breaking news
Yadadri
-
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం విషాదం చోటుచేసుకుంది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికరెడ్డి మృతి చెందింది.బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. నిన్న(శనివారం) సాయంత్రం నీలిమ.. తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రవీందర్రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
తొలిరోజు 18 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం 50 కేంద్రాల ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 8,921 హాజరు కావాల్సి ఉండగా 8,903 మంది హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలకు రావడంతో సందడి కనిపించింది. భువనగిరి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో పరీక్ష కేంద్రాలను పలువురు అధికారులు తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు భువనగిరి పట్టణంలో విజ్ఞాన్ హైస్కూల్, మరో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాంటిస్సోరీ, మథర్థెరిస్సా హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ సత్యనారాయణ జిల్లాలోని పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ పదో తరగతి పరీక్షలు ప్రారంభం -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. -
వరి.. తడారి
ఈ రైతు పేరు వేలిమినేటి ముత్యంరెడ్డి. ఈయనది మోత్కూరు మండలం ముసిపట్ల. గ్రామంలో తనకున్న ఆరెకరాల భూమితోపాటు, మరో ఎకరంన్నర భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఆగిఆగి సన్నగా పోస్తుంది. పక్షం రోజుల నుంచి నీరందడం లేదు. ఎకరం పొలం నెర్రెలు వారి పోయింది. కౌలుకూడా ఎల్లే పరిస్థితి లేదని రైతు వాపోతున్నాడు. ఈ చిత్రంలోని రైతు గుండాల మండలం మాసంపల్లి గ్రామానికి చెందిన మలిపెద్ది మైపాల్రెడ్డి. ఈయన తనకున్న ఎకరంన్నర పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరిపంటసాగు చేశాడు. వ్యవసాయ బావిలో నీటి ఊటలు తగ్గి సాగుకు నీరందడం లేదు. దీంతో ఇప్పటికే సుమారుగా ఎకరంన్నర పొలం ఎండిపోయింది. -
గ్యాస్ తంటా.. కట్టెల మంట
రాజాపేట : వంట గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొల్లెన జానమ్మ రోజూ సాయంత్ర వేళ మిరపకాయ బజ్జీలు (మిర్చీలు) వేస్తూ జీవనం సాగిస్తోంది. గ్యాస్ దొరకక మూడు రోజులపాటు ఇబ్బంది పడిన జానమ్మ రూ.వెయ్యి వరకు ఖర్చు చేసి ఇనుప డ్రమ్మును కట్టెలపొయ్యిగా మార్చుకుని మిర్చీలు వేస్తూ తన వ్యాపారం కొనసాగిస్తోంది. అయితే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా మండల కేంద్రంలో కొన్ని చిన్న హోటల్స్తోపాటు టీ స్టాళ్లు మూతపడ్డాయి. -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చౌటుప్పల్ : బైక్పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీకోదాడరూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన బి. బాబుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్ డే కేర్ సెంటర్) 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
గడువులోగా లక్ష్యం చేరేనా!
భూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల వసూలుకు మరో 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. ఈనెల 31 తేదీ వరకు గడువు ఉండడంతో ఆలోపు వంద శాతం పన్ను వసూలుకు అధికారులు అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించాలని ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. గడువు సమీపిస్తుండడంతో వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లు ఇంటింటా తిరిగి పన్నులు చెల్లించాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. పన్నులు చెల్లింపునకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు ఆన్లైన్లో కూడా చెల్లించుటకు వెలుసుబాటు కల్పించారు. 50 శాతం కూడా దరిచేరని లక్ష్యం.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు ఉండగా అందులో చౌటుప్పల్, మోత్కూరు మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్లు వసూలు 50శాతం కూడా లక్ష్యానికి చేరుకోలేదు. జిల్లాలో చౌటుప్పల్ మొదటి స్థానంలో ఉండగా, ఆలేరు చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 13 నాటికి చౌటుప్పల్లో 62.88 శాతం, ఆలేరులో 37.80 శాతం పన్నులు వసూలు అయ్యాయి. ఇక తెలంగాణలో 131 మున్సిపాలిటీలు ఉండగా, పన్నుల వసూలు విషయంలో రాష్ట్రస్థాయిలో వరుసగా చౌటుప్పల్ 34, మోత్కూరు 65, యాదగిరిగుట్ట 76, భువనగిరి 80, భూదాన్పోచంపల్లి 114, ఆలేరు 115 స్థానాల్లో నిలిచాయి. ఊరటనిచ్చిన మున్సిపల్ ఎన్నికలు.. గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు పన్నుల వసూలుకు కొంత ఊరటనిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు వారిని బలపరిచే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తి పన్నులు చెల్లించి నోడ్యూస్ సర్టిఫికెట్ జతపర్చాలనే నిబంధనతో అభ్యర్థులంతా ఆస్తి పన్నులు చెల్లించారు. దాంతో భువనగిరిలో రూ.20,85,000లు, చౌటుప్పల్లో రూ.15,89,526లు, యాదగిరిగుట్టలో రూ.14,39,000, భూదాన్పోచంపల్లిలో రూ.8,02,432లు, మోత్కూర్లోరూ.7,92,000లు, ఆలేరులో రూ. 5,69,730లు వసూలు అయ్యాయి. ఈనెల 13 నాటికి పన్ను వసూలు వివరాలు (రూ.కోట్లలో) మున్సిపాలిటీ గృహాలు డిమాండ్ వసూలు శాతం చౌటుప్పల్ 8,995 8.19 5.15 62.88 మోత్కూరు 5,024 1.37 0.72 52.55 యాదగిరిగుట్ట 5223 3.80 1.85 48.68 భువనగిరి 15,321 9.37 4.44 47.39 పోచంపల్లి 5,190 2.99 1.17 39.13 ఆలేరు 4,718 2.54 0.96 37.80 ఫ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు నెలాఖరు వరకే గడువు ఫ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న యంత్రాంగం ఫ ఇప్పటి వరకు 40 నుంచి 60 శాతమే వసూలు -
పోచంపల్లిని సందర్శించిన అమెరికన్లు
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత వస్త్రాల తయారీ విధానాలు, కులవృత్తుల జీవన స్థితిగతులను తెలుసుకొనేందుకు శనివారం ఇద్దరు అమెరికన్లు పోచంపల్లిని సందర్శించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, నాణ్యత, డిజైన్లు, మార్కెటింగ్ విధానాలు, ఉపాధి అవకాశాలను కార్మికులను నేరుగా తెలుసుకున్నారు. చేనేత డిజైన్లు చూసి కార్మికుల కళా నైపుణ్యాలను అభినందించారు. అనంతరం టూరిజం పార్కును సందర్శించారు. పోచంపల్లి చేనేత పరిశ్రమ, భూదా నోద్యమ చారిత్రక నేపథ్యాన్ని స్థానిక చేనేత కార్మికురాలు నవనీత వారికి వివరించారు. హోటళ్లు, దుకాణాలపై ‘సివిల్ సప్లయ్’ దాడులుమోత్కూరు : మోత్కూరు పట్టణంలో డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వినియోగిస్తున్న హోటళ్లు, ఇతర దుకాణాలపై శనివారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లయ్ ఏఎస్ఓ సురేందర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నర్సింగరావు, గిర్దావర్ నర్సింహారెడ్డి, భారత్ గ్యాస్ గోదాం ఇన్చార్జి చిప్పలపల్లి యాదగిరి తదితరులు ఉన్నారు. యాదగిరి క్షేత్రంలోవిశేష పూజలుయాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కేసుల రాజీకి పోలీసులు సహకరించాలి చౌటుప్పల్ : కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసేందుకు పోలీసులు కక్షిదారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. శనివారం చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సివిల్, ట్రాఫిక్, ఎకై ్సజ్ విభాగాల పోలీసు అధికారులతో లోక్ అదాలత్పై నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ ఉన్న కేసులన్నీ పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, కక్షిదారులు రాజీ పడేలా వారిని ప్రోత్సహించాలన్నారు. కోర్టు పరిధిలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ లోక్ అదాలత్ ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్, రూరల్ సీఐ రాములు, ఎకై ్సజ్ సీఐ బాలోజీనాయక్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ తరుచూ ట్రిప్ అవుతోంది
మూడు ఎకరాల్లో వరిసాగు చేశాను. రోజూ ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో మూడు ఎకరాల వరిలో 30 గుంటల వరకు ఎండితే గొర్లను మేపాను. 12 గంటలు కరెంట్ సరఫరా చేస్తే ఉన్న పొలం ఎండిపోకుండా ఉంటుంది లేదంటే పూర్తిగా ఎండిపోతుంది. – కాకళ్ల శేఖర్, రాజపేట మా పక్క రైతు బోరు వేయడంతో మా బావి వట్టిపోయింది. కరెంట్ సక్రమంగా సరఫరా కాక మూడెకరాల వరి గింజదశలో పూర్తిగా ఎండిపోవడంతో మూగజీవాలకు మేతగా ఇచ్చాను. – రాజమణి, మహిళా రైతు, పల్లెర్ల, ఆత్మకూర్(ఎం) మండలం -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్గౌడ్కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకట్రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి శిక్షణ తరగతులు
ఫ నిర్వహణకు గణాంక శాఖ ఏర్పాట్లు ఫ మే నుంచి మొదటి దశ ఇళ్ల లెక్కింపు ఫ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ సాక్షి, యాదాద్రి : జనగణన–2027 ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొదటి దశ నిర్వహించనున్న హౌస్ హోల్డ్ సమాచారం సేకరణకు సంబంధించి జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో సెన్సెస్ అధికారులకు ఆదివారం శిక్షణ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2011లో జనాభా లెక్కలు సేకరించారు. అనంతరం 2021లో జనగణన చేపట్టాల్సిన ఉండగా కరోనా కారణంగా జరగలేదు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా యూనిట్గా జనజనణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇళ్ల సర్వేపై శిక్షణ జనగణనలో భాగంగా ఇళ్ల లెక్కింపు సర్వేపై ఈనెల 15, 16, 17 తేదీల్లో కలెక్టరేట్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గణాంక శాఖ రాష్ట్ర అధికారులు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మండల, మున్సిపల్ సెన్సెస్ చార్జ్ అధికారులు, మండల అడిషనల్ చార్జ్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా 24, 25, 26 తేదీల్లో సెన్సెస్ క్లర్క్స్కు శిక్షణ ఇస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వలిగొండ, భువనగిరి, చౌటుప్పల్ మండలాలకు ఇద్దరు, మల్టీపర్పస్గా ఒక్కరు చొప్పున 26 మంది క్లర్క్స్ ఉంటారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఇళ్ల గణనకు ఫీల్డ్ ట్రైనీస్గా 26 మంది టీచర్లకు ఈనెల 28,29, 30 తేదీల్లో గణాంక శాఖ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఎఫెక్ సర్వే ప్రకారం జిల్లాలో సుమారు 2.14 లక్షల ఇళ్లు ఉన్నాయి. ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్.. జనగణన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా సెన్సెస్ అధికారిగా సీపీఓ ఉంటారు. రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, ఏడుగురు అదనపు సెన్సెస్ అధికారులు ఉంటారు. ఇందులో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు, సీపీవో, డీఈవో, డీఏవో, జెడ్పీ సీఈవో, డీపీవో, డీపీఆర్వో, ఏడీసీవోలు ఉంటారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు చార్జ్ అధికారులు, మేనేజర్లు అదనపు చార్జ్ అధికారులు, మండలాల్లో తహసీల్దార్లు చార్జ్ అధికారులుగా, ఎంపీడీవోలు అదనపు చార్జ్ అధికారుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి–2027లో గణన ఇళ్ల లెక్కలు తేలిన తర్వాత జనాభా లెక్కల సేకరిస్తారు. ఈ సారి జనగణన డిజిటల్ పద్ధతిలో చేపడతారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 20 నుంచి 30 శాతం జనాభా పెరిగే అవకాశం ఉంది. జనగణనలో భాగంగా ప్రతి ఇంటిని లెక్కిస్తారు. మేలో ప్రారంభమై సెప్టెంబర్ 2026 వరకు గణిస్తారు. ఇంటి స్వరూపం, గదుల సంఖ్య, జీప్లస్ 1, అంతకుపైగా ఉన్న వివరాలు, ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యులు సంఖ్య వంటి పలు అంశాలను లెక్కిస్తారు. ఇళ్ల సంఖ్య తేలిన అనంతరం జనగణన చేపడతారు. ప్రతి 700 నుంచి 800 మందికి ఒకరు చొప్పున ఎన్యుమరేటర్ ఉంటారు. ప్రతి ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటారు. వీరందరిని ఇప్పటికే ఎంపిక చేశారు. 2011 జనాభా లెక్కల వివరాలు.. మొత్తం జనాభా 7,70,833 మహిళలు 3,80,341పురుషులు 3,90,492 -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో వలిగొండ : పదో తరగతి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ సమీపంలో శనివారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామానికి చెందిన వనగంటి శివరాం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో తెలుగు పరీక్ష రాసేందుకు అతడు వలిగొండలోని పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రెడ్లరేపాక గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాంను స్థానికులు 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సహాయకురాలితో ‘పది’ పరీక్షకు హాజరుమిర్యాలగూడ : మండలంలోని యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వెన్నెలకు పుట్టుకతోనే పోలియో వలన కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. దీంతో ఆమె పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని సహాయకురాలి(స్క్రైబ్)గా నియమించారు. శనివారం వెన్నెల సహాయకురాలి సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చి తెలుగు పరీక్ష రాసింది. పదో తరగతి పరీక్షల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెన్నెలతో కలిపి 13 మంది విద్యార్థులకు స్క్రైబ్లను అనుమతించారు. పదో తరగతిలో మొత్తం ఏడు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇలాంటి వారికి ఏదో ఒక పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వెన్నెలకు ఇంగ్లిష్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. -
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరణించినా.. ఐదుగురికి ప్రాణదానంవేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు. -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్నగర్కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్లోని ఫిల్మ్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్టాప్, బైక్, టీవీ, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అష్ట బుద్ధుల వద్ధ బుద్ధజ్యోతి వెలిగించి హారతి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం పూర్వ విద్యార్థి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రశాంత్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
చెరువులో పడి యువకుడు మృతి
మోతె: కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన బుడ్డిపుడి రాములు – రాణి దంపతుల కుమారుడు బుడ్డిపుడి వెంకటేష్ (26) మోతె మండలం మామిళ్లగూడెం గ్రామంలోని తన అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ఓ పిల్లవాడు కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి సమాచారం అందించాడు. బంధువులు చెరువు వద్దకు చేరుకుని వెంకటేశ్ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంనిడమనూరు: సాగర్ ఎడమకాల్వలో గల్లంతైన మేకల కాపరి గంధం ఎల్లయ్య(54) మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. నిడమనూరు శివారులో బుధవారం సాగర్ ఎడమకాల్వలో మేకల కాపరి గంధం ఎల్లయ్య ప్రమాదవశాత్తు పడి గల్లంతు కాగా అతడి మృతదేహం శుక్రవారం ముకుందాపురం వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు నిడమనూరు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పొలానికి వెళ్లిన వ్యక్తి వాగులో పడి మృతి మిర్యాలగూడ అర్బన్: పాలేరు వాగులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య(55) పాలేరు వాగు అవతల ఉన్న తన పొలానికి ప్రతి రోజు పాలేరువాగు దాటి వెళ్తుంటాడు. రోజుమాదిరిగా ఈ నెల 12న మధ్యాహ్నం 12గంటల సమయంలో పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పాలేరు వాగు వెంట వెతకగా శుక్రవారం తెల్లవారుజామున అతడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయంపై మృతుడి కుమారుడు అనంతుల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. -
పట్టు పరిశ్రమలో తెలంగాణది నాలుగో స్థానం
భూదాన్పోచంపల్లి : పట్టు పరిశ్రమ అభివృద్ధిలో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని సెంట్రల్ సిల్క్ బోర్డు (మైసూర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ దయానంద అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో రీజినల్ సిల్క్ పరిశోధనా కేంద్రం, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టు రైతులు, రీలర్లు, చేనేత కార్మికుల సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి శ్రీపట్టు కృషి మేళా–2026శ్రీను పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్థన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పట్టు పరిశ్రమ అభివృద్ధిలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఇతర పంటలతో పోల్చితే పట్టు పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు 75 శాతం నుంచి 85 శాతం మేర రాయితీలు ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో 7వేల మంది పట్టు రైతులు 15వేల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారని చెప్పారు. పద్మశ్రీ గజం అంజయ్య మాట్లాడుతూ.. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టు ఉత్పత్తి పెంచి ఆఽర్థికంగా లాభపడాలన్నారు. కాగా.. మేళాలో పట్టు ఉత్పత్తులు, మల్బరీతోటకు పిచికారీ మందులు తదితర స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టు పరిశోధనా కేంద్రం మైసూర్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ జయషిరాణి, మల్లికార్జున, సెంట్రల్ సిల్క్ బోర్డు రీజినల్ సిల్క్ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్యాదవ్, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్లు ఎం. లత, అనసూయ, శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, జిల్లా సెరికల్చర్ అధికారిణి మాధవి, శ్రీరంజన్ సిల్క్ యూనిట్ నిర్వాహకుడు ఎన్నం శివకుమార్, టైఅండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, భారత భూషణ్, రాజేశ్వరీ, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ సెంట్రల్ సిల్క్బోర్డు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దయానంద -
గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు
భువనగిరిటౌన్ : జిల్లాల్లో గృహ అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా యంత్రాంగాలతో వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం భువనగిరి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ అక్షాంక్షశ్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ఎల్పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా ప్రజలకు గ్యాస్ కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని, పలు చోట్ల దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 49 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. గృహవసరాలకు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులకు సిలిండర్ కొరత రాకుండా చూసుకోవాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు. వాణిజ్య సిలిండర్లకు కొంత ఇబ్బంది ఉంది తప్ప, గృహవసరాలకు ఎలాంటి కొరత లేనందున ప్రజలు ఆందోళన చెంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదులకు సెల్ 9281423623 నంబర్ సంప్రదించవచ్చన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియ సమగ్రంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి రోజారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణ అధికారులు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా అధికారులకు శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో ఈనె 16న సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. చేనేతకు రూ.4 వేల కోట్లు కేటాయించాలిమోత్కూరు : చేనేత, పవర్ లూమ్ పరిశ్రమకు వేర్వేరుగా రూ.2 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.4వేల కోట్ల నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ త్రిప్టు పథకంలో కార్మికుడికి రూ.1,200, అనుబంధ కార్మికుడికి రూ.800 రికరింగ్ డిపాజిట్ చేస్తే ప్రభుత్వం వాటా కింద చేయాల్సిన డిపాజిట్ను తొమ్మిది నెలలుగా చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారివెంట చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముశం నరహరి, ఉపాధ్యక్షుడు వడకాల చంద్రశేఖర్ ఉన్నారు. ఇందిరమ్మ గృహం.. నిరుపేదలకు వరంయాదగిరిగుట్ట రూరల్ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరంలాంటిదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు, వంగపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహాల ప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులకు పట్టువస్త్రాలు, పొట్టేలును కానుకగా అందజేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీల ప్రకారం గూడులేని వారికి ఇళ్లు కట్టించి వారి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచులు చిన్నం మమత, వగ్గు రవళి , కానుగు బాల్రాజ్, చిన్నం శ్రీను, కానుగు రాజీవ్, గుర్రం బాలస్వామి, చిన్నం మల్లేష్, కొక్కలకొండ అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రానికి గ్యాస్ ఇబ్బంది లేదు – ఆలయ ఈఓ భవాని శంకర్ యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆలయ ఈఓ భవాని శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత దేవస్థానానికి లేకుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు లేఖ రాసి సంప్రదించామని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గ్యాస్ ఏజెన్సీ అధికారులు నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను అందించారని తెలిపారు. దేవాలయానికి సుమారు 425 కిలోలవి ప్రతినెలా 12 సిలిండర్లు, 19 కిలోలవి 250 సిలిండర్లు అవసరం పడుతున్నాయని, వీటిని అన్న ప్రసాదం, ప్రసాదాల తయారీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ నిల్వలో ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు. -
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం
కోదాడరూరల్ : ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని రామిరెడ్డిపాలెం రోడ్డు క్రాసింగ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని బాలాజీనగర్కు చెందిన అజ్మీర యశ్వంత్ అలియాస్ సన్నీ(14), గుండెపంగు రాకేష్ స్నేహితులు. చదువు మధ్యలో ఆపేసి ఇంటివద్దే ఉంటున్నారు. ఇద్దరు కలిసి లారీ ఆఫీస్ సమీపంలోని ఓ హోటల్లో భోజనం కోసం వెళ్లి పార్శిల్ తీసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ నుంచి కొరబండవైపు వెళ్తున్న డీసీఎం వీరి బైక్ను ఢీకొట్టింది. యశ్వంత్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేష్కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. ఫ యువకుడు మృతి, మరొకరికి గాయాలు -
నిషేధిత జాబితా నుంచి ఇళ్లను తొలగించాలి
ఆలేరు రూరల్ : మండల వ్యాప్తంగా నిషేధిత జాబితాల్లో చేర్చిన పేదల ఇళ్లు, భూములను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని తహసీల్ధార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. మండలంలో 1,600లకుపైగా ఇళ్లు, భూములు నిషేధిత జాబితాల్లో చేర్చడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఇదే సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిషేధిత జాబితాలో చేరిన ఇళ్ల బాధిత మహిళలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది పేదల ఇళ్లు కూల్చుకోవడానికేనా అని ప్రశించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే సమాదానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్, గ్యాదపాక నాగరాజు, కుండె సంపత్, కందుల శంకర్, రామ్నర్సయ్య, ఆరుట్ల లక్ష్మిప్రసాద్రెడ్డి, శోభన్బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తల, ఇళ్లు, భూముల బాధితులు, మహిళలు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
స్ప్రేయర్ల ఎంపికలో జాగ్రత్త.. దిగుబడిలో రక్షణ
