breaking news
Yadadri
-
దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు దోస్త్ రిజిస్ట్రేషన్ను జూన్ 25వరకు పెంచినట్లు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాహత్ఖానం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, తత్సమాన పరీక్ష పాసై, ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. భక్తులు వివిధ పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వన మహోత్సవానికి సిద్ధం కావాలిబొమ్మలరామారం: వన మహోత్సవంలో భాగంగా అధికారులు మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని జెడ్పీసీఈఓ శోభారాణి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్లోని నర్సరీని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. వన మహోత్సవంలో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి ఇంకుడుగుంత తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజాత్రివిక్రమ్, సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాష్రెడ్డి, ఈసీ పుష్ప, పంచాయతీ కార్యదర్శి హన్మాన్, ఎఫ్ఏ సంజీవ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలియాదగిరిగుట్ట రూరల్: గ్రామస్థాయి నుంచి మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని వీలీడ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అంబేద్కర్ అన్నారు. బోస్కో సేవా కేంద్రం, యాత్ర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో గురువారం జెండర్ సమానత్వం–మహిళా నాయకత్వం–సాధికారతపై మహిళా నాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీ లీడ్ ప్రోగాం కోఆర్డినేటర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సాధికారితకు యాత్ర సంస్థ ద్వారా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, రెండవ విడత శిక్షణ వచ్చే నెలలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు
మోటకొండూర్: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో సీఈసీ గ్రూప్ను అప్పాజిపేటకు గురుకుల పాఠశాలకు తరలించొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు ఝెల్లంల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ సీఈసీ గ్రూప్ను ఇక్కడే కొనసాగించాలన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పీసరి తిరుమలరెడ్డి, చిర్ర రవీందర్, పన్నాల చంద్రశేఖర్రెడ్డి, తండ కృష్ణగౌడ్, జోరుక ఎల్లేష్, ఆలేటి నాగరాజు, శనిగరం ప్రదీప్, దాసరి నాగరాజు పాల్గొన్నారు. ఫ బాలికల గురుకుల పాఠశాల ఎదుట బీజేపీ నాయకుల ధర్నా -
పేదలందరికీ సొంత ఇల్లు
సాక్షి, యాదాద్రి, తుర్కపల్లి: పేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో అర్హులైన 205 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఆకుల ఆగవ్వకు మొదటి ప్రొసీడింగ్ పత్రం అందజేశారు. అనంతరం వాసాలమర్రిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.22.500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇలా రాబోయే మూడున్నరేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని ఈ నెల 6న తిర్మాలపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారని చెప్పారు. మొదటగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి, 205 మంది లబ్ధ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనలతో భూభారతి– 2025 తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వాసాలమర్రిలో లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకునేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎంపీ కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఆలేరు అభివృద్ధిలో ముందుండేలా చూసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి సమస్య పరిష్కారానికి గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు. కలెక్టర్ హనుమంతరావు, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, అదనవు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావు, ఆర్డీఓ కృష్ణా రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ శ్రీరాములు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, నాయకులు నీలం సంజీవ రెడ్డి, జనగాం ఉపేందర్ రెడ్డి, దనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, రాజారాం నాయక్, పలుగుల శ్రీనివాస్, ఎలుగల రాజయ్య, బోరెడ్డి హనుమంతురెడ్డి, మహిపాల్ రెడ్డి, బాబు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ వాసాలమర్రిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భువనగిరి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని అధికారులకు సూచించారు. సానుకూలంగా స్పందించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. అంతకు ముందు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో చేస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామస్తుల ఆందోళనభువనగిరి మండలంలోని రాయగిరి గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 518లో ఉన్న 467 ఎకరాలు భూదాన్ భూములుగా రికార్డులో ఉండడంతో తాము అన్ని రకాలుగా నష్టపోతున్నామని వాపోయారు. తమ భూమి భూదాన్లో ఎలా నమోదు అయిందని అధికారులను నిలదీశారు. భూములకు సంబంధించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల అంశం హైకోర్టు పరిధిలో పెండింగ్ ఉందని ఆర్డీఓ కృష్ణారెడ్డి గ్రామస్తులకు తెలిపారు. కాగా.. గ్రామంలో మధ్యాహ్నం తర్వాత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. 119 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డి, రెవెన్యూ అధికారులు, రాయగిరి, వడాయిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
కొత్త అడ్మిషన్లు 4,884
అందరి సహకారంతోనే అడ్మిషన్ల సంఖ్య పెరిగింది కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లాలోని ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయడం, శ్రమించడం వల్లే ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించారు. – సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఫ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన నూతన ప్రవేశాలు ఫ గత సంవత్సరంతో పోలిస్తే 21 శాతం పెరుగుదల ఫ సత్ఫలితాలిచ్చిన బడిబాట ఫ 35,989కు చేరిన విద్యార్థుల సంఖ్యభువనగిరి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలతో పాటు బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభించారు. 14 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో 4,884 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 35,989 జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 35,558 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 484 ప్రాథమిక పాఠశాలు ఉండగా వీటిల్లో 14,195 మంది విద్యార్థులు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 3216 మంది విద్యార్థులు, 163 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 18,147 మంది విద్యార్థులున్నారు. మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 4453 విద్యార్థులు పరీక్షలకు హాజరై పాఠశాలలను వదిలి వెళ్లారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 31,105కు చేరింది. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందిన వారి సంఖ్య 4,884 మంది విద్యార్థులు కావడంతో ప్రస్తుతం మొత్తం 35,989కి చేరింది. దీంతో గత సంవత్సరం కంటే ప్రస్తుతం 431 మంది విద్యార్థులు అధికంగా పాఠశాలల్లో చేరారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఫలితాలిచ్చిన కార్యక్రమాలు ఇవీ.. ఫ డీఎస్సీ–2024 ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకం, బదిలీలు, పదోన్నతలు ప్రక్రియ చేపట్టి ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశారు. ఫ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఫ కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకుని పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో 500కు పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఫ ఈ సారి ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట ద్వారా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు సంవత్సరం విద్యార్థులు 2023 & 24 4,419 2024 & 25 4,040 2025 & 26 4,884 -
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేయడం, నూతన కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నారు. కాపుగల్లుకు చెందిన ముత్తవరపు భాస్కర్రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వరకు కోదాడలోని సెయింట్ జోసెఫ్ సీసీరెడ్డి పాఠశాలలో, ఇంటర్మీడియట్ విజయవాడలోని విశ్వశ్రీ కళాశాలలో , బీఫార్మసీని కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్గా, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్, పీఏసీఎస్ చైర్మన్ నంబూరి సూర్యం, రిటైర్డ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు, హనుమంతరావు, గ్రామస్తులు అభినందించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
భువనగిరి: మండలంలోని బండసోమారం గ్రామంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి యజమానులతో మాట్లాడారు. ఇళ్ల ఎలా ఉందని, ఇంటి కల నేరవేరిందా అని, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటి యాజమానులకు దస్తులు, గ్యాస్ స్టౌవ్ అందజేసి వారిని శాలువాలతో సన్మానించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు బర్రె జహంగీర్, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఫక్కీర్ కొండల్రెడ్డి, చిక్కుల వెంకటేశం, మాజీ సర్పంచ్ నానం పద్మ కృష్ణ, సురుపంగ అయిలయ్య, ఉప సర్పంచ్ యాట రాజు, దంతూరి శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. రోగులకు పండ్లు పంపిణీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకు ముందు ఆస్పత్రి ఆవరణలో కేట్కట్ చేసి స్వీట్లు అందజేశారు. -
పెండింగ్ సమస్యలకు మోక్షం కలిగేనా!
సాక్షి, యాదాద్రి : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ భూముల పంపిణీ, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కేటాయింపు, సబ్ ప్లాన్ నిధులతో పాటు అట్రాసిటీ కేసుల విషయంలో న్యాయం జరగడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం, శనివారం రెండు రోజులు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటించనున్న నేపథ్యంలో తమ సమస్యలు ఏ కరువు పెట్టేందుకు సంబంధిత వర్గానికి చెందిన నాయకులు సిద్ధమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో కేసులు పరిష్కరించాలని, వివిధ అభివృద్ధి పథకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, సబ్ప్లాన్ నిధులు, అట్రాసిటీ కేసుల విషయంలో సత్వర న్యాయం చేయాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి దళిత, గిరిజన సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం యాదగిరిగుట్టకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ వార్షికోత్సవంలో పాల్గొంటారు. కమిషన్ చైర్మన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజులు పర్యటించనున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఫ నేడు రాత్రి యాదగిరిగుట్టలో బస ఫ శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఫ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సమస్యలు ఏకరువు పెట్టేందుకు సిద్ధమవుతున్న నాయకులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఎస్సీ, ఎస్టీ కేసులకు సత్వర పరిష్కారం లభించడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి పదేళ్లవుతున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇంకా ఇక్కడ ఏర్పాటు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఉండడంతో బాధితులు అక్కడకు వెళ్లి రావడం అసౌకర్యంగా ఉంది. అత్యాచార బాధితుల కేసులో పరిహారాలు అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం ప్రొసీడింగ్స్కే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సుమారు రూ.50 లక్షల వరకు చెల్లించాల్సిన పరిహారం పెండింగ్లో ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కీంలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రతి సంవత్సరం 120 మంది విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తారు. నాలుగు సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. 2021 నుంచి ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు సంబంధించి ప్రోత్సాహకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 90 జంటలు కులాంతర వివాహాలు చేసుకోగా.. ప్రభుత్వం ఇచ్చే రూ. 2.50 లక్షల కోసం ఎస్సీ డెవలప్మెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఇవ్వాల్సిన సబ్సిడీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంది. -
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
మిర్యాలగూడ: ఆటో చోరీ కేసులో నిందితుడిని గురువారం దామరచర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన వెంపటి శ్రీనివాస్ ఈ నెల 7వ తేదీ రాత్రి 10గంటల సమయంలో తన ఆటోను తన దుకాణం ముందు ఉంచి ఇంటికి వెళ్లి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు ఈ నెల 11న వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పెల్లూరి ఆంజనేయులు గురువారం దామరచర్ల చెక్పోస్టు వద్ద దొంగిలించిన ఆటోలో వస్తుండగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పిడుగురాళ్లకు చెందిన కొండపల్లి ఆంజనేయులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
రెగ్యులర్ పద్ధతిన నియామకాలు చేపట్టాలి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిభారం తగ్గించేందుకు గాను ఖాళీగా ఉన్న పోస్టుల్లో రెగ్యులర్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని టీఎన్జీఓల సంఘం సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీష్ ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టలోని పాత గోశాలలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన దేవాలయాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు, పీఆర్సీ అనుమతించి, రాబోయే ప్రభుత్వ జీఓలో ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు. జీఓ నంబర్ 888ను దేవాలయాల్లో ఉన్న పోస్టులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సవరణ చేయాలని, జీఓ నంబర్ 261ని సవరించాలన్నారు. పదవీ విరమణ దగ్గర్లో ఉన్న ఉద్యోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను మానవతా దృక్ఫథంతో తమ తమ మాతృ సంస్థలకు బదిలీ లేదా డిప్యూటేషన్పూ పంపాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. అనంతరం ప్రధాన దేవాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొటున్న సమస్యల పరిష్కారం, ఉద్యోగులకు అవసరమ్యే అంశాలపై చర్చించారు. త్వరలోనే దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేష్బాబు, టీఎన్జీఓల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేష్, ముక్కెర్ల సత్యనారాయణ, జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, ఆయా దేవాలయాల అధ్యక్షులు వి. శ్రీనివాస్రెడ్డి (భద్రాచలం), కూరగాయల శ్రీనివాస్ (వేములవాడ), సుదర్శన్ (బాసర), మల్లికార్జునస్వామి (కొమురవెల్లి), చందు (కొండగట్టు), దూశెట్టి కృష్ణ, దయానంద్ (యాదగిరిగుట్ట), 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
వర్మీ కంపోస్టుతో అధిక దిగుబడి
ప్రభుత్వ బడిలో కుమారుడిని చేర్పించిన టీచర్నార్కట్పల్లి: నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ఆదిమల్ల మణిరాజ్ తన కుమారుడు సత్యరాజును అదే పాఠశాలలో 10వ తరగతిలో గురువారం చేర్పించారు. 9వ తరగతి ప్రైవేట్ స్కూల్లో చదివిన తన కుమారుడిని 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో మణిరాజును పాఠశాల ఉపాధ్యాయుల బృందం అభినందించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యా బోధన చేయనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు మల్లేపల్లి కాశయ్య తెలిపారు.గుర్రంపోడు : గతంలో రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. కాలానుగుణంగా పంటలు అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయన ఎరువులు వాడడం మొదలు పెట్టారు. రసాయన ఎరువుల మోతాదును పెంచుకుంటూ పోవడంతో ఏర్పడిన దుష్ఫలితాలను గ్రహించిన రైతులు మళ్లీ సేంద్రియం వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ ఎరువు వాడడం వల్ల రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువంటే పశువుల ఎరువే కాదు..జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, వర్మీ కంపోస్టు కూడా వస్తాయి. వర్మీ కంపోస్టు తయారీపై అనుముల ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి మురళి అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. రైతు మిత్రులుగా వానపాములు వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో తయారయ్యే వర్మీ కంపోస్టు ముఖ్యమైన సేంద్రియ ఎరువుగా చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి వానపాములను రైతు మిత్రులుగానే పరిగణిస్తాం. ఈ వానపాములు పాక్షికంగా కుళ్లిన వ్యర్థ పదార్థాలను తిని విసర్జించిన పదార్థాన్నే వర్మీ కంపోస్టు అంటారు. వర్మీ కంపోస్టు తయారీ విధానం ఫ మూడు అడుగుల వెడల్పుతో కావలసిన పొడువు వరకు ఒక్కో బెడ్ చొప్పున లభించే వ్యర్థ పదార్థాలు, స్థలాన్ని బట్టి బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ ఈ బెడ్ను వర్షపు నీరు, సూర్యరశ్మి, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడడానికి పైన తాటాకు పందిర్లతో లేదా రేకులతో కప్పు నిర్మించాలి. ఫ బెడ్ అడుగు భాగంలో సిమెంట్తోగాని, పేడతోగాని అలికి గట్టిగా ఉండేలా చూడాలి. ఫ అడుగు భాగం నుంచి 10 సెం.మీ ఎత్తు వరకు పాక్షికంగా కుళ్లిన వ్యర్థ పదార్థాలను వేయాలి. దీనిపై పలుచగా నీరు చల్లాలి. ఫ ఆ తర్వాత మళ్లీ మరో వరుస 15–30 సెం.మీ మందంలో సేంద్రియ వ్యర్థ పదార్థాలు, కుళ్లిన కూరగాయలు వేసుకోవచ్చు. దీనిపైన పలుచగా నీరు పెట్టి, వరి గడ్డితోగాని, పాత గోనె సంచులతోగాని కప్పి ఉంచాలి. ఫ ఈ బెడ్కు ప్రతిరోజు పలుచగా నీరు పెడుతూ ఒక వారం రోజుల తర్వాత ఒక చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున వదలాలి. ప్రతిరోజు నీరు పెడుతూ అప్పుడప్పుడు బెడ్ను కదిలించాలి. ఫ బెడ్లలో వేసిన వ్యర్థ పదార్థాలు అదే రూపంలో లేకుండా తేలికగా, నల్లగా, వాసన లేకుండా ఉండే పదార్థంగా ఏర్పడినట్లయితే వర్మీ కంపోస్టు తయారైనట్లుగా భావించవచ్చు. ఫ ఈ దశలో నీరు పెట్టడం ఆపేస్తే వానపాములన్నీ బెడ్ల అడుగు భాగానికి చేరుతాయి. ఫ ఆ తర్వాత పైన ఉండే వర్మీ కంపోస్టును జల్లడ పట్టినట్లయితే వర్మీ కంపోస్టు వస్తుంది. ఫ అనంతరం వానపాములను మరో బెడ్లోకి వదలాలి. జాగ్రత్తలు ఫ సేంద్రియ వ్యర్థ పదార్థాలు వేసేటప్పుడు దానిలో ప్లాస్టిక్ కవర్లు, గాజు పెంకులు వంటివి లేకుండా చూసుకోవాలి. ఫ బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్మీ కంపోస్టు వల్ల ఉపయోగాలు ఫ నేలలో సేంద్రియ కర్భనం పెంచుతుంది. ఫ భూ భౌతిక రసాయన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఫ భూసారాన్ని పరిరక్షిస్తూ ఉత్పాదకతను పెంచుతుంది. ఫ భూమిలో గాలి ప్రసరణ, నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం పెంచుతుంది. ఫ పోషకాల లభ్యత పెంచడంలో మొక్క సులభంగా గ్రహించడంలో తోడ్పతుంది. ఫ పండ్ల తోటల్లో ఒక చెట్టుకు 5 కిలోలు, పూల కుండీల్లో 250 గ్రాములు వర్మీ కంపోస్టు వాడుకోవచ్చు. -
ట్రాక్టర్ తిరగబడడంతో రైతు మృతి
