏళ్ల అనుభవానికి గుర్తింపు వలిగొండ: మండలంలోని గొల్లపల్లికి చెందిన చేనేత కార్మికుడు చల్లమల్ల కృష్ణ కొండా లక్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. గత 40 ఏళ్లుగా చేనేత కళాకారుడిగా పనిచేస్తున్న ఆయన తెల్ల రుమాల్, డబుల్ ఇక్కత్ 100% కాటన్ చీరలు నేస్తున్నారు. తన అనుభవానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తనను కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన అన్నారు. అవార్డుకు ఎంపికై న కృష్ణను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు.డబుల్ ఇక్కత్ చీర నేస్తున్న చిట్టిప్రోలు ధనుంజయ్య త్రీడీ ఎఫెక్ట్తో రూపొందించిన చీర సంస్థాన్ నారాయణపురం:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామానికి చెందిన సామల భాస్కర్ ఎంపికయ్యారు. భాస్కర్ తన 33 సంవత్సరాల చేనేత అనుభవంతో త్రీడీ ఎఫెక్ట్ ఉండేలా కొత్త డిజైన్తో చీరను రూపొందించారు. సాధారణంగా ఒక చీరకు 30 మెట్లు ఉంటే.. భాస్కర్ 1450 మెట్లతో నెమలి దేవత ఆకృతులతో గ్రాఫిక్ డిజైన్తో రూపొందించారు. నిలువు, 4అచ్చెలతో ప్యూర్ సిల్క్ చీరను 10 నెలల్లో తయారు చేశారు. ఈ చీర తయారీకి 7 రంగులను వాడినట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య విజయలక్ష్మి సహకారంతో కొత్త చీరను రూపొందించానని, దానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని భాస్కర్ తెలిపారు. ఈ అవార్డుతో తమ చీరకు మార్కెటింగ్ ఏర్పడి తమ జీవనపాధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీర..చిట్యాల: చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు చిట్టిప్రోలు ధనుంజయ్య మగ్గంపై నేసిన పోచంపల్లి డబుల్ ఇక్కత్ తరహాలోని చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధనుంజయ్యకు అవార్డు రావటం పట్ల చిట్యాల మండలానికి చెందిన పలువురు పద్మశాలీలు హర్షం వ్యక్తం చేశారు. డిజైనింగ్లో ప్రతిభ గట్టుప్పల్: చేనేత చీరల డిజైనింగ్లో ప్రతిభ కనబర్చిన గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన గాజులు అనిల్ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు ఎంపికయ్యారు. ఆయన 2012 నుంచి పోచంపల్లి ఇక్కత్(జకార్డ్) చీరల బార్డర్లపై అన్ని రంగులతో డిజైన్లు వేస్తున్నారు. ఈ చీరలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అనిల్ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అనిల్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
చిన్నతనం నుంచే జీతమున్నా..
చండూరు: చండూరు మండల కొండాపురం గ్రామానికి చెందిన అవ్వారి రవీందర్ తయారు చేసిన ఇక్కత్ రాజ్కోట్ చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఇవి వేరే దేశాలతో పాటు రాజస్తాన్, అహ్మదాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మగ్గం పనిచేసే వారి వద్ద జీతం ఉన్నానని, ఆ తర్వాత బొంబాయికి వలస వెళ్లి అక్కడ పదేళ్లు ఉండి సాంచన్లు నడిపి తిరిగి కొండాపురం గ్రామం వచ్చినట్లు రవీందర్ తెలిపారు. కొత్తగా వచ్చే డిజైన్లను గమనించి చీరలు తయారు చేయడం తనకు అలవాటని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల కిందటే 5 మగ్గాలతో చీరలు నేయించినట్లు వివరించారు. ప్రసుత్తం తనకు 69 ఏళ్లని, ఇన్నేళ్లకు తనకు గుర్తింపు లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● మహిళ మృతి ● మరో ఇద్దరికి స్వల్ప గాయాలుచౌటుప్పల్ రూరల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామానికి చెందిన మద్దిరాల ప్రవీణ్కుమార్ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ.. నెల రోజుల క్రితం హైదరాబాద్కు బదిలీ అయ్యాడు. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో నివాసం ఉండడానికి ఇల్లు చూసుకున్నాడు. తన తల్లి గోవిందమ్మ(62), భార్య సుమతితో కలిసి అద్దె ఇంట్లో దిగేందుకు స్వగ్రామం చిరుకూరుపాడు నుంచి సోమవారం రాత్రి 9గంటలకు కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో మంగళవారం తెల్లవారుజామున చౌటుప్పల్ దాటిన తర్వాత బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ముందు సీట్లలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్, అతడి భార్య సుమతికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లులో కూర్చున్న ప్రవీణ్ తల్లి గోవిందమ్మకు ఛాతి భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మరిది మద్దిరాల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారరిపై ట్రాఫిక్జాం కావడంతో సీఐ మన్మథకుమార్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
మూడేళ్లు.. ముగ్గురు అన్నదమ్ములకు అవార్డులు
చండూరు: చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి శ్రీనివాసులు సహజ సిద్ధమైన రంగులతో డబుల్ ఇక్కత్ దుపట్టాను తయారు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు అన్న చిలుకూరి క్రిష్ణయ్య 2023లో, తమ్ముడు చిలుకూరి ధనుంజయ 2024లో కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ముగ్గురు అన్నదమ్ములు డబుల్ ఇక్కత్ పైనే ప్రావీణ్యం సంపాదించారు. మూడేళ్ల క్రితం వరకు రసాయన రంగులతో డబుల్ ఇక్కత్ వస్త్రాలు నేసినా ఆ తర్వాత నుంచి సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందుతున్నారు. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది. దుపట్టా తయారు చేసేందుకు రెండు నెలల సమయం పట్టిందని, శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై ముడి సరుకులు ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహిస్తే ఉత్పత్తిని పెంచి తక్కువ ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. -
108 డిజైన్లు.. 29 రంగులు
గట్టుప్పల్: ఎంతో శ్రమించి 108 డిజైన్లు, 29 రంగులతో చీరను తయారుచేశారు గట్టుప్పల్కు చెందిన కర్నాటి కృష్ణయ్య. ఆయన గత 40 ఏళ్లుగా చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేనేతలో కొత్తదనం సృష్టించాలనే తపనతో కృష్ణయ్య ఏడాది క్రితం 108 డిజైన్లు, 29 రంగులతో చీర తయారు చేయడం ప్రారంభించారు. నెలరోజుల క్రితం ఈ చీర తయారీ పూర్తయ్యింది. క్వాలిటీ, కలర్స్, డిజైన్స్ను పరిశీలించిన చేనేత శాఖ అధికారులు కృష్ణయ్యను కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేశారు. ఇన్నేళ్ల తన కష్టానికి సరైన గుర్తింపు దక్కడంతో కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం.. ఎంత దూరమైన పోతా’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.నాలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ఇంకా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. రాజగోపాల్రెడ్డికి ప్రజలు కావాలి. మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అది మీ ఇష్టం. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు. నాకన్నా చిన్నవారికి పదవులు ఇచ్చారు. మీరు ఎంపీ గెలిపించుకో అంటే గెలిపించాను. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు. మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయను’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. -
మూసీ ప్రాజెక్టుకు 1250 క్యూసెక్కుల వరద
కేతేపల్లి: హైదరాబాద్ నగరంతో పాటు ఎగురవన మూసీ పరీవాహక ప్రాంతాల్లో కురుసున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం వదర పెరిగింది. ఆదివారం సాయంత్రం 240 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం ఉదయానికి 1250 క్యూసెక్కులకు పెరిగింది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం నీటిమట్టం 642.90 అడుగులు ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 362 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 285 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.91 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
శ్రీశైలం దర్శనానికి వెళ్లొస్తూ..
శాలిగౌరారం: ట్రావెల్స్ వాహనంలో శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లొస్తూ.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్ట డంతో ఒకరు మృతిచెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద సోమవారం తెల్ల వారుజామున జరిగింది. స్థానిక ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం పత్తిపాక గ్రామ పంచాయతీ పరిధిలోని వినాయకతండాకు చెందిన 14 మంది తాపీమేసీ్త్రలు ట్రావెల్స్ వాహనంలో ఆదివారం శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం వీరు తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. డ్రైవర్ గుండెపాక నవీన్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సోమవారం తెల్లవారుజామున 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టాడు. దీంతో ట్రావెల్స్ వాహనం రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న బానోతు మంగీలాల్(47) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బానోతు రమేశ్, బానోతు లాలూ, భూక్య సర్వం, అంబోతు శ్రీను, గుగులోతు నరేశ్, భూక్య వీరన్కు తీవ్రగాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బానోతు పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ వాహనం ఒకరు మృతి, 13 మందికి గాయాలు -
బీటీ పత్తిని ఆశించే పురుగులు – నివారణ చర్యలు
పెద్దవూర: రైతులు బీటీ పత్తి సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించటం వలన అధిక దిగుబడులు సాధించవచ్చని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి. సందీప్కుమార్ సూచిస్తున్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సేంద్రియ ఎరువుల వాడటం, అధికారులు సిఫారసు చేసిన పురుగు మందులను వాడాలని ఆయన పేర్కొంటున్నారు. రసం పీల్చే పురుగులు – తొలి దశ(1 నుంచి 60 రోజులు): బీటీ పత్తి పంటలో తొలి దశలో రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు ఆశించకుండా విత్తన శుద్ధి చేయాలి. దీని వలన దాదాపు 30 రోజుల వరకు పురుగులను అరికట్టవచ్చును. విత్తన దుకాణాల్లో లభించే అన్ని రకాల అనుమతి పొందిన బీటీ వంగడాలు విత్తన శుద్ధి చేసినవే లభిస్తాయి. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూఎస్ లేదా థయామిథాక్సామ్ 70 డబ్ల్యూఎస్ మందులను ఒక కిలో విత్తనానికి 4 నుంచి 5 గ్రాముల వరకు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయకపోతే పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది. సేంద్రియ ఎరువులను విధిగా ఉపయోగించటం వలన నేల సత్తువ పెరుగుతుంది. అంతర పంటలైన సోయాచిక్కుడు, పెసర, మినుము, బొబ్బర, కొర్ర వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది కొంతవరకు రసం పీల్చు పురుగుల నియంత్రణకు దోహదపడతాయి. పూత పద్ధతి: తొలి దశలో ఆశించే పురుగులను అదుపు చేయటానికి కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. 3 పర్యాయాలు 30, 45 రోజులలో మోనోక్రోటోఫాస్ 1:4(ఒక భాగం మందు, 4 భాగాలు నీళ్లు) నిష్పత్తిలో వాడాలి. తిరిగి 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో(ఒక పాళ్లు మందు, 20 పాళ్లు నీరు) వాడాలి. కాండం, పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగు మందులు లేకుండా 70–80 రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. మందులను పిచికారీ చేయకపోవడం వలన తొలిదశలో మిత్ర పురుగుల సంతతి పెరిగి చీడపీడలను అదుపు చేయడంలో సహకరిస్తాయి. రసం పీల్చు పురుగుల నివారణకు 5శాతం వేపగింజల కషాయం వాడాలి. కాయ తొలుచు పురుగు 60 నుంచి 90 రోజుల పంట దశలో పత్తి పైరులో సాధారణంగా పూత ఏర్పడిన దగ్గరి నుంచి కాయ తొలుచు పురుగులు ఆశించటం మొదలవుతుంది. ముఖ్యంగా తలనత్త, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులు పంటను వివిధ దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఎకరంలో 50 శాతం మొక్కల్లో కనీసం ఒక్కొక్క మొక్కను ఒక గూడ కంటే ఎక్కువ నష్టపోతే (పురుగు చేసిన రంధ్రంతో విచ్చుకున్న గూడలు) 5శాతం వేపగింజల కషాయం పిచికారీ చేస్తే శనగపచ్చ పురుగు గుడ్లను, మొదటి దశ గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు. బీటీ క్రిమిసంహారక మందులను బీటీ వంగడాలపై వాడకూడదు. వృక్ష మందులైన వేపగింజల కషాయం 5 శాతం లేదా 0.5 శాతం వేపనూనె లేదా 0.2 నుంచి 0.5 శాతం పిచికారీ చేయవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి 1.0 మి.లీ. నోవల్యూరాన్ లేదా 1.0 మి.లీ. లూఫెన్యూరాన్ లేదా ఇమామెక్టీన్ బెంజోయోట్ను 0.5 మి.లీ. పిచికారీ చేయాలి. ఆశించు దశ: 90 నుంచి 120 రోజుల దశలో శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 90 రోజుల నుంచి బీటీ పత్తిలో గూడ, పిందెలలో ఉండే బీటీ ప్రోటీన్ స్థాయి క్రమేపి తగ్గుతూ ఉండటం వలన శనగపచ్చ పురుగుల నియంత్రణ తగ్గుతూ ఉంటుంది. ఈ దశలో ఏవైనా గొంగళి పురుగుల నష్టపరిమితి స్థాయి గమనిస్తే 1 లేదా 2 పర్యాయాలు క్రిమి సంహారక మందులు ఉపయోగించటం ద్వారా పురుగును అదుపు చేయవచ్చు. థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ. ను పిచికారీ చేయాలి. రెండోసారి పిచికారీగా సైపనోసాడ్ 0.3 మి.లీ. లేదా ఇండాక్సకార్బ్ 1.0 మి.లీ. చొప్పున ఒక లీటరు నీటికి కలిపి ఏదో ఒక మందును మార్చి మార్చి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు సిఫార్సు చేసిన పురుగు మందులను 3 మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2.0 మి.లీ. ఫిప్రోనిల్ లేదా .03 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెనిథియురాన్ లీటరు నీటికి కలిపి వాడాలి.గులాబీ రంగు, పిండినల్లి పురుగు120 రోజుల తర్వాత పత్తి పంటలో గులాబీ రంగు పురుగు, పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు నష్టపరిమితి స్థాయిని గమనించి పత్తి పంటలో అక్కడక్కడా కొన్ని కాయలను కోసి తెరిచి చూడాలి. పది కాయలకు ఒక లార్వా ఉంటే నష్టపరిమితి స్థాయి అధికంగా ఉన్నట్లు గుర్తించాలి. అవసరం మేరకు పంట చివరి దశలో ఒకటి లేదా రెండు పర్యాయాలు సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారీ చేయడం ద్వారా గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. అదేవిధంగా పెద్ద గొంగళి పురుగులను ఏరి నాశనం చేయాలి. పిండినల్లి నివారణకు ఎసిఫేట్ లేదా ప్రొఫెనోపాస్ మందులను వాడాలి. పంట విత్తిన వెంటనే 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించినట్లయితే ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. బుట్టలో 8 తల్లి రెక్కలు పడినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
వలిగొండ: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. పహిల్వాన్పురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు వట్టిపెల్లి సుధాకర్గౌడ్(55) రోజుమాదిరిగా సోమవారం కల్లు గీయడానికి గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని గ్రామస్తులు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. బైక్ అదుపుతప్పి.. తుర్కపల్లి: బైక్పై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తుర్కప్లలి మండలం రుస్తాపూర్ గ్రామ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన దేవరకొండ రాకేష్(28) భువనగిరి పట్టణ కేంద్రంలోని యాక్సిస్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. సోమవారం తన సహ ఉద్యోగి హరీష్తో కలిసి తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కస్టమర్ను కలిసి అతడితో మాట్లాడి తిరిగి భువనగిరికి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ పరిధిలో అకస్మాత్తుగా గేదె రోడ్డుకు అడ్డంగా రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. బైక్పై వెనుక కూర్చున్న రాకేష్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బైక్ నడుపుతున్న హరీష్ హెల్మెట్ ధరించడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య శ్రీజ ఇచ్చని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తక్యుద్దీన్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు నార్కట్పల్లి: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ చౌరస్తా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన అర్ధం కృష్ణవేణి నల్లగొండ చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతుండగా బస్టాండ్ వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను 108 వాహనంలో కామినేని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జూదరులపై కేసు నమోదు చిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామ శివారులోని తిరుమలనాథస్వామి ఆలయం గుట్టపై కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద రూ.5850 నగదు, మూడు బైక్లు, స్కూటీ, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: అతివేగంగా వచ్చిన లారీ రోడ్డు పక్కన నిల్చున్న యువకుడిని ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్చౌక్ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన కన్నెకంటి నరసింహాచారి(31) పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెయింటింగ్ పనులు ముగించుకుని రాత్రి 11:15 గంటలకు రాజీవ్చౌక్ సమీపంలో రోడ్డు పక్కకు తన బైక్ను పార్కింగ్ చేసి నిల్చున్నాడు. అదే సమయంలో గుంటూరు నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కన నిల్చున్న నరసింహాచారిని ఢీకొట్టింది. దీంతో అతడి తల చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి లారీని అడ్డగించారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నరసింహాచారి తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా.. అతడి మేనమామ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గోశాల విస్తరణకు స్థల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన గోశాల విస్తరణకు గాను టెంపుల్ సిటీపై స్థలాన్ని ఈఓ వెంకట్రావ్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం ఆలయ గోశాలను మల్లాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో దేవస్థానం తోటలో నిర్వహిస్తున్నారు. దీనిని విస్తరించేందుకు టెంపుల్ సిటీపై గోశాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఈఓ వెల్లడించారు. అనంతరం టెంపుల్ సిటీపై వేద పాఠశాలకు సంబంధించిన స్థలంలో చేస్తున్న పనులను పరిశీలించారు. వేద పాఠశాల నిర్మాణంపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అక్కడే జరుగుతున్న భూముల సర్వేను పరిశీలించి, వైటీడీఏ పరిధిలోని భూములను పకడ్బందీగా నిర్వహించాలని సర్వేయర్లకు తెలిపారు. కొండపైన భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ బ్రిడ్జి ఏర్పాటు కోసం అధికారులు, అర్చకులతో చర్చించి, పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. -
ప్రేమించిన యువతి మోసం చేసిందని..
