Yadadri
-
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
యాదాద్రి భువనగిరి
చేతులెత్తేసిన కాంగ్రెస్.. పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే చేతులెత్తేసిందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.సూర్యాపేటలో యోగా పోటీలు ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలను మార్చి 2వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. 7- 8లోమంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 9లోవైభవంగా నిర్వహించాలి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ సూచించారు.- 8లో -
‘గర్భిణి ఇంటికి వెళ్లి.. వైద్యసేవలపై ఆరా తీసి
గుండాల : గర్భిణులు సమతుల ఆహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యకరమైన బిడ్డలు జన్మిస్తారని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా శ్రీగర్భిణి ఇంటికి వెళ్లి.. తలుపు తట్టిశ్రీ కార్యక్రమానికి సోమవారం గుండాల మండలం అనంతారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని హైరిస్క్ గర్భిణి అపర్ణ ఇంటిని సందర్శించారు. కలెక్టర్ను వచ్చానంటూ పరిచం చేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని, వైద్య పరీక్షల చేయించుకుంటున్నారా, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారని గర్భిణిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని సూచించారు. మొదటి రోజు 300 మంది హైరిస్క్ గర్భిణుల ఇళ్లను అధికారులు సందర్శించినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, తహసీల్దార్ జలకుమారి, ఎంపీడీఓ శంకరయ్య, వైద్యాధికారి హైమావతి, సీడీపీఓ జ్యోష్న, వైద్యసిబ్బంది ఉన్నారు. శివుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆల య ముఖ మండపంలో స్పటిక లింగానికి పూజలు నిర్వహించారు. అదే విధంగా ప్రధానాలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ మహిళా విభాగం కార్యదర్శిగా వనజారెడ్డి ఆలేరురూరల్ : కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన వనజారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ సోమవారం గాందీభవన్లో ఆమెకు నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రి కోమట్రెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ ఐలయ్య, జిల్లా ఇంచార్జి కృష్ణవేణికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
యాదగిరిగుట్ట : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన పేరున ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైకుంఠద్వారం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై ఎవరైతే కుట్రలు చేశారో వారి చేతుల్లోనే నేడు తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని.. మన నిధులు, మన వనరుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారని, ఆయన ఆనవాళ్లు తుడిచివేయడం ఎవరితరం కాదన్నారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత కేసీఆర్దేనన్నారు. యాదగిరి క్షేత్రాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, ప్రజల తరఫున పోరాటం చేసేందుకు మరింత శక్తి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. సమగ్ర కు టుంబ సర్వే పారదర్శకంగా జరగని కారణంగా తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ పాటలకు డ్యాన్స్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, భిక్షమయ్యగౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మ హేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు తుంగబాలు, చింతల వెంకటేశ్వర్రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, యాదగిరి గుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ కార్యదర్శి పాపట్ల నరహరి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనురాధ పాల్గొన్నారు.ఫ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా నిలిపిన ఘనత కేసీఆరేదే ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
మహోత్సవానికి వేళాయే..
పంచకుండాలు సిద్ధం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధానాలయ ఉత్తర మాడ వీధిలో పర్ణశాల ఏర్పాటు చేశారు. వాసుదేవ, ప్రద్ద్యుమ్న, సంకర్షణ, నారాయణ, అనిరుద్ధ అనే దేవతమూర్తుల పేర్లతో ఐదు కుండాలు సిద్ధం చేశారు. పంచకుండాల చెంత విశేష హోమాధి పూజలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 108 మంది రుత్వికులతో నృసింహ మూల, మూర్తి మంత్రం, రామాయణ, మహా భారత ఇతి హాసాల పఠనం చేపట్టనున్నారు.యాదగిరి క్షేత్రంలో రేపటి నుంచి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం.. ఏర్పాట్లు పూర్తియాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19నుంచి 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహాయాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీమధురకవి రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. వేడుకకు వచ్చే అతిథులు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా ఈఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్వాగత తోరణాలు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం అనంతరం మార్చి 1నుంచి నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రధానాలయం, ఆలయ పరిసరాలు, యాదగిరిగుట్ట పట్టణం, వంగపల్లి, రాయగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ తోరణాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా తెలంగాణ టీ చౌరస్తా నుంచి వైకుంఠద్వారం వరకు ఇరువైపులా దేవుళ్ల రూపాలతో కూడిన లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలయం శుద్ధి ప్రధానాలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపాలను సోమవారం దేవస్థానం సిబ్బందితో కలిసి ఆలయ ఈఓ భాస్కర్రావు స్వయంగా శుద్ధి చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30గంటల వరకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ శుద్ధి పూర్తయిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిచ్చారు. విద్యుత్ దీపాలతో అలంకరణ ప్రధానాలయం, ఉప ఆలయాలతో పాటు యాదగిరికొండ చుట్టూ ఆకర్షణీయంగా ఉండేలా రంగురంగుల విద్యుత్ కాంతులు విరజిమ్మే లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు యాదగిరికొండపైన జరిగే పూజాధి కార్యక్రమాల వివరాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు భక్తులు, యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైక్లు ఏర్పాటు చేశారు. సమిధలు అందజేతయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమానగోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే పంచకుండాత్మక యాగా నికి పలువురు దాతలు సోమవారం సమిధలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన వెంకట పురం విద్యాసాగర్, బాణాల శ్రీకాంత్ సుమారు 30 క్వింటాళ్ల మామిడి, మోదుగు సమిధలను టీటీడీ లోకల్ అడ్వైజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ ద్వారా అందజేశారు. -
దారులన్నీ గట్టువైపే
లింగమంతుల స్వామి జాతరకు పోటెత్తిన భక్తులుసూర్యాపేట, చివ్వెంల,సూర్యాపేటటౌన్, భానుపురి: చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర రెండవ రోజు సోమవారం జనగట్టును తలపించింది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. రెండవ రోజు చౌడమ్మ బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు బోనాలతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారిని సోమవారం ఒక్కరోజే 6 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. బోనాల సమర్పణ సాగిందిలా.. మున్న (రాజులు) మెంతబోయిన (పూజారులు) తమ ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో రెండు బోనాలు వండి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఈ జాతరలో ప్రత్యేకత. తొలుత మున్నవారు రాశిబోనం, తర్వాత మెంతబోయినవారు సందవసర బోనం సమర్పించారు. ఇరు బోనాల నుంచి కొంత అన్నం తీసి లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తొలిగొర్రె (మెంతబోయిన వారిది), బద్దెపాల గొర్రె (మున్న వారిది), వరద గొర్రె (గొర్ల వారిది)లను చౌడమ్మ తల్లికి ఎదురుగా బలిచ్చారు. ఆ మాంసాన్ని మున్న, మెంతబోయిన, బైకానివారు వాటాలుగా పంచుకుని వండి చౌడమ్మకు నైవేద్యం సమర్పించారు. లింగమయ్య పూజల్లో ప్రముఖులు లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్రెడ్డి, కలెక్టర్ దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు. నేడు చంద్రపట్నం ఫ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఫ ఓ లింగా నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టు ఫ రెండవ రోజు ప్రత్యేకంగా సాగిన బోనాల సమర్పణ ఫ పూజల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ -
మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమానగోపుర మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈనెల 19 నుంచి 23 వరకు జరిగే మహాక్రతువుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండురోజుల్లో ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తికానున్నాయి. 108 మంది రుత్విక్కులతో పూజలు నిర్వహిస్తారు. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెస్తున్నారు. ఇందుకోసం కొండపైన హోమగుండాలు కూడా సిద్ధమవుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణకు ఈనెల 23న జరిగే మహా కుంభాభిషేకం జరుగుతుంది. ఉదయం 11.34 గంటలకు నిర్ణయించిన ముహూర్తంలో ఈకార్యక్రమం జరుగుతుంది. పీఠాధిపతి వానమామలై రామానుజ జియర్స్వామి పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. 19 నుంచి 22 వరకు 108 మంది రుత్విక్కులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహిస్తారు. రామాయణ, భారత, భాగవత కథలను పారాయణం చేస్తారు.ప్రత్యేక వసతులు, ఏర్పాట్లు... మహాకుంభ సంప్రోక్షణకు దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేసి ఇందుకోసం ప్రత్యేక వసతులు, ఏర్పాటు చేస్తున్నారు. 23న సుమారు లక్షమంది భక్తులకు పులిహోర ప్రసాదం ఉచితంగా అందించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మహాకుంభ సంప్రోక్షణతోపాటు మార్చి1 నుంచిప్రారంభమయ్యే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార కార్యకమంలో భాగంగా దేవస్థానం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, భువనగిరి, శంషాబాద్, మహరాష్ట్రలోని షోలాపూర్లో స్వాగత తోరణాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తోంది. శ్రీస్వామివారి విమాన గోపురం బంగారు తాపడం పనులకు దేవస్థానం 68కిలోల బంగారం వాడుతుంది. ç50.5 ఫీట్ల పంచతల రాజగోపురానికి చుట్టుమొత్తం10,759 చదరపు అడుగల మేర స్వర్ణతాపడం పనులు చేపట్టారు. దేవాలయం పునర్నిర్మాణంప్రారంభించినపుడే విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ముందుగా11వేల కిలోల రాగితో రేకులను తయారు చేశారు. ఒక చదరపు అడుగు రేకుకు 6 గ్రాముల బంగారం ఖర్చు చేస్తున్నారు. ఐదు యజ్ఞకుండాలు: కొండపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు హోమ కుండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దకుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు చేస్తారు. చివరి రోజైన ఈనెల 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం, మూలమూర్తి హవనం చేస్తారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి విమాన గోపురానికిప్రాణం ΄ోస్తారు. ఇందులో 108 మంది పారాయణదార్లు పాల్గొంటారు. వివి«ద్ర పాంతాలనుంచి రుత్వికులు వస్తారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.మహాకుంభాభిషేక, సంప్రోక్షణ వివరాలు19వ తేదీ బుధవారం: ఉదయం గం. 7.45కు భగవద్ అనుజ్ఞ స్వస్తి వాచన, శ్రీ విశ్వక్సేనారాధాన, పుణ్యాఃవాచన, రక్షాబంధన, బుత్విగ్వరణం, మృత్సంగ్రహణ, పర్యగ్నీకరణ, తిరువీధి సేవ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధనతో ఆరంభం అవుతాయి. సాయంత్రం 6:00 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు వారణానువాక హోమం, జలాధివాసం, నిత్యపూర్ణాహుతి, నివేదన, తీర్ధప్రసాద గోష్ఠి, తిరువీధి సేవ, ఆలయంలోకి వేంచేపు జరుగుతాయి. గురు, శుక్ర వారాలలో వివిధ కార్యక్రమాల అనంతరం 22 వ తేదీ శనివారం తిరువీధిసేవ,చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమం, ఏకాశీతి కలశ స్నపనం, మూల మంత్రమూర్తి మంత్ర హావనం, నిత్యపూర్ణాహుతి నివేదన, నీరాజన మంత్ర పుష్పం, శాత్తుమరై, సాయంత్రం 6:00 గంటలకు నిత్య పూర్ణాహుతి నివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి తిరువీధి సేవ ఆలయంలోకి వేంచేపుతో ముగుస్తాయి. ఈనెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం జరిపి దివ్యవిమాన గోపురాన్ని శ్రీ స్వామివారికి అంకితం చేస్తారు. 23వ తేది ఉదయం 11.54 గంటలకు స్వర్ణవిమానగోపురానికి కుంభాభిషేకం చేస్తారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమానం బంగారు తాపడంలో 40 రకాల విగ్రహాలు బంగారు పూతతో చెక్కారు. విమాన గోపురంపై బంగారు రేకులపై పంచనారసింహ క్షేత్రంలో స్వామివారి వివిధ రూపాలను చెక్కారు. శ్రీవిష్ణుమూర్తి దశావతారాలు, నర్సింహస్వామి వారి వివిధ రూపాలను వివిధ ఎత్తులతో చెక్కారు. అలాగే స్వామివారి గరుడ విగ్రహాలు నాలుగు, సింహాలు 8 ఇలా మొత్తం స్వర్ణతాపడంపై ΄÷ందుపరిచారు. కాగా దేశంలోనే అతి పెద్ద స్వర్ణ విమాన గోపురంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి విమానగోపురంతోపాటు ఆలయంపై ఉన్న 39 కలశాలకు కూడా బంగారు తాపడం చేశారు. ఈ సందర్భంగా రోజూ 2000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు.ఏర్పాట్లు పూర్తిశ్రీ లక్ష్మి నర్సింహస్వామి దేవాలయం విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి అయ్యాయి. దేవస్థానం పీఠాధిపతి పర్యవేక్షణలో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 108 మంది రుత్విక్కులు ప్రత్యేక పూజలు చేస్తారు. హోమగుండాలు ఏర్పాటు చేశాం. రామాయణ, మహాభారత, భాగవత ప్రబంధాల ప్రవచనాలు పారాయణ చేస్తారు. భక్తుల వసతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏ. భాస్కర్రావు,దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట– యంబ నర్సింహులు,సాక్షి ప్రతినిధి, యాదాద్రి. -
టెన్త్ ఇంటర్నల్ మార్కులపై ఆరా
భువనగిరి : పదో తరగతి ఇంటర్నల్ మార్కులపై జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. మార్చి 21నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇంటర్నల్ మార్కుల నమోదు విషయంలో యాజమాన్యాలు అశాసీ్త్రయంగా చేయకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఈనెల 17నుంచి 18వ తేదీ వరకు పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నాయి. ఫార్మెటీవ్ పరీక్షల్లో వాస్తవంగా మార్కులు నమోదు చేశారా? ఇస్తారీతిన వేశారా? పరిశీలిస్తాయి. టెన్త్ విద్యార్థులున్న పాఠశాలలు 266 జిల్లాలో పదో తరగతి విద్యార్థులున్న పాఠశాలలు 266 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ 178, రెసిడెన్సి యల్ 14, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు 74 ఉన్నాయి. వీటిలో 8,631 మంది విద్యార్థులు ఉన్నారు. తనిఖీల కోసం 21 బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి 4 నుంచి 6 పాఠశాలల బాధ్యతలు అప్పగించారు. బృందాల ఆమోదం పొందిన మార్కులను ఈ నెల 21 నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవే చివరి ఇంటర్నల్ విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా 20 మార్కులు ఇంటర్నల్గా వేసే విధానం పదేళ్లుగా కోనసాగుతోంది. ఈ పద్ధతికి స్వప్తిపలుకుతున్నట్లు నవంబర్లో విద్యాశాఖ ప్రకటించింది. అప్పటికే ఇంటర్నల్ మార్కులు సిద్ధం చేసిన విషయానిన ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో ఈ విద్యా సంవత్సరం వరకు ఇంటర్నల్ విధానం కొనసాగిస్తున్నట్లు నిర్ణయించింది. దీంతో ఇవే చివరి ఇంటర్నల్ మార్కులు కానున్నాయి. ఫ ఈనెల 17నుంచి 19వ తేదీ వరకు పాఠశాలల్లో తనిఖీలు ఫ 21 బృందాలు ఏర్పాటు -
కులగణన పేరుతో కాంగ్రెస్ డ్రామా
యాదగిరిగుట్ట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఒక డ్రామా అని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్, ఇన్నాళ్లూ ఏం చేసిందన్నారు. 70 ఏళ్లలో ఒక్క ఓబీసీ వ్యక్తిని అయినా సీఎం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ గణనను చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తే పార్లమెంట్లో ఆమోదించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామాజిక న్యాయం పా టిస్తూ రాష్ట్రపతులను చేసిందని, కేబినెట్లో 27మంది ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయన్నారు. ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్టకు తీసుకువస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ పడమటి జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్గౌడ్, రవీందర్, నాయకులు రచ్చ శ్రీనివాస్, చంద మహేష్, కర్రె ప్రవీ ణ్కుమార్, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ ఎంపీ ఈటల రాజేందర్ -
లింగమయ్యా.. దీవించయా్య..