తిప్పర్తి: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడడంతో రైతు మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో గురువారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి వెంకట్రెడ్డి(51) ట్రాక్టర్తో గురువారం పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది. బురదలో నుంచి ట్రాక్టర్ను బయటకు తీసే క్రమంలో ట్రాక్టర్ తిరగబడింది. దీంతో వెంకట్రెడ్డి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాంమూర్తి తెలి పారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ పైనుంచి పడి.. నూతనకల్: ట్రాక్టర్ పైనుంచి పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన నూతనకల్ మండలం పరిధిలోని పెద నెమిల గ్రామ పంచాయతీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నెమిల గ్రామ పంచాయతీకి చెందిన గంగుల వీరస్వామి(50) అదే గ్రామానికి చెందిన జెన్నారెడ్డి వివేక్రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం వ్యవసాయ పొలంలో వీరస్వామి ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా.. బండ రాయిని ఎక్కడంతో అదుపుతప్పి వీరస్వామి ట్రాక్టర్పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
భక్తులకు అభిషేక జల సంప్రోక్షణ, హారతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రధానాలయంలో అభిషేక జల సంప్రోక్షణ, హారతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆలయ ప్రధానార్చకులకు, అధికారులకు ఈఓ వెంకట్రావ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆలయ అధికారులు, అర్చకులతో ఈఓ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్వామివారి అంతరాలయములో వెళ్లే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరిస్తేనే అనుమతి ఇవ్వాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు స్వయంగా వస్తేనే ప్రొటోకాల్ దర్శనం కల్పించబడుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రొటోకాల్ దర్శనము వారందరూ టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భక్తుల్లో భక్తి భావం పెంపొందించేందుకు శ్లోకములు, వాటి అర్థాలను వివరిస్తూ బోర్డులు, పెయిటింగ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా దేవస్థాన భద్రతకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు దయాకర్రెడ్డి, రామారావు, రాజన్బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. ఫ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావ్ -
అధ్వానంగా కాల్వలు
సీసీ లైనింగ్తో ఆధునీకరించాలి శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలను సీసీ లైనింగ్తో పూర్తిస్థాయిలో ఆధనీకరించాలి. అప్పుడు ప్రాజెక్టు సాగునీరు వృథాకావడం, అక్రమంగా నీటిని ఎగువకు తరలించడం పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. పేరుకే ప్రాజెక్టు ఆయకట్టులో ఉన్నాం. కానీ ఏనాడు చివరి భూములకు సాగునీరందిన దాఖలాలు లేవు. – కట్ట వెంకట్రెడ్డి, రైతు, అడ్లూరు పూడికతీతకు నిధులు లేవు శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీసేందుకు నీటిపారుదలశాఖలో నిధులు లేవు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే తప్ప ప్రత్యేకంగా నిధులు వెచ్చించే పరిస్థితి నీటిపారుదలశాఖకు ఉండదు. ప్రస్తుతం వానాకాలం సాగు నేపథ్యంలో రైతులే తమ సొంత ఖర్చులతో కాల్వల్లో పూడికతీత పనులు చేయించుకోవాలని కోరుతున్నాం. – సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈఈ, శాలిగౌరారం ప్రాజెక్టు శాలిగౌరారం: ఉమ్మడి జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు అధ్వానంగా మారాయి. ప్రధాన కాల్వలు దెబ్బతినడం, ప్రధాన కాల్వలపై ఉన్న పంట కాల్వల తూములు, షట్టర్లు పూర్తిగా ధ్వంసం కావడంతో సాగునీరు వృథాగాపోతుంది. అంతేకాకుండా కాల్వల్లో కంపచెట్లు, చెత్తాచెదాం నిండడడంతో ఆయకట్టు చివరికి సాగునీరందడం కష్టంగా మారుతోంది. దీంతో ఆయకట్టు చివరి భూముల రైతులు సాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి నిల్లవ సామర్ధ్యంతో 6వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 19 అడుగుల మేర నీరు ఉంది. సాగునీరందేది 6 కి.మీ. మాత్రమే.. శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల మొత్తం పొడవు 12 కిలోమీటర్లు. అందులో కుడి కాల్వ పొడవు 6.5 కిలోమీటర్లు, ఎడమ కాల్వ పొడవు 5.5 కిలోమీటర్లు. దశాబ్దాల కాలంగా ప్రధాన కాల్వలు మరమ్మతులకు నోచుకోకవడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఒకొక్క కాల్వ ద్వారా గరిష్టంగా 3 కిలోమీటర్ల వరకు కూడా సాగునీరు ప్రవహించని పరిస్థితి. ప్రధాన కాల్వల వెంట అక్రమంగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతానికి నీటిని తరలించడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. మురుగునీటితో కష్టంగా పూడికతీత.. కుడి, ఎడమ ప్రధాన కాల్వలు నిత్యం డ్రెయినేజీ నీటితో నిండి ఉంటున్నాయి. కుడి కాల్వలోకి తిరుమలరాయునిగూడెం, బాలిశెట్టిగూడెం, మార్కెట్కాలనీ, పావురాలగూడెం గ్రామాల నుంచి డ్రెయినేజీలను కలిపారు. అదేవిధంగా ఎడమ కాల్వకు రామగిరి గ్రామం నుంచి వచ్చే డ్రెయినేజీని కలిపారు. దీంతో కుడి, ఎడమ కాల్వలు నిత్యం మురుగునీటితో నిండి ఉండటంతో కనీసం ఉపాధి హామీ పథకంలో భాగంగా కాల్వలను పూడిక తీసేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. రైతులు సొంత ఖర్చులతో జేసీబీల సహాయంతో కాల్వలలో పూడిక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ కంప చెట్లు, చెత్తాచెదారం, మురుగునీటితో నిండిన శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు ఫ ఆందోళనలో ఆయకట్టు చివరి రైతులు -
భువనగిరి ఖిలా టికెట్ ధరలు పెంపు
భువనగిరి: భువనగిరి ఖిలా సందర్శనకు టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఖిలా సందర్శనకు గాను పెద్దలకు గతంలో రూ.10 టికెట్ ఉండగా.. ప్రస్తుతం రూ. 20కు పెంచారు. అదేవిధంగా పిల్లలకు గతంలో రూ.5 టికెట్ ఉండగా.. ఇప్పుడు రూ.10కు పెంచారు. మిగిలిన ధరలు యాథావిధిగా ఉన్నాయి. గతంలో సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు వెళ్లేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చిన ఆదాయాన్ని మ్యూజియం నిర్వహణ, రికార్డుల నిర్వహణ కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల అడ్డగింతఆత్మకూర్ (ఎస్): ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామం నుంచి సూర్యాపేటలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల బస్సులు తమ గ్రామానికి రావొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పిలిపించి కొందరు గ్రామస్తులు తమ పిల్లలకు ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్షరామగిరి(నల్లగొండ): నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను నల్లగొండ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గురువారం ఒక రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదాబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి
మునగాల: రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య డిమాండ్ చేశారు. గురువారం మునగాల మండలంలోని కొక్కిరేణి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12వేల ఆర్తికసాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి.. 16నెలలు గడుస్తున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని, భూభారతిలో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ భూములన్నింటిని పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పంచాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు కొదమగుండ్ల నగేష్, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సొంపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, గుంజ వెంకటేశ్వర్లు, షేక్ సైదా హుస్సేన్, నారసాని వెంకటేశ్వర్లు, జంపాల స్వరాజ్యం, గుండు సైదులు, ఆరె రామకృష్ణారెడ్డి, దోసాపాటి భిక్షం పాల్గొన్నారు. ఫ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
సూర్యాపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన ఇటికాల ఫణిచంద్, కోదాడకు చెందిన నాగేంద్రబాబు, మరో ఇద్దరు బాలురు జల్సాలకు అలవాటుపడి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు కోదాడ పట్టణానికి రాగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఎనిమిది తులాల బంగారం, బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫణిచంద్ వివిధ పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లి కూడా వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఫణిచంద్, నాగేంద్రబాబును రిమాండ్కు తరలించగా.. ఇద్దరు బాలురను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుక్ను కోదాడ పోలీసులను ఎస్పీ అభినందించారు ఫ నలుగురు దొంగల అరెస్ట్ -
కొత్తగా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచాలన్న నిబంధన ఉంది. అయితే, 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెండు రోజుల కిందట గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. అదనంగా ఏమీ పెరుగలేదు. అప్పట్లో రామన్నపేట నియోజకవర్గం రద్దయి, కొత్తగా హుజూర్నగర్ ఏర్పడగా, చలకుర్తి నియోజకవర్గం స్థానంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జనాభా 50 లక్షల వరకు పెరిగినట్లు అంచనా. దాని ప్రకారం మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు, రాజకీయ నేతలు చెబుతున్నారు. జిల్లా పరిధి మారకుండా పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజనను భౌగోళిక అంశాలు, పరిపాలన సౌలభ్యం పరిగణనలోకి తీసుకొని ఆ జిల్లాల్లోనే నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలు ఉండేలా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని మండలాలు ఒక జిల్లా పరిధిలో ఉండగా, మరికొన్ని మండలాలు మరో జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో ఉన్నాయి. రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, శాలిగౌరారం మండలాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు అదే జిల్లాలో ఉండేలా పునర్విభజన చేసే అవకాశం ఉంది. మరోవైపు 2027లో పూర్తయ్యే జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం జనాభా ప్రతిపాదికనా.. లేక ఓటర్ల ప్రాతిపదికన నియోజక వర్గాలను ఏర్పాటు చేస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది. తెరపైకి పాత నియోజకవర్గాలు.. గతంలో రద్దయిన పాత నియోజకవర్గాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. 2027లో జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. అయితే మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నందున అందులో తిరిగి రద్దయిన పాత నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో అర్బన్, రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారన్న చర్చ జరగుతోంది. నల్లగొండ అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా.. నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడతాయన్న చర్చ గత కొంత కాలంగా సాగుతోంది. నల్లగొండ పట్టణంలో రెండు లక్షలపైగా జనాభా, 1.20 లక్షల వరకు ఓటర్లున్నారు. నల్లగొండ పట్టణంతో పాటు రూరల్ మండలం కలుపుకుని నల్లగొండ అర్బన్ ని యోజక వర్గంగా ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలను కలుపుకొని నల్లగొండ రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చనే చర్చ సాగుతోంది. నాగారం కూడా.. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారంను కూడా నియోజకవర్గం చేస్తారనే చర్చ జరుగుతోంది. నాగారం గతంలో నియోజవర్గంగా ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎ.రంగారెడ్డి గెలుపొందారు. అయితే 1966లో ఆ నియోజకవర్గం రద్దయి, తుంగతుర్తి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ దానిని ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. నాగారంను తిరిగి నియోజకవర్గంగా చేయాల్సి వస్తే నాగారం, అడ్డగూడురు, తిరుమలగిరి, అర్వపల్లి మండలాలతో చేసే అవకాశం ఉంది. సూర్యాపేట అర్బన్.. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట టౌన్తో పాటు రూరల్ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. సూర్యాపేట రూరల్ నియోజకవర్గాన్ని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే నాగారం నియోజకవర్గం ఏర్పాటైతే సూర్యాపేట రూరల్ నియోజకవర్గం ఉండకపోవచ్చని, సూర్యాపేట రూరల్ ఉంటే నాగారం నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉండదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్లుమోత్కూరు, చౌటుప్పల్ నియోజకవర్గాలకు డిమాండ్ చౌటుప్పల్, మోత్కూరు కేంద్రాలుగా నియోజకవర్గాల డిమాండ్ వస్తోంది. మోత్కూరు నియోజకవర్గం అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, ఆత్మకూర్(ఎం), వలిగొండ, మోటకొండూరు మండలాలతో ఏర్పాటు చేయాలని మోత్కూరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. తమ ప్రాంతాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో కలపడం వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. మరో వైపు డివిజన్ కేంద్రమైన చౌటుప్పల్ను నియోజకవర్గ కేంద్రం చేయాలన్న చర్చ కూడా జరగుతోంది. 33 శాతం మహిళా రిజర్వేషన్ కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాల పునర్విభజనతోపాటు 33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్రం చర్యలు చేపడుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని కచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోనూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు మహిళలకే దక్కనున్నాయి. -
‘ధర్మారెడ్డిపల్లి’కి కదలికొచ్చింది
కాల్వ ఆధునీకరణ పనులు పరుగులు ఫ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ ఫ పురోగతిలో 108 వంతెనలు ఫ వెల్లంకి శివారులో వందల సంఖ్యలో కార్మికులతో క్యాంపులు ఫ డిసెంబర్ నెలాఖరు వరకుపనులు పూర్తయ్యేలా ప్రణాళిక ఫ రూ.123.98 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాల్వ స్వరూపం నీఇ సామర్థ్యం 50 నుంచి 208 క్యూసెక్కులకు పెంపు పొడవు 51.51 కి.మీ పూర్తయినది 29.72 కి.మీ కాల్వ పరిధిలోని మండలాలు : వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి గ్రామాలు 40 చెరువులు 41నిర్మిస్తున్న వంతెనలు 108ఆయకట్టు 17,787 ఎకరాలురామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలో 17,787 ఎకరాలకు సాగు నీరందించే పనులు మొదలయ్యాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో 51.51 కి.మీ మేర కాల్వ విస్తరించి ఉంది. అదనపు ఆయకట్టు స్థిరీకరించి సాగునీరు అందించేలా కాల్వను డిజైన్ చేశారు. పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పెరిగిన కాల్వ సామర్థ్యం ధర్మారెడ్డిపల్లి కాలువ పాత సామర్థ్యం 50 క్యూసెక్కులు. స్థిరీకరించిన ఆయకట్టు 5,126 ఎకరాలు. అధనంగా 12,661 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాల్వ సామర్థ్యాన్ని 208 క్యూసెక్కులకు పెంచుతూ ఇరిగేషన్ శాఖ అధికారులు డిజైన్ రూపకల్పన చేశారు. ధర్మారెడ్డిపల్లి కత్వ 0 కి.మీ నుంచి 12.41 కి.మీ (గోకారం చెరువు) వరకు కాల్వ అడుగుభాగం 10 మీటర్ల వెడల్పు (బెడ్విడ్త్), అక్కడి నుంచి చిట్యాల మండలం శివనేని గూడెం వరకు మహాలింగం చెరువు (45.10కి.మీ)వరకు అడుగుభాగం 6 మీ, శివనేనిగూడెం నుంచి ఏపీ లింగోటం (51.51) వరకు అడుగుబాగం 3 మీటర్ల ఉండే విధంగా కాల్వను తవ్వడం ప్రారంభించారు. కాల్వ విస్తరణలో భాగంగా 108 చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. కాల్వ మొత్తం పొడవు 51.51 కి.మీ కాగా.. గతంలో 29.72 కి.మీ మేర విస్తరణ పనులు పూర్తయ్యాయి. 113.09 ఎకరాల భూమి సేకరించి రైతులకు రూ రూ.1.50 కోట్ల పరిహారం చెల్లించారు. మరో 24.20 ఎకరాలను సేకరించే పనులు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన కొందరు రైతుల పరిహారం డబ్బులు ఆర్డీలలో జమ చేశారు. కాల్వ ఆధునీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.123.98 కోట్లు మంజూరు చేసింది. గడువుకు ముందే పూర్తి చేస్తాం ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల ప్రగతిని అధికా రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైతులు సహకరిస్తున్నారు.కాల్వ తవ్వకం, సిమెంట్ కాంక్రీట్ పనులు ఏకకాలంలో పూర్తి కానున్నాయి. మిగిలిన భూ సేకరణ, రైతులకు పరిహారం చెల్లింపులు జరుగుతున్నాయి. నిర్ణీత గడువుకంటే ముందే పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. –కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ ముమ్మరంగా పనులు ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెల్లంకి, సిరిపురం, వనిపాకల శివారులలో పదకొండు భారీ యంత్రాలు రాత్రింభవళ్లు పనిచేస్తున్నాయి. ఐబీ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. వెల్లంకి శివారులో వందల సంఖ్యలో కార్మికులతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. కాల్వ తవ్వకం పనులకు అడ్డుగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ షిప్ట్ చేస్తున్నారు. యాసంగి సీజన్ నాటికి సాగునీరు అందుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. -
వాసాలమర్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
తుర్కపల్లి: వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం తుర్కపల్లి మండలం వాసారాలమర్రి గ్రామానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రి పునర్ నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, తిరుమలాపూర్ సభలోనూ గ్రామ అభివృద్ధిపై ప్రస్తావించారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో గ్రామ పునర్నిర్మాణానికి పునాది వేస్తామని చెప్పారు. 227 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, లబ్ధిదారులందరికీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతులమీదుగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తారని వెల్లడించారు. మొదట ఆకుల ఆగవ్వకు ప్రొసీడింగ్ కాపీ అందజేస్తామన్నారు. ఇందిరమ్మ గృహాలే కాకుండా పాఠశాలలు, రోడ్లను అభివృద్ధి చేస్తామని, మైలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్య మహేందర్రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాయకులు దనావత్ శంకర్నాయక్, చాడ భాస్కర్రెడ్డి, గడిమీది నిఖిల్, బాబు, దుర్వాసులు, రాజారాం నాయక్, భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాక ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బండసోమారంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించనున్న మంత్రి భువనగిరి : మండలంలోని బండసోమారం గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు గ్రామానికి చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాకు బయలుదేరి వెళ్తారని వివరించారు. -
భూ భారతితో సమస్యలు సత్వర పరిష్కారం
యాదగిరిగుట్ట: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధి యాదగిరిపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి భూ సమస్యలపై తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామగ్రామన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు సహకరించేందుకు సదస్సుల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. యాదగిరిపల్లికి చెందిన దండు విజయలక్ష్మి భూమిని ఆమెకు తెలియకుండా రికార్డులనుంచి తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు మిట్ట వెంకటయ్యగౌడ్, సీస కృష్ణ, బరిగే రాంచందర్ విన్నవించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్, డీటీ సత్యం, ఆర్ఐలు పాల్గొన్నారు. -
రైతు భరోసా.. ఇదేమి గోస!