మిర్యాలగూడ అర్బన్: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో సోమవారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కేశబోయిన సైదులు, సుజాత దంపతుల పెద్ద కుమారుడు కేశబోయిన కార్తీక్(26) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కార్తీక్ ఓ యువతిని ప్రేమించి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల వద్ద ఉంటున్న సదరు యువతి గత కొద్దిరోజులుగా కార్తీక్కు ఫోన్ చేయకపోవడంతో పాటు రెండు రోజుల క్రితం మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కార్తీక్కు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే కార్తీక్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య -
రిమాండ్కు తరలించాలని ఎస్పీకి ఫిర్యాదు
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని మృతుడి సోదరుడు సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను ప్రజావాణి కార్యక్రమంలో కలిసి ఫిర్యాదు చేశాడు. మృతుడి సోదరుడు బొప్పని దావీదు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన బొప్పని గురవయ్య బండమీది చందుపట్ల గ్రామంలోని పెట్రోల్ బంక్లో పనిచేస్తుండగా.. అతడి భార్య ధనలక్ష్మి అదే గ్రామానికి చెందిన వడ్డేపల్లి రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గురువయ్యకు, అతడి కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు ధనలక్ష్మిని మందలించారు. దీంతో ఎలాగైనా తన భర్త గురవయ్య అడ్డు తొలగించుకువాలని భావించిన ధనలక్ష్మి, తన ప్రియుడు వడ్డేపల్లి రాజుతో కలిసి జూలై 12న సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ గురువయ్యను కొట్టి చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా గడ్డి మందు తాగించారు. విషయం తెలుసుకున్న గురువయ్య కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్కు తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 14వ తేదీన మృతిచెందాడు. జులై 16న సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ధనలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు వడ్డేపల్లి రాజుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గురవయ్య సోదరుడు దావీదు తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై.. తిప్పర్తి: తిప్పర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు ఓ బైక్ దొరకగా.. దానిని రిపేర్ చేయించి సర్వారం గ్రామానికి చెందిన వ్యక్తి అమ్మారు. అయితే బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి ముందు మాట్లాడుకున్నట్లుగా మొత్తం డబ్బులు చెల్లించలేదు. దీంతో మొత్తం డబ్బులు ఇవ్వాలని అతడిపై కానిస్టేబుళ్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఎస్ఐకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ బైక్ రిపేర్ చేసిన మెకానిక్ను పిలిపించి విచారించగా.. అతడు బైక్ వివరాలను చెప్పాడు. ఇద్దరు కానిస్టేబుళ్లపై జిల్లా ఎస్పీకి నివేదిక పంపించామని, వారిపై ఎస్పీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్ఐ తెలిపారు. మహాశివుడికి అభిషేక పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండ పైన యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు జరిపించారు. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయంగా చేపట్టారు. ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజ లను కొనసాగించారు. సుదర్శన నారసింహ హో మం, నిత్య కల్యాణం, జోడు సేవ జరిపించారు. -
దాటుకుంటూ..
● కంపచెట్లు మునుగోడు పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం ఉదయం ఆ చెరువును పరిశీలించారు. చెరువు వద్దకు వెళ్లే క్రమంలో కట్టపై కంప చెట్లు అడ్డుగా ఉన్నా.. ఎమ్మెల్యే వాటిని చేతితో పక్కకు జరుపుతూ చెరువు పరిసరాలను పరిశీలించారు. కబ్జాకు గురైన చెరువు భూమిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. – మునుగోడు -
విషపూరితమైన మొక్కలు తిని 150 గొర్రెలు మృతి
మునగాల: విషపూరితమైన మొక్కలు తిని సుమారు 150 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దువ్వాడ మండలం హానుమాన్పల్లి గ్రామానికి చెందిన కొర్ల శివకుమార్కు చెందిన గొర్రెల మంద మేత కోసం కొంతకాలం క్రితం మునగాల మండలం చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం మేతకు వెళ్లి వచ్చిన గొర్రెల మందలోని 150 గొర్రెలు సాయంత్రం అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరులు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి గొర్రెలను పరిశీలించి విషపూరితమైన మొక్కలు తినడం వలన మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతిచెందిన గొర్రెల విలువ రూ.15లక్షల వరకు ఉంటుందని గొర్రెల కాపరులు తెలిపారు. -
గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్
నార్కట్పల్లి: బైక్ల నంబర్ ప్లేట్స్ మారుస్తూ ఒరిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. సోమవారం నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్పల్లి మండల పరిధిలోని వివేరా హోటల్ ఎదుట సోమవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రెండు బైక్లపై ఒరిస్సాలోని మల్కాన్గిరికి చెందిన జీబన్ డెపారి, కిరన్ బైధ్యా, సుధాషేన్ సాలేతో పాటు మరో బాలుడు హైదరాబాద్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా 7 కిలోల గంజాయి లభ్యమైంది. అంతేకాకుండా రెండు బైక్ల నంబర్ ప్లేట్స్ అసలైనవి కావని పోలీసులు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాదల్ దాకువ అనే వ్యక్తి ఒరిస్సాలోని మల్కాన్గిరిలో ఉంటూ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడ తక్కువ ధరకు గంజాయి కొని హైదరాబాద్లో ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్లో గంజాయి అవసరం ఉన్న వారితో పరిచయం పెంచుకున్నాడు. ఎక్కువ మొత్తంలో గంజాయి తరలిస్తే పోలీసులు పట్టుకుంటారని భావించి ఒరిస్సాకు చెందిన కొంతమందిని ఎంపిక చేసుకుని, బైక్ల నంబర్ ప్లేట్స్ మార్చి 7 నుంచి 10 కేజీల గంజాయి హైదరాబాద్కు తరలిస్తున్నాడు. గంజాయి తరలించే వారికి రోజుకు ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో జీబన్ డెపారి, కిరణ్ బైధ్యా, సుధాషేన్ సాతే, మరో బాలుడు కలిసి బాదల్ దాకువతో ఒప్పందం చేసుకుని బైక్ల నంబర్ ప్లేట్స్ మార్చి ఒరిస్సా నుంచి హైదరాబాద్కు 7 కిలోల గంజాయిని బైక్ డిక్కీ, సీటు కింద పెట్టుకుని తరలిస్తుండగా పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితుల నుంచి రెండు బైక్లు, 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. బాదల్ దాకువ అనే వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది రాము, జవహర్, రమేష్, సత్యనారాయణ, శ్రీకృష్ణ, శివ, తిరుమలేష్ ఉన్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ 7 కిలోల గంజాయి స్వాధీనం -
నీడ లేదు.. గూడు ఇప్పించరూ..
గుండాల: పూరి గుడిసె ఎదుట ఉన్న ఈ దంపతుల పేరు బొంత ఎల్లయ్య, లక్ష్మి. దంపతులిద్దరూ దివ్యాంగులే. గుండాల మండలం మాసాన్పల్లి. ఇద్దరు పిల్లలతో కలిసి ఈ గుడిసెలోనే ఉంటున్నారు. తల్లిదండ్రులు నిర్మించిన ఇల్లు పదేళ్ల కిత్రం కూలిపోగా తిరిగి కట్టుకునే స్థోమత లేక గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. విచారణకు వచ్చిన అధికారులు బొంత ఎల్లయ్య ఫొటో తీసుకుని వెళ్లారు. కానీ, ఇల్లు మంజూరు కాలేదు. వర్షాలు, ఈదురుగాలులు వీచినప్పుడు గుడిసెలో ఉండలేకపోతున్నామని, రాత్రి సమయంలో మేల్కొని ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత స్థలం ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని వాపోయారు. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న బొంత ఎల్లమ్మ, లక్ష్మి దంపతులు -
పలు చోట్ల భారీ వర్షం
నీట మునిగిన పొలాలు బీబీనగర్: మండలంలోని రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి సాగు నీటి కాల్వలు పొంగిపొర్లాయి. దీంతో పలుగుతండా పరిధిలోని బొల్లేపల్లి కాలువ ఆయకట్టులో పంట పొలాల్లోకి నీరు చేరింది. ఫ ఆలేరులో కూలిన విద్యుత్ స్తంభాలు ఫ పోచంపల్లిలో రహదారులు జలమయం ఫ ఆత్మకూర్(ఎం) పరిధిలో బిక్కేరుకు వరద ప్రవాహం, చెక్డ్యాంలకు జలకళ ఆలేరు : జిల్లాలో పలుచోట్ల ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఆలేరు పట్టణంలో రెండుగంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఆలేరు బైపాస్, మంతపురి, కేవీపీకే, రఘనాథ్పురం మార్గాల్లో, కోలనుపాకలోని తొమ్మిది విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ వెంకటేష్ నేతృత్వంలో సిబ్బంది స్తంభాలను తిరిగి ఏర్పాటు చేసి కరెంట్ సరఫరాను పునరుద్దరించారు. పదో వార్డు ఎస్సీ కాలనీలోని మాతమ్మగుడి వద్ద చెట్టు కూలి గుడిసైపె పడటంతో దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికేమి ప్రమాదం జరగలేదు. పట్టణంలో 63.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే భారీ వర్షమని స్థానికులు పేర్కొంటున్నారు. భూదాన్పోచంపల్లి: పట్టణంలో సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు వర్షం దంచికొట్టింది. వర్షానికి సినిమా థియేటర్ సమీపంలో మెయిన్రోడ్డుపై భారీగా నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచి తటాకాన్ని తలపించింది. 36.8 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆత్మకూర్(ఎం): మండలానికి ఎగువన కురిసిన వర్షానికి బిక్కేరు వాగు కల్వర్టుపైనుంచి ప్రవహించింది. వరద తగ్గేవరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొరటికల్ చెక్డ్యామ్ పూర్తిగా నిండింది. పెద్దపలుగుతండా వద్ద సాగు భూముల్లోకి చేరిన వరద నీరు -
కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
భువనగిరి : తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగ జేఏసీ నాయకులు సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావును ఆయన చాంబర్లో కలిశారు. కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అదే విధంగా సస్పెన్షన్కు గురైన కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అంతుకుముందు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు భగత్కు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖదీర్, కోశాధికారి శ్రీకాంత్, టీజీఓ అధ్యక్షుడు జగన్మోహన్ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల అధ్యక్ష, కార్యదర్శులు శశికాంత్, రాజు, సిద్ధేశ్వర్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం శ్రీస్వామివారికి అభిషేకం చేసిన అర్చకులు.. రాత్రి స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పవిత్రాధివాసం వేడుక నిర్వహించారు. ఇక అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోనూ పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, అధికారులు, అర్చకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. ఫ విష్వక్సేన ఆరాధనతో ప్రారంభం -
త్వరలోనే కళాశాలను తరలిస్తాం
ఆలేరు: ‘ప్రమాదమని తెలుసు..ఎందుకో అలుసు’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. కళాశాల పరిస్థితిపై ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఐఈఓ) రమణిని వివరణ కోరారు. కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, తరగతుల నిర్వహణకు ఉపయోగించరాదని ఆర్అండ్బీ అధికారులు నివేదిక ఇచ్చిన విషయాన్ని కలెక్టర్కు ఆమె వివరించారు. వెంటనే కళాశాలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు డీఐఈఓ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. భవనం గోడలు, తరగతి గదులు శిథిలమై, పగుళ్లు, లీకేజీలతో ప్రమాదకరంగా ఉన్నాయని వారు డీఐఈఓ దృష్టికి తెచ్చారు. ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కాలేజీని తరలించేందుకు డిగ్రీ కళాశాలల రాష్ట్ర కమిషనర్కు ప్రతిపాదనలు పంపామని, రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. నూతన భవన నిర్మాణానికి రూ.53 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కళాశాలను తరలించిన తరువాత పాత భవనాన్ని కూల్చివేసి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వర్షాలు కురిసినప్పుడు ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా తరగతులు నిర్వహించాలా, వద్దా.. అని నిర్ణయం తీసుకోవాలని ప్రిన్సిపాల్కు సూచించారు.ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందజేశారు. ఫ ఆలేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన డీఐఈఓ ఫ కలెక్టర్కు నివేదిక -
పరిషత్కు రెడీ!
అధికారులు, సిబ్బంది 6,889 మంది 600 ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, ఎంపీటీసీ స్థానానికి రిటర్నింగ్ అధికారి, ఏఆర్ఓ ఉంటారు. అదేవిధంగా 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లుండే కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. 401 నుంచి 600 ఓటర్లు ఉండే పోలింగ్ బూత్లో ఒక ప్రిసైడింగ్, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. మొత్తం 5,734 మంది అవసరం కాగా.. అదనపు సిబ్బంది 1,115తో కలిపి 6,889 మందితో తాజాగా జాబితా రెడీ చేశారు. వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సాక్షి, యాదాద్రి: పరిషత్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఈనెల 10 తరువాత ఏ క్షణమైనా వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్లు, నామినేషన్ పత్రాలు, అధికారులు, సిబ్బంది నియామకంతో పాటు కౌంటింగ్కు కేంద్రాలను ఖరారు చేయగా.. మరోమారు అప్డేట్ చేసుకుంటుంది. రెండు దశల్లో ఎన్నికలు జిల్లాలో 178 ఎంపీటీసీ, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు జెడ్పీటీసీ స్థానాలు, వీటి పరిధిలోని 84 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రెండవ విడతలో భువనగిరి, బీబీనగర్, భూదాన్పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, రామన్నపేట జెడ్పీటీసీ స్థానాలు, వీటి పరిధిలోని 94 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదించారు. మరోసారి ఏర్పాట్ల పరిశీలన ఈనెల 10 తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటికే పూర్తి చేసిన ఏర్పాట్లను, పోలింగ్ సామగ్రిని అధికారం యంత్రాంగం సరిచూసుకుంటుంది. రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ కలెక్టర్ పలుదఫాలు సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నివేదికను ఎన్నికల కమిషన్కు పంపించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా యంత్రాంగం ఫ ఇప్పటికే అందుబాటులో ఎన్నికల సామగ్రి ఫ సిబ్బంది నియామకం పూర్తి ఫ రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఫ ఎన్నికల కమిషన్కు నివేదిక ఆలేరు, భువనగిరిలో కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు రెండు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతలో ఎన్నికలు జరిగిన స్థానాలకు సంబంధించి ఆలేరులోని జేఎంజే స్కూల్లో ఓట్లు లెక్కించనున్నారు. రెండో విడత భువనగిరిలోని దివ్యబాల పాఠశాలలో కౌంటింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్స్లను అక్కడికి తరలించనున్నారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మండలాలకు ఎన్నికల సామగ్రిని చేరవేశాం. ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదిక కూడా పంపించాం. –భాస్కర్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ
సాక్షి, యాదాద్రి: జిల్లాలో పలుచోట్ల ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. వలిగొండ మండలం సంగెం ఐకేపీ సెంటర్లో రూ.4.64 లక్షల విలువైన ధాన్యం గోల్మాల్ జరిగింది. కేంద్ర నిర్వాహకురాలు, సిబ్బంది, వలిగొండ పీఏసీఎస్ సీఈఓ, మిల్లర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా భూదాన్పోచంపల్లి మండలంలోని రుద్రవెళ్లి, చిన్నరావులపల్లి, బీబీనగర్ మండలం రాఘవాపురం కొనుగోలు కేంద్రాల్లో నూ విచారణ చేశారు. వీటితో పాటు బకాయి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)పైనా విచారణ చేశారు. 2022–23 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ ఇంకా 29 వేల మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. బకాయిపడ్డ భూదాన్పోచంపల్లి మండలం ముక్తాపూర్, మోత్కూరు మండలం ఎల్.ఎన్.రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్లో విచారణ చేశారు. రికార్డులను పరిశీలించారు. సివిల్ సప్లై డీఎం నుంచి వివరాలు సేకరించారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి
ఫ కలెక్టర్ హనుమంతరావు భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేయడానికి సుదూర ప్రాంతాలనుంచి వస్తుంటారని, ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. మొత్తం 71 అర్జీలు రాగా అత్యధికంగా 42 దరఖాస్తులు భూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, డీపీఓ సునంద తదితరులు పాల్గొన్నారు. ● బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ రాజ్కాళబైరవ ఆధ్వర్యంలో బాధితులు కలెక్టర్కు విన్నవించారు. గ్రామ కంఠానికి సంబంధించి రూ.79 కోట్లు, భూములు 200 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందన్నారు. -
8న స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపా ల్ సీహెచ్.నరసింహరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో చేరడానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులతో పాటు పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. 5నుంచి 7వ తేదీ వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని, సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్లను జతపరచాలని కోరారు. వంద శాతం ఫలితాలు సాధించాలి తుర్కపల్లి,బీబీనగర్ : ఇంటర్లో వంద శాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని వయోజన విద్య డైరెక్టర్ ఉషారాణి సూచించారు. తుర్కపల్లి మండలంలోని రాంపూర్తండా మోడల్ స్కూల్, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆమె సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం రూపొందించిన కార్యాచరణపై అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ నిధులతో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు చదువుపై పట్టు సాధించేలా మారుతున్న కాలానుగుణంగా బోధనలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, ఎంఈఓలు మాలతి, సురేష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాళ్లు వినోదాదేవి, ఉమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అడ్మిషన్లు పెంచితేనే పాఠశాల మనుగడ యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని మైలార్గూడెం ప్రాథమిక పాఠశాలను సోమవారం డీఈఓ సత్యనారాయణ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో గ్రామపెద్దలతో చర్చలు జరిపారు. విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల మూసివేయాల్సిన పరిస్థితులో ఉందన్నారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి అడ్మిషన్లు పెంచితేనే పాఠశాలకు మనుగడ ఉంటుందని వారికి సూచించారు. అడ్మిషన్లు పెంచడానికి ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ శరత్యామిని, కాంప్లెక్స్ జీహెచ్ఎం మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. పెండింగ్ సమస్యలపై పోరుబాట భువనగిరి: జిల్లాలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధి, భూ పంపిణీ వంటి సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ 2022 సంవత్సరం నాటికే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉండగా నేటికీ పనులు పూర్తికాలేదన్నారు. గ్రామాల్లోనూ ప్రజా పాలన లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ నెల 20వరకు సమస్యల పరిశీలన, సంతకాల సేకరణ, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 30వ తేదీన తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్లో పెండింగ్ ప్రాజెక్టులపై పోరుబాట ఉంటుందన్నారు. సమావేశంలో నాయకులు కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపదలో బంధువై..