పెద్దవూర: ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల కు పురుగులు, తెగుళ్లు ఆశి స్తున్నాయి. దీంతో రైతులకు పంటలపై ఒకటికి రెండుసార్లు క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం పరిపాటిగా మారింది. పిచికారీ చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లను సరిగ్గా ఎంపిక చేసుకోకపోతే రసాయనాలు వృథా కావడంతో పాటు పిచికారీ చేసే వ్యక్తి శరీరంపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల స్ప్రేయర్లకు సంబంధించి పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి.సందీప్కుమార్ వివరించారు. తైవాన్ పవర్ స్ప్రేయర్.. ఇటీవల అన్ని రకాల పంటలకు తైవాన్ పవర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. దీని ఖరీదు కంపెనీలను బట్టి రూ.20వేల వరకు ఉంటుంది. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో వెదజల్లే సామర్థ్యం దీనికి ఉంది. ఇతర వాటితో పోల్చితే దీనిలో సస్యరక్షణ మందులు మూడు వంతులు అధికంగా పోయాల్సి ఉంటుంది. రోజుకు సగటున 8 నుంచి 10 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. దీనికి అమర్చిన బెల్డ్ ద్వారా భుజాల వెనుక సులభంగా తగిలించుకోవచ్చు. ఈ పవర్ స్ప్రేయర్ చదరపు సెంటీమీటర్కు 30–35 కిలోల ఒత్తిడిని కలగజేస్తుంది. ధ్వని కాలుష్యం కూడా తక్కువ. ఒకేసారి 20 అడుగుల వెడల్పుతో పిచికారీ చేయొచ్చు. ఇంజిన్ పనిచేయడానికి గంటకు లీటర్ పెట్రోల్ అవసరం అవుతుంది. లీటర్ పెట్రోల్ ఆరు ఎకరాలకు సరిపోతుంది. నిమిషానికి 7.2 లీటర్ల మందును చల్లవచ్చు. బరువు తొమ్మిది కిలోలు. దీనిలో 20 లీటర్ల రసాయం ద్రావణం, 900 మి.లీ.ల పెట్రోల్ పడుతుంది. ఇటీవల వచ్చిన ఆధునాతన పవర్ స్ప్రేయర్లతో ఒక వ్యక్తి మందు ద్రావణ డబ్బాను భుజానికి తగిలించుకుంటే , రెండు వైపులా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో రసాయన మందును పిచికారీ చేసే పరిస్థితి వచ్చింది. నాప్సాక్ స్ప్రేయర్ దీని బరువు తక్కువగా ఉండేందుకు పాలిథీన్తో తయారు చేస్తారు, స్ప్రేయర్ ట్యాంకు పరిమాణం 15–16 లీటర్లు. దీనికి ఉన్న బెల్టుల ద్వారా భుజాల వెనక సులువుగా తగిలించుకోవచ్చు. పంట అన్ని దశల్లో మందు పిచికారీకి స్ప్రేయర్ సులువుగా ఉపయోగపడుతుంది. ధర రెండు వేల లోపే ఉంటుంది. ట్యాంకు లోపలి భాగాన పంపు, గాలి గది, పైభాగాన ఒక రంధ్రానికి ప్లాస్టిక్ గొట్టం బిగించబడి ఉంటుంది. రెండో చివర నాజిల్ ఉంటుంది. ట్యాంకులో అమర్చబడిన పిస్టన్ పైకి కిందకు కదలడం వలన ద్రావణంపై ఒత్తిడి ఏర్పడి రబ్బరు గొట్టం ద్వారా నాజిల్ ద్వారా బయటకు వెలువడుతుంది. పిస్టన్ కదిలించటానికి హ్యాండిల్ ఉంటుంది. దీనితో రసాయన ద్రావణం అంతటా సమంగా పడుతుంది. ఫుట్ స్ప్రేయర్ ఇది కాళ్లతో పనిచేస్తుంది. మినుము, పెసర వంటి పంటలతో పాటు కూరగాయ తోటలు, మామిడి, బత్తాయి వంటి పండ్లతోటల్లో సస్యరక్షణ మందులను పిచికారీ చేయొచ్చు. రోజుకు రెండు ఎకరాల్లో, పండ్ల తోటల్లో సగటున రోజుకు 150 చెట్లకు పిచికారీ చేయొచ్చు. ధర రూ.4వేల లోపే ఉంటుంది. ఇత్తడితో తయారైన ఫుట్ స్ప్రేయర్లో ప్రధానంగా చిన్న బ్యారల్, కదిలే పిస్టన్ ఉంటుంది. బ్యారల్ అడుగుభాగానికి ప్లాస్టిక్ గొట్టం కలపబడి ఉంటుంది. రెండో చివరన ఫిల్టర్ గరాటు బిగించబడి ఒక పాత్రలోని రసాయన ద్రావణంలో మునిగి ఉంటుంది. పెడల్ను కాళ్లతో తొక్కినప్పుడు పిస్టన్ బ్యారల్లో పైకి కిందికి కదలడంతో ద్రావణం బ్యారల్ పైభాగానికి చేరి అక్కడి నుంచి గాలి గది ద్వారా రెండో గొట్టం చివర ఉన్న నాజిల్ గుండా బయటకు వెళ్తుంది. దీనిలో చదరపు సెంటీమీటర్కు 8 నుంచి 13 కిలోల ఒత్తిడి తీసుకురావచ్చు. అధిక ఒత్తిడి వలన ఎత్తుగా ఉన్న మామిడి చెట్లకు సులభంగా పిచికారీ చేయొచ్చు. ఫ వాతావరణ మార్పులతో పంటలకు తెగుళ్లు ఫ సరైంది ఎంచుకోకపోతే రసాయనం వృథా -
టెన్త్ పరీక్షలకు 50 కేంద్రాలు
సాక్షి, యాదాద్రి : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఈ సారి అనుమతిస్తారు. ఐదు నిమిషాలు దాటితే పరీక్ష రాయడానికి అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఉదయం 9గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానికి పరికరాలను అనుమతించరు. మొత్తం 8,913 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు జరుగుతాయి. కేంద్రాల వద్ద 163 సెక్షన్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అలజడి జరుగకుండా బీఎన్ఎస్ 163 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాల నిఘాలో కేంద్రాలు ఉంటాయి. పరీక్షా సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ చొప్పున మొత్తం 50 మంది సూపరింటెండెంట్లు, 50 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 572 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అడిషనల్ షీట్స్ కాకుండా 24 పేజీలు, 12 పేజీలతో కూడిన బుక్లెట్స్ను విద్యార్థులకు ఇస్తారు. సౌకర్యాలు ఇలా.. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ద్రావణం ఇతర అనారోగ్య కారణాలకు చికిత్స దించడానికి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎంలను నియమించారు. కేంద్రాల్లో విద్యుత్, ఫర్నిచర్, చల్లని నీరు, మరుగుదొడ్లు వసతులు ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వాటి పరిష్కారానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం 9010772080ను టోల్ప్రీ నంబర్ను అధికారులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాతంగా పరీక్షలు రాయాలి. గతేడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాల సాధనకు పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తాం. –కె.సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఫ పరీక్షలు రాయనున్న 8,913 మంది విద్యార్థులు ఫ ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ప్రీ నంబర్ 9010772080 ఏర్పాటు -
బకాయిలు చెల్లించండి
భూదాన్పోచంపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే వీటి నుంచే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి నెలాఖరుతో ముగిసింది. అప్పటి నుంచి తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకాధికారులుగా పంచాయతీల్లో పాలన కొనసాగింది. ఈ క్రమంలో పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చాలా పనులు పూర్తిచేసేందుకు తన సొంత డబ్బులను ఖర్చు చేశారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేశాక తీసుకుందామంటే సకాలంలో రాక నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. 2024–25లో రూ.7.60 కోట్లు ఖర్చు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 390 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, వీద్యుద్ధీపాలు, పైప్లైన్ మరమ్మతులు, ఇతర పనులకు సుమారు రూ.7.60 కోట్ల మేర ఖర్చు చేశారు. కాగా ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.7,59,29,667లను విడుదల చేసింది. దాంతో విడుదలైన నిధుల నుంచే బకాయిలను సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉంటే తాజా మాజీ సర్పంచులు సైతం తమ కూడా బకాయిలు రావాలని తాజాగా గ్రామ పంచాయతీల్లో జమ అయిన నిధుల నుంచి చెల్లించాలని అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం విడుదలైన నిధులు ఇటు కార్యదర్శులు, అటు మాజీ సర్పంచులు తమకంటూ తమకే ఇవ్వాలని పట్టుబట్టుతున్నారు. చివరికి ఉన్నతాధికారులు ఎవరికి ఎలా సర్దుబాటు చేస్తారో వేచిచూడాల్సిందే. నిబంధనలు ఇవీ.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్టైడ్ పేరిట విడుదల చేస్తుంది. టైడ్ నిధులను తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు, క్లోరినేషన్, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్యం పనులకు వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధులను పంచాయతీ అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఒక్కో పంచాయతీ కార్యదర్శి గరిష్టంగా రూ.3 లక్షల మేర సొంతంగా చేతి నుంచి గ్రామాభిృద్ధికి ఖర్చు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం నుంచి తమ బకాయిలు చెల్లించాలని ఇటీవల డీపీఓను కలిసి విన్నవించాం. – నరేందర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు తదితర పనులకు చేసిన ఖర్చులకు మాత్రమే చెల్లింపులు చేస్తాం. మొదటి ప్రాధాన్యతగా పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలి. మిగిలిన బడ్జెట్తోపాటు వచ్చే విడతలో మంజూరయ్యే నిధుల నుంచి బకాయిలు తీసుకొనేందుకు ఉత్తర్వులు ఇస్తాం. – విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిఫ ఉన్నతాధికారులకు పంచాయతీ కార్యదర్శుల విన్నపం ఫ గ్రామాల అభివృద్ధికి రూ.7.60 కోట్ల మేర సొంత డబ్బులు ఖర్చు ఫ బిల్లులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన -
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళ భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు పూజలు, నిత్యకల్యాణాన్ని విశేషంగా జరిపించారు. సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. -
ఉగాది వేడుకలకు కవి బాల్రెడ్డికి ఆహ్వానం
నార్కట్పల్లి: మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ఉగాది వేడుకలకు నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, కవి, రచయిత, పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డికి శుక్రవారం ఆహ్వానం వచ్చింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా ఈ నెల 18న చైన్నెలోని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా కవి సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలుగు కవులు, తెలుగు వారి సాంస్కృతిక వారసత్వం, ఉగాది విశిష్టతను తమ కవితా పఠనంతో వివరించనున్నారు. బైక్ చెట్టును ఢీకొని వ్యక్తి మృతిభువనగిరి: మండల పరిధిలోని పగిడిపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని హన్మాన్వాడ్కు చెందిన మోతె శ్రీరాములు(38) బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో బంధువుల ఇంటికి బైక్పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి భువనగిరికి బయలుదేరాడు. భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టును అదుపుతప్పి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. అవయవదానంతో నలుగురికి పునర్జన్మకేతేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి బ్రెయిన్డెడ్ కావడంతో అతడి అవయవాలను కుటుంబసభ్యులు జీవన్దాన్ సంస్థకు అప్పగించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామానికి చెందిన శివాలయ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల జగన్మోహన్రెడ్డి(57) ఈనెల 10న బైక్పై నల్లగొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో తాటికల్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జగన్మోహన్రెడ్డి బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఈమేరకు ఆయన కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. వైద్యుల సూచనల మేరకు జగన్మోహన్రెడ్డి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు గురువారం రాత్రి ఆస్పత్రికి చేరుకుని అవయవాలను సేకరించారు. శుక్రవారం జగన్మోహన్రెడ్డి మృతదేహాన్ని ఇనుపాముల గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
భూగర్భ జలాలను సంరక్షించాలి
భువనగిరిటౌన్ : భూగర్భజలాలను సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు తగినన్ని నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. భూగర్భ జలాల సంరక్షణపై శుక్రవారం భువనగిరి కలెక్టర్లో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీజీడబ్ల్యూ రీజినల్ డైరెక్టర్ జ్యోతికుమార్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా భూగర్భ జల సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. జిల్లా భూగర్భ జల అధికారి జ్యోతికుమార్ మాట్లాడుతూ భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం భూగర్భ జలమండలి ఆధ్వర్యంలో ముద్రించిన నకీమ్ రిపోర్ట్, జిల్లా రీచార్జ్ మ్యాప్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీజీడబ్ల్యూ శాస్త్రవేత్త యాదయ్య, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, సుధీర్కుమార్, మాధవ్, సరిత, రేష్మ పిల్లాయి, సర్ధాజ్ భాషా, అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
తగ్గిన నీరు.. ఎండిన పైరు
ఆత్మకూర్ (ఎస్) : మండల వ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు తగ్గడంతో పాటు ఎస్సారెస్పీ కాలువ నీరు సరిగ్గా రాకపోవడం పంటలను ఎండుముఖం పట్టేలా చేసింది. పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు తగ్గడం, కరెంటు కష్టాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూర్లోని ఏనుబాముల రోడ్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పంటను కాపాడునేందుకు రైతు జనరేటర్ సాయంతో పంటకు నీళ్లు పెడుతున్నాడు. మరికొన్ని చోట్ల గత్యంతరం లేక పండించిన వరిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో సుమారు 10వేల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదంలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లతో నీరు మునుగోడు : వరి పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాసంగి సీజన్ ఆరంభంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు.. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు పడిపోవడంతో నీరు అడుగంటింది. పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి వేల రూపాయలు ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి పొలాలకు పెట్టే పరిస్థితి ఎదురవుతోంది. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బగా మారింది. గ్రామంలో దాదాపు 50 మందికిపైగా రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి వరి పొలాలకు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా రైతులకు సరిపడా ట్యాంకర్లు దొరకకపోవడంతో ఇతర గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. నిత్యం పదికి పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఫ పంటను కాపాడుకునేందుకు రైతుల అష్టకష్టాలు ఫ ట్యాంకర్లతో నీటి సరఫరా ఫ కరెంటు కష్టాలు కూడా తోడవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు -
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
చౌటుప్పల్ : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారుల విఫలమయ్యారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. చౌటుప్పల్లో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా ప్రాంతీయ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, కె.నర్సింహ, ఎం.బాలరాజు, కృష్ణారెడ్డి, జి.శ్రీనివాసచారి, పెంటయ్య, పాషా, సైదులు, కరుణాకర్, కిష్టయ్య, నర్సిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, స్వామి, బి.నర్సింహ, సంజీవరెడ్డి, అంజిరెడ్డి, మధుకృష్ణ పాల్గొన్నారు. -
కారు ఢీకొని పోస్టుమెన్ దుర్మరణం
సంస్థాన్ నారాయణపురం: ఉత్తరాలను బట్వాడా చేసేందుకు పోస్టుమెన్ బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటన సంస్థాన్నారాయణపురం మండలం దేవిరెడ్డిబంగ్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వేల్ గ్రామ పోస్టుమెన్గా బూస వెంకటేశ్వర్లు గుప్త(60) పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఉదయం దేవిరెడ్డిబంగ్లా గ్రామంలో ఉత్తరాలు బట్వాడా చేసి, తిరిగి ఎర్రగుంట గ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వేగంగా వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు గుప్త అక్కడికక్కడే మృతి చెందాడు. కుంటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్ తెలిపారు. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన్నం రమేష్(32) టోయింగ్ వెహికిల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల అతడి తల్లి మృతిచెందడంతో మానసికంగా మరింత కుంగిపోయాడు. గురువారం రమేష్ సొంత బామ్మర్ది వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం చిన్నరామచర్ల గ్రామంలో జరిగిన హాల్ది వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం రాత్రి కారులో రమేష్ ఆలేరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం భార్య, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ స్పందించలేదు. దీంతో పక్కింటి వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని రమేష్ కనిపించాడు. మృతుడి సోదరి చిన్నం స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ ఆత్మహత్యతో గురువారం జరగాలి్సన అతడి బావమర్ది పెళ్లి నిలిచిపోయింది. -
పడవ మీద పడి వ్యక్తి మృతి
గరిడేపల్లి : లారీలో తరలిస్తున్న పడవ రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ స్తంభానికి తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తిపై పడడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం బెట్టితండా గ్రామానికి చెందిన మాలోతు లక్ష్మ(37) గురువారం కేసు విచారణ నిమిత్తం బైక్పై హుజూర్నగర్ కోర్టుకు బయల్దేరాడు. అదే సమయంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కాప శ్రీనివాస్ రాజమండ్రి నుంచి పడవను లారీలో సుంకేసుల డ్యాం వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గరిడేపల్లి మండల కేంద్రంలోకి రాగానే లారీపై ఉన్న పడవ రోడ్డు మధ్యలోని సెంట్రల్ లైటింగ్ స్తంభానికి తగలి రోడ్డుకు అటువైపు బైక్పై వెళ్తున్న మాలోతు లక్ష్మ తలపై పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఫ లారీలో పడవ తరలిస్తుండగా స్తంభానికి తగిలి మీదపడటంతో ఘటన -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
భువనగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99రోజుల కార్యచరణ ప్రణాళిక పై నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లు, సర్పంచ్లు, చైర్మన్న్లకు గురువారం స్థానిక వి కన్వెన్షన్లో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు, చైర్మన్న్లు గ్రామాలు, పట్టణాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతనరేషన్కార్డుల జారీ, సన్న బియ్యం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రానున్న ఎండకాలంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నుంచి నిధులుమంజూరు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు నచ్చేలా అభివృద్ధి పనులు చేయాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించినట్లయితే అందంగా తయారవుతాయన్నారు. సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై నప్రజాప్రతినిధులు పట్టుదలతో అభివృద్ధి పనులు చేపడితే విజయం సాధించవచ్చన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధులను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా 10 అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, జెడ్పీ సీఈఓ శోభారాణి, సర్పంచ్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఫ భువనగిరిలో ప్రజాప్రతినిధులకు శిక్షణ -
ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు
కట్టంగూర్ : ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు జరిగిందని జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ కేంద్ర బృందం సభ్యులు నవనీత, రాచీ గార్గ్, ప్రతీక్ కోర్డే అన్నారు. గురువారం వారు నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ నర్సింహారావు, ఏపీఓ కడెం రాంమోహన్తో కలిసి కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, కల్మెర, పరడ, కట్టంగూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులను పరిశీలించారు. సోక్పిట్, అమృత్ సరోవర్, ఓవర్హెడ్ ట్యాంకు, చెక్ డ్యాం, ఫాంపాండ్, చేపల చెరువు పనులను పరిశీలించి వాటి ప్రయోజనాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. నీటి నిల్వ పనులతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేకూరిందన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు ముక్కాముల శ్యామలశేఖర్, తోటకూరి జలజ, కొలిపాక సురేందర్, ఇప్పలపల్లి అనిత, ఈసీ శ్రీధర్, టీఏ రమణ, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఫ జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ బృందం ఫ కట్టంగూర్ మండలంలో ఉపాధి హామీ పనుల పరిశీలన -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
భూదాన్పోచంపల్లి: మహిళా చేనేత కార్మికులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలని యునైటెడ్ నేషన్–ఉమెన్ సంస్థ (ఢిల్లీ) ప్రతినిధి షిరిన్ అన్నారు. భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కులో నాలుగు రోజులుగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ సహకారంతో మహిళా చేనేత కార్మికులకు శ్రీజన్ పేరిట నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరున్నా, ఆ బ్రాండ్ ఇమేజ్ను వినియోగించుకొని సరైన మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు మార్కెటింగ్ రంగంలో రాణించాలంటే వారికి శిక్షణ ఎంతో అవసరం అని అన్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు సొంతంగా వెబ్సైట్ రూపొందించుకొని నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. తమ ఉత్పత్తులను ఏ విధంగా ప్రమోట్ చేయాలి, కొత్త డిజైన్ల రూపకల్పన, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించామన్నారు. అలాగే ఎంపిక చేసిన ఐదుగురు మహిళా చేనేత కార్మికులకు ఢిల్లీలో జాతీయస్థాయిలో మరింత శిక్షణ ఇచ్చి వ్యాపారవేత్తలుగా రాణించే విధంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జార్ఖండ్, వారణాసి, ఓడిశా, అహ్మదాబాద్లో మహిళలకు శిక్షణ ఇచ్చామన్నారు. త్వరలో పోచంపల్లి కేంద్రంగా చేనేత కార్మిక మహిళలకు ప్రత్యేకంగా చేనేత డిజైన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ అవార్డు గ్రహీతలు భోగ సరస్వతీబాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, మహిళా చేనేత కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
నల్లగొండ: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(62) పని నిమిత్తం గురువారం నల్లగొండకు వచ్చింది. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు గాను బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి నల్లగొండ బస్టాండ్లోకి వస్తూ సుభాష్ విగ్రహం వద్ద దేవకమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమార్తె పబ్బతిరెడ్డి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కోర్టులో స్పృహతప్పి పడిపోయిన వ్యక్తిరామగిరి(నల్లగొండ): నల్లగొండ కోర్టులో గురువారం ఓ వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. వలిగొండ మండలం అర్రూర్ గ్రామానికి చెందిన బండారు నర్సింహారెడ్డి కేసు నిమిత్తం నల్లగొండ జిల్లా కోర్టుకు వచ్చాడు. ఉన్నట్టుండి అతడికి చెమటలు పట్టి ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు కోర్టులో ఉన్న డిస్పెన్సరీకి తీసుకెళ్లి ఈసీజీ తీయగా హార్ట్ఎటాక్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో 108 వాహనంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
హోటళ్లకు గ్యాస్ తంటా
యాదగిరిగుట్ట: పశ్చిమాసియాలో యుద్ధప్రభావం మనప్రాంతంలో వంటగ్యాస్ సరఫరాపై పడింది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్రమత్తమైన ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల కోసం బుకింగ్ కష్టాలు తప్పడంలేదు. యాదగిరిగుట్ట పట్టణంలో సుమారు 20కి పైగా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇందులో టిఫిన్స్ తయారు చేసేందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఎక్కువగా నిర్వాహకులు వినియోగిస్తున్నారు. తాజాగా హోటళ్లకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలివేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిపై టిఫిన్స్ను తయారు చేస్తున్నారు. అంతే కాకుండా పలు హోటల్స్ మూసివేసేందుకు సిద్ధమయ్యారు. వారం రోజులుగా.. యాదగిరిగుట్టలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రతి నెలా 250 కమర్షియల్ సిలిండర్లు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో వారం రోజులుగా హోటళ్లకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన సిలిండర్లు ఉండటంతో కొన్ని హోటల్స్ టిఫిన్స్ తయారు చేస్తుండగా.. మరి కొన్ని హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు అయిపోయాయి. దీంతో పలువురు నిర్వాహకులు యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు టిఫిన్స్, భోజనాలను అందించేందుకు కట్టెల పొయ్యిలపై టిఫిన్స్, వంటలు చేసే పరిస్థితి నెలకొంది. ఇక యాదగిరి క్షేత్రంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదానికి సరిపోను సిలిండర్లు అందజేస్తున్నట్లు హెచ్పీ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్ల కొరత రాబోయే రోజుల్లో ఉంటుందనే ఆలోచనలో ప్రజలు ముందస్తుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు హెచ్పీ ఎజెన్సీ కస్టమర్ కేర్కు కాల్స్ చేస్తుంటే నెట్వర్క్ బిజీ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో సైతం గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు మాత్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ఓటీపీ వచ్చిన ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. యాదగిరిగుట్టలో కట్టెల పొయ్యిపై టిఫిన్స్, వంటలు చేస్తున్న ఓ హోటల్ నిర్వాహకుడుగుట్టలో మూతబడిన చాయ్ దుకాణం నిలిచిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఫ కట్టెల పొయ్యిపై టిఫిన్స్ తయారీ ఫ డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్ కోసం వినియోగదారుల పాట్లు -
ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
భువనగిరి: జిల్లాలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–1 పరీక్ష జరిగింది. ఆయా పరీక్షలకు మొత్తం 6,642 మంది విద్యార్థులకు గాను 6,359 మంది హాజరు కాగా 282 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షల ముగింపు రోజు కావడంతో విద్యార్థులు ఒకరినొకరి బైబై చెప్పుకుంటూ స్వగ్రామాలకు వెళ్లారు. -
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్ ఫార్మా కంపెనీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య అనే నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయంపై కంపెనీ యాజమాన్యం బయటకు రానివ్వడం లేదని కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కాలుష్యంతో సమీప ప్రాంతాల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శ్వాస సంబంధ వ్యాధులతో తరచూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. కంపెనీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫ నలుగురు కార్మికులకు ఆస్వస్థత -
పరీక్షల వేళ.. ఆరోగ్యం భద్రం
పరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజూ సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం. కనీసం 15 నిమిషాలు నడవడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉంటారు. – మల్లెల వందన, వైద్యాధికారిణి తిరుమలగిరి (తుంగతుర్తి) : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే పరీక్షల భయంతో విద్యార్థులు హైరానా పడుతుంటారు. తిండి సరిగా తినరు. సమయానికి నిద్రపోరు. ఈ సమయంలో పరీక్షలకు సన్నద్ధమయ్యే పిల్లల ఆహారంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం అందిస్తూ మనస్సుకు ప్రశాంతత చేకూరే వాతావరణం కల్పిస్తే ఒత్తిడిని అధిగమిస్తారని చెబుతున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులైతే పరీక్షల సమయంలో బరువు తగ్గిపోతున్నారని, పరీక్షలకు ఎంత కష్టపడి సన్నద్ధమవుతుంటారో అదే స్థాయిలో ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన ఆహారం తీసుకోని విద్యార్థుల్లో ఎక్కువ చిరాకు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుందని విద్య, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకోండి ఇలా.. అల్పాహారం : ఉదయం అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఇవి మెదడుకు అదనపు శక్తిని ఇస్తాయి. ● పొట్టుతో కూడిన పదార్థాలతో తయారుచేసిన ఇడ్లీ, పెసరట్టు, గోధుమ ఉప్మా, బ్రౌన్ బ్రెడ్, జొన్న రొట్టె వంటివి తీసుకోవడం మంచిది. వీటితో పాటు గ్లాసు పాలు, పండ్లు తీసుకోవడం మంచిది. ● పీచు పదార్థాలు, కెరోటిన్ వంటి ఇతర ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆపిల్, నారింజ, క్యారెట్ మొక్కలు, బాదం, పిస్తాలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం : మధ్యాహ్నం అన్నం, గోధుమ రొట్టెలతో పాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం(పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు) తీసుకోవాలి. వాటిలో ఏకాగ్రత పెంచడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ● అంతేకాకుండా పెరుగు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి భోజనం : రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పప్పు ధాన్యాలతో పాటు కోడిగుడ్డు తీసుకోవడం ఉత్తమం. రాత్రి 10 గంటల వరకు చదివి పాలు తాగి పడుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా రోజూ తగినంత నీటిని తాగాలి. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. నిద్ర ఎంతో ముఖ్యం పరీక్షల వేళ కొంతమంది విద్యార్థులు సమయానికి నిద్రపోరు. రాత్రంతా మేల్కోని చదువుతుంటారు. సరైన ఆహారం తినరు. ఇలా కొన్నిరోజులు అలవాటైతే తిండిపై ధ్యాస తగ్గిపోతుంది. ఎక్కువగా టీ, కాఫీలు తాగుతూ రాత్రంతా మేలుకొని ఉండటం వల్ల ఆకలి మందగిస్తుంది. దీంతో నిద్ర లేమికి గురవుతుంటారు. ఒత్తిడి అధిగమించేందుకు, జ్ఞాపకశక్తిని కలిగి ఉండేందుకు ఆహార పదార్థాలు తిన్న అరగంట వరకు మెదడుపై ప్రభావం ఉంటాయి. వీలైనంత వరకు బయటి ఫుడ్ తీసుకోకపోవడం ఉత్తమం. ఫ విద్యార్థులకు తల్లిదండ్రులు సమతుల ఆహారం ఇవ్వాలి ఫ సమయానికి నిద్ర తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు -
వేతన బిల్లుల కోసం లంచం డిమాండ్
మోత్కూరు : ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన వేతన బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం తీసుకున్న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ను గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న పైళ్ల జనార్దన్రెడ్డి 38 రోజులకు గాను తనకు రావాల్సిన రూ.1,09,386 వేతన బిల్లులు క్లియర్ చేయాలని గత నెల 5న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించగా.. సీనియర్ అకౌంటెంట్ ఎండీ ఖదీర్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఖదీర్తో పాటు అతడి సహచర ఉద్యోగి నిరంజన్ అకౌంట్కు విడతల వారీగా రూ.10 వేలు పంపించిన తర్వాతే ఆన్లైన్ చేసి టోకెన్ ఇచ్చారని ఈ నెల 4న కలెక్టర్తో పాటు ఏసీబీ అధికారులకు జనార్దన్రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై దాడి చేసి రికార్డులను పరిశీలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ముందుగా భువనగిరిలోని ఖదీర్ నివాసంలో సోదాలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఖదీర్ను అరెస్టు చేశామని, శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఫ మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్ -
రసవత్తరంగా నాటక పోటీలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గురువారం నాలుగో రోజు పోటీలను ప్రముఖ పారిశ్రామికవేత్తలు కర్నాటి రమేష్, బండారు కుశలయ్య, గొల్ల రామశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాటక రంగంలో మిర్యాలగూడ ఖ్యాతిని ఢిల్లీ వరకు చాటిన స్థానిక కళాకారుల కృషి అభినందనీయమని కొనియాడారు. అనంతరం విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి చెరిగిపోని చిరునామా, విశాఖపట్నం నటరాజ డ్రమాటిక్ అసోసియేషన్ వారి నీళ్లు నీళ్లు, వరంగల్ మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వారి వివాహ బంధం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులకు ప్రశంసా పత్రాలు, షీల్డులు అందజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
మేకల అపహరణ
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన దొండ లింగమల్లుయాదవ్కు చెందిన 5 మేకలను గు రువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్య క్తులు అపహరించారు. దీంతో బాధితుడు మో త్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని మోత్కూరు సీఐ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతికట్టంగూర్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కల్మెర గ్రామ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి యాదయ్య(59) గురువారం ఉదయం కట్టంగూర్లో ఉంటున్న తన కుమార్తె వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కల్మెర గ్రామ శివా రులోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. యాదయ్యను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. భార్యను వేధించిన వ్యక్తికి జైలు శిక్షరామగిరి(నల్లగొండ): భార్యను వేధించిన భర్తకు నల్లగొండ ప్రత్యేక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నేరాలు కోర్టు న్యాయమూర్తి దారా సాయిమేఘన రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన గిరిగాని వేణుకు నల్లగొండకు చెందిన మహిళతో వివాహమైంది. వేణు తన భార్యను వేధిస్తుండడంతో ఆమె నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లో 2015లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి వేణును కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా పబ్లిక్ ప్రొసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి నిందితుడికి రెండేళ్లు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బైక్ను ఢీకొట్టిన కారుఫ ఒకరికి గాయాలు అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు ఫ ప్రయాణికులు సురక్షితం మునగాల:హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రం శివారులో గురువారం తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అతివేగంతో వెళ్తున్న ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో డ్రైవర్ అప్రమత్తమై కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
భువనగిరిటౌన్ : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను త్వరగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో చేపట్టిన ఇందిర మహిళా శక్తి భవనం, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరంలో సెర్ప్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాప్రమాణాలు మెరుగు పర్చేందుకే తనిఖీలుమోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నోడల్ బృందం సభ్యులు వనం వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం గురువారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, పద్మశాలీ కాలనీ, కాశవారిగూడెం, ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసింది. పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, లైబ్రరీ నిర్వహణ, ఉపాధ్యాయుల డైరీలు, లెస్సన్ ప్లాన్స్, స్టాక్ రిజిష్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించింది. కార్యక్రమంలో పాఠశాలల హెడ్మాస్టర్లు పుష్పలత, పరమేశ్వరి, నర్సయ్య, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు, రేపు సీపీఎం సమావేశాలుభువనగిరిటౌన్ : సీపీఎం జిల్లా ప్రాంతీయ సమావేశాలు చౌటుప్పల్, భువనగిరి కేంద్రాలుగా శుక్ర, శనివారం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షిక బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు అదనంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, ధర్మారెడ్డి కాల్వ పనులు పూర్తి చేయాలని, బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలకు మరమ్మత్తులు చేయాలని, బీబీనగర్ ఎయిమ్స్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి భువనగిరిటౌన్ : జిల్లాలో రబీకి సంబంధించి సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై సివిల్సప్లయ్, అగ్రికల్చర్, కోఆపరేటివ్, మెప్మా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ వంటివి అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరతలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణ, సివిల్ సప్లయ్ రోజారాణి , వ్యవసాయ అధికారి రమణారెడ్డి, రవాణాశాఖ అధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన సులువు
భూదాన్పోచంపల్లి : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధిస్తారని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు. భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కన్ఫ్లూఝెన్స్–2026 వేడుకల్లో భాగంగా గురువారం రెండో రోజు విద్యార్థులకు స్పోర్ట్స్, అథ్లెటిక్స్, డ్యాన్స్, పాటలు, కవి సమ్మేళనం పోటీలతో పాటు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సుచిత్ర చంద్రబోస్తో పాటు ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్, సినీ గాయని గీతామాధురి, సినీ గేయరచయిత అనంత్ శ్రీరాం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గడ్డం మోహన్రావు వ్యవహరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుచిత్ర చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్నవారు ఏ రంగంలోనైనా రాణించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు క్షణికావేశంలో తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవద్దని సూచించారు. యాంకర్ రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలని అన్నారు. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం మాట్లాడుతూ.. మహిళలు శక్తి స్వరూపిణి అని, వారికి సాధించే సామర్థ్యం ఉంటుందని అన్నారు. సింగర్ గీతామాధురి మాట్లాడుతూ.. చదువును మించిన ఆయుధం మరొకటి లేదని అన్నారు. ఆశ, ఆశయం ఉంటే విజయం మనదే అని పేర్కొన్నారు. సినిమాలను ఎంటర్టైన్మెంట్గానే చూడాలి తప్ప నిజజీవితానికి అన్వయించుకోద్దని సూచించారు. అనంతరం వారిని కళాశాల నిర్వాహకులు శాలువాలు కప్పి మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్యాలయాల జాయింట్ సెక్రటరీ వీఎస్ఆర్ శర్మ, మల్టీజోనల్ అధికారి రజిని, స్టేట్ ఆఫీసర్ నిర్మల, జోనల్ అధికారిణి విద్యాంజలి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, అధ్యాపకులు, అధ్యాపకయేతర బృందం పాల్గొన్నారు. మాట్లాడుతున్న యాంకర్ రష్మి గౌతమ్మాట్లాడుతున్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాంవిద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న గాయని గీతామాధురిఫ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ ఫ దేశ్ముఖిలోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాలలో స్పోర్ట్స్, కల్చరల్ మీట్ ఫ న్యాయ నిర్ణేతలుగా హాజరైన సినీ ప్రముఖులు -
బుకింగ్ టెన్షన్
భువనగిరిటౌన్ : ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకుందామంటే సాంకేతిక కారణాలతో కావడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 8 నుంచి 10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడి సిస్టమ్ క్రాష్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు గృహ వినియోగ సిలిండర్ల సరఫరా ఏకంగా 50 శాతం మేర తగ్గిపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులుదీరుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం కనీస నిరీక్షణ సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అయితే, చివరి డెలివరీ తర్వాత 25 రోజులు పూర్తి కాకముందే బుక్ చేయడానికి ప్రయత్నించే కస్టమర్లను నిరోధించే వ్యవస్థ టెలికం నెట్వర్క్ స్థాయిలో లేకపోవడంలో, ప్రతి కాల్ ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ అప్లికేషన్లకు చేరుతోంది. ఈ అసాధారణ ట్రాఫిక్ వల్ల మొత్తం నెట్వర్క్ స్తంభించిపోయింది. ఫలితంగా ఫోన్ కాల్స్ కలవక, సిలిండర్లు అందక జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. 50శాతం తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్ గ్యాస్ పంపిణీదారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. సరఫరా సగానికి పడిపోగా, డిమాండ్ మాత్రం 50 శాతం పెరిగింది. బుకింగ్ కావట్లేదని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వస్తున్న జనం, అక్కడ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. గతంలో ఒకట్రెండు రోజుల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు వారం దాటినా రాకపోవడంతో సామాన్యులు గోదాముల వద్దకు వెళ్లి నేరుగా సిలిండర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
టెన్త్ పరీక్షలకు 50 కేంద్రాలు
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. ఎండల నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా అన్ని శాఖల అధికారులతో చర్చించామని పేర్కొన్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించి యాదాద్రి భువనగిరి జిల్లా 7వ స్థానంలో నిలిచిందని, ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కంట్రోల్ రూం ఏర్పాటు పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎండలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో కూల్ వాటర్ను ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్, ఫర్నిచర్, మూత్రశాలలు, మరుగుదొడ్లు వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నాం. సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాం. సందేహాలు ఉంటే 90107 72080 నంబర్కు ఫోన్ చేయాలి. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి పదో తరగతి పరీక్షలకు 8930 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 8913 మంది విద్యార్థులు రెగ్యులర్ కాగా 20 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులకు ఉదయం 9 గంటల లోపే కేంద్రాల వద్దకు చేరుకోవాలి. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 50 మంది సీఎస్, 50 మంది డీఓలతో పాటు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. వీరితో పాటు జిల్లాలో పరీక్షలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మను ప్రత్యేకంగా నియమించారు. 572 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రం వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వహణ సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేయాలి. సీఎస్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఆర్టీసీ అధికారులతో చర్చించాం అన్ని కేంద్రాల వైపు బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులతో చర్చించాం. ఉదయం కేంద్రాలకు వచ్చే సమయంతోపాటు, మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ వారికి సూచించాం. అదేవిధంగా పాఠశాలల్లో హాల్టికెట్ ఇవ్వకుంటే ఫిర్యాదు చేయొచ్చు. వెబ్సైట్ నుంచి హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యంగా పాఠశాలల ప్రారంభం నుంచే ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. ముందుగానే విద్యార్థులకు వేకప్ కాల్ పేరుతో తెల్లవారుజామునే పిల్లలను నిద్రలేపి చదివేటట్టు చేయడం, పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, దత్తత పేరుతో పాఠశాలలు ఉన్న గ్రామంలో సీ గ్రేడు విద్యార్థులను గ్రామంలోని విద్యావంతులకు గాని అధికారులకు గాని అప్పగించి వారి పర్యవేక్షణలో చదివే విధంగా ఏర్పాటు చేశాం. ఈ సారి అభ్యసన దీపికలు అన్ని సబ్జెక్టులకు ఇవ్వడం జరిగింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 200 సైకిళ్లను ఉచితంగా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి పరీక్షలకు మధ్య రెండు నుంచి మూడు రోజుల వరకు గడువు ఉంది. విద్యార్థులకు ముందు జరిగే పరీక్షలకు సంసిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పాఠశాలలకు రావాలి. ప్రధానంగా పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఫ 8930 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు ఫ ఎండల నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం ఫ అత్యత్తమ ఫలితాలు సాధించిన 200 మంది విద్యార్థులకు సైకిళ్లు అందిస్తాం ఫ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు ‘సాక్షి’తో డీఈఓ సత్యనారాయణ -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.1.86కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.1,86, 44,511 నగదు, మిశ్రమ బంగారు 57గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 750 గ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చాయన్నారు. ఈ హుండీ ఆదాయం 28 రోజులదని ఈఓ పేర్కొన్నారు. -
జాడలేని చేయూత పెన్షన్లు
భువనగిరిటౌన్ : కొత్త ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నెలలు గడుస్తున్నా మంజూరు కాకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27నెలలు కావస్తున్నా ఇంకా చేయూత పింఛన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. చేయూత గ్యారెంటీ అమల్లోకి వస్తే పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకోనున్న నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రయోజనం చేకూరనుంది. 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57–64 ఏళ్ల వయస్సు ఉన్న వారికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆసరా దరఖాస్తులతో పాటు 57– 64 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఒకేసారి పింఛన్లు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేయలేదు. లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. వృద్ధాప్య పింఛన్న్దారులు మృతి చెందితే వారికి వచ్చే పింఛన్ వెంటనే నిలిపివేస్తున్నారు. కానీ ఆ వృద్ధుడి భార్యకు మాత్రం తిరిగి పింఛన్ మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం 12 వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆఫ్లైనన్లో వచ్చిన దరఖాస్తులు క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోకుండా కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. తమకు ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయంటూ దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫ కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు ఫ అధికారంలోకి వచ్చి 27నెలలు కావొస్తున్నా ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం -
23 గొర్రెలు మృత్యువాత
మునగాల : మండలంలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతానికి గురై 23 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిరేణి గ్రామానికి చెందిన చింతకాయల అరుణ్యాదవ్కు చెందిన గొర్రెల మంద నీటి కోసం గ్రామ శివారులోని గురప్పకుంట చెరువు వద్దకు చేరుకున్నాయి. ఇదే చెరువులో తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగునీటి కోసం విద్యుత్ (ఓపెన్ వెల్) మోటార్లు అమర్చారు. దీంతో చెరువులో నీరు తాగేందుకు వెళ్లిన 23 గొర్రెలు విద్యుదాఘాతానికి గరై మృతిచెందాయి. అంతేకాకుండా అరుణ్యాదవ్ కూడా విద్యుదాఘాతానికి గురి కాగా ప్రాణప్రాయం నుంచి బయటపడ్డాడు. బాధితుడికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గొర్రెల కాపరుల సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల కృష్ణయ్యయాదవ్ డిమాండ్ చేశారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
భూదాన్పోచంపల్లి: రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆశా కార్యకర్తలు భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేశారు. ఆశా డే సందర్భంగా విధులు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశాకార్యకర్తలు రాధిక, అలివేలు, సైదమ్మ, కవిత, శారద, జ్యోతి, నవ్య, బాలమణి, చంద్రకళ, అరుణ, నాగమణి, మనోహర, పద్మ, విమల, భార్గవి, సంతోష, లింగమణి పాల్గొన్నారు. -
తల్లి, కుమారుల అంత్యక్రియలు పూర్తి
● రూ.లక్ష ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డిభువనగిరి : మండలంలోని వడపర్తి గ్రామం వద్ద సోమవారం ఆటోను డీసీఎం ఢీకొనడంతో బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన కేతమ్మ, ఆమె ఇద్దరు కుమారులు నరేష్, సురేష్ మృతిచెందారు. ముగ్గురి మృతదేహాలకు మంగళవారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో బీఎన్ తిమ్మాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఈసం సత్తయ్య(43) కుటుంబంతో కలిసి చౌటుప్పల్లోని రాంనగర్కాలనీలో నివాసముంటూ తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా సోమవారం కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి పనికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత రాత్రి ఆటోలో వచ్చి తంగడపల్లి క్రాస్రోడ్డు వద్ద దిగాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు గాను సత్తయ్య హైదరాబాద్–విజయవాడ హైవే దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ఎగిరిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని అంబులెన్స్లో చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న ఈసం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
వైన్స్లో చోరీ.. దొంగ అరెస్టు
నల్లగొండ: వైన్ షాపులో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నల్లగొండ వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల మహాలక్ష్మి వైన్ షాపులో గతేడాది డిసెంబరు 7న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి రూ.5 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్లాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహరావుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నర్సింహారావును అదుపులోకి తీసుకొని విచారించగా.. మూడు వైన్ షాపుల్లో చోరీలు చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.1.77లక్షల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నర్సింహారావు గతంలో వంట మాస్టర్గా పనిశాడని, అతడు ప్రస్తుతం ఏపీలోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మచ్చయపాలెం గ్రామంలో నివాసముంటున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి బెయిల్పై బయటకు వచ్చినట్లు తెలిపారు. -
నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
నార్కట్పల్లి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్పల్లి మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. మరో బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మోజో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయల్దేరి ఏపీలోని కాకినాడకు వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున బస్సు నార్కట్పల్లి మండల పరిధిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే.. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ, బస్సు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఫ్లైఓవర్ పక్కన వాహనాలను వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడకు వెళ్తున్న మరో మోజో ట్రావెల్స్ బస్సు అక్కడికి చేరుకోగా.. ఆ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్(30), చిట్టకేనా బంగారయ్య(45) బస్సును పక్కకు ఆపి అప్పటికే వాదించుకుంటున్న బస్సు, లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న మరో లారీ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు డ్రైవర్లు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్, చిట్టికేనా బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. మొదట ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్ సురేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్పల్లి సీఐ, నార్కట్పల్లి, చిట్యాల ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని రెండు లారీలు, బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీనివాస్, బంగారయ్య మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన క్లీనర్ సురేష్ను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్లోని మెహిదీపట్నం సమీపంలోని గుడిమల్కాపురం వాంబే కాలనీలో నివాసముంటుండగా.. బంగారయ్య స్వస్థలం ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ అని ఎస్ఐ పేర్కొన్నారు. ఫ లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి ఫ మరో బస్సు క్లీనర్కు తీవ్ర గాయాలు -