మూడు ఎకరాల్లోపే ఉన్నా అందని పెట్టుబడి సాయం మూడు రోజుల్లో రూ.122 కోట్లు .. భువనగిరిటౌన్ : రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,84,250 మంది రైతులు ఉండగా రూ.317.57 కోట్లు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరిలో మూడు ఎకరాల్లోపు ఉన్న 1,68,349 మంది రైతులకు బుధవారం వరకు రూ. 122 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. యాదగిరిగుట్ట రూరల్: మూడు ఎకరాల్లోపే ఉన్నా రైతు భరోసా డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మూడెకరాల్లోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ కొందరి ఖాతాల్లో సగం నగదే జమ కాగా, మరికొందరికి అసలే అందలేదు. దీంతో వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులకు వచ్చి అధికారులను సంప్రదిస్తున్నారు. టీజీబీలో ఎక్కువ మంది బాధితులు ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో ఖాతాలున్న రైతుల్లో చాలా మందికి రైతుభరోసా డబ్బులు జమకాలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు పేరును గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చారు. నూతన ఐఎఫ్ఎస్ కోడ్ అమలు చేసింది. ఈ కారణంగా టీజీబీలో ఖాతా ఉన్న రైతులకు రైతుభరోసా డబ్బులు జమకాలేదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదంటున్నారని రైతులు చెబుతున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు పూర్తిస్థాయిలో రైతుభరోసా డబ్బులు జమకాలేదు. యాదగిరిగుట్టకు చెందిన పంజాల సురేష్ అనే రైతుకు ఎకరం 30 గుంటల భూమి ఉండగా 52 గుంటలకు మాత్రమే రైతుభరోసా వచ్చింది. గత ప్రభుత్వం మొత్తం భూమికి వచ్చిందని, రెండు దఫాలుగా పూర్తిస్థాయిలో రావడం లేదని, అధికారులు తమకు తెలియదని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఫ కొందరికి సగం, మరికొందరికి అసలే జమకాని నగదు ఫ వ్యవసాయ, బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్న రైతులు -
అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన
నల్లగొండ టూటౌన్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని అన్నారు. ఒక్కో రైతుకు పాత బకాయి రూ.30వేలు ఉందని, ఇలా గత యాసంగిలో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.800కోట్లు రైతు భరోసా నిధులు బాకీ పడ్డారని తెలిపారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా రైతులకు ఇప్పించే బాధ్యత జిల్లా మంత్రులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాకు కాంగ్రెస్ మంత్రులు చేసిందేమీ లేదని, చేతగాని మంత్రులుగా మిగిలిపోయారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కబ్జాలు, ఆక్రమణలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. వారికి కమీషన్లు వచ్చే పనులను పట్టుకుని ముఖ్యమంత్రి చుట్టూ తిరిగేందుకు సమయం సరిపోతలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేస్తున్న విచారణ ఓ బూటకమని, ఫార్ములా–ఈ కేసులో ఏం జరగకపోయినా కేటీఆర్పై కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు, విచారణ అంటూ వేధిస్తున్నారని అన్నారు. కేటీఆర్పై ఇప్పటి వరకు 14 కేసులు అక్రమంగా పెట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడదని, ప్రజల తరఫునన ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, హామీల అమలుపై పోరాటమని చేస్తామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫ గత యాసంగిలో రైతులకు రూ.800 కోట్లు బాకీ పడ్డారు ఫ కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్కు నోటీసులు ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
సీఈసీ గ్రూప్ అప్పాజిపేటకు తరలింపు
మోటకొండూర్: మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సీఈసీ గ్రూప్ను నల్లగొండ మండలంలోని అప్పాజిపేటలో గల బాలికల గురుకుల పాఠశాలకు తరలిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటకొండూర్ గురుకుల పాఠశాలలో గతేడాది బైపీసీ, సీఈసీ, ఎంపీసీ గ్రూప్లలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యను బోధించారు. కాగా ఈ సంవత్సరం అడ్మిషన్ల సమయంలో కూడా ఆన్లైన్లో ఇంటర్ సీఈసీ మోటకొండూర్ చూపించడంతో విద్యార్థులు ఆప్షన్ ఇచ్చుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు మాత్రం నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గురుకుల పాఠశాలలో సీఈసీ బోధన ఉంటుందని ప్రిన్సిపాల్ జ్యోతి చెబుతున్నారు. ఇంటర్ సీఈసీ సబ్జెక్ట్లు బోధించడానికి సరైన ఫ్యాకల్టీ, తరగతి గదులు లేవని దీంతో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సీఈసీని అప్పాజిపేటలోని గురుకులంలో నిర్వహిస్తారని ఆమె తెలిపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్లో చూపించకుండా అక్కడే చూపిస్తే మేము ఆప్షన్ పెట్టుకోకుండా ఉండేవారమని, అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం కూడా ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫ మోటకొండూర్ బాలికల గురుకుల పాఠశాల నుంచి తరలించడంతో విద్యార్థినులకు ఇబ్బందులు -
గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో లాభాలు పొందవచ్చు
గరిడేపల్లి: గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకుని రైతులు అధిక లాభాలు పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎ. మరియాదాస్ అన్నారు. బుధవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వేర్హౌజ్ డెవలప్మెంట్ రెగ్యూలేటరీ యాక్ట్, నెగోషియబుల్ వేర్హౌజ్ రిసిప్ట్పై రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యాజమానులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరియాదాస్ పాల్గొని మాట్లాడారు. రైతులు ధాన్యం నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే 10 నుంచి 30శాతం ధాన్యం చీడ పురుగులు, ఎలుకల వల్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. ధాన్యం నిల్వపై ప్రతిఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం రైతులను నేరేడుచర్లలోని స్టేట్ వేర్హౌజింగ్ కార్పొరేషన్ గిడ్డంగుల సంస్థకు తీసుకెళ్లి ధాన్యం నిల్వ గురించి ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి. ఆదర్శ్, ఎ. కిరణ్, టి. మాధురి, సీహెచ్. నరేష్, రైతులు పాల్గొన్నారు. ఫ జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ మరియాదాస్ -
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
హుజూర్నగర్: ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసి ఇస్తానని అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హుజూర్నగర్ సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడ కృష్ణలంకకు చెందిన చింతల సురేష్బాబు ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే అమాయకులు, వృద్ధులు, మహిళల ఏటీఎం కార్డులను తీసుకొని దాని స్థానంలో నకిలీ కార్డును వారికి ఇచ్చి.. ఆ తర్వాత వారి అసలు ఏటీఎం కార్డులను ఉపయోగించుకొని డబ్బులు కాజేస్తున్నాడు. గతేడాది నవంబర్ 19న హుజూర్నగర్కు చెందిన మంద విజయ కరుణ పట్టణంలోని ఓ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ఇతడి సహాయం కోరగా ఆమె చెప్పిన పిన్ నంబర్ ఉపయోగించి డబ్బులు డ్రా చేసి ఆమెకు డబ్బులతో పాటు నకిలీ ఏటీఎం కార్డును చేతిలో పెట్టి నిజమైన కార్డును తీసుకొని వేరే ప్రదేశాల్లో రూ.1.25 లక్షలు డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సురేష్బాబుపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద సురేష్బాబు అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 44 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న ఏఎస్ఐ బలరామిరెడ్డి, కానిస్టేబుళ్లు వరప్రసాద్, నాగరాజును సీఐ అభినందించారు. -
‘దోస్త్’ రిజిస్ట్రేషన్కు నేడే చివరి తేదీ
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ఫస్టియర్లో చేరేందుకు గాను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్)లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గురువారం చివరి తేదీ అని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ ఖానం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ, బీజెడ్సీ, డైరీ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామికి బుధవారం 108 బంగారు అష్టదళ పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహరతుల సమర్పణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలు మృతిచిలుకూరు: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తమ్మనబోయిన శంకర్ మాతృమూర్తి తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం అనారోగ్యంతో మృతిచెందింది. ఆమెకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. వెంకమ్మ కుటుంబంలో కుమారులు, కుమార్తెలు, మనమలు, మనవరాళ్లు, ము ని మనవళ్లు, ముని మనవరాళ్లు కలిపి 60 మంది ఉన్నారు. వెంకమ్మ ఎలాంటి దీర్ఘకాలిక వ్యా దుల బారిన పడకుండా వందేళ్లకు పైగా జీవించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఎదురెదురుగా ఢీకొన్న ఆటో, ఆర్టీసీ బస్సుఫ ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్లు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన ఉప్పుల శ్రీశైలం ఆటోలో పాల డబ్బాలతో సూర్యాపేటకు వెళ్తుండగా.. నెమ్మికల్లు గ్రామంలో సూర్యాపేట నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
స్పిల్వేను పరిశీలించిన నిపుణులు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాం స్పిల్వేను మరమ్మతుల నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినప్పుడు అధిక ఒత్తిడితో స్పిల్వే మీద నుంచి జారి బక్కెట్ పోర్షన్ తాకి ఎగిసిపడతాయి. సుమారు 300 నుంచి 350 మీటర్ల ఎత్తు నుంచి అధిక ఒత్తిడితో నీరు పడటం కారణంగా స్పిల్వేపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వీటిని ప్రతి సంవత్సరం మరమ్మతులు చేపట్టకపోతే డ్యాం పటిష్టతకు ఆటంకం ఏర్పడుతుంది. సాగర్ డ్యాం స్పిల్వే మరమ్మతులకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఎంత ఖర్చు చేసినా ప్రతి ఏడాది క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల చేసిన తర్వాత స్పిల్వే దెబ్బతినడం.. మరలా మరమ్మతులు చేపట్టడం సర్వసాధారణమైంది. గతేడాది కూడా రూ.20కోట్లతో స్పిల్వేకు మరమ్మతులు చేపట్టారు. కానీ నీటి విడుదల తర్వాత స్పిల్వే దెబ్బతిని గుంతలు ఏర్పాడ్డాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నిపుణుల కమిటీ సమావేశమై శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంవైకే ఆర్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు కులదీప్ తివార్, ఏఎన్ శ్రీకాంత్రాజ్, ఆదిత్య విక్రం వర్మ, సుజిత్ చంద్ర, ఎంజీ ప్రశాంత్లు డ్యాంను సందర్శించి స్పిల్వేను పరిశీలించారు. వీరితో పాటు సాగర్ డ్యాం ఇన్చార్జి ఎస్ఈ మల్లిఖార్జునరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ సత్యనారాయణ ఉన్నారు. స్పిల్ వే మరమ్మతులకు ఎలాంటి మెటిరీయల్ను వినియోగించాలి, వాటి సామర్థ్యం ఎంతమేరకు తట్టుకోగలదు వంటి విషయాలపై అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా ఎంవైకే కంపెనీ ప్రతినిధులు సాగర్ స్పిల్వేను పరిశీలించారు. ఈ బృందం పూర్తిస్థాయి నివేదికను ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులకు అందజేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి, అందుబాటులో ఉన్న కాలాన్ని బట్టి స్పిల్వేకు మరమ్మతులు నిర్వహించనున్నారు. వీరి ప్రతిపాదనలను ప్రభుత్వం ఒప్పుకుంటే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు సమయం సరిపోదు కాబట్టి దెబ్బతిన్న స్పిల్వేపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేపట్టనున్నారు. జలాశయం నిండి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల పూర్తయిన తర్వాత మరమ్మతులు చేసిన స్పిల్వే గుంతలు నీటి ప్రవాహాన్ని ఒత్తిడిని తట్టుకుని ఉండగల్గితే అప్పుడు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. ఫ సాగర్ డ్యాం ఇంజనీర్లతో కలిసి మరమ్మతులపై అధ్యయనం -
తప్పు అధికారులది.. శిక్ష వినియోగదారుడికి..
నల్లగొండ: విద్యుత్ శాఖ అధికారులు చేసిన తప్పిదానికి వినియోగదారుడు బలైన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. గృహ వినియోగానికి.. కమర్షియల్ విద్యుత్ మీటర్ అమర్చడంతో ఒక్క నెలలోనే రూ.1.50లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఇదేమిటని సదరు వినయోగదారుడు విద్యుత్ అధికారుల వద్దకు వెళ్తే.. కమర్షియల్ మీటర్ తీసేసి గృహానికి సంబంధించిన మీటర్ పెట్టారు. కానీ పాత బిల్లు సరిచేస్తామని చెప్పిన అధికారులు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదు. తాజాగా బిల్లు మొత్తం చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఐదేళ్లుగా కాలయాపన.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విల్లాస్లో నివాసముంటున్న మేడి లింగయ్య అలియాస్ లింగస్వామి ఇంటికి 2014లో (సర్వీస్ నంబర్ 0401402486) కమర్షియల్ మీటర్ను విద్యుత్ అధికారులు పెట్టారు. అయితే లింగయ్య పని నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాడు. ప్రతి నెల నల్లగొండకు వచ్చినప్పుడల్లా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నా కూడా కడుతూ వచ్చాడు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని 2020లో విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మీటర్ చెక్ చేస్తామంటూ డీడీలు కూడా కట్టించుకున్నారు. ఈ మేరకు మీటర్ను చెక్ చేసి అది కమర్షియల్ మీటర్ అని అధికారులు రిపోర్టు ఇచ్చి ఆ మీటర్ను మార్చారు. అప్పటి వరకు కరెంట్ బిల్లు రూ.1.50లక్షలకు చేరుకుంది. మీటర్ మార్చిన సందర్భంలో పాత బిల్లంతా రివైజ్ చేస్తామని చెప్పడంతో లింగయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు విద్యుత్ అధికారులు, ఏడీఏలు కూడా సంతకం చేసి అంగీకరించారు. ఆ తర్వాత బిల్లు తగ్గించకుండానే కొత్త బిల్లుతో పాటు పాత బిల్లు కలుపుతూ వస్తున్నారు. ఈ విషయంపై ఏఈ, డీఈ, ఎస్ఈలతో పాటు విద్యుత్ వినియోగదారుల ఫోరంలో కూడా లింగయ్య దరఖాస్తులు ఇవ్వడంతో బిల్లును సరిచేస్తామని చెప్పి దాటవేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ బిల్లు రూ.1.79లక్షలకు చేరుకుంది. అయితే బిల్లు మొత్తం చెల్లించాలంటూ మంగళవారం లింగయ్య ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో అతడు విద్యుత్ ఆపరేషన్స్ ఎస్ఈ వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. కానీ బిల్లులో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో లింగయ్య న్యాయపరంగా ముందుకు వెళ్తానంటూ సాక్షికి వివరించాడు. విద్యుత్ అధికారులు చేసిన పొరపాటును సరిదిద్దుకోకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎంత వరకు సమంజసమని లింగయ్య వాపోతున్నాడు. ఫ గృహ వినియోగానికి కమర్షియల్ విద్యుత్ మీటర్ ఇచ్చిన అధికారులు ఫ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుండడంతో మీటర్ మార్పు ఫ బిల్లు సరిచేస్తామని చెప్పి ఏళ్ల తరబడి సాగదీత ఫ మొత్తం బిల్లు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేత -
సినీ ఫక్కీలో బంగారం చోరీ
ఫ వృద్ధురాలిని మంచానికి కట్టేసి 9 తులాల బంగారంతో ఉడాయించిన కేటుగాళ్లు నాగారం: సినీ ఫక్కీలో వృద్ధురాలిని మంచానికి కట్టేసి 9 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నాగారం మండలం ఈటూరు గ్రామంలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన నంగునూరి బయ్యమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరందరికి వివాహాలు అయ్యాఇ. బయ్యమ్మ కుమారుడు శ్రీరాములు ఉద్యోగ రీత్యా చైన్నెలో ఉంటున్నాడు. బయ్యమ్మ భర్త కొనేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె ఇంటి వద్ద ఒంటరిగానే ఉంటుంది. మంగళవారం రాత్రి బయ్యమ్మ ఇంట్లో నిద్రించగా.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కరెంట్ పోయింది. దీంతో ఆమె ఇంటి బయటికి వచ్చి వరండాలో మంచం వేసుకొని నిద్రించింది. ఆమె నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి వచ్చి బయ్యమ్మ రెండు చేతులను చీరతో మంచానికి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలో ఉన్న 2తులాల బంగారు నల్లపూసల గొలుసు గుంజుకున్నారు. అనంతరం ఇంట్లోకి చొరబడి ఇంట్లోని ట్రంక్ పెట్టెలో దాచిన 4 తులాల బంగారు పెద్ద గొలుసు, 3 తులాల పుస్తెలతాడుతో పాటు ఆమె నడుముకున్న చెక్కుడు సంచిలో ఉన్న రూ.2500 లాక్కోని పారిపోయారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఎం. ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయంలో రికార్డుల పరిశీలన యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన పలు రికార్డులను విజిలెన్స్ అధికారులు బుధవారం పరిశీలించారు. ప్రతి ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి విజిలెన్స్ అధికారులు ఆలయంలో రికార్డులను పరిశీలించినట్లుగానే బుధవారం విజిలెన్స్ అధికారులకు ఆలయానికి వచ్చి రికార్డులు పరిశీలించినట్లు ఆలయ అధికారులు చెప్పారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో ఐదుగురు సభ్యులతో కలిసి ఆలయ అకౌంట్ సెక్షన్లో రికార్డులను చూ శారు. ఆలయానికి ఆదాయం ఎంత వస్తుంది, గతేడాది ఎంత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా, నగలు ఎంత ఉన్నాయి, ఖర్చులు ఎంత అవుతున్నాయే అంశాలపై రికార్డులను పరిశీలించి వెళ్లారు. వారి వెంట ఆలయ డిప్యూటీ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, పలువురు ఉద్యోగులున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరణ.. ఐదుగురికి రిమాండ్ నూతనకల్: నూతనకల్ మండలం యడవెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సైదులు, వనం రాజు, పిట్టల కృష్ణ, బొడ్డు రాజాలు, నెల్లుట్ల సైదులు గతంలో గ్రామంలో ఘర్షణకు పడగా.. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. అయితే వారు కేసు వాయిదాలకు హాజరుకాకుండా కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడడంతో బుధవారం నాన్ బెయిలెబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. వైభవంగా నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోలు మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్గిగావించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి రైల్వే ఉద్యోగి మృతి
డోర్నకల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన రైల్వే ఉద్యోగి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఎర్రంశెట్టి సందీప్(28) డోర్నకల్లో రైల్వే ట్రైన్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి సరదాగా మున్నేరువాగులో ఈతకు వెళ్లాడు. అక్కడ మిత్రులు ఈత కొడుతుండగా ఈతరాని సందీప్ వాగు ఒడ్డున నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు వాగులోకి జారి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో వాగులోనుంచి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగినట్లు సమాచారం. -
రూ.3.50లక్షల విలువైన కిట్లు పంపిణీ
సంస్థాన్ నారాయణపురం: ౖెహదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థాన్నారాయణపురంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం స్కూల్ కిట్లు అందజేశారు. 340 మంది విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువ చేసే స్కూల్ కిట్లను డీఈఓ సత్యనారాయణ, ట్రస్ట్ ఎండీ తుపాకుల రవి అందజేశారు. రిలయబుల్ ట్రస్ట్ సహకారం అభినందనీయమని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకురావాలని డీఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎంలు రమాదేవి, ఉదయ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శివరంజని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్నె శివారెడ్డి, సుక్క సుదర్శన్, ఆముదాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్తో బేకరీలో మంటలు మిర్యాలగూడ అర్బన్: బేకరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద గల గోకుల్ బేకరీలో పై అంతస్తులో సామగ్రి నిల్వ చేసిన గదిలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.4.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రాహుల్ అగర్వాల్ తెలిపాడు. -
మహిళ మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్
తాళ్లగడ్డ (సూర్యాపేట): మహిళ మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంట తండాకు చెందిన బాణోతు విజయ (36)ను అదే తండాకు చెందిన బాణోతు ఉపేందర్ లైంగికంగా వేధిస్తూ తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఈ నెల 13న ఉదయం కూడా ఉపేందర్ విజయకు ఫోన్ చేయగా ఆమె కుమార్తె అఖిల ఎత్తింది. శ్రీమీ అమ్మ ఎటు వెళ్లిందిశ్రీ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికే ఉపేందర్ భార్య శారద విజయ ఇంటికి వెళ్లి తన భర్తతో వివాహేతర సంబంధంపై ప్రశ్నించడంతో విజయ మనస్తాపం చెంది అదే రోజు పొలం దగ్గర పురుగుల మందు తాగింది. అనంతరం ఇంటికి వచ్చిన విజయ వాంతులు చేసుకోవడంతో ఆమె కుమార్తె గ్రామస్తుల సాయంతో సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతిచెందింది. విజయ భర్త బాలు ఫిర్యాదు మేరకు బాణోతు ఉపేందర్, బాణోతు శారద, ఉపేందర్ అన్న గంగరాజు, వదిన మంగమ్మపై ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బాణోతు ఉపేందర్, అతని భార్య శారదను రూరల్ సీఐ రాజశేఖర్ అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఉపేందర్ అన్న గంగరాజు, వదిన మంగమ్మ పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో ఆత్మకూర్ ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. -
సిటీ స్కాన్ సేవలెప్పుడు?
ప్రైవేట్ ల్యాబ్లే దిక్కు.. ● భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తలకు సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరింది. సిటీ స్కాన్ తీయాలని వైద్యులు సూచిచండంతో ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లింది. రూ.5వేల వరకు ఖర్చు వచ్చినట్లు బాధితురాలు వాపోయింది. ● ఆలేరుకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వ్యాధి నిర్ధారణ కోసం ప్రైవేట్ ల్యాబ్లో సిటీ స్కాన్ తీయించుకోగా రూ.4వేల వరకు తీసుకున్నారని వాపోయాడు. ప్రైవేట్లో సీటీ స్కాన్ కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి రావడం పేద రోగులకు భారంగా మారింది. ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వస్తే రోగులకు బాధలు తప్పనున్నాయి.భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిత్యం 500కుపైగా రోగులు వస్తుంటారు. 100 పడకలు సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో అనేక విభాగాల్లో ఇన్పేషెంట్లకు నిత్యం సేవలందిస్తున్నారు. న్యూరాలజీ, మోకాల నొప్పులు, తల, ఎముకలు, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత తదితర వ్యాధులకు సంబంధించి సిటీ స్కాన్ పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ఆస్పత్రికి రెండు నెలల క్రితం నూతనంగా సీటీ స్కాన్ మిషన్ మంజూరైనా సేవలు అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా స్కానింగ్ అవసరమైన రోగులకు ప్రైవేట్ ల్యాబ్లే దిక్కవుతున్నాయి. రూ.2.5 కోట్లతో యంత్రం కొనుగోలురాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ భువనగిరిలోని జిల్లా ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సమయంలో ఆస్పత్రికి సిటీ స్కాన్ అవసరమని గుర్తించారు. ఆమె ఆదేశాల మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రతిపాదనలు రూపొందించి వైద్యారోగ్య శాఖకు పంపగా.. సిటీ స్కాన్ యంత్రాన్ని మంజూరు చేసింది. ఈ యంత్రం రెండు నెలల క్రితమే ఆస్పత్రిలోని తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్కు చేరినా వినియోగంలోకి తేవడం లేదు. దీని విలువ రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది. నెలలు గడుస్తున్నా మంజూరుకాని విద్యుత్ కనెక్షన్ ప్రస్తుతం ఆస్పత్రికి విద్యుత్ సరఫరా జరుగుతున్న లైన్ సామర్థ్యం సిటీ స్కాన్ యూనిట్ నిర్వహణకు సరిపోదు.హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్ కోసం వైద్యాధికారులు ట్రాన్స్కోకు దరఖాస్తు చేశారు. దీనికోసం సుమారు రూ.11 లక్షల వరకు అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చలాన్ కట్టకపోవడంతో అనుమతి రాలేదని తెలుస్తోంది. టెక్నీషియన్ల నియామకానికి ప్రతిపాదనలుసిటీ స్కాన్ నిర్వహణకు రేడియాలజిస్ట్ అందుబాటులో ఉండగా ఇంకా నలుగురు టెక్నీషియన్లు కావాలి. వీరి నియామకానికి వైద్యాధికారులు ప్రతి పాదనలు పంపారు. నిరుపయోగంగా రూ.2.5 కోట్ల యంత్రం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రెండు నెలల క్రితమే చేరిక వినియోగంలోకి తేవడంలో జాప్యం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్న రోగులువిద్యుత్ కనెక్షన్ అనుమతి రాలేదు సీటీ స్కాన్ యూనిట్ నిర్వహణకు గాను హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశారు. అనుమతి రాగానే సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. అదే విధంగా ప్రత్యేకంగా నలుగురు టెక్నీషియన్లు అవసరం ఉండగా సబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపాం. –వెంకటేశ్వర్లు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ -
● తరలించకపోతే ముప్పే..