విద్యుత్ వెలుగుల్లో లింగమంతులస్వామి ఆలయ పరిసరాలు వైభవంగా గొల్లగట్టు జాతర ప్రారంభం ఫ కేసారంలో దేవరపెట్టేకు ప్రత్యేక పూజలు ఫ అర్ధరాత్రి కాలినడకన పెట్టెను గట్టుకు చేర్చిన భక్తులు ఫ ఆకట్టుకున్న మందగంపల ప్రదక్షిణ చివ్వెంల/సూర్యాపేట టౌన్: గజ్జెల లాగుల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్ప్పుళ్లు, భక్తుల పూనకాల నడుమ లింగా.. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది. మేడారం జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి యాదవులు, ఇతర భక్తులు ఆదివారం అర్ధరాత్రి వరకే గట్టుకు చేరుకున్నారు. అర్ధరాత్రి గట్టుకు చేరిన దేవరపెట్టె.. సూర్యాపేట మండలం కేసారంలో గొర్ల గన్నారెడ్డి ఇంటి నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, మెంతబోయిన లింగస్వామి ఇంటి నుంచి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దేవరపెట్టెలోని దేవతామూర్తులకు సమర్పించి పూజలు చేశారు. అనంతరం యా దవులు దేవరపెట్టెను పెద్దగట్టుకు చేర్చారు. మెంతబోయిన, మున్న, గొర్ల వంశస్తులు దేవరపెట్టెకు పూజలు నిర్వహించారు. అలాగే మందగంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొదటి రోజు 20వేల మంది.. జాతర మొదటి రోజు సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల సౌకర్యార్థం.. జాతర వద్ద భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలును, పోలీస్ సహాయక కేంద్రాలు, హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. భేరీ మోగిస్తున్న భక్తుడునేడు చౌడమ్మకు బోనాలుజాతరలో సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. మెంతబోయిన వంశస్తులు తెచ్చిన తొలి గొర్రె (తల్లి గొర్రె), మున్న వంశీ యులు తెచ్చిన బద్దెపాల గొర్రె, రెడ్డిగొర్ల వంశీయులు తెచ్చిన వర్ధ గొర్రెను జడత పడుతారు. అనంతరం అమ్మవారికి బలి ఇస్తారు. -
నేడు యాదగిరి క్షేత్రంలో కేసీఆర్ పేరున పూజలు
యాదగిరిగుట్ట : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజల అనంతరం ఆలయ వైకుంఠద్వారం చెంత కేక్ కట్ చేసి, పేదలకు పళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 26న అఖండ జ్యోతి రథయాత్ర ప్రారంభం భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపట్టనున్న స్వామి వారి అఖండజ్యోతి రథయాత్ర ఈ నెల 26న హైదరాబాద్లోని బర్కత్పురలో గల యాదాద్రి భవనం నుంచి ప్రారంభం కానుందని రథయాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎంపల్ల బుచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట భక్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదగా రథయాత్ర సాగుతుందని, మార్చి1న యాదగిరిగుట్టకు చేరుకుంటుందన్నారు. అఖండజ్యోతి రథయాత్రకు ఘన స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షుడు కా సుల సత్యనారాయణగౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ దిడ్డి బాలాజీ, ప్రధాన కార్యదర్శి బండారు ఆగమయ్య, గడ్డం జ్ఞానప్రకాష్రెడ్డి, అశోక్, ఉపేందర్, గణపతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్కు స్వాగతం భువనగిరిటౌన్ : ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ కెప్టెన్ అభయ్సింగ్ యాదవ్ ఆదివారం భువనగిరికి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మజహార్, కూర వెంకటేష్ పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోవాలి ఆత్మకూరు(ఎం): రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి బాటలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఉపాధిహామీ ఏపీఓ రమేష్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. కావాల్సిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో మండల కేంద్రాలోని ఉపాధిహామీ కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. సీతారాంపురం వాసికి పరాగ మంజరి అవార్డు గుండాల : గుండాల మండం సీతారాంపురం గ్రామానికి చెందిన చిలుకూరి శివాని పుప్పొడి నేత పరాగ మంజరి అవార్డు అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వృక్షశాస్త్రంలో ఎమ్మెస్సీ చేసిన శివాని.. పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశారు. భూమిపై ఉన్న లక్షలాది మొక్కల పూలు వేటికవి భిన్నంగా ఉంటాయని, వీటిని టెక్స్టైల్ పరంగా ఎంబ్రాయిడరింగ్, టిషర్టులు, బెడ్షీట్లపై డిజైన్ కోసం వాడవచ్చన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
చికెన్ అమ్మకాలు డౌన్
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : భువనగిరిలోని బాబా చికెన్ సెంటర్ నిర్వాహకుడు ప్రతి ఆదివారం 800 కిలోల వరకు చికెన్ విక్రయించేవాడు. ఈ ఆదివారం 300 కిలోల లోపే విక్రయించాడు. పెళ్లిళ్ల కోసం నా లుగు ఆర్డర్లు రాగా అందులో రెండు క్యాన్సిల్ అయినట్లు యజమాని మహ్మద్ షూనుర్ తెలిపాడు..జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోళ్లకు బర్డ్ఫ్లూ సోకుతుందన్న ప్రచారంతో చికెన్ అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. జిల్లావ్యాప్తంగా చికెన్ విక్రయాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలు దారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజూ నాలుగు నుంచి ఐదు వేల టన్నుల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్లో 10వేల టన్నుల వరకు ఉంటుంది. ఆదివారం అందులో సగం కూడా అమ్ముడుపోలేదు. పడిపోతున్న ధరలు చికెన్ అమ్మకాలతో పాటు ధర కూడా పడిపోతోంది. వారం రోజుల క్రితం కిలో చికెన్ (స్కిన్) రూ.200, స్కిన్లెస్ రూ.220 వరకు ఉండగా ప్రస్తుతం స్కిన్ రూ.190, స్కిన్లెస్ రూ.170 నుంచి రూ.180 వరకు అమ్ముతున్నారు. ఉడకబెట్టి తింటే నో ప్రాబ్లమ్ ఉడికీ ఉడకని చికెన్ తినవద్దని, 70 నుంచి 100 డి గ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు. కోళ్ల ఫారాలు, చికెన్ సెంటర్లలో పని చేసే సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. 50 శాతం తగ్గిన విక్రయాలు ఫ బర్డ్ ఫ్లూ ప్రచారంతో కొనుగోలుకు జనం అనాసక్తి ఫ మటన్, చేపలకు పెరిగిన డిమాండ్ మటన్ కిలో రూ.900 చికెన్కు బదులు మటన్, చేపల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కూడా పెరిగాయి. వారం కిందట మటన్ కిలో రూ.800 ఉండగా ఇప్పుడు రూ.900కు పెంచారు. చేపల రేట్లు సైతం కిలో రూ.20 నుంచి రూ.25 వరకు పెంచారు. ఐదారు రోజులుగా గిరాకీ పెరిగిందని చేపల వ్యాపారులు అంటున్నారు. -
ఆశావహులెవరు?
కార్యకర్తలకు దిశానిర్దేశం ఎన్నికలు ఎప్పుడు జరిగినా 80 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఇందుకోసం ఇప్పటినుంచే కేడర్ను సమాయత్తం చేయాలని చెప్పడంతో ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి గత ఐదు రోజులుగా ముఖ్యులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆశావహుల పేర్లను సేకరిస్తున్నారు. వడబోసి ఎన్నికల నాటికి గెలుపు గుర్రాల పేర్లు ప్రకటించనున్నారు. సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల రేసులో ఉన్న ఆశావహుల పేర్లను తీసుకుంటున్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ మేరకు గెలుపుగుర్రాలను గుర్తించనున్నారు. పైరవీలకు తావులేకుండా అందరి ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు ఫుల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఒక్కో గ్రామం, వార్డు నుంచి ఐదారుగురు ఆశావహులు ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ గత రిజర్వేషన్లను బేరీజు చేసుకుని వారంతా ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో లేకున్నా పార్టీని వెన్నంటి ఉన్నవారు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి కేడర్, ప్రజాప్రతినిధులు భారీగా కాంగ్రెస్లో చేరారు. వీరిలో చాలా మంది హామీలు పొంది వచ్చారు. పాత, కొత్త నేతల్లో భారీ సంఖ్యలో టికెట్ ఆశిస్తున్నారు. పార్టీకి పని చేయనివారిపై ఫిర్యాదులు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీకోసం పనిచేయని వారు టికెట్లు ఆశిస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా ఎమ్మెల్యే ముందు ఉంచుతున్నారు. విధేయతను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యేలు ఫ క్షేత్రస్థాయిలో కేడర్తో సమావేశాలు ఫ అందరి అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక -
కొలనుపాక వాగులో జారిపడిన దంపతులు
ఆలేరురూరల్ : ఆలేరు – కొలనుపాక వాగు కాజేవ్పై ఆదివారం దంపతులు జారిపడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజాపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్య–అరుణ దంపతులు స్వగ్రామం నుంచి ఆలేరు పట్టణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. గోదావరి జలాలతో కొలనుపాక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు దాటే క్రమంలో జారిపడి కాజ్వే కిందకు కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులు, స్థానికులు గమనించి వారిని కాపాడారు. ఈ ఘటనలో అరుణకు స్వల్పంగా, వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రైవేట్ అంబులెన్స్లో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. 20 రోజుల్లో నాలుగు ఘటనలు వాగు వద్ద 20 రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలోనే వర్షాకాలం సమయంలో పలువురు కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఈ ప్రాంతంలో హైలెల్ బ్రిడ్జి నిర్మించాలని అనేకసార్లు ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు.ఫ తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు ఫ 20 రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు -
ఒక్క రోజే 800 కోళ్లు మృతి
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫారంలో శనివారం తెల్లవారుజామున 800 కోళ్లు మృతి చెందాయి. నేలపట్లకు చెందిన పబ్బు మల్లేశ్ ఫారంను లక్కారం గ్రామానికి చెందిన శివ కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి పృథ్వీరాజ్ ఫారం వద్దకు చేరుకుని మరణించిన కోళ్లను పరీక్షించారు. బర్డ్ఫ్లూ లక్షణాలు లేవని, వైరస్ కారణంగా చనిపోయి ఉంటాయని తెలిపారు. పౌల్ట్రీ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టారు. కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానని నిర్వాహకుడు శివ వాపోయాడు. -
ఎండ ముదిరి.. చేను ఎండి
సాక్షి,యాదాద్రి: వేసవి రాకముందే ఎండలు ముదిరిపోయా యి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాన్ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేశారు. దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. సరిగ్గా నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పైరు ఎండిపోతుండగా రైతులు పశువులను మేపుతున్నారు. ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే...వేలాది ఎకరాలకు పంటనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనవరి నాటికి జిల్లాలో భూగర్భ జలాలు రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి. యాసంగి ఆశలపై దెబ్బ వానాకాలం సీజన్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. జలకళ సంతరించుకోగా, రైతులు యాసంగి వరిసాగుపై ఆశలు పెంచుకున్నారు. ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో నీటిగండం వచ్చిపడింది. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు బోరు బావుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు ఎకరాల వరి బీటలు వారింది నాకున్న ఐదెకరాల్లో వరిసాగు చేశాను. బావి నీటిమట్టం తగ్గడంతో రెండు ఎకరాల వరిపొలం బీటలు వారింది. ఉన్న మూడు ఎకరాలకు రెండు రోజులకో తడి ఇస్తున్నాను. దానిపై కూడా ఆశ లేదు. – వడకాల రాజు, వరి రైతు, మోత్కూర్.నీరు లేక పంట ఎండిపోయింది 3 ఎకరాల్లో వరి వేశా. నాట్ల సమయంలో బావి లో నీరు బాగానే ఉంది. వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. వారం క్రితం రెండు బోర్లు వేశాను. రెండూ ఫెయిల్ అయ్యాయి. నీరులేక పంట ఎండిపోయింది –చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం -
సేవాలాల్ మార్గం అనుసరణీయం
సంత్ సేవాలాల్ సమాజానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మార్గం అనుసరణీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 10లోపెద్దగట్టుకు మకర తోరణం రాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు రానున్న దేవరపెట్టె సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం గంపల ప్రదక్షిణతో ప్రారంభం పెద్దగట్టు ఆలయంలో ఆర్అండ్ఆర్ కమిషనర్ పూజలు చివ్వెంల(సూర్యాపేట): మండలంలోని దురాజ్పల్లిలో గల శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) దేవస్థానాన్ని శనివారం రాష్ట్ర భూసేకరణ, ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించకున్నారు. ఈ సందదర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. రాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి దేవరపెట్టెను పెద్దగట్టుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. దేవరపెట్టెలో గొల్ల లు ఆరాధించే శ్రీ లింగమంతుల స్వామితో పాటు 33మంది దేవతల గణం ఉంటుంది. సుమారు 400 ఏళ్లుగా రెండేళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ జాతరకు మనరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ సంప్రోక్షణ పూర్తి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయించి, సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. మెట్లు, ప్రవేశద్వారానికి రంగుల వేశారు. తలనీలాలు, టెంకాయల వేలంపాటలు పూర్తి చేశారు. భక్తుల రవాణాకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. తాగునీటి వసతితోపాటు, చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. జాతరలో వివిధ రకాల దుకాణాలతోపాటు వినోద శాలలు వెలిశాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి జాతరలో పారిశుద్ధ్యపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. జాతరను 8 జోన్లుగా విభజించారు. 7 ప్రాంతాల్లో శాశ్వత మరుగుదొడ్లు, 24 చోట్ల మహిళలకు, 48 చోట్ల పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు మూడు షిఫ్ట్ల ప్రకారం ఒక్కో షిఫ్ట్కు 130 మంది చొప్పున 390 మంది కార్మికులు పారిశుద్ధ్య విధుల్లో పాల్గొనున్నారు. షిఫ్ట్కు నాలుగు ట్రాక్టర్ల ద్వారా చెత్తాచెదారం తొలగించనున్నారు. ఇందుకు 19మంది సూపర్వైజర్లు, 12 మంది జవాన్లను నియమించారు. రాత్రి పూట వెలుగులు విరజిమ్మేలా ఎల్ఈడీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం నాలుగు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. కోనేరులో శివుని విగ్రహం ప్రతిష్టించారు. ఏర్పాట్ల పరిశీలన జాతరలో భక్తుల కోసం కల్పించిన సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణయ్య పర్యవేక్షించారు. ఈ జాతరకు 30 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో దురాజ్పల్లి శ్రీలింగమంతుల స్వామి ఆలయంన్యూస్రీల్సూర్యాపేట టౌన్: దురాజ్పల్లిలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జరగనున్న శ్రీలింగమంతుల స్వామి జాతర మహోత్సవానికి శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్ నుంచి స్వామివారి మకర తోరణం భారీ ఊరేగింపు నడుమ పెద్దగట్టుకు తరలి వెళ్లింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. శ్రీలింగమంతుల స్వామి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కక్కిరేణి శ్రీనివాస్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అంజాద్ అలీ, కోడి శివయాదవ్, హరీష్ యాదవ్, బత్తుల సాయి, వల్లపు రఘువీర్ యాదవ్, కోడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఏవైనా మనమే గెలవాలి
చౌటుప్పల్ : ఎన్నికలు ఏవైనా విజయం మనదే అవ్వాలని, అందుకోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మంత్రితో పాటు ఆయన వెంట ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలైనా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా బీజేపీ అభ్యర్థులే గెలవా లన్నారు. ఇప్పటికే ప్రజలు గత బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీజేపీనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బూత్స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, చౌటుప్పల్ మండల, మున్సిపల్ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కంచర్ల గోవర్ధన్రెడ్డి, నాయకులు దాసోజు భిక్షమాచారి, బత్తుల జంగయ్య, చినుకని మల్లేష్, కడారి అయిలయ్య, ఊదరి రంగయ్య, ఇటికాల దామోదర్రెడ్డి, పర్నె శేఖర్రెడ్డి, మహేందర్రెడ్డి, ఎర్ర నర్సింహ, బాతరాజు గణేష్, లింగస్వామి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.ఫ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
ఇస్మార్ట్ బామ్మ!
చిన్నతనంలో విన్న పద్యాలు, పౌరాణిక నాటకాలు చూసిన ఆమెకు తాను అలా పాడాలని.. నాటకాల్లో నటించాలని కోరిక ఉండేది. ‘ఆ బంగారు కాలం ఎటుబాయే’ అని బాధపడే గౌరమ్మకు స్మార్ట్ఫోన్ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. తన మనవరాలి సాయంతో ఫోన్లో రీల్స్ చేస్తూ వేల మంది ఫాలోవర్స్ను సంపాదించి.. పలువురిచేత ఔరా అనిపించుకుంటోంది. –రాజాపేట యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణిగుంట గ్రామానికి చెందిన రంగ గౌరమ్మ, ఆమె భర్త భిక్షపతి నిరక్షరాసులు. వ్యవసాయ కూలి పనులే వారికి జీవనాధారం. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు సెల్ఫోన్ ప్రపంచంలో తలమునకలవుతూ ఈ ప్రపంచాన్నే మరిచిపోవడాన్ని ఎన్నోసార్లు గమనించింది గౌరమ్మ. సెల్ఫోన్లో ఎన్నో యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసింది. అవి చూసినప్పుడల్లా తనలోని కళాకారిణి మేల్కొనేది. ‘బావా ఎపుడు వచ్చితీవు’ ‘చెల్లియో చెల్లకో‘ ‘ఎక్కడ నుండి రాక’ ‘జెండాపై కపిరాజు’.. ఇలా ఎన్నో పద్యాలు తన చిన్నప్పటి రోజుల్లో విన్నది. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం, శ్రీరామంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, నర్తనశాల.. ఇలా ఎన్నో పౌరాణిక నాటకాలు చూసింది. పద్యాలు విన్నప్పుడల్లా.. తానూ పాడేది. నాటకాలు చూసినప్పుడల్లా తనకు కూడా వేదిక ఎక్కి నటించాలని ఉండేది. కానీ, ఎవరు ఏమంటారో అనే భయంతో నటించాలనే కోరిక తనలోనే ఉండిపోయేది. ప్రశంసలతో మరింత ఉత్సాహం గత కాలాన్ని కళ్ల ముందుకు తీసుకొస్తున్న సెల్ఫోన్ను కొనాలని గౌరమ్మ నిర్ణయించుకుంది. అక్క మనుమరాలు రీతిక, మేనకోడలు మౌనిక ప్రోత్సాహంతో స్మార్ట్ ఫోన్ కొని వినియోగిస్తుంది. వారి ద్వారా ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంది. చిన్న చిన్న వీడియోలు తీయడం, రీల్స్ తీస్తు.. తాను చేసిన వీడియోలను గత సంవత్సరం నుంచి యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసేంది. ఆ వీడియోలు చూసి మొదట ఊరి వాళ్లు, చుట్టాలు పక్కాలు ‘మన గౌరమ్మేనా!’ అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినందించారు. వారి అభినందనలు, ప్రశంసలు తనకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా తనను గుర్తు పట్టి ప్రశంస పూర్వకంగా మాట్లాడేవారు. గౌరమ్మ చేసిన పోస్టులకు లైకులు రావడం, సబ్స్కైబర్లు పెరగడం మొదలైంది. క్లీన్ అండ్ గ్రీన్ షార్ట్స్ పద్ధతిగా వీడియోలు చేస్తూ ‘భేష్’ అనిపించుకుంటుంది గౌరమ్మ. జాతరలు, దేవాలయాల దర్శనం, పెళ్లిళ్లు, పేరంటాలు, పిల్లలను తొట్టెల్లో వేయడం, వ్యవసాయ పనులు చేసే కూలీలు, వరి నాట్లు వేయడం, ముగ్గులు వేసే మహిళలు.. ఇలా తనకు తోచినట్టుగా రీల్స్ చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 1500 వరకు పోస్టులు చేయగా 8,831 మంది ఫాలోవర్స్ ఉన్నారు. గౌరమ్మ చేస్తున్న ‘రీల్స్’ ప్రాచుర్యం పొందడంతో ఆమె పేరు కాస్త ‘ఇన్స్టాగ్రామ్ గౌరమ్మ’గా మారింది.మెచ్చుకోవడం సంతోషంగా ఉంది యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’ చూసిన తరువాత నాకు కూడా ఏదైనా చేయాలనిపించింది. అక్షరం ముక్క రాకపోయినా చాలా బాగా వీడియోలు చేసి ఎంతోమంది చేత ‘శభాష్’ అనిపించుకుంటున్న వారిని యూట్యూబ్లో చూసిన తరువాత నాకు కూడా ధైర్యం వచ్చింది. రీల్స్, వీడియోలు చేయడానికి ఎక్కడికీ పోనవసరం లేదు.. మన ఇల్లు, పొలాలే స్టూడియో అనుకొని పనిలోకి దిగాను. ఎంతోమంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఫ ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’ చేస్తూ ఔరా అనిపించుకుంటున్న రంగ గౌరమ్మ ఫ మనవరాలే గురువుగా డిజిటల్ పాఠాలు నేర్చుకున్న నిరక్షరాస్యురాలు ఫ ఇల్లు, పొలాలే స్టూడియోగా వీడియోలు, రీల్స్ – రంగ గౌరమ్మ -
డీఎస్సీ – 2008 అభ్యర్థులకు పోస్టింగ్
భువనగిరి : ఎస్సీ–2008 అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.30 మందికి గాను 24మంది కౌన్సిలింగ్కు హాజరుకాగా వారికి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. మిగితా ఆరుగురికి పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 17వ తేదీన సంబంధిత ఎంఈఓలకు రిపోర్టు చేసి తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రశాంత్రెడ్డి, ప్రధానో పాధ్యాయుడు పాండునాయక్, సత్యనారాయణరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుడికి లక్ష పుష్పార్చన
నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే భువనగిరి టౌన్ : సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని వారికోసం మరోసారి సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటలో తెలిపారు.రోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే కొనసాగుతుందన్నారు. దరఖాస్తు ఫారాన్ని pcsurv ey.cgg.gov.in వెబ్సెట్లో డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అందజేయాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు, వివరాల కోసం టోల్ఫ్రీ నంబర్ 040–211111111ని సంప్రదించవచ్చన్నారు. నూతన కమిటీ ఎన్నిక భువనగిరి టౌన్ : తెలంగాణ ఎకనామిక్, స్టాటిస్టిక్స్ సెల్ ఆర్డినేట్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని శనివారం భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వడ్డేపల్లి వినోద్కుమార్, సెక్రటరీగాగా జయంత్, ఉపాధ్యక్షుడిగా గుణగంటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీగా కృష్ణ, కోశాధికారిగా సంతోష్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీను, పబ్లిసిటీ సెక్రటరీగా శ్రావణి, ఇ.సి మెబర్లుగా శారద, భభిత ఎన్నికయ్యారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి, కోశాధికారి శ్రీకాంత్, టీజీవోఎస్ కోశాధికారి ఉపేందర్రెడ్డి తదితరులు నూతన కమిటీని సత్కరించారు. ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి మోటకొండూర్ : వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు రైతులకు సూచించారు.స్టడీటూర్లో భాగంగా శనివారం మోట కొండూరులో పర్యటించారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బొమ్మల రూపంలో చిత్రం వేసి రైతులకు వివరించారు. అలరించిన ‘కూచిపూడి’యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీథర్ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ (పెండం నాగశ్రీ) హైదరాబాద్ బృందం కళాకారుల కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది. -
‘రీజినల్’ నిర్వాసితులను ఆదుకోవాలి
చౌటుప్పల్ రూరల్: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పొతున్న నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవా లని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం వెళ్తూ చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని విలేజ్ ఆహారం హోటల్ వద్ద ఆగారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కవితకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం రెవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతానికి వచ్చి త్రిబుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. గెలిచి 14నెలలు అవుతున్నా ఇప్పటి వరకు బాధితులను కలవలేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిర్వాసితులకు అండగా ఉంటానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నేడు మొఖం చాటేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం స్పందించి నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏఎసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు,మెట్టు మహేశ్వర్రెడ్డి, ఉడుగు మల్లేశం,మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్య,మాచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
అమ్మకు భరోసా..