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
మోటకొండూర్ : పాఠశాలల్లో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) రామకృష్ణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల, చందేపల్లిలోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మంది బాలికలు, 48 మంది బాలురకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గాంధీ, డాక్టర్ స్వప్న, డాక్టర్ స్వప్న, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కట్ట విజయ్, జయంత్, అనూష, గాయత్రి, సత్యనారాయణ, నరసింహ, ధనమ్మ తదితరులున్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసుకోవాలి ఆత్మకూరు(ఎం): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో మండల సమాఖ్య ఓబీ, గ్రామ సంఘాల ప్రతినిధులకు, సీనియర్ సీఆర్పీఎస్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలన్నారు. అవసరం అనుకుంటే మండల సమాఖ్య సబ్ కమిటీ వేయాలని చెప్పారు. గ్రామంలో ప్రతి సభ్యురాలు మహిళా సమ భావన సంఘాల్లో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్ వెంకటేశం, డీపీఎం ఫామ్, నాన్ ఫామ్ రవీందర్, ఏపీఎం నర్సింహ, డీఆర్పీ హరిలాల్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ పల్లవి, సీసీలు కొమురయ్య, హరిబాబు, సీఓ నల్ల చంద్రస్వామి, ఎంఎస్ మానస పాల్గొన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ జరిపించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, నిజాభిషేకం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవోత్సవం, రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
అన్నదాతలు.. అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త
గుర్రంపోడు : పండ్ల తోటలు సాగు చేసే రైతులకు వేసవిలో అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తాయి. 20 ఏళ్ల పాటు దిగుబడులు ఇచ్చే బత్తాయి, నిమ్మ తోటలు అగ్ని ప్రమాదాలకు గురైతే రైతు ఆర్థికంగా కోలుకోవడం కష్టమే. ప్రతి ఏడాది వేసవిలో అగ్ని ప్రమాదాల కారణంగా పండ్ల తోటలు కాలిపోతుండగా.. అధికారులు నష్టం అంచనా వేస్తున్నా పరిహారం అందించిన దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పక్క పొలం రైతు చెత్తను తగలబెట్టేందుకు నిప్పు పెట్టగా ఆ మంటలు వ్యాపించి పక్కే గల బత్తాయి తోటలో 70 చెట్లు కాలిపోయాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుముల క్లస్టర్ ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి వివరించారు. ఆయన సూచనలు, సలహాలు ఇవీ.. ఫ రైతులు మోటార్ల సర్వీసు వైర్లు, కేబుల్ వైర్లు అతుకులు లేకుండా చూసుకోవాలి. నేల మీద వైర్లు లేకుండా చూసుకోవాలి. ఎండ వేడిమికి షార్ట్ సర్క్యూట్తో ఎండిన ఆకులకు నిప్పంటుకుంటుంది. ఫ విద్యుత్ సర్వీసు వైర్లు, ఫ్యూజుల నుంచి స్టార్టర్ వరకు గల వైరు నాసిరకంగా ఉంటే లోఓల్టేజీతో కాలిపోయి మంటలు అంటుకుని వ్యాపించే అవకాశం ఉంది. ఫ స్టార్టర్ డబ్బాలు నేలపై అడ్డంగా ఉంచడం వల్ల ఎలుకలు దూరి వైర్లు కత్తిరించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎండు ఆకులకు మంటలు అంటుకుంటాయి. ఫ తోటల్లో కరెంటు స్తంభాల మధ్య లూజ్ లైన్ లేకుండా చూసుకోవాలి. లూజ్ లైన్ల వల్ల గాలిదుమారాలకు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు నేలపై పడి కింద ఉన్న గడ్డికి అంటుకుంటాయి. ఫ తోటల్లో చెట్ల మధ్యలో వేసవికి ముందే దన్నుకోవాలి. కలుపు మందులు వాడితే ఎండిన గడ్డిని పీకివేయాలి. ఫ ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో తోటల్లో చెత్తకు నిప్పుపెట్టకూడదు. ఫ తోటల చుట్టూ కంచె ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అదుపులో ఉండేందుకు కంచె మధ్యలో ఎడం ఉండేలా ఖాళీ స్థలం ఉంచుకోవాలి. ఫ తోట గెట్ల వెంట గడ్డివాములు ఉంచకూడదు. ఫ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తోటల్లో అంతరకృషి లేకుండా ఎండు గడ్డి బాగా ఉంటే డ్రిప్ లాటరల్ పైపులు కాలిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. -
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
భువనగిరిటౌన్ : పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలోని సింగన్నగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, మిగిలిన పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ఏడీ శ్రీరాములు, సంబంధిత అధికారులు ఉన్నారు. రేపు శిక్షణ కార్యక్రమం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంపై మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై గురువారం ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
చివ్వెంల(సూర్యాపేట): విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి చెందిన వీరబోయిన సైదులు(32) మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. బోరు మోటార్లు పోయకపోవడంతో ట్రాన్స్పార్మర్ వద్ద ఫ్యూజులు ఏమైనా పోయాయా అని చూడటానికి వెళ్లాడు. ట్రాన్స్పార్మర్ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి సైదులును ఆటోలో సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న నాయకులు
శాలిగౌరారం : మండలంలోని వంగమర్తి వద్ద మూసీ నది సమీపంలోని ప్రభుత్వ ఇసుక రీచ్ నుంచి సంబంధిత కాంట్రాక్టర్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాడని మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రవాణాను అడ్డుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుక రీచ్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సుమారు 50కి పైగా టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. మండల ఇసుక లారీల అసోసియేషన్ పరిధిలోని లారీలకు ఇసుక ఇండెంట్ లభించకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్కు సహకరించడం వల్లనే ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ వ్యక్తులు, నిర్మాణ సంస్థలకు ఇసుక అమ్ముకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, నాయకులు చామల అనిల్రెడ్డి, నూక కిరణ్కుమార్, అన్నెబోయిన సుధాకర్, నోముల జనార్ధన్, వడ్లకొండ పరమేశ్, చింత ధనుంజయ్య, తొట్ల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక క్వారీ వద్ద శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్కు చెందిన ఇసుక టిప్పర్లను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పీఓ తెలుపడంతో నాయకులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి ఇసుక రవాణాకు సంబంధించి డీడీలు పొందిన అన్ని లారీలను సాయంత్రం అనుమతించారు. నిలిచిపోయిన ఇసుక లారీలు వంగమర్తిలో ప్రభుత్వ ఇసుక రీచ్ వద్ద లారీలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఇసుక రీచ్ను మైనింగ్ ఏడీ బాలు పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన ఇసుక పూడికతీత పనులు, ఎంతమేర పూడికతీతతో తవ్వకాలు జరుగుతున్నాయనే విషయాలను తెలుసుకున్నారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ ఈఈ యాదగిరి, జియాలజిస్టు నామ కుమార్, మైనింగ్ పీఓ కిరణ్కుమార్ ఉన్నారు.ఫ ప్రభుత్వ పనులకు అనుమతి తీసుకుని.. కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక అమ్ముకుంటున్నాడని ఆరోపణ ఫ పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం -
సాగర్లో ముగిసిన జాతీయ భద్రతా వారోత్సవాలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లో జెన్కో పవర్హౌజ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 55వ జాతీయ భద్రతా వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి హాజరై మాట్లాడారు. ఏడీలు, ఏఈలు, ఉద్యోగులతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశ్రమల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి సురక్షితంగా పనిచేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్కుమార్, ఎస్ఈలు రామకృష్ణారెడ్డి, రఘురాంరెడ్డి, ఫైర్ అండ్ సేఫ్టీ ఏడీ రజనీ, ఏఈ అజమ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
యాదగిరిగుట్ట: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేసుకొని శుక్రవారం గృహ ప్రవేశం చేసిన దూశెట్టి లలిత, రామచంద్రయ్య దంపతులకు నూతన వస్త్రాలు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య రాంచందర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కౌన్సిలర్లు పెలిమెల్లి లావణ్య శ్రీధర్గౌడ్, బూడిద మధు, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బిట్టు సరోజ హరీష్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్ నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, ఎరుకల హేమేందర్ తదితరులున్నారు. -
గేదెలు మేపేందుకు వెళ్లి అన్నదమ్ములు అదృశ్యం
మేళ్లచెరువు : చింతలపాలెం మండలం చింత్రియాల పరిధిలోని కృష్ణా నది వద్దకు గేదెలు మేపేందుకు వెళ్లి అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింత్రియాలకు చెందిన షేక్ సైదుస్సేన్ కుమారులు సమీర్(12), సర్దార్ (13) ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మదరసాలో అరబిక్ నేర్చుకుంటున్నారు. మూడురోజుల క్రితం ఇంటికి వచ్చారు. వారిద్దరు మంగళవారం గేదెలు మేపేందుకు చింత్రియాల సమీపంలోని కృష్ణానది వద్దకు వెళ్లి అదృశ్యమయ్యారు. సాయంత్రమైనా వారిద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కృష్ణా నది తీరంలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. అయితే నది ఒడ్డున జాలర్లకు చెందిన పడవలు, వలలు ఉండడంతో చేపలు పట్టేందుకు నదిలోకి వల వేసి మునిగినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదుచిలుకూరు : మండలంలోని పోలేనిగూడెంలో పక్క పక్క ఇళ్లలో ఉంటున్న ఇద్దరు గోడ విషయమై సోమవారం ఘర్షణ పడ్డారు. ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమాన్నాయక్ మంగళవారం తెలిపారు. బిట్టు నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందా వెంకటేశ్వర్లు, సుమలతతో పాటు మరో నలుగురిపై, అదేవిధంగా చందా సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిట్టు నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గంజాయి పట్టివేతభువనగిరిటౌన్ : గంజాయి విక్రయిస్తున్న యువకుడిని మంగళవారం ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సనౌలేక్ భువనగిరి పట్టణంలో గంజాయితో సంచరిస్తున్నాడని సమాచారం తెలియడంతో ఎకై ్సజ్ పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 170 గ్రాముల గంజాయి, ఇతర మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. 10 లీటర్ల నాటుసారా.. కొండమల్లేపల్లి : ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం దేవరకొండ ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐ నర్సింగరావు, నరసింహ, వీరబాబు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఇసుక లారీల పట్టివేతకోదాడరూరల్ : ఏపీ నుంచి అనుమతి లేకుండా వస్తున్న ఇసుక లారీని కోదాడ రూరల్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కేంద్రం సమీపంలోని మున్నేరు వాగు నుంచి లారీలో ఇసుకను లోడ్ చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్కు తరలిస్తుండగా.. రామాపురం క్రాస్రోడ్లో వాహనాల తనిఖీల్లో భాగంగా కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. లారీ యజమానితో పాటు డ్రైవర్ బిల్లా సాంబశివరావు, క్లీనర్ కారం శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యచందంపేట : మండలంలోని అచ్చంపేటపట్టి గ్రామానికి చెందిన జర్పుల పత్య(35) అప్పు ల బాధ తాళలేక మంగళవారం హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్పుల పత్య అచ్చంపేటపట్టి గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సరైన దిగుబడి రాక, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక హైదరాబాద్లోని హస్తినాపురంలో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మంగళవారం హస్తినాపురంలోని అద్దె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పత్య మృతదేహాన్ని అచ్చంపేటపట్టి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
గుట్టలో ఎంట్రీ ఫ్లై ఓవర్ పనుల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి వెళ్లేందుకు మొదటి ఘాట్ రోడ్ సమీపంలో జరుగుతున్న ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులను కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై, ప్రస్తుతం పనులు ఏయే దశలో ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా పనులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ శాఖ అధికారి సరిత, సంబంధిత శాఖల అధికారులున్నారు. -
నానో యూరియాతో అధిక దిగుబడి
హాలియా : నానో యూరియా, నానో డీఏపీతో భూసారం పెరగడంతో పాటు దిగుబడి మెరుగవుతుందని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత రాములమ్మ, ఉద్యాన పంటల శాస్త్రవేత్త బిందు అన్నారు. మంగళవారం అనుముల రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయం, నానో ఎరువుల వాడకం, హెచ్టీ పత్తి సాగు, ఆయిల్ పామ్, కిచెన్ గార్డెనింగ్పై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. యూరియా, డీఏపీని మోతాదుకు మించి వాడటం వల్లే భూసారం తగ్గి పంట దిగుబడి పడిపోతుందన్నారు. నానో యూరియా చాలా తక్కువ ధరకు దొరుకుతుందని, తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. యూరియా సరైన సమయంలో అందుబాటులో లేకపోతే నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. అధిక మోతాదులో యూరియా వినియోగం వలన పురుగులు, తెగుళ్లు పెరగడంతో పాటు నేల, నీరు, వాతావరణం కాలుష్యం అవుతుందని, దాని ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కూడా పడే అవకాశం ఉందన్నారు. రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకున్నప్పుడే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అధిక సాంద్రత కలిగిన పత్తి సాగు చేస్తే కూలీల ఖర్చు, పంట కాలం తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. ఏడీఏ సరిత మాట్లాడుతూ.. సస్యరక్షణ చర్యలు, సాగులో మెళకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎంఏ వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఏఓ వెంకన్న, హర్షిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
క్రీడల్లో మెరికలు
రాజాపేట : రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ముగ్గురు, దూదివెంకటాపురం హైస్కూల్ విద్యార్థిని చదువుతోపాటు క్రీల్లోనూ రాణిస్తున్నారు. గతేడాది నుంచి జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటి వివిధ మెడల్స్ సాధించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలు, 2036లో జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ తరఫున ఆడి పతకాలు సాధిస్తామని అంటున్నారు. కబడ్డీలో సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు రాజాపేట సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న డి.దిలీప్ కబడ్డీలో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్నాడు. 2025 అక్టోబర్లో హైదరాబాద్లో నిర్వహించిన యువ ప్రో కబడ్డీలో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్నాడు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన 61 జూనియర్ నేషనల్ గేమ్స్ ఆడాడు. మహబూబాబాద్లో జరిగిన ఎస్జీఎఫ్ క్రీడల్లో అండర్–19 విభాగంలో కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించాడు. కరీంనగర్, మహబూబ్నగర్లో నిర్వహించిన సీనియర్, జూనియర్ స్టేట్ మీట్లో ఉత్తమ ఆటతీరు కనబర్చాడు. ఇదే కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ బైపీసీ విద్యార్థి ఎస్.అనుము మహబూబాబాద్లో 2025 అక్టోబర్లో నిర్వహించిన జూనియర్ స్టేట్ మీట్లో కబడ్డీ పోటీల్లోపాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. మహబూబ్నగర్లో 2024, 2025లో జరిగిన జూనియర్ స్టేట్ మీట్లో పాల్గొని బ్రౌంజ్ మెడల్ సాధించాడు. అలాగే సెకండియర్ విద్యార్థి బి.దేవరాజు హైదరాబాద్లో 2025 అక్టోబర్లో నిర్వహించిన యువ ప్రోకబడ్డీలో పాల్గొన్నాడు. ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్–17 పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చి బ్రౌంజ్ మెడల్ సాధించాడు. సాఫ్ట్బాల్లో దూదివెంకటాపురం విద్యార్థిని.. రాజాపేట మండలం దూదివెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుల్లెన ప్రణీత ఎస్జీఎఫ్ సాఫ్ట్బాల్ పోటీల్లో రాణిస్తోంది. ఈ ఏడాది జనవరిలో నిజామాబాద్లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 4 నుంచి 8 వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని సత్తాచాటింది. డి.దిలీప్, రాజాపేట గురుకులం గుల్లెన ప్రణీత, దూదివెంకటాపురంఎస్.అనుము, రాజాపేట గురుకులం డి.దేవరాజు, రాజాపేట గురుకులం ఎస్జీఎఫ్లో రాణిస్తున్న గురుకుల విద్యార్థులు ఫ కబడ్డీలో దిలీప్, దేవరాజు, అనుము ఆటతీరు అద్భుతం ఫ జాతీయ స్థాయిలో పలు మెడల్స్ సొంతం ఫ సాఫ్ట్బాల్లో సత్తాచాటుతున్న ప్రణీత -
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉండాలి
భువనగిరిటౌన్ : ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రత్యేక అధికారులు రోజూ పాఠశాలకు వెళ్లి భోజనాన్ని స్వయంగా రుచి చూసి, నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట చేస్తున్నారా లేదా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. సాంకేతిక విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యంఆలేరు: ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వల్పకాలిక కోర్సులను మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణితో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఈ కోర్సుల్లో శిక్షణ అనంతరం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈకార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బీజన భాస్కర్ పాల్గొన్నారు. భూభారతి కేసులో మరో నలుగురు రిమాండ్జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన భూ భారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంలో రిమాండ్ సంఖ్య 19కి చేరింది. కొద్ది రోజుల క్రితం జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుర్చగా, నాలుగు రోజుల క్రితం జనగామ పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాకు చెందిన సర్పంచ్ దొమ్మాట బాబు, లింగస్వామి, భానుప్రకాశ్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మహాశివుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నిత్య పూజలను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామ లింగేశ్వరస్వామి వారి ఆలయలో శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు, కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయ బద్ధంగా చేపట్టారు. సాయంత్రం సేవోత్సవాన్ని జరిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే స్వామి వారిని మేల్కొలిపి, సుప్రభాత సేవలు, అర్చనలను అర్చకులు చేశారు. గర్భాలయంలోని స్వయంభూవులకు అభిషేకాలను నిర్వహించారు. ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహంచిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రజలనుంచి 46 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. శ్మశాన వాటికను ఆక్రమించారు భువనగిరి మండలం గంగసానిపల్లి గ్రామాంలోని శ్మశాన వాటిక స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకున్నారని ఆ గ్రామస్తులు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. అర్జీ ఇచ్చినవారిలో సత్యనారాయణ, వెంకటేష పాండు, నవీన్, స్వామి, సత్తయ్య, లక్ష్మయ్య ఉన్నారు. నష్టపరిహారం చెల్లించాలి బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న తమకు పరిహారం ఇవ్వాలని చోకళ్లతండా, కోట్య తండా, పీర్యతండాల వాసులు కోరారు. భూసేకరణ చేసి సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం రాలేదన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
భూదాన్పోచంపల్లి : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచ్ల పై ఉందని భువనగిరి డీఎల్పీఓ బి. శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోటకొండూర్, ఆత్మకూర్ (ఎం), గుండాల మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు చివరి విడత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ల విధులు, నిధుల వినియోగం, గ్రామంలో కల్పించాల్సిన మౌలిక వసతులపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాములు, టీఓటీలు నవీన్కుమార్, ఎం.డీ. మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలి
ప్రభుత్వం నూలు సబ్సిడీకి బదులు నేతన్న భరోసా కింద ఏడాదికి చేనేత కార్మికుడికి రూ.18వేలు, అనుబంధ కార్మికుడి రూ.6వేల చొప్పున మొత్తం రూ.24వేలు ఇస్తామని చెప్పింది. కానీ పథకం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. దాంతో చేనేత కార్మికులు నగదు డబ్బులు చెల్లించి నూలు కొంటున్నారు. పెరిగిన ధరలతో వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. నూలు ధరల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. –కర్నాటి పురుషోత్తం, తెలంగాణ చేనేత జనసమాఖ్య జిల్లా అధ్యక్షుడు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
యాదగిరిగుట్ట రూరల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలో గోదావరి జలాలతో నిండిన పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో రైతులకు సాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, నవాబ్పేట, తపాస్పల్లి ప్రాజెక్టుల నుంచి ఆలేరు ప్రాంతంలోని అన్ని చెరువులు నింపడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, జనగాం ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ కాల్నె సరిత, భాస్కర్, గుండ్ల పల్లి భరత్ గౌడ్, కానుగు బాలరాజ్ గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వం.. రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే కుంభం భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భూగర్భజలాలు తగ్గి వరి పొలాలు ఎండుతున్న నేపథ్యంలో మొదటి సారి నీటిని విడుదల చేశామన్నారు. బీఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితులకు త్వరలో పరిహారం కింద రూ. 50కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటిని విడుదల చేయడంలో సహకరించిన మంత్రి ఉత్తమకుమార్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ, రైతులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
చౌటుప్పల్ : గ్యాస్ ధరల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీపీఎం మున్సిపల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, కృష్ణారెడ్డి, పాష, అవ్వారు రామేశ్వరి, బండారు నర్సింహ్మ, దాసు, ధర్మయ్య, మల్లేశం, రేష్మ, స్వామి, ఆనంద్, ఈదయ్య, ఐలయ్య, రాములు, పెంటయ్య పాల్గొన్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా గొంతువిప్పాలి రామన్నపేట :ప్రజలు మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం రామన్నపేటలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డీ జహంగీర్, మేక అశోక్రెడ్డి, పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, ఉపేందర్, ఏబూషి నర్సింహ, బోయిని ఆనంద్, హన్మంత్ పాల్గొన్నారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి వలిగొండ : అర్హులైన వారందరికీ ప్రభుత్వం వెంటనే నూతన పింఛన్లు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం వలిగొండలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జహంగీర్, బాలరాజు, రాజయ్య, సిర్పంగి స్వామి, తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, కందడి సత్తిరెడ్డి, కొండే కిష్టయ్య, శ్రీశైలం రెడ్డి, యాదయ్య, దుబ్బలింగం, సురేష్ పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
యాదగిరిగుట్ట రూరల్ : ఇందిరమ్మ పథకంతో పేదవాడి సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై లభ్ధిదారులు కోల మాధవి మల్లేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్కుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచ్ గడ్డం దేవేందర్, కుండె సిద్దులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
గర్భాశయ క్యాన్సర్ నివారణకే హెచ్పీవీ టీకా
భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ టీకాను 14 సంవత్సరాలు నిండిన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హెచ్పీవీ టీకా పంపిణీని ఆయన ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా 14 సంవత్సరాల వయస్సు నిండిన బాలికలు హెచ్పీవీ టీకా వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.6వేల నుంచి రూ.12వేల విలువ చేసే టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారు. 30 రోజుల పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ సీహెచ్సీల్లో టీకాను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపలి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, కౌన్సిలర్ సూదగాని సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖబాబురావు, డాక్టర్ ఇంద్రాణి, రామకృష్ణ, యామిని శృతి, నిరోష పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాదగిరీశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ మాడవీధులతో పాటుగా, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, ప్రధానాలయం క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తజనం సందోహం కనిపించింది. శ్రీస్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 35 వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా స్వామి వారికి రూ.45,46811 నిత్యాదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