రామన్నపేట మండలం వెల్లంకి సబ్స్టేషన్ నుంచి పదిహేనేళ్ల క్రితం సిరిపురం శివారులో ఏర్పాటు చేసిన క్రషర్కు విద్యుత్ లైన్ వేశారు. లైన్ కోసం వెల్లంకి గ్రామంలోని ఈదుల చెరువులో స్తంభాలు పాతారు. అప్పట్లో చెరువులో నీళ్లు లేకపోవడం వల్ల ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కొన్నేళ్లుగా పిల్లాయిపల్లి కాలువ నీటితో చెరువు ఎప్పడూ నిండుగా ఉంటుంది. స్తంభాల్లో కొన్ని వంగిపోయాయి. మరమ్మతులు ఏర్పడినప్పుడు విద్యుత్ సిబ్బంది బోటు సాయంతో వెళ్లి సరి చేయాల్సి వస్తుంది. పశువులు నీళ్లు తాగే సమయంలో, గ్రామస్తులు చేపలు పట్టే సమయంలో ప్రాణాపాయం సంభవించే ప్రమాదం లేకపోలేదు. విద్యుత్ స్తంభాలను సురక్షితమైన ప్రాంతం నుంచి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – రామన్నపేట -
ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ
సాక్షి,యాదాద్రి : సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వీధుల్లో పిచ్చిమొక్కలను తొలగించాలని, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని సూచించారు. వసతి గృహాల్లో నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రపరచాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే– డ్రై డే గా పాటించాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని, నీటి పైపులైన్లకు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, డీఎంహెచ్ మనోహర్, మిషన్ భగీరథ ఎస్ఈ కరుణాకర్, ఎస్సీ సంక్షేమ అధికారి జినుకల శ్యాంసుందర్ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందుండాలిఅభివృద్ధిలో గ్రామాలను జాతీయస్థాయిలో ముందుంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మండల పరిషత్, పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. అభివృద్ధికి సంబంధించి తొమ్మిది అంశాలపై వారికి అవగాహన కల్పించారు. వీటిని పక్కాగా అము చేస్తే గ్రామాలు అలవోకగా అభివృద్ధి చెందుతాయన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
కొనుగోళ్లలో రాణించారు
ధాన్యం సేకరణ ద్వారా మహిళా సంఘాలకు భారీగా కమీషన్సాక్షి,యాదాద్రి: ధాన్యం కొనుగోలులో మహిళలు శభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక మహిళా సంఘాలు కీలకపాత్ర పోషిస్తూ రూ.కోట్లలో వ్యాపారం చేశాయి. యాసంగి సీజన్లో తమకు కేటాయించిన ఐకేపీ కేంద్రాల ద్వారా 1,77,228 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.3.44 కోట్లు కమీషన్ రూపంలో ఆర్జించాయి. ఇందిరా మహిళా శక్తి పథకాల ద్వారా అతివల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వం.. ధాన్యం సేకరణలోనూ వారికి అవకాశం కల్పించడంతో సత్తా చాటారు. కొనుగోలు చేసిన ధాన్యం ఇలా..యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు 321 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 91 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిని స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. వీటి ద్వారా 1,77,228 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను క్వింటాకు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లించింది. మొత్తం రూ.3.44 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో జమకానున్నాయి. కమిషన్లో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇతర ఖర్చులు పోను 50 శాతం డబ్బులు స్రీనిఽధి ఖాతాలో జమ చేస్తారు. ఇకనుంచి 50 శాతం కేంద్రాలు..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 50 శాతం కేటాయించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. యాసంగి ధాన్యం కొనుగోలుకు 321 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 30 శాతం అంటే 91సెంటర్లు ఐకేపీకి కేటా యించారు. ప్రస్తుత వానాకాలం 50 శాతం కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 శాతం కేంద్రాలను మాత్రమే కేటాయించేవారు. ఇదిలా ఉండగా యాసంగి సీజన్లో గోకారం, కక్కిరేణి, వెల్లంకి, శోభనాద్రిపురం, శివారెడ్డిగూడెం, పెద్దగూడెంలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం సేకరించారు. యాసంగి సీజన్లో 1,77,228 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.3.44 కోట్లు కమీషన్గా ఆర్జించిన స్వయం సహాయక సంఘాలు కొనుగోలు కేంద్రాల్లో 30 శాతం వారివే.. వానాకాలం నుంచి 50 శాతానికి పెంపుడిపాజిట్లలో నంబర్ వన్ ధాన్యం కొనుగోళ్లలో స్వ యం సహాయక సంఘాల పనితీరు ప్రశంసనీయం. వారికిచ్చిన లక్ష్యాన్ని 45 రోజుల్లోనే పూర్తి చేశారు. ఒక్క యాసంగి సీజన్లోనే కమిషన్ రూపంలో రూ.3.44 కోట్లు సంపాదించారు. ప్రస్తుతం జిల్లా స్రీనిధి బ్యాంకులో ఐకేపీ కేంద్రాల డిపాజిట్లు రూ.12 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం. ఈ వానాకాలం నుంచి మొత్తం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మహిళా సంఘాలకే కేటాయిస్తాం. – నాగిరెడ్డి, డీఆర్డీఓ శిక్షణ సద్వినియోగంధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై స్వ యం సహాయక సంఘాల సభ్యులకు డీఆర్డీఓ ఆధ్వర్యలో శిక్షణ ఇచ్చారు. డేటా ఎంట్రీ, తేమ శాతం చూడటం, బుక్ కీపింగ్, కాంటా వేసిన నంబర్లకు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు తమకు కేటాయించిన కేంద్రాల్లో విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేసి భారీ కమీషన్ ఆర్జించారు. -
బ్యాంకుల వద్ద బారులు
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు మంగళవారం రద్దీగా మారాయి. ప్రభుత్వం ఈ నెల 16 సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తోంది. డబ్బులు డ్రా చేసుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకుల బాట పట్టారు. జిల్లాలో 2.84,250 మంది రైతులకు రూ.317.57 కోట్లు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరందరి ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో నగదు జమచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ.6వేల చొప్పున మూడు ఎకరాల వరకు 1,33,736 మంది రైతుల ఖాతాల్లో రూ.72.62 కోట్లు జమయ్యాయి. బ్యాంకర్ల తీరుతో రైతుల అవస్థలుబ్యాంకర్ల తీరుతో రైతుభరోసా డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు పడినట్లు పలువురు రైతులు వాపోయారు. రైతుభరోసా సాయాన్ని ఇతర రుణాలకు లింక్పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, కొన్ని బ్యాంకులు అవేమీ పట్టించుకోకపోవడం రైతులు సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. విత్డ్రా ఓచర్లు ఇవ్వలేదని, అధికారులు సరైన సమాధానం చెప్పలేదని భువనగిరిలోని యూనియన్ బ్యాంకుకు వచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కర్షకుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ రెండు రోజుల్లో రూ.72.62 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల్లో అన్నదాతల క్యూఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతుభరోసా డబ్బులు తీసుకోవడానికి భువనగిరిలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లాను. పైసలు తీసుకునేందుకు ఓచర్ అడగగా అధి కారులు కాలయాపన చేశారు. సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. నాలాంటి పరిస్థితినే చాలా మంది రైతులు ఎదుర్కొన్నారు. – మచ్చ భాస్కర్, రైతు -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
వలిగొండ : భూ భారతి చట్టంతో భూసమస్యల పరిష్కారానికే సత్వర పరిష్కారం లభించనుందని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం, వేములకొండ గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. పహిల్వాన్పురం సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, ఆర్ఓఆర్ వంటి సేవలు సలుభంగా పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన అనంతరం దరఖాస్తులను పరిశీ లించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. పహిల్వాన్పురంలో 41, వేములకొండలో 23 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ, డిప్యూటీ తహసీల్దార్ పల్లవి, రెవెన్యూ అధికారులు మనోహర్, కర్ణాకర్రెడ్డి, నగేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
19న ప్రధానాలయాల ఉద్యోగుల సమావేశం
యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఉద్యోగుల సమావేశం ఈనెల 19వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించనున్నట్లు దేవాలయ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు గజివెల్లి రమేష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాల్లో పనిచేస్తున్న మతపర, మినిస్టీరియల్, నాల్గో తరగతి సిబ్బంది సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాలలో గల ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. టీఎన్టీఓల సెంట్రల్ యూనియన్, రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంజనేయుడికి నాగవల్లి దళార్చన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చన శాస్త్రోక్తంగా చేపట్టారు. మంగళవారం ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయం, విష్ణు పుష్కరిణి, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాలను సింధూరంతో అలంకరించి, పాలాభిషేకం, తమలపాకులతో అర్చన చేశారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికభువనగిరిటౌన్ : ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ హాకీ జట్టు తరఫున రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న ఆలేరు విద్యార్థులను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం తన చాంబర్లో అభినందించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర జట్టులోనూ చోటు సంపాదించాలని వారికి సూచించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థుల్లో గడ్డం సందీప్, బీరు సాయిగణేష్, రాజబోయిన మణికంఠ, శనిగరం పార్థసారధి, కె.వెంకటేష్ ఉన్నారు. వీరు ఇటీవల అదిలా బాద్లో జరిగిన సబ్ జూనియర్స్ చాంపియన్ షిప్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు పాల్గొన్నారు. 19న వాసాలమర్రికి మంత్రి పొంగులేటి రాకతుర్కపల్లి: రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈనెల 19న తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 227 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, భువనగిరి అర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ దేశ్యానాయక్, కొక్కండ సత్తయ్య, పలుగుల లింగయ్య, బాబు, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చౌటుప్పల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారని, విద్యార్థులకు నాణ్య మైన విద్య అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, డిజిటల్ క్లాస్, పాఠశాల ఆవరణను పరిశీలించారు. బోధన తీరుపై ఆరా తీశారు. అడ్మిషన్లు ఎలా ఉన్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సులువైన రీతిలో పాఠాలు అర్థమయ్యేలా బోధనం చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నల్లెంకి శంకరయ్య, ఉపాధ్యాయులు శ్వేత, విజయ్ప్రతాప్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మునగాల: ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మునగాల మండలం ఆకుపాముల శివారులో జరిగింది. ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం కొమరబండ గ్రామానికి చెందిన షేక్ దావూద్ కుమారుడు షేక్ ఇమామ్(20) ఏసీ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి వరంగల్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో మాంటిస్సోరి పాఠశాల ఎదుట బైక్ అదుపుతప్పడంతో డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇమామ్కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి షేక్ దావూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు.. తుర్కపల్లి: ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్ వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో తుర్కపల్లి నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఆటో డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంతిరుమలగిరి(నాగార్జునసాగర్): తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు గ్రామానికి చెందిన బైరు కాశయ్య గత నెల 21వ తేదీ నుంచి కనిపించడం లేదని అతడి భార్య గీత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య తెలిపారు. కుక్కల దాడిలో చిన్నారికి గాయాలుభూదాన్పోచంపల్లి: కుక్కల దాడిలో చిన్నారికి గాయలైన ఘటన మంగళవారం సాయంత్రం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయికాలనీలో చోటుచేసుకుంది. మహమ్మాయికాలనీకి చెందిన మనస్విక మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి ట్యూషన్కు వెళ్తుండగా.. వీఽధి కుక్కలు ఆమైపె దాడి చేసి కాలును కరిచాయి. చిన్నారి భయంతో కేకలు వేస్తుండగా తల్లి జ్యోతి బయటికి వచ్చి కుక్కలను బెదిరించే క్రమంలో ఆమైపె కూడా దాడికి యత్నించాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి కర్రతో కుక్కలను తరమగా అవి అక్కడ నుంచి పారిపోయాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. -
ఇక్కత్ డిజైన్లను డూప్లికేట్ చేస్తే కేసులు నమోదు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ డిజైన్లను డుప్లికేట్ చేసినా, ప్రింటింగ్ చేసినా, బ్లాక్ పెయింటింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హ్యాండ్లూమ్స్ రీజినల్ డెవలప్మెంట్ కమిషనర్ మంజునాథ్ అన్నారు. మంగళవారం పోచంపల్లి పట్టణంలోని చేనేత సహకార సంఘంలో చేనేత వస్త్రాల రిజర్వేషన్ యాక్ట్ పరిరక్షణపై చేనేత కార్మికులు, వివిధ చేనేత సంఘాల నాయకులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 11 రకాల చేనేత వస్త్రాలకు రిజర్వేషన్ యాక్ట్ కల్పించిందని అన్నారు. ఇందులో చీరలు, దోవతులు, టవల్స్, దుప్పట్లు, బెడ్షీట్స్ తదితర వస్త్రాలు ఉన్నాయని వివరించారు. రిజర్వేషన్ యాక్ట్ కల్పించిన వస్త్రాలను కేవలం మగ్గాలపై తయారు చేయాలని అన్నారు. అలాకాకుండా పవర్లూమ్స్పై తయారుచేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొంటామన్నారు. అంతేకాక పేటెంట్ హక్కు(జీఐ) కల్గిన వస్త్రాలను వంద కిలోమీటర్ల పరిధిలోనే తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో తయారు చేసినా చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని తెలి పారు. వస్త్ర వ్యాపారులు, కార్మికులు తమ వస్త్రోత్పుత్తులకు సిల్క్మార్క్, హ్యాండ్లూమ్ మార్కు లోగోలు తప్పనిసరి వేయించుకోవాలన్నారు. వినియోగదారులు కూడా సిల్క్మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లోగోలను చూసి వస్త్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర చేనేత జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభయహస్తం కింద నకిలీ వస్త్రాలను నిరోధించేందుకు నాణ్యమైన చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి హ్యాండ్లూమ్ లోగోను అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ లీగల్ అసిస్టెంట్ దీపక్ వంశీ, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఓ రాజేశ్వర్రెడ్డి, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, మాజీ అధ్యక్షుడు తడక రమేశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, చేనేత నాయకులు చిక్క కృష్ణ, గంజి బస్వలింగం, భారత్ భూషణ్, గంజి కృష్ణ, దుద్యాల పాపయ్య, బోడ దయానందం తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్లూమ్స్ రీజినల్ డెవలప్మెంట్ కమిషనర్ మంజునాథ్ -
హత్యాయత్నం కేసులో ముగ్గురి రిమాండ్
చివ్వెంల(సూర్యాపేట): భూ వివాదాల కారణంగా వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూ వివాదాల కారణంగా చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామానికి చెందిన గుండెబోయిన గంగయ్యపై అదే గ్రామానికి చెందిన గుండెబోయిన సైదులు, గుండెబోయిన పెద్దగంగయ్య, గుండెబోయిన శ్రీలత ఈ నెల 15వ తేదీన గొడ్డలి, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో గంగయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. బాధితుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కత్తితో దాడి చేసిన వ్యక్తికి.. భూదాన్పోచంపల్లి: పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన సుంకరి రవికుమార్పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. ఈ నెల 15న సుంకరి రవికుమార్ బర్రె పాలు పితిక్కొని బైక్పై ఇంటికి వస్తుండగా.. పాతకక్షలను మనుసులో పెట్టుకొన్న ఎర్రబోతు మహేశ్, ఎర్రబోతు శ్యామ్బాబు, ఎర్రబోతు మధు, నర్సింహ అతడిని అడ్డగించి కత్తితో కడుపులో పొడిచి తలపై దాడి చేశారు. ఈ ఘటనలో రవికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రవికుమార్ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఎర్రబోతు మహేశ్ను చౌటుప్పల్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మత్స్య పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ
సీ్త్రశక్తికి తగిన గుర్తింపు ఆక్వా రంగం (చేపల పెంపకం)లో మహిళలను ప్రోత్సహించేలా రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళలను ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పంపించగా.. అందులో నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వంపు స్వాతి కూడా ఉన్నారు. నిరుపేద దళిత మహిళ అయిన స్వాతి తన భర్త సహకారంతో సాగుకు యోగ్యంకాని తన మూడెకరాల భూమిలో చిన్న చెరువులను ఏర్పాటు చేసుకుని చేపల పెంపకం చేపట్టి విజయవతంగా ముందుకు సాగుతోంది. తొలుత చేపలను పెంచాలనే ఆసక్తితో తనకున్న వంపు భూమిలో నీరు నిలిచే గుంతలో కొర్రమీనలు సాగు చేసుకోగా అదే వృత్తిగా మరింతగా విస్తరించారు.గుర్రంపోడు: వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన చేపల పెంపకంపై ఆదరణ పెరుగుతోంది. సాగునీటి వసతి పుష్కలంగా ఉండి పంటలకు అనువైన భూములు లేని చోట్ల ఆసక్తి ఉన్న రైతులు చేపల చెరువులను తవ్వుకుని చేపల పెంపకం చేపడతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో సుమారు వంద ఎకరాల్లో చెరువులను ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుతున్నారు. ప్రధానంగా పంటలకు అనువుగా లేని చౌడు భూముల్లో, వాగు నీటి వంపుల్లో చేపల చెరువులు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యశాఖతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అందుతున్న సబ్సిడీ అందిస్తుండడంతో ఏటా చేపల పెంపకం చేపడుతున్న రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కోనసీమను తలపించేలా..ఐదెకరాలు, పదెకరాల వరకు చేపల చెరువులను తవ్వుకుని చేపల చెరువులను ఏర్పాటు చేసుకున్న చోట్ల కోససీమను తలపించే వాతావరణం కనిపిస్తుంది. గుర్రంపోడు మండలంలోని వెంకటాపురం(కె) గ్రామంలో రామగిరి వెంకటరమణారావు అనే రైతు తనకు 20 ఎకరాల్లో, ఆమలూరు గ్రామానికి లక్ష్మయ్య సుమారు 30 ఎకరాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుతున్నారు. కొయగూరవానిబావి, తేనపల్లి, గుర్రంపోడు, చేపూరు తదితర గ్రామాల్లో చేపల చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో బొచ్చ, రవ్వ, రూప్చంద్, కొర్రమేను తదితర రకాల చేపలను పెంచుతున్నారు. సొంతంగా దాణా తయారీ..చేపల దాణా అవసరమైన ముడిసరుకులను రైతులే స్వయంగా తెచ్చుకుని చైనాతో పాటు ఢిల్లీ, రాజస్తాన్ ప్రాంతాల నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని పెద్ద షెడ్డు ఏర్పాటు చేసుకుని దాణా తయారు చేసుకుంటున్నారు. వెంకటాపురంలోని చేపల చెరువు ఏఎమ్మార్పీ ఆయకట్టులో విరివిగా చేపల చెరువులు ఆధునిక సాంకేతికతను జోడించి చేపల పెంపకంప్రోత్సాహం అందించాలి ప్రభుత్వం చేపల పెంపకందారులను ప్రోత్సహించేలా రాయితీలు అందించాలి. చెరువులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ రాయితీలు రావడం లేదు. దాణాపై పన్నులు తగ్గించి తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలి. చేపలు వ్యాధుల బారిన పడకుంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి – వేముల లక్ష్మయ్య, మత్స్యకార్మికుడు -
టిప్పర్ బోల్తా.. ట్రాఫిక్కు అంతరాయం
మునగాల: సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న టిప్పర్ మంగళవారం రాత్రి విజయవాడ–హైదరాబాద్ హైవేపై మునగాల మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనతో అర్ధగంట ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మునగాల ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. టిప్పర్ను రోడ్డు పక్కకు తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాఫిక్కు అంతరాయం కల్గడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిఆత్మకూరు(ఎం): ఇంటి వద్ద సింగిల్ ఫేజ్ మోటారుకు రిపేర్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పోసానికుంటలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోసానికుంట గ్రామానికి చెందిన సామ సుధాకర్రెడ్డి(45) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద సింగిల్ ఫేజ్ మోటారును రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా..