సేవలందించేందుకు 460 మంది నియామకం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా రూపొందించిన కార్యాచరణ పక్కాగా అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకోసం 461 మందిని కేటాయించారు. ఇందులో వైద్యారోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ సూపర్వైజర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, టీచర్లు ఉంటారు. వీరికి రెండు రోజుల క్రితం కలెక్టర్ హనుమంతరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణసాక్షి, యాదాద్రి : ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడానికి వైద్యులు దృష్టి సారించాలి.. అత్యవసరం అయితేనే ఆపరేషన్లు చేయాలి’ అని వైద్యారోగ్యశాఖ దిశానిర్దేశం చేసింది. అయినా గణాంకాలు చూస్తే మార్పు ఏమీ కనిపించడం లేదు. గతంలో మాదిరిగానే సాధారణ ప్రసవాలు, శస్త్ర చికిత్సలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు డెలివరీ తేదీ ఉన్న గర్భిణుల ఇళ్లకు వెళ్లి న్యూట్రిషన్ కిట్లు అందజేయనున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై భరోసా కల్పించనున్నారు. చేపట్టే కార్యక్రమాలు ఇవీ.. మార్చి 31వ తేదీ వరకు డెలివరీ తేదీ ఉన్న మహిళలు రికార్డుల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 461 మంది నమోదయ్యారు. వైద్యారోగ్య సిబ్బంది ఈనెల 17వ తేదీన సాయంత్రం 5 గంటలకు గర్భిణిల ఇళ్లకు వెళ్లి తలుపు తడుతారు. వారితో కూర్చొని యోగ క్షేమాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం, వైద్య పరీక్షలు, తీసుకుంటున్న ఆహారం తదితర విషయాల గురించి చర్చిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ఉన్న అపోహలను తొలగిస్తారు. నార్మల్ డెలివరీల వల్ల ప్రయోజనాలు, సిజేరియన్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, నిపుణులైన వైద్యుల గురించి వివరిస్తారు. రూ.500 విలువ చేసే న్యూట్రిషన్ కిట్ అందజేస్తారు. ‘ప్రభుత్వ ఆస్పత్రికి రండి.. సుఖ ప్రసవం చేసి క్షేమంగా ఇంటికి పంపుతాం’ అంటూ ప్రోత్సహిస్తారు. మార్చి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ● ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారు. గర్భిణులకు రోజూ కాల్ చేసి ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి తెలియజేస్తారు. ● ఆస్పత్రులకు వచ్చే గర్భిణులను వైద్యుల వద్దకు తీసుకెళ్లేందుకు హెల్స్డెస్క్ల్లో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు జిల్లాలో 2023 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 7,937 ప్రసవాలు జరిగాయి. ఇందులో నార్మల్ 3,661, సిజేరియన్లు 4,276 ఉన్నాయి. సాధారణ కాన్పులు పెరగాలి ఫ కలెక్టర్ హనుమంతరావు భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే కాకుండా సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం కలెక్టరేట్లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై సలహాలు, సూచనలు చేశారు. గర్భిణుల ఇళ్లకు వెళ్లి పోషకాహారం, వైద్య పరీక్షలు, వ్యాయామం గురించి అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు ఆరో గ్యపరంగా తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి పరీక్షలు చేయించాలని, తద్వారా మాత, శిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. సమావేశంలో మాతాశిశువు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ యశోధ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శిల్పిని, ఆర్మన్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది డాక్టర్ రోహిణి, డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ ఈనెల 17నుంచి ‘గర్భిణుల ఇళ్లకు వెళ్లి.. తలుపుతట్టి’ కార్యక్రమానికి శ్రీకారం ఫ ఆరోగ్య వివరాలు తెలుసుకుని న్యూట్రిషన్ కిట్లు అందజేయాలని నిర్ణయం ఫ సలహాలు ఇచ్చేందుకు ఆస్పత్రుల్లో హెల్స్డెస్క్లు ఏర్పాటు ఫ గర్భిణులను వైద్యుల వద్దకు చేర్చేందుకు ప్రత్యేక సిబ్బంది -
గట్టుకు ఉత్సవ శోభ
చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల 16 నుంచి 20 వరకు జరగనుంది. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం నుంచి జాతర ప్రారంభం కానుండడంతో ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలు వెలుస్తున్నాయి. భక్తుల కోసం జాయింట్ వీల్ (రంగుల రాట్నం), బ్రేక్ డ్యాన్స్, సర్కస్, హంస వాహనం, ఎగ్జిబిషన్ తదితర వినోద శాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇవీ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటికోసం 14 ప్రదేశాల్లో నల్లాలు ఏర్పాటు చేశారు. నిఘాకోసం 66 సీసీ కెమెరాలు అమర్చారు. చెరువు కట్టపై బారికేడ్లు, హైమాస్ట్ లైట్లు, భక్తులకు ఎండవేడిమి నుంచి రక్షణకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. నిధుల కేటాయింపు ఇలా.. జాతర నిర్వహణకు ప్రభుత్వం 70 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని చదును చేశారు. ఈసారి గుట్టపై దేవాదాయ శాఖ, గుట్టకింద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.67 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. హైమాస్ట్, టవర్ లైట్లకు రూ.35 లక్షలు కేటాయించారు. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు బారికేడ్ల ఏర్పాటుకు రూ.12 లక్షలు, తాత్కాలిక టాయిలెట్లకు రూ.12 లక్షలు కేటాయించారు. ఇవేకాక, చెత్త తొలగింపునకు రూ.25 లక్షలు, నేల చదునుకు రూ.10 లక్షలు, ఆలయం చుట్టూ చెట్ల పొదలు తొలగించేందుకు రూ.8లక్షలు, తాగునీటి సరఫరాకు రూ.3లక్షలు, నీటి ట్యాంకర్ల కోసం రూ.5లక్షలు, గల్ఫర్ ద్వారా బుదర తరలించేందుకు రూ.4లక్షలు, సీసీ రోడ్ల మరమ్మతులకు రూ.5లక్షలు, జాతర స్టోర్ డస్ట్కు రూ.5 లక్షలు, గ్రావెల్ కోసం రూ.5లక్షలు కేటాయించారు. సీసీ కెమెరాలు, సోలార్ లైట్ల మరమ్మతులకు రూ.5లక్షలు, స్నానాలు చేసేచోట ప్లాట్ఫామ్, పైపులైన్ ఏర్పాటుకు రూ.9.30 లక్షలు, నీటి మోటార్స్, సింథటిక్ ట్యాంక్స్, హెచ్డీపీఓ పైపులైన్ కోసం రూ.5లక్షలు, కోనేరులో శివుడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు రూ.3 లక్షలు, నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు.రేపటి నుంచి దురాజ్పల్లి శ్రీలింగమంతుల జాతర.. ఏర్పాట్లు పూర్తిఇబ్బంది కలగకుండా సౌకర్యాలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, లైటింగ్, సివిల్ పనులు చేయించాం. జాతర ముగిసే వరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతాం. – బోళ్ల శ్రీనివాస్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్జాతరకు 60 ప్రత్యేక బస్సులు భానుపురి (సూర్యాపేట): పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నల్లగొండ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు.చార్జి పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు. -
స్థానికం.. మరింత జాప్యం!
తుది దశకు ఏర్పాట్లు మార్చి రెండో వారం నాటికి ప్రాదేశిక, సర్పంచ్ ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్లుగానే యంత్రాంగం సైతం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. ఇప్పటికే ఓటర్లు తుది జాబితాను ప్రదర్శించింది. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరాయి. రెండు రోజుల క్రితం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. కలెక్టర్, అధికారులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలి ఉంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల బరిలో నిలువాలన్న ఆశావహుల్లోనూ నిరాశ నెలకొంది.సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతుండగా.. మరోవైపు కులగణన రీసర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అయోమయం నెలకొంది. ఈనెల 15లోపు పరిషత్, ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కులగణలో పాల్గొనని వారికోసం ఈనెల 16నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆతరువాత బిసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వ ప్రకటన, అసెంబ్లీలో బిల్లు పెట్టడం, గవర్నర్ ఆమోదం ఇవన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చిలో పరీక్షలు, ఏప్రిల్, మేలో ఎండలు మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలు ముగియగానే ప్రైమరీ, సెకండరీ స్కూల్ పిల్లలకు పరీక్షలు మొదలవుతాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. ఈనెల కులగణన రీసర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ తరువాత అసెంబ్లీలో, గవర్న్చేత బిల్లు ఆమోదింపజేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.ఫ 16 నుంచి కులగణన రీసర్వే ఫ బీసీ బిల్లు ఆమోదం కోసం మరికొంత సమయం ఫ ఆ తరువాతనే ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ ఫ నిరాశలో ఆశావహులు -
పాఠశాలల్లో తనిఖీలు
బీబీనగర్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను డీఈఓ సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. బోధనా తీరు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదవ తరగతిలో ఉత్తమ పలితాల సాధనకు రూపొందించిన కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలను పరిశీలించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈఓ సురేష్రెడ్డి, జిల్లా ప్రణాళికా విభాగం కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగారు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం పరిశీలన భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రం ఉండాలని, సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పైరవీలకు రావొద్దుఆలేరు రూరల్ : సర్పంచ్ టికెట్ల కోసం పైరవీల కు రావద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించారు. శుక్రవారం ఆలేరులోని వైఎస్సార్ గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా శ్రేణులు పనిచేయాలన్నారు. మనస్పర్థలు, విభేదాలను వీడి సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చైతన్య, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, ఎంఏ ఎజాజ్, అశోక్, వెంకటేశ్వర్లు, తుంగకుమార్, సాగర్రెడ్డి, ఆరె ప్రశాంత్, బుగ్గ నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీలు, ఆయుష్మాన్ మందిర్లలో హెల్త్ మేళాభువనగిరి : జిల్లాలోని 21 పీహెచ్సీలు, 99 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో శుక్రవారం హెల్త్ మేళా నిర్వహించారు. ఈఎన్టీ, అప్తామాలజీ, కంటి, దంత, టీబీ, క్యాన్సర్ తదితర 12 రకాల పరీక్షలు చేశారు. అలాగే ఆయుష్మాన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేశారు. భువనగిరి మండలం అనంతారం సబ్సెంటర్లో హెల్త్ మేళాకు డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని హాజరయ్యారు. హెల్త్ క్యాంపులను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
డీసీసీబీ, పీఏసీఎస్ల పదవీకాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కిందట (2020 ఫిబ్రవరి 15వ తేదీన) సహకార సంఘాల ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. పాలక వర్గాల గడువు శుక్రవారం నాటితో (ఈనెల 15వ తేదీతో) ముగియడంతో ప్రభుత్వం పాలకవర్గాల గడువును మరో ఆరు నెలలు పెంచింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్రావు గురువారం జీవో 74 జారీ చేశారు. గత ఏడాది చైర్మన్గా ఎన్నిక ఉమ్మడి జిల్లాలో 107 పీఏసీఎస్లు ఉన్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గం 2020 ఫిబ్రవరి 29న ఎన్నికై ంది. బీఆర్ఎస్కు చెందిన గొంగిడి మహేందర్రెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనపై 2024 జూన్ 28న అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి గత ఏడాది జూలై 1వ తేదీన చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం సహకార సంఘాల గడువును పెంచడంతో డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి మరో ఆరు నెలలుపాటు కొనసాగనున్నారు. అలాగే జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు. ఫ ఆరు నెలల పాటు కొనసాగనున్న ప్రస్తుత పాలకవర్గాలు ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లా పీఏసీఎస్లు నల్లగొండ 42సూర్యాపేట 44యాదాద్రి 21 మొత్తం 107 రైతులకు సేవలందించేందుకు మరో అవకాశం రైతులకు మరో ఆరు నెలలు సేవలు అందించే అవకాశం లభించింది. పదవీ కాలం పొడగించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ఈ అవకాశంతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
ఇక్కత్ వస్త్రాల ప్రదర్శన
ఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ ఫొటో, ఎక్స్పోలో చేనేత ఇక్కత్ వస్త్రాలు, మగ్గాన్ని ప్రదర్శించారు. - 8లో17,18 తేదీల్లో ‘భగీరథ’ బంద్ భువనగిరి : కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతుల కారణంగా ఈ నెల 17న ఉదయం 6నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మీషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ భువనగిరి డివిజన్ సీఈ కరుణాకర్ శుక్రవారం తెలిపారు. భువనగిరి నియోజకవర్గలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలంలోని 8 గ్రామాలు, భూదాన్పోచంపల్లి మండలంలోని 16 గ్రామాలు మున్సిపాలిటీలు, ఆలేరు నియోజకవర్గంలో రాజాపేట, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం మండలాల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఆయా ఆగ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. -
ఎంజీయూలో సమూల మార్పులు
యూనివర్సిటీలో సమయ పాలన కఠినంగా అమలు చేస్తున్నాం. విద్యార్థులు, అధ్యాపకుల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా ఉండాల్సిందే. విద్యార్థుల హాజరు శాతం కూడా 75 శాతం ఉండాలి. ఏదైనా కారణం చేత తరగతులకు హాజరు కాకపోతే కనీసం 65 శాతం ఉండాల్సిందే. మరో 10 శాతానికి డాక్టర్ సర్టిఫికెట్ కూడా తేవాల్సి ఉంటుంది. కొందరు కాలేజీకి డుమ్మా కొట్టడంతో 25 శాతం కూడా లేదు. అటువంటి వారు 63 మంది డిటెన్షన్ అయ్యారు. కచ్చితంగా హాజరు శాతాన్ని, కాలేజీ పనివేళలు అమలు చేస్తుండడంతో మెరుగైన ఉత్తీర్ణత రానుంది. కొత్త కోర్సులకు నిర్ణయం యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశ పెడుతున్నాం. కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ భవనం నిర్మించనున్నాం. కొత్తగా 56 ప్రోగ్రామ్ కోర్సులను తీసుకువచ్చేందుకు ఇప్పటికే డిజైన్ చేశాం. ప్రతి డిపార్మెంట్లో రెండు కోర్సులకు తగ్గకుండా కొత్త కోర్సులు తీసుకొస్తాం. లైబ్రరీని వారంలో రెండు రోజులు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నడిపించనున్నాం. అక్కడ విద్యార్థులకు క్రెడిట్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఇంటర్న్షిప్ కోసం ఒక డైరెక్టర్ను కూడా నియమించాం. కంపెనీలతో మాట్లాడి విద్యార్థులకు ఇంటర్న్షిప్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. పని వేళలు సీరియస్గా అమలు చేస్తున్నాం విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాల్సిందే మెస్ బిల్లు రూ.2200లకు తగ్గించాం రూ.322 కోట్లతో కొత్త భవనాల నిర్మాణాలకు డీపీఆర్ రూపొందించాం ‘సాక్షి’తో ఎంజీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
అశోక్గౌడ్కు బీజేపీ పగ్గాలు
సాక్షి, యాదాద్రి : బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఊట్కూరి అశోక్గౌడ్ను రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన అశోక్గౌడ్ స్వగ్రామం రాజాపేట. 34 సంవత్సరాలుగా పార్టీ విధేయునిగా ఉన్న అశోక్గౌడ్కు జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. రాజాపేటలో 1994లో ఏబీవీపీ నాయకునిగా పనిచేస్తూ అంచలంచెలుగా జిల్లా అధ్యక్షుని స్థాయికి ఎదిగారు. బీజేవైఎం, ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీలో జిల్లా ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బి.గోపాల్రెడ్డి, పట్నం రోజా, ఆలేరు నియోజకవర్గం నుంచి రచ్చ శ్రీనివాస్ను నియమించారు. వీడిన ఉత్కంఠ జిల్లా అధ్యక్ష పదవికోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఊట్కూరి అశోక్గౌడ్, పడాల శ్రీనివాస్, ఏసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, పడమటి జగన్మోహన్రెడ్డి, చందామహేందర్గుప్తా, మాయ దశరథ, బాలకృష్ణ వంటి వారు పోటీపడ్డారు. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఊట్కూరి అశోక్గౌడ్, ఏసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, పడమటి జగన్మోహన్రెడ్డి పేర్లను రాష్ట్ర పార్టీకి పంపింది. పది రోజుల క్రితమే రాష్ట్రంలో పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. కానీ, ముగ్గురు పోటీ పడడం, పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భువనగిరి జిల్లా అధ్యక్షుని పేరు చివరి దశలో వాయిదాపడింది. తమకు అవకాశం కల్పించాలని ముగ్గురు ఆశావహులు ప్రయత్నాలు చేశారు. కానీ, చివరికి అశోక్గౌడ్ను ఫైనల్ చేసి ప్రకటించింది. ఫ విధేయతకు పట్టం ఫ చివరి వరకు పోటీ తీవ్రం ఫ ఊట్కూరి అశోక్గౌడ్ వైపు మొగ్గు చూపిన రాష్ట్ర పార్టీ -
యువత లక్ష్యాలపై దృష్టి సారించాలి
సాక్షి, యాదాద్రి : యువత ప్రేమ పేరుతో పెదదోరణి పట్టి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. ఎంచుకున్న లక్ష్యాలపై దృష్టి సారించాలి. తమ లక్ష్యాన్ని చేరుకున్న రోజు వారి ప్రేమకు బలం చేకూరుతుంది. జీవితంలో ప్రేమతో పాటు ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉంటాయి. తాము కోరుకున్న జీవితం సాఫల్యం కావడానికి లక్ష్యసాధన ముఖ్యం. ప్రేమ పేరుతో జరిగే మోసాలను పసిగట్టాలి.ప్రేమికుల రోజున యువత ప్రమాదకర విన్యాసాలు చేయవద్దు. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు. ప్రేమికులకు వివాహం చేస్తామంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితై వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రేమికుల దినోత్సవం రోజు పోలీసుల నిఘా ఉంటుంది. –రాహుల్రెడ్డి, భువనగిరి ఏఎస్పీ -