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అండగా 108అంబులెన్స్లో సౌకర్యాలు ఇవీ..అత్యవసర రోగులు, బాధితులకు చికిత్స అందిస్తూ ఆస్పత్రికి చేర్చడానికి 108 అంబులెన్లో అవసరమైన అన్నిరకాల వైద్యపరికరాలు ఉంటాయి. గ్లూకోమీటర్, బీపీ ఆపరేటర్, థర్మామీటర్, క్రిమిసంహారక, ఇతర మందులు తాగిన వారికి చికిత్స అందించడానికి సక్షన్ ఆపరేటర్, గుండెపోటు బాధితులకు షాకింగ్ చికిత్స అందించడానికి కార్డియాక్ ఏఈడీ యంత్రం, ఆక్సీజన్, స్ట్రెచర్, కాలుచేతులు విరిగి లేవలేనివారికి స్కూప్ స్ట్రెచర్, ప్రమాదంలో వెన్నుపూస విరిగి కదలలేని వారికి స్పైన్ బోర్డు తదితర వైద్య పరికరాలు ఉంటాయి. ఆస్పత్రిలో చేర్చేవరకు ఆ పరికరాలను ఉపయోగిస్తూ రోగులకు ఈఎంటీలు ప్రాథమిక చికిత్స అందిస్తారు. మోత్కూరు : సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన చరణ్ మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి పండుగకు వచ్చాడు. తిరుగుప్రయాణంలో ఎదురుగా వచ్చిన ఆటో అతని ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో చరణ్ కాలు విరగడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులిచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్ 15 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈఎంటీ, పైలట్ బాధితుడికి అంబులెన్స్లో ప్రథమ చికిత్స అందిస్తూ ఆస్పత్రికి చేర్చారు.. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రులకు చేరుస్తూ పునర్జన్మ ప్రసాదిస్తున్నాయి.. 108 అంబులెన్స్లు. వేలాది మందికి పునర్జన్మజిల్లాలోని మోత్కూరు, గుండాల, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, తుర్కపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు కేంద్రాల పరిధిలో 108 అంబులెన్స్లు 12 ఉన్నాయి. ఇవి పల్లెలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో నిరంతర సేవలందిస్తున్నాయి. 2024–25 సంవత్సరంలో మొత్తం 22,492 మందికి సేవలందించాయి. అందులో మెడికల్ 15,562, గర్భిణులు 1,980, రోడ్డు ప్రమాద బాధితులు 2,915, గుండెనొప్పి 892, శ్వాస సంబంధ కేసులు 1,107 మందికి ప్రాథమిక చికిత్స అందించి సంఘటన స్థలం నుంచి సకాలంలో ఆస్పత్రులకు చేర్చాయి. నిమిషాల్లో ఘటనా స్థలానికికుయ్..కుయ్మనే చప్పుడు వినిపించగానే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 108 అంబులెన్స్ పథకం ప్రవేశపెట్టారు. 108 కాల్ నుంచి ఎవరైనా ఆపదలో ఉన్నామని తెలియజేయగానే అంబులెన్స్ శరవేగంగా బయలుదేరుతుంది. పట్టణ మైతే 15 నిమిషాలు, పల్లె అయితే 20 నిమిషాలు.. మారుమూల ప్రాంతానికి అరగంటలోనే చేరుకుని బాధితులను ఆస్పత్రులకు చేరుస్తాయి. పేదోడి నుంచి కోటీశ్వరుడి వరకు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన అపరసంజీవనిగా పేరొందింది. శిక్షణ పొందిన ఈఎంటీలు, పైలట్లుబాధితులు ఎవరైనా 108కి కాల్ చేసి ఆపదలో ఉన్నామని తెలియజేస్తే దగ్గరలోని అంబులెన్స్ను సంఘటన స్థలానికి 20 నిమిషాల్లోనే పంపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు అంబులెన్స్లోనే ప్రాథమిక వైద్యం అందిస్తారు. తుదపరి వైద్యం కోసం సకాలంలో ఆస్పత్రిలో చేర్చుతారు. ఇందుకోసం అంబులెన్స్లో శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), ఎంతవేగంతోనైనా వాహనాన్ని సురక్షితంగా నడిపించగల పైలట్ ఉంటాడు. జిల్లాలో ఈఎంటీలు, పైలట్లు 125 మంది ఉన్నారు. బాధితులు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో సంఘటనా స్థలానికి చికిత్స చేయడంతో పాటు సకాలంలో ఆస్పత్రులకు తరలింపు జిల్లా పరిధిలో 12 అంబులెన్స్లు 2024–25లో 22,492 మందికి సేవలు ప్రతి వాహనంలో పైలట్, ఈఎంటీ అందుబాటులో ఆధునిక వైద్య పరికరాలు, ప్రథమ చికిత్స సేవలందిస్తున్న 125 మంది సిబ్బంది జీపీఎస్ సహాయంతో సేవలు మరింత మెరుగు -
నిమిషాల్లోనే వెళ్తాం
108 నుంచి ఎవరైనా కాల్ చేయగానే వెంటనే బయలు దేరుతాం. నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అంబులెన్సులోనే ప్రథమ చికిత్స అందిస్తూ వేగంగా ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం చేస్తాం. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు బాధితులను తరలిస్తా. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్చి వారి ప్రాణాలు దక్కితే మాకు కూడా పేరుటుంది. – లాథినేని సోమేశ్వర్, 108 అంబులెన్స్ పైలట్● -
ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు
ఆలేరు: ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. బునాది క్రమంగా కుంగిపోతోంది. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. ఎప్పుడు కూ లుతుందో తెలియక విద్యార్థులు, అధ్యాపకులు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. ఇక వర్షాలకు లీకేజీలు ఏర్పడటంతో భవనం మరింత ప్రమాదకరంగా మారింది. శిథిల భవనంతో ముప్పు ఉందని, కళాశాలకు పనికిరాదని ఆర్అండ్బీ అధికారులు నివేదిక ఇచ్చినా విద్యాశాఖ అధికారులు అలసత్వం వీడటం లేదు. 1993లో నిర్మాణంజూనియర్ కళాశాల భవనాన్ని 1993లో తహసీల్దార్ కార్యాలయం పక్కన నిర్మించారు. దాదాపు 32 ఏళ్లుగా ఈ భవనంలో కళాశాల కొనసాగుతోంది. అయితే స్వల్పకాలానికే భవనం శిథిలావస్థకు చేరింది. భవనం నిర్మించి స్థలం ఫిట్గా లేకపోవడంతో భవనం స్ట్రక్చర్ మొత్తం బలహీన పడింది. తరగతి గదుల స్లాబ్లో ఇనుప చువ్వలు తేలాయి. లీకేజీలు, గోడలకు పగుళ్లు, నీటి చమ్మలతో శిథిలావస్థకు చేరింది. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జూలై 21న ఆర్అండ్బీ ఈఈ బాలప్రసాద్ (ప్రస్తుతం బదిలీ అయ్యారు) కళాశాలను సందర్శించారు. భవనం, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీ లించారు. తరగతుల నిర్వహణకు భవనం పనికిరాదని విద్యాశాఖకు నివేదిక ఇచ్చారు. నేల స్వభావం భవనంపై ప్రభావం పడి ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?కళాశాల నిర్వహణకు భవనం పనికిరాదని ఆర్అండ్బీ అధికారులు నివేదిక ఇచ్చినా మరో చోటకు తరలించకుండా ఇంటర్ విద్యాశాఖ చోద్యం చూస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారనే ఆలోచన అధికారులు చేయకపోవడం గమనార్హం 250 మంది విద్యార్థులుకళాశాలలో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులతో పాటు కంప్యూటర్ సైన్స్, ఈటీ, డెయిరీ టెక్నాలజీ వృత్తివిద్య కోర్సులు బోధిస్తున్నారు. ఆలేరు, కొలనుపాక, రఘనాథపురం, దూదివెంకటాపురం, చిన్నకందుకూరు, శారాజీపేట, కొల్లూరు, ఇక్కుర్తి, అమ్మనబోలు, మంతపురి, శ్రీనివాసపురం,మోటకొండూరు తదితర గ్రామాలకు చెందిన 250 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అదే విధంగా బోధన, బోధనేతర సిబ్బంది 29మంది ఉన్నారు.గోడలకు పగుళ్లొచ్చాయిఅన్ని తరగతి గదుల్లో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. లీకేజీలు ఉన్నాయి. వర్షం వస్తే గదులు కురుస్తాయి. అప్పుడప్పుడు పైకప్పు పెచ్చులూడిపడతాయి. ఇబ్బందులతోపాటు భయంతో గడుపుతున్నాం. – జె. మణిధర్, విద్యార్థి, అమ్మనబోలుభయంగా ఉందిభవనం శిథిలమైంది. తరగతి గదుల గోడలు పెచ్చులూడుతున్నాయి. వర్షాలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. తరగతి గదిలో ఉన్నంత సేపు విద్యార్థులంతా భయపడుతున్నారు. – ఎం. రేఖ, విద్యార్థిని, దూదివెంకటాపురంశిథిలావస్థలో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కుంగిన బునాది, గోడలకు పగుళ్లు, పెచ్చులూడుతున్న స్లాబ్ కాలేజీని సందర్శించిన ఆర్అండ్బీ ఈఈ తరగతుల నిర్వహణకు పనికిరాదని విద్యాశాఖకు నివేదిక ముప్పని తెలిసినా వీడని నిర్లక్ష్యంకళాశాలను తరలించేందుకు ప్రతిపాదనలుఆర్అండ్బీ నివేదికను ఇంటర్ విద్యాశాఖ అధికారులకు అందజేశాం. తప్పని పరిస్థితుల్లో.. కాస్తా బాగున్న గదుల్లో తరగతులు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కాలేజీని తరలించే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. – పూజారి వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం, పరిసరాలు సందడిగా మారాయి. వేకుజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తును అభిషేకం, సహస్రనామార్చనలతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండిజోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు. -
పలు ప్రాంతాల్లో వర్షం
భువనగిరి, భూదాన్పోచంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో అదివారం మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్లో 59 మి.మీ, వలిగొండ మండలం వర్కట్పల్లిలో 58 మి.మీ, భువనగిరిలో 6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై గంటన్నరపాటు మోస్తరు వర్షం కురిసింది. దాంతో ప్రజలకు కాస్త ఉపశమనం కల్గింది. ఎండిపోతున్న మెట్టపంటలకు జీవం వచ్చినట్టయ్యింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాజాపేట : మార్నింగ్వాక్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదివారం రాజాపేట మండల కేంద్రంలో పర్యటించారు. వివిధ వార్డుల్లో తిరిగి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇసుక, సిమెంట్, స్టీల్ ఏ రేట్లకు లభిస్తున్నాయని ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లబ్ధిదారులకు సహకరించాని అధికారులకు స్పష్టం చేశారు. రాజాపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని, చెరువల ద్వారా సాగునీరు అందించాలని బీజేపీ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విఠల్నాయక్, నాయకులు పెంటయ్యగౌడ్, ఇంజ నరేష్, సురేందర్, శ్రీశైలం, కేదారి, లక్ష్మణ్, శ్రవణ్, రమేష్ పాల్గొన్నారు. 7న భువనగిరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాకభువనగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఈనెల 7న భువనగిరిలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా ప్రభారి చాడ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ తెలిపారు. అదివారం భువనగిరిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత బస్టాండ్ నుంచి వినాయకచౌరస్తా మీదుగా ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు రోడ్ షో ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, పోతంశెట్టి రవీందర్, కర్నాటి ధనుంజయ్య, పడమటి జగనోహ్మన్రెడ్డి, నర్ల నర్సింగ్రావు, చందా మహేందర్ గుప్తా, శివకుమార్, పట్నం శ్రీనివాస్, అచ్చయ్య, పట్టణ, మండల కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం, సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రానికి ఉత్సవ శోభ
● నేటి నుంచి పవిత్రోత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. సోమవా రం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణా లతో అలంకరించారు. యాగ నిర్వహణకు ప్రథమ ప్రాకార మండపంలో యాగశాల సిద్ధం చేశారు. విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారంసోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో అర్చకులు పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకతో పాటు రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల రెండో రోజు ఉదయం నవకలశ అభిషేకాలు, నిత్య మూర్తి, మూలమంత్ర, శ్రీనృసింహ, సుదర్శన, దేవతా హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి విమాన గోపురానికి పూజలు చేసి, శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేస్తారు. చివరిరోజు బుధవారం మహా పూర్ణాహుతి నిర్వహించి, స్వామి వారికి పవిత్రమాలలను సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సర్వదోషాలు తొలగిపోవడానికి..ఏటా శ్రావణమాసంలో శ్రీస్వామి వారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగే నిత్యారాధనలు, వివిధ రకాల ఉత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగినట్లయితే వాటి ప్రాయశ్చితార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. పవిత్రోత్సవాల్లో నాలుగు చతుర్వేద పారాయణాలు, మూలమంత్ర హవన పూజలు నిర్వహిస్తారు. వివిధ రంగుల్లోని పట్టు, నూలు పోగులకు ప్రత్యేక పూజలు, వేదమంత్రాల మధ్య పవిత్రాలను తయారు చేస్తారు. ఉత్సవాల్లో చివరి రోజు పవిత్రాలను శ్రీస్వామి వారికి సమర్పిస్తే సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసమని అర్చకులు వెల్లడించారు. మొదటగా గర్భాలయంలోని మూలవర్యులు, ఉత్సవ మూర్తులకు పవిత్రాలను ధరింపజేస్తారు.దోష నివారణకే పవిత్రోత్సవాలు ఆలయంలో నిత్యారాధనలతో పాటు వివిధ రకాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాల్లో మనకు తెలియకుండానే లోపాలు జరుగుతుంటాయి. వాటి నివారణకు ప్రాయశ్చిత్తంగా ఏటా శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఉత్సవాలు ముగిసే వరకు రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో చతుర్వేద పారాయణంతో పాటు మూలమంత్రాలు, నారసింహ హవనం జరిపిస్తాం. ప్రత్యేక పూజలు చేసిన పట్టు, నూలు పోగులను స్వామి వారికి సమర్పిస్తాం. – కాండూరి వెంకటచార్యులు, ప్రధానార్చకులు ఆర్జిత సేవలు రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో 5, 6 తేదీల్లో శ్రీసుదర్శన నారసింహ హోమం, శాశ్వత, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన రద్దు చేశారు. 7వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. -
నీటి విడుదలకు 58 ఏళ్లు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వలకు నీటిని విడుదల చేసి నేటికి 58 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థకసాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ మానవనిర్మిత ఆనకట్టల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి, నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. 1955 డిసెంబర్ 10 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల అనంతరం ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆనాడు రైతుల కళ్లలో ఆనందం తొనికిసలాడింది. కాల్వల్లో నీరు పారడంతో బీళ్లుగా ఉన్న భూముల్లో రైతులు సిరులు పండాయి. రైతులు ఆర్థికంగా బలపడ్డారు. తాగు, సాగునీటికి కొదవ లేకుండా పోయింది. ఆయకట్టుపరిదిలోని గ్రామాలు పట్టణాలుగా మారాయి. మిర్యాలగూడ,కోదాడ,ఖమ్మం లాంటి చిన్న చిన్నగ్రామాలు నేడు పెద్ద,పెద్ద పట్టణాలుగా రూపుదిద్ధుకున్నాయి. హాలియా, నేరెడుచర్ల, హూజూర్నగర్ లాంటి పల్లెలు నేడు ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధిపథంలో ఉన్నాయి. జనాభాపెరిగిన మేజర్గ్రామ పంచాయతీలు పురపాలక సంఘం నగరాలుగా మారాయి. ఆశించిన మేర నెరవేరని లక్ష్యం58 ఏళ్లు గడిచినా అనుకున్న స్థాయిలో ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు ఆధునీకరణలో కొన్ని ప్రాంతాలకు నీరు చేరువైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లోని కాలువల చివరి భూములకు నేటికి నీరందడం లేదు. ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న భూములు బీడు భూములుగానే ఉంటున్నాయి. ముందు చూపును దృష్టిలో పెట్టుకుని జలాశయం నుంచి నీటిని అదనంగా తీసుకునే అవకాశం ఉండే విధంగా కాలువ వెడల్పుగా తవ్వలేదు. మెయిన్ కాల్వ హెడ్ రెగ్యులేటర్ నుంచి డిస్ట్రిబ్యూటరీల హెడ్ రెగ్యులేటర్ల వరకు, తూములు వెడల్పు చేసి ఇన్టెక్ లెవల్ను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఆనాడు స్థిరీకరణలో తేలని భూములు నేడు సేద్యంలోకి వచ్చి ఆయకట్టు పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి అంచనా వ్యయం కేవలం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతులకే వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ గ్యాప్ ఆయకట్టుకు (టేల్యాండ్) నీరందక పోవడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు ఆధునికీరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయంతో రూ.4,444.44 కోట్లతో ప్రణాళిక తయారుచేసి పనులు ప్రారంభించారు. అయితే సమర్థులైన అధికారులు లేకపోవడంతో 2014లో పూర్తి కావాల్సిన పనులు జూలై 2016లో ముగిసాయి. అప్పుడే కాల్వలకు గండ్లు పడటంతో పాటు లైనింగ్ రూపురేఖలు మారాయి. ఈపనులన్నీ సమర్థవంతంగా పూర్తిచేస్తే, ప్రాజెక్టు లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరేది. కాలువల వ్యవస్థ, పారుదల సామర్థ్యం పెరిగి గ్యాప్ ఆయకట్టు సాగులోకి వచ్చేది. 1967 ఆగస్టు 4న సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ -
యాదగిరి క్షేత్రంలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా శ్రీస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 45నిమిషాల సమయం పట్టింది. భక్తులు అధికంగా రావడంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో భక్తుల సందడి కనిపించింది. శ్రీస్వామి వారిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.44,57,014 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
రూట్ మ్యాప్కు క్యూఆర్ కోడ్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రింగ్ రోడ్డులో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ అధికారులు భక్తులకు ఆయా మార్గాలను, ఆధ్యాత్మిక వాడలోని లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ప్రెసిడెన్షియల్ సూట్, తులసీ కాటేజీ, తదితర ప్రాంతాలను తెలుపుతూ క్యూఆర్ కోడ్తో కూడిన రూట్ మ్యాప్ ఫ్లెక్సీలను కొండ పైన, కొండ కింద వైకుంఠద్వారం వద్ద ఏర్పాటు చేశారు. భక్తులకు సులభతర ప్రయాణం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు ఈఓ వెంకట్రావ్ తెలిపారు. -
కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు
చండూరు: డబ్బులు, కాంట్రాక్టర్ల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా, మేడిగడ్డ వద్ద నిర్మించారని, కాళేశ్వరంలో డిజైన్ లోపం, నిర్లక్ష్యం, అవినీతి చోటుచేసుకుందని మండిపడ్డారు. ఆదివారం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే కాలంలో మునుగోడులోనే కంటి ఆస్పత్రి నిర్మించి ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఇది సేవా కార్యక్రమమని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు. అన్ని ప్రభుత్వమే చేయాలంటే కష్టమని, భగవంతుడు ఇచ్చిన శక్తి కొద్దీ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని కోరారు. విద్య, వైద్యం తనకు రెండు కళ్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 18 రెసిడెన్షియల్ పాఠశాలల్లో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించే పనులు మెదలుపెట్టామని తెలిపారు. 614 మంది పాల్గొన్న ఈ శిబిరంలో 245 మందిని ఆపరేషన్కు ఎంపిక చేసి, 117 మందిని వెంటనే తరలించగా.. మిగిలిన 128 మందిని మంగళవారం తీసుకెళ్లి ఆపరేషన్లు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొరిమి ఓంకారం, జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ పల్లె వెంకన్న, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
సాగర్కు పర్యాటకుల తాకిడి
● సుమారు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ● మధ్యాహ్నం సమయానికి గేట్లు మూసివేయడంతో నిరాశతో వెనుదిరిగిన పర్యాటకులునాగార్జునసాగర్: కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు నాగార్జునసాగర్కు పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకులతో కిటకిటలాడింది. బుద్ధవనం నుంచి సాగర్డ్యాం దిగువనగల విద్యుదుత్పాదన కేంద్రం నుంచి రేడియల్ క్రస్ట్గేట్ల వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొత్త బ్రిడ్జి, విజయ విహార్, లాంచీస్టేషన్, బుద్ధవనం, పైలాన్లోని గ్యాలరీల రోడ్లు, పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు, బ్యాంకు పార్కు, పైలాన్ శంకుస్థాపన పిల్లర్ నుంచి బస్టాండు మీదుగా జెన్కో కార్యాలయం వరకు జనంతో కిటకిట లాడింది. బుద్ధవనం పరిసరాలు, పార్కులు, విజయవిహార్ వెనుక భాగం పార్కులో పర్యాటకులు భోజనాలు చేసి సేదతీరారు. లాంచీ విహారం చేసేందుకు సరిపోయేటన్ని లాంచీలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాంచీ టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. వాహనాల రద్దీ ఉండడంతో కొత్తబ్రిడ్జితోపాటు ఇటు ముత్యాలమ్మ గుడి వరకు వేరే రూట్లలో ట్రాఫిక్ను మళ్లించారు. -
ప్రతి భక్తుడికి 30గ్రాములకు తగ్గకుండా ప్రసాదం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం 30 గ్రాములకు తగ్గకుండా అందించాలని ఈఓ వెంకట్రావ్ ప్రసాద విక్రయ విభాగం అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రసాద వితరణను ఆయన పరిశీలించారు. ఆలయ భద్రతకు సంబంధించి ఆలయ లోపలి భాగం, ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టంగా చేయాలన్నారు. ఆలయంపై డ్రోన్స్ ఎగురకుండా నిషేధించుటకు భద్రత సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. శ్రీస్వామి వారి దర్శనం అనంతరం భక్తులను పశ్చిమ రాజగోపురం నుంచి (ప్రసాద వితరణ మార్గంలో) మాత్రమే బయటకు అనుమతించాలని పేర్కొన్నారు. గుట్కా ప్యాకెట్లు స్వాధీనంచౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని పలు దుకాణాల్లో ఆదివారం పోలీసుల తనిఖీలు చేశారు. దుకాణాల్లో నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను, విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
వాహనాల బ్యాటరీలు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్టు
నల్లగొండ: వాహనాల్లో బ్యాటరీల చోరీలకు పాల్ప డుతున్న ఇద్దరిని కనగల్ పోలీసులు అరెస్టు చేసినట్లు చండూరు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. కేసు వివరాలను ఆదివారం కనగల్ పోలీస్స్టేషన్లో వెల్లడించారు. కనగల్ మండల పరిధిలోని కేబీ తండా గ్రామానికి చెందిన కోమటిరెడ్డి కరుణాకర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రం వద్ద తన మోటార్ సైకిల్ను పార్క్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను చోరీ చేశారు. దీంతో కనగల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు ప్రారంభించారు. ఆదివారం ఉదయం పోలీసులు కనగల్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వీరిని చూసి వాహనం వెనుకకు తిప్పుకుని వెళ్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితులు నేరం అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్, రూ.లక్షా 45 వేలు విలువ చేసే 20 బ్యాటరీలు, రూ. 24 వేలు నగదు, ఆటో, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సముద్రాల కృష్ణ నల్లగొండలో ఉంటూ కూలి పని చేస్తుంటాడని, మరో నిందితుడు షేక్ టిప్పు సుల్తాన్ అలియాస్ సుల్తాన్ నల్లగొండలో ఉంటూ హౌష్ షిఫ్టింగ్ మూవర్, ప్యాకర్గా పని చేస్తాడని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. కేసును ఛేదించిన సబ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రెడ్డి, పోలీసు సిబ్బంది రవీందర్రెడ్డి, వెంకన్న, శేఖర్, సురేశ్, రమేష్, వెంకట్ రెడ్డిని చండూరు సీఐ ఆదిరెడ్డి అభినందించారు. -
సాగు నీరు అందించడంలో పాలకులు విఫలం
కేతేపల్లి : శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల ద్వారా నీరు విడుదలవుతున్నప్పటికీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండబెడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప కాల్వల ద్వారా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరందించలేకపోతున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ముందు చూపు లేకే ఈపరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీజన్లో నీరందక నల్లగొండ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిరేకల్ నియోజవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడుస్తున్నా అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ మండల అద్యక్షుడు మారం వెంకట్రెడ్డి, నాయకులు గుర్రం గణేష్, గోలీ వేణు, మాధవరెడ్డి, కొండ సైదులు, వంటల చేతన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
భువనగిరిలో లారీ బీభత్సం.. బైక్లను ఢీకొట్టి.. షాపులోకి దూసుకెళ్లి..