● ‘పీఎంశ్రీ’ పాఠశాలల్లో దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్లు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల ● ఉమ్మడి జిల్లాలోని 99 స్కూళ్లకు రూ.9.90లక్షలు కేటాయించిన కేంద్రంఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, సమకాలీన అంశాలపై అవగాహన పెంచడం కోసం దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్ల కొనుగోలుకు చేసేందుకు కేంద్రం తొలిసారి నిధులు మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ ద్వారా డీఈఓలకు నిధులు విడుదల చేసింది. పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో స్కూల్లో దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్ల కొనుగోలుకు రూ.10వేల చొప్పున కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 99 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ మేరకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాల వారీగా నిధులు ఇలా..యాదాద్రి భువనగిరి జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న 25 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2.50లక్షలు, సూర్యాపేట జిల్లాలో 31 పాఠశాలలకు రూ.3.10లక్షలు, నల్లగొండ జిల్లాలోని 43 పాఠశాలలకు రూ.4.30లక్షల చొప్పున మొత్తం రూ.9.90లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఒక్కో పాఠశాలలో నెలకు రూ.1000 చొప్పున పది నెలల పాటు దినపత్రికలు, చిన్నపిల్ల ల మ్యాగజైన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పత్రికల కొనుగోలు ఇలా ఉండాలి..ప్రతి పాఠశాలలో ఒక తెలుగు దినపత్రిక, ఒక హిందీ లేదా ఉర్దూ దినపత్రిక, ఒక ఇంగ్లిష్ దినపత్రిక కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్నపిల్లల తెలుగు మ్యాగజైన్, ఒక హిందీ లేదా ఉర్దూ చిన్నపిల్లల మ్యాగజైన్, ఒక ఇంగ్లిష్ చిన్నపిల్లల మ్యాగజైన్ కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. ఈ నిధులు పది నెలలకే.. పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఒక్కో స్కూల్కు రూ.10వేలు జమవుతాయి. ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం సూచించిన ప్రకారం దినపత్రికలు, మ్యాగజైన్లు కొనుగోలు చేయాలి. నెలకు రూ.1000 చొప్పున పది నెలలకే బడ్జెట్ అలాట్ అయ్యింది. విద్యార్థుల్లో పఠనాసక్తితో పాటు కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. – సత్యనారాయణ, డీఈఓ, యాదాద్రి భువనగిరి జిల్లా -
భూ ఆక్రమణకు యత్నించిన భార్యాభర్తలపై కేసు
నల్లగొండ: భూ వివాదం పెండింగ్లో ఉండగానే ఈ నెల 16న భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కగనల్ మండలం జి.చెన్నారం గ్రామంలోని ఓ భూమి మీదకు ఈ నెల 16న గార్లపాటి భూపాల్రెడ్డి, అతని భార్య రామేశ్వరమ్మ.. కందిమల్ల రఘుమారెడ్డి, జమ్మల్ల ప్రభాకర్రెడ్డి సాయంతో భూమిని ఆక్రమించుకునేందుకు డోజర్ వాహనంతో వచ్చారు. విషయం తెలుసుకున్న కూకుంట్ల శేఖర్ తనకు పూర్తి డబ్బులు ఇవ్వకుండానే భూమి వద్దకు వెళ్లొద్దంటూ అడ్డుకోబోయాడు. దీంతో శేఖర్ను కూలం పేరుతో దూషించడంతో చంపి అక్కడే పాతి పెడతామని బెదిరించి దాడి చేసి భూమి నుంచి బయటకు తోసి వేశారు. ఈ ఘటనపై కనగల్ పోలీస్ స్టేషన్లో శేఖర్ ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గార్లపాటి భూపాల్రెడ్డి, గార్లపాటి రామేశ్వరమ్మను కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ భూ వివాదం కేసులో భూపాల్రెడ్డి, రామేశ్వరమ్మ ఈ నెల 12న నల్లగొండలో ప్రెస్మీట్ పెట్టి పోలీసులు సహకరించడం లేదని, డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయంపై కనగల్ పోలీసులపై శాఖాపరమైన విచారణ జరపగా.. తప్పుడు, నిరాధార ఆరోపణలని తేలిందన్నారు. భూమిని ఆక్రమించడానికి సహకరించనందుకు పోలీసులను ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే వారు ఆరోపణలు చేసినట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా భూ వివాదాలకు సంబంధించి కబ్జాలో ఉన్న వారితో నేరుగా గాకుండా కోర్టు, రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధంగా కబ్జాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
ఒక ట్రాక్టర్.. మూడు గుంటుకలు
ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటలో రైతు సూదగాని లింగయ్యగౌడ్ పత్తి చేనులో ట్రాక్టర్కు మూడు గుంటుకలు కట్టి తోలుతున్నాడు. దీంతో సమయం ఆదాతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నాడు. – ఆత్మకూరు (ఎం) -
స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటశ్వరస్వామి దేవాలయం వద్ద అదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ, రథోత్సవం నిర్వహించారు. పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : దేశంలో అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లోవిశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు అవార్డులు అందజేయనున్నారు. 2026 సంవత్సరానికి ఇచ్చే పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫారసులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ htt p://awards.gov.in ద్వారా జులై 31 లోగా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు పద్మ అవార్డుల వెబ్సైట్ http://padmaawards. gov.inలో ఉన్నాయి. కల్నల్ సంతోష్బాబు త్యాగం వెలకట్టలేనిది సూర్యాపేటటౌన్ : దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం కల్నల్ సంతోష్బాబు వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని సంతోష్బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా విరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసిన సంతోష్బాబును నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కల్నల్ సంతోష్బాబు గారి త్యాగాన్ని స్మరించుకోవడం ఆ కుటుంబానికి ఓదార్పన్నారు. కార్యక్రమంలో సంతోష్బాబు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధి కారులు, ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు. -
రైతుల బాగుకే రైతునేస్తం
రైతునేస్తం కార్యక్రమం రైతులకు గొప్ప అవకాశం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికా రులు రైతులతో ముఖాముఖి చర్చించి సాగు పద్ధతులతో తెలియజేయడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం కార్యక్రమం ద్వారా అభ్యుదయ రైతుల అనుభవాలు చూడడం వల్ల రైతుల్లో వ్యవసాయంపై నమ్మకం పెరుగుతుంది. జిల్లాలో అదనంగా 34 రైతువేదికల్లో సోమవారం నుంచి రైతునేస్తం సేవలు అందుబాటులోకి వస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రజాప్రతినిధులు, రైతులు రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొనాలి. – గోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి -
మల్లాపురంలో హైడ్రామా
వలిగొండలో గొంగిడి సునీత నిరసన వలిగొండ : కర్రె వెంకటయ్యను వలిగొండ పోలీస్స్టేషన్ తరలించారన్న సమాచారంతో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అక్కడికి చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆమరణ దీక్ష చేస్తున్న వెంకటయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రహస్యంగా వలిగొండ పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని ఆమె ఖండించారు. మెడికల్ కాలేజీని కాపాడుకునేందుకు శాంతియుతంగా దీక్ష చేపట్టగా పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. మెడికల్ కళాశాలను దాతర్పల్లికి తరలించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. మల్లాపురంలోనే వైద్యకాలేజీ ఏర్పాటు చేస్తామని, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, డీఎంహెచ్ఓ ఎవరైనా హామీ ఇచ్చే వరకు వెంకటయ్య దీక్ష కొనసాగుతుందన్నారు. యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో హైడ్రామా చోటు చేసుకుంది. మెడికల్ కళాశాలను మల్లాపురంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల శాఖ అధ్యక్షుడు, మల్లాపురం మాజీ సర్పంచ్ కర్రె వెంకటయ్య ఆదివారం మల్లాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కృషి వల్ల మెడికల్ కళాశాల మంజూరైందని, మల్లాపురంలోని సర్వే నంబర్ 64 భూముల్లో నిర్మాణం చేసేందుకు నాటి సీఎం కేసీఆర్ జీఓ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కళాశాలను మల్లాపురంలో కాకుండా వేరే చోటకు తరలించాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. మల్లాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కళాశాల, గ్రామ ప్రజల బాగు కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని, గత ప్రభుత్వం కేటాయించిన ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ నిర్మాణం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, పల్లెపాటి మాధవులు, బరిగె నర్సింహులు, మెటె శేఖర్, బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. దీక్షను భగ్నం చేసిన పోలీసులువెంకటయ్య ఆమరణ దీక్షకు దిగిన కొన్ని గంటల్లోనే యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మల్లాపురం చేరుకున్నారు. వెంకట య్యను బలవంతంగా అదుపులోకి తీసుకుని వలి గొండ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు మరికొందరిని స్టేషన్కు తరలించారు. గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోబోగా ఉద్రిక్తత నెలకొంది. గుట్టలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా, అరెస్ట్యాదగిరిగుట్ట: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అరెస్టును నిరసిస్తూ మల్లాపురం గ్రామస్తులు, మండలం, పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు యాదగిరిగుట్టలోని ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని గడ్డమీది రవీందర్గౌడ్, పాపట్ల నరహరి, మాజీ జెడ్పీటీసీ కర్రె కమలమ్మ తదితర నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంకటయ్యకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, క్షేమంగా అప్పగిస్తామని సీఐ భాస్కర్ వారికి చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న కర్రె వెంకటయ్యతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాట్లాడించడంతో వారు ఆందోళన విరమించారు. కేటీఆర్, హరీష్రావు ఆరా..కర్రె వెంకటయ్య ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు ఆరా తీశారు. గొంగిడి సునీతకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల మల్లాపురంలోనే ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆమరణ దీక్ష భగ్నం చేసి వలిగొండ స్టేషన్కు తరలింపు పోలీసుల తీరును నిరసిస్తూ గుట్టలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, ఉద్రిక్తత -
నృసింహుడి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చనలతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
రైతునేస్తం.. సాగుకు ఊతం
భువనగిరిటౌన్, రామన్నపేట : వ్యసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రైతులకు సలహాలు, సూచనలిచ్చేందుకు సోమవారం నిర్వహించే శ్రీరైతునేస్తంశ్రీ కార్యక్రమానికి రైతునేస్తం కేంద్రాలు రెడీ అయ్యాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతునేస్తం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రైతునేస్తం కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. గతంలో 17 రైతువేదికల్లో మాత్రమే రైతునేస్తం కార్యక్రమం ప్రసారం అయ్యేది. తాజాగా మరో 34 రైతువేదికలకు పెంచారు. ప్రతి మండలంలో మూడు రైతువేదికల చొప్పున ఎంపిక చేసి రైతునేస్తం కార్యక్రమానికి సిద్ధం చేశారు. పాల్గొననున్న ఎమ్మెల్యేలుసీఎం పాల్గొనే రైతునేస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు వీక్షించనున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట రైతువేదిక, కుంభం అనిల్కుమార్రెడ్డి భువనగిరి శివారులోని రైతువేదిక, మందుల సామేల్ మోత్కూరు మండలం పాటిమట్ల రైతువేదికలో పాల్గొంటారు. నేడు రైతులతో సీఎం ముఖాముఖి 51 రైతునేస్తం కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి పాల్గొననున్న 12,750 మంది రైతులుఒక్కో రైతువేదికలో 250 నుంచి 300 మంది రైతులు హాజరు జిల్లా వ్యాప్తంగా 51 రైతువేదికల్లో 1,2750 మంది రైతులు హాజరుకానున్నారు. ఒక్కో వేదికలో 250 నుంచి 300మంది రైతులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రైతునేస్తం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా గ్రామాల్లో రైతులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం, డప్పు చాటింపు వంటివి చేశారు. -
గడువులోపు సాధ్యమేనా!
పంట సీజన్లో బునాదిగాని కాల్వ విస్తరణబీబీనగర్: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న బునాదిగాని కాల్వ విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. పనుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.266.69 కోట్లు విడుదల చేసింది. 98 కిలో మీటర్లకు గాను.. తొలి దశలో బీబీనగర్ మండల పరిధిలోని మక్తా అనంతారం నుంచి ఎర్రకుంట వరకు ఐదు కిలో మీటర్ల మేర కాల్వ పనులు జూలై 10 లోపు పూర్తి చేసి సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. అంత వరకు బాగానే ఉన్నా పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే అనుకున్న తేదీకి పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల వల్ల కాలువలో పూడికతీత సమయంలో నీటి ఊట వస్తుండటం ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా పనులు మొదలై 25 రోజులు గడిచినా అర కిలో మీటరు దూరమే పూర్తయ్యాయి. 98కిలో మీటర్ల మేర జరుగనున్న విస్తరణబీబీనగర్ మండల పరిధిలోని మక్తా అనంతారం శివారులో మేడ్చల్ – యాదాద్రి జిల్లా సరిహద్దులోని మూసీ నుంచి అడ్డగూడూరు మండలం ధర్మారం చెరువు వరకు 98 కిలో మీటర్లు బునాది కాల్వను విస్తరించనున్నారు. ప్రసుత్తం ఉన్న కాల్వ సరిగా లేకపోవడంతో ఎగువ ప్రాంతానికి నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది. బీబీనగర్, భవనగిరి మండలాల పరిధిలోని భూములకు మాత్రమే నీరందుతుంది. మొదటి దశలో 5 కిలో మీటర్ల మేర కాల్వను ఆధునీకరించి పంటలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. పనులకు ఆటంకంకాల్వ పనులను మొదలు పెట్టి 25 రోజులు గడిచినా ఇంకా 500 మీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. మక్తా అనంతారం వద్ద కాల్వ పూడిక తీత, సిమెంట్ కాంక్రీట్ బెడ్ పనులు జరిగాయి. ఇంకా నాలుగున్నర కిలో మీటర్ల మేర పనులు జరగాల్సి వుంది. జూలై 10న నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నా గడువులోపు మొదటి దశ పనులు పూర్తిస్థాయిలో జరిగేలా కనిపించడం లేదు. అడుగు భాగంలో 66 మీటర్లు, పైభాగంలో 30 మీటర్ల వెడల్పుతో కాల్వను విస్తరిస్తున్నారు.కాల్వ పూడీక తీసేటప్పుడు నీరు ఊరుతుండడంతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది.సకాలంలో నీటిని వదలాలి బునాదిగాని కాల్వ విస్తరణ మొదటి దశ పనులను త్వరగా పూర్తిచేసి అధికారులు చెబుతున్నట్టుగా జూలై 10వ తేదీ వరకు కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలి. నాకున్న ఎకరం పొలంతో పాటు కౌలుకు తీసుకున్న 10 ఎకరాలు బునాదిగాని కాల్వ నీటి ద్వారానే సాగు చేస్తాను. క్రాప్హాలిడే ప్రకటిస్తే రైతులంతా నష్టపోతాం. సకాలంలో పనులు పూర్తి చేసి కాల్వకు నీటిని విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – జక్కి సంతోష్, రైతు, రాఘవాపురంజూలై 10న నీటి విడుదల కాల్వ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కాల్వ కట్టలు తెగిన చోట, క్రాసింగ్లను గుర్తించి పూడిక తీత, సిమెంట్ కాంక్రీట్ బెడ్ పనులు చేపడుతున్నాయం. మొదటి దశలో 5 కిలో మీటర్ల మేర కాల్వ విస్తరణ పనులను జూలై 10లోపు పూర్తి చేసి సాగు నీటిని విడుదల చేస్తాం. – భరత్కుమార్, ఇరిగేషన్ ఏఈ తొలి దశలో ఐదు కిలో మీటర్లు.. జూలై 10వ తేదీలోపు పనులు పూర్తి చేసి రైతులకు నీరివ్వాలని నిర్ణయం 25 రోజులు గడిచినా అర కిలో మీటరు దూరమే పూర్తి సకాలంలో నీటి విడుదలపై సందేహాలు క్రాప్హాలిడే ప్రకటిస్తారన్న ప్రచారంక్రాప్హాలిడే తప్పదా?పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే వానాకాలం సీజన్ ఆయకట్టులో క్రాప్హాలిడే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 98 కిలో మీటర్ల మేర పనులు జరగాల్సి ఉన్నందున ఇంకా 500 మీటర్ల మేర మాత్రమే పూర్తయ్యాయి. క్రాప్హాలిడే ప్రకటించకపోతే పనులు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. దీంతో ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించడతో పాటు భూ సేకరణ విషయంలో నచ్చజెప్పి సర్వే చేపట్టడంలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకునేలా అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. క్రాప్హాలిడే ప్రకటిస్తే మండల పరిధిలోని 300కు పైగా రైతు కుటుంబాలపై ప్రభావం చూపడంతో పాటు 500 ఎకరాలకు పైగా సాగు పనులు నిలిచిపోనున్నాయి. -
గ్రామాల్లో గంజాయి ఘాటు
యాదగిరిగుట్ట రూరల్: పట్టణాలకే పరిమితమైన గంజాయి..పల్లెలకూ పాకింది. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి మాఫియా వ్యాపారం చేస్తోంది. నాగపూర్, ఆంధ్రా, ఒడిశా, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తోంది. దీంతో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. విద్యార్థులు, యువకులు నిర్మానుష్య ప్రాంతాలు, నిరుపయోగంగా భవనాలను అడ్డాగా చేసుకుని గంజాయి సేవిస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట మండలంలో చోటు చేసుకున్న ఘటనలు కలవర పరుస్తున్నాయి. ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడిన వ్యక్తులంతా యువకులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు● యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో కొందరు యువకులు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి రహస్య ప్రాంతంలో సేవిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ● యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో ఓ వ్యక్తి వద్ద పోలీసులకు గంజాయి లభించింది. ● భువనగిరి బస్టాండ్లో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతూ ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ● హైదరాబాద్ నుంచి ఆలేరుకు గంజాయి తరలిస్తున్న యువకుడిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 160 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. ● భువనగిరిలో ఓ వ్యక్తి బైక్పై గంజాయి తీసుకెళ్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు.అతని వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇలా వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉన్నాయి. గుట్టుగా విక్రయాలు ఇంటర్, డిగ్రీ విద్యార్థులే టార్గెట్ రోడ్లు, రైలు మార్గాల ద్వారా జిల్లాకు అక్కడి నుంచి ద్విచక్రవాహనాలపై పల్లెలకు చేరవేస్తున్న అక్రమార్కులుఈ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా..రాష్ట్రంలోని పలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు గంజాయి రవాణా జరుగుతోంది. ప్రధానంగా నాగాపూర్, ఆంధ్రా ఒడిశా బార్డర్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో గంజాయి తీసుకువచ్చి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. వాటిని ప్యాకెట్ల చేసి యువతకు విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ.500 నుంచి రూ.1000, పావు కిలో రూ.3,500, అరకిలో రూ.6,500, కిలో రూ.1,3000 వరకు విక్రయిస్తున్నారు.పల్లెల్లో నిఘా ఉంచాం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా టోల్ప్లాజాలు, ప్రతి బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఉంచాం. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా సదస్సులు ఏర్పాటు చేసి దుష్ప్రరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచాలి. – కృష్ణమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి యువత మత్తుపదార్థాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలుంటాయి. పల్లెలపైనా నిఘా ఉంచాం. ఎవరైనా విద్యార్థులు, యువకులు మత్తుపదార్థాలకు బానిసలై ఉంటే మా దృష్టికి తీసుకవస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. పిల్లలు ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. – భాస్కర్, యాదగిరిగుట్ట ఎస్హెచ్ఓ -