సాధారణ ప్రసవాలు పెంచాలి : కలెక్టర్
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం జిల్లాలోని వైద్యాధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశమై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9గంటలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్మల్ డెలివరీల సంఖ్య పెంచడానికి మండల స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు వైద్యాధికారులు.. ప్రతి గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టరేట్లో కాల్సెంటర్ ఏర్పాటు చేసి గర్భిణులకు అందుతున్న వైద్యసేవలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా సూచనలు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. నారసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యపూజలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. ఆ తర్వాత స్వామివారికి తులసీదళాలలను అర్పించి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. అదే విధంగా ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలను నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా దశరథరెడ్డి ఆత్మకూరు(ఎం) : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా (2025–27) కార్యదర్శిగా ఆత్మకూరు(ఎం)కు చెందిన కందడి దశరథరెడ్డి నియామకం అయ్యారు.ఈ మేరకు జిల్లా డీఈఓ సత్యనారా యణ గురువారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. దశరథరెడ్డి భువనగిరి మండలం చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : సీపీ భువనగిరి: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్బాబు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఇటీవల 10 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. -
ఎమ్మెల్సీ బరిలో 19 మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 19 అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 19 మంది మధ్య పోటీ కొనసాగనుంది. బరిలో ఉండే వారు తేలడంతో శుక్రవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. మొత్తం 23 నామినేషన్లు దాఖలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 3వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 10 తేదీన ముగి సింది. మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 11వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఒక అభ్యర్థి ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది నామినేషన్లను ఆమోదించారు. 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు కావడంతో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారిలో హైదరాబాద్ కొత్తపేటకు చెందిన కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన బండారు నాగరాజు, కోదాడ మండలం లక్ష్మీపురానికి చెందిన జి.కోటిరెడ్డి ఉన్నారు. మిగిలింది ప్రచారమే.. ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలిపోయింది. అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక నేటి నుంచి ప్రచారం ముమ్మరం కానుంది. పోలింగ్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. కాగా పోలింగ్కు రెండు రోజుల ముందే ప్రచారం బంద్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు కొందరు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జిల్లాలను చుట్టేశారు. సాధారణ ఎన్నికల తరహాలో ఎక్కడికక్కడ కళాశాలలు, సంఘాల వారీగా దావత్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తమను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ ఉపాధ్యాయులకు హామీలు గుప్పిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.పోటీలో ఉన్న అభ్యర్థులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ఎస్. సుందర్రాజు, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వస్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి, ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబు రావు, బంక రాజు. ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ ఫ ఇక జోరుగా సాగనున్న ప్రచారం ఫ టీచర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు -
చెంతనే నీరు.. వాడుతున్న పైరు
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు విడుదల ఫ నిండుకుండల్లా చెరువులు.. అయినా రైతులకు దక్కని ప్రతిఫలం ఫ ఎగువ ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లో పెరగని నీటి మట్టం ఫ నీరందక ఎండుతున్న పొలాలు మోటకొండూర్ : గోదావరి జలాలతో గ్రామాల్లోని చెరువులు నిండుతున్నాయని సంతోషించిన రైతులకు దాని ప్రతిఫలం మాత్రం కనిపించటం లేదు. ఎండలకు భూగర్భ జలమట్టం పెరగకపోవడంతో బోర్లు, బావులు అడుగంటుతున్నాయి. దీంతో నీరందక చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మోటకొండూర్ మండలంలో సాగు యోగ్యమైన భూమి 33 వేల ఎకరాలు ఉంది. గత ఏడాది యాసంగిలో 13,548 ఎకరాల్లో వరి సాగు చేశారు. చివరి దశకు చేరుకోగానే ఎండలు తీవ్రం కావటంతో కొంత నష్టం జరిగింది. దీంతో రైతులు ఈ ఏడాది యాసంగి సాగులో వరి సాగు తగ్గించారు. సుమారు 11వేల ఎకరాల్లో వరి వేసినట్లు అధికారులు అంచనా వేశారు. కొంతకాలంగా గోదావరి జలాలు వస్తుండడంతో సాగునీటికి కొదవ లేదనుకున్నారు. కానీ, భూగర్భ జలం పెరగకపోవడంతో ఎగువప్రాంతంలో పంటలు వాడుపడుతున్నాయి. 100 చెరువుల్లో నీరు ఫుల్ మల్లన్నసాగర్నుంచి గత కొంతకాలంగా ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు విడుదల చేస్తున్నారు. ఈ నీటితో 100కు పైగా చెరువులను నింపారు. బిక్కేరు, ఆలేరు పెద్దవాగు, బేగంపేట, కొలనుపాక తదితర వాగుల్లోకి కూడా గోదావరి జలాలు చేరుతున్నాయి. దిగువన ఉన్న ప్రాంతాల్లో చేలు దెబ్బతింటుండగా.. ఎగువన మాత్రం నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. పెరగని నీటి మట్టం మోటకొండూరు చెరువు నిండా గోదావరి జలాలు చేరినా ప్రయోజనం లేకుండాపోయింది. ఎగువ ప్రాంతంలోని బోర్లు, వ్యవసాయ బావుల్లో భూగర్భ జలమట్టం పెరగకపోగా ఎండల కారణంగా రోజు రోజుకూ పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోటకొండూరుతో పాటు రాయికుంటపల్లి, మేడికుంటపల్లి తదితర గ్రామాల పరిధిలోని పంట పొలాలకు సరిపడా నీరందక వాడుపడుతున్నాయి. ఎండలు ముదిరితే గొర్రెలు, ఆవులను మేపటానికి పొలాలను విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్లందక పొలం ఎండిపోయింది మోటకొండూరులో నాకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత సంవత్సరం యాసంగిలో నాలుగు ఎకరాలు వరి సాగు చేశాను. చివరి పది రోజులు నీళ్లు అందకపోవటంతో పక్క భూమి లో బోరు వేసుకుని కాపాడుకున్నా. ఈ ఏడాది 3.5 ఎకరాల్లో వరి సాగు చేశాను. నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయింది. పశువులు మేపుకోమ్మని చెప్పాను. పెట్టుబడి మొత్తం పోయింది. మా ఏరియాలో చాలా మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. –రేగు శ్రీశైలం, రైతు, మోటకొండూరురూ.లక్ష పెట్టుబడి పెట్టా చెరువుల నిండా నీళ్లున్నా వ్యవసాయ బోర్లు, బావుల్లో భూగర్భ జలం పెరగడం లేదు. నాకు మోటకొండూరు చెరువు కింద నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి సాగు చేస్తున్నాను. ఈసారి వాతావరణ మార్పులు, నాసిరకం విత్తనాల కారణంగా పొలం సరిగా పెరగలేదు. ఇప్పటి వరకు పెట్టిన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను. అదంతా పూర్తిగా నష్టపోయాను. చెరువు కింద 200 ఎకరాల్లో వరి సాగు కాగా.. 100 ఎకరాల్లో నష్టం తప్పటం లేదు. –బొబ్బలి చంద్రారెడ్డి, రైతు, మోటకొండూరు -
మా భావాలు కలిశాయి
ప్రేమ వివాహాలతో అంతరాలు తొలగుతాయి ఇద్దరం అట్టడుగు వర్గాల పక్షాన పోరాడే సంస్థల్లో పనిచేశాం. నాది కొడంగల్ కాగా, నా భర్త వెంకటేశ్వర్లు పురం న్యాయవాది. ఆయనది నల్లగొండ పట్టణం బీటీఎస్. నేను మొదట అరుణోదయ సంస్థలో పని చేయగా, నా భర్త పీడీఎస్యూలో పని చేసేవారు. మా ఇద్దరి భావాలు, భావజాలం ఒక్కటే కావడంతో ఒకరినొకరం ఇష్ట పడ్డాం. ప్రేమించుకున్న నాలుగేళ్ల తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2018లో దగ్గరి బందువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టేజీ మీద దండలు మార్చుకొని ఒక్కటయ్యాం. కులం, మతం లాంటి అంతరాలు పోవాలంటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు అభ్యంతరాలు చెప్పినా వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. – అనితకుమారి, లెక్చరర్, ఎంజీ యూనివర్సిటీ తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు మనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని కళాశాలకు పంపుతున్నారు. వాళ్ల ఆశలను నీరుగార్చుకుండా ఏకాగ్రతతో చదవుకొని ఉద్యోగం సాధించాలనే తప్పన పెట్టుకోవాలి. తల్లిదండ్రుల కుదుర్చిన పెళ్లి చేసుకోవాలి. –ప్రశాంతి, విద్యార్థినిఫ మా కుటుంబాలు ఒప్పుకున్నాయి ఫ మేము పనిచేసే ఉద్యమ సంస్థే మా పెళ్లి చేసింది ఫ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏ సమస్యా ఉండదు ఫ జీవితంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి ‘సాక్షి’తో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు నకిరేకల్: ‘మేము విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేశాం. మా ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నాం. మా కులాలు వేరైనా ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో మా పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఆనాడు మేము పనిచేస్తున్న ఉద్యమ సంస్థే మాపెళ్లి జరిపించింది. ప్రేమిస్తే.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అని చెబుతున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించగా.. ప్రేమ, పెళ్లిపై వారు తమ మనోగతాన్ని వెల్లడించారు. ఒక విజన్ ఉండాలి పెళ్లి అనేది.. ఇద్దరి మనస్సులు, వ్యక్తిత్వాలు, రెండు జీవితాలు.. భవిష్యత్కు సంబంధించిన నిర్ణయం. ప్రేమ అంటే మానవీయ విలువలతో పాటు కుల మతాలకతీతంగా రెండు మనస్సులు కలిసి కడదాకా బాధ్యతలను పంచుకుని కలిసి సాగడం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహలు చేసుకునే వారు భవిష్యత్ సంబంధించి ఒక విజన్ ఏర్పరుచుకోవాలి. జీవితంపై ఒక స్పష్టత ఉంటే.. ఎలాంటి సమస్యా ఉండదు. తాత్కాలిక ఎమోషన్తో నిర్ణయాలు తీసుకుంటే.. అనేక చిక్కులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రేమ, పెళ్లికి ముందు.. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు, అలవాట్లు, అభిరుచులు, ఆలోచన ధోరణి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే జీవనం సాఫీగా సాగుతుంది. జీవితంపై స్పష్టత అవసరం ప్రేమించడం, ప్రేమించబడడం, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోడడం తప్పు కాదు. సమాజంలో ఉండే కులాలు, కుటుంబాలు, భార్యభర్తలు మధ్య ఉండే వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. కులాంతర వివాహమైనా.. కులంలో పెళ్లి అయినా ఇరువైపులా తల్లిదండ్రులను ఒప్పించి పెద్దల సహకారంతో చేసుకునే పెళ్లిళ్లకు సహకారం, నిబద్దత ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఇరువురు.. ఒక అవగాహనతో ప్రేమ, జీవితంపై స్పష్టతతో పెళ్లి చేసుకున్నా.. హ్యపీగా ఉండొచ్చు. -
ఆర్ఓలు, ఏఆర్ఓల పాత్ర కీలకం
సాక్షి,యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సునంద సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టేజ్–1, స్టేజ్–2పై అధికారులకు బుధవారం భువనగిరిలోని వెన్నెల కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె డీఆర్డీఓ నాగిరెడ్డితో కలసి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల రోజు మొదులకొని ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. హ్యాండ్ బుక్లను బాగా చదవాలన్నారు. మొత్తం 428 మంది శిక్షణలో పాల్గొన్నారు.మాస్టర్ ట్రైనర్లు కడారి నర్సిరెడ్డి, హరినాథ్రెడ్డి, చిత్తరంజన్, అశోక్, నరేందర్ రెడ్డి, తడక రాజు శిక్షణ ఇచ్చారు. దిశానిర్దేశం చేసిన అంశాలు ఇవీ.. ● పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి. ● ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ● ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. ● నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలి. ● సమయపాలన కోసం నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో గోడ గడియారం అందుబాటులో ఉంచాలి. ● అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలి. ● నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు రాకుండా, వారి ప్రతిపాదకులు వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ● ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించాలి. ● బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాలి. ● అభ్యర్థులు ఎన్ని సెట్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్లను తప్పనిసరిగా పరిశీలించాలి. ● దాఖలైన నామినేషన్లలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి.. తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను అభ్యర్థులకు తెలియజేయాలి. ● నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి ప్రతిరోజూ నివేదిక అందజేయాలి. ● అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ● నామినేషన్ల స్వీకరణ, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయించాలి. ● పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరగాలి. ● నామినేషన్ల స్వీకరణకు అనువుగా ఉండే పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవాలి. ● పోలింగ్ రోజు జాగ్రత్తగా ఉండాలి.ఫ జిల్లా పంచాయతీ అధికారి సునంద ఫ ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ -
ఎంజీయూ అడిషనల్ కంట్రోలర్గా రామచందర్
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అసిస్టెంట్ కంట్రోలర్గా డాక్టర్ ఎం.రామచందర్గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు యూని వర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్గా సోషల్ వర్క్ విభాగం అధిపతి డాక్టర్ ఎస్.శ్రవణ్కుమార్ నియమితులయ్యారు. వీరిద్దరూ సంవత్సరం పాటు నూతన బాధ్యతల్లో కొనసాగనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. వీరికి యూనివర్సిటీ అధికారులు అభినందనలు తెలిపారు -
బర్డ్ఫ్లూపై అలర్ట్
లక్షణాలు● కోడి తల ఉబ్బి ఉంటుంది. ● ముక్కునుంచి ద్రవం కారుతుంది. ● వందల సంఖ్యలో కోళ్లు చనిపోతాయి. ఇలా చేయాలి ● చనిపోయిన కోళ్లను ఖననం చేయాలి. లేదా లోతైన గోయ్యి తీసి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లి పూడ్చిపెటాలి. సాక్షి, యాదాద్రి : బర్డ్ ఫ్లూపై పశు సంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. పెద్ద ఎత్తున కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లఫారాల్లో తనిఖీలు చేస్తూ వ్యాధి నివారణపై నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. యజమానుల్లో ఆందోళన జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానప్పటికీ పౌల్ట్రీ యజమానుల్లో ఆందోళన నెలకొంది. కొందరు నేరుగా పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించి వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి తెలుసుకుంటున్నారు. జిల్లాలో భూదాన్పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట తదితర మండలాల్లో పెద్ద ఎత్తున పౌల్టీ పరిశ్రమ విస్తరించి ఉంది. సుమారు 300 ఫారాలు ఉండగా 45 లక్షల వరకు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో సుమారు 15 లక్షల కోళ్లు లేయర్, 3 లక్షల వరకు పేరెంట్ స్టాక్, మిగతావి బ్రాయిలర్ కోళ్లు ఉన్నాయి. తక్కువ ధరకు అమ్మకం : ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో బర్డ్ ప్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన పౌల్ట్రీ యజమానులు ముందుగానే తేరుకుని కోళ్లను ఎంతోకొంత రేటుకు అమ్ముతున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడి నుంచి బ్రాయిలర్, నాటు కోళ్లు ఉమ్మడి నల్ల గొండ జిల్లాకు రవాణా చేయకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. గుంటూరు– నల్లగొండ జిల్లా సరి హద్దులోని వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చౌరస్తా వద్ద పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సంప్రదించాల్సిన నంబర్ 99899 97697ఫ ఏపీలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు ఫ అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ ఫ పౌల్ట్రీ ఫాంలలో తనిఖీలు ఫ పరీక్షల నిమిత్తం కోళ్ల నుంచి రక్త నమూనాల సేకరణ ఫ ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యజమానులకు అవగాహన సందేహాలుంటే సమాచారం ఇవ్వండి జిల్లాలో బర్డ్ ప్లూ కేసులు బయట పడలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. పౌల్ట్రీలకు వెళ్లి కోళ్లను పరిశీలిస్తున్నాం. వ్యాధి లక్షణాలు, గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాం. ఫారాల్లో పరిశుభ్రత తప్పనిసరి. యాంటిబయాటిక్ మందులు వేయాలి. చికెన్ విషయంలో ఆందోళన చెందవద్దు. 100 డిగ్రీల సెల్సీయస్లో ఉడికించి తినవచ్చు. –డాక్టర్ కృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానప్పటికీ ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్ల ఫారాలను తనిఖీ చేసి వ్యాధి లక్షణాలకు గుర్తించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశారు. ఈ టీఎంలు ప్రతీ ఫాంకు వెళ్లి కోళ్లకు పరీక్షలు చేస్తున్నారు. అనుమానం ఉంటే శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోళ్ల ఫారాల్లో పనిచేసే సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. -
సేవలపై ఆరా తీసి.. సూచనలు చేసి..
బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఒడిశా ప్రతినిధులు, చిత్రంలో స్థానిక వైద్యులు భువనగిరి, ఆలేరు రూరల్ : భువనగిరి మండలం బొల్లేపల్లి పీహెచ్సీ, ఆలేరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను బుధవారం ఒడిశా నేషనల్ హెల్త్ మేనేజ్మెంట్ బృందం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ తెలంగాణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జానకిరాం, డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో సందర్శించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద అందజేస్తున్న సేవలు, గర్భిణుల సంరక్షణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, డయాలసిస్ కేంద్రంలో బాధితులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఆహారం అందజేస్తున్నారని, ప్రసవాలపై ఆరా తీశారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
భూదాన్పోచంపల్లి : బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ప్రజలకు ఏమీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో అధికారం కట్టబెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నమ్మకం నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం, భీమనపల్లి, కనుముకుల గ్రామాల ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. రసాయన కంపెనీల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, సాగు, తాగునీరు ఎద్దడి ఉందని అంతమ్మగూడెం, దోతిగూడెం ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పిలాయిపల్లి కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా సాగునీరు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో ఫోన్ మాట్లాడి మిషన్భగీరథ ద్వారా 16 గ్రామాలకు కృష్ణానీళ్లు సరిపడా సరఫరా చేయాలని ఆదేశించారు. ఏడాదిలో ఎంతో చేశాం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎంతో చేశామని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని, రైతుభరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాల అమలుతో పాటు కొత్త రేషన్కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువలకు రూ.500 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. హెచ్ఎండీఏ నిధులు రూ.52కోట్లతో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.32 రూట్లలో కొత్తగా ఆర్టీసీ బస్సులు వేయించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలను కై వసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాక మల్లేశ్, జిల్లా నాయకుడు తడక వెంకటేశం, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, మర్రి నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాలయ్య, గునిగంటి రమేశ్, తోట శ్రీనివాస్, అనిరెడ్డి జగన్రెడ్డి, కాసుల అంజయ్య, మన్నెం వెంకట్రెడ్డి, ఏర్పుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాలెం మల్లేశ్, పాక జంగయ్య, రావుల లింగస్వామి, బండ మురళీ, ముద్దం శేఖర్, వల్లూరి కుమార్, సుధాకర్రెడ్డి, మల్లారెడ్డి, కంటె లింగస్వామి, మర్రి రాజిరెడ్డి, మేకల కృష్ణ, పాక రమేశ్, చుక్క వెంకటేశం, కోట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
ఉపసంహరణకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. రైస్ మిల్లులో తనిఖీలు రామన్నపేట : మండలంలోని ఇంద్రపాలనగరం విద్య ఆగ్రో రైస్మిల్లులో సివిల్ సప్లై అధికారులు చేపట్టిన తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. రికార్డులు పరిశీలించి ధాన్యం స్టాక్ను లెక్కించారు. ప్రభుత్వానికి చెల్లింపులపై ఆరా తీశారు. తనిఖీల్లో జిల్లా సివిల్సప్లయ్ అధికారి వనజాత, ఏఎస్ఓ రోజారాణి, డీఎం హరికృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ బాలమణి పాల్గొన్నారు. డ్రెయినేజీ చుట్టూ రేకులు ఏర్పాటు చౌటుప్పల్ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట సర్వీస్ రోడ్డులో ఉన్న డ్రెయినేజీ చుట్టూ రేకులు ఏర్పాటు చేశారు.అండర్పాస్ నిర్మాణంలో భాగంగా సర్వీస్ రోడ్డులో చేపట్టిన డ్రెయినేజీ పనులు మార్కెట్ కార్యాలయం ఎదుట రెండు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు డ్రెయినేజీలో పడిపోతున్నాయి. నీ నేపథ్యంలో సాక్షిలో ప్రచురించిన కథనాలకు మున్సిపల్ అధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు డ్రెయినేజీ గుంత చుట్టూ కాంట్రాక్టర్ రేకులు ఏర్పాటు చేశారు. పెద్దగట్టు జాతరకు పటిష్ట భద్రత చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్పల్లి శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు 2వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన పెద్దగట్టు పరిసరాలను కలియదిరిగి బందోబస్త్ ఏర్పాట్లు, జాతర రూట్ మ్యాప్, గ్లోబల్ మ్యాప్లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, సిబ్బందికి వసతి, జాతరకు వచ్చి పోయే మార్గాలు, బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడు వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తామన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ, నార్కట్పల్లి మీదుగా మళ్లిస్తామని పేర్కొన్నారు. నిఘా కోసం 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు జరగకుండా స్పెషల్ టీమ్స్, క్రైం కంట్రోల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక టీమ్ మఫ్టీలో తిప్పుతూ అనుమానితులను గుర్తించి, దొంగతనాలు జరగకుండా చూస్తామన్నారు. మహిళల భద్రతకు షీటీం పని చేయనుందన్నారు. చెరువు నిండుగా ఉన్నందున చెరువు వైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నారసింహుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం విశేషంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరి చిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపం, ఆలయ ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో
ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే ఫ ఒక్కో ఏఈఓకు 1,800నుంచి 2వేల ఎకరాలు టార్గెట్ ఫ పంటలు చేతికొచ్చే నాటికి పూర్తి చేయాలని ఆదేశం ఫ 30,125 ఎకరాల్లో సర్వే పూర్తి వరి 2,75,316ఆయిల్పామ్ 1,826రామన్నపేట : జిల్లాలో యాసంగి పంటల ఆన్లైన్ నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాల వద్దకు వెళ్లి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పంటలు చేతికొచ్చేలోపు సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ఒక్కో ఏఈఓకు 1,800 నుంచి రెండు వేల ఎకరాలు.. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 2,78,136 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 2,75,316 ఎకరాలు, ఆయిల్పామ్ 1,826 ఎకరాలు, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేశారు. జిల్లాను 92 వ్యవసాయ క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక ఏఈఓను నియమించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలో సాగైన పంటల్లో 1800 నుంచి రెండు వేల ఎకరాలను డిజిటల్ సర్వే చేసి వాటి వివరాలను సర్వే నంబర్ల వారీగా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మిగిలిన పంటల వివరాలను సాధారణంగా(ఆఫ్లైన్) నమోదు చేయాలి. ఫొటో తీసి.. యాప్లో అప్లోడ్ ఏఈఓ నేరుగా పంట చేల దగ్గరికి వెళ్లాలి. ప్రతీ సర్వే నంబర్లో సాగు చేసిన పంట ఫొటో తీసి అక్కడినుంచే యాప్లో అప్లోడ్ చేయాలి. ఎక్కడో ఉండి, ఎవరి పొలమో ఫొటో తీసి అప్లోడ్ చేయడం కుదరదు. సర్వే చేసే పొలానికి సంబంధించిన సర్వే నంబర్కు 25 మీటర్ల పరిధి వరకే యాప్ పనిచేస్తుంది. ఫిభ్రవరి 5వ తేదీన సర్వే ప్రారంభమైంది. ప్రారంభంలో యాప్ సరిగా పనిచేయకపోవడం, సర్వర్ బిజీ, నెట్వర్క్ సమస్యలతో సర్వే మందకొడిగా సాగింది. క్షేత్రస్థాయి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో మూడు, నాలుగు రోజుల నుంచి సర్వే ఊపందుకుంది. జిల్లాలో మొత్తం 1,84,000 ఎకరాలను డిజిటల్ సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 30,125 ఎకరాల్లో పూర్తిచేసి యాప్లో నమోదు చేశారు. ఇతర పంటలు994మొత్తం2,78,136 పంటల సాగు (ఎకరాల్లో) సర్వే చేయాల్సిన పంటలు మొత్తం 1,84,000 పూర్తయినవి 30,125ప్రయోజనాలు అనేకం డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహద పడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికి ఉపయోగపడుతుంది. వానా కాలంలో డిజిటల్ క్రాప్ చేయించుకోకపోవడం వల్ల పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రైతులు సహకరించాలి జిల్లా వ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతుంది. ప్రారంభంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఉన్నతాథికారులు సమస్యలను పరిష్కరించడంతో ప్రస్తుతం నిరాటంగా సర్వే జరుగుతుంది. డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు చాలా ఉపయోగ పడుతుంది. పంటలను అమ్ముకోవడానికి, పంటల భీమా, నష్టపరిహారం పొందడానికి ఉపకరిస్తుంది. సర్వేకోసం వస్తున్న విస్తరణాధికారులకు రైతులు సహకరించాలి. –గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి -
మాతృ మరణాలకు తావుండొద్దు
భువనగిరి : మాతృ మరణాలకు తావుండవద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ వైద్యసిబ్బందికి సూచించారు. బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతృ మరణాలపై సమీక్షించారు. ప్రసవంకోసం వచ్చే గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పరీక్షలు నిర్వహించాలన్నారు. సురక్షిత ప్రసవంతో పాటు తల్లీబిడ్డ క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. మాతాశిశు సంరక్షణకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అంతకుముందు మోత్కూరు, గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ యశోద, డాక్టర్ సాయిశోభ, డాక్టర్ శిల్పిని, పాండునాయక్, కవిత, సాయి రమణి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఫ సాధారణ ప్రసవాలు పెంచాలి ఫ డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ -
విధులు సక్రమంగా నిర్వర్తించాలి
సాక్షి,యాదాద్రి : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్స్, సెక్టార్ ఆఫీసర్, ఎలక్షన్ సిబ్బంది అందరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయడం లేదని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండల ప్రత్యేక అధికారుల నియామకంరాజాపేట : గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులను మారుస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భువనగిరి మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జీనుగుల శ్యాంసుందర్, గూండాల మండల ప్రత్యేక అధికారిగా ఆలేరు ఏడీఏ పద్మావతి, పోచంపల్లి మండల ప్రత్యేక అధికారిగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి సీ.రమణి, రాజాపేట మండల ప్రత్యేక అధికారిగా యాదగిరిగుట్ట ఏడీఏ వీ.శాంతి నిర్మలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీచర్ ఎమ్మెల్సీ పోటీలో కోటీశ్వరులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. ప్రధాన సంఘాలు, సంస్థలకు చెందిన వారిలో ఎక్కువ మందికి రూ.కోట్లలో ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, బంగారం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా వివిధ రూపాల్లో ఉన్న తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. వారికి బ్యాంకు, వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణాలు కలుపుకొని పెద్దమొత్తంలో అప్పులు కూడా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్రెడ్డి అందరికంటే ఆస్తిపరుడు. ఆయన ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రూ.17.30 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రెండో స్థానంలో ప్రైవేటు విద్యా సంస్థ యజమాని సుందర్రాజు ఉన్నారు. ప్రధాన సంఘాల అభ్యర్థుల్లో టీచర్స్ జేఏసీ తరఫున పోటీచేస్తున్న, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి మాత్రం రూ.లక్షల్లోనే ఆస్తులు ఉండగా, అప్పులు కూడా ఉన్నాయి. పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు, అప్పుల వివరాలివీ.. ● స్వతంత్ర అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, ఆయన భార్య పేరున ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మొత్తంగా రూ.17.30 కోట్ల విలువైన భూములు, ఇళ్లు, బంగారం తదితర స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వివిధ బ్యాంకులు, వ్యక్తిగత అప్పులు మొత్తంగా రూ. 3.27 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన పేరుపై వాహనాలు ఏమీ లేవు. ● ప్రైవేటు విద్యా సంస్థల యజమాని ఎస్.సుందర్రాజు, ఆయన భార్య, పిల్లల పేరున మొత్తంగా రూ.16.44 కోట్ల ఆస్తులు ఉండగా, బ్యాంకులు, ఇతరత్రా రూ.2.30 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆస్తుల్లో ఆయన, ఆయన కుటుంబ సభ్యుల పేరున రూ. కోటి విలువైన 33 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరున మోటారు సైకిల్ మాత్రమే ఉంది. ● ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆయన భార్య పేరున మొత్తంగా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.2.99 లక్షల అప్పు ఉంది. ఆస్తుల్లో రూ.90.10 లక్షల విలువైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎల్ఐసీలు, బంగారం ఉంది. మాడుగులపల్లి మండలం భీమనపల్లిలో ప్రస్తుతం రూ.1.20 కోట్ల విలువైన 4.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మిర్యాలగూడలో ప్లాట్లు ఉన్నాయి. ● డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, ఆయన భార్య పేరున అన్నీ కలిపి రూ. 3.20 కోట్ల ఆస్తులు ఉండగా, రూ.కోటిన్నర అప్పు ఉంది. ● ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య, ఆయన భార్య పేరున రూ. 3.06 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ● పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, ఆయన భార్య, పిల్లల పేరున మొత్తంగా రూ.2.29 కోట్లు విలువైన ఆస్తులు ఉండగా, ఇక రూ.1.36 కోట్ల అప్పులు ఉన్నాయి. ● బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పేరున రూ.1.32 కోట్ల ఆస్తులు ఉండగా, రూ. 21.80 లక్షల అప్పులు ఉన్నాయి. ఆయన పేరున ఎలాంటి వాహనాలూ లేవు. ● స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్, ఆయన భార్య పేరున రూ.1.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, అందులో రూ.98 లక్షల విలువైన 21 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరున మోటారు సైకిల్ మాత్రమే ఉంది. ● టీచర్స్ జేఏసీ అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ఆయన భార్య, పిల్లల పేరున రూ.77 లక్షల ఆస్తులు ఉండగా, రూ. 57 లక్షల అప్పులు ఉన్నాయి. ● ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల పేరున రూ. 1.88 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.28 లక్షల అప్పులు ఉన్నాయి. ● స్వతంత్ర అభ్యర్థి బంక రాజు పేరున రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ. 13.74 లక్షల అప్పులు ఉన్నాయి. ● స్వతంత్ర అభ్యర్థి అర్వ స్వాతి, కుటుంబ సభ్యుల పేరున రూ.1.29 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.40 లక్షల అప్పులు ఉన్నాయి. ● స్వతంత్ర అభ్యర్థి.. కంటె సాయన్న, ఆయన కుటుంబ సభ్యుల పేరున రూ. 3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.ఫ అందరిలో ఆస్తిపరుడు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి ఫ నామినేషన్ వేసిన వారిలో ఆయనకే అత్యధిక ఆస్తులు ఫ రూ.17.30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి ఫ ఆ తర్వాత అత్యధికంగా సుందర్రాజుకు రూ.16.44 కోట్ల విలువైన ఆస్తులు -
ఇసుక లారీల ‘ఓవర్’ లోడ్
సాక్షి,యాదాద్రి : ఓవర్లోడ్ ఇసుక రవాణా అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. ఓవర్లోడ్ కారణంగా రోడ్లు, వంతెనలు దెబ్బతింటున్నాయి. ములుగు జిల్లా భూపాలపల్లి పరిసర క్వారీల నుంచి హైదరాబాద్కు ఓవర్లోడ్తో యాదాద్రిభువనగిరి జిల్లా మీదుగా ఇసుకను తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టి జరిమానాలు విఽధిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. జిల్లా మీదుగా సుమారు 500 ఇసుక లారీలు నిత్యం నడుస్తున్నాయి. గోదావరి నది ఇసుక రీచ్ల నుంచి..టీజీఎండీసీ గోదావరి నది ఇసుక రీచ్ల నుంచి లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా మేడ్చల్ మల్కాజిగిరి మీదుగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు గోదావరి ఇసుకను రవాణా చేస్తున్నారు. దెబ్బతింటున్న రోడ్లు ఓవర్ లోడ్తో వెళ్తున్న ఇసుక లారీల కారణంగా జాతీయ రహదారి దెబ్బతింటోంది. ఓవర్ లోడ్తో వెళ్తున్న మెజార్టీ ఇసుక లారీల వల్ల జనగామ నుంచి ఆలేరు, వంగపల్లి, రాయిగిరి, భువనగిరి, బీబీనగర్, మీదుగా ఘట్కేసర్ వరకు 40 కిలోమీటర్ల రోడ్డు పలుచోట్ల దెబ్బతిన్నది. తనిఖీలు చేస్తున్నా తప్పించుకుని.. వరంగల్–హైదరాబాద్, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులపై అధికారులు తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలోని పంతంగి, గూడూరు టోల్గేట్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. విషయం తెలుసుకుని జాతీయ రహదారి వెంట లారీలు గంటల తరబడి నిలిపి ఉంచుతున్నారు. అధికారులు వెళ్లగానే లారీలు తరలిపోతున్నాయి. అక్రమ రవాణా వెనుక కొందరు అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నేడు సీఎస్ సమీక్ష ఓవర్లోడ్తో ఇసుక అక్రమ రవాణాపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రెండు రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి ఆదేశించడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. అక్రమ ఇసుక రవాణా వివరాలను జిల్లా ఇంటలిజెన్స్ అధికారులు సేకరించారు. జిల్లాలోని బిక్కేరు, ఆలేరు, మూసీతోపాటు స్థానిక వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణ, ఫిల్టర్ ఇసుక రవాణా వివరాలను సేకరించారు. బస్వాపూర్ ప్రా జెక్టు నిర్మాణానికి అనుమతి తీసుకుని ఇతర జిల్లాలకు తరలిస్తున్న ఇసుక రవాణాపై ఆరా తీశారు. ఇసుక లారీల రవాణా నిబంధనలు టైర్ల లారీ ప్రస్తుతం కొన్ని ఉండాల్సిన బరువు లారీలు ఇలా12 టైర్ల లారీ 35 టన్నులు 50 టన్నులు 14 టైర్ల లారీ 42.50 60 టన్నులు 16 టైర్ల లారీ 47.50 70 టన్నులు అక్రమ రవాణాపై ఇంటలిజెన్స్ ఆరా నేడు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నివేదిక సిద్ధం చేసిన కలెక్టర్ జరిమానా విధిస్తున్నాం ఇసుక ఓవర్లోడ్తో వెళ్లే లారీలను తనిఖీ చేస్తున్నాం. కెపాసిటీకి మించి ఇసుకతో వస్తున్న లారీలకు జరిమానా విధిస్తున్నాం. అధిక లోడ్తో వస్తున్న లారీకి రూ.2 వేలు, ప్రతి టన్నుకు రూ1000 జరిమానా విధిస్తున్నాం. కొన్నిమార్లు డ్రైవర్ల లైసెన్స్లు సస్పెండ్ లేదా రద్దు చేస్తున్నాం. – సాయికృష్ణ, ఇన్చార్జ్ డీటీఓ భువనగిరి -
నేటి నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ
భువనగిరిటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి పీఓ, ఏపీఓలకు స్థానిక వెన్నల కళాశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 12 నుంచి 15వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. 2658 మంది పీఓలు, 2256 మంది ఏపీఓలు విడతల వారీగా శిక్షణలో పాల్గొననున్నారు. ప్రతి విడత 200 మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి● డీఎంహెచ్ఓ మనోహర్ భువనగిరి : జిల్లాలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించి సురక్షిత ప్రసవాలు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటిగ్రేటెడ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్పై జిల్లాలోని మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ఆర్మన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పాల్గొని మాట్లాడుతూ అధిక ప్రమాద గర్భ అంతరాలను గుర్తించినప్పటికీ నిర్వహణ, చికిత్స సరిగా లేక మహిళలకు, నవజాత శిశువుకు శాపంగా మారుతోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ యశోద, శిల్పిని, ఆర్మన్ స్వచ్ఛంద సంస్థ సిబ్బ ంది రోహిణి, శివకుమార్, ప్రోగ్రాం ఆఫీ సర్ డాక్టర్ సాయిశోభ, అంజయ్య పాల్గొన్నారు. ఒక నామినేషన్ తిరస్కరణనల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. నేతన్న పొదుపునకు దరఖాస్తు చేసుకోవాలిభూదాన్పోచంపల్లి : నేతన్న పొదుపు పథకానికి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి, స్థానిక చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్ శ్రీనివాస్రావు అన్నారు. భూదాన్పోచంపల్లిలో మంగళవారం చేనేత సహకార సంఘం కార్మికుల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రావు మాట్లాడుతూ జియో ట్యాగింగ్ కలిగి, చేనేత వృత్తి చేస్తున్న ప్రతి చేనేత కార్మికుడితోపాటు అనుబంధ కార్మికులు నేతన్న పొదుపు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చేనేత కార్మికుడు, అనుబంధ కార్మి కుడి ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్తోపాటు నామిని ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హనుమంతుడికి ఆకుపూజయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించారు. -
ఎస్ఐ లక్ష్మయ్య మల్టీజోన్ ఐజీ కార్యాలయానికి అటాచ్
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ ఎస్ఐ ఎం.లక్ష్మ య్యపై అవినీతి ఆరోపణలు రావడంతో మల్టీజోన్ ఐజీ–2 కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఏడాది క్రితం చౌటుప్పల్ ఎస్ఐగా విధుల్లో చేరిన లక్ష్మయ్యపై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు వచ్చాయి. నాలుగు నెలల క్రితం చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ సీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఆయన అక్కడ విధుల్లో చేకుండా చౌటుప్పల్లోనే కొనసాగారు. ఇటీవల ఓ పోర్జరీ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఎస్ఐ లక్ష్మయ్యను చౌటుప్పల్ ఏసీపీ పంపించారు. అయితే ఆ వ్యక్తికి ముందస్తు సమాచారం ఇచ్చి పరారయ్యేలా సహకరించాడని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా రెడ్డిబాయి స్టేజీ వద్ద ఉన్న ఓ దాబాలో మద్యం అమ్ముతున్నారని సమాచారం ఇచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో సదరు వ్యక్తులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వ్యక్తుల నుంచి లంచాలు తీసుకోవడంతో ఓవ్యక్తి కూడా సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మయ్యపై శాఖాపరమైన విచారణ జరిపి మల్టీజోన్–2 ఐజీ కార్యాలయానికి ఈ నెల 5వ తేదీన అటాచ్ చేశారు. -
ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు నమ్మొద్దు
వలిగొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కోరారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 14 మాసాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయడానికి సన్నాహాలు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ త్రిశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ చైర్మెన్ భీమానాయక్, పాశం సత్తిరెడ్డి, చిట్టెడి జనార్దన్రెడ్డి, నూతి రమేష్, తుమ్మల యుగంధర్రెడ్డి, బాబురావు, బాతరాజు బాల్ నర్సింహ, బెలిద నాగేశ్వర్, సామ రాంరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, కంకల కిష్టయ్య, చిలుగురి సత్తిరెడ్డి, బత్తిని లింగయ్య, సహదేవ, పల్లెర్ల సుధాకర్ పాల్గొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి -
విద్యుత్ వినియోగం ౖపైపెకి