సాక్షి, యాదాద్రి: భువనగిరిలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్లు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ.. మూడు బైక్లను ఢీకొట్టి.. షాపులోకి దూసుకెళ్లింది. జగదేవ్పూర్ చౌరస్తాలో ఈ ఘటన జరగ్గా.. ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.కాగా, మృతుల్లో ఒక వ్యక్తిని రాజపేట మండలం కురారం గ్రామానికి చెందిన రామకృష్ణ వాసిగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. -
స్నేహం ఊహకు అందని అంశం
స్నేహం అనేది ఊహకు అందని అంశం. మధురమైన జ్ఞాపకం. స్నేహానికి గుర్తే ఫ్రెండ్షిప్డే. ప్రస్తుత రోజుల్లో మానవ విలువలు, సంబంధాలు వ్యాపారమయంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్డే గొప్పతనాన్ని చాటిచెప్పాలి. ఏ స్థాయిలో ఉన్నా తన స్నేహాన్ని మర్చిపోకుండా అక్కున చేర్చుకోవడమే నిజమైన స్నేహం. నా చిన్ననాటి స్నేహితుడు నల్లబెల్లి యాదగిరిది మోత్కూర్ మండలం గట్టు సింగారం. మా స్వగ్రామమైన శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి అనిల్ కూడా నా స్నేహితుడే. ఇంటర్లో న్యాయవాది ధర్మార్జున్తో కూడా స్నేహం చేశాను. ఆయన కూడా నాకు అండగా ఉండేవాడు. – వేముల వీరేశం, ఎమ్మెల్యే నకిరేకల్ -
రాజకీయ రంగు అంటని స్నేహ బంధం
నిడమనూరు: నిడమనూరు మండల కేంద్రానికి చెందిన బొల్లం బాలయ్య, శేషరాజు భిక్షమయ్య వయస్సు 70సంవత్సరాల పైనే ఉంటుంది. బొల్లం బాలయ్య యాదవ సామాజిక వర్గంలో పెద్ద రైతుగా, పెద్దమనిషిగా గుర్తింపు పొందారు. శేషరాజు భిక్షమయ్య రాజకీయాలతో పాటు వ్యాపారం, వ్యవసాయం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరు ఎన్నో పర్యాయాలు గ్రామ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. నిడమనూరు సర్పంచ్గా 2007లో వీరిద్దరితో పాటు మరికొందరు పోటీపడగా.. బొల్లం బాలయ్య 95 ఓట్లతో నిడమనూరు సర్పంచ్గా గెలుపొందారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులుగా పోటీ పడినప్పటికీ ఎన్నికల అనంతరం కొన్నిరోజులకే వారు తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇప్పటికీ వారిద్దరు ప్రతినిత్యం ఆరోగ్యం, వ్యవసాయం, రాజకీయాల గురించి చర్చిస్తుంటారు. -
‘సిల్వర్ జూబ్లీ’ స్నేహం
నిడమనూరు: ఏపీలోని కర్నూల్ జిల్లాలో గల సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో 2000 సంవత్సరంలో మొదలైన వారిద్దరి స్నేహానికి ఈ ఏడాదితో సిల్వర్ జూబ్లీ(25 వసంతాలు) పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన వల్లపుదాసు సత్యనారాయణ, ఏపీలోని ప్రస్తుత ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన బాలిన వెంకట్రావు 2000 సంవత్సరంలో కర్నూల్లోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(బయో కెమెస్ట్రీ) చదువుతుండగా స్నేహితులయ్యారు. వీరిద్దరూ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి బీఈడీ చేసినప్పటికీ.. మెడికల్ రిప్రజెంటివ్గా ఉద్యోగాలు ప్రారంభించి, ప్రస్తుతం మార్కెటింగ్ జనరల్ మేనేజర్లుగా కొనసాగుతున్నారు. 25 ఏళ్లు అవుతున్నా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ శ్రీసిల్వర్ జూబ్లీశ్రీ జరుపుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో అప్పుడప్పుడు కలుసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
లా కాలేజీలో స్నేహితులయ్యారు
సాక్షి, యాదాద్రి: ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఇద్దరి వ్యక్తుల మధ్య చిగురించిన స్నేహం 35 ఏళ్లుగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఏపూరి భాస్కర్రావు, హైదరాబాద్కు చెందిన టీ. వెంకటరమణ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో 1991 జూలై 12న ఒకే రోజు చేరారు. ఆనాడు వారి మధ్యన ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. భాస్కర్రావు ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలు రాసి రెవెన్యూ శాఖలో చేరారు. ప్రస్తుతం సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. వెంకటరమణ న్యాయవాదిగా హైదరాబాద్లోని తార్నాకలో స్థిరపడ్డారు. భాస్కర్రావు ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ తన స్నేహితుడు వెంకటరమణకు అవసరమైన చోట అండగా ఉంటూ వస్తున్నారు. ఇద్దరం విధి నిర్వహణలో రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా వారానికి రెండు మూడుసార్లు ఫోన్లో మాట్లాడుకుంటామని భాస్కర్రావు తెలిపారు. -
స్నేహానికి అరవై వసంతాలు
కోదాడ : మంత్రిప్రగడ భరతరావు, శ్రీరామవచం వెంకటేశ్వర్లు ఇద్దరూ ఆరు దశాబ్దాలుగా కలిసి నడుస్తూ స్నేహమంటే ఇదేరా అన్నట్లు ఉంటున్నారు. హూజూర్నగర్ ప్రాంతంలోని లకారం గ్రామానికి చెందిన భరతరావు, పక్కన గ్రామమైన లింగగిరికి చెందిన శ్రీరామకవచం వెంకటేశ్వర్లు 1968లో కోదాడ కేఆర్ఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కాలం నుంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇద్దరు అదే కళాశాల నుంచి ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత ఇద్దరు మరో 15 సంవత్సరాలు కోదాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేశారు. ఇటీవలే వారు ఆ ఉద్యోగాలను మానేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు మీరు ఇంత స్నేహంగా ఉండడానికి కారణమేంటని ఎవరైనా.. అడిగితే అది వారి గొప్పతనమే.. అటూ ఒకరి గురించి ఒకరు కితాబునిచ్చుకుంటారే తప్పా నేనే అనిమాత్రం చెప్పుకోరు. పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడమే స్నేమబంధం పదికాలాలపాటు నిలిచి ఉండడానికి పునాది అని వారు ఎప్పుడూ చెపుతుంటారు. -
ఐదు దశాబ్దాల దోస్తానా..
నల్లగొండ టూటౌన్: వారిద్దరిది ఒకే ఊరు. అదే ఊళ్లో ప్రభుత్వ బడిలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు చదివి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఒకటో తరగతిలో మొదలైన వారి స్నేహం గత 53 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన కందుకూరి వెంకటేశ్వర్లు, పసుపులేటి జయపండరి ఒకటో తరగతి నుంచి స్నేహితులు. కందుకూరి వెంకటేశ్వర్లు ప్రస్తుతం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రజారోగ్య ఎస్ఈగా పనిచేస్తుండగా.. పసుపులేటి జయపండరి నల్లగొండలోనే ఆర్మ్డ్ రిజర్వ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఉద్యోగ రీత్యా గతంలో వీరు వేర్వురు జిల్లాల్లో పనిచేసినప్పటికీ నెలలో రెండుసార్లు తప్పనిసరిగా కలుస్తూ ఇరువురి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకునేవారు. తాము ఎప్పుడు కలిసినా ఊరి గురించి, అక్కడి ప్రజల గురించి వాకబు చేస్తూ గంటల కొద్ది గడుపుతామని వారిద్దరు తెలిపారు. తమ స్నేహం చిరస్థాయిగా నిలిచిపోయేదని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే అయినా.. స్నేహాన్ని మరువలే..!
గుండాల: గురుకుల పాఠశాలలో ఏర్పడిన స్నేహం నేటికీ కొనసాగుతోంది. వారిలో ఒకరు ఎమ్మెల్యే కాగా.. మరొకరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయ్యారు. గుండాల మండలం మోత్కూరు గ్రామానికి చెందిన జంపాల రాజు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ 30 ఏళ్ల క్రితం సర్వేల్ గురుకులంలో స్నేహితులయ్యారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు, ప్రధానోపాధ్యాయుడు. గాదరి కిషోర్కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ తన మిత్రుడు రాజు కుటుంబాలతో స్నేహంగా ఉండేవారు. నాటి నుంచి నేటి వరకు తన స్నేహం అలాగే కొనసాగుతోంది. -
నాడు తండ్రులు.. నేడు కుమారులు
నకిరేకల్: నకిరేకల్ పట్టణానికి చెందిన వీర్లపాటి వెంకటేశ్వర్లు, కందగట్ల వెంకటేశ్వర్లు 1980లో నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే నాటి నుంచి వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. నల్లగొండలో ఒకే రూమ్లో కలసి ఉంటూ డిగ్రీ, పీజీ చేశారు. వీర్లపాటి వెంకటేశ్వర్లు సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తూ ఇటీవల రిటైర్డ్ అయ్యారు. కందగట్ల వెంకటేశ్వర్లు పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొంది నకిరేకల్లోనే లెక్చరర్గా, వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా సేవలందించారు. నేడు వారిరువురి కుమారులైన వీర్లపాటి అభినవ్, కందగట్ల జయదీప్లు కూడా అత్యంత మిత్రులుగా మారారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే కాలం నుంచి ఆప్తులుగా మారారు. చిన్ననాటి నుంచి వారి తండ్రులు స్నేహితులు కావడం, తరుచూ ఆ రెండు కుటుంబాలు కలుసుకుంటూ ఉండడంతో దోస్తానం వారిని ఆప్త మిత్రులుగా మార్చింది. ఆస్ట్రేలియాలో అభినవ్, అమెరికాలో జయదీప్ ఎంఎస్ చదివారు. వారి స్నేహానికి అమెరికాలో యాదృశ్చికంగానే ఒకే ఆఫీస్లో ఇరువురికి ఉద్యోగం లభించింది. ఇప్పుడు అమెరికాలోని హరిజోన్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ స్నేహమేరా జీవితం అంటూ తండ్రుల స్నేహాన్ని వారు పదిలంగా పంచుకుంటూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు
చౌటుప్పల్: హైదరాబాద్–విజయవాడ హైవేపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండలం మొల్కచెర్ల గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆంజనేయులు, భార్గవి, వెంకటయ్య, అంజి, శ్రీకాంత్, రేణుక, మొగులమ్మ, త్రివేణితో పాటు వారి పిల్లలు మొత్తం 14మంది కలిసి శనివారం సాయంత్రం ఆటోలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో రాత్రి 9గంటల సమయంలో చౌటుప్పల్ పట్టణంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి ఆటోను ఢీకొని ముందుకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో ముందు సీట్లో తండ్రితో కలిసి కూర్చున్న దీక్షిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల వెనుక భాగం పగిలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్పెన్పహాడ్: తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలం మేగ్యాతండా ఆవాసం కేవ్లాతండాకు చెందిన లకావత్ లఘుపతి ఇంటికి గత నెల 28న తాళం వేసి ఉండగా.. చివ్వెంల మండలం తుల్జారావుపేటకు చెందిన ధరావత్ మణిరామ్ గడ్డపారతో తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి తులం బంగారం, రూ.5వేల నగదు అపహరించాడు. బాధితుడు లఘుపతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపికృష్ణ కేసు నమోదు చేయగా.. దర్యాప్తులో భాగంగా క్లూస్టీం సహాయంతో చోరీకి పాల్పడిన మణిరామ్ను పట్టుకొని అతడి వద్ద నుంచి సొత్తుని రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఎలక్ట్రిక్ బస్సు
మోత్కూరు: సూర్యాపేట డిపో నుంచి శనివారం హైదరాబాద్కు బయల్దేరిన ఎలక్ట్రిక్ బస్సు మోత్కూరు పట్టణంలోని టీవీఎస్ షోరూం ఎదుట సాంకేతిక లోపంతో గంటన్నర సేపు నిలిచిపోయింది. డ్రైవర్ మరమ్మతుల కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోవడంతో డిపో మేనేజర్కు సమాచారం అందించారు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉండగా.. బస్సు ఆగిపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. డ్రైవర్, కండక్టర్ డిపో టెక్నికల్ టీంతో వీడియో కాల్తో మాట్లాడగా.. బస్సులోని బ్యాటరీలు, శాటిలైట్ సిగ్నల్స్కు సంబంధించిన పరికరాలు హీట్ అవ్వడంతో బస్సు ఆగిపోయిందని తెలిపారు. ఇతర డిపోలకు చెందిన బస్సుల్లో కొంతమందిని ప్రయాణికులు తరలించారు. గంటన్నర తర్వాత బస్సు బయల్దేరడంతో మిగతా ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు వెళ్లారు. ‘కిట్స్’ చైర్మన్పై క్రిమినల్ కేసు నమోదు చేయండి ● జేఎన్టీయూ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వంసాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి హైదరాబాద్లోని జేఎన్టీయూ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు సమయంలో కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా ఉన్న నీలా సత్యనారాయణ తప్పుడు, ఫోర్జరీ పత్రాలతో ఇతరుల భూమిని తనదిగా చూపి ఢిల్లీలోని ఏఐసీటీఈ, హైదరాబాద్లోని జేఎన్టీయూలను మోసగించినట్లు ఇటీవల విజిలెన్స్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. కళాశాల ఏర్పాటులో నీలా సత్యనారాయణ పది తప్పిదాలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి వాటిలో తొమ్మిది ఆరోపణలు నిజమని నిర్ధారించి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించడంతో ఆ శాఖ కార్యదర్శి.. నీలా సత్యనారాయణతో పాటు తప్పుడు, ఫోర్జరీ పత్రాలను సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్లోని జేఎన్టీయూ రిజిస్ట్రార్ను ఆదేశించారు. చెస్ ఎగ్జిబిషన్కు ఆహ్వానం నల్లగొండ టూటౌన్: ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆయన కుమారుడు అఖిల్ ఆనంద్తో కలిసి చైన్నెలో ఏర్పాటు చేసిన చెస్ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఉమ్మడి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డికి ఆహ్వానం అందింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించే చెస్, కలలు, మ్యాథ్స్ ఎగ్జిబిషన్(మార్పి గెనిసిస్)లో పాల్గొనడానికి కరుణాకర్రెడ్డి శనివారం చైన్నె బయల్దేరి వెళ్లారు. -
ఉద్యోగ సాధనలోనూ కలిసికట్టుగా..