ఫలించిన భగీరథ ప్రయత్నం
చండూరు: జియాలజిస్టులు సైతం పరిశీలించి ఆ భూమిలో ఎక్కడ బోరు వేసినా చుక్క నీరు పడదని తేల్చేశారు. అయినా ఆ రైతు తన భగీరథ ప్రయత్నం ఆపలేదు. తన భూమి చుట్టూ కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించి.. చుక్క నీరు పడదని తేల్చిన చోట ఎక్కడ చూసినా గంగ ఉబికి వచ్చేలా మార్చాడు చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి. వర్షపు నీరు భూమిలోనే ఇంకిపోయేలా సత్యనారాయణరెడ్డి తనకున్న దాదాపు 100 ఎకరాల్లో ఆరేళ్ల క్రితమే కందకాలు తవ్వించారు. 2 సంవత్సరాల క్రితం మళ్లీ ఆ కాలువల్లో పూడిక తీయించారు. గొల్లగూడ గ్రామానికి వెళ్లే దారిలో గల 50 ఎకరాల్లో ఒక్కోటి ఎకరం విస్తీర్ణంలో 4ఎకరాల్లో వేర్వేరుచోట్ల ఫాంపాండ్ లాంటి నీటి గుంతలను తవ్వించారు. దీంతో 50 ఎకరాల్లో పడిన ప్రతి వాన చినుకు భూమిలోకి ఇంకగా.. మిగిలిన నీరు కందకాల ద్వారా ఇంకుడు గుంతల్లోకి, ఫాంపాండ్లలోకి చేరేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎండాకాలంలో కూడా రెండు గుంతల్లో నీరు అలానే ఉంది. దీని ద్వారా వస్తున్న నీటి లభ్యత, భూగర్భ జలాలతో మిగిలిన 46 ఎకరాల్లో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలతో పాటు జొన్న సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, ఖర్జూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ పండిస్తున్నారు. అంతేగాక వందల్లో వేప, యూకలిప్టస్, కానుగ చెట్లు పెంచుతున్నారు. ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించే విషయంలో రైతులకు ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఈ ఒక్క సంవత్సరమే చండూరు మండలంలో దాదాపు 50 మందికి పైగా రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భూగర్భ జలాలకు కొదవ ఉండదనేది నిపుణుల అభిప్రాయం. తనకున్న భూమిలో ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించిన రైతు తోటలకు, పంటల సాగుకు పుష్కలంగా లభ్యమవుతున్న నీరు వాన నీటిని ఒడిసి పట్టుకోవాలి భూమి ఉన్న ప్రతి రైతు వాన నీటిని ఒడిసి పట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నేను సొంత ఖర్చులతో ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకున్నాను. ఇప్పుడు ఎండాకాలంలో కూడా తోటలకు, ఇతర పంటలకు నీటి సమస్య అనేదే లేదు. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా రైతులకు సహాయ సహకారాలు అందించాలి. – పాల్వాయి సత్యనారాయణరెడ్డి, రైతు, బంగారిగడ్డ రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఉపాధి హామీ పథకం ద్వారా చాలా మంది రైతులు తమ భూముల్లో ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకుంటున్నారు. ఈ సంవత్సరం వేసవిలో చండూరు మండలంలో దాదాపు 50 మంది రైతులు ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకున్నారు. మిగతా రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీనివాస్, ఉపాధి హామీ ఏపీఓ -
సారవంతమైన నేలల్లో అధిక దిగుబడులు
కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలువికసించిన బ్రహ్మ కమలంనల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణంలోని అలకాపురి కాలనీకి చెందిన ఇడుకుల్ల మంజులపద్మాకర్ నివాసంలో ఆదివారం రాత్రి బ్రహ్మ కమలం వికసించింది. ఇలాంటి మొక్కలను ఆలయాల్లో మాత్రమే పెంచుతుంటారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే వికసించి గంట మాత్రమే ఉంటాయి. ఈ బ్రహ్మ కమలం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన పుష్పంగా చెబుతుంటారు.హుజూర్నగర్ : హుజూర్నగర్లో గల గోదాదేవి, పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయంలో అగ్నిప్రతిష్ఠ, శాంతిపాఠం, గరుడ హోమం, చతుస్థానార్చన, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవ, ఎదుర్కోళ్లు, మంగళ నీరాజనం, మంత్రపుష్పం గావించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.పచ్చిరొట్టతో ఉపయోగాలు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, అలసందను ప్రధాన పంటల సాగుకు ముందు సాగు చేసి కలియ దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల్లో సేంద్రియ పదార్ధం ఉంటుంది. సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారి నీటి నిలువ శాతం పెరిగి సులభంగా నీరు, గాలి వేర్లకు అందుతుంది. సూక్ష్మపోషక పదార్థ లోపాలు రాకుండా ఉంటాయి. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి.త్రిపురారం: సారవంతంగా నేలలు ఉంటేనే చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతుల్లో నేలలను సారవంతం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నేలలను సారవంతం చేసుకోవడానికి ఆయన సలహాలు, సూచనలు ఇవీ.. గొర్రెల మందలతో అధిక ప్రయోజనాలునేలలను సారవంతంగా చేసుకోవడానికి గొర్రెల ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి గొర్రెల కాపరులు మేత కోసం గ్రామాలకు వస్తుంటారు. ఒక్కో గొర్రెల మందలో సుమారు 150 నుంచి 500 వరకు గొర్రెలు ఉంటాయి. రైతులు గొర్రెల కాపరులతో మాట్లాడుకుని ఎకరానికి కొంత చొప్పున చెల్లించి గొర్రెల మందలను తమ పొలంలో రాత్రి సమయంలో ఉండేలా చూసుకోవాలి. ఉదయం నుంచి మేత మేసిన గొర్రెలు రాత్రి సమయంలో పెంట రూపంలో పొలంలో వదులుతాయి. అలా గొర్రెల పెంటను నేలలో కలియ దున్ని దమ్ము చేసుకుంటే నేల సారవంతంగా తయారవుతుంది. వర్మీ కంపోస్టుతో నేల సారవంతం..వర్మీ కంపోస్టు నిస్సారమైన భూమిని సారవంతంగా మారుస్తుంది. రసాయనిక ఎరువుల ద్వారా భూమిలో ఇంకిపోయిన భాస్వరం, పొటాషియం, నత్రజనిని తిరిగి పంటలకు ఉపయోగపడేలా చేస్తుంది. పంటలకు కావాల్సిన సూక్ష్మపోషకాలు, మధ్య పోషకాలు, జింక్ పూర్తిస్థాయిలో లభిస్తుంది. పైర్లకు చీడపీడలను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ ఎరువులో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటి వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఎకరానికి 500 కేజీల వర్మీ కంపోస్టు వేసుకోవడం ఉత్తమం. వర్మీ కంపోస్టు తయారు చేసుకునే విధానం..వర్మీ కంపోస్టు తయారీకి అవసరమైన తొట్టెలను నిర్మించుకోవాలి. ఈ తొట్టెల్లో వరి గడ్డి ఒక లేయర్గా వేసుకోవాలి. లేయర్పై ఆరబెట్టిన పేడను వేసుకొని దానిపై తడిచెత్తను వేసుకోవాలి. అలాగే మూడు రోజులు మగ్గిన తర్వాత వానపాముల సీడ్ను వేయాలి. అనంతరం జీవామృతం పోసుకొని స్ప్రేయర్ ద్వార నీళ్లు చల్లుతూ ఉండాలి. 20 నుంచి 30 రోజుల్లో వానపాములు పూర్తిస్థాయిలో ఉత్పత్తవ్వడం ద్వారా ఓ మిశ్రంలా మారుతుంది. పై భాగంలో ఉన్న మిశ్రమాన్ని జల్లించి ఆరబెట్టడం ద్వారా వర్మీ కంపోస్టు తయారవుతుంది. పై భాగంలో మిశ్రమాన్ని తీసిన ప్రతిసారి జీవామృతం పోస్తూ మగ్గబెట్టుకోవాలి. ఇలా తొట్టెల్లోని మిశ్రమాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత తిరిగి తయారీ ప్రారంభించుకోవాలి. జీవ ఎరువుల వినియోగం..గోమయం, పంచగవ్వ, గ్రీన్ మాశ్చుర్, జీవామృతం వంటి జీవ ఎరువులను వినియోగించి భూసారం కాపాడుకోవచ్చు. జీవ ఎరువులు పంటలకు పోషకాలు అందించి మట్టిని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మట్టిలో ఉండే సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందిస్తాయి. మట్టిలో సేంద్రియ పదార్ధాలను పెంచి పైర్ల గాలితో పాటు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతాయి. పంటలకు నెమ్మదిగా పోషకాలు అందిస్తాయి. కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సూచనలు -
విజయవిహార్లోని గదుల అద్దె పెంపు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయ తీరంలోని విజయవిహార్ అతిథి గృహంలో పర్యాటకులు బస చేసే గదులకు అద్దెలను భారీగా పెంచారు. పెంచిన ధరలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్తర్వులిచ్చింది. సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో నిర్మించిన ఈ అతిథి గృహంలో బస చేసే పర్యాటకులకు వెనుక భాగంలో జలాశయం వ్యూ కనబడుతుంటుంది. ఈ అతిథి గృహంలో ఎంతో మంది రాజకీయ నాయకులు బస చేశారు. ఎందరో సినీ నిర్మాతలు, గేయ రచయితలు, దర్శకులు కథలతో పాటు సినిమా పాటలు రాసుకునేందుకు ఇక్కడికి వచ్చి వారాల తరబడి ఇందులో బస చేస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి ఈ భవనానికి మరమ్మతులు చేశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో అప్పటి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇక్కడ వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో కేవలం ఫర్నీచర్, ఏసీలను మార్చారు. తిరిగి 2024 చివరలో మరమ్మతులు చేసేందుకు అంచనాలు తయారు చేసి రూ.5కోట్ల నుంచి రూ.15 కోట్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించి తొలి దశలో రూ.5కోట్లకు టెండర్లు పిలిచారు. ఇటీవల ప్రపంచ సుందరీమణులు నాగార్జునసాగర్కు వచ్చిన సందర్భంగా పనులను వేగవంతం చేసి ముందుగానే ఆధునీకరణ పనులు పూర్తిచేశారు. పాత భవనం కావడంతో స్లాబుకు మరమ్మతులతో పాటు టైల్స్, మార్బుల్ బండలు వేశారు. రంగులతో పాటు గదుల ముందుగల లాన్లలో తివాచీ గడ్డిని పరిచారు. సూట్ రూములలో కొత్త మంచాలతో పాటు బెడ్స్ను మార్చారు. సూట్ రూములలో ఫైవ్ స్టార్ హోటల్స్ను తలపించేలా ఏర్పాట్లు చేశారు. విదేశీయులు సైతం బస చేసేవిదంగా ఆధునీకరించినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. 30 శాతానికి మించి పెరిగిన అద్దె..విజయవిహార్లో మూడు రకాల భవనాలు ఉంటాయి. అత్యంత విలాసవంతమైన విజయవిహార్ భవనంలో 10 సూట్ రూములు ఉంటాయి. ఈ రూములకు గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అద్దె రూ.3472 ఉండగా, శని, ఆదివారాల్లో రూ.4200గా ఉండేది. ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు జీఎస్టీతో కలిపి రూ.4,704 ఉండగా, శని, ఆదివారాలలో రూ.5,600గా నిర్ణయించారు. అదేవిధంగా సరోవర్ భవనంలో 8 డీలక్స్ రూములు ఉంటాయి. వీటికి గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ.2600, శని, ఆదివారాల్లో రూ.3400 అద్దె ఉండేది, ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ.3,024, వారాంతంలో రూ.3,920గా అద్దె పెంచారు. సమాగమంలో 20 స్టాండర్డ్ గదులు ఉంటాయి. గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ.2016, వారంతంలో రూ.2,700 అద్దె ఉండేది. ఇప్పుడు వారం మొదట్లో రూ.2,352, శని, ఆదివారాల్లో రూ.3024గా అద్దె పెంచారు. గతంలో కంటే 30 శాతం పెరుగుదల -
గ్యాస్ సిలిండర్ లీకై వ్యాపించిన మంటలు
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో ఆదివారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. వివరాలు.. మూసీ రోడ్డులో నివాసముంటున్న కాడింగు కొండయ్య ఇంట్లో గ్యాస్ సిలిండర్లో అయిపోవడంతో ఆదివారం కొత్త సిలిండర్ అమర్చారు. అనంతరం వంట చేసుకునేందుకు గాను గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా.. ఒక్కసారిగా సిలిండర్ వద్ద మంటలు చెలరేగాయి. ఇళ్లంతా పొగ ఆవరించింది. చుట్టుపక్కల ఇళ్ల భయాందోళనకు గురయ్యారు. కొండయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని చిన్న చిన్న వస్తువులు కాలిపోయాయని బాధితుడు కొండయ్య తెలిపాడు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొండయ్య ఇంటిని పరీశీలించి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతితుంగతుర్తి: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన గీత కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల సోమయ్య(57) ఈ నెల 2వ తేదీన కల్లు గీసేందుకు గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మాజీ వార్డు సభ్యుడైన సోమయ్య భౌతికకాయానికి మాజీ ఎంపీపీ గుండాగాని కవితారాములుగౌడ్, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన గుణగంటి మధు(35) ఈ నెల 8వ తేదీన బైక్పై నెమ్మికల్ నుంచి ఆత్మకూర్ మండల కేంద్రానికి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
ప్రతిఒక్కరూ ధర్మాన్ని పాటించాలి
హుజూర్నగర్ (చింతలపాలెం) : ప్రతిఒక్కరూ ధర్మాన్ని పాటించాలని శ్రీరామదూత స్వామి ఆశ్రమ ప్రధాన శిష్యులు కుమారస్వామి, పూర్ణానంద దీక్షితులు, పవిత్రమ్మ, శిరీషమ్మ అన్నారు. ఆదివారం చింతలపాలెం మండలంలోని గుడిమల్కాపురం గ్రామంలో శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మీ దాంపత్య వ్రతం, కలశపూజ, హోమం జరిపించారు. జూలై 10న గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ రామదూత స్వామి దివ్యధామంలో 120 హోమ గుండాలతో అభీష్టసిద్ధి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాగిరెడ్డి దంపతులు, చక్రారెడ్డి, శంబిరెడ్డి, కోటి, శంకరాచారి, శ్రీదేవి, నాగమణి పాల్గొన్నారు. -
అధికారులను అడ్డుకున్న రైతులు
చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కుడి కాలువ ఏర్పాటుకు సంబంధించి భూములను సర్వే చేసేందుకు ఆదివారం వచ్చిన ఇంజనీరింగ్, సర్వే అధికారులను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. కుడి కాలువ పరిధిలో సుమారు 30 ఎకరాల భూములను రైతులు కోల్పోనున్నారు. కాగా ఈ భూములకు ప్రభుత్వ రికార్డులో మార్కెట్ రేట్ ప్రకారం సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో కోటి రూపాయల వరకు విలువ ఉంటుంది. దీంతో రైతులు తమకు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలనే డిమాండ్కు అధికారులు అంగీకరించకుండా సర్వే చేయడానికి డీఈ శ్రీనివాస్, ఏఈ రాజశేఖర్రెడ్డి, సర్వేయర్ రజనీకాంత్లను అడ్డుకున్నారు. దీంతో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు నర్రా మోహన్రెడ్డి, నర్రా భిక్షంరెడ్డి, అక్కెనపల్లి యాదగిరి, నర్రా లవేందర్రెడ్డి, దూదిగామ స్వామి, దూదిగామ మల్లయ్య, పాలాల యాదయ్య, మేడి వీరస్వామి, నర్రా శ్రీకాంత్రెడ్డి, లెంకల సత్తిరెడ్డి పాల్గొన్నారు. -
భక్తులు దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చేలా..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు పశ్చిమ ద్వారం నుంచి కాకుండా దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రతిరోజు ఉచిత పులిహోర ప్రసాదం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమ ద్వారం వద్ద భక్తులు ప్రసాదం తీసుకునేందుకు నిలిచిపోవడంతో పాటు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆలయ ఈఓ వెంకట్రావ్, ఆలయాధికారులు దక్షిణ ద్వారం వద్ద భక్తులకు ఉచిత పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ బయటకు పంపిస్తున్నారు. పశ్చిమ ద్వారం గుండా సైతం భక్తులను పంపిస్తున్నామని, భక్తులకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశ్యంతో దక్షిణ ద్వారం మార్గంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ మాడ వీధిలోకి పంపుతున్నామని ఆలయ డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్ శర్మ వెల్ల డించారు. యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు -
ఉన్నతాధికారులతో విచారణ చేయించాలి
యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీర్ల ఐలయ్య ఇంట్లో గంధమల్ల రవి ఆత్మహత్యపై ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనిపై ఓ ప్రజాప్రతినిధిగా, ఆలేరు ఎమ్మెల్యేగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బీర్ల ఐలయ్యకు ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి రవి మృతదేహాన్ని అప్పటికప్పుడే పంచనామా చేసి, భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రవి మృతిచెందాడని ప్రచారం జరుగుతుందన్నారు. లోకల్ పోలీసులతో విచారణ జరిపిస్తే సరిగ్గా చేయరని, కమిషనరేట్ పరిధిలో నిజాయితీగా ఉండే అధికారితో విచారణ చేపట్టి నిజాలు బయట పెట్టాలని రాచకొండ సీపీ సుధీర్బాబును కోరామన్నారు. రవి ఆత్మహత్యను పక్కదోవ పట్టించేందుకే బీర్ల ఐలయ్య, స్థానిక పోలీసులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాంతియుత వాతావరణంలో కర్రె వెంకటయ్య నిరసన తెలుపుతుంటే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కర్రె వెంకటయ్యకు ఏం జరిగినా ఐలయ్య, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. కురుమ సామాజిక వర్గానికి చెందిన వెంకటయ్య రాజకీయంగా ఎదగకుండా ఐలయ్య కుట్ర చేస్తున్నారన్నారు. ఐలయ్య, పోలీసుల దౌర్జన్యాలపై నియోజకవర్గ వ్యాప్త బంద్కు పిలుపునిస్తామని అన్నారు. ఐలయ్య ఇప్పటికై నా రవి కుటుంబానికి రూ.2కోట్ల సాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్రెడ్డి, యూత్ సెక్రటరీ విజయ్, రాజేష్యాదవ్, సతీష్గౌడ్, కుమార్, గజం అశోక్, సూరి, శ్రావణ్, వీరారెడ్డి తదితరులున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి -
నడిపించిన నాన్న..
పిల్లలను పక్షి వలే తన రెక్కలతో కాపాడుతూ.. వారి కష్టసుఖాల్లో నేనున్నానంటూ వెన్నుతట్టి నడిపించేది నాన్న. పిల్లల విజయాన్ని తన గెలుపుగా భావించి వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు నాన్న. పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు తాను కొవ్వొత్తిలా కరుగుతాడు నాన్న. ఓర్పుకు మారుపేరు.. మార్పుకు మార్గదర్శి.. నీతికి నిదర్శనం.. మన ప్రగతికి సోపానం నాన్నే. నేడు ఫాదర్స్డే సందర్భంగా ప్రత్యేక కథనాలు 8లో -
వివేరా హోటళ్ల అధినేతకు అవార్డు
భువనగిరి : ఉత్తమ రక్తదాతగా వివేరా హోటళ్ల అధినేత సద్ది వెంకట్రెడ్డికి అవార్డు లభించింది. రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సద్ది వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వివేరా హోటళ్లలో పనిచేసే సిబ్బంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తుంటారు. చాలా ఏళ్లుగా రక్తదానం చేస్తున్నందుకు గాను అవార్డు లభించినట్లు సద్ది వెంకట్రెడ్డి తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడినవారం అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ కిషోర్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, డైరెక్టర్ దిడ్డి బాలాజీ పాల్గొన్నారు. వెంకట్రెడ్డి పలువురు అభినందనలు తెలిపారు. -
లోక్ అదాలత్లో 9,411 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్ ద్వారా 9,411 కేసులు పరిష్కారం అయ్యాయి. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సమక్షంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. అన్ని కోర్టుల్లో ప్రత్యేకంగా 8 బెంచీలు, ఏర్పాటు చేశారు. కక్షిదారులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో హాజరై కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ 2,516, సివిల్ 7, ప్రి లిటిగేషన్, టెలిఫోన్ రుణ బకాయి, ఎస్బీఐకి సంబంధించి 94, ట్రాఫిక్ చలాన కేసులు 6,794 పరిష్కారం అయ్యాయి. రాజీమార్గమే రాజమార్గం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు అనూహ్య స్పందన లభించిందని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు తెలిపారు. భువనగిరి కోర్టులో లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు. వైవాహిక వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకొని ఒక్కటైన దంపతులకు అవార్డు అందజేసి అభినందించారు. రాజీమార్గమే రాజమార్గం అని.. చిన్న తగా దాలను లోక్ అదాలత్లో పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిదా, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జిస్వాతి, ప్రభుత్వ న్యాయవాదులు, ఏపీపీలు సౌజన్య, చంద్రశేఖర్, న్యాయ సహాయ అడ్వకేట్లు ఎస్.జయపాల్, ఎన్.శంకర్, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఫ అన్ని కోర్టుల్లో 8 ప్రత్యేక బెంచీలు ఏర్పాటు ఫ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కక్షిదారులు -
అడ్డంకులు తొలగినా ఆలస్యమే..