● పెరిగిన ఎండ తీవ్రత ● మొదలైన ఉక్కపోతవిద్యుత్ వినియోగం పెరుగుతోంది ప్రస్తుతం జిల్లాలో వారం రోజుల నుంచి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ విద్యుత్ వినియోగం 8.0 మిలియన్ యూనిట్లుగా ఉంటోంది. వేసవిలో విద్యుత్ డిమాండ్ 10 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా 33 కేవీ విద్యుత్ స్టేషన్లను నిర్మించడంతోపాటు లోడ్ ఎక్కువగా ఉన్న ఫీడర్లను గుర్తించి లోడ్ తగ్గించాం. జిల్లాలో 26 వరకు 11 కేవీ విద్యుత్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – సుధీర్కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ భువనగిరి : జిల్లాలో రోజురోజుకూ విద్యుత్ విని యోగం పెరుగుతోంది. గత సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంతో పోల్చితే ఈ నెల మొదటి వారంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సాధారణంగా మార్చి మొదటి లేదా రెండో వారం నుంచి ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి జిల్లాలో ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు ఉండగా గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా ఎండలు పెరగడంతో ఉక్కపోత ప్రారంభమయింది. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీనికితోడు వరి పంటకు నీరు ఎక్కువగా అవసరమయ్యే సమయం కావడంతో రైతులు విద్యుత్ మోటార్లు వినియోగిస్తున్నారు. ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులువేసవిలో గృహ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 4,41,610 ఉండగా.. 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 97 ఉన్నాయి. 220 కేవీ విద్యుత్ స్టేషన్లు 02, అదేవిధంగా 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 06 ఉన్నాయి. ఓవర్ లోడ్ను తట్టుకునేందుకు జిల్లా వ్యాప్తంగా రెండు 33 కేవీఏ విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించగా మరో సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. ఏడు ఉప కేంద్రాల్లో విద్యుత్ సామర్థ్యాన్ని 5 ఎంవీఏ ఉంచి 8 ఎంవీఏకు పెంచారు. ఓవర్లోడు ఉన్న 26 ఫీడర్లను విభజించి వేరుగా ఏర్పాటు చేశారు. తక్కువ సామర్థ్యం ఉన్న 101 ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వీటితో 83 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. మరో 10 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని త్వరలో పెంచనున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను అధికంగా వినియోగిస్తున్న ప్రజలు డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా అధికారుల ఏర్పాట్లుజిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా.. ( మిలియన్ యూనిట్లు )తేదీ 2024 2025ఫిబ్రవరి 3 7.2 7.4 4వ తే దీ 7.3 7.5 5వ తే దీ 7.3 7.6 6వ తే దీ 7.3 7.7 7వ తే దీ 7.4 7.8 8వ తే దీ 7.4 8.0 9వ తే దీ 7.4 8.0 10వ తే దీ 7.5 8.1 -
ధాన్యం సేకరణకు సన్నాహాలు చేయాలి
సాక్షి,యాదాద్రి : యాసంగి సీజన్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచే ధాన్యం సేకరణకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. యాసంగి 2024–25 కు సంబంధించి ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశం మంగళవారం రాయగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏజెన్సీలు, అధికారులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్లో గత సీజన్ కంటే రెట్టింపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నందున దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 395 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సాయికృష్ణ, జిల్లా కోఆపరేటీవ్ అధికారి రవీందర్, సహాయ పౌర సరఫరాల అధికారిని రోజా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
‘ప్రాదేశిక’ ఓటర్ల జాబితా ప్రదర్శన
సాక్షి,యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తికాగా ఎన్నికల సంఘం గుర్తులను కూడా ప్రకటించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 17 మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితాలను ప్రదర్శించారు. జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించి బుధవారం నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 15లోగా ఏర్పాట్లు పూర్తి చేయండి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 15లోగా ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్తో అదనపు కలెక్టర్ గంగాధర్తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. మంగళవారం (నేడు) పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల చేసి 12నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 15న తుది జాబితా ప్రదర్శించాలని సూచించారు. 13నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు పీఓలు, ఏపీఓలతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు నేరుగా వెళ్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి అనువుగా ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సజావుగా నిర్వహించేలా సిద్ధంగా ఉండాలని కోరారు. ఏర్పాట్లలో ఏచిన్న లోపం రావద్దని, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు వస్తే జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీపీఓ సునంద, జిల్లా పరిష్త్ సీఈఓ శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా వెల్లడి -
చేజికి్కంచుకునేలా!
స్థానిక సంస్థల్లో పట్టుకు కాంగ్రెస్ వ్యూహం ఆశావహులు ఫుల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతర పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిలో పలువురు మున్సిపల్ చైర్మన్ పదవులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఆశిస్తున్నారు. కాగా పదేళ్లు అధికారంలో లేకున్నా పార్టీని వెన్నంటి ఉన్న కేడర్లో చాలామంది బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగనుండడంతో టికెట్ సాధిస్తే గెలుపు నల్లేరుపై నడకేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ తమ వర్గానికి వస్తుందన్న అంచనాతో టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్దకు ఆశావహుల తాకిడి మొదలైంది. ఎమ్మెల్యేలు మాత్రం పాత, కొత్త వారిని సమన్వయం చేసుకుని గెలుపుగుర్రాలకు టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రంగం సిద్ధమైంది. సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని స్థానిక సంస్థల్లోనూ పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. త్వరలో ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్ను సన్నద్ధం చేయడంతో పాటు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలపై మోపింది. అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో వారికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు క్షేత్ర పర్యటనలు, స న్నాహక సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు. పనితీరు ప్రామాణికంగా.. జిల్లాలోని 178 ఎంపీటీసీలు, 17 జెడ్పీటీసీ స్థానా లు, 428 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపుమీదున్న కాంగ్రెస్.. స్థానిక పోరులోనూ అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం కీలకమైన అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉంది. పెద్దల అండ ఉంటే చాలూ.. టికెట్ వస్తుందన్న అభిప్రాయానికి ఈసారి పార్టీ నాయకత్వం చెక్ పెట్టనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కేడర్ పనితీరు ప్రామాణికంగా, కొత్తగా పార్టీలో చేరిన వారిని సమన్వం చేసుకుంటూ అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ 90 శాతం సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ ఫ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యేలకు ఫ క్షేత్ర పర్యటనలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలకు సమాయత్తం అందరి చూపు రిజర్వేషన్ల వేపై.. ప్రస్తుతం అందరి చూపు బీసీ రిజర్వేషన్లపైనే ఉంది. ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదికను సమర్పించింది. దీని ప్రకారం మండలం యూనిట్గా ఎంపీటీసీలు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీ రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్గా జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలో ఆశావహులు ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. వారంతా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. -
పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు
రామన్నపేట : మండలంలోని జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను సోమవారం కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, నీళ్ల ట్యాంకుల్లో బొద్దింకలు, జెర్రీలు చనిపోయి ఉండడంతో ప్రిన్సిపాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వ్యవస్థపై కూడా సరైన పర్యవేక్షణ లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లగా విద్యార్థులు సమస్యలు ఏకరువు పెట్టారు. తరగతి గదులు, బాత్రూంలను తమతోనే శుభ్రం చేయిస్తున్నారని, కాస్మొటిక్ చార్జీల్లో రూ.3 కోత విధిస్తున్నారని, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నారని, నీటికాలుష్యం వల్ల దురద వస్తుందని, కోతుల దాడిలో గాయాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరిన కూరగాయలు, పెద్దసైజులో ఉన్న వంకాయ, ఆలుగడ్డ ముక్కలను తినలేక పడవేస్తే పరుష పదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బాత్రూంలు శుభ్రంగా ఉండడం లేదని, ఫ్యాన్లు, లైట్లు పనిచేయడం లేదని, డార్మిటరీలు లేక తరగతి గదుల్లోనే పడుకోవాల్సి వస్తుందని, పడుకునే గదులకు బాత్రూంలు దూరంగా ఉండడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బంది పడుతున్నామని మొర పెట్టుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రమదానం పేరుతో విద్యార్థులను బాలకార్మికులుగా మారుస్తారా?, ఫంక్షన్ల పేరుతో డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ.. మందలించారు. పేదపిల్లలను చూసుకునే పద్ధతి ఇదేనా అని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఫిర్యాదులు వస్తున్న ఏకై క పాఠశాల ఇదేనని, మీ పనితీరు వల్ల జిల్లాకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆయనవెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి తహసీల్దార్ సి.లాల్బహదూర్, ఎంపీడీఓ బి.యాకుబ్నాయక్, పీఆర్ఎఈ గాలయ్య తదితరులు ఉన్నారు. నిచ్చెన ఎక్కి.. ట్యాంకులను పరిశీలించి విద్యార్థుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ హనుమంతరావు పాఠశాల ఆవరణలోని నీటి సంపును పరి శీలించారు. అనంతరం నిచ్చెన తెప్పించి భవనంపైకి ఎక్కి బాత్రూంలకు నీటిని సరఫరా చేసే ట్యాంకులను చూశారు. పురుగులు, చెత్తా, చెదారం ఉండడంతో ఆసహనం వ్యక్తం చేశారు. తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు.హెల్త్క్యాంప్ ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశం పాఠశాలలో తక్షణమే మెగా హెల్త్క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని ఫోన్లో ఆదేశించారు. రక్తపరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతం కూడా పరిశీలించాలని తెలిపారు. మంగళవారం స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని ఎంపీడీఓ యాకుబ్నాయక్ ఆదేశించారు. నల్లాలు, ఫ్యాన్లు మరమ్మతులు, లైట్ల కోసం ప్రతిపాదనలు పంపాలని పీఆర్ఏఈ గాలయ్యకు సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాఠశాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో తల్లితండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారానికి రెండుసార్లు తహసీల్దార్, ఎంపీడీఓలు పాఠశాలను సందర్శించి నివేదిక పంపిస్తారని తెలిపారు. విధుల్లో అలసత్వం వహించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఫ కలెక్టర్ హనుమంతరావు ఫ జనంపల్లి గురుకుల పాఠశాల తనిఖీ -
చౌటుప్పల్కు సాగునీరు సాధించడమే లక్ష్యం
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ ప్రాంతానికి సాగునీరు సాధించడమే లక్ష్యమని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ కట్టా భగవంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి, ఖైతాపురం, ఎల్లంబావి, ఎల్లగిరి, కొయ్యలగూడెం, దండుమల్కాపురం, తుప్రాన్పేట గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతంలో సాగునీటి వనరులు లేక రైతులు, ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారని పర్కొన్నారు. సాగునీరు అందించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, అయినా పట్టించుకునే వారు లేరన్నారు. సాగునీటి కోసం రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఇందుకోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సమావేశంలో మెట్టు సుదర్శన్రెడ్డి, మాజీ సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, గుర్రం కొండయ్య, యాదయ్య, నాయకులు కంది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. ఇప్పటి వరకు 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్ జరుగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. సమావేశాలు, ర్యాలీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి సోమవారం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డి, పులి సరోత్తమ్రెడ్డి, పూల రవీందర్, ఎస్.సుందర్రాజు యాదవ్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్ బహుజన వాదంతో పెద్ద ఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. సుందర్రాజు యాదవ్ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. అయితే సుందర్రాజుయాదవ్, పూల రవీందర్ నామినేషన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు. 13 వరకు ఉపసంహరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. జోరందుకోనున్న ప్రచారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున ప్రచార ఘట్టం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని సంఘాలు క్షేత్ర స్థాయిలో ఓ దఫా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇకపై మరింత జోరుగా ప్రచారాన్ని కొనసాగించనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన సంఘాల అభ్యర్థులతో పాటు బహుజన వాదంతో ముందుకు వస్తున్న అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి, ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చివరి రోజు 18 మంది నామినేషన్ ఫ మొత్తం 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు ఫ భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ ఫ నేడు నామినేషన్ల పరిశీలనఅభ్యర్థుల వారీగా నామినేషన్లు వేసిన సెట్ల సంఖ్యఅభ్యర్థి సెట్లు అలుగుబెల్లి నర్సిరెడ్డి 3పులి సరోత్తంరెడ్డి 3పింగిళి శ్రీపాల్రెడ్డి 4పూల రవీందర్ 3గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి 2ఎస్.సుందర్రాజు 3తాటికొండ వెంకటరాజయ్య 1ఏలె చంద్రమోహన్ 3దామర బాబురావు 3లింగిడి వెంకటేశ్వర్లు 4బంక రాజు 2పన్నాల గోపాల్రెడ్డి 2ఔర స్వాతి 1చకిలం చంద్రశేఖర్ 2తలకొప్పుల పురుషోత్తంరెడ్డి 3కొలిపాక వెంకటస్వామి 3కాటే సాయన్న 1జంగిటి కై లాసం 1జెట్టి శంకర్ 1బోండా నాగరాజు 2కోమటిరెడ్డి గోపాల్రెడ్డి 1గండిరెడ్డి కోటిరెడ్డి 1తండు ఉపేందర్ 1 -
స్నేహానికన్న మిన్న లోకాన లేదు
ఆలేరు రూరల్ : స్నేహానికన్న మిన్న లోకాన లేదని, నిజమైన స్నేహితులు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడని సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్తేజ అన్నారు. కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ రచించిన దోస్తానా మినీ కవితా సంపుటిని సోమవారం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి వ్యక్తి తన దోస్తులతో అమృత తుల్యమైన ఆనందనం పంచుకుంటారని పేర్కొన్నారు. హరగోపాల్ తన స్నేహితులతో ఉన్న ఐదు దశాబ్దాల అనుబంధాన్ని దోస్తాన సంపుటి ద్వారా అక్షరబద్ధం చేశారని పేర్కొన్నారు. సంపుటిలోని 150 కవితలు స్నేహం విలువలను చాటిచెబుతున్నాయన్నారు. హరగోపాల్ పరిశోధనల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారని కొనియాడారు. అదే విధంగా పుస్తక ప్రచురణ కర్త అమ్మయాది పెండెం ఫౌండేషన్ అధ్యక్షుడు పెం సత్యనారాయణ, కవి శ్రీరామోజు హరగోపాల్, డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, పాఠశాల హెచ్ఎం దాసరి మంజుల, మేఘరాజు మాట్లాడారు. కార్యక్రమంలో నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్టు ఎండీ అబ్దుల్, యంబ నర్సింహులు, బండిరాజుల శంకర్, ఆకవరం మోహన్రావు, జి.కుమారస్వామి, వంగపల్లి అంజయ్యస్వామి, దూడల వెంకటేశ్, బొమ్మకంటి బాలరాజు, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ సభ్యులు సుధాకర్, సుభాష్, జయంత్, గఫార్, సాహితీ అభిమానులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి హరగోపాల్, సుద్దాల అశోక్ తేజను పలువురు ఘనంగా సన్మానించారు. ఫ ‘దోస్తానా’ పుస్తకావిష్కరణలో సుద్దాల అశోక్తేజ -
మూడో విడత ‘రైతుభరోసా’ విడుదల
భువనగిరిటౌన్ : రైతుభరోసా మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రెండు ఎకరాల లోపు ఉన్న 9,151 మంది రైతుల ఖాతాల్లో రూ.7,18,36,017 నగదు జమ అయ్యాయి. గత నెల 26న మొదటి విడత, ఈనెల 5వ తేదీన రెండో విడత నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో 32,946 మంది రైతులకు రూ.53.64 కోట్ల పెట్టుబడి సాయం అందజేసింది. శివకేశవులకు సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా కొండపైన కొలువైన శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, ముఖ మండపంలో అష్టోత్తరం తదితర పూజలు చేపట్టారు. యాదగిరి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెన్షన్కు గురైనట్లు తెలుస్తోంది. సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రావ్య అనుమతి లేకుండా కొద్ది రోజులుగా విధులకు రావడం లేదు. అదే విధంగా కొండపైకి వెళ్లే వాహనాల నుంచి వసూలు చేసిన రుసుమును రికార్డు అసిస్టెంట్ నర్సింగరావు ఆలయానికి చెల్లించడం లేదు. దీంతో ఇద్దరిని దేవస్థానం ఈఓ భాస్కర్రావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ బీసీల ద్రోహి సాక్షి, యాదాద్రి : కులగణన పేరుతో బీసీలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి ద్రోహిగా మిగిలిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. సోమవారం భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా 2024 నాటికి పెరగాలే కాని ఎలా తగ్గిందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం చట్టబద్ధత ఎందుకు కల్పించలేదన్నారు. బీసీ లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని, సరి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లడాన్ని బీఆర్ఎస్ అంగీకరించబోదన్నారు. బీసీ కులగణన తప్పని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ప్రతులను తగులబెట్టిన విషయాన్ని భిక్షమయ్యగౌడ్ గుర్తు చేశారు. బీసీలకు చేస్తున్న అన్యాయాలపై గ్రామ సభలు పెట్టి చైతన్యం చేస్తామన్నారు. బీసీలకు కేసీఆర్ ఎంతో చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 50 శాతం టికెట్లు బీసీలకు కేటాయిస్తుందన్నారు. విలేకర్ల సమావేశంలో మాజీ గ్రఽంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎనబోయిన అంజనేయులు, వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీలు బీరుమల్లయ్య, బొట్ల పరమేశ్వర్,మొగుళ్ల శ్రీనివాస్, తోటకూర అనురాధ, నాయకులు కర్రె వెంకటయ్య, బబ్బూరి రవీంద్రనాఽథ్గౌడ్, కొలుపుల హరినాధ్, నీల ఓం ప్రకాశ్గౌడ్, గడ్డమీది రవీందర్గౌడ్, పెంటనర్సింహ, అబ్బగాని వెంకట్ పాల్గొన్నారు. మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదుభువనగిరిటౌన్ : రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామసభలతో పాటు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరాల శాఖ సూచన మేరకు మీసేవ పోర్టల్లో ఆహార భద్రత (రేషన్)కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోనివారు మాత్రమే అర్హులన్నారు. -
యాదాద్రి భువనగిరి
ఆ కంపెనీ మాకొద్దు టైర్ల రీసైక్లింగ్ కంపెనీ తమకొద్దంటూ మోట కొండూరు మండలం కాటేపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7పెద్దగట్టుకు పోదాం ఇలా.. దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి జాతరకు సంబంధించిన రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. - 8లోమంగళవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 9లో23న మహాకుంభ సంప్రోక్షణం యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురానికి ఈనెల 23న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు.- 8లో -
చిన్న కారణానికే ఎంత దారుణం
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్: పాఠశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకును మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సైదులుకు ముగ్గురు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు చదువు ఆపి వేసి హయత్నగర్లో కారు మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రెండో కుమారుడు చౌటుప్పల్లోనే ఇంటర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు భానుప్రసాద్ చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న భానుప్రసాద్ రాత్రి ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో అతడిని చితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక భానుప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అరగంట తర్వాత తండ్రి కోపం తగ్గిందని భావించి భానుప్రసాద్ ఇంటికి రాగా.. మరోసారి విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీపై తన్నడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు చనిపోయాడని నిర్ధారించారు. దీంతో శనివారం రాత్రి హుటాహుటిన స్వగ్రామం ఆరెగూడేనికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదివారం ఉదయం దహనసంస్కారాలు చేస్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆరెగూడెం గ్రామానికి చేరుకున్నారు. చితిపై ఉంచిన మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసేలా ఒప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అశ్రునయనాలతో అంత్యక్రియలుపోస్టుమార్టం అనంతరం స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో భానుప్రసాద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచి్చన కొడుకును క్షణికావేశంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు మృతుడి ఇంటికి బారులుదీరారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. కేసు నమోదుఈ ఘటనపై మృతుడి తల్లి కట్ట నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో సైదులు నివాసం ఉండే ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుని నమోదు చేశారు. -
ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు సోమవారం ముగియనుంది. 3వ తేదీన నామినేషన్లు ప్రారంభం కాగా 7వ తేదీ వరకు 17 మంది 23 సెట్లు దాఖలు చేశారు. భారీగా దాఖలు కానున్న నామినేషన్లుసోమవారం పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీల మధ్య వచ్చి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ర్యా లీతో వచ్చి నామినేషన్ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భరత్చంద్రాచారి కుటుంబానికి చేయూత సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కంకణాలగూడెం పంచాయతీ పరిధి దేశతండాకు చెందిన పదో తరగతి విద్యార్థి భరత్చంద్రాచారి కుటుంబానికి గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవితావిద్యాసాగర్ చేయూతనిచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో భరత్చంద్రాచారి పాఠశాలకు వెళ్లడానికి ఆది వారం సైకిల్, రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు తలుపుతట్టి – నిద్రలేపి కార్యక్రమానికి భరత్చంద్రాచారి ఇంటినుంచి కలెక్టర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ గడ్డం మురళీధర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కడ్తాల కిషన్, మాజీ ఉప సర్పంచ్ పాలెం వీరేష్గౌడ్, మురుదొడ్డి శ్రీనివాస్, సిరిపంగి శంకర్ తదితరలు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాతం సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమంగజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసిన అనంతరం ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
75 శాతం కోతలే.. !