గిరి ప్రదక్షిణలో కూచిపూడి నృత్య ప్రదర్శన
యాదగిరిగుట్ట రూరల్ : హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి.వైష్ణోదేవి యాదగిరీశుడి కొండ చుట్టూ కూచిపూడి నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేసింది. సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ, 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మార్గమంతా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. కాగా జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వైష్ణోదేవి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆమెను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈఓ భవానీ శంకర్ అభినందించారు. లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యాణం అనంతరం తిరుమాడ వీధులలో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలంరామన్నపేట : ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. ఆదివారం రామన్నపేటలో చేపట్టిన ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామన్నపేట సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేయాలన్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలు, పందుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, కందుల హన్మంత్, గొరిగె సోములు, బావండ్లపల్లి బాలరాజు, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, బాబుచారి, వేముల మల్లేశం, బండ శ్రీశైలం, కుందూరు వెంకటేశం, మునుకుంట్ల రాణి, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్కు ధరల మంట
రంజాన్ కానుకల్లో కోత! ఫ ఈ ఏడాది 50 శాతం తగ్గింపు ఫ గతంలో 2,300 కుటుంబాలకు పంపిణీ ఫ ఈ సారి 1,250 మందికే.. ఫ ఆందోళనలో పేద ముస్లింలు భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రంజాన్ కానుకల (తోఫా) పంపిణీలో కోత పెట్టింది. గతం కంటే ఈసారి 50 శాతం తగ్గించింది. అయితే 2023లో భువనగిరికి 1,300, ఆలేరుకు వెయ్యి చొప్పున కానుకల ప్యాకెట్లను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఒక కుటుంబానికి చీర, కుర్తా పైజామా, ఒక డెస్స్తో కలిపి ప్రత్యేక ప్యాకెట్(ను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 4వేల పేద ముస్లిం కుటుంబాలకుగాను కనీసం 2వేల కుటుంబాలకై నా పంపిణీ చేయాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గానికి 750, ఆలేరు నియోజకవర్గానికి 500 మాత్రమే కేటా యించి సరఫరా చేసింది. అధికారులు ఒక్కొక్క గ్రామానికి కనీసం ముగ్గురికి కూడా పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందరికి ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎక్కువ మందికి పంపిణీ చేసి ఇప్పడు తగ్గించడమేంటని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేద ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందించాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఫ పెరిగిన గృహ, వాణిజ్య గ్యాస్ ధరలు ఫ మొత్తం 2.61లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫ వినియోగదారులపై రూ.90లక్షల భారంమీము నెలకు రెండు గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తాం. పెరిగిన ధరతో ప్రతినెలా అదనంగా రూ.120 వరకు భారం పడుతుంది. పెరిగిన ధరను తగ్గించి పేద కుటుంబాలకు ఊరట కలిగించాలి. – గాజుల గీత, ఆత్మకూర్(ఎం) వంట గ్యాస్పై రూ.60, కమిర్షియల్ గ్యాస్ రూ.100 పెంచడం దారుణం. పెరిగిన వంట గ్యాస్ ధరల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనంగా భారం పడుతుంది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలి. – కొండమడుగు నాగమణి, ఐద్వా మండల కార్యదర్శి భువనగిరి : ఇరాన్, ఇజ్రాయిల్–అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం భారత్లో వంట గ్యాస్ మంట పుట్టిస్తోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచి వంటగ్యాస్ ధరలు పెంచేశాయి. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. దీంతో జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభావం ఇలా.. గ్యాస్ బుక్కింగ్ సరఫరాకు సంబంధించిన వెబ్సైట్లు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచే డీలర్ల పరిధి నుంచి చమురు సంస్థల అజమాయిషిలోకి వెళ్లాయి. గృహ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసేందుకు గడువును 21 నుంచి 25 రోజులకు పెంచారు. ఈ వ్యత్యాసం రానున్న రోజుల్లో 30 నుంచి 35 రోజులకు పెరిగే అవకాశం ఉందని డీలర్ల అంచనా వేస్తున్నారు. బుక్ తర్వాత డెలివరీకి వారం, పది రోజులు పట్టే అవకావం ఉంటుంది. దీంతో గ్యాస్ ను పొదుపుగా వాడుకోవడంతోపాటు కట్టెల పొయ్యిలను కూడా పెట్టుకోవాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జిల్లాలో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదరగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి పట్టణాల్లో కొన్ని పెద్ద హోటళ్లు ఉన్నాయి. వీరు నేరుగా అర్డర్ల త్వారా సంబంధిత డీలర్ల ద్వారా వాణిజ్య సిలిండర్లను తెచ్చుకుంటారు. కొందరు రెండు మూడు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటారు. కానీ, ప్రస్తుతం ఇ పరిస్థితి లేదు. దీంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల నుంచి పెరిగిన బుకింగ్లు జిల్లాలో వారం రోజుల నుంచి వంట, కమర్షియల్ గ్యాస్ గాని బుకింగ్లు పెరిగాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో పాటు మారిన విధానంతో రెండు మూడు రోజులుగా మరింతగా బుకింగ్లు పెరుగుతున్నాయి. కాగా ఈకేవైసీ లేకుండా గ్యాస్ బుకింగ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. అదనపు భారం.. రూ.90 లక్షలు జిల్లాలో ప్రస్తుతం 7,54,831 మంది జనాభా ఉంది. ఇండేన్, భారత్, హెచ్పీసీ గ్యాస్ డీలర్లు ఉన్నారు. ఆయా డీలర్ల పరిధిలో సుమారు 2,61,201 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గృహ సిలిండర్ ధర ఈ నెల 6 నుంచి రూ.60లు పెరగడంతో ప్రస్తుతం వంట గ్యాస్ ధర 14 కిలోల సిలిండర్కు రూ.960.50కు చేరింది. వాణిజ్య గ్యాస్ ధర 19 కేజీల సిలిండర్కు రూ.2,100కు చేరినా సరఫరా నిలిచింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రజలు ప్రతినెలా 1.50 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండగా 90 లక్షల రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ఆలేరు : గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆదివారం ఆలేరు పట్టణంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు. రైల్వేగేట్ చౌరస్తాలో కట్టెల పొయ్యిమీద వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో పేద, మధ్యతరగతి వర్గాలపై ఆర్థికభారం పడుతుందన్నారు. పెంచిన గ్యాస్సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.జనార్దన్, సహదేవ్, అడివయ్య, నాగరాజు, బాలమల్లేష్, సమరసింహారెడ్డి, రాఘవరెడ్డి, కొమురయ్య, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
వలిగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆది వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసు కుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివా రం మమత తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్ల గా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత సూసై డ్ నోట్ రాసి, సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్కు ఉరేసు కుంది. మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
పారదర్శక పాలన అందించాలి
భూదాన్పోచంపల్లి : సర్పంచ్లు పారదర్శక పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. నూతన సర్పంచ్లు పంచాయతీరాజ్ చట్టం, విధులు, రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి.శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, ఎండీ మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యం.. పురుగులమయం
గుండాల : మండలంలోని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కి పురుగులు పట్టిపోతున్నాయి. అయినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. గుండాల మండల వ్యాప్తంగా 20 రేషన్ షాపులకు గతేడాది మార్చిలో ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేసింది. దీంతో ఒక్కో షాపులో సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు మొత్తంగా 400 నుంచి 500 క్వింటాళ్ల దొడ్డు బియ్యం ఏడాది కాలంగా నిల్వ ఉంటున్నాయి. గతేడాది ఏప్రిల్లో ఉగాది కానుకగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో దొడ్డు బియ్యాన్ని పట్టించుకోకపోవడంతో పురుగు పట్టిపోతున్నాయి. నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోకపోవడం వల్ల సన్న బియ్యం నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని రేషన్ డీలర్లు చెబుతున్నారు. దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి వచ్చే ప్రమాదం ఉందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఫ రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న బియ్యం ఫ వాపస్ తీసుకోని ప్రభుత్వం ఫ సన్న బియ్యం నిల్వకు డీలర్ల ఇక్కట్లు -
ఇంటర్ పరీక్షలకు 141 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లాలో 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం గణితం–2బీ, జువాలజీ, హిస్టరీ పేపర్–2 పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 4,888 మంది విద్యార్థులకు 4,747 మంది హాజరు కాగా 141 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీవైష్ణవి జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ భాస్కర్రావు శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రాల్లో కల్పించిన వసతులను అడిగి తెలుసుకున్నారు. నిత్యాన్నదానానికి విరాళంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అందజేస్తున్న నిత్యన్నదాన పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వేటపాలెం గ్రామానికి చెందిన అమటం శైలేంద్రనాథ్, పద్మావతి, షణ్ముక మయూర్లు రూ.లక్ష విరాళం అందజేశారు. శుక్రవారం శ్రీస్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా వారు ఆలయాధికారి గజివెల్లి రఘుకు విరాళంగా ఇచ్చారు. భక్తుల అన్న ప్రసాదం కోసం విరాళం వినియోగించాలని వారు కోరారు. మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలుభువనగిరిటౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భువనగిరి కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు చెస్, స్పూన్, క్యారమ్స్, రిగ్బాల్ తదితర క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ పోటీలకు ఈ సారి అంగన్వాడీ టీచర్లను ఆహ్వానించకపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. రేపటి నుంచి ‘ఇంటింటికీ సీపీఎం’ భువనగిరిటౌన్ : ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఈ నెల 8 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జహంగీర్ తెలిపారు. శుక్రవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారంపై ఎమ్మెల్యేలు, ఎంపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలేరు రెవెన్యూ డివిజన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు పాల్గొన్నారు. -
పల్లెలను పరిశుభ్రంగా మారుద్దాం
బొమ్మలరామారం : పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి, మైసిరెడ్డి పల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని పర్యటించారు. పరిశుభ్రత కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కాలువతో పాటు రోడ్లు, వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాన్నారు. మైసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అనంతరం మల్యాలలోని కేజీబీవీని తనిఖీ చేశారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, కిచెన్, స్టోర్రూమ్, డార్మెంటరీని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీరాములు, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ గడ్డం జ్ఞానప్రకాష్ రెడ్డి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
యాదగిరిగుట్ట : మహిళలు అన్ని రంగాల్లో రాణించి, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత ఐలయ్య పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ప్రాంగాణంలో శుక్రవారం మహిళ ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ప్రతిభను చాటుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులను మహిళా ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య రాంచందర్, కస్తూరి, ఆర్టీసీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
కడసారి చూపు కోసం వస్తూ.. కానరాని లోకాలకు
మునగాల, అనంతగిరి: అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో భగత్సింగ్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామానికి చెందిన కిన్నెర పుల్లయ్య అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన ఆయన సమీప బంధువులు కిన్నెర దావీదు(26), కొండ్రు వంశీ(28) ఇద్దరూ ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటుండగా బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన స్నేహితులైన మార్కు బుడిరాజ్కుమార్, పెద్దపండు వెంకట్తో కలిసి మొగలాయి కోట గ్రామానికి కారులో బయలుదేరారు. అతివేగం కారణంగా కారు మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిన్నెర దావీదు, కొండ్రు వంశీ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రాజ్కుమార్, పెద్దపండు వెంకట్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం జరిగిన కారులో ఇరుక్కుపోయిన ఈ నలుగురిని వెలికి తీసేందుకు స్థానికుల సాయంతో పోలీసులు సుమారు రెండు గంటల పాటు శ్రమించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. వంశీ (ఫైల్) దావీదు (ఫైల్) మొగలాయికోటలో విషాదం మృతులు దావీద్, వంశీ ఇద్దరూ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. దావీదు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా అక్క ఉన్నది. ఆమెకు సుమారు 9 నెలల క్రితం వివాహం జరిపించాడు. దావీదు అకాల మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా.. వంశీకి తల్లితో పాటు అక్క ఉండగా ఆమెకు సుమారు 8 నెలల క్రితం విహహం చేశాారు. తల్లిని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వంశీ మృతిచెందడంతో తల్లి ఒంటరిగా మిగిలింది. ఇద్దరి యువకులు మృతిచెందడంతో మొగలాయికోట గ్రామంలో విషాదం చాయలు అలుముకున్నాయి. మృతులను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు మొగలాయికోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అదుపుతప్పి కారు బోల్తా ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
కర్ల రాజేష్ మృతిపై విచారణలో జాప్యం
నల్లగొండ టౌన్: కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి డీఎస్పీ రవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒత్తిడి మేరకే రీ పోస్టుమార్టం నిర్వహించారన్నారు. దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల 8లోగా విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని, విచారణ ఆలస్యం చేస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, మేడి శంకర్, సునిల్, తరి ఏడుకొండలు, గోపాల్, కమలమ్మ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
ఎరువుల సమతుల్యత.. పంటల భద్రత
త్రిపురారం : వివిధ రకాల పంటల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు కీలకమని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొంటున్నారు. ఎరువుల యాజయాన్యం పద్ధతులు ఆయన మాటల్లోనే.. నత్రజని: పంటలపై పురుగులు దాడి చేసి నష్టం కలిగించడానికి.. నత్రజని వాడకానికి ముడిపడి ఉంటుంది. నత్రజని వాడకం పెంచడంతో మొక్కలు ఏపుగా పెరిగి శాఖీయోత్పత్తి బాగా జరిగి ఆకులు, కాండాలు, బిరుసుతనం కోల్పోయి మెత్తగా తయారై పురుగులు అనువుగా తయారవుతాయి. పంటలపై జరిగిన పరిశోధనల్లో సిఫారసు చేయబడిన మోతాదుకు మించి నత్రజని వాడకం వలన పురుగుల బెడద ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నత్రజని నెమ్మదిగా వినియోగంలోకి రావడానికి యూరియాను వేపపిండితో కలిపి లేదా నిమిన్ వంటి వేప సంబంధిత వాటితో కలిపి వాడుకోవచ్చు. భాస్వరం: మొక్కలు భాస్వరాన్ని లవణాల రూపంలో తీసుకుంటాయి. పూలు, విత్తనాలు దుంపలు తదితర ప్రాముఖ్యత గల పంటల్లో విత్తనపు భాగాల్లో ఈ పోషకం అవసరం ఎక్కువగా ఉంటుంది. భూమిలో సేంద్రియ ఎరువులు ఎక్కువగా కుళ్లేందుకు ఉపయోగపడుతుంది. పంట త్వరగా పక్వానికి వస్తుంది. కణ విభజన, పైరు అభివృద్ధి, మొక్క త్వరగా నిలదొక్కుకోవడం, మొక్కలో మాంసకృత్తులు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పైర్లకు కలిగే దుష్ఫలితాలను కొంతమేరకు అరికడుతుంది. మొక్కలకు అవసరమయ్యే కిరణజన్య సంయోగక క్రియ జరగడానికి కీలకపాత్ర పోషిస్తుంది. పొటాష్ : చీడపీడల యాజమాన్యంలో పొటాష్ పాత్ర అత్యంత కీలకం. పంటలకు తగినంత పొటాష్ అందించినప్పుడు మొక్కల్లో కొన్ని రకాల ఫినాలిక్ కాంపౌండ్స్ తయారై రక్షణగా ఉంటాయి. కణకవచం గట్టిగా తయారై దండెత్తే పురుగులకు అడ్డుగోడగా నిలుస్తుంది. వరి పైరులో చీడపీడలపై అధిక ప్రభావం చూపి సమర్ధంగా అరికడుతుంది. బాక్టీరియా, బూజు సంబంధిత తెగుళ్లను 70 శాతానికి పైగా అరికడుతుంది. పురుగులు, మైట్స్ దాడి నుంచి 60 శాతానికి పైగా రక్షణగా నిలుస్తుంది. చెరుకు పంటకు తగినంత పొటాష్ వేసినప్పుడు పొలుసు పురుగు, పత్తిలో ముక్కు పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. టమాటా, మిరప, వంకాయ, బంగాళాదుంప వంటి కూరగాయల పంటలకు శాస్త్రవేత్తల సూచనల మేరకు పొటాష్ అందిస్తే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది.జీవ ఎరువుతో ఉపయోగాలు జీవ ఎరువుల్లో బాసిల్లాస్, సూడోమోనాస్ వంటి సూక్ష జీవులు ఆస్పర్జిల్లడ్, పెన్సిలియం వంటి శీలింద్రాలు భూమిలో కరగని రూపంలో భాస్వరాన్ని కరిగించి మొక్కల లభ్యతను పెంచుతాయి. సిఫారసు చేసిన భాస్వరం మోతాదును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వరకు తగ్గించుకోవచ్చు. మట్టి నమూనాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములుగా 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి. -
నిప్పులగుండంలో పడిపోయిన భక్తులు
కేతేపల్లి: వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వరస్వామి జాతర సందర్భంగా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు భక్తులు అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలపాలయ్యారు. భీమారం గ్రామం సమీపంలోనే ఉన్న ఆమనగల్లు గ్రామంలో జరుగుతున్న జాతరకు గ్రామం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. బుధవారం తెల్లవారుజామున స్వామివారి పల్లకీని నిప్పుల గుండం దాటించే క్రమంలో.. భీమారం గ్రామానికి చెందిన సామగాని నాగరాజు, నాయకం గంగమ్మ, ఏర్పుల సంధ్య, దూబని విజయ, కొరివి సంధ్య, మేకల మత్తమ్మ, మేకల పుష్ప నిప్పుల గుండంలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా ఆమనగల్లు గ్రామానికి చెందిన ఉత్తెర్ల కృష్ణయ్య, మారిపెద్ది సాయి, వట్టె మానసలతోపాటు దోసపాడుకు చెందిన సింగం వినోద, మిర్యాలగూడకు చెందిన మేడబోయిన సైదమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు, మాడ్గులపల్లి ఎస్ఐ కృష్ణయ్య సిబ్బందితో అప్రమత్తమై అందరిని బయటకు లాగారు. భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆర్డీఓ అశోక్రెడ్డి, తహసీల్దార్ రమాదేవి క్షతగాత్రుల వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజు, గంగమ్మ, సంధ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు రిఫర్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాద్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కేతేపల్లి మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్యాదవ్, నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, భీమారం సర్పంచ్ పద్మవెంకన్న క్షతగాత్రులను పరామర్శించారు. అమనగల్లు ఘటనలో భీమారం గ్రామానికి చెందిన ఏడుగురికి గాయాలు -
దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు
పెద్దవూర : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగూడెం గ్రామ సమీపంలో ఉన్న ప్రతాపగిరి లక్ష్మీనర్సింహాస్వామి (గుండ్లకాడి) కల్యాణ మహోత్సవానికి జస్టిస్ రాజశేఖర్రెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం సమీప గ్రామాల ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్రెడ్డి–కళ్యాణి దంపతులను దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్ సన్మానించారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్ యడవెల్లి మనోహర్రెడ్డి, ఆలయ పూజారులు కందాళ అజయ్కుమార్, లోకాచార్యులు, విజయ్కుమార్, సర్పంచ్ పోశం రమణమ్మకోటిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
హాలియా : హాలియా వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో మంగళవారం గల్లంతైన పెద్దవూర మండలంలోని సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, హాలియా పోలీసులు సాగర్ ఎడమ కాల్వ తూములు, త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు గాలింపు చర్యలు కొనసాగించారు. హాలియా పోలీస్స్టేషన్లో నమోదైన అయిన ఇద్దరి బాలుర మిస్సింగ్ కేసు నేపథ్యంలో బుధవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. కేసు విచారణను వేగవంతం చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ ఉన్నారు. -
ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి సంతాపం
భువనగిరిటౌన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి సంతాప సూచికగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలోని షియా ముస్లింల మసీదు పై ఖమేనీ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పాటు, నల్ల జెండా సైతం ఎగురవేశారు. అవమానకరమైన జీవితం కంటే గౌరవంగా మరణించడం మేలు అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలునడిగూడెం : రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సూర్యాపేటకు చెందిన కొప్పుల వెంకటేశ్వర్లు తన కారుతో నడిగూడెం నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడేనికి వెళ్తున్నాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన బాణాల భిక్షం తన బైక్పై ఇంటికి వెళ్తుండగా కాగితరామచంద్రాపురంలో కారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షంకు గాయాలయ్యాయి. బాధితుడు సూర్యాపేట ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో బుధవారం బాధితుడి వద్దకు వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతికోదాడరూరల్ : పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల పరిధిలోని బీక్యాతండాకు చెందిన బోడ రాజు(45) భార్య ఐదేళ్ల కిందట మృతి చెందింది. కుమార్తెకు మూడేళ్ల కిందట వివాహమైంది. దీంతో ఒంటరిగా ఉంటున్న రాజు మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలుమునుగోడు: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలైన సంఘటన మునుగోడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు పట్టణంలోని లక్ష్మిదేవిగూడేనికి చెందిన కొంపల్లి నర్సింహ ఆదివారం రోజు మాదిరిగా చండూరు రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాయితో దాడి.. ఒకరికి గాయాలునడిగూడెం : తన కుటుంబ సభ్యులను తిట్టాడనే కారణంతో ఓ వ్యక్తిపై రాయితో దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గంధమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగితరామచంద్రాపురం గ్రామానికి చెందిన షేక్ షరీఫ్, అదే గ్రామానికి చెందిన షేక్ కరీమ్ కుటుంబ సభ్యులను అసభ్యకరంగా తిట్టాడనే కారణంగా షరీఫ్పై కరీమ్ రాయితో దాడి చేశాడు. దీంతో షరీఫ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బుద్ధవనంలో బోధి మొక్క నాటిన బౌద్ధ భిక్షువులు
నాగార్జునసాగర్ : దమ్మయాత్రలో పాల్గొన్న థాయిలాండ్ బౌద్ధభిక్షువులు బుధవారం బుద్ధవనంలో బోధి (రావి) మొక్క నాటారు. దమ్మయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా థాయిలాండ్ ప్రధాన బౌద్ధభిక్షవు సంఘ సక్ కోవిడో (అజాన్తున్) ఆధ్వర్యంలో స్థూప వనంలోని థాయిలాండ్ స్థూపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. దమ్మయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావును బౌద్ధభిక్షవులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, సీనియర్ అసిస్టెంట్ రాంకుమార్, బుద్ధవనం ప్రాజెక్టు సిబ్బంది నర్సింహారావు, ప్రజ్ఞానంద్, గగన్మాలిక్ ఫౌండేషన్ మేనేజర్ వికాస్టైడే తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్ల బండిపై రామలింగేశ్వర స్వామి ఊరేగింపు
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రామలింగేశ్వర స్వామి దంపతులను ఊరేగించారు. ఎడ్ల బండిని పూల మాలలతో అలంకరించి గరుత్మంతుడి వాహనంపై రామలింగేశ్వర స్వామి దంపతులను నిల్చోబెట్టి ఊరేగింపును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య ప్రారంభించారు. మోత్కూరు పట్టణంలోని చెరువు కట్ట, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పోతాయిగడ్డ, పద్మశాలి కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వడ్డెర కాలనీ, సుందరయ్య కాలనీ, అంగడి బజార్ తదితర కాలనీలలో స్వామి, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, దేవాలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రు, ప్రతినిధులు బుర్ర యాదయ్య, బయ్యని రాజు, ఉయ్యాల అంజయ్య, బుర్ర కృష్ణ, గుండు శ్రీను, మందుల సురేష్, బుర్ర నర్సయ్య, జెనిగల భిక్షం, జెనిగల శ్రీను, బిళ్లపాటి మహేందర్రెడ్డి, వెంకన్న, శేఖరాచారి, పోచం అంజయ్య, బందెల రవి పాల్గొన్నారు. -