పెన్పహాడ్: పెన్పహాడ్ తహసీల్దార్గా పనిచేస్తున్న చివ్వెంల మండలం గుడిరాంతండా ఆవాసం హలావత్తండాకు చెందిన లాలు 2001–2003 విద్యాసంవత్సరంలో సూర్యాపేటలోని బ్రిలియంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నకిరేకల్ మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన నర్సింగ్ కరుణాకర్తో స్నేహం ఏర్పడింది. కళాశాలలో ప్రారంభమైన వీరి స్నేహం ఉద్యోగ సాధనలోనూ కొనసాగింది. 2006లో ఇద్దరు డీఎస్సీ రాయగా ఇద్దరికి ఎస్జీటీలు ఉద్యోగాలు రావడంతో టీచర్లుగా పనిచేశారు. అనంతరం 2016లో ఇద్దరు కలిసి గ్రూప్–2 పరీక్షలు రాయగా ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికయ్యారు. నర్సింగ్ కరుణాకర్ ప్రస్తుతం గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండడంతో సమయం కుదరక రెండు నెలలకోసారి కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. -
ఆపదలో ఆదుకుంటున్న ‘మిత్రమండలి’
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లిలో కొంతమంది స్నేహితులు, యువకులు కలిసి మిత్రమండలి పేరుతో వాట్సాప్ గ్రూప్ను 2021లో ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా స్నేహితులంతా కలిసి ఆపదలో ఉన్న వారికి తమకు తోచిన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్సాయపల్లి గ్రామానికి చెందిన బాణోతు వీరన్న చెరువులో పడి మృతిచెందగా.. అతడి కుటుంబానికి మిత్రమండలి ఆధ్యర్యంలో రూ.30 వేలు ఆర్థికసాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పందిరి సైదులు కుటుంబానికి రూ.25 వేలు, అకాల మరణం చెందిన అంకిరెడ్డి రవి కుటుంబానికి రూ.30 వేలు, బైక్ పైనుంచి పడి మృతిచెందిన పూజరి సైదులు కుటుంబానికి రూ.27 వేలతో పాటు పలు కుటుంబాలకు మిత్రమండలి ఆధ్వర్యంలో ఆర్ధికసాయం అందించారు. అదేవిధంగా బాణోతు సాయి పేదరికంతో చదువు మధ్యలోనే మానేయడంతో అతడికి రూ.15 వేలు ఆర్ధికసాయం చేశారు. అంతేకాకుండా సామాజిక అంశాలపై వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్తులను చైతన్యపరుస్తున్నారు. రాజకీయాలకతీతంగా గ్రామస్తుల్లో మార్పు తీసుకురావడానికి మిత్రమండలి వాట్సాప్ గ్రూప్ సభ్యులు కృషిచేస్తున్నారు. -
అండగా ఉంటున్న ‘ఆల్ మై ఫ్రెండ్స్’
దేవరకొండ: దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ 1989–90 బ్యాచ్కు చెందిన 84మంది పదో తరగతి విద్యార్ధులు ఆల్ మై ఫ్రెండ్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని తమ స్నేహితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. 2015లో ఏర్పాటు చేసుకున్న ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా తమతో పాటు చదువుకున్న స్నేహితులకు ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడంతో పాటు ఆపద సమయాల్లో మేమున్నాం అంటూ అండగా నిలుస్తున్నారు. మొదట్లో గ్రూప్ సభ్యులకు మాత్రమే సహాయ సహకారాలు పరిమితం కాగా ప్రస్తుతం వారి సేవలను విస్తృతపర్చారు. గతేడాది తమ స్నేహితుడైన ఆంజనేయులు అనారోగ్యానికి గురికావడంతో మిత్రులంతా కలిసి రూ.లక్ష ఆర్థికాసాయం అందజేశారు. మరో స్నేహితుడు కృష్ణమాచారి అనారోగ్యంతో మృతిచెందడంతో అతని కుటుంబానికి రూ.1.80లక్షలు అందజేశారు. ఇటీవల జరిగిన కర్నాటి ఆంజనేయులు కుమార్తె వివాహానికి రూ.55వేలు అందించి భరోసా కల్పించారు. -
బైక్లు చోరీ చేస్తున్న దొంగల రిమాండ్
నార్కట్పల్లి: డూప్లికేట్ తాళంచెవిలు ఉపయోగిస్తూ బైక్లు చోరీ చేస్తున్న దొంగలను నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి శనివారం నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. గతేడాది నవంబర్ 3వ తేదీన నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పైన కేతేపల్లి మండలం ఇనుపముల గ్రామానికి చెందిన తిరుగుడు సతీష్ బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సతీష్ ఫిర్యాదు మేరకు నార్కట్పలి్ల్ పోలీసు కేసు నమోదు చేశారు. శనివారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని అమ్మనబోలు చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు రామన్నపేట మండలం ఎయన్నారం గ్రామానికి చెందిన మట్టిపల్లి వెంకన్న, మట్టిపల్లి అనిల్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ తాళంచెవిలు ఉపయోగించి బైక్లు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 12 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు యన్నారం గ్రామానికే చెందిన మట్టిపల్లి శ్రీకాంత్ కూడా ఈ చోరీల్లో పాలుపంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఏపీలోని పిడుగురాళ్లలో నివాసముంటుండగా.. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ 12 బైక్లు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
చెట్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గావున్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జాబోరే సుగుణాకర్(26) లారీలో బొగ్గు లోడుతో ఆసిఫాబాద్ నుంచి ఏపీలోఇన మాచర్లకు వెళ్తున్నాడు. శనివారం తెల్లవారుజామున సుమారు 4.20గంటలకు లారీ ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలోకి రాగానే డ్రైవర్కు నిద్రరావడంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన వేప చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుగుణాకర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. క్లీనర్ వెంకటేశ్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం వారు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో డ్రైవర్ను లారీ క్యాబిన్లో నుంచి బయటకు తీసి 108 వాహనంలో సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లారీ వేగంగా ఢీకొనడంతో భారీ వేప చెట్టు వేర్లతో సహా కూలిపోయింది. చెట్టు లేకపోతే పక్కనే ఉన్న ఇళ్లలోకి లారీ దూసుకెళ్లి ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్హెచ్ఓ దస్తగిరి తెలిపారు. -
51 % సాగు
2,29,671 ఎకరాల్లో వివిధ పంటలుఫ వర్షాభావంతో తగ్గిన సాగు విస్తీర్ణం ఫ సాధారణం కంటే 229,666 ఎకరాలు తక్కువ ఫ గణనీయంగా పడిపోయిన వరి, అదే బాటలో పత్తి సాక్షి, యాదాద్రి: వర్షాభావ పరిస్థితుల కారణంగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. సాధారణ సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 2,29,671 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. సీజన్ మొదలై రెండు నెలలు గడిచినా లోటు వర్షపాతమే నమోదైంది. సరైన వర్షాలు లేక చాలామంది రైతులు సాగుబాట పట్టకుండా మిన్నకున్నారు. వరి 1.31 లక్షల ఎకరాల్లోనే.. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం వరి సాగు 2,36,168 ఎకరాలు కాగా.. 1,31,174 ఎకరాల్లో నాట్లు వేశారు. అది కూడా మూసీ పరీవాహక మండలాలైన భూదాన్పోచంపల్లి, బీబీనగర్, రామన్నపేట మండలాల్లో అధికంగా నాట్లు పడ్డాయి. నాన్ ఆయకట్టులో 30 శాతం కూడా నాట్లు వేయలేదు. వరి బాటలోనే పత్తి వర్షాధార పంటలైన పత్తి, కంది సాగు గణ నీయంగా తగ్గింది. 1.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా 98,121 ఎకరాలకు మించలేదు. కంది 6 వేల ఎకరాలు అంచనా వేయగా.. కేవలం 376 ఎకరాల్లోనే సాగు చేశారు. ఇతర మెట్ట పంటలు మచ్చుకై నా కనిపించడం లేదు. లోటు వర్షపాతం సీజన్ ప్రారంభంలో మురిపించిన వర్షాలు.. ఆ తరువాత జాడలేకుండా పోయాయి. జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో సాగు పుంజుకుంటున్న తరుణంలో మళ్లీ వరుణుడు ముఖం చాటేయడంతో సాగు డీలా పడింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 99.2 మి.మీ కాగా.. 56.5 మి.మీ కురిసింది. సాధారణం కన్నా 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో 236.5 మి.మీటర్లకు గాను 228.6 మి.మీ కురిసింది. 3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోతుల్లోకి భూగర్భ జలం వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పడిపోయాయి. గత సంవత్సరం జూలై నెలా ఖరులో 10.90 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం.. ఈ ఏడాది జూలై 11.87 మీటర్ల లోతుకు వెళ్లింది. నారాయణపురం, ఆత్మకూర్ మండ లాల్లో దయనీయ పరిస్థితులున్నాయి. -
నృసింహుడి ఆలయ భూముల సర్వే
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల పరిరక్షణపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా శనివారం డీజీపీఎస్ (డిఫరెన్సియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సర్వే చేపట్టారు.స్వామివారికి యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పాతగుట్ట, వైటీడీఏ పరిధిలోని టెంపుల్ సిటీ, మల్లాపురం, రాయగిరి, దాతరుపల్లి, సైదాపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. వీటన్నింటినీ సర్వే చూసి హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు కొనసాగనుందని తెలిపారు. సర్వేలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కరశర్మ, తహసీల్దార్ గణేష్, దేవస్థానం, మున్సిపల్ అధికారులు దయాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వైటీడీఏ సీబ్బంది పాల్గొన్నారు. -
ఉపవాసంతో పూజలు చేస్తాం
తీజ్ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిష్టతో జాగరణలో ఉంటూ పూజలు చేస్తాం. ఉత్సవాలు ముగిసే వరకు తండాను వదిలి బయటికి వెళ్లం. చివరిరోజు పూర్తిగా ఉపవాసంతో ఉంటాం. తండా పెద్దలు, తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తాం. – రమావత్ అనిత, తిరుమలగిరిసాగర్ మండలం తండా అంతా ఒక్కటిగా జరుపుకుంటాం తీజ్ పండుగను తండావాసులంతా కలిసి జరుపుకుంటాం. పంటలు బాగా పండాలని అమ్మవార్లకు పూజలు చేస్తాం. గోధుమ నారును తెంచి కుటుంబ సభ్యులకు ఇచ్చి, అమ్మవారి దీవెనలు అందుకుంటాం. చివరి రోజున చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. – నీలా బాయి, తుర్కపల్లి మండలం -
పచ్చందాల అర్బన్ పార్కు
సాగర్ జలాశయ తీరంలో నాగార్జునసాగర్–హైదరాబాద్, సాగర్–నల్లగొండ రహదారుల (సమ్మక్క–సారక్కల) వెంట రూ.1.5కోట్లతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల అటవీ కోర్ ఏరియాలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు పచ్చందాలను ఆరబోస్తోంది. 980 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన సాగర్ బ్యాక్ వాటర్ అందాలను తిలకించేందుకు నెల్లికల్లు అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అటవీ అందాలను వీక్షించేందుకు రెండు రకాల సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనంలో 10 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1,000, 24 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1500 వసూలు చేస్తున్నారు. సిబ్బంది కొరత మూలంగా పర్యాటకులు అడిగితేనే సఫారీ వాహనాలను నడుపుతున్నారు. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజలి సేవను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగాయి. బైక్ అదుపుతప్పి యువకుడి మృతిఫ మరో ఇద్దరికి గాయాలు డిండి: బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో జరిగింది. శుక్రవారం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన లక్కు విజయభాస్కర్రెడ్డి(18), ఎం. సిద్దార్ధరెడ్డి, ప్రకాష్రెడ్డి గురువారం శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుని రాత్రి బైక్పై ముగ్గురు కలిసి నాగార్జునసాగర్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్ అదుపుతప్పడంతో మధ్యలో కూర్చున్న విజయభాస్కర్రెడ్డి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన సిద్దార్ధరెడ్డి, ప్రకాష్రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలించారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విజయభాస్కర్రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆతిథ్యమిస్తున్న హోటళ్లు
నాగార్జునసాగర్లో పర్యాటకులకు అనుగుణంగా హోటళ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో హోటల్ బిజినెస్ కూడా పెరిగింది. హిల్కాలనీలో విజయ్విహార్లో నడుస్తున్న హోటల్లో దేశ, విదేశీయులు తినే పలురకాల వంటకాలు లభ్యమవుతున్నాయి. అలాగే బుద్ధవనంలో సిద్థార్థ హోటల్, మనోరమ హోటల్, పైలాన్కాలనీలో ఇటీవల ఏర్పాటైన టైగర్ వ్యాలీ హోటళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొత్త బ్రిడ్జి అవతలి వైపున ఉన్న మాతా సరోవర్, రైట్ బ్యాంకులో మాతా సరోవర్ హోటళ్లు వెలిశాయి. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హిల్కాలనీలో విజయ్విహార్ హోటల్లో 34 గదులు ఉన్నాయి. ముందస్తుగా ఆన్లైన్లో టీడీటీజీసీ.ఇన్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. వివరాలకు 08680–277362 నంబర్ను సంప్రందించాలి. -
దుకాణాల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఫ మహిళకు తీవ్ర గాయాలు ఆలేరు: డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పెద్దవాగు నుంచి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తరలించేందుకు జూకంటి సంపత్ ట్రాక్టర్కు తహసీల్దార్ ఆంజనేయులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్ కమల్హాసన్ వాగు వద్ద ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని కనకదుర్గ గుడి మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. ఆర్కే సినిమా థియేటర్ వెళ్లే దారి సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ ఉడెన్ ఫర్నీచర్ వర్క్స్షాప్ పైకి దూసుకెళ్లింది. దీంతో షాపులోని వర్కర్లు బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న కొలనుపాకకు చెందిన వల్లెపు రాజమణిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫర్నీచర్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన స్కూటీ నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, డ్రైవర్ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాంగ్రూట్లో ఎదురుగా రావడంతో అతడిని తప్పించే క్రమంలోనే ట్రాక్టర్ దుకాణాల పైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. -
సాగర్ సోయగాలు
చూసొద్దాం.. రండి నాగార్జునసాగర్ నుంచి ఏపీలోని మాచర్లకు వెళ్లే దారిలో 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం వద్ద 70 అడుగుల పైనుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. ఈ జలపాతం చూసేందుకు టిక్కెట్ ధర పెద్దలకు రూ.30 కాగా పిల్లలకు రూ.20. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి బస చేసేందుకు 8 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్ ఫ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే నందికొండ, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం ఫ చెప్పలేని అనుభూతిని మిగిల్చే లాంచీ విహారం గత ఆనవాళ్లకు చిరునామా అనుపు హిల్కాలనీకి 15 కిలోమీటర్ల దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ అలనాటి నాగార్జున విశ్వవిద్యాయం, ఇక్ష్వాకుల యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణా నది లోయలో లభించిన రంగనాథస్వామి ఆలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణా నది తీరంలో నిర్మించడం విశేషం. తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మనసు దోచే ఎత్తిపోతల -
రూ.19.24 కోట్లు మాఫీ
సాక్షి,యాదాద్రి : జిల్లాలో 2,380 చేనేత కార్మికులకు రూ.19.24 కోట్ల రుణమాఫీ కానుందని అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో రుణమాఫీ జాబితాను అమోదించి రాష్ట్ర కమిటీకి నివేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 ఏప్రిల్ 1నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికుల ఆధారంగా జాబితా రూపొందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 బ్యాంకుల్లో 2,380 మంది కార్మికులు రుణాలు పొందారని వెల్లడించారు. సమావేశంలో ఆర్డీడీ పద్మ, లీడ్బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ జిల్లా ఇంచార్జ్ అధికారిగా సాహితి భువనగిరిటౌన్ : ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితి బీసీ సంక్షేమ జిల్లా ఇంచార్జ్ అధికారిగా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో సాహితికి శుక్రవారం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రగతిచక్ర అవార్డులు రామగిరి (నల్లగొండ) : విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆర్టీసీ సిబ్బందికి రీజియన్ స్థాయిలో ఏప్రిల్, మే, జూన్ నెలల ప్రగతిచక్ర అవార్డులను ఆర్ఎం జానిరెడ్డి శుక్రవారం నల్లగొండలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు. రీజియన్ పరిధిలో 28 మంది సిబ్బందికి ప్రగతిచక్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం, అన్ని డిపోల మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ: 2025–26 విద్యా సంవత్సరానికి గాను అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ శిక్షణకు బీసీ న్యాయవాద గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలని, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఆగస్టు 15లోగా దరఖాస్తులను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
అమ్మపాలు.. బిడ్డకు అమృతం
భువనగిరిటౌన్ : సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను ప్రా రంభించారు. మొదటి రోజు మోత్కూరు, గుండాల తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. తల్లిపాల ఆవశ్యకతపై అధికారులు అవగాహన కల్పించారు. ● 2న తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసే పోస్టర్లు ప్రదర్శిస్తారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, ఉప కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తారు. ● 3న గ్రామ, వార్డుస్థాయిలో అన్నప్రాసనలు. ● 5నుంచి 6వ తేదీ వరకు గృహాలను సందర్శిస్తారు. ఆరు నెలల లోపు, 6నుంచి 24 నెలల వయసున్న పిల్లలకు తల్లి పాలిచ్చే విధానం, పోషకాహారం అందించే విధానం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. ● 7న స్వయం సహాయక బృందాల సహాయంతో పిల్లలు, మహిళల శ్రేయస్సు కోసం వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వారోత్సవాలను విజయవంతం చేయాలి బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని, ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టించాలని జిల్లా సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి జ్యోత్స్న పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధమని, లేకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. తల్లిపాల ఆవశ్యతను తెలియజేసేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, గర్భిణులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం ఫ 7వ తేదీ వరకు కార్యక్రమాలు -
ఫ శాఖాంబరిగా..