జిల్లాలో 75.7 శాతం సిజేరియన్ కాన్పులే.. అందులో ప్రైవేట్ఆస్పత్రుల్లోనే అధికం. నొప్పులు భరించలేక కొందరు, ముహూర్తాలు చూసుకుని మరికొందరు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా కారణమేనని తెలుస్తోంది. శస్త్ర చికిత్సలు తగ్గించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా మార్పు రావడం లేదు.జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్లు ●● 12 నెలల వ్యవధిలో 12,499 ప్రసవాలు ● నార్మల్ 4,310, ఆపరేషన్లు 8,189 ● ప్రైవేట్లో అధికం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాస్త తక్కువ ● సాధారణ కాన్పులు పెంచేలా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
చౌటుప్పల్ : సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తూ చౌటుప్పల్లో కాసేపు ఆగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో కార్యకర్తలకు బండి సంజయ్ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా ఆధరణ కోల్పోయిందని, అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్ను సైతం ప్రజలు దూరం పెట్టారని పేర్కొన్నారు. ఎవరికివారే కథానాయకులుగా మారి పార్టీ విజయం కోసం పని చేయాలని కోరారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, నాయకులు ఆలె చిరంజీవి, ముత్యాల భూపాల్రెడ్డి, గుజ్జుల సురేందర్రెడ్డి, పోలోజు శ్రీధర్బాబు, కంచర్ల గోవర్ధన్రెడ్డి, ఆలె నాగరాజు, దాసోజు భిక్షమాచారి, బత్తుల జంగయ్య, చినుకని మల్లేష్, రాదారపు సత్తయ్య, కడారి అయిలయ్య, నూనె సహదేవ్, దిండు భాస్కర్, పబ్బు వంశీ, ఊదరి రంగయ్య, ఇటికాల దామోదర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ -
భువనగిరిలో ముమ్మరంగా వాహన తనిఖీలు
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్, జగదేవ్పూర్, హైదరాబాద్ చౌరస్తాల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆర్సీలు, లైసెన్స్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నంబర్లు ప్లేట్లు సరిగా లేని వాహనాలపై దృష్టి సారించారు. ఒక కారు, మూడు ఆటోలు, 32 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు భువనగిరి ఏసీపీ రాహుల్రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. తనిఖీల్లో పట్టణ సీఐ కందుకూరి సురేష్కుమార్, ముగ్గురు ఎస్ఐలు, ట్రాఫిక్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా భువనగిరిలోని సమస్యాత్మక ప్రాంతాలైన హన్మాన్వాడ, సంజీవ్నగర్, పహాడీనగర్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసుల సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు సీఐ సురేష్కుమార్ తెలిపారు. -
పెద్దగట్టుపై పట్టింపేది?
చివ్వెంల(సూర్యాపేట): దురాజ్పల్లిలోని పెద్దగట్టు (శ్రీ లింగమంతుల స్వామి) జాతర ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంనేందుకు వస్తారు. సుమారు 30 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ఈ జాతరకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. పనులు మాత్రం నత్తనడకన సాగుతుండడంతో జాతర నాటికి పనులు పూర్తవుతాయో లేదోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జాతరలో తాత్కాలిక పనులే.. పెద్దగట్టు జాతరకు ప్రతిసారి తాత్కాలిక పనులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈసారైనా తాత్కాలిక పనులు కాకుండా శాశ్వతంగా చేపట్టాలని కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం జాతరకు వచ్చే రహదారుల విస్తరణ, వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు, తాగునీటి వసతులు, వైద్య సదుపాయాలు, రహదారుల మరమ్మతులు, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. జాతర జరిగే సమయంలో మాత్రమే అధికారులు హడావుడి చేసి, తర్వాత ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భక్తులు వాపోతున్నారు. రూ.5 కోట్లు మంజూరురాష్ట్ర ప్రభుత్వం జాతరకు రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. జాతరకు వారం రోజులు మాత్రమే ఉండటంతో, గతంలో మాదిరిగా మళ్లీ తాత్కాలిక పనులే చేపడుతారా అని భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో లింగమంతుల స్వామి జాతర ప్రారంభం భక్తుల సౌకర్యాల కల్పనకు రూ.5 కోట్లు మంజూరు శాశ్వత పనులు కాకుండా తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు నిరుపయోగంగా కుళాయిలు, మరుగుదొడ్లు ఇప్పటివరకు మిషన్ భగీరథ ట్యాంకులకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయలేదు. గతంలో తాత్కాలిక ప్రాతిపాదికన ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్లు.. నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. గుట్టపై తాగునీటి ట్యాంకు ఉన్నప్పటికీ అక్కడక్కడా ఏర్పాటు చేసిన కళాయిలకు పూర్తిస్థాయిలో నీరు అందించలేని పరిస్థితి. మహిళలు స్నానాలు చేసి దుస్తులు మార్చుకునేందుకు సరైన గదులు లేవు.ఇబ్బందులు కలగకుండా వసతులు ఈ నెల 16 నుంచి 20 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తాం. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చలువ పెందిళ్లు వేస్తున్నాం. తాగునీటి సదుపాయం కల్పిస్తున్నాం. –పోలేబోయిన నర్సయ్య యాదవ్, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ -
సాధారణ కాన్పులు పెంచడమే లక్ష్యం
జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు సాధారణ ప్రసవాల పంఖ్య పెంచేలా కలెక్టర్ చోరవతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు మెడికల్ కళాశాల రావడంతో నైపుణ్యం కలిగిన గైనకాలజీస్ట్లు, సర్జన్ వైద్యులు ఉన్నారు. వీరి గుంచి విస్త్రత్తంగా ప్రచారం చేస్తున్నాం. ప్రతి గర్భిణీ మహిళా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా ఆశా, ఏఎన్ఎంలతో అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం మొదటి కాన్పులో సిజేరియన్ అయిన వారి సంఖ్య ఈ రెండు ఎళ్లలో తగ్గిపోతుంది, ప్రస్తుతం మొదటి కాన్పుకు సంబందించిన వారికి సాధారణ ప్రసవం జరిగే చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ మనోహర్, డీఎంహెచ్ఓ -
షెడ్యూల్ ఎప్పుడొచ్చినా రెడీ!
సాక్షి, యాదాద్రి : ప్రాదేశిక సమరానికి యంత్రాంగం సమాయత్తమవుతోంది. షెడ్యూల్ ఏ క్షణంలో వచ్చినా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితర ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈనెల 15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తయ్యేలా కసరత్తు చేస్తోంది. జిల్లాలో 17 జెడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కొత్తగా మోత్కూరు మండలంలో పాటిమట్ల ఎంపీటీసీ స్థానం ఏర్పాటైంది. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 178కి చేరింది. నేడు పోలింగ్ సిబ్బంది ఖరారుఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ (పీఓ)సిబ్బందిని ఖరారు చేయనున్నారు. 12న ఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 13 లేదా 14న పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వనున్నారు.వీరికి టీవోటీ (ట్రైనర్స్ ఆఫ్ ట్రైనీస్) లు, మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు గుర్తులు ప్రకటించిన ఎన్నికల కమిషన్జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్తో పాటుగా ఇండిపెండెంట్ల కోసం మరో 30 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. 30 గుర్తుల్లో ఇండిపెండెంట్లు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరికంటే ఎక్కువ మంది ఎంచుకుంటే డ్రా విధానంలో కేటాయిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు..కాంగ్రెస్కు చేయి, బీజేపీకి కమలం పువ్వు, సీపీఎం సుత్తి కొడవలి నక్షత్రం, ఆమ్ ఆద్మీ చీపురు, బీఆర్ఎస్ కారు, వైఎస్సార్సీపీ ఫ్యాన్, ఎంఐఎం పతంగి, టీడీపీ సైకిల్, సీపీఐ కంకి కొడవలి, జనసేన గాజు గ్లాసు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తులు వచ్చాయి. ఇండిపెండెంట్లకు .. స్వతంత్ర అభ్యర్థులకు కెమెరా, క్యారంబోర్డు, చపాతీ రోలర్, కోటు, పండ్ల బుట్ట, ఎయిర్ కండీషనర్, ఆపిల్ పండు, బెల్ట్, బైనాక్యులర్, ఫుట్బాల్ ఆటగాడితో పాటు మరో 21 ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వయంగా పరిశీలించనున్న అధికారులుపోలింగ్ కేంద్రాల తుది జాబితాను 15వ తేదీన ప్రకటిస్తారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉన్నాయో లేదో.. మండల స్థాయి అధికారులు స్వయంగా పరిశీలిస్తారు.ఈ తేదీల్లో ఇవీ.. పోలింగ్ కేంద్రాల ముసాయిదాను 11వ తేదీన ప్రకటించనున్నారు. 11నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి 14న పరి ష్కరించనున్నారు. అదే రోజు కలెక్టర్ పరిశీ లించి ఆమోదిస్తారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను15వ తేదీ విడుదల చేస్తారు. అదే విధంగా 13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండలాల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికలకు యంత్రాంగం సమాయత్తం 15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి జిల్లాలో 178 ఎంపీటీసీ, 17 జెడ్పీటీసీ స్థానాలు కొత్తగా పాటిమట్ల ఎంపీటీసీ ఏర్పాటు ఇప్పటికే గుర్తులు కేటాయించిన ఎన్నికల కమిషన్ మోత్కూరు మండలంలో పెరిగిన ఎంపీటీసీ స్థానాలు మోత్కూరు : మండలంలో ఎంపీటీసీ స్థానాలు ఐదుకు పెరగనున్నాయి. ప్రస్తుతం నాలుగు ఎంపీటీసీలు ఉండగా కొత్తగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానం ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీ సమావేశాల్లో పలు సవరణలు చేసి ఆమోదించింది. దీని ప్రకారం ప్రతి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో ఐదు కంటే తక్కువ స్థానాలు ఉన్న మండలాల వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఇందులో భాగంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలున్న మోత్కూరు మండలంలో ఐదవ ఎంపీటీసీ స్థానం ఏర్పాటుకు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎంపీటీసీ స్థానాలు ఇవీ దాచారం ఎంపీటీసీ పాటిమట్ల పరిధిలో సదర్శాపురం దత్తప్పగూడెం పరిధిలో దత్తప్పగూడెం, పాలడుగు గ్రామాలు ముశిపట్ల పరిధిలో ముశిపట్ల, పనకబండ, రాగిబావి పొడిచేడు ఎంపీటీసీ పరిధిలో పొడిచేడు, అనాజిపురం కొత్తగా పాటిమట్ల ఏర్పాటైంది. -
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
నార్కట్పల్లి : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజ న మంత్ర పుష్ప పూజలను నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉంచి.. చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నవీన్కుమార్, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, నేతగాని కృష్ణ, వారాల రమే్ష్, రేగట్టె నవీన్రెడ్డి, గడుసు శశిధర్రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్రెడ్డి, వెంకటయ్య, రాజ్యలక్ష్మి, వంశీధర్రావు, నరేష్, గణేష్, మహేందర్రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు. -
ఖిలా చరిత్రను భావితరాలకు అందజేస్తాం
భువనగిరి : భారతీయ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ కృషి చేస్తోందని, అందులో భాగంగా భువనగిరి కోట విశేషాలపై అధ్యయనం చేసి భావితరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం భువనగిరి ఖిలాను సందర్శించి కోటపై కట్టడాలను పరిశీలించారు. చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వారికి కోట చరిత్రను గైడ్ ఆవుల వినోద్, పర్వతారోహకురాలు అన్విత వివరించారు. ఖిలాను సందర్శించిన వారిలో సభ్యులు హరీష్, దుర్గ, శశాంక్, కిరణ్ తదితరలు ఉన్నారు.కోడ్ ముగిసే వరకు ప్రజవాణి రద్దు భువనగిరి టౌన్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత తిరిగి ప్రజవాణి కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు గమనించి కలెక్టరేట్కు రావద్దని కోరారు. సీపీఐని కలుపుకుపోతాం యాదగిరిగుట్ట : స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో సర్దుబాటు చేసుకుని, వారికి బలం ఉన్న చోట సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, మండలాల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవిధంగా ముందుకెళ్లాలనే విషయమై త్వరలో మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుందని, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, మండల పార్టీ కార్యదర్శులు కల్లెపల్లి మహేందర్, చిగుళ్ల లింగం, మారుపాక వెంకటేష్, అన్నమైన వెంకటేష్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, జిల్లా సమితి సభ్యుడు బబ్బూరి శ్రీధర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, జిల్లా సమితి సభ్యులు ఎల్లంకి మహేష్, బంగారి తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణ చౌటుప్పల్ : చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి ఇంచార్జి సూపరింటెండెంట్గా డాక్టర్ కె.రాజగోపాల్ తిరిగి శనివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ కారణాలతో ఆయనను డిసెంబర్ 30న సస్పెన్షన్కు గురయ్యారు. హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అతన్ని పోస్టింగ్లో నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్తోపాటు డీసీహెచ్కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజగోపాల్ శనివారం ఆస్పత్రికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు భువనగిరి : సికింద్రాబాద్– కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. కాజీపేట–ఖమ్మం– విజయవాడ మధ్య మూడో లైన్ పనుల కారణంగా రైలును రైద్దు చేసినట్లు తెలిపారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు కాగజ్నగర్ – సికింద్రాబాద్కు భువనగిరి మీదుగా రోజూ ఉదయం 8.44 గంటలకు, సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్కు సాయంత్రం 4.14 గంటలకు వెళ్తుంది. రైలును పునరుద్ధరించే వరకు భువనగిరితో పాటు జిల్లా ప్రజలు రవాణపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. -
అన్నదాత.. స్ఫూర్తిప్రదాత
మోత్కూరు మున్సిపాలిటీ పరిధి ఆరెగూడేనికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి (45) బంక్లో పెట్రోలు పోయించుకుంటూ కుప్పకూలిపోయాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేనికి తరలించగా.. నర్సిరెడ్డికి బ్రెయి న్డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డాక్టర్ల సలహామేరకు నర్సిరెడ్డి అవయవాలను దానం చేసేందుకు మృతుడి భార్య, కుటుంబీకులు సమ్మతించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరం కావడంతో నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. నర్సిరెడ్డి నుంచి గుండెను సేకరించి నాగోల్ మెట్రో రైలు ద్వారా జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. గుండెతో పాటు మరికొన్ని అవయవాలు సేకరించారు. మతుడి భార్య నిర్మల, పదేళ్ల వయస్సున్న కుమారులు శశిధర్రెడ్డి, శ్రీనాథ్రెడ్డిని ఐపీఎస్ అధికారి సజ్జనార్ పరామర్శించి అభినందించారు. -
భువనగిరి కేంద్రమే ఆధారం!