చట్టాలపై సర్పంచ్లు అవగాహన పెంచుకోవాలి
భూదాన్పోచంపల్లి: పంచాయతీరాజ్ చట్టాలపై సర్పంచ్లు పూర్తిగా అవగాహన పెంచుకొని పరిపాలనపై పట్టు సాధించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాలుగవ విడతగా చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలలో మౌలిక వసతులకు కల్పనకు ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, ఎం.డీ మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ పాల్గొన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో శ్రీస్వామి వారికి పూజలను ప్రారంభించారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, సహస్రనామార్చన పూజలను చేపట్టారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అర్చకులు విశేషంగా చేపట్టారు. ఇక సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవంతో ఆలయాన్ని ద్వారా బంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహిస్తాంనల్లగొండ టౌన్ : పాలు, పాల ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తనిఖీలు చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రభాకర్, ఎన్.శివశంకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025లో ఉమ్మడి జిల్లాలో 24 చోట్ల పాల నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని.. అందులో పాలలో నీరు కలపడం, ఫ్యాట్ శాతం నిర్ణయించిన శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. వినియోగదారుల ఆరోగ్యం కాపాడేలా కృషి చేస్తున్నామని తెలిపారు. బీఓఎస్ సభ్యుల నియామకంనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో సిలబస్ కూర్పు, పరీక్షల నిర్వహణ విధానం మూల్యాంకనం, వంటి అంశాలను చర్చించి ఆయన ఆమోదించారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) మెంబర్లుగా అలువాల రవి, జక్క సురేష్ రెడ్డి, శ్వేత, వి.అనురాధ, మెంబర్ కన్వీనర్గా లక్ష్మీప్రభ, ఇతర సభ్యులుగా వాస్తవ అపర్ణ, ఏదుళ్ల శ్రీధర్రెడ్డిని నియమించారు. వీరి నియామకం రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
ఫ వేపను ఆశించిన డైబ్యాక్ తెగులు ఫ నిలువునా ఎండిపోతున్న చెట్లు ఫ పండుగకు వేప పూత కరువే
వేప చెట్టు పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదయం లేవగానే వేప పుల్లతో పళ్లు తోమ్ముకోవడం మాకు అలవాటు. అలాంటి వేప చెట్లు వింత రోగం వల్ల నశిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రోడ్డ పక్కన, పొలాల వద్ద ఉన్న వేపచెట్లు ఎండిపోతున్నాయి. ఈనెల 19న ఉగాది పచ్చడికి వేప పూత కరువవుతుంది. శాసీ్త్రయ పరిశోధన చేసి వేప చెట్లను కాపాడాలి. – నారబోయిన వెంకటేశం, అడ్డగూడూరుఅడ్డగూడూరు: తెలుగు సంవత్సరాది పండుగ వచ్చిందంటే ముందుకుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. మామిడి, చింతపండు, వేపపూత, కారం, ఉప్పు, బెల్లం వేసి పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాదీ స్వీకరిస్తారు. ఇందులో ఉండే తీపి, చేతు, వగరు, పులుపు, ఉప్పు, కారం ఈ షడ్రుచులు అనేవి జీవితంలో అన్ని అనుభవాలకు ప్రతీక. ఇలా ఎంతో ప్రధాన్యం కలిగిన పచ్చడి తయారీలో అవసరమైన వేపపూత ఈ సారి దొరకని పరిస్థితి నెలకొంది. వేప చెట్లకు డైబ్యాక్ తెగులు సోకి నిలువుగా ఎండిపోయాయి. ఉగాది పండుగ వేళ వేప పూతతో పచ్చగా కలకలలాడాల్సిన వేప చెట్ల మోడువారి దర్శనమిస్తున్నాయి. ఉనికి కోల్పోతున్న ఆరోగ్య ప్రదాయిని గ్రామీణ జీవనంలో వేప చెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం వృక్షం మాత్రమే కాదు.. ప్రకృతి ప్రసాధించిన అద్భుత ఔషధ గని. పల్లెల్లోని రైతులు, ప్రజలు తెల్లవారు జామున వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి పళ్లు తోముకునే వేపపుల్ల మొదలుకొని ఒంటి నొప్పులు ,చర్మవ్యాధులను సయంచేసే ఆకుల వరకు ఇలా వేప ప్రతిభాగం మానవారోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తోంది. గాలిని శుద్ధి చేస్తూ చల్లని నీడను ఇస్తూ ప్రతి ఇంటిముందు ఒక వైద్యుడిలా కొలువై ఉండే వేపచెట్టు నేడు తన ఉనికిని కాపాడుకోవడానికిపోరాడుతోంది. మొదట ఆకులు రాలి.. ఎప్పుడు ఆరోగ్యంగా కనిపించే వేపచెట్లు నిలువునా ఎండిపోవడానికి డైబ్యాక్ అనే తెగులు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాధి శీతాకాలం నుంచి ఎండకాలం మారే సమయంలో సోకుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధికి ప్రధాన కారణం ‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ అనే శిలీంధ్రం కారణమని అంటున్నారు. కొమ్మల చివరి నుంచి ఆకులు రాలిపోయి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. పచ్చని ఆకులు కాస్తా నల్లగా మారి నిర్జీవమవుతున్నాయి. వ్యాధి తీవ్రమైతే చెట్టుమొత్తం ఎండిపోయి చనిపోతుందంటున్నారు. ఈ వ్యాధి గాలి వల్ల వ్యాప్తిస్తుండి కాబట్టి పక్కన ఉన్న చెట్లకు కూడా సులువుగా అంటుకుంటుంది. అందువల్లే రహదారుల పక్కన వరుసగా ఉన్న చెట్లకు సోకి ఎండిపోతున్నాయని వారు అంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం కనిపించిన ఈ వ్యాధి ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టింది. మూడునాలుగు నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా మోడువారిన వేప చెట్లే దర్శన మిస్తున్నాయి. ఈ వింత వ్యాధి కారణంగా ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. వేప చెట్లకు సోకిన వ్యాఽధికి తగిన నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేప పువ్వు లేకుండా.. ఈనెల 19వ తేదీన ఉగాది పండుగ ఉంది. ఆ రోజు ఉగాది పచ్చడి తయారీకి అవసరమైన మామిడి కాయలు, చింతపండు,బెల్లం, ఉప్పు, కారం అందుబాటులో ఉన్నాయి. కానీ వేప పువ్వు లేదు. ఈ సారి వేప పువ్వు లేకుండానే పచ్చడి తయారు చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
భువనగిరిటౌన్ : రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ తో కలిసి నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగను సోదరభావంతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ అధికారులు పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మైనారిటీ సంక్షేమ అధికారిణి జయమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేలా పనిచేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్ని విభాగాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది, ఇన్పెషెంట్, అవుట్పెషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనం పై కొనసాగుతున్న అదనపు భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి బాలసదనంలోని విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భువనగిరి పట్టణంలోని మీనానగర్లో ఉన్న బాలసదన్ను తనిఖీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ రాంలింగం, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, ఆర్బీ కో ఆర్డినేటర్ అనంతలక్ష్మి, యశోద సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి భువనగిరిటౌన్ : ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు నిర్వహించే ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికకు సంబంధించి యాక్షన్ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు నెలల బియ్యం
భువనగిరి: మళ్లీ మూడు నెలల రేషన్ బియ్యం ముందస్తుగానే అందనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా బియ్యాన్ని ఒకే సారి ఏప్రిల్లో పంపిణీ చేయనున్నారు. వచ్చే వేసవి కాలం దృష్ట్యా మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పంపిణీని ఈమేరకు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించి నెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మూడు నెలలకు సంబంధించి అవరసరమైన 14,883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది. ఈ బియాన్ని స్టాట్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు తరలించనున్నారు. 515 రేషన్ దుకాణాలు జిల్లాలో ప్రస్తుతం మొత్తం 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 2,47,757 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,688 అంత్యోదయ కార్డులకు 381479 యూనిట్లు, 2,34,069 ఆహారభద్రత కార్డులకు 6,92,142 యూనిట్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా సుమారు 4,961 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటాయి. ఇలా మూడు నెలలకు కలిపి సుమారు 14,883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించనున్నారు. కారణాలు ఇవే.. గత ఏడాది వర్షాకాంలో వరదల ముప్పు, ప్రకృతి విపత్తులను దృష్టి ఉంచుకుని తిండి గింజల నిల్వ రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉండటం వంటి కారణాలతో గతంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటా ఒకే సారి పంపిణీ చేశారు. ఈ సారి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణం శాఖ వేసిన అంచనాను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యలు పునరావృతం కాకుండా.. గత ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం ఇవ్వడంతో లబ్ధిదారులు, రేషన్ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేయడం ద్వారా రవాణా చార్జీల ఖర్చు తగ్గడంతో పాటు హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. కానీ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేక డీలర్లకు సమస్యగా మారింది. ఆ తర్వాత విడతల వారీగా డీలర్లు బియ్యం తీసుకుపోయే అవకాశం కల్పించినా ఇబ్బందులు తప్పలేదు. ఇక మూడు నెలల బియ్యం తీసుకోవాలంటే ఒక కార్డు దారుడు మూడు సార్లు వేలి ముద్ర వేయాలి. ఈ క్రమంలో గతంలో సిగ్నల్తో పాటు సర్వర్ సమస్య, మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో ఒక్కో కార్డు దారుడికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయ పట్టింది. దీంతో లబ్ధిదారులకు రేషన్ దుకాణాల వద్ద నిరీక్షణతప్పలేదు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఎక్కడికి తరలించాలి అనే సమస్య అధికారులకు ఎదురుకానుంది. మూడు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం ఇవ్వడం పై మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక వేళ ఆదేశాలు వస్తే అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ మేజేజర్ఫ ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్ ఏప్రిల్1 నుంచి పంపిణీ ఫ రేషన్ షాపులకు తరలనున్న 14,883 మెట్రిక్ టన్నుల బియ్యం ఫ ప్రస్తుతం గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఫ వీటిని ఖాళీ చేయడానికి సమయం పట్టే అవకాశం -
ప్రజల జీవితాలు హరివిల్లుగా మారాలి
బొమ్మలరామారం: ప్రజల జీవితాలు హరివిల్లుగా మారాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలంలోని గోవింద్ తండాలో బుధవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి రంగులు చల్లుతూ ,సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. గిరిజనుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అడుగంటుతున్న జలాలు.. ఎండుతున్న పొలాలు
గుండాల: గుండాల మండలంలో రైతులు సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండి పోతున్నాయి. రోజురోజుకూ ముదురుతున్న ఎండలకు బావులు, బోర్లలో నీటి ఊట తగ్గి రైతులు వేసిన వరి పొలాలు ఎండి పోతున్నాయి. బిక్కేరు వాగులలో ఇసుకను యథేచ్ఛగా తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఊట తగ్గి బావులు, బోర్లు ఒట్టి పోతున్నట్లు రైతులు వాపోతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి సాగు చేస్తే నీరందక కళ్లెదుటే ఎండి పోతుండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. తుర్కలశాపురంలో ఎండిన వరి పొలం -
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
భువనగిరి, వలిగొండ: భర్తతో గొడవల కారణంగా ఇద్దరు కన్నబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్కు వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఎరుపుల యాదయ్య, పద్మ దంపతుల కుమార్తె ఐశ్వర్య (28)తో 2020లో వివాహం జరిగింది. మహేశ్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత వారికి కుమార్తె ఝాన్సీ (2) జన్మించింది. ఆ తర్వాత మహేశ్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఐశ్వర్య అతన్ని నిలదీసేది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని ఐశ్వర్యను మహేశ్ వేధిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో గొడవల వల్ల పుట్టింటికి వెళ్లి అక్కడే కుమారుడి (10 నెలలు)కి జన్మనిచ్చింది. అప్పట్నుంచి అక్కడే భార్య ఉంటుండగా మహేశ్ తన కుమారుడిని చూసేందుకు ఒక్కసారీ రాలేదు. పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇప్పుడైనా రావాలని భర్తను భార్య కోరగా తొలుత ఆమెనే అత్తారింటికి రావాలన్నాడు. దీంతో సోమవారం సాయంత్రం ఐశ్వర్య తన పిల్లలతో కలిసి అత్తారింటికి చేరుకుంది. రాత్రికి మహేశ్ విధులకు వెళ్లగా ఐశ్వర్య తన పిల్లలతో ఓ గదిలో నిద్రించింది. మంగళవారం ఉదయం ఎంతకీ ఐశ్వర్య నిద్ర లేవకపోవడంతో అత్తమామలు గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఐశ్వర్య ఫ్యాన్కు ఉరేసుకుంది. అయితే గొల్లగూడెం చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తే ఐశ్వర్యను, పిల్లలను హతమార్చాడని ఆరోపించారు. భువనగిరి డీఎస్పీ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి గదిలో మూడు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని.. వారిని జైలుకు పంపాలని లేఖలో ఐశ్వర్య రాసింది. తన వెంట తెచ్చిన పిల్లలను తన వెంటే మృత్యుఒడికి తీసుకెళ్తన్నట్లు లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: గొల్లెగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కూతురు(10 నెలలు), కుమారుడి(2)ని చంపి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు.మరో ఘటనలో..కాగా, మరో ఘటనలో నిరుపయోగంగా ఉన్న మిల్లులో ఉరేసుకుని వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని కోటక్ జిల్లాకు చెందిన శ్రీధర్(25) నేరేడుచర్ల పట్టణంలో నిరుపయోగంగా ఉన్న చాణక్య రైస్ మిల్లు పక్కనే ఉన్న ఒడిశా దాబాకు అప్పుడప్పుడు వచ్చి కొన్నిరోజులు అక్కడే పనిచేసి తిరిగి సొంతూరుకు వెళ్తుంటాడు.ఈ క్రమంలో గత నెల 25న దాబాకు వచ్చిన శ్రీధర్ మూడురోజులు పనిచేసి తిరిగి ఊరికి వెళ్తున్నానంటూ దాబా యాజమాని వద్ద రూ.3వేలు తీసుకుని వెళ్లాడు. అయితే సోమవారం చాణక్య రైస్ మిల్లు నుంచి దుర్వాసన వస్తుండడంతో పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మిల్లులోకి వెళ్లి పరిశీలించగా శ్రీధర్ ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు, మూడు రోజుల క్రితమే శ్రీధర్ ఉరేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బ్యాంకులో దోపిడీకి యత్నం
చౌటుప్పల్ : మండల పరిధిలోని ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి యత్నించారు. గ్యాస్ కట్టర్తో బ్యాంకు షట్టర్ను కట్ చేస్తుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంబావి(పాత కొయ్యలగూడెం) గ్రామంలో హైదరాబాద్–విజయవాడ హైవే సర్వీసు రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వైపు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి బైక్పై వచ్చారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకు వైపు వచ్చారు. ఈ దృశ్యాలు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేసి.. అయితే బ్యాంకు వద్దకు మాత్రం ఒకే వ్యక్తి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేశాడు. మిగతా వారు రెక్కీ నిర్వహిస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం బ్యాంకు ప్రధాన ద్వారం వద్ద ఇనుప గ్రిల్ తాళం పగులగొట్టాడు. అనంతరం షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా.. ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో చుట్టుపక్కల నివాసముండేవారు ఇళ్ల నుంచి బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బ్యాంకు వద్దకు చేరుకుని.. దుండగులు దోపిడీకి యత్నించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ సందర్శించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అయితే ఈ దోపిడీకి యత్నించింది ఎంత మంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముసుగులు ధరించి బైక్లపై వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్తో షట్టర్ కట్ చేస్తుండగా మోగిన అలారం స్థానికులు అప్రమత్తమవ్వడంతో పారిపోయిన దొంగలు చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన -
మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
హయత్నగర్ : నష్టాల్లో ఉన్న నల్లగొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్ముల్– మదర్ డెయిరీ)కి పూర్వ వైభవం తీసుకొస్తామని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని మదర్ డెయిరీ కార్యాలయంలో ఆయన డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మదర్ డెయిరీలో నెలకొన్న సరిస్థితులను, పదేళ్లుగా వస్తున్న నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించామని, సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మదర్ డెయిరీ మాక్స్ చట్టం పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేమని, ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందం కుదిర్చేందుకు కృషిచేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, నార్ముల్ ప్రతినిధి సామ మహిపాల్రెడ్డితో కూడిన బృందం ఎన్డీడీబీ ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తక్షణ సహాయంగా రూ.10 కోట్లు ఇచ్చేందుకు ఎన్డీడీబీ అంగీకరించిందన్నారు. పాల సేకరణను మదర్ డెయిరీ పాలకవర్గం చూసుకోవాలని, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్ ఎన్డీడీబీ చూసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. మదర్ డెయిరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ మధుసూదన్రెడ్డి -
పోలీసుల అదుపులో సైబర్ నేరగాళ్లు
● కోదాడ నియోజకవర్గ పరిధిలో 162 మందిని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు ● 30 మందిని అదుపులోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లు సీజ్ ● రిమాండ్కు తరలింపుచిలుకూరు : ఆన్లైన్లో గేమ్ల పేరిట లక్షల రూపాయాలు చెలామణి చేస్తున్న పలువురు సైబర్ నేరగాళ్లను సోమవారం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోదాడ, హుజూర్నగర్ నియోజవకర్గ పరిధిలో సుమారు 162 మంది ఉన్నట్లు గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు వారిలో 30 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, తెల్లబెల్లి, పాలారం, లక్ష్మీపురం, వల్లాపురం, ఆకుపాముల తదితర గ్రామాల నుంచి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంతో పాటు రిమాండ్కు కూడా పంపినట్లు సమాచారం. అయితే తమ వాళ్లను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు లక్షల రూపాయాలు చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారని, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి సెల్ఫోన్లు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థానిక పోలీసుల కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిలో చాలా మంది అధికార పార్టీ నాయకులు ఉన్నట్లుగా తెలిసింది. -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
మిర్యాలగూడ టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) ఆదివారం రాత్రి బైక్పై గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ.. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై యూట ర్న్ తీసుకుంటుండగా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్కు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య పగడాల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 5 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి వస్తువుల అపహరణ గరిడేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. ఈ ఘటన గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో జరిగింది. వివరాలు.. అప్పన్నపేట గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, చీరలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఐదు తులాల బంగారం, 35 తులాల వెండి వస్తువులు, రూ.1,30,000 నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, ఏఎస్ఐ జగన్మోహన్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలను సేకరించారు. -
ట్రాక్టర్ చోరీ చేసిన నిందితుల అరెస్టు
పెద్దవూర: ట్రాక్టర్ చోరీ చేసిన నిందితులను పెద్దవూర పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్తో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దున్న శ్రీను గత రెండేళ్ల నుంచి పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులో దొడ్డి నర్సింహారావు పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 12న దున్న శ్రీను ట్రాక్టర్తో పొలం దున్ని దానిని అక్కడే వదిలి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో పెద్దవూర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి మండలంలోని పొట్టిచెల్మ వై జంక్షన్ సమ్మక్క–సారలమ్మ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుముల గ్రామానికి చెందిన మంద శంకర్, కావేటి భరత్ ట్రాక్టర్పై హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఆపారు. ట్రాక్టర్కు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోతునూరు సమీపంలో పొలంలో ఉన్న ట్రాక్టర్ను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి ట్రాక్టర్, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను నిడమనూరు కోర్టులో రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. -
గంజాయి పట్టివేత
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు గంజాయి పట్టుకున్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపురం గ్రామంలోని పీర్ల గుట్ట, ప్రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆదివారం రాత్రి గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి గంజాయిని సేవిస్తున్న వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు, బైక్లను అక్కడే వదిలి పారిపోయారు. 60 గ్రాముల గంజాయి, రెండు బైక్లను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తెలిపారు. పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
చందంపేట : ఓ వ్యక్తితో ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ లచ్చు(30) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కూలీ పనితో పాటు ఊళ్లో చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కేతావత్ శ్రీకాంత్తో లచ్చుకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కర్రతో దాడి చేయగా లచ్చు, అతడి భార్య అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లచ్చును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో జోడుబాయితండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ బీసన్న ఆధ్వర్యంలో చందంపేట ఎస్ఐ లోకేష్, డిండి ఎస్ఐ బాలకృష్ణ, నేరెడుగొమ్ము ఎస్ఐ నాగేంద్రబాబు, నాంపల్లి, మర్రిగూడ ఎస్ఐలు, దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి బందోబస్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష ● మరో నలుగురికి జరిమానా సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష,, రూ.2300 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4 వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం అర్చకులు చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబందనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. -
వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం
భూదాన్పోచంపల్లి : వినూత్న ఆలోచనలే నూతన ఆవిష్కరణలకు దోహదపడతాయని 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ డాక్టర్ బి. బెనెట్ బోస్కోదాస్ అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎంట్రప్రెన్యూర్షిప్ సెల్(ఈ–సెల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ–సెల్ వేదికలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన అవకాశమన్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, సమాజంలోని సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమన్నారు. అలాగే ఈ–సెల్ విద్యార్థులకు సొంతంగా స్టార్టప్లు స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రోత్సహాన్ని అందించే కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. స్టార్టప్ ప్రయాణంలో సమస్యలను ఆధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సమాజానికి దోహదపడేలా ఉండాలన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. అనంతరం ఈ–సెల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ బెనెట్ బోస్కోదాస్ -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారని..