ఏఐ తరగతులను ప్రారంభించాలి : డీఈఓరామన్నపేట: అందుబాటులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తరగతులు ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణ సూచించారు. శుక్రవారం రామన్నపేట మండలం ఇస్కిళ్లలోని గుండా సత్తయ్య మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బేస్లైన్ టెస్ట్ ఫలితాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.వలంటీర్లు సహకారంతో ఫ్రీప్రైమరీ తరగతులు, వెనుకబడిన విద్యార్థులకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం కక్కిరేణి, ఎన్నారం ప్రాథమికోన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఆయనవెంట ప్రధానోపాద్యాయులు శ్రీనివాస్, ఉపేందర్జీ తదితరులు ఉన్నారు. -
యాదగిరి క్షేత్రంలో స్వాతినక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వాతినక్షత్ర పూజలు వేడుకగా చేపట్టారు. స్వామివారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు, అర్చకులు వేకువజామున గిరిప్రదక్షిణ చేశారు. ఇక ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమంతో పాటు పంచామృతాలు, శుద్ధజలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేశారు. అదే విధంగా నిత్యారాధనలు కొనసాగాయి. పూర్ణగిరిలో.. భువనగిరి: మండలంలోని నమాత్పల్లిలో గల పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రావి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీత్రిదండి రామానుజ చిన్నజీయర్స్వామి శిశ్యులచే స్వామివారికి నవకలశ స్నపనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన దాత మొసలి ఉదయకుమార్రెడ్డి, ప్రధానార్చకులు పవన్కుమార్ శర్మ, ధర్మకర్తలు సురుపంగ పద్మ నరసింహ, ఎల్లంల జంగయ్య యాదవ్, బత్తిని సుధాకర్గౌడ్, పబ్బతి ఉప్పలయ్య, ఆలయ సేవకులు కంబాలపల్లి రఘునాత్, కొత్తపల్లి నాగయ్య పాల్గొన్నారు. -
తొలిరోజు 97శాతం ముఖ హాజరు
భువనగిరి: ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత కోసం రాష్ట్ర విద్యాశాఖ తీసుకువచ్చిన ఫేస్ రికగ్నేషన్ విధానం శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి వచ్చింది. తొలిరోజు 97 శాతం మంది ఉపాధ్యాయులు యాప్లో ఫొటో దిగి హాజరు నమోదు చేశారు. 2,635 మంది రిజిస్ట్రేషన్జిల్లాలో 670 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది 3,494 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2,635 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను ఫేస్ రికగ్నేషన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మొదటి రోజు అందరి హాజరు నమోదైంది. ఫేస్ రికగ్నేషన్కు ముందు తమకు కేటాయించిన యూజర్ పేరు, పాస్వర్డ్తో యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జీపీఆర్ఎస్తో అనుసంధానం చేసినందున ఇది పాఠశాల ఆవరణలోనే సాధ్యమవుతుంది. పలుచోట్ల సాంకేతిక సమస్యలు మొదటి రోజు కావడంతో పలు పాఠశాలల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉపాధ్యాయులు సంబంధిత నిపుణులను సంప్రదించి వెంటనే లోపాలను సరిదిద్దారు. ఫ పాఠశాలల్లో అమల్లోకి ఫేస్ రికగ్నేషన్ విధానం ఫ యాప్లో ఫొటో దిగి విధులకు హాజరైన ఉపాధ్యాయులు -
కొత్త కార్డులకూ పథకాలు
భువనగిరిటౌన్ : కొత్త రేషన్కార్డులు పొందిన వారికి సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. పదేళ్లుగా రేషన్ కార్డులు వరకు మంజూరు కాకపోవడంతో గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో వివిధ పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రస్తుతం రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. వీరితో పాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందనివారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. నూతనంగా 11,759 కార్డులు జారీ ప్రజాపాలన గ్రామసభలు, మీ సేవ కేంద్రాలు ద్వారా 95,637 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయిలో విచారణ చేసినఅధికారులు 11,759 కార్డులు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు 2,16,831 కార్డులు ఉన్నాయి. నూతనంగా మంజూరైన కార్డులు, గతంలో కార్డులు కలిగి పథకాలు అందని కుటుంబాలు దరఖాస్తు చేసుకునే ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తు విధానం ఇలా.. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయాల్లో, పట్టణాల్లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలి. సబ్సిడీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్కార్డు, తెల్లరేషన్కార్డు జిరాక్స్లతో పాటు గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలను కౌంటర్లలో సమర్పించాలి. దరఖాస్తు సంఖ్యను ప్రజా పరిపాలనలో కూడా కలిగి ఉండాలి. అప్పుడే పథకాలకు అర్హత పొందుతారు. కాగా ప్రస్తుతం వెబ్సైట్లో సబ్సిడీ గ్యాస్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదని, గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉచిత గృహ విద్యుత్, సబ్సిడీ గ్యాస్ వర్తింపు ఫ దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు ఫ మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు ఫ గతంలో దరఖాస్తు చేసుకోనివారికీ అవకాశం లబ్ధిదారుల్లో ఆశలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేసింది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో రూ.500కు వంట గ్యాస్, గృహజ్యోతిలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి రేషన్కార్డు తప్పనిసరి చేసింది. దీంతో కార్డులేని కుటుంబాలు పథకాలు పొందలేకపోయాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది. నూతన రేషన్ కార్డులుమండలం కార్డులు ఆలేరు 971ఆత్మకూర్ 299బి.రామారం 300గుండాల 302మోటకొండూరు 446తుర్కపల్లి 857రాజాపేట 558యాదగిరిగుట్ట 881భువనగిరి 573భువనగిరి టౌన్ 598బీబీనగర్ 478పోచంపల్లి 816వలిగొండ 1418చౌటుప్పల్ 540నారాయణపురం 1168రామన్నపేట 927అడ్డగూడూరు 72మోత్కూరు 555 -
మందుల కొరత లేకుండా చూడాలి
మోటకొండూర్: ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండొద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కొరత ఉన్న మందులను వెంటనే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసిబ్బంది హాజరు రిజిస్టర్, రోగుల వివరాల నమోదు, కాన్పుల రికార్డులను పరిశీలించారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడారు.ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యసేవలు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని డాక్టర్లను సూచించారు. ఆయన వెంట వైద్యులు విజయ్, మోసెస్ రాజ్, ఎస్ఐ అశోక్ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన భువనగిరి: మండలంలోని కూనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ సామగ్రి ఏ రేట్లకు లభిస్తున్నాయని లబ్ధిదారులను అడిగారు. లబ్ధిదారులకు ఇబ్బందులు ఉంటే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. గ్రామానికి మంజూరైన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మాకొద్దు జీపీఓ కొలువు!
సాక్షి, యాదాద్రి : గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి(జీపీఓ) పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. కానీ, ఈ పోస్టులకు పూర్వపు వీఆర్ఓలు, వీఆర్ఏలు ఆసక్తి చూపడం లేదు. జీపీఓ పోస్టుల భర్తీకి రెండు దఫాలు పరీక్ష నిర్వహించిన 172 మంది మాత్రమే హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 318 రెవెన్యూ గ్రామాలున్నాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారంతా విధుల్లో చేరితే ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాలను కేటాయించే అవకాశం ఉంది. సర్వీస్ లెక్కించకపోవడమేనా.. 2020లో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు కాగా.. వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గ్రామస్థాయిలో తిరిగి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ పాలన అధికారులను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. వీఆర్ఓ, వీఆర్ఏలను పరీక్ష ద్వారా గ్రామ పాలనాధికారులుగా నియమించేందుకు సంకల్పించింది. అయితే తమ పాత సర్వీస్ కోల్పోతామని పలువురు జీపీఓ పరీక్ష రాయడానికి ఆసక్తి చూపలేదు. తద్వారా పదోన్నతుల్లో వెనుకబడిపోతామన్న ఆందోళన వారిలో నెలకొంది. ఈ నేపధ్యంలో తిరిగి మాతృసంస్థలోకి రావడానికి సుముఖత చూపడం లేదు. పరీక్షకు తక్కువ సంఖ్యలో హాజరు జీపీఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండుసార్లు పరీక్ష నిర్వహించింది. తొలిసారి మే 25న నిర్వహించిన పరీక్షకు 151 మంది దరఖాస్తు చేసుకోగా 139 మంది పరీక్ష రాశారు. అందులో 127 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులోనూ నలుగురు జీపీఓ ఉద్యోగంలో చేరడానికి ఇష్టం లేదని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో వీఆర్ఓలు 58, వీఆర్ఏలు 65 మంది ఉన్నారు. ఇక రెండవ సారి జూలై 27వ తేదీన నిర్వహించిన పరీక్షకు 37 మందికి గాను 34 మంది హాజరయ్యారు. ముగ్గురు హాజరు కాలేదు. పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఫ మాతృసంస్థలోకి రావడానికి పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏల అనాసక్తి ఫ పరీక్షలకు 173 మందే హాజరు ఫ జిల్లాలో 318 రెవెన్యూ విలేజ్లు ఫ ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాలు కేటాయించే అవకాశంరెండు,మూడు గ్రామాలు తప్పవా? ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. జిల్లాలో 318 రెవెన్యూ గ్రామాలున్నాయి. పూర్వ వీఆర్ఓలు 181, వీఆర్ఏలు 526 మందికి 172 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సర్వీస్ కోల్పోతామన్న భయం సర్వీస్ కోల్పోతామన్న భయంతో చాలామంది జీపీఓ పోస్టులపై ఆసక్తి కనబరచడం లేదు. ఈ కారణంగానే పరీక్ష రాయలేదు. మరోసారి పరీక్ష నిర్వహించాలని రెవెన్యూ మంత్రిని కోరాం. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వాలి. –గుర్రాల బాలకృష్ణ, పూర్వ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
తప్పుడు పత్రాలపై విచారణ
మోత్కూరు: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందిన ఘటనపై తహసీల్దార్ జ్యోతి శుక్రవారం విచారణ చేపట్టారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి వెళ్లి వల్లపు సోమలక్ష్మమ్మ కుటుంబ సభ్యులను విచారణ చేశారు. లక్ష్మమ్మ కూతురు రాధిక వివాహం 2011లో వలిగొండ మండలం మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మహేష్తో జరిగిందని, వారికి ఏడేళ్ల వయసున్న కుమారుడు, ఐదు సంవత్సరాల కుమార్తె ఉన్నట్లు విచారణలో తేలింది. తప్పుడు పత్రాలతో లబ్ధి పొందినట్లు రూ.1,00,116 లబ్ధి పొందినట్లు గుర్తించారు. లబ్ధిపొందిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించినట్లు తహసీల్దార్ తెలిపారు. -
కొత్త విధానం.. కష్టాలు అదనం
భువనగిరిటౌన్ : చేయూత పింఛన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. ఒక్కో లబ్ధిదారు ఫొటోను మిత్ర యాప్లో అప్లోడ్ చేయడానికి 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి సైట్ ఓపెన్ కాకపోవడం, నెట్ సిగ్నల్స్ అందకపోవడం, లబ్ధిదారుల ఆధార్ వివరాలు అప్డేట్ కాకపోవడం వంటి సమస్యల కారణంగా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా పోస్టల్ సిబ్బందికి ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేయకపోవడంతో సెల్ఫోన్లలో మిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని లబ్ధిదారుల పొటోలు అప్లోడ్ చేస్తున్నారు. సెల్ఫోన్లు సరిగా పనిచేయకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. గురువారం భువనగిరి, ఆలేరు, బొమ్మలరామారం మండలాల్లోని పోస్టల్ కార్యాలయాల్లో ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయి. దీంతో లబ్ధిదారులు పొద్దస్తమానం పడిగాపులు కాయక తప్పలేదు. చాలా మంది లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లారు. మరోవైపు తాగునీరు, నీడ సౌకర్యం కూడా లేకపోవడంతో వృద్ధులు అవస్థలు పడ్డారు. ‘ఫేస్ రికగ్నేషన్’తో సాంకేతిక సమస్యలు మిత్ర యాప్లో అప్లోడ్ కాని ఫొటోలు సైట్ సమస్య అంటున్న పోస్టల్ సిబ్బందిమూడు రోజులుగా తిరుగుతున్నపింఛన్ కోసం మూడు రోజుల నుంచి పోస్టాఫీస్కు వచ్చిపోతున్న. సైట్ ఓపెన్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. పాత విధానమే బాగుంది. – తాళ్ల పద్మ, జలాల్పూర్ -
నిబద్ధతో పనిచేసినప్పుడే గుర్తింపు
భువనగిరిటౌన్ : ఉద్యోగులు నిబద్ధతో పనిచేసినప్పుడే గుర్తింపు ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు పనిచేసే చోట చిత్తశుద్ధితో వ్యవహరించి మంచిపేరు తెచ్చుకోవా లని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సూచించారు. వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయాలన్నా రు. అనంతరం అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావుతో కలిసి యాదయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీఓల సంఘం రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, టీజీఓ సభ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
బొమ్మలరామారం,బీబీనగర్, తుర్కపల్లి: ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపలి, మేడిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకోవాలని, విస్తీర్ణం పెరిగితే అదనపు ఖర్చుతో భారంగా మారుతుందని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో హౌసింగ్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని మందలించారు. ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని స్పష్టం చేశారు. నాగినేనిపల్లిలో చిక్క సరోజన, గొట్టిముక్కుల రాజమ్మకు మంజూరైన ఇళ్ల నిర్మాణానికి చేయూతనిచ్చిన నాయకుడు రామిడి జంగారెడ్డిని ఎండీ గౌతమ్ అభినందించారు. అదే విధంగా బీబీనగర్ కొండమడుగు గ్రామం, తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ వ్యయంపై లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించలేదని కొండమడుగు గ్రామంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేయకుండా లబ్ధిదారులకు ఇసుక, ఇతర మెటీరియల్ సమకూర్చాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా హౌ సింగ్ పీడీ విజయ్సింగ్, మండల నోడల్ అధికారి జ్యోతికుమార్, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, డీఈ శ్రీరాములు, ఏఈ రోహిత్, పంచాయతీ కార్యదర్శులు నవీన్, గణేష్ తదితరులు ఉన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ -
అంగన్వాడీల్లో 324 ఖాళీలు
నాలుగేళ్లుగా భర్తీ కాని పోస్టులు ● సిబ్బంది కొరతతో మూతపడుతున్న కేంద్రాలు ● జిల్లాలో 28 సెంటర్లు మూసివేత ఆత్మకూరు(ఎం): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అండగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక చోట్ల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కొన్ని చోట్ల సమీప గ్రామాల కేంద్రాల టీచర్లను ఇంచార్జ్లుగా నియమించగా, మరికొన్ని చోట్ల తెరిచేవారు లేక మూతపడ్డాయి. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 841 అంగన్వాడీ కేంద్రాలు.. వాటి పరిధిలో టీచర్ 58, ఆయా పోస్టులు 266 ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల 28 కేంద్రాలు మూతపడ్డాయి. ఖాళీ పోస్టులను సుదీర్ఘకాలంగా భర్తీ చేయకపోవడంతో పలు గ్రామాల్లో కేంద్రాలు తెరిచేవారు లేకుండాపోయారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాలు మూత పడటంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందడం లేదు. రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో..రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్ 16, ఆయా పోస్టులు 97 ఖాళీ ఉన్నాయి. సిబ్బంది లేమితో 10 కేంద్రాలు మూతపడ్డాయి. భువనగిరి పరిధిలో..భువనగిరి పరిధిలో 267 కేంద్రాలు నడుస్తున్నాయి. టీచర్ 4, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు, ఆయాలు లేనిచోట ఇంచార్జ్లతో నడిపిస్తున్నారు. మోత్కూరు..మోత్కూరు ప్రాజెక్టు పరిధిలో 136 కేంద్రాలు నడుస్తున్నాయి. టీచర్లు 32, ఆయా పోస్టులు 63 ఖాళీ ఉన్నాయి. టీచర్లు, ఆయాలు లేకపోవడంతో 15 కేంద్రాలు మూతపడ్డాయి. బాలింతలు 285 మంది, గర్భిణులు 359, చిన్నారులు 2,934 మంది ఉన్నారు. ఆలేరు..ఆలేరు ప్రాజెక్ట్ పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. టీ చర్లు 6, ఆయా పోస్టులు 56 ఖాళీ ఉన్నాయి. 3 కేంద్రాలు మూతపడ్డాయి. బాలింతలు 1,061, గర్భిణులు 1,031, చిన్నారులు 10,566 మంది నమోదై ఉన్నారు. ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు 16, గర్భిణులు నలుగురు ఉండేవారు. కేంద్రంలో పని చేస్తున్న ఆయా అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో రెండేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్ మంగమ్మ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. పిల్లలకు చదువు చెప్పడంతో పాటు కేంద్రాన్ని ఊడ్చటం, పిల్లలకు వంట చేయటం, పౌష్టికాహారం పంపిణీ వంటి పనులన్నీ తానే చేస్తుంది. అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పిల్లలకు భద్రత కల్పించడానికి స్వయంగా నెలకు రూ. 600 చెల్లిస్తూ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుంది. ఆత్మకూరు(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో 15 మంది లబ్ధిదారులు ఉండేవారు. అనారోగ్యంతో అంగన్వాడీ టీచర్, వృద్ధాప్యంతో ఆయా మృతి చెందారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో మోదుబావిగూడెం అంగన్వాడీ కేంద్రం టీచర్ను ఇంచార్జ్గా నియమించారు. ఆమె పది రోజులకు ఒకసారి పోతిరెడ్డిపల్లికి వచ్చి లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేసి వెళ్తుంది. మిగతా రోజుల్లో కేంద్రం మూసి ఉంటుంది. త్వరలోనే భర్తీ చేస్తాం అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వేస్తాం. సిబ్బంది లేనిచోట లబ్ధిదారులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నా ఏర్పాట్లు చేశాం. పక్క గ్రామం అంగన్వాడీ టీచర్తో పౌష్టికాహారం అందజేస్తున్నాం. ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాం. – నరసింహారావు, ఐసీడీఎస్ పీడీ -
తరగతులు ఐదు.. గది ఒక్కటే!