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితి దాపురించింది. గతంలో గుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రం నడిచేది. చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో మూసివేశారు. ఏడాది గడిచినా తిరిగి ప్రారంభించడం లేదు. దీంతో స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే..ఆధార్ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. ప్రస్తుతం ఏ పనికావాలన్నా ఆధార్ ఉండాల్సిందే.. అది లేకపోతే పని జరగడం లేదు.. పోనీ ఆధార్ చేయించుకుందామంటే ఆ అవకాశమూ లేదు. ఎందుకంటే గుట్టలో ఉన్న ఒకే ఒక్క ఆధార్ కేంద్రం మూతపడింది. దీంతో ఆధార్ చేర్పులు, మార్పులకు అష్టకష్టాలు పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలంలో 23 గ్రామాలు 75 వేల వరకు జనాభా ఉంది. ఏ ఒక్క గ్రామంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయలేదు. కార్డుల్లో తప్పుల సవరణ, చేర్పులు, మార్పులు చేసుకోవడానికి భువనగిరికి వెళ్లాల్సి వస్తుంది. అంతదూరం వెళ్లినా సర్వర్లో సాంకేతిక సమస్యలు, రద్దీ తదితర కారణాలతో పొద్దస్తమానం ఎదురుచూడాల్సి వస్తుంది. ఆధార్ సేవలకు ఏడాది నుంచి యాదగిరిగుట్ట ప్రజలు దూరం గతంలో ఉన్న కేంద్రం మూసివేత కొత్త కార్డులు, చేర్పులు, మార్పులకు అష్టకష్టాలు -
ఆశ.. నిరాశేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రి పదవులు ఆశిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఆశ ఇప్పట్లో నెరవేరేలా లేదు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో అవసరం లేదని అధిష్టానం తేల్చిచెప్పినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించడం నిరాశను మిగిల్చింది. అధిష్టానం హామీ ఇచ్చిందని..మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉమ్మడి జిల్లా నుంచి మునుగోడు నియోజవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపించే బాధ్యతను రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు అప్పట్లో చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డి గెలిచారు. అప్పటి నుంచి తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. హోంమంత్రి పదవి ఇవ్వాలని..మొదట్లో జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మంత్రి పదవులు లభించాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది. ఒకానొక సందర్భంలో తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్రెడ్డి చెప్పుకొచ్చారు. లంబాడా కోటాలో వస్తుందని..ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్కు అవకాశం ఉంటుందనే చర్చ జో రుగా సాగింది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగింది. ప్రస్తుతం కేబినెట్ విస్తరణ అవసరం లేదని అధిష్టానం స్పష్టం చేయడంతో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నిరాశ తప్పడం లేదు. -
యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి
సాక్షి,యాదాద్రి : యాసంగి సీజన్లో ధాన్యం దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. శనివారం తన చాంబర్లో సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమైన యాసంగి ధాన్యం దిగుబడి, సేకరణ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో సుమారు 2,75,000 ఎకరాల్లో వరి సాగు అయ్యిందని, 7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. అందులో 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. సీఎంఆర్ సరఫరాలో వేగం పెంచండియాసంగి ధాన్యం కొనుగోళ్లకు సమయం దగ్గర పడుతుందని, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో వేగం పెంచాలని మిల్లర్లకు సూచించారు. ఆ విధంగా అయితేనే మిల్లుల్లో ఖాళీ స్థలం ఏర్పడి ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి అవసరం మేరకు స్థలాలను అద్దెకు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, సంబంధిత అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు. ఫ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
యాదాద్రి భువనగిరి
7ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025నృసింహుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకుని శనివా రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో లక్ష పుష్పార్చన పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులను అలంకరించి తులసీదళాలు, వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, సుదర్శన హోమం, నిత్యకల్యాణం తదితర సంప్రదాయ పూజలను నేత్రపర్వంగా చేపట్టారు.ఉత్సవమూర్తులకు పుష్పార్చన చేస్తున్న అర్చకుడుదరఖాస్తు చేసుకోవాలి నేతన్న పొదుపు పథకానికి ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆర్డీడీ పేర్కొన్నారు. - 8లోన్యూస్రీల్ -
త్రిషలా.. మేమూ ఆడతాం..
భారత మహిళా క్రికెట్ జట్టు అండర్–19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడిని ఆదర్శంగా తీసుకుని పలువురు అమ్మాయిలు క్రికెట్ సాధన చేస్తున్నారు. ఆటలపై ఆసక్తి ఉన్న కూతుళ్లను తల్లిదండ్రులు క్రికెట్ వైపు ప్రోత్సహించినప్పుడే.. త్రిష, కమలిని, సనిక చాల్కె, వైష్ణవి శర్మ తరహాలో తయారవుతారు. ప్రస్తుతం సూర్యాపేట, కోదాడలోని క్రికెట్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అవకాశం వస్తే భారత జట్టుకు, మహిళల ఐపీఎల్కు ఎంపికై సత్తా చాటుతామని చెబుతున్నారు. – సూర్యాపేట టౌన్, కోదాడరూరల్ఫ మన వాళ్లలోనూ అండర్–19 మహిళల ప్రపంచకప్ గెలుపు స్ఫూర్తి ఫ క్రికెట్పై మక్కువతో కోచింగ్ తీసుకుంటున్న బాలికలు ఫ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యమంటున్న అమ్మాయిలుభారత జట్టుకు ఎంపికవుతా.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన అక్షయ 10వ తరగతి చదువుతోంది. క్రికెట్పై మక్కువతో సూర్యాపేటలోని ఎస్వీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్రతిభ చాటుతోంది. 2024లో భద్రాచలంలో అండర్–17 ఎస్జీఎఫ్ స్టేట్మీట్లో ఆడి సత్తా చాటింది. ఈ ఏడాది ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి స్టేట్మీట్లో పాల్గొంది. ఈ ఏడాది జరగనున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) లీడ్ మ్యాచ్లో ఆడనున్నట్లు అక్షయ తెలిపింది. భారత జట్టుకు ఎంపిక కావడమే తన లక్ష్యమని అక్షయ పేర్కొంది. ఆల్ రౌండర్గా రాణిస్తా.. సూర్యాపేటకు చెందిన క్రికెట్ కోచ్ వాంకుడోతు సుధాకర్, రేణుక దంపతుల కూతురు కారుణ్యశ్రీ 5వ తరగతి చదువుతోంది. కారుణ్యశ్రీ తన తండ్రి పోత్సాహంతో చిన్ననాటి నుంచే బ్యాట్ పట్టింది. ఈ ఏడాది ఖమ్మంలో జరిగిన అండర్–17 స్టేట్మీట్లో ఆడి ఆల్ రౌండర్గా ప్రతిభ కనబరిచింది. త్వరలో జరగనున్న హెచ్సీఏ లీగ్స్ ఆడటానికి వెళ్లనున్నట్లు కోచ్ సుధాకర్ తెలిపారు. భవిష్యత్లో భారత జట్టుకు ఎంపికై ఫాస్ట్ బౌలర్గా ఆడటమే తన లక్ష్యమని చెబుతోంది.సూర్యాపేటలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం కోదాడ మండలం గుడిబండకు చెందిన లాస్యశ్రీ 9వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది జనవరిలో ఖమ్మం నగరంలో నిర్వహించిన స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడల్లో పాల్గొంది. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించింది. క్రికెట్లో రాణించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెబుతోంది లాస్యశ్రీ. సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్ కూతురు యోధ క్రికెట్లో రాణించేందుకు ప్రాక్టీస్ చేస్తోంది. యోధ ప్రస్తుతం 2వ తరగతి చదువుతోంది. బ్యాటింగ్, బౌలింగ్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది. త్వరలో లీగ్ మ్యాచ్లు ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది యోధ. నాన్న బాలునాయక్ ప్రోత్సాహంతో క్రికెట్ నేర్చుకుంటున్నానని..క్రికెటర్ శృతిమందన ఆడతానని చెబుతోంది. దేశం తరఫున ఆడిన అరుంధతి తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మారుమూల గ్రామంలోనే జన్మించినప్పటికీ తనలో ఉన్న ప్రతిభతో జాతీయస్థాయిలో తనదైన ముద్రవేసుకుంది తిరుమలగిరి(సాగర్)కు చెందిన అరుంధతిరెడ్డి. మహిళల క్రికెట్లో రాణిస్తూ.. ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. 2018లో ఐసీసీ మహిళా ఛాంపియన్ షిప్ భారత్ –శ్రీలంక టీ–20లో ఆమె దేశం తరఫున అరంగేట్రం చేసింది. ఎడమచేతి వాటం బౌలింగ్ చేస్తూ అటు బ్యాటింగ్లోనూ ప్రతిభ చూపి ఆల్ రౌండర్గా పేరు తెచ్చుకుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్–16 జట్టుకు కెప్టెన్గా, అండర్ – 17, అండర్– 19, అండర్– 23 జట్లలో ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. భారతీయ రైల్వేలో గ్రూప్–సీ ఉద్యోగిగా చేరి రైల్వే జట్టు తరుఫున క్రికెట్ ఆడుతోంది. తండ్రి శాగం వెంకట్రెడ్డి కూడా రైల్వే ఉద్యోగి కావడం గమనార్హం. డబ్ల్యూసీఎల్ జట్టుకు ఎంపిక హుజూర్నగర్కు చెందిన పచ్చిపాల మహేశ్వరి డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. రోజూ కోదాడ వచ్చి కోచ్ సిద్ధిఖ్ వద్ద క్రికెట్లో శిక్షణ పొందుతోంది. తండ్రి హుజూర్నగర్లో టీ స్టాల్ నడుపుతుండగా తల్లి గృహిణి. 2024 జూలైలో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ఉమెన్ క్రికెట్ లీగ్లో సెలక్షన్స్లో పాల్గొని అండర్–19 హైదరాబాద్ డబ్ల్యూసీఎల్ జట్టుకు ఎంపికై ంది. క్రికెట్లో మరింత సాధన చేసి భారత జట్టు తరఫున ఆడి పుట్టిన నేలకు మంచి పేరు తెస్తానంటోంది మహేశ్వరి.చిచ్చర పిడుగు యోధ..- 8లో -
No Headline
సాక్షి, యాదాద్రి : అవయవ దానం చేయడం ద్వారా తాము చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వివిధ కారణాలతో చావుకు దగ్గరైన వారి అవయవాలన దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకువస్తున్నారు. డాక్ట ర్లు, జీవన్దాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా అవయవదానంపై అవ గాహన పెరుగుతోంది. ఏడాదిలో ఎనిమిది బ్రెయిన్డెడ్ ఘటనలు చోటు చేసుకోగా మృతుల నుంచి సేకరించిన అవయవాల ద్వారా 21 మందికి పునర్మజన్మ కలిగింది. అవయవ దాతలు ● భూదాన్పోచంపల్లి మండలం రాంలింగంపల్లి రేషన్డీలర్ చేపూరి లక్ష్మయ్యచారి(55) బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యాడు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దాంతో కుటుంబ సభ్యులు లక్ష్మయ్య చారి అవయవాలను జీవన్ధాన్కు దానం చేశారు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న మరో నలుగురి ప్రాణాలు దక్కాయి. ● పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దేవరపల్లి మోహన్రెడ్డి(42) రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ తో మృతిచెందాడు. అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఐదుగురికి ప్రాణాలు నిలిపారు. ● భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన గుండ్ల ఎల్లారెడ్డి(68) శనివారం భువనగిరి పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. వైద్యుల సూచన మేరకు ఎల్లారెడ్డి కళ్లను హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు అప్పగించారు. ● వలిగొండ మండలం కంచెనపల్లికి చెందిన మెరుగు అంజయ్య బ్రెయిన్డెడ్కు గురయ్యాడు. వైద్యుల సూచన మేరకు అతని అవయవాలను దానం చేశారు.ఆరుగురి జీవితాల్లో వెలుగులు ఆలేరు మున్సిపాలిటీ బహుదూర్పేటకు చెందిన జంపాల సుజాత(40) ఇంట్లో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయారు. వెంటనే ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూనే బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఆమె భర్త జంపాల దశరథ, కుటుంబసభ్యుల అంగీకారంతో జీవన్దాన్ బృందం ఆమె నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తుల, రెండు కంటి కార్నియాలు సేకరించి అవసరం ఉన్న వారికి అమర్చారు. అవయవ దానంతో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా బాధ నుంచి ఉపశమనం కలిగిందని దశరథ చెప్పారు.ఫ అవయవదానంపై పెరుగుతున్న అవగాహనఫ వైద్యులు, జీవన్దాన్ సభ్యుల సూచనతో ముందుకొస్త్తున్న కుటుంబాలు -
ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది...
భువనగిరి: అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది. అయితే అది మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడురోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న అడవి దున్నను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులతో కలిపి 10 బృందాలను ఏర్పాటు చేశారు. అడవి దున్నకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు వరంగల్ జూపార్క్ నుంచి వైద్యులు కూడా వచ్చారు. శుక్రవారం భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచరిస్తున్నట్లు గుర్తించి వైద్యులు అడవి దున్నకు సమీపంలో నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో భయంతో అడవి దున్న అక్కడ ఉన్న గుట్టల పైన పరుగులు పెట్టి పడిపోయింది. మత్తుతో ఉన్న దున్నను వాహనంలోకి ఎక్కించే క్రమంలో పరిశీలించగా అది మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల నుంచి పరుగులు పెడుతున్న అడవి దున్న అప్పటికే అనార్యోగానికి గురికావడంతో పాటు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పరుగులు పెట్టడం వల్ల మృతిచెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి తెలిపింది. అడవి దున్నకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు. -
వంతెనకు మోక్షం ఎప్పుడు!
ఆలేరురూరల్ : ఆలేరు– కొలనుపాక వాగుపై ప్రతిపాదించిన వంతెన కలగానే మిగిలింది. ఏడాది క్రితం నిధులు మంజూరై కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం కుదిరినా పనుల్లో నేటికీ ముందడుగు పడలేదు. ఫలితంగా వరదొచ్చినా ప్రతీసారి ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాగు దాటుతున్న క్రమంలో ఎంతోమంది కొట్టుకుపోయారు. వంతెన నిర్మాణమే సమస్యకు పరిష్కారం అని తెలిసినా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. పలు జిల్లాలకు ప్రధాన మార్గంకొలనుపాక, రాఘవాపురం బైరాంనగర్, గ్రామాల్లో 2,500పైన కుంటుంబాలు ఉంటాయి. వీరంతా తమ అవసరాల నిమిత్తం ఆలేరు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. అంతేకాకుండా రాజాపేటతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట, పోచన్నపేట, చేర్యాల, సిద్ధిపేటకు ఇది ప్రధాన మార్గం. నిత్యం వందలాదిగా వాహనాలు వాగుపై నుండే రాకపోకలు సాగిస్తుంటాయి. రూ.4.50 కోట్లు మంజూరువంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణానికి జీఎచ్కే సంస్థతో 11 నెలల క్రితం ఒప్పందం కుదిరింది. కానీ, నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అధికారంలోకి వస్తే బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. సమస్యను ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోతున్నారు. 20 రోజులుగా వరద ఉధృతిమల్లన్నసాగర్ నుంచి కొంతకాలంగా గోదావరి జలాలు విడుదల చేస్తున్నారు. కొలనుపాక వాగులోకి పెద్ద ఎత్తున నీరు చేరుతుండడంతో కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితిలో వాగు దాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల మూడు రోజుల వ్యవధిలోనే ఐదుగురు వాగులో కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. జరిగిన ప్రమాదాల్లో కొన్ని ఇవీ.. ● ఉపాధ్యాయురాలు స్కూటీపై ఆలేరుకు వస్తూ వాగు దాటే క్రమంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ● శ్రీకాంత్ అనే యువకుడు బైక్తో సహా కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. ● బచ్చన్నపేటకు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా నీటి ఉధృతికి లోలెవల్ బ్రిడ్జిపై నుంచి దిగువకు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు వారిని రక్షించారు. ● కొలనుపాకకు చెందిన యువకుడు ఆలేరు వస్తుండగా బైక్తో సహా వాగులో పడిపోవడంతో గాయాలయ్యాయి. ● బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు స్కూటీపై వాగులో పడి గాయాలయ్యాయి, ● ప్రయాణికులతో వెళ్తున్న కొలనుపాకకు చెందిన ఆటో నీటి ఉధృతికి కొట్టుకపోయింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. ● ఆలేరుకు చెందిన సందెన రామనర్సయ్య, అతని భార్య లక్ష్మి బైక్పై పోచన్నపేటకు వెళ్లి వస్తుండగా వాగులో స్కూటర్తో సహా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్లో జనగాం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ●హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన దంపతులు మద్దూర్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా నీటి ఉధృతికి లోలెవల్ బ్రిడ్జి కిందకు కొట్టుకుపోయారు. ఇద్దరికీ గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ● యువకుడు ఆలేరు నుంచి కొలనుపాకకు వెళ్తుండగా వాగులో పడి కాలు విరిగింది.ఆలేరు – కొలనుపాక వాగుపై కలగానే హైలెవల్ బ్రిడ్జి ఏడాదిన్నర క్రితమే నిధులు మంజూరు నేటికీ మొదలు కాని పనులు వరదొచ్చినా వాగుదాటాల్సిందే ప్రమాదాల బారిన ప్రయాణికులువాగు దాటలేకపోతున్నాం గోదావరి జలాలు కొలనుపాక వాగు కల్వర్టుపైనుంచి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతవాసులం ఏచిన్న పనికై నా ఆలేరుకు వెళ్లాలి. వాగుదాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నాం. జనగామ, సిద్ధిపేట జిల్లాలకూ ఇది ప్రధాన మార్గం. వాగుపై వంతెన నిర్మించాలి. – గంగుల శ్రీనివాస్, ప్రయాణికుడు -
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తరం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. విలువలతో కూడిన విద్యను అందించాలి ఆలేరురూరల్ : విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించారు. శుక్రవారం ఆలేరులో వీఆర్ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని చదవాలన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి కలలను సాకారం చేస్తే సమాజం మీకంటూ గొప్ప పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.అయ్యప్ప, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, ఎంఏ ఎజాజ్, గందమల్ల అశోక్, ఎండీ సలీం, తుంగకుమార్, బుగ్గ నవీన్, ఉపాధ్యాయులు, కమలాకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
నామినేషన్లకు మిగిలింది ఒక్కరోజే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగింపు దశకు చేరుకున్నాయి. నామినేషన్లు వేసేందుకు ఒక్కరోజే గడువు ఉంది. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, ఈనెల 10వ తేదీతో ముగియనుంది. 8, 9తేదీల్లో రెండో శని, ఆది వా రం కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 10వ తేదీ ఒక్కరోజే నామినేషన్ల వేసేందుకు సమయం ఉంది. శుక్రవారం అత్యధిక నామినేషన్లునామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 17 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 13 మంది 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్సీ, టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి, టీచర్స్ జేఏసీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎస్.సుందర్రాజ్, ఏలె చంద్రమోహన్, దామెర బాబురావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్ పోలిపాక వెంకటస్వామి, చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న, జంగిటి కై లాసం నామినేషన్లు దాఖలు చేశారు. 11న పరిశీలనఈ నెల 10వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, 11న పరిశీలన ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10వ తేదీతో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు సెలవు కావడంతో నేడు, రేపు విరామం 11న నామినేషన్ల పరిశీలన శుక్రవారం నామినేషన్లు వేసిన ప్రధాన సంఘాల అభ్యర్థులుర్యాలీగా వచ్చిన అభ్యర్థులు ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి శుక్రవారం నల్లగొండ పట్టణంలో ర్యాలీలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఇక 10వ తేదీన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.