కొండమల్లేపల్లి : తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్ము వెంకటయ్య(49) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలో పూల్సింగ్తండాకు చెందిన నేనావత్ శ్రీనుకు మూడు గుంటల భూమిని వెంకటయ్య విక్రయించాడు. తన పేరిట ఉన్న మరో 17 గుంటల భూమిని కూడా శ్రీను, మరో నలుగురు కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరితే బెదిరిస్తున్నారని, దీంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వెంకటయ్య ఓ పేపర్లో రాసి సోమవారం తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపంతో బలన్మరణం -
మరణంలోనూ వీడని స్నేహం
శాలిగౌరారం : చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గుడిసె సైదులు, సరోజన దంపతులకు కుమార్తె, కుమారుడు రవి(20) ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. సైదులు నిమ్మ తోటలు కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సైదులు అనారోగ్యానికి గురికావడంతో భార్య సరోజన, కొడుకు రవి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన నిమ్మ తోట కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కౌలు పూర్తి కావడంతో ఇటీవలే ఊట్కూరు గ్రామానికి వచ్చారు. 7వ తరగతి నుంచి క్లాస్మేట్స్ సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల వంశీ(20) అమ్మమ్మ ఊరు ఊట్కూరు పక్కనే ఉన్న బండమీదిగూడెం. దీంతో వంశీ 7వ తరగతి నుంచి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఊట్కూరు జెడ్పీహెచ్ఎస్లో రవితో కలిసి చదివాడు. ఇంటర్మీడియట్ కూడా రవి, వంశీ కలిసే చదివారు. ఇద్దరూ ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. దీంతో రవి తల్లిదండ్రులతో కలిసి నిమ్మ తోటలు కౌలు చేస్తుండగా, వంశీ హైదరాబాద్లో ఉంటున్నాడు.సప్లమెంటరీ పరీక్షల కోసం వచ్చి..హైదరాబాద్లో ఉంటున్న వంశీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు రెండు రోజుల క్రితం డి. కొత్తపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వంశీ బైక్పై ఊట్కూరుకు వచ్చి రవిని వెంట తీసుకుని నల్లగొండలో పరీక్ష రాసేందుకు బయల్దేరాడు. మార్గమధ్యలో నల్ల గొండ మండలం చందనపల్లి వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఇద్దరూ మృతిచెందారు. సోమవారం రాత్రి ఊట్కూరులో రవి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో రవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఊట్కూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం శాలిగౌరారం మండలం ఊట్కూరులో విషాదఛాయలు -
బాల్య వివాహం నిలిపివేత
కేతేపల్లి : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బాలికకు బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికా రులు సోమవారం బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి పనులు జరుగుతుండటంతో అధికా రులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. బాల్య వివాహం చేయడం నేరమని, అవగాహన కల్పించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అంగీకరించి రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో తహసీల్దార్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి, అశ్రిత, లక్ష్మణ్, శోభారాణి ఉన్నారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్నకిరేకల్ : నకిరేకల్ పట్ట ణంలో ఆదివారం రాత్రి సంతకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న నకిరేకల్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ యువకుల సహాయంతో సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం ప్రైవేట్ వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్తో పాన్షాపు దగ్ధంసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజేత పాన్షాపులో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగామంటలు, పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలా నికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాన్షాపులోని సామాను కాలిబూడిదైంది. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రి, ఫర్నీచర్, రూ.35వేల నగదు దగ్ధమైనట్లు షాపు యజమాని తెలిపాడు. -
సర్పంచ్లు సుపరిపాలన అందించాలి
భూదాన్పోచంపల్లి: సర్పంచ్లు సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి సూచించారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, ఎం.డీ. మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ పాల్గొన్నారు. -
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
చౌటుప్పల్ : పరిశ్రమల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి సూచించారు. 55వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ రసాయన ఽపరిశ్రమల ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం క్లస్టర్ నుంచి పోచంపల్లి మండలం దోతిగూడెం క్లస్టర్ వరకు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించొద్దంటే ముఖ్యంగా భద్రత పాటిస్తే సరిపోతుందన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కలెక్టరే కన్నకొడుకులా..
తనయులు పట్టించుకోవడంలేదని, ఆదుకోవాలని కోరుతూ ప్రజావాణికి వచ్చి గోడు వెల్లబోసుకున్న వృద్ధదంపతులను చూసి చలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వారిని కన్నకొడుకులా ఆదరించి వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కుమారులు పంచుకొని, వారిని నిర్లక్ష్యం చేయడంతో గతంలోనే కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వారిలో మార్పురాలేదు. దీంతో ఆ వృద్ధదంపతులు సోమవారం మళ్లీ ప్రజావాణికి వచ్చారు. ‘మాకు ఎవరూ లేరు.. మీరే దిక్కు.. మమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పించండి’ అంటూ ఆ వృద్ధదంపతులు కలెక్టర్ను ప్రాధేయపడ్డారు. స్పందించిన కలెక్టర్ వారిని చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. -
విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం
ఫ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫ సాగర్లో ముగిసిన 3వ దమ్మయాత్ర నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ దమ్మ యాత్ర ముగింపు వేడుకలకు మంత్రి వెంకటస్వామితో కలిసి ఆయన హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం కల్బుర్గిలోని సిద్ధార్థ విహార్ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర శాంతి సందేశాన్ని చాటుతూ నాగార్జునసాగర్కు చేరుకోవడం సంతోషదాయకమ న్నారు.రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, దూలికట్ట వంటి చారిత్రక బౌద్ధక్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఒక ‘డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మనిషి సాధారణ జీవితం గడిపేందుకు బుద్ధుడి బోధనలు మార్గదర్శకంఅని అన్నారు. కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్, పర్యాటక శాఖ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి, గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్, అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హిట్టంబె, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. -
కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడో?
రామన్నపేట : గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన నెలరోజుల్లోనే కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ నూతన పాలకవర్గాలు కొలువుదీరి రెండు నెలలుదాటినా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆశావహులకు ఎదుచూపులు తప్పడంలేదు. సర్పంచ్లకు శిక్షణ కూడా.. జిల్లాలో 2025 డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అదే రోజున చాలా గ్రామాల్లో ఉపసర్పంచ్లను ఎన్నుకున్నారు. వివిధ కారణాల వల్ల కొన్ని చోట్ల వాయిదా పడిన ఉపసర్పంచ్ ఎన్నికను మరుసటి రోజు నిర్వహించారు. కొత్త సర్పంచ్లకు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని రామానంద తీర్ణ గ్రామీణ సంస్థలో విడతల వారీగా శిక్షణ కూడా ఇస్తున్నారు. అయినా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రం చేపట్టలేదు. ప్రతీ పంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల చొప్పున.. పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు ఉంటారు. పంచాయతీ పాలకవర్గం వీరిని ఎన్నుకుంటుంది. కో ఆప్షన్ సభ్యులకుసైతం వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. వీరు పాలకవర్గ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా సలహాలు సూచనలు చేయవచ్చు. ఉపసర్పంచ్ల ఎన్నిక, అవిశ్వాస సమయాల్లో ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండదు. ముగ్గురిలో ఒకరు గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మరొకరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి, ఇంకొకరు గ్రామాభివృద్ధికి సహకరించే దాత లేదా ఎన్ఆర్ఐ ఉంటారు. ఆశావహులకు తప్పని నిరీక్షణ ఎన్నికలు జరిగిన నెల రోజుల లోపు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలి. వీరి ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన లేదు. అసలు ఎన్నిక ఉంటుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో వార్డుల్లో పోటీలో ఉన్న వారిని విరమింప జేయడం, వివిధ పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా జరిగిన ఒప్పందాలలో కో ఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. అలాంటి హామీ పొందిన ఆశావహులు కో ఆప్షన్ పదవికోసం నిరీక్షించక తప్పడం లేదు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంఽధించి కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నిక ప్రక్రియ చేపడతాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. –విష్ణువర్ధన్రెడ్డి, డీపీఓ, యాదాద్రి భువనగిరి ఫ పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి రెండునెలలు ఫ కో ఆప్షన్ ఎన్నికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం ఫ ఎదురు చూస్తున్న ఆశావహులు -
పూర్వ వైభవం తీసుకొస్తాం
నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. - 8లోమహా శివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
కళాకారుల హక్కుల సాధనకు పోరాటం
భువనగిరిటౌన్ : కళాకారుల హక్కుల సాధనకు పోరాటం చేయనున్నట్లు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్ పేర్కొన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజానాట్య మండలి కళాకారులు అనేక సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, సరైన పారితోషికం లేకుండా, సామాజిక భద్రత హామీలు లేకుండా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, కళాకారుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారులను ఉపయోగించుకుంటూ, తరువాత వారికి కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ ఇమ్రాన్, చిగుర్ల లింగం, జిల్లా సమితి సభ్యులు వెంకటేష్, ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు భూషిపాక నరసింహ, ఉపాధ్యక్షులు పిట్టల శంకర్, ఇంజా హేమలత, కట్ల యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శి పోతు ప్రవీణ్, సోమ నర్సయ్య, మొగుళ్ల శేఖర్ రెడ్డి, మూల పోచయ్య, కళాకారులు మనోహర, జాను, శ్రీనివాస్, రాజప్ప, రేణుక, నవనీత, కృష్ణమ్మ, వసంత, కవిత, ఎలేంద్ర, లక్ష్మి పాల్గొన్నారు. -
అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: సంత్ కబీర్, జాతీయ చేనేత అవార్డు ప్రదానం కోసం ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో భాగంగా ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సంత్ కబీర్ అవార్డు కోసం 50 సంవత్సరాల వయస్సు నిండి చేనేత రంగంలో 20 సంవత్సరాల అనుభవం, జాతీయ చేనేత అవార్డు కోసం 30 సంవత్సరాలు పై బడిన వారు చేనేత రంగంలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండలని తెలిపారు. అర్హత, ఆసక్తి క లిగిన వారు ఈ నెల 23లోపు దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయాలని కోరారు. టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు సాక్షి,యాదాద్రి : రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. యాసంగి 2025–26 వరిధాన్యం కొనుగోళ్లపై సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఎత్తు, పల్లాలు సరిచూసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ లు, గన్నీ బ్యాగులు సరిపడా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్లు అందజేయాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందిలేకుండా తాగునీరు, టెంట్లు, కుర్చీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని పీపీసీ కేంద్రాలవారు మార్చి 15 లోగా తూకపు యంత్రాలు, తేమ యంత్రాలను సంబంధిత అధికారులచే ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 293 మంది గైర్హాజరుభువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలో 28 కేంద్రాలలో గణితం–1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 7,308 మంది విద్యార్థులకు గాను 7,015 మంది హాజరు కాగా 293 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. బీఈడీలో నాణ్యతాప్రమాణాలు మెరుగుపడాలినల్లగొండ టూటౌన్ : బీఈడీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్తో కలిపి కనీసం 10 మంది అధ్యాపకులను విధిగా నియమించాలన్నారు. ఆధార్లింక్తో అధ్యాపకుల నమోదు జరగాలని, 75 శాతం విద్యార్థి హాజరును కచ్చితంగా పాటించేందుకు ఫేస్ రికగ్నిషన్ మెషీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ఆకుల రవి పాల్గొన్నారు. ప్రతిపల్లెకూ ఆర్టీసీ బస్సు నడపాలిమునుగోడు : ప్రభుత్వం పత్రి పల్లెకు ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామస్తులు తమకు నల్లగొండ నుంచి మునుగోడు మీదుగా బస్సు నడపాలని ఇటీవల ఎమ్మెల్సీని కలిసి కోరగా.. ఆయన ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు ఏర్పాటు చేయించారు. సోమవారం మునుగోడులో బస్సును ప్రారంభించి అదే బస్సులో లింగవారిగూడెం వరకు ప్రయాణించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం నూరుశాతం అమలయ్యేందుకు ప్రతిపల్లెకు బస్సు ఏర్పాటు చేయాలన్నారు. -
ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్ఫెయిర్
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఆదివారం జయ సృష్టి–2026 పేరుతో సైన్స్ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన బొమ్మల కొలువు, డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, పీఎస్ఎల్వీసీ 33, 37 నమూనాలు, సోలార్ ఎనర్జీ, ఫుడ్ కోర్టు, స్పేస్ రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ క్యాంపులో తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సైన్స్ఫెయిర్లో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత హాజరై సైన్స్ఫెయిర్ను ప్రారంభించి మాట్లాడారు. జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాసీ్త్రయ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్: నల్లగొండలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐటీయూ ఏర్పడినప్పటి నుంచి దేశంలో కార్మికవర్గ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతికంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నది సీఐటీయూ మాత్రమే అన్నారు. సీఐటీయూ జిల్లా సభల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన కార్మికుల సమస్యలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఎండీ.సలీం, బాణాల పరిపూర్ణాచారి, డబ్బికార్ మల్లేష్, అవుత సైదులు, దండెంపల్లి సత్తయ్య, చింతపల్లి బయన్న, మల్లు గౌతమ్రెడ్డి, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజల ద్వారా నిత్యాదాయం రూ.42,96,548 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
నకిరేకల్ : హైదరాబాద్–విజయవాడ హైవేపై నకిరేకల్ పట్టణ పరిధిలోని పద్మానగర్ జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు సీఐ హరిబాబు తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. -
మోత్కూరు వాసికి డాక్టరేట్
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దునుక సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె సరితకు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఫార్మసీ విభాగంలో ‘డెవలప్మెంట్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ నానో కారియర్ బేస్డ్ ట్రాన్స్ థర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రకటించారు. త్వరలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. సరితకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రెండో పీఆర్సీ అమలు చేయాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదేళ్లు అవుతున్నా రెండో పీఆర్సీ అమలు చేయకపోవడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ఐదు విడతల పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, బి. ఆడం, వి. రమేష్, ఎస్. సోమయ్య, సీహెచ్. రమేష్, డి. లాలు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమయ్య -
‘వయ్యారిభామ’తో పంటకు నష్టం
త్రిపురారం : రైతులు పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ(పార్థీనీయం) కలుపు మొక్కకే. ఎందుకంటే ఈ కలుపు మొక్కకు ఎక్కడైనా పెరిగే లక్షణం ఉంటుంది. ఒక్కో వయ్యారిభామ కలుపు మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు దూర ప్రాంతాలకు సైతం త్వరగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క నివారణ చర్యలు కేవీకే కంపాసాగర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు ఆయన మాటల్లోనే.. వయ్యారిభామ కలుపు మొక్క వల్ల పంటలకే కాకుండా మనుషులు, పశువులకు కూడా ప్రమాదమే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు సోకడంతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ మొక్కలు తిన్న పశువులు హైపర్ టెన్షన్కు గురువుతాయి. పశుగ్రాసం పంటకు కూడా నష్టం కలిగిస్తాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కంటే ముందే ఈ మొక్కలు గ్రహించుకుంటాయి. తద్వారా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి సుమారు 40 శాతం మేర తక్కువ దిగుబడులు వస్తాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదం ఎక్కువ. వయ్యారిభామను తొలగించే విధానంపార్థీనీయం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే రైతులు చేతితోనే తొలగించాలి. మొక్కలు పూత దశకు రాకముందే తొలగించి వాటిని మంటల్లో కాల్చివేయాలి. లేకపోతే ఈ మొక్కలు ముదిరితే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పూత దశకు చేరుకున్న మొక్కలను తొలగించాలంటే చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కులు ధరించి తొలగించి కుప్పలుగా వేసి కాల్చివేయాలి. మొక్కజొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకుంటే వయ్యారిభామ కలుపు మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేర్వాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పశుగ్రాసం సాగు చేసుకునే రైతులు పంట వేయక ముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పూతకు రాకముందే తొలగించాలి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలుకంపోస్టుగా కూడా తయారు చేసుకోవచ్చువయ్యారిభామ కలుపు మొక్కలు ఎంతో ప్రమాదకరమైనప్పటికీ వాటిని ఉపయోగించుకొని కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందు కోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేవిదంగా గుంత తవ్వుకోవాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలు వేసి వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి చల్లుకోవాలి. ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని అన్ని పంటలకు సేంద్రీయ ఎరువుగా వినియోగించుకోవచ్చు. -
వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలో వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆదివారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఈ నెల 26న మహబూబాద్ జిల్లా వీఎస్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన ధర్మారం శ్రీశైలం కారులో హైదరాబాద్కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగా కారును ఆపారు. కారుపై ఉన్న చలానా కట్టాలని శ్రీశైలంపై ఒత్తిడి చేశారు. తాను తర్వాత కట్టుకుంటానని శ్రీశైలం చెప్పడంతో అతడిపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగాను ఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒగ్గు కళాకారుడు మృతిఅర్వపల్లి : ఒగ్గు కథ చెప్పడానికి బైక్పై వెళ్తు న్న ఒగ్గు కళాకారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన ఒగ్గు కళా కారుడు కొల్లు యాదయ్య(53) ఆదివారం ఒగ్గు కథ చెప్పడానికి జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వెళ్తున్నాడు. మార్గమధ్యలో నాగారం మండలం ప్రగతినగర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న వరికోత మిషన్ను పక్క నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను స్థానికులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద ఆదివారం కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కాసాని గోపయ్య తన ఇద్దరు కుమారులను తీసుకొని పాత వెల్ల టూరు గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లాడు. గోపయ్య చిన్న కుమారుడు వరుణ్(7) తన అమ్మమ్మ ఇంటి సమీపంలో కృష్ణానది వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. పెద్ద కుమారుడు వచ్చి తమ్ముడు నదిలో పడిపోయాడని గోపయ్యకు చెప్పడంతో వారు వెళ్లి గంట సేపు వెతికిన తర్వాత కృష్ణానదిలో వరుణ్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు నార్కట్పల్లి : ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై నార్కట్పల్లి పోలీసులు ఆది వారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల పరిధిలోని తొండల్వాయి గ్రామానికి చెందిన బింగి సాయిబాబా ఆరేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు మరో బాలికతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సాయిబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. -
దప్పిక తీర్చిన సోలార్ బోర్లు
చందంపేట : వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల దప్పిక తీర్చడానికి అటవీ శాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 14,719 హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఎండ వేడిమికి తట్టుకోలేక దాహం తీర్చుకునేందుకు జంతువులు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి కుంటలు, సాసర్ పిట్లను నింపేవారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ సహాయంతో ఐదు బోర్ల ద్వారా నీటి కుంటలను నింపుతున్నారు. ఈ చర్యలతో గతంతో పోలిస్తే అటవీ జంతువుల సంఖ్యతో పాటు చిరుత పులులను కూడా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చందంపేట మండలాన్ని ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, మను బోతులు, చిరుతపులులు, పులులు, అటవీ కుక్కల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నీరు తాగేందుకు కుంటల వద్దకు వచ్చే ఈ జంతువులను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జంతువుల అడుగులను బట్టి వాటిని నిర్ధారిస్తుంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో సోలార్ విద్యుత్తో బోర్ల ద్వారా నీటి కుంటలు నింపుతున్న అటవీ అధికారులు వేసవిలో వణ్యప్రాణులకు 24 గంటల పాటు అందుబాటులో నీరు -
చికిత్స పొందుతూ రైతు మృతి
గుర్రంపోడు : అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందా డు. ఆదివారం గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకా రం.. గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన గోవింద్(55) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సరైన దిగుబడి లేక నష్టపోయాడు. గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహానికి అప్పు కావడంతో అప్పులు అంతకుఅంత పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఈ నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి గోవింద్ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
గాదె శ్రీనివాస్రెడ్డి చూపిన మార్గంలో నడవాలి
మిర్యాలగూడ : భూపోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరజీవి గాదె శ్రీనివాస్రెడ్డి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీనివాస్రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రైతు, కార్మిక హక్కుల కోసం సాగిన పోరాటంలో శ్రీనివాస్రెడ్డి పాత్ర నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, గాదె పద్మమ్మ, ప్రభాకర్రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
‘మధ్యాహ్నం’లో టాప్
భువనగిరి : మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా ముందు వరుసలో నిలిచినందుకు జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. కాగా రెండో స్థానంలో వనవర్తి జిల్లా నిలిచింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న హైదరాబాద్లోని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదగా రాష్ట్రంలో రెండు జిల్లాలకు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉత్తమ పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాని జిల్లా విద్యాశాఖ అధికారికి అందుకున్నారు. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి గాను యాదాద్రి జిల్లాకు తొలి పురస్కారం లభించినందుకు యంత్రాగం హర్షం వ్యక్తం చేస్తోంది. 90 శాతానికిపైగా హాజరు జిల్లాలో 2003 జనవరి 2వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు, 2008–09 సంవత్సరాల కాలంలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 659 పాఠశాలల్లో పథకం కొనసాగుతోంది. ఆయా పాఠశాలల్లో సుమారు 41,254 మంది విద్యార్థులు ఉండగా నిత్యం 31 వేలకు వరకు (90 శాతం మంది) విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,220 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు. ఈ అంశాల అమలు వల్లే పురస్కారం 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం అమలులో ఉత్తమ పురస్కారాన్కి ఎంపిక చేసేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో మధ్యాహ్న భోజనం సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థుల హాజరు, వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావా అందించడం, వంట కార్మికులకు, ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు, వేతనాలు చెల్లించడం, తాజా కూరగాయాలు వినియోగించడం, పోషకాహారాన్ని అందించడంతోపపాటు పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉత్తమ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు పోషకాహారాన్ని అందిస్తాం. – సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారిమధ్యాహ్న భోజనం పథకం అమలులో జిల్లా భేష్ ఫ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన యాదాద్రి భువనగిరి ఫ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్న డీఈఓ -
బడికి దూరంగా 290 మంది