తుర్కపల్లి: ఒకటి నుంచి 5వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు. అందరికీ ఒకటే గది. ఉపాధ్యాయులు ఇద్దరు ఉండగా ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్రావు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఐదు తరగతుల బోధన బాధ్యతలు హెచ్ఎంపైనే పడ్డాయి. ఆయన విద్యాశాఖ నిర్వహించే సమాశాలకు వెళ్లే ఆ రోజు పాఠశాల మూసివేస్తారు. ఈ గదిలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. వంట సామగ్రి సైతం ఇందులోనే భద్రపరుస్తారు.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇదీ. పాఠశాల పాత భవనాన్ని కూలగొట్టి నూతన భవనం నిర్మిస్తున్నారు. భవనం పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేయడంతో బీసీ కమ్యూనిటీ హాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
భూసేకరణే ప్రధాన సమస్య!
మూసీ కాలువల ఆధునీకరణకు అడ్డంకి ఇదే.. సాక్షి,యాదాద్రి: మూసీ కాలువల ఆధునీకరణకు భూ సేకరణ ప్రధాన సమస్యగా మారింది. భూ ముల ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పలుకుతున్నందున అదే స్థాయిలో పరిహారం ఇ వ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డంకులు తొలగించి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులను ఒప్పించే ప్రయ త్నం చేస్తున్నారు. నేటినుంచి రైతులతో సమావేశాలు .. ఉమ్మడి జిల్లాకు లబ్ధి చేకూరేలా బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల విస్తరణకు అవసరమైన భూ సేకరణ చేయటానికి రెవెన్యూ యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. అయితే భూములు సేకరించాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్పై మోపింది. దీంతో వారు రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పరిహారంపై చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం వలిగొండ మండల రైతులతో అధికారులు సమావేశం కానున్నారు. 66 కి.మీ పొడవు పిలాయిపల్లి కాలువరంగారెడ్డి జిల్లా బండరావిర్యాల నుంచి భువనగిరి జిల్లా మీదుగా నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామం వరకు 66 కిలో మీటర్ల పొడవు పిలాయిపల్లి కాలువను ఆధునీకరించనున్నారు. బండరావిర్యాల నుంచి భూదాన్పోచంపల్లి మండలం మైసమ్మ కత్వవరకు ఏడు మీటర్లు, అక్కడినుంచి చిన్నకోడూరు వరకు ఆరు మీటర్లు, అక్కడి నుంచి ఉరుమడ్ల వరకు 5 మీటర్లు కాలువను వెడల్పు చేయనున్నారు.భూ సేకరణకు రూ.86.22 కోట్లు అవసరం కాగా.. ప్రస్తుతం రూ.8 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ధర్మారెడ్డి కాలువ..ధర్మారెడ్డిపల్లి నుంచి నార్కట్పల్లి మండలం లింగోటం వరకు 66 కిలో మీటర్ల మేర ధర్మారెడ్డి కాలువను ఆధునీకరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.123.98 కోట్లు మంజూరు చేసింది. కాలువ విస్తరణకు అవసరమైన భూసేకరణ మొదలైంది. అయితే పలు ప్రాంతాల్లో రైతులు భూములిచ్చేందుకు అంగీకరించడం లేదు.ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారం సరిపోదని, పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బునాదిగాని కాలువకు 350 ఎకరాలు అవసరం బీబీనగర్ మండలం మక్తా అనంతారం నుంచి మోత్కూరు మండలం ధర్మారం వరకు 98.64 కిలో మీటర్ల మేర బునాదిగాని కాలువను ఆధునీకరించనున్నారు. ప్రారంభంలో 6 మీటర్లు, ఆ తరువాత 5, 4 మీటర్ల మేర కాలువను వెడల్పు చేయనున్నారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 32 గ్రామాల్లో సుమారు 350 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. కాలువ ఆధునీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికే రూ.269 కోట్లు మంజూరు చేసింది. భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతం రూ.10 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే బహిరంగ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉన్నందున పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కారణంతో మక్తా అనంతారం వద్ద బునాదిగాని కాలువ పనులను రైతులు అడ్డుకున్నారు. పరిహారం పెంచాలంటున్న రైతులు భూములు ఇవ్వడానికి విముఖత, పనుల అడ్డగింత ఆటంకాలను తొలగించేందుకు కార్యాచరణ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పర్యటన రైతులను ఒప్పించి కాలువల పనులు ముందుకు తీసుకెళ్లేయత్నం వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం మూసీ కాలువల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికే బీబీనగర్ మండలం మక్తాఅనంతారం నుంచి బునాదిగాని కాలువ పనులు ప్రారంభించాం. కొన్ని చోట్ల రైతులు పరి హారం పెంచాలని అడుగుతున్నారు. ప్రభుత్వంతో చర్చించి ఎక్కువ పరిహారం ఇప్పేంచే ప్రయత్నం చేస్తాం. – అనిల్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే -
రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ
భువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. 2వ తేదీన వెబ్సైట్లో ఖాళీల ప్రదర్శన, 3న సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 4న అభ్యతరాలను పరిశీలించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న వెబ్ అప్షన్ల అమలు (గ్రేడ్–2 హెచ్ఎంలకు), 8న ఎస్జీటీల తుది జాబితా విడుదల, 10న ఎస్జీటీల వెబ్ఆప్షన్లు వెల్లడించనున్నారు. 11న స్కూల్ అసిస్టెంట్లు, 12న ఎస్జీటీల పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జిల్లాలో 2,939 మంది ఉపాధ్యాయులు ఉండగా 200 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మాతృ మరణాలకు తావుండొద్దు భువనగిరి: మాతృ మరణాల నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ మనోహర్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాతృ మరణాల జిల్లా ఉప కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైరిస్క్ గర్భిణుల్లో రక్త హీనత, హైబీపీ వంటి సమస్యలను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాతృ మరణాల నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించనుందని, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు యశోద, శిల్పిని, ఇందిరామణి, సాయిరమణి తదితరులు పాల్గొన్నారు. అన్ని పాఠశాలల్లో ఎన్సీసీ యూనిట్లు ఆలేరు: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్సీసీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని ఎన్సీసీ యూనిట్ను సందర్శించారు. ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఈ విభాగాన్ని విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ ఎర్రలక్ష్మి, హెచ్ఎం దాసరి మంజుల, ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి నరేంద్రస్వామి, ఉపాధ్యాయలు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రరుక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఇక ప్రాకరా మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. స్వామి వారికి రూ.19,89924 ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. -
మట్టపల్లిలో నృసింహుని నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని గురువారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఆలయ ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
పాడి పరిశ్రమతో విజయపథం
నడిగూడెం: రెండు గేదెలతో పాడి పరిశ్రమను ప్రారంభించి గత 18 ఏళ్లుగా నిత్యం ఉపాధి పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామానికి చెందిన పుట్టగుంట చందు. డిగ్రీ వరకు చదువుకున్న చందు 2007లో రెండు పాడి గేదెలతో పాడి పరిశ్రమ ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకు 20 పాడి గేదెలు, 15 ఆవులతో పాడి పరిశ్రమ కొనసాగిస్తూ నిత్యం ఆదాయం పొందుతున్నాడు. రెండు పాడి గేదెల ద్వారా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ నేడు 20 గేదెల వరకు అభివృద్ది చేసుకున్నాడు. ఇంకా 10 వరకు దూడలు కూడా ఉన్నాయి. రోజుకు 180 లీటర్ల పాల దిగుబడి ఆయనకు ఉన్న 20 పాడి గేదెలు, 15 ఆవుల ద్వారా రోజుకు ఉదయం 80 నుంచి 90 లీటర్లు, సాయంత్రం 70 నుంచి 80 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నాడు. పాలను గ్రామానికి చెందిన పలువురికి నేరుగా వాడికల ద్వారా, కోదాడ, ఖమ్మం పట్టణాల్లో ప్రైవేట్ డెయిరీలకు విక్రయిస్తున్నాడు. లీటరు పాలకు రూ.60 నుంచి రూ.70 వరకు ఆదాయం వస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇద్దరు బిహారీ కూలీలకు ఉపాధి కల్పిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్నాడు. పశువులకు ఎండు గడ్డితో పాటు పత్తి చెక్క, వేరుశనగ చెక్క, తవుడు, జొన్న పిండిని ఆహారంగా ఇస్తున్నట్లు చందు చెబుతున్నాడు. నాణ్యమైన పౌష్టికాహారం పెడుతుండడంతో పాల దిగుబడి అధికంగా వస్తుందని ఆయన పేర్కొన్నాడు. ప్రభుత్వం ప్రోత్సహించాలిగత 18 సంవత్సరాలుగా పాడిపరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నాను. ప్రజలకు, ప్రైవేట్ డెయిరీలకు డైరీలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నాను. మా లాంటి పాడి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే పాల ఉత్పత్తులు పెంచేందుకు వీలుంటుంది. ప్రత్యేక రుణాలు, పశుగ్రాసం కోసం రాయితీ సౌకర్యం కల్పించాలి. – పుట్టగుంట చందు, పాడి రైతు 18 ఏళ్లుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న నడిగూడెం మండలం వాసి నిత్యాదాయంతో పాటు ఉపాధి కల్పిస్తున్న పుట్టగుంట చందు -
యూరియా అక్రమ రవాణా నిందితుల అరెస్ట్
చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కేంద్రంగా సబ్సిడీ యూరియా అక్రమ రవాణాకు పాల్పడిన ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి పేర్కొన్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రానికి చెందిన వాసుదేవ్ శంకర్యాదవ్ వెలిమినేడు గ్రామ పరిధిలో గత కొంతకాలంగా దాబా నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా అదనపు ఆదాయం పొందేందుకు గాను గత ఆరు నెలలుగా వెలిమినేడు గ్రామానికే చెందిన టేకుల అంజిరెడ్డికి చెందిన స్థలంలో గోదాం ఏర్పాటు చేసి బీఎస్–6 వాహనాల్లో అదనపు మైలేజీ కోసం ఉపయోగించే డీఈఎఫ్(డీజిల్ ఎగ్జాస్ట్ ప్లూయిడ్) తయారు చేస్తున్నాడు. గోదాంలో డీఈఎఫ్ తయారీ.. ఈ గోదాంలో పరిశ్రమల శాఖ ద్వారా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా డీఈఎఫ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేశాడు. యూరియా 33 శాతం, నీరు 66 శాతం ఉపగియోగించి డీఈఎఫ్ తయారు చేస్తున్నారు. ఇందులో సబ్సిడీయేతర యూరియాను వినియోగించడంతో అధిక లాభాలు రావడంలేదని, వ్యవసాయ పొలాల్లో వినియోగించే సబ్సిడీ యూరియాను కొందరి వద్ద కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి శంకరయ్య ద్వారా వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా ఇటీవల కాలంలో రైతుల పేరున తీసుకున్న సబ్సిడీ యూరియాను కొనుగోలు చేసి డీఈఎఫ్ తయారుచేస్తూ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంటర్లో బీఎస్–6 వాహనాలకు విక్రయిస్తూ వస్తున్నాడు. వెలిమినేడు గ్రామంలో యూరియా కొరత ఏర్పడుతుండటంతో పోలీసులు గోదాంపై దాడి చేసి అక్రమంగా తయారవుతున్న డీఈఎఫ్ను పట్టుకున్నారు. 70 బస్తాల సబ్సిడీ యూరియా బస్తాలతో పాటు బోలేరో వాహనం, ఆటోను సీజ్ చేశారు. చిట్యాల మండల వ్యవసాయాధికారి గిరిబాబు ఫిర్యాదు మేరకు వాసుదేవ్ శంకర్యాదవ్తో పాటు అతడికి సహకరించిన గోలి శంకరయ్య, దుర్గయ్య, వినోద్కుమార్, రాజీవ్ రాయ్, రోషన్కుమార్ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్, హెడ్కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు వెంకట్, ఖలీం, సాయి గణేష్, జాన్రెడ్డి, వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
సాగర్లో పోలీసుల పటిష్ట బందోబస్తు
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం నుంచి గురువారం కూడా 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. గురువారం సాక్షి దినపత్రికలో ట్రాఫిక్ జాం, సమ్మక్క సారక్క వద్ద పర్యాటకులు వాహనాలు నిలిపి జలాశయంలోకి దిగుతున్నారని ప్రచురించగా.. గురువారం కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్ జాం కాకుండా, దయ్యాల గండి వద్ద పర్యాటకులు వాహనాలు నిలిపి జలాశయంలోకి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సమ్మక్క సారక్క దగ్గర నుంచి కృష్ణానది తీరం వరకు రహదారికి ఇరువైపులా ఉన్న కంప చెట్లను సైతం అధికారులు తొలగించారు. అంతేకాకుండా దయ్యాల గండి సమీపంలోని పర్యాటకులు పుష్కరఘాట్లోకి దిగకుండా చుట్టూ ట్రంచ్ కొట్టారు. ఎక్కడికక్కడ పర్యాటకుల వాహనాలను పోలీసులు వరుస క్రమంలో పెట్టిస్తుండటంతో గురువారం ఎక్కడా కూడా ట్రాఫిక్కు అంతరాయం కలుగలేదు. యాదగిరిగుట్టపై ఆండాళ్ సదనం గదుల పరిశీలనయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు చెందిన ఆండాళ్ సదనం గదులను ఆలయ ఈఓ వెంకట్రావ్ గురువారం పరిశీలించారు. యాదగిరిగుట్ట పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆలయ అద్దె గదులు నిరుపయోగంగా ఉన్నాయని తెలుసుకుని స్వయంగా వెనాయన పరిశీలించారు. గదుల మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేసి భక్తుల కోసం వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏఈఓ రమేష్బాబు, సివిల్ ఈఈ దయాకర్రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ రామారావు తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సు దహనం కేసులో ఇద్దరి రిమాండ్
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను గురువారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య విలేకరులకు వెల్లడించారు. తడకమళ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద గత నెల 23న అర్ధరాత్రి పార్కింగ్ చేసిన మిర్యాలగూడ డిపోకు చెందిన నైట్ హాల్ట్ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో.. బస్సు కండక్టర్ సీహెచ్. బాలకృష్ణ మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తడకమళ్ల గ్రామానికే చెందిన కుసుమ సుదర్శన్రెడ్డి, తంగెళ్ల జానకిరెడ్డి కలిసి డీజిల్ను బస్సు లోపల చల్లి నిప్పు పెట్టినట్లు పోలీసులు విచారణలో తేలడంతో వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. సుదర్శన్రెడ్డిపై 8 కేసులు, తంగెళ్ల జానకిరెడ్డిపై ఐదు కేసులు ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సుదర్శన్రెడ్డి, జానకిరెడ్డిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ -
యాదగిరిగుట్ట ప్రధానార్చకుడి ఉద్యోగ విరమణ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ వెంకట్రావ్తో పాటు ఆలయ అర్చకులు, అధికారులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. స్వామివారికి ఆయన చేసిన సేవలను ఆలయ ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు. పాత ఆలయం నుంచి ఆలయ పునర్నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు మరువలేనివని స్థానికులు చెబుతున్నారు. 46ఏళ్ల పాటు సేవలు యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన నరసింహాచార్యులు జన్మస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామం. ఆయన వైధిక విద్యను అభ్యసిస్తూనే ఎంఏ తెలుగు, సంస్కృతం వేద ఆగమాలపై గ్రంథ రచనలు చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తొలుత ఈయననల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకత్వం చేశారు. అనంతరం 1979 డిసెంబర్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అర్చకుడిగా విధుల్లో చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఆయనను ఆలయ ప్రధానార్చకులుగా నియమించింది. లక్ష్మీనరసింహుడి సన్నిధిలో 46 సంవత్సరాల పాటు ఆయన తన సేవలు అందించారు. ఘనంగా సత్కరించిన ఈఓ, అర్చకులు, అధికారులు -
వైద్యం కోసం వెళ్లి అనంతలోకాలకు..