ప్రత్యేక సర్వేలో గుర్తించిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాం. గుర్తించిన వారికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పించాం. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లలుంటే ఆయా పరిశ్రమల యాజమాన్యం వారికి చదువు చెప్పించాలని సూచించాం. 19 ఏళ్లు నిండిన వారు ఓపెన్ ఇంటర్ చదివేలా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నాం. – సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారిభువనగిరి : ప్రతిఒక్క విద్యార్థి చదుకోవాలనే లక్ష్యంతో విద్యకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కొందరు మాత్రం బడికి దూరంగానే ఉంటున్నారు. విద్యార్థులు బడికి దూరంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా విద్యా శాఖ ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 290 మంది బడికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఇటుక బట్టీలు, పారిశ్రామిక ఏరియాల్లో పనిచేస్తున్న వారి పిల్లలే బడికి దూరంగా ఉన్నట్లు తేల్చారు. ఇందులో బొమ్మలరామారం, తుర్కపల్లి, చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే నివేదిక ఉన్నతాధికారులకు.. జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు కేజీబీవీలు, మోడల్, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ చదువుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. ఎంతో మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. వీరిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో జిల్లాలోని 17 మండలాల పరిధిలో 48 క్లస్టర్లలో 51 మంది సీఆర్పీలు ప్రతి ఇంటికి వెళ్లి 6 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగి చదువుకు దూరంగా ఉంటున్నవారి వివరాలను సేకరించి సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. పాఠశాలల్లో అడ్మిషన్ ప్రత్యేక సర్వే ద్వారా జిల్లాకు వలస వచ్చినవారు, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి చదువుకు దూరంగా ఉన్న 290 మంది వివరాలు సేకరించారు. గుర్తించిన వారిలో సుమారు 200కుపైగా పాఠశాలల్లో చేర్పించగా 15 ఏళ్లు పైబడిన వారికి అవగాహన కల్పించి ఓపెన్ టెన్త్, ఇంటర్లో చేర్పించారు. మరికొందరికి ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేసి చదువు చేప్పేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఫ ఇటుక బట్టీలు, పారిశ్రామిక ఏరియాల్లో పిల్లలే ఎక్కువ ఫ ప్రత్యేక సర్వేలో గుర్తించిన విద్యా శాఖ ఫ 200 మందికిపైగా పాఠశాలల్లో చేర్పించిన యంత్రాంగం ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత -
డిగ్రీ అభ్యర్థులకు మరో అవకాశం
రామన్నపేట : వివిధ కారణాలతో 2010–11 విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు డిగ్రీ కోర్సు పూర్తి చేయలేక పోయిన విద్యార్థులకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మరో అవకాశం కల్పించిందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రహత్ఖానం, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాత విధానం (ఇయర్ వైజ్), ప్రస్తుత సెమిసస్టర్ విధానంలో బ్యాక్లాగ్ పేపర్లు కలిగిన విద్యార్థులు ఈనెల 4వ తేదిలోగా పరీక్ష ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరాన్పై దాడులు అప్రజాస్వామికంభువనగిరిటౌన్ : ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడులు చేయడం అప్రజాస్వామికమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. ఒకదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహరిస్తుందని ఆరోపించారు. ట్రంప్ పాలనలో యుద్ధన్మాదం తీవ్ర స్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రజలంతా అమెరికా ట్రంప్ చర్యలను ఇజ్రాయిల్ దురాగతాలను వ్యతిరేకించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలిచౌటుప్పల్ : రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టి పకడ్బందీగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన పాలక ప్రభుత్వమే ప్రైవేటు విద్యా రంగంపై మొగ్గు చూపుతుందన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు కల్లూరి మల్లేశం, లావుడియా రాజు, నాగరాజు, రాహుల్, తీగుళ్ల శ్రీనివాస్, జగన్, ఉదయ్, ఇందురాణీ, ప్రకాష్, శ్రవణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారులు అన్నిరంగాల్లో ఎదగాలి మోత్కూరు : స్వర్ణకారులు అన్నిరంగాల్లో ఎదగాలని స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలాచారి అన్నారు. ఆదివారం మోత్కూరు మండల స్వర్ణకార సంఘం ఎన్నికలను స్థానిక ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాగోజు నరసింహాచారి, ఎన్నికల ఇన్చార్జ్ కె.శ్రీనివాసచారి, పూర్ణాచారి, రిటైర్డ్ హెచ్ఎం ఎం.బ్రాహ్మచారి, టి.మనోహరాచారి, సీనియర్ జర్నలిస్టు ఎస్ఎన్.చారి, చేపూరి అనిల్, ఆకవరం శ్రీనివాసాచార్యులు, సంఘ నాయకులు నరసింహాచారి,కొల్లోజు నరేందర్, షణ్ముకచారి, మోత్కూరు నవీన్, మోత్కూరు జగన్, బోగోజు రవి, సజ్జనం మనోహర్ పాల్గొన్నారు. రేణుకాచార్య జయంతి ఉత్సవాలు ఆలేరు రూరల్ : మండలంలోని కొలనుపాక గ్రామంలోని సోమేశ్వరాలయంలో ఆదిజగద్గురు రేణుకాచార్య జయంతోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా రుద్రాభిషేకాలు, చండీ హోమం, లక్ష దీపోత్సవం, శివ పార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వీరశైవ భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వీరశైవ భక్తులు కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వీరశైవ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కాలుష్యం కోరల్లో రంగాపూర్
రంగాపూర్ గ్రామ సమీ పంలో కాలుష్యం వెదజల్లుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్న టైర్ల కంపనీపై తదుపరి చర్యల నిమిత్తం జిల్లా పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)అధికారులకు లేఖ రాశాం. నిబంధనలు పాటించని, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఫ్యాక్టరీలపై చర్యలు తప్పనిసరిగా తీసుకునేలా జిల్లా అధికారులకు నివేదిక అందజేశాం. – రాజాత్రివిక్రమ్, ఎంపీడీఓ బొమ్మలరామారం రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ రాత్రి వేళల్లో తీవ్రమైన దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీంతో రాత్రి సమయంలో ఊపిరి తీసుకోలేక పోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఈ పొగతో సమీపంలోని కూరగాయల పంటలపై నల్లటి బొగ్గులాంటి పదార్థం పేరుకుపోతోంది. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలి. – జూపల్లి లింగం, బొమ్మలరామారం ఫ విషం చిమ్ముతున్న టైర్ల రీసైక్లింగ్ కంపెనీ ఫ అనారోగ్యం బారిన గ్రామస్తులు ఫ కూరగాలయ పంటలపైనా ప్రభావం ఫ పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి ఫ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు విన్నపంబొమ్మలరామారం : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కాలుష్య కారక కంపెనీపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు–పీసీబీ) అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో ఉన్న టైర్ల రీసైక్లింగ్ కంపెనీ రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తీవ్ర దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని వదులుతోంది. దీంతో కళ్లు మండుతున్నాయని, ఊపిరి పీల్చుకోలేక శ్వాస సంబంధిత సమస్యతోపాటు గుండె, ఊపిరితిత్తులు పాడవడం, జలుబు, ఎలర్జీ లాంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని, కూరగాయల పంటలపై కూడా ప్రభావం చూపుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగాపూర్ గ్రామస్తులు ఈనెల 23న ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతరావును కలిసి తమ సమస్యను వివరించారు. ఈ కంపెనీని మూసేయాలని గతంలో చాలాసార్లు అఖిల పక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రం ఆందోళలు చేసి అధికారులకు వినతులు అందజేశామని, అయినా కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోగా పోగా అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదని విన్నవించారు. ఇప్పటికై నా సదరు కంపెనీపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనలకు నీళ్లు! రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కాలుష్యాన్ని జనావాసాల్లోకి వదులుతున్నాయనేది బహిరంగ సత్యం. ఈ కంపెనీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు నెలకొల్పినప్పటికీ జనావాసాలకు సమీపంలో ఏర్పాటు చేయడమేంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యంతోపాటు వివిధ రకాల పంటలు, కూరగాలయ తోటలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సదరు కంపెనీ ఉత్పత్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, ప్రజారోగ్యానికి ముప్పులా దాపురించిన ఈ కంపెనీని మూసివేయాలని బాధిత గ్రామ ప్రజల డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం వేళలో కంపెనీ నుంచి కొద్దిపాటిగా విడుదలవుతున్న పొగ రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ లోపలి భాగం -
బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తిచేస్తూ సాగిన మూడవ దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి చేరుకుంది. 29 రోజుల పాటు సుమారు 403 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు బుద్ధవనం వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య.. స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ థాయిలాండ్, భారతదేశంలోని భిక్షువులతో కలిసి 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారని తెలిపారు. పాదయాత్ర విజయవంతానికి గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్, అక్షయ ఫౌండేషన్ అధ్యక్షుడు కేకే రాజా, బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు ఎంతగానో సహకరించారని తెలిపారు. 29 రోజుల పాటు సాగిన ఈ దమ్మ యాత్రలో ‘సాతి’ అనే శునకం భిక్షువులతో పాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనస స్వర్ణ, బుద్ధవనం ఆర్ట్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజాప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ మత్తుయ్య పాల్గొన్నారు. -
ఎన్డీడీబీ చేతికి మదర్ డెయిరీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: మూసివేత తప్పని దశకు చేరుకున్న మదర్ డెయిరీ (నార్ముల్)ని ఆదుకునేందుకు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) రంగంలోకి దిగనుంది. ఈ డెయిరీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా, కొంత కాలం నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు కూడా బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఎన్డీడీబీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేశ్ షా, బోర్డు ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ జి. మధుసూదన్రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మదర్ డెయిరీ సంస్థ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. అలాగే డెయిరీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. నిర్వహణ బాధ్యతలు ఎన్డీడీబీ తీసుకోవాలని మదర్ డెయిరీ పాలకవర్గం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రతినిధి బృందం బోర్డుకు అందజేసింది. రూ.75 కోట్ల నిధులు అనివార్యం..: ప్రస్తుత పరిస్థితుల్లో డెయిరీని గట్టెక్కించాలంటే రూ.75 కోట్ల వరకు అనివార్యంగా నిధులు కావాలని, అలాగే సంస్థ నిర్వహణకు మరికొంత అవసరం అవుతాయని, ఈ పరిస్థితుల్లో ఎన్డీడీబీ సహకారం కావాలని, లేదంటే డెయిరీ మూసివేత ఒక్కటే మార్గమవుతుందని తెలంగాణ ప్రతినిధులు వివరించారు. డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి వేతనాలు, పాల సేకరణ, బ్యాంకుల్లో తక్షణమే చెల్లించాల్సిన రుణాలు, కార్యకలాపాల పునరుద్ధరణ, పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం కొన్ని షరతుల మీద మదర్ డెయిరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ఎన్డీడీబీ అంగీకరించినట్టు తెలిసింది. ఈ షరతులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే జాతీయ స్థాయిలోని మరో డెయిరీతో కలిసి సంయుక్తంగా కొంతకాలంపాటు డెయిరీని నిర్వహిస్తామని ఎన్డీడీబీ స్పష్టం చేసింది. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ప్రతినిధులు చర్చల పురోగతికి కూడా తమ సమ్మతిని తెలియజేశారు. దీంతో 10–15 రోజుల్లో మదర్ డెయిరీ, తెలంగాణ ప్రభుత్వం, ఎన్డీడీబీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం మేరకు ఎన్డీడీబీ రంగంలోకి దిగి ఆర్థిక కష్టాలు, అస్తవ్యస్త నిర్వహణతో కుదేలవుతున్న మదర్ డెయిరీకి మళ్లీ జీవం పోసే ప్రయత్నాలను ప్రారంభించనుంది. -
అర్ధరాత్రి ఆపదొస్తే.. అల్లాడాల్సిందే!
పీహెచ్సీల్లో రాత్రి వేళ అందుబాటులో ఉండని వైద్యులు ● ఆత్మకూర్ పీహెచ్సీలో 24 గంటల వైద్యం అందించాలి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండాలి. కాని ఒక్కరే డాక్టర్ ఉన్నారు. మరో డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్య సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అందులో హెల్త్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉన్నారు. పోసానికుంట వద్ద తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మోత్కూరు చెందిన రామకృష్ణ తలకు గాయమై చికిత్స కోసం పీహెచ్సీకీ తీసుకువచ్చారు. అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్ ప్రాథమిక వైద్యం చేసి భువనగిరికి రిఫర్ చేశారు. ఫ కింది స్థాయి సిబ్బందికి డ్యూటీ వేసి వెళ్లిపోతున్న డాక్టర్లు ఫ అత్యవసర వైద్యం కోసం ప్రైవేట్కు పరుగులు తీస్తున్న రోగులు ఫ 24 గంటల వైద్యం ఉత్తిమాటే ఫ కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సాక్షి, యాదాద్రి: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పరిఽధిలో 24 గంటల వైద్యం మొక్కుబడిగా మారింది. రాత్రి సమయంలో పీహెచ్సీల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇద్దరు వైద్యులు షిఫ్టుల వారీగా వైద్యం అందించాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందికి డ్యూటీ వేసి డాక్టర్లు వెళ్లిపోతున్నారు. దీంతో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం రోగులు ఆస్పత్రికి వెళ్తే పట్టించుకునే డాక్టర్లు కరువయ్యారు. శనివారం రాత్రి 8 గంటల అనంతరం 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన పీహెచ్సీలను విజిట్ చేయగా.. పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అత్యవసర సేవలకు అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. యాదగిరిగుట్ట, ఆత్మకూర్ (ఎం), నారాయణపూర్, రాజాపేట, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, మోత్కూరు, తుర్కపల్లి, బొమ్మలరామారం పీహెచ్సీలు 24 గంటల వైద్యం అందించాలి. వీటిల్లో మొత్తం 14 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండాలి. ఇందులో ఒక మహిళా డాక్టర్ లేదా ఆయూష్ డాక్టర్ ఉంటారు. అత్యవసర సేవలకు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. స్టాఫ్ నర్సులు, నర్స్– మిడ్ వైప్లు ముగ్గురు ఉండాలి. వీరితోపాటు ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ సిబ్బంది ఉండాలి. కాని ఎక్కడా అందుబాటులో ఉండడం లేదు. ● తుర్కపల్లి పీహెచ్సీలో శనివారం రాత్రి 8 గంటలకు విజిట్ చేయగా ఒక ఏఎన్ఎం మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇక్కడ ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లలో ఒకరు రాజాపేట పీహెచ్సీకి డిప్యూటేషన్పై వెళ్లారు. మరో డాక్టర్ సాయంత్రం విధులను పూర్తి చేసుకుని వెళ్లారు. అత్యవసర వైద్యం కోసం ఎవరైన రాత్రివేళ వస్తే వారికి వైద్యం అందదు. ఇటీవల గర్భిణి కడుపు నొప్పితో రాత్రి వేళ వస్తే వైద్యం చేసే డాక్టర్ లేక భువనగిరికి తరలించారు. ● వలిగొండ మండల కేంద్రంలోని పీహెచ్సీలోనూ రాత్రి 8 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ హల్లోపతి, ఆయుర్వేదం డాక్టర్లు ఇద్దరు ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ప్రస్తుతం సిస్టర్, ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు. అత్యవసర వైద్యం కోసం రోగులను భువనగిరికి పంపిస్తున్నారు. కోతులు లోపలికి వస్తాయన్న భయంతో ఐరన్ గ్రిల్స్తో ఆస్పత్రి మూసి వేశారు. -
కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : పోక్సో కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ ఆదేశించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా న్యాయమూర్తి జయరాజు సూచనల మేరకు జిల్లా కోర్టు ఆవరణలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసం అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీపీ, పోలీసు, చైల్డ్లైన్ శాఖల వారికి పోక్సో కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, జేజేబీ కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రెడ్డి, సఖి ఓన్ స్టాఫ్ సెంటర్ సెంట్రల్ అడ్మిన్ విన్ని, భువనగిరి టౌన్ ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. -
ఆన్లైన్లో రెవెన్యూ సేవలు
భువనగిరిటౌన్ : మీ సేవ కేంద్రాల ద్వారా అందించే రెవెన్యూ సేవల్లో పారదర్శకత, వేగవంతం కోసం ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకువచ్చింది. ధ్రువపత్రాల జారీలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పాలనా అధికారులకు కొత్తగా జీపీఓ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. పౌరసేవలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలపై సిబ్బంది విచారణతో పాటు నివేదిక ప్రక్రియ అంతా ఇక యాప్ సాయంతో ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దీంతో ప్రజలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి. ఈమేరకు మంగళవారం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్తో కలిసి మొబైల్ యాప్ పని తీరుపై సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన విధానాన్ని వివరించారు. ఈమేరకు రెండు నెలల క్రితం భువనగిరి మండలంలోని పెంచికల్పహాడ్, భువనగిరి పట్టణం, బీబీనగర్, కొండమడుగు, మక్త అనంతారం గ్రామాల్లో జీపీఓల ద్వారా పైలట్ దరఖాస్తులపై మొబైల్ యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. యాప్ ఆచరణలో సాంకేతికంగా తలెత్తుతున్న అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకనుణంగా మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న మొబైల్ యాప్ సాంకేతిక అడ్డంకులన్నీ అధిగమించి పూర్తి స్థాయి అప్లికేషన్ను ఈ నెల 25వ తేది నుంచి జీపీఓలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం జీపీఓ మొబైల్ యాప్ ద్వారా మరణ, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. త్వరలో పూర్తి రెవెన్యూ సేవలు జీపీఓ యాప్ ద్వారా అందించనున్నారు. ఫ ప్రత్యేకంగా జీపీఓ యాప్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఫ ధ్రువపత్రాలు జారీ చేయడంలో జాప్యానికి చెక్ -
కాలువల పనులు పూర్తిచేయాలి
సాక్షి, యాదాద్రి : భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సాగు నీటి కాలువల ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం భువనగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలపై అధికారులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.485 కోట్లతో బునాదిగాని కాలువ ధర్మారెడ్డి పల్లి కాలువ, పిల్లాయిపల్లి కాలువల పనులు చేపట్టామన్నారు. వచ్చే మూడు నెలల్లోపు కాలువలు పూర్తి చేయాలన్నారు. కాలువల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పక్కకు తీయడం, బస్వాపూర్ హైలెవల్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బోల్లెపల్లి, భీమలింగం, అలీనగర్ కాలువల పునరనిర్మాణం కోసం కావాల్సిన అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నీటిపారుదల, రెవెన్యూ అధికారులకు సూచించారు. సమావేశంలో భువనగిరి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్లు తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, తడక వెంకటేశం, నీటి పారుదల శాఖ ఎస్ఈ రవీందర్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎస్డీసీ (భూసేకరణ) జగన్నాథ రావు, నీటి పారుదల శాఖ ఈఈలు శైలేందర్, ఖుర్షీద్, గ్రంథాలయం చైర్మన్ అవేజ్ చిస్తీ, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
ఆన్లైన్లోనూ మార్కెటింగ్ చేసుకోవచ్చు
భూదాన్పోచంపల్లి: సొంత వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్లో, ఇతర సామాజిక మాధ్యమాల సాయంతోనూ చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసుకోవచ్చని నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం ఆయన పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘంలో అధికారులు, సంఘం పాలకవర్గంతో సమావేశమయ్యారు. సంఘం ద్వారా చేనేత కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి, అనుసరిస్తున్న మార్కెటింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాపునర్వి హ్యాండ్లూమ్ను సందర్శించి నూలు, చిటికి కట్టడం, రంగులద్దకం, రీలింగ్ యూనిట్, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. నూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని, వస్త్రోత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో అవలంబిస్తున్న నూతన విధానాలను సాయిని భరత్ కలెక్టర్కు వివరించారు. అలాగే చేనేత కార్మికుడు పెండెం కృష్ణ ఇంటిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నాణ్యతను పాటించాలని సూచించారు. అదేవిధంగా పోచంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆరా తీశారు. జలాల్పురంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ను తనిఖీ చేశారు. కాగా.. మున్సిపాలిటీ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న స్మశానవాటికకు నిధులు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కలెక్టర్కు విన్నవించారు. ఆయన స్పందించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ సత్యనారాయణ, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఓ బాలమోహన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, ఎంఈఓ ప్రభాకర్, ఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, ఎస్ఓ ఇందిర, రుద్ర ఆంజనేయులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
కేసులు పెండింగ్ లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : జిల్లాలో కేసులు పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. శనివారం జిల్లా కోర్టు భవనంలో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం అంశాలపై చర్చించి, త్వరితగతిన కేసుల పరిష్కారం, పెండింగ్ జాప్యాన్ని తగ్గించటం, జైలులో ఉన్న వారి కేసులు పరిష్కారం, న్యాయ సహాయం, సాక్షి రక్షణ పథకం వంటి అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవి లత, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ పాల్గొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి భువనగిరి: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అఽధిరోహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. శనివారం భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల లింగబసవ గార్డెన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ విద్యార్థులకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏకాగ్రతతో చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పరీక్షల మధ్య ఉన్న విరామ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల్లో పరీక్షా భయం లేకుండా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి సాహితి, డీఈఓ సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి బొమ్మలరామారం: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బొమ్మలరామారం మండలంలోని యువ డిఫెన్స్ అకాడమీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను శనివారం పరిశీలించారు. కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన గాలి, వెలుతురు ఉండేలా, తాగు నీరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు త్వరగా పూర్తిచేయాలిభువనగిరిటౌన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిపై పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ వేతనాలు, మెటీరియల్ చెల్లింపుల లక్ష్యాలను సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి భువనగిరిటౌన్ : గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ.30 వేల పెన్షన్, హెల్త్కార్డులు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు, ముష్కె జయపాల్రెడ్డి, మంతపురం వినోద్, సుర్వి శ్రీనివాస్గౌడ్, మాణిక్యమ్మ, బేజాడి కుమార్, కృష్ణ, లక్ష్మణ్, గణేష్, పాండు పాల్గొన్నారు. -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
యాదగిరిగుట్ట రూరల్: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జెడ్పీసీఈఓ శోభారాణి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. బిల్లులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నిర్మాణాన్ని పూర్తి చేయాలని మేసీ్త్రకి సూచించారు. అదేవిధంగా నర్సరీని పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలని ఆదేశించారు. జెడ్పీ సీఈఓ వెంట పంచాయతీ కార్యదర్శి నరేష్, ప్రధానోపాధ్యాయులు రవీందర్, సిబ్బంది తదితరులున్నారు. ఫ జెడ్పీసీఈఓ శోభారాణి -
భ్రూణ హత్యలు నివారించాలి
ఫ డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ భువనగిరి: భ్రూణ హత్యలను పూర్తిగా నివా రించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రచారం చేయడం, సహకరించడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోక తప్పదన్నారు. గర్భిణుల పర్యవేక్షణ, అల్ట్రాసౌండ్ కేంద్రాల తనిఖీలు, రికార్డుల సమగ్ర పరిశీలన, సీ సెక్షన్ ఆడిట్ నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్ యశోధ, వీణ, నిర్మల, శ్రీదేవి, అరుంధతి, ప్రజా సంబంధాల అధికారి నాగరాజు, శివలింగం, తాజోద్దీన్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సర్వే పూర్తి
అడ్డగూడూరు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే ముగిసింది. గత నెల 25, 26, 27వ తేదీల్లో మూడురోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లా ఎంపిక చేసిన బడుల్లోనే ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా నిర్వహించిన సర్వే బాధ్యతలను ఉపాధ్యాయులకు కాకుండా ప్రస్తుతం బీఈడీ చదువుతున్న విద్యార్థులకు అప్పగించారు. వీరిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. సర్వే నిర్వహణపై ఎంపిక చేసిన వారికి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. మొదటి రోజు తెలుగు భాషపై వివరాలు సేకరించారు. రెండో రోజు గణిత అభ్యసన సామర్థ్యాలపై, మూడో రోజు ఇంగ్లిష్ భాషకు సంబంధించి వివరాలను సేకరించారు. ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో సర్వే అభ్యసన సర్వేను జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం.. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. తరగతుల వారీగా చవదడం, రాయడంతోపాటు, గణితంలో నాలుగు రకాల ప్రాథమిక ప్రక్రియలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026– 27 నాటికి విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎఫ్ఎల్ఎన్లో సాధించిన ఫలితాలను బేరీజు వేసేందుకు చేపట్టిన ఈ సర్వే ఈనెల 27తో ముగిసింది. ఫ గత నెల 25, 26, 27వ తేదీల్లో కొనసాగిన ప్రక్రియ ఫ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన ఇన్వెస్టిగేటర్లు