జనగామ, రాజాపేట: వ్యవసాయ పొలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు వైద్యం కోసం వచ్చి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగింది. రాజాపేట ఎస్ఐ అనినీల్కుమార్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎం. ప్రభాకర్రెడ్డి(47) గత నెల 26న ట్రాక్టర్తో వ్యవసాయ పొలం దున్నుతుండగా.. విద్యుత్ తీగ తెగి ట్రాక్టర్ వెనుక కల్టివేటర్పై పడింది. దీంతో ప్రభాకర్రెడ్డి ట్రాక్టర్ పైనుంచి దూకే ప్రయత్నం చేయగా.. అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అతడి రెండు కాళ్ల పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు వెంటనే జనగామలోని అజంతా ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ బాలాజీ పరీక్షించి.. ప్రభాకర్రెడ్డి కాలుకు ఇన్ఫెక్షన్ ఉందని, తగ్గే వరకు సర్జరీ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుధవారం ఇంటికి తీసుకెళ్లాలని చెప్పగా పరిస్థితి విషమంగా ఉంటే ఎలా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు సదరు వైద్యుడిని నిలదీయగా ఆస్పత్రిలోనే ఉండమన్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ప్రభాకర్రెడ్డి మృతిచెందాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రభాకర్రెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాలు ఇన్ఫెక్షన్కు గురైతే మరో ఆస్పత్రికి రెఫర్ చేయకుండా, ఐదు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే ఉంచుకోవడంతోనే పరిస్థితి విషమించి ప్రభాకర్ రెడ్డి మృతిచెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పేషెంట్కు షుగర్, వీడీఆర్ఎల్ పాజిటివ్, ఇన్ఫెక్షన్, మోకాళ్ల వాపులు ఉండడంతో తగ్గే వరకు సర్జరీ వాయిదా వేసినట్లు చెప్పారు. అంతలోనే గుండెపోటుతో మృతి చెందాడని, ఇందులో తమ తప్పులేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజాపేట మండలం బసంతాపురానికి చెందిన రైతు మృతి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల ఆందోళన జనగామ జిల్లా కేంద్రంలో ఘటన -
కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్జాం
బుధవారం సాయంత్రం పర్యాటకుల వాహనాలు ఒక్కసారిగా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని కొత్త బ్రిడ్జి పైకి రావడంతో ఎదురుగా వచ్చిన లారీ ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్జాం అయ్యింది. పోలీసులు స్పందించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి వంతెనపై వాహనాలు వరుస క్రమంలో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కొత్త బ్రిడ్జిపై పర్యాటకులు వాహనాలు నిలుపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకంఉడా దయ్యాలగండి వద్ద గల పుష్కరఘాట్ సమీపంలో పర్యాటకులు రోడ్డు వెంట వాహనాలు నిలిపి సాగర్ జలాశయంలోకి దిగుతున్నారు. అక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. -
దొడ్డా పద్మ ఆశయాలు సాధించాలి
చిలుకూరు: హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ ఆశయాలను సాధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం చిలుకూరులో దొడ్డా పద్మ భౌతికకాయానికి కూనంనేని సాంబశివరావు నివాళులర్పించి ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో తన భర్త దొడ్డా నర్సయ్యతో కలిసి నల్లమల్ల అడవుల్లో మూడేళ్లు పాటు పద్మ అజ్ఞాతవాసం చేసిందని, కొరియర్గా కూడా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. పార్టీ నాయకులు దొడ్డా పద్మమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఆశయసాధనకు కృషి చేయాలని అన్నారు. దొడ్డా పద్మ మృతి సీపీఐకి తీరని లోటని అన్నారు. దొడ్డా పద్మ మృతి పట్ల సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, ఉజ్జిని యాదగిరిరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఉజ్జిని రత్నాకర్, పార్టీ జాతీయ నాయకులు పశ్య పద్మ, పోటు కళావతి, సీపీఐ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, దండి సురేష్, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తెల సృజన, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు, ధనుంజయ నాయుడు, మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, బద్దం కృష్ణారెడ్డి, లతీఫ్, బత్తిని హనుమంతరావు, దేవరం మల్లేశ్వరీ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి సంతాపం..దొడ్డా పద్మ మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, పద్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఫోన్లో పద్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పద్మ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చిలుకూరులో ముగిసిన పద్మ అంత్యక్రియలు -
కల్తీ కల్లు తయారీ ముడిసరుకు పట్టివేత
నార్కట్పల్లి: కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఆటోలో తరలిస్తుండగా మంగళవారం రాత్రి నార్కట్పల్లి బైపాస్ వద్ద ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం నల్లగొండ ఎకై ్సజ్ సీఐ బుర్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కట్టంగూర్కు కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఆటోలో తీసుకెళ్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో మంగళవారం రాత్రి నార్కట్పల్లి బైపాస్లో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఆటోలో 30 కిలోల కోరల్హైడ్రేట్తో పాటు ఇతర ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కట్టంగూర్ నుంచి ఈ ముడిసరుకును సూరత్, గుజరాత్కు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెరిపోతుల వెంకన్నపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సూర్యాపేట గ్రామానికి చెందిన నారబోయిన మహేష్ కుమార్తు అశ్విక సూర్యాపేట పట్టణంలోని కాకతీయ స్కూల్లో నర్సరీ చదువుతోంది. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అశ్విక కొద్దిసేపటికి తర్వాత తోటి పిల్లలతో ఆడుకునేందుకు ఇంటి బయటకు వచ్చింది. అదే సమయంలో బైక్పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అశ్వికను కిడ్నాప్ చేసేందుకు గాను ఆమెను ఎత్తుకున్నారు. అదే సమయంలో పక్కింటికి చెందిన గాజాని భాను చూసి ‘ఎవరు మీరు.. పాపని తీసుకెళ్తున్నారు’ గట్టిగా అడగడంతో పాపను అక్కడే వదిలేసి పరారయ్యారు. తాను బయటకు వచ్చేలోగా దుండగులు పరారైనట్లు భాను భర్త హరీష్ తెలిపారు. పక్కింటి మహిళ కేకలు వేయడంతో బైక్పై పరారైన గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామంలో ఘటన -
నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతితో అధిక లాభాలు
త్రిపురారం: రైతులు పంటల సాగులో ఉత్తమ పద్ధతులు పాటించి నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతులు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయం విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు ఎం. యాకాద్రి అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంసాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో జిల్లాలోని రైతులకు వ్యవసాయ మరియు ఉద్యాన పంటల ఎగుమతులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై దృష్టి సారించాలని, మెట్ట వరి సాగుతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణను వినియోగించుకోవాలన్నారు. అనంతరం త్రిపురారం, మర్రిగూడెం గ్రామాల్లో రైతులు సాగు చేసిన మెట్ట వరి సాగు అలాగే తిప్పర్తిలో సాగు చేసిన అధిక సాంద్రత పత్తి సాగును పరిశీలించి కేవీకే శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. మొట్ట పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్కుమార్, సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్, ఉద్యనవన శాస్త్రవేత్త హిమబిందు, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు యాకాద్రి కేవీకే కంపాసాగర్లో రైతులకు పంటల ఎగుమతులపై శిక్షణ -
పెరటి తోటల పెంపకంపై అంగన్వాడీలకు అవగాహన
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో పెరటి తోటల పెంపకంపై అంగన్వాడీ టీచర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త డి. నరేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లల్లో పోషక ఆహార సమస్యలు, దానికి అవసరమైన పోషక విలువలు గల పెరటి తోటల పెంపకంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోషకాలు సమృద్ధిగా ఉండే పెరటి తోటల పెంపకం ఎలా చేయాలో వివరించారు. అనంతరం తొమ్మిది రకాలు కూరగాయల సీడ్ కిట్స్ను అంగన్వాడీ టీచర్లకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్. నరేష్, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్. సుగంధి, హుజూర్నగర్ సీడీపీఓ వెంకటలక్ష్మి, మండల ఇచ్చార్జి రేవతి, కేవీకే శాస్త్రవేత్త అక్షిత్ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనంలో నుంచి నగదు చోరీ
కొండమల్లేపల్లి: ద్విచక్ర వాహనం డిక్కీలో నుంచి నగదును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన ముదిగొండ రాము తన ద్విచక్ర వాహనంపై కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో గల నాగార్జున గ్రామర్ హైస్కూల్లో ఉన్న తన మిత్రుడి కలిసేందుకు వచ్చాడు. పాఠశాల లోపలికి వెళ్లి ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి మిత్రుడితో మాట్లాడేందుకు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తి ద్విచ్ర వాహనం డిక్కీలో దాచిన రూ.1.93లక్షల నగదును అపహరించాడు. ఈ దృశ్యాలు పాఠశాలలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. తాళం వేసిన ఇంట్లో..తిప్పర్తి: తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నాయిగూడెం గ్రామంలో బుధవారం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చిన్నాయిగూడేనికి చెందిన బైరగోని సతీష్ బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలం నాటు వేయడానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. రూ.30వేల నగదు, తులంన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్.. వ్యక్తి మృతికొండమల్లేపల్లి: బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం బాపూజీనగర్ వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన దమ్మోజు ఆంజనేయచారి (37) బుధవారం కొండమల్లేపల్లి పట్టణంలోని తమ బంధువుల ఇంటికి బైక్పై వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొల్ముంతలపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిని ఆంజనేయచారిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి అక్క ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించాలి● ఆర్టీసీ ఆర్ఎం కొణతం జానిరెడ్డిమిర్యాలగూడ టౌన్: ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కొణతం జానిరెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని ఆర్టీసీ డిపోలో ఆయన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిలోమీటర్ల రాబడి, ఆక్యుపెన్సీ రేట్ను పెంచాలన్నారు. ఆర్టీసీ ప్రతిష్టను కాపాడుకునే విధంగా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. టూరిజం ప్యాకేజీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చూడాలన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ డిపో మేనేజర్ రామ్మోహన్రెడ్డి, టీఐ–3 పుట్ట వైష్టవి తదితరులు ఉన్నారు. -
సాగర్లో పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు క్యూ కట్టారు. సాగర్ అందాలను పర్యాటకులు తమ సెల్ఫోన్లలో బంధిస్తూ, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం వద్ద, కొత్త బ్రిడ్జిపై పర్యాటకులు కిటకిటలాడారు. పర్యాటకుల రాకతో సాగర్ తీరంలో చిరువ్యాపారులు బత్తాయి జ్యూస్, ఐస్ క్రీమ్, మొక్కజొన్న కంకులు, చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు. డౌన్ పార్కుకు మారిన లాంచీ స్టేషన్.. లాంచీ స్టేషన్ విజయవిహార్ నుంచి డౌన్ పార్కుకు మార్చారు. గతంలో డౌన్ పార్కు వద్దే లాంచీ స్టేషన్ ఉండగా.. ఇక్కడ వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విజయవిహార్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన లాంచీ జట్టీ నుండే లాంచీలను నడుపుతూ విజయవిహార్లో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లాంచీ స్టేషన్ డౌన్పార్కుకే మార్చడంతో పర్యాటకులు ఆగకుండా వెంటనే లాంచీ ఎక్కి వెళ్లేందుకు కొంత అనువుగా ఉంది. ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఇక్కడి నుండే లాంచీలను నడపనున్నారు. కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపిన పర్యాటకులు చిరు వ్యాపారులకు పెరిగిన గిరాకీ -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేధ్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగాయి. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలి ఆలేరురూరల్ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుచాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవాం ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని అన్ని రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం మంతపురిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, వెంటర్నరీ హెల్త్ క్యాంపులో గొర్రెలకు వేస్తున్న బ్లూ టంగ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట వెంటర్నరీ అధికారి డాక్టర్ పి.చైతన్య, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, హౌసింగ్ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలియాదగిరిగుట్ట రూరల్: విద్యార్ధులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందజేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్ధులకు స్వయంగా వడ్డించారు. కొత్త అడ్మిషన్లు గురించి ఆరా తీసి మాట్లాడారు. ఆయన వెంట హెచ్ఎం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. గౌస్కొండలో కేంద్ర బృందం పర్యటనభూదాన్పోచంపల్లి : మండలంలోని గౌస్కొండ గ్రామంలో మంగళవారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సర్వే నిర్వహించింది. సర్వే బృందం అధికారులు వనజ, జుబేదా బేగం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ పారిశుద్ధ్యం, ఇంకుడుగుంతలపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీపీడీ భాస్కర్, ఎంపీఓ మాజిద్, ఏపీఓ కృష్ణమూర్తి, జిల్లా ఎస్బీఎం కోఆర్డినేటర్ మురళి, టెక్నికల్ అసిస్టెంట్ మాధవి, పంచాయతీ కార్యదర్శి సరిత పాల్గొన్నారు. ఓఆర్ఎస్తో ఎంతో మేలుబీబీనగర్: ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ద్రావణంతో ఎంతో ప్రయోజనకారి అని బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల వైద్యులు తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్లోని పీడీయాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఓఆర్ఎస్ వారోత్సవాల్లో భాగంగా చిన్నారుల తల్లులకు ఓఆర్ఎస్ ప్రాముఖ్యతను వివరించారు. ఓఆర్ఎస్ తయారీపై ప్రదర్శనలు, ఆరోగ్య నిపుణలతో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ ఆరోరా, డీన్ సంగీత సంపత్, పీడీయాట్రిక్ విభాగాధిపతి సిబాబ్రత్త పట్నాయక్, వైద్యులు మధుసూదన్, మనీషా, నితిన్ జాన్ పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి వెల్లడించాలి
చౌటుప్పల్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ వైఖరిని తక్షణమే వెల్లడించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ విస్త్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో బీజేపీ మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్రంలో మాత్రం అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ మూలంగా బీసీలు నష్టపోతున్నారని తెలిపారు. నాన్చుడు ధోరణిని విడనాడాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందివ్వకపోవడం సరికాదన్నారు. తక్షణమే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, మల్లేశం, పెంటయ్య, గోశిక స్వామి, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాస్చారి, ఎండి.పాషా, గంగదేవి పాండు, గోశిక కరుణాకర్, రాగీరు కిష్టయ్య పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
కాల్వల అభివృద్ధికి నిధులిస్తాం..
భూదాన్పోచంపల్లి : పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేస్తే ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కొత్త రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి తనకు ప్రియమిత్రుడు, దగ్గరి బంధువు అని, ఆయన కోరిక మేరకే పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాలువలకు నిధులు మంజూరు చేశానన్నారు. అలాగే ఎమ్మెల్యే కోరినట్టుగా అలీనగర్, బొల్లేపల్లి, భీమలింగం కాలువల నిర్మాణాలకు నిధుల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు గెలిపించి జిల్లాను రాష్ట్రాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు. గొప్ప చరిత్ర కలిగిన పోచంపల్లికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది.. ఇందిరమ్మ పాలన : ఎమ్మెల్యే కుంభంమంత్రులు మన దగ్గరిక వచ్చి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నారని.. కాంగ్రెస్ ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. దేశంలో మరెక్కడలేని విధంగా సన్నబియ్యం అందజేస్తున్నామని గుర్తుచేశారు. మూసీ సాగునీటి కాల్వలకు రూ.500ల కోట్ల నిధులు మంజూరు చేసి ప్రత్యేక అభిమానం చూపిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో పేదవారు కడుపునిండా తింటున్నారని పేర్కన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, చౌటుప్పల్ ఆర్టీఓ శేఖర్రెడ్డి, డీఎస్ఓ రోజా, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, డీటీ నాగేశ్వర్రావు. ఆర్ఐ వెంకట్రెడ్డి, భువనగిరి మార్కెట్కమిటీ చైర్మన్ రేఖా బాబురావు, జిల్లా గ్రంథాలయశాఖ చైర్మన్ అవైస్ చిస్తీ, పోత్నక్ ప్రమోద్కుమార్, కాంగ్రెస్జిల్లా నాయకులు తడక వెంకటేశం, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు పాక మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి పాల్గొన్నారు. పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు భూసేకరణ పూర్తిచేయండి రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పోచంపల్లి, ఆలేరులో రేషన్ కార్డుల పంపిణీపేదలకు విస్మరించిన బీఆర్ఎస్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను విస్మరించిందని ఏ ఒక్కరికి ఇల్లు, రేషన్కార్డు ఇచ్చిన పాపాన పోలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సన్నబియ్యంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. -
తేలిన చేనేత రుణమాఫీ లెక్క
అర్హులుగా 2,355 మంది కార్మికుల గుర్తింపుసాక్షి, యాదాద్రి : ప్రభుత్వం ప్రకటించిన చేనేత వ్యక్తిగత రుణమాఫీ అర్హుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రంలోని నేతన్నల రుణమాఫీ కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ.33 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2024 వరకు బ్యాంకుల్లో నేతన్నలు తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది. ఈ కటాఫ్ తేది ఆధారంగానే జిల్లాలోని బ్యాంకుల వారీగా అప్పులున్న నేతన్నల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించింది. కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో లబ్ధిదారులు, మాఫీ మొత్తాన్ని ఆమోదిస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీలో రుణమాఫీ ఆమోదం పొందగానే నేతన్నలకు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. 2,355 మందికి రూ.18.87 కోట్ల వరకు..జిల్లాలో 2,355 మంది చేనేత కార్మికులు అర్హులుగా అధికారులు లెక్కతేల్చారు. రూ.లక్ష వరకు వీరందరికి వర్తించే రుణమాఫీ మొత్తం రూ.18.87 కోట్లుగా తేలింది. అయితే రూ లక్ష కంటే ఎక్కువ ఎంత అప్పు ఉన్నా వారికి ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.లక్ష వరకు మాఫీకానుంది. ప్రాథమిక అంచనా ప్రకారం రుణాలు తీసుకున్న నేతన్నల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలోని 40 బ్యాంకుల నుంచి జౌళి శాఖ అధికారులు వివరాలను సేకరించారు. బ్యాంకులు ఇచ్చిన జాబితా ఆధారంగా వ్యక్తిగత రుణం మాఫీ కానుంది. అత్యధికంగా భూధాన్ పోచంపల్లిలో 900 మంది. పుట్టపాకలో 500 మంది, చౌటుప్పల్లో 250 మంది. ఆలేరులో 150 మందితోపాటు జిల్లా వ్యాప్తంగా రుణమాఫీకి అర్హులను అధికారులు గుర్తించారు. ఆగస్టు 1న బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆగస్టు 1న జిల్లాస్థాయిలో బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. సభ్యులుగా ఉన్న డీసీసీబీ సీఈఓ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఆర్డీడీ, ఎల్డీఎం, డీజీఎం నాబార్డ్, జీఎం ఇండస్ట్రీస్, జిల్లా కోఆపరేటీవ్ ఆడిట్ అధికారి, జిల్లా జౌళి శాఖ అధికారి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రుణగ్రస్తుల జాబితాను ఆమోదించి రాష్ట్ర స్థాయి కమిటికీ పంపిస్తారు. అక్కడా ఆమోదంలభించిన వెంటనే నేతన్న ఖాతాల్లో రుణమాఫీ చేస్తారు.బ్యాంకుల వారీగా వివరాలు సేకరించాం.. జిల్లాలో చేనేత రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రూ.లక్షలోపు రుణం తీసుకున్న నేతన్నల వివరాలను బ్యాంకుల వారీగా తీసుకున్నాం. పూర్తిగా చేనేత కోసం వ్యక్తిగత రుణం తీసుకున్న వారే 2,355 మంది అర్హులు ఉన్నారు. వీరికి రూ. 18.87 కోట్లు మాఫీ అవుతాయి. – శ్రీనివాస్, ఏడీ, జౌళి శాఖ జాబితా సిద్ధం చేసిన అధికారులు రూ.లక్ష వరకు మాఫీ కానున్న వ్యక్తిగత రుణం జిల్లాలో రూ.18.87 కోట్ల వరకు మాఫీకి అవకాశం -
‘గంధమల్ల’ను పూర్తిచేస్తాం
● మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిఆలేరు: జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి, ఆలేరు నియోకవర్గ రైతాంగానికి సాగునీరు అందిస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆలేరు పట్టణంలో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రిజర్వాయర్ పూర్తికి రూ.600 కోట్ల నిధులు కేటాయించామన్నారు. భూసేకరణ కోసం రైతులకు చెల్లించేందుకు అదనంగా రూ.27కోట్ల నిధులు ఇరిగేషన్ శాఖ నుంచి త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలేరులో కొత్తగా 7వేల మందికి రేషన్కార్డులను జారీ చేశామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవానికి ప్రతీక రేషన్కార్డుల పంపిణీ అన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడమే తన చిరకాల కల అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కు ఎమ్మెల్యే ఐలయ్య గొర్రెపిల్లను బహూకరించారు. అనంతరం మంత్రులను ఎమ్మెల్యే, కలెక్టర్లు సన్మానించారు. రెవన్యూ డివిజన్గా ఆలేరును ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు మంత్రికి వినతి అందజేశారు. గొర్రెపిల్ల నాకేనా.. : ఉత్తమ్బహూకరించిన గొర్రెపిల్లను నాకేనా. మీకా అని మంత్రి ఉత్తమ్ సమావేశంలో ఎమ్మెల్యేతో చమత్కారించారు. అదనపు కలెక్టర్ మా నియోజకవర్గ ఓటరే.. కలెక్టర్ మన జిల్లా వాసే అని మంత్రి సరదాగా మాట్లాడి నవ్వులు చిందించారు.