ఫ 18 సంవత్సరాల క్రితమే శంకుస్థాపన ఫ స్థలం సరిపోదంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన మార్కెటింగ్ అధికారులు ఫ మరో చోట అనువైన భూమి గుర్తింపు.. నేటికీ కలగని మోక్షం ఫ పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి అన్నదాతల అవస్థలు సంస్థాన్ నారాయణపురం : వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సంస్థాన్నారాయణపురం మండలంలో 33,150 ఎకరాల సాగు భూమి, సుమారు 15వేల మంది రైతులు ఉన్నారు. వీరంతా వరి, పత్తితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. వ్యయప్రయాసలకోడ్చి పండించిన పంటలను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులంతా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో మార్కెట్ నిర్మాణానికి 18 ఏళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా నేటికీ పునాది పడలేదు. మూడో దఫా 11 ఎకరాల స్థలం గుర్తింపు సంస్థాన్నారాయణపురం మండల కేంద్రంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరయ్యాయి. 2007 డిసెంబర్ 22న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 114 సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాలు గుర్తించారు. అది మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. దాని కోసం అప్పట్లో రూ.2.20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. గుర్తించిన స్థలంలో 1.10 ఎకరాలు గుట్ట ఉండడంతో మార్కెట్శాఖ సాంకేతిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన స్థలం చూపితేనే మార్కెట్ పనులు చేపట్టడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సంస్థాన్నారాయణపురం పరిధిలో సర్వే నంబర్ 450లో 44 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశిలించారు. అది కూడా రాళ్లు, గుట్టలతో నిండి ఉంది. ఎత్తయిన ప్రదేశంలో ఉండటం, దాని పక్కన అదర్శ పాఠశాల ఉండటం, గుట్టలు, రాళ్లు తొలగించి చదును చేయడం ఖర్చుతో కూడుకుందని అధికారులు చెప్పడంతో భూ సమస్య మొదటికి వచ్చింది. ఆ తరువాత మూడేళ్ల క్రితం సర్వే నంబర్ 255లో 11 ఎకరాల స్థలం గుర్తించారు. అందులో 6 ఎకరాలు మార్కెట్ యార్డుకు, 5 ఎకరాలు పీఏసీఎస్ గోదాంలకు కేటాయించారు. స్థలం అనువుగా ఉండటం, అధికారులు కూడా అంగీకరించారు. అడ్డంకులు తొలగినా నేటికీ పనులు ప్రారంభించడం లేదు. వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా వేసిన శిలాఫలకంసబ్ మార్కెట్ యార్డు ఏర్పాటుకు తాజాగా ప్రతిపాదించిన స్థలంమార్కెట్ లేక నష్టపోతున్నాం నారాయణపురంలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో వల్ల మండల రైతులందరం ఇబ్బంది పడుతున్నాం. ఇతర మార్కెట్లకు పోవాలంటే రవాణా చార్జీలు మీద పడి నష్టపోతున్నాం. స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేస్తే అదనపు భారం తప్పుతుంది. భూమి సిద్ధంగా ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించాలి. –రాచకొండ స్వామి, రైతు, సంస్థాన్నారాయణపురం 20 కిలో మీటర్లు పోవాల్సిందే.. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న చండూరు, చౌటుప్పల్, మాల్, మునుగోడు, చిట్యాల, నల్లగొండ మార్కెట్లకు వెళాల్సి వస్తుంది. పంట ఉత్పత్తులు తరలించడానికి వారికి అదనంగా రవాణా చార్జీలతో పాటు సమయం వృథా అవుతుంది. అంతదూరం వెళ్లినా మద్దతు ధర దక్కకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు విక్రయిస్తున్నారు. -
ఆటోడ్రైవర్ నుంచి ఆర్టీసీ డ్రైవర్గా
సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవర్గా రికార్డు సొంతం చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరితనాయక్. మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన సరిత ఇప్పటికే ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సు చక్రం తిప్పి దేశంలోనే బస్సును నడిపిన మొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్గా విధుల్లో చేరారు. అమ్మా నాన్నలు రాంకోటి, రుక్కలు. సరిత కుటుంబంలో నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. సరిత కొన్ని రోజులు దేవరకొండలో.. తర్వాత ఐదు సంవత్సరాలు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. ఆటో నడుపుతున్న సందర్భంగా ఎదురైన ఇబ్బందులును ఎదుర్కోవడానికి పురుషుల మాదిరిగా వేషధారణ మార్చింది హైదారాబాద్లోని బంధువులు ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. తెలంగాణలో ఉద్యోగం చేయాలని సరిత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు విన్నవించింది. హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి వెంకట్రెడ్డి ఆమె హామీ ఇచ్చారు. తాజాగా ఆమె ఎంజీబీఎస్ డిపోల్ పోస్టింగ్ పొందారు. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్స్టాప్ బస్సు నడిపారు. ఫ ఆర్టీసీ డ్రైవర్గా సరితనాయక్ ఫ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరిక -
ఆశ చూపి.. సొమ్ము కాజేసి!
అధిక వడ్డీ ఇస్తామని రూ.కోట్లలో వసూలు సాక్షి, యాదాద్రి: వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కిరాణ షాపుల యజమానులు వడ్డీలకు నడుపుతుంటారు. ఇదే క్రమంలో తమ వద్ద డబ్బులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని గ్రామస్తులకు ఆశ చూపారు. వారి మాటలు నమ్మి 80 మంది రూ.1.50 కోట్లు ఇచ్చారు. వ్యాపారులు తిరిగి చెల్లించకుండా గ్రామం నుంచి ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. బాధితులు డబ్బుల కోసం నేటికీ పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి ఘటనలతో అమాయక ప్రజలు రూ.లక్షల్లో మోసపోతున్నారు. తమ దగ్గర తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు చూపుతామంటూ, అధిక వడ్డీ ఇస్తామంటూ బంగారం దుకాణాలు, ఫైనాన్స్, చిట్ఫండ్ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు అక్రమ దందా చేస్తున్నారు. వందకు 10 రూపాయల వరకు వడ్డీ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. కొంతకాలం నెలనెలా వడ్డీ ఇవ్వడంతో వారి మాటలు నమ్మి అమాయక ప్రజలు అప్పుఇవ్వడం, పెట్టుబడులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు వసూలైన తరువాత వ్యాపారులు పత్తాలేకుండా పోతున్నారు. కొందరు ఐపీ పెట్టి అప్పులిచ్చిన వారి నోరు మూయిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 16 చీటింగ్ కేసులు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. వెలుగులోకి రానివి మరికొన్ని ఉన్నాయి. కేసులు పెడితే తమ పైసలు రావన్న ఉద్దేశంతో వీలైనంత వరకు రాజీమార్గంలో రాబట్టుకునేందుకు బాధితులు పెద్ద మనుషులు, మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ఘటనలు ● యాదగిరిగుట్టలో జైభవానీ జ్యువెలర్స్ పేరుతో ఇద్దరు వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. ప్రజల నుంచి బంగారం, వెండి తాకట్టు పెట్టుకుని కొంతకాలం తరువాత బోర్డు తిప్పేశారు. జనవరిలో ఈ ఘటన వెలుగుచూడగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. నమోదు అయ్యింది. జితేందర్ అనే పాన్ బ్రోకర్ వద్ద బంగారం, వెండి కుదువపెట్టినట్లు పోలీలీసులు గుర్తించారు. డబ్బుల కోసం బాధితులు తిరుగుతూనే ఉన్నారు. ● ఆలేరులో ఓ బైక్ కంపెనీ షోరూం నిర్వాహకుడు, అతని భార్య వందకు రూ.5నుంచి రూ.10 వరకు వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేశారు. కొంతకాలం తరువాత పత్తా లేకుండా పారిపోయారు. అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. ● ఆలేరు పట్టణంలో మెడికల్ షాప్ నిర్వాహకుడు వడ్డీ నిమిత్తం కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఐపీ పెట్టాడు. ఇచ్చిన డబ్బులు రాబట్టుకునేందుకు బాధితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ● జనగామకు చెందిన మేడారం సురేష్ మోత్కూరులో 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. అక్కడే ఇల్లు నిర్మించుకున్నాడు. మారుతీ పెయింటర్ పేరుతో షాప్ నిర్వహిస్తూ రూ.3కోట్ల వరకు అప్పులు చేశాడు. తిరిగి చెల్లించలేక ఆరు నెలల క్రితం దుకాణం సర్దుకుని పరారయ్యాడు. ● ఖమ్మం జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి మోత్కూరులో ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. రూ.5 లక్షల వరకు అప్పులు చేసి రాత్రికిరాత్రే గ్రామం నుంచి ఉడాయించాడు. ● మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన గోపాల్ బస్ కండక్టర్. అతని భార్య చిరుదుకాణం నిర్వహించేది. అందినకాడల్లా సుమారు రూ.50 లక్షలకు పైగా అప్పులు చేశారు. తిరిగి చెల్లించలేక పారిపోయారు. ఫ కొంతకాలం తరువాత బోర్డు తిప్పేస్తున్న ఘనులు ఫ బాధితులు ఒత్తిడి తేకుండా ఐపీ ఫ రూ.కోట్లలో నష్టపోతున్న జనం ఫ ఏడాదిన్నర కాలంలో జిల్లాలో 22 చీటింగ్ కేసులు -
మోత్కూరు ఎస్ఐ హెడ్క్వార్టర్కు అటాచ్
మోత్కూరు : క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మోత్కూరు ఎస్ఐ డి.నాగరాజును అంబర్పేట పోలీస్ హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్కు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముశిపట్ల గ్రామంలో ఒక యువకుడు సీఎం రేవంత్రెడ్డి, అధికార పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టడం, రాగిబావి గ్రామంలో భూ తగాదాలో ఇరు వర్గాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించడంపై ఎస్ఐ నాగరాజు విఫలమయ్యాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆయనను పోలీస్ హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐని హెడ్ క్వార్టర్కు అటాచ్ చేసిన విషయం వాస్తవమేనని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. రూ.1.50 లక్షల విలువైన పట్టు చీరలు బహూకరణ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి భూదాన్పోచంపల్లికి చెందిన చేనేత వ్యాపారి బొడ్డు శ్రీధర్, నవీన్లు రూ.1.50లక్షలు విలువ చేసే కంచి పట్టు చీరలు బహూకరించారు. శనివారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఆలయ అధికారి గజవెల్లి రఘుకు చీరలను అందజేశారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలి భువనగిరి : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సెమి రెస్సిడెన్షియల్ స్కూల్స్గా మార్చడంతో పాటు పర్యవేక్షణ అధికారుల పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్యూటీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం భువనగిరిలోని ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ సంఘం భవనంలో జరిగిన టీఎస్ యూటీఎప్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను డే పాఠశాలలుగా మార్చడం సరికాదన్నారు. ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేసి తరగతికి ఒక గది ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందుతుందన్నారు. వెంటనే పీఆర్సీని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, ఉపాధ్యక్షులు వెంకటాచారి, మమత, కోశాదికారి ముత్యాలు, నాయకులు దొడ్డి స్వామి, రవికుమార్, కరుణాకర్, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బాధ్యులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : దేశంలో అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లోవిశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు అవార్డులు అందజేయనున్నారు. 2026 సంవత్సరానికి ఇచ్చే పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫారసులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ awards.gov.in ద్వారా జులై 31లోగా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు padmaawards. gov.inలో ఉన్నాయని అధికారులు తెలిపారు. -
గిరిజన బిడ్డ ‘వీల్’ పవర్
సంస్థాన్ నారాయణపురం: మారుమూల తండాలో పుట్టి పెరిగిన గిరిజన బిడ్డ సరిత.. ప్రగతి రథం స్టీరింగ్ పట్టి చరిత్ర సృష్టించింది. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్స్టాప్ బస్సు నడిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన వి.రాంకోటి, రుక్కల కుమార్తె సరిత అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో కుటుంబ బాధ్యతను తీసుకుంది.ఈ క్రమంలో ఆటో నడపడం నేర్చుకుంది. ఐదేళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. అనంతరం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపింది. రెండేళ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయగా, సరిత ఒక్కతే ఎంపికైంది. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్గా గుర్తింపు పొందింది. ఆమె ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చేస్తూ రోజూ 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం: తెలంగాణలో ఉద్యోగావకాశం కల్పించాలంటూ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి సరిత తీసుకెళ్లింది. కోమటిరెడ్డి సిఫార్సు మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఉద్యోగం సాధించింది. ఎంజీబీఎస్ డిపోలో పోస్టింగ్ ఇచ్చారు. -
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
యాదగిరిగుట్ట: ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్లో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాత్రికి రాత్రి రవి మృత దేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అయిలయ్య సందర్శించారు. -
యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు మరొక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలువబోతుంది. ఇప్పటికే కొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించి, అందులో సర్కిల్స్, గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని రింగ్ రోడ్డులో ఆయా సర్కిల్స్లో సేదతీరేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే క్రమంలో ఉన్న సర్కిల్స్కు ఏవిధంగా అయితే నామకరణాలు చేశారో.. ఇప్పుడు యాదగిరి కొండ కింద ఉన్న సర్కిల్స్కు సైతం దేవుళ్ల పేర్లను అధికారులు పెట్టారు. మూడు, నాలుగు నెలల్లో విగ్రహాల ఏర్పాటు.. తిరుమల తిరుపతి తరహాలోనే యాదగిరి కొండకు దిగువన ఉన్న సర్కిల్స్కు నామకరణం చేశారు. ఇందులో వైకుంఠద్వారం వద్ద ఉన్న సర్కిల్కు శ్రీ అభయాంజనేయ, ప్రెసిడెన్షియల్ సూట్ వెళ్లే దారిలో ఉన్న సర్కిల్కు గరుడ, కొండపైకి వెళ్లే ఎగ్జిట్ ప్లై ఓవర్ (ప్రస్తుతం మూడో ఘాట్రోడ్డు ప్రారంభంలో) వద్ద ఉన్న సర్కిల్కు రామానుజ, యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వెళ్లే దారిలో ఉన్న సర్కిల్కు యాదర్షిగా నామకరణం చేశారు. ఈ నామకరణం చేసిన సర్కిళ్లలో ఆయా దేవుళ్ల విగ్రహాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈఓ వెంకట్రావ్ ఆలయ అర్చకులు, స్తపతులతో వాస్తు, ఆగమశాస్త్ర అంశాలపై చర్చించారు. మూడు, నాలుగు నెలల్లో విగ్రహాల ఏర్పాటు పూర్తి చేస్తామని ఈఓ చెబుతున్నారు. రింగ్ రోడ్డులో భాగంగా.. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి, పునః నిర్మాణంలో భాగంగా కొండ చుట్టూ సుమారు 5.2 కిలోమీటర్ల రింగ్ రోడ్డును విస్తరించారు. ఇందుకుగాను గత ప్రభుత్వం రూ.235.7 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో భూ సేకరణతోపాటు రింగ్ రోడ్డు విస్తరణ, ఎంట్రీ, ఎగ్జిట్ ఫ్లైఓవర్స్, గ్రీనరీ, డ్రైనేజీతోపాటు నాలుగు దిక్కులు నాలుగు సర్కిళ్ల ఏర్పాటుకు ఈ నిధులు ఖర్చు చేశారు. వైకుంఠద్వారం, మల్లాపురం వెళ్లే రహదారి, కొండపైకి ఎక్కడానికి ఏర్పాటు చేసిన మూడో ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లే మార్గంలో ఈ సర్కిళ్లను ఏర్పాటు చేసి, అందులో రకరకాల పుష్పాలతో భక్తులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. ఈ సర్కిళ్లకే దేవుళ్ల పేర్లు పెట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా.. స్వామివారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆయా సర్కిల్స్ వద్ద ఆగిపోతున్నారు. వైకుంఠద్వారం నుంచి రింగ్ రోడ్డు చుట్టూ తిరుగుతూ ఆలయానికి, కల్యాణకట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం, తులసీ కాటేజీ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే దారి తెలియక, రింగ్ రోడ్డులో ఏ సర్కిల్ వద్ద ఉన్నామో తెలియక తికమక పడుతున్నారు. దీంతో ఆలయ ఈఓ వెంకట్రావ్ రింగ్ రోడ్డులో ఉన్న సర్కిల్స్ కు వివిధ దేవుళ్ల పేర్లు పెడితే భక్తులు ఎక్కడ ఉన్నారో తమ కుటుంబ సభ్యులకు తెలిపేందుకు సులువుగా ఉంటుందని సర్కిల్స్కు నామకరణం చేశారు. వైకుంఠద్వారం వద్దకు వచ్చిన వారికి ఏ సర్కిల్ వద్దకు వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్తాం అనే వివరాలు సులువుగా తెలిసే అవకాశం ఉంది.ఫ తిరుమల తరహాలో నామకరణంఫ యాదగిరి కొండ చుట్టూ నాలుగు సర్కిల్స్ ఫ దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు -
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ
హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ పోటీల్లో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దాసరి వెంకన్న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరావత్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తన కుమారుడు రాహుల్ను శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థి సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని వెంకన్న చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్రెడ్డి విద్యార్థి రాహుల్కు అడ్మిషన్ అందజేశారు. కాగా, రాహుల్ 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. -
సైనిక్ గురుకుల కళాశాల విద్యార్థిని ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపిక
బీబీనగర్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల 2021–2024 బ్యాచ్ విద్యార్థిని వి.కావ్య ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపికయ్యారు.ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 28వ తేదీన దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి విధుల్లో చేరనున్నారు. కళాశాల నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఎంపికై న మొదటి విద్యార్థి కావ్య అని ప్రిన్సిపాల్ తెలిపారు. కావ్యను ప్రన్సిపాల్ శ్రీలత, కళాశాల కార్యదర్శి వర్షిణి, సహాయ కార్యదర్శి పీఎస్ఆర్ శర్మ, ఉప కార్యదర్శి రజిని, అధ్యాపకులు అభినందించారు. వాట్సాప్ గ్రూపులో తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసుమోత్కూరు : మండలంలోని ముశిపట్ల గ్రామ వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు పోస్టు చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు. వివరాలు.. ఈ నెల 6న మావూరి ముచ్చట్లు (ముశిపట్ల) గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేర్లకంటి శ్రీనివాస్, బోనగిరి హరీష్ పోస్టు చేశారు. ఆ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గీత కార్మికుడికి గాయాలునకిరేకల్ : చందుపట్లకు చెందిన కొప్పు పెద్ద శ్రీను(44) గీత కార్మికుడు రోజువారీ మాదిరిగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో గాలి రావడంతో చెట్టు కూలిపోయి కిందపడి గాయపడ్డాడు. శ్రీనును కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
చిట్యాల: బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన హ్యాండ్బ్యాగ్ను భద్రపరిచి తిరిగి ఆమెకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ జంగయ్య. వివరాలు.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎల్లారెడ్డిగూడెం నుంచి చిట్యాలకు వస్తున్న యువతి తన హ్యాడ్బ్యాగ్ను మరిచిపోయి చిట్యాల బస్టాండ్లో దిగి వెళ్లిపోయింది. అనంతరం ఆ యువతి కార్గో సెంటర్ నిర్వాహకుడు పొలిమెర దశరథ ద్వారా కండక్టర్కు సమాచారం అందించింది. దీంతో హ్యాండ్బ్యాగును కండక్టర్ తీసుకుని తన వద్ద భద్రపరుచుకున్నాడు. వెంటనే రామన్నపేటకు వచ్చిన యువతికి కండక్టర్ జంగయ్య ఆ హ్యాండ్బ్యాగు అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. రెండు ఇళ్లల్లో చోరీబీబీనగర్: మండల కేంద్రంలోని ఓ కాలనీలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. బీబీనగర్లోని గోకుల్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన వెంకటేశ్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్లాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న తులం బంగారు చైన్తోపాటు వెండి వస్తువులను అపహరించుకుపోయారు. వారు శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన ఇంట్లో పోలీసులు శుక్రవారం పరిశీలించి ఆధారాలు సేకరించారు. అలాగే అదే కాలనీలో చోరీ జరిగిన ఇంటి సమీపంలో పోచంపల్లి మండలంలోని ఇంద్రియాలకు చెందిన కవిత అద్దెకు ఉంటోంది. ఆమె కూడా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వస్తువులను చిందరవందరగా పడవేశారు. ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటిని పరిశీలించారు. కాగా ఇదే కాలనీలో ఇటీవల ఓ ఇంట్లో రూ.50 వేల నగదుతోపాటు బయట పార్క్ చేసి ఉన్న కారును దొంగిలించుకుపోయారు. ఆలయంలో.. నడిగూడెం : మండల పరిధిలోని వేణుగోపాలపురం సమీపాన ఉన్న శ్రీలక్ష్మి తిరుపతమ్మ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దారపునేని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగులగొట్టి, ఆలయంలోని హుండీలను ధ్వంసం చేసి హుండీల్లో ఉన్న దాదాపు రూ.15 వేల నగదు చోరీ చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కూలీ మృతివలిగొండ : భవన నిర్మాణ పనికి వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నపాక బాబు అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులకు దినసరి కూలీగా వెళ్తున్నాడు. చిన్నపాక బాబు గురువారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. బైక్ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణంచివ్వెంల(సూర్యాపేట) : బైక్ ఢీకొట్టడంతో జర్నలిస్ట్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చెరుపల్లి సత్యం (70) మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద రహదారి దాటుతుండగా మోతె నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం, తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సత్యంను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..
ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కామునిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాగటి ఆనంద్ శ్రీకోకోనట్ కై ్లంబర్శ్రీ (కొబ్బరిచెట్లు ఎక్కే పరికరం) సహాయంతో తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో దీనిని తయారు చేయించి తీసుకొచ్చాడు. యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నానని, ఈ పరికరం ఐదు కిలోల బరువు ఉంటుందని, దీని ధర రూ.10,600 ఉందని ఆనంద్ చెప్పాడు. ఒక చెట్టు నుంచి మరో చెట్టు వరకు మోకును తీసుకెళ్లినట్టే సులభంగా తీసుకెళ్లవచ్చని, గీత కార్మికులకు రక్షణగా ఉంటుందని వివరించాడు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్య అందుతుందని జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. భువనగిరి మండలం తాజ్పూర్ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ సొంత ఖర్చుతో డిజిటల్ తరగతి గదిలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీలను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, డిజిటల్, ఆంగ్లమాధ్యమంలో చదువు చెబుతున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ర్యాకల శ్రీనివాస్ను జెడ్పీ సీఈఓ, డీఈఓ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ నాగవర్థన్రెడ్డి, ఎంపీఓ దినకర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ ర్యాకల సంతోషశ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ జెడ్పీ సీఈఓ, డీఈఓ -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
భువనగిరి: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి మండలంల పెంచికల్పహాడ్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించారు.రెవెన్యూ అధికారులు భూ రికార్డులతో సదస్సులకు హాజరై వీలైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారని పేర్కొన్నారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సహాయ, సహకారాలు అందజేయటానికి హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతకుముందు రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంజిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
భువనగిరిటౌన్: బాలకార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పిలుపునిచ్చారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, యజ మానులపై కేసులు నమోదు చేయడంతో పాటు రెండేళ్ల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా ఉంటుందన్నారు. బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాగిరెడ్డి, రమణి, మోయిజుద్దీన్, సీడీపీఓ శైలజ, బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
మూడు నెలలు ఆగాల్సిందే..
భువనగిరి: కొత్తగా రేషన్కార్డులు మంజూరైన లబ్ధిదారులు బియ్యంకోసం మూడు నెలలు ఆగాల్సిందే. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఈనెలలోనే పంపిణీ చేస్తున్నారు. మే 20వ తేదీ కంటే ముందు కార్డులు పొందిన వారికి కోటా ప్రకారం ప్రభుత్వం బియ్యం కేటాయించింది. దీంతో మే 20 తర్వాత కార్డులు పొందిన లబ్ధిదారులకు సెప్టెంబర్లో బియ్యం అందనున్నాయి. 13,587 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామసభలు, మీ సేవ కేంద్రాల ద్వారా 1,96,105 దరఖాస్తులు వచ్చాయి. మీసేవల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి కార్డులు మంజూరు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి మొదలైంది. పాతవి, కొత్త కార్డులు కలిపి మే 20వ తేదీ నాటికి జిల్లాలో 2,18,963 కార్డులు, 7.09 లక్షల యూనిట్లు ఉన్నాయి. మూడు నెలలకు సంబంధించి 13,587 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను ప్రభుత్వం కేటాయించగా.. ప్రస్తుతం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ఫ మే 20 తర్వాత మంజూరైన కార్డులకు సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం ఫ ప్రస్తుత కోటా 65 శాతం పంపిణీ పూర్తి ఫ 1,640 మంది కార్డుదారులకు తప్పని నిరీక్షణ 1,640 దరఖాస్తులు మే 20వ తేదీ తర్వాత 1,640 కార్డులు జారీ అయ్యాయి. ఇందులో 3,250 యూనిట్లు ఉన్నాయి. వారందరికీ సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం అందనున్నాయి.లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్న మూడు నెలల బియ్యం పంపిణీ 65 శాతం పూర్తయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
బడిబాట ద్వారా 100 అడ్మిషన్లు
భువనగిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు కొత్తగా 100 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఉండగా గత ఏడాది ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసే నాటికి 260 మంది విద్యార్థులున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు 100 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 360కి చేరింది. బడిబాట ఈనెల 19వ తేదీ వరకు కొనసాగనుందని, విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులనమోదు పెంచండి సాక్షి,యాదాద్రి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు పెంచాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం వచ్చిన అడ్మిషన్ల వివరాలను కళాశాలల వారీగా సమీక్షించారు. కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి గడువు ఉన్నందున ఆలోపు టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన గురించి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని, స్లిప్ టెస్టులు నిర్వహించి అందులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఉన్నతస్థానం వెళ్లేలా నాణ్యమైన విద్యను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి పాల్గొన్నారు. సీఎం కప్ విజేతలకు అభినందన భువనగిరి: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కిక్బాక్సింగ్ విభాగంలో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి తన చాంబర్లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. మున్ముందు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిలా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు, గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్, మాస్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఎంపవర్మెంట్ బోర్డు అధ్యక్షుడిగా సత్యనారాయణ భూదాన్పోచంపల్లి: సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడిగా భూదాన్పోచంపల్లి పట్టణానికి చెందిన దోర్నాల సత్యనారాయణ నియామకం అయ్యారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం పాటుపడుతానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లా స్థాయి కమిటీలు నియమించి బోర్డును బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. -
ఉల్లంఘిస్తే ఏఐ పట్టేస్తుంది!
వాహనదారులపై ఆధునిక పరిజ్ఞానంతో నిఘా ట్యాబ్కు క్షణాల్లో సమాచారంరోడ్లు, కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు ఆయా మార్గాల్లో వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను క్యాప్చర్ చేస్తాయి. పన్ను చెల్లించ లేదా, బీమా ఉందా, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులున్నాయా.. ఇలా సమాచారమంతా విశ్లేషించి క్షణాల్లో రవాణాశాఖ అధికారుల వద్ద ఉన్న ట్యాబ్కు చేరవేస్తాయి. కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి దూరంగా ఉన్న అధికారుల ట్యాబ్లో వాహననంబర్ కనిపిస్తుంది. దాని ఆధారంగా వాహనదారుడు తమ దగ్గరకు రాగానే ఆపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఏఐతో రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసే విధానం ఉండదు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఏఐ కెమెరాలు బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజాతో పాటు జాతీయ రహదారులపై, రవాణా శాఖ కార్యాలయంలో ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా అవసరమైన చోట ఇంటిలెజెన్స్ ఆర్టిఫిషియల్ పరిజ్ఞానాన్ని విస్తరిస్తారు. ఫ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే పట్టుకోవడం, గుర్తించడం ఇక సులువు ఫ జరిమానాలు, కేసులున్నా, బీమా, ధ్రువీకరణ పత్రాలు లేకున్నా తక్షణమే గుర్తింపు ఫ వాహన చోరీలకు చెక్ ఫ జిల్లాలో త్వరలోనే వినియోగంలోకి కృత్రిమ మేధ ఫ ఎంపిక చేసిన ప్రాంతాల్లో కిట్ల ఏర్పాటుకు సన్నాహాలు ఫసిబ్బందికి శిక్షణ పూర్తి సాక్షి, యాదాద్రి: ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులను గుర్తించడం, పట్టుకోవడం సులువు కానుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు జిల్లా రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఏఐ టూల్స్ వినియోగంపై రవాణాశాఖలోని ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్స్, ఏఎంవీఐలకు ఇప్పటికే హైదరాబాద్లో శిక్షణ పొందారు. జిల్లాలోనూ కృత్రిమ మేదాను వినియోగించేందుకు శిక్షణ తీసుకున్న సిబ్బంది కసరత్తు ప్రారంభించారు. వాహనదారులను క్యాప్చర్ చేసేందుకు ఎక్కడెక్కడ ఏఐ కెమెరాలు, పరికరాలు ఏర్పాటు చేయాలి, ఎంత ఖర్చవుతందనే వివరాలతో రవాణా శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు -
అవగాహన కల్పించి.. సందేహాలు తీర్చి
భువనగిరి: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ముగిసింది. మే 5న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 13వ తేదీ వరకు 40 రోజుల పాటు కొనసాగింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యానవన, ఆయిల్ఫెడ్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం భాగస్వాములను చేసింది. వీరంతా ఆరు బృందాలుగా ఏర్పడి ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. మెరుగైన సాగు పద్ధతులకు సంబంధించి ఆరు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ అంశాలపై అవగాహన ● అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దాని వాడకం తగ్గించాలి. యూరియా వాడడం వల్ల లాభ, నష్టాలపై వివరించారు. ● అధిక దిగుబడుల కోసం రైతుల అవసరానికి మించి రసాయనానలు వాడుతున్నారు. దాని ప్రభావం వాతావరణం, రైతుల ఆరోగ్యం పడుతుంది. అదే కాకుండా పెట్టుబడుల వ్యయం కూడా పెరుగుతుందన్నారు. ● విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. సాగు కాలం ముగిసేదాకా రశీదును భద్రపర్చుకోవాలి. రశీదు ఉండటం వల్ల విత్తనాలు, పురుగు మందుల కారణంగా నష్టపోతే పరిహారం పొందవచ్చని సూచించారు. ● వరి సాగుకున నీటిని ఎక్కువగా వాడకూడదు. రెండు, మూడు రోజులకు ఒకసారి పొలంలో తడి ఉంటే సరిపోతుందన్నారు. ● పంట మార్పిడి చేయాలి. రాష్ట్రంలో 95 మంది రై తులు వరి, పత్తి సాగు చేస్తున్నారని.. పంట మా ర్పిడి వల్ల సుస్థిర ఆదాయం పొందడమే కా కుండా భూమి సారం కోల్పోకుండా ఉంటుందన్నారు. ● నీటి వృథా చేయవద్దు. నీటి సంరక్షణ చర్యలు పాటించి భవిష్యత్ తరాలకు నీటి ముప్పు రాకుండా చూడాలి.రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి సాగు విధానాల గురించి తెలుసుకోవడంతో పాటు తమ సందేహాలను వ్యక్తపరిచారు. శాస్త్రవేత్తలు వారి సందేహాలను నివృత్తి చేశారు. మెరుగైన సాగు పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వాడకంపై తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులను సన్నద్ధం చేయటానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించాం. –అనిల్కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త85 గ్రామాల్లో 4,738 మంది రైతులతో మమేకమైన శాస్త్రవేత్తలు ఫ మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన ఫ కర్షకుల ప్రశ్నలకు సమాధానం ఫ ముగిసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ విత్తన ఎంపిక, ఎరువుల వాడకంపైనే అధికం.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఎంపిక చేసిన 85 గ్రామాల్లో 4,738 మంది రైతులు హాజరయ్యారు. ఇందులో పురుషులు 3,981, మహిళా రైతులు 757 మంది ఉన్నారు. నూతన సాగు పద్ధతులు, సాంకేతిక పరికరాలు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని, సమస్యను ఎలా అధిగమించాలని ఎక్కువ మంది రైతులు కోరారు. అలాగే ఏ పంటకు ఏ సమయంలో, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎలా వినియోగించాలని ప్రశ్నలు వేశారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. -
చేనేత.. దేశ వారసత్వ సంపద
సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు.అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు. -
మోదీ వల్లే ప్రపంచదేశాల్లో భారత్కు గుర్తింపు
భువనగిరి: భారతకు ప్రపంచదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ తెలంగాణ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీజీ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భువనగిరిలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు.. ఆపరేషన్ సిందూర్ పేరుతో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు మొక్కలు నాటడంతో పాటు వరసిద్ధి వినాయక దేవాలయంలో పూజలు నిర్వహించారు. అలాగే మట్టి బాటిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మరావు, భరత్ ప్రసాద్, నాయకులు ఏలే చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్, నాయకులు పట్నం కపిల్, రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్, ప్రవీణ్, మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, చందుపట్ల వెంకటేశ్వరరావు, గూడూరునారాయణరెడ్డి, పడమటి జగన్మోహన్రెడ్డి, నర్ల నర్సింగ్రావు, మాయ దశరథ, సీఎన్రెడ్డి, పడాల శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, వైజయంతి, సుర్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది.. కాటన్, సెమికాటన్, సిల్క్తో అనేక వైరెటీలలో ఇక్కత్ వస్త్రాలు తయారు చేయడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కొనియాడారు. గురువారం ఆయన తన సతీమణి సుధా డెబ్బార్మతో కలిసి భూదాన్పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులోని చేనేత కాన్ఫరెన్స్ హాలులో చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ప్రపంచంతో పాటు దేశంలో ఏ మూలకుపోయినా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరిస్తున్నారని అభినందించారు. పోచంపల్లి ఇక్కత్, కంచి, ఒడిశా తదితర చేనేత వస్త్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఎక్చేంజ్లో చేనేతవస్త్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. పోచంపల్లికి మళ్లీ వస్తా దేనికై తే పేరుంటుందో దానికి నకిలీల బెడద ఉంటుందని, దాంతోనే పోచంపల్లి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పదనం అర్థమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రింట్ఫొటోకు, పెయింటింగ్ ఫొటోకు తేడా ఉన్నట్లే మిల్లులో తయారైన వస్త్రానికి, మగ్గంపైన తయారైన వస్త్రానికి ఉన్న తేడా, నాణ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎప్పుడైనా చేనేత వస్త్రాలను మిల్లులో తయారైన వస్త్రంతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం మార్కెటింగ్, డుప్లికేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. పోచంపల్లి ఇక్కత్ పేరు విన్నానని, అలాగే పుస్తకాల్లో చదివానే తప్ప.. వస్త్రాలు ఎలా తయారవుతాయో తనకు తెలియదన్నారు. పోచంపల్లికి వచ్చి ప్రత్యక్షంగా ఇక్కత్ వస్త్రాల తయారీని చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోచంపల్లికి మళ్లీ వస్తానన్నారు. జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేనేత నాయకుడు తడక వెంకటేశం ఇచ్చిన వినతి మేరకు గవర్నర్ స్పందిస్తూ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాఽధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు గర్దాస్ ఉపేందర్, కుంట్లగూడెంకు చెందిన భాగ్యలక్ష్మి, వనం యాదగిరికు నేతన్న బీమా, కూర పాటి నిర్మల, పొట్టబత్తిని సుగుణ, దోర్నాల ధనుంజయ్యకు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. చేనేతకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే కుంభం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాధా న్యమిస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. త్రిప్ట్ పథకం, వయస్సుతో నిమిత్తం లేకుండా వృత్తిపై ఆధారపడిన చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నేతన్నకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళా కార్మికుల సేవలు బేష్ : కలెక్టర్ పురుషులతో సమానంగా మహిళా కార్మికులు చేనేత పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారని కలెక్టర్ అన్నారు. నేతన్నలకు టెక్నాలజీ ఉపయోగించి ఉపాధి కల్పించాలని గవర్నర్ ఆలోచన చేస్తున్నారని, ఎన్ఐటీతో మాట్లాడి అధ్యయనం చే యాలని కోరారని తెలిపారు.గవర్నర్ ఆలోచన స త్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఫ ప్రపంచం, దేశంలో ఏ మూలకెళ్లినా ఇక్కత్ వస్త్రాలు ధరిస్తున్నారు ఫ చేనేత డిజైన్ల అభివృద్ధి, ఉపాధి కల్పనకు సహకరిస్తా ఫ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఫ సతీమణితో కలిసి భూదాన్పోచంపల్లి సందర్శన చేనేత గృహాలకెళ్లి.. కుటుంబాల జీవన స్థితిగతులపై ఆరా తీసి.. గవర్నర్ పోచంపల్లి పర్యటనలో భాగంగా తొలుత చేనేత కార్మికులు పెండెం కృష్ణ, భారత మధు, భారత భాస్కర్ ఇళ్లను సందర్శించారు. వారు గవర్నర్ దంపతులకు బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఎన్నేళ్ల నుంచి చేనేత వృత్తి చేస్తున్నారు, ఎంత గిట్టుబాటు అవుతుందని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యూజి యంను సందర్శించారు. కొకూన్స్, నూలు, నూలువడకడం, చిటికికట్టడం, ఆసుపోయడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్ర తయారీ ప్రక్రియలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్, తేలియా చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేతకళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. గవర్నర్ స్వయంగా మగ్గం నేసి అబ్బురపర్చారు. అనంతరం పోచంపల్లి చేనేత ప్రాముఖ్య ఏవీని తిలకించారు. కార్యక్రమంలో చేనేత, జౌళిశాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, ఆర్డీడీ పద్మ, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏడీ శ్రీనివాసరావు, ఏడీఎం కళింగరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్థన్, గజం అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబు రావు, ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఏసీపీ మధుసూధన్రెడ్డి, చేనేతనాయకులు తడక వెంకటేశం, తడక రమేశ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, అంకం పాండు, మెరుగు శశికళ, గుర్రం హేమలత, హరిశంకర్, కాంగ్రెస్ నాయకులు పాక మల్లేశ్, సామ మధుసూధన్రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
బడిగంట మోగింది..
పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం తక్కువగా వచ్చారు విద్యా సంవత్సరం మొదటి రోజు కావడంతో పాఠశాలలకు విద్యార్థులు తక్కువగా హాజరయ్యారు. గతంలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరిచాం. పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశాం. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశాం. సాయంత్రం పాఠశాలలు ముగిసిన అనంతరం ప్రతి రోజూ సాయంత్రం గంట సమయం అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం. –సత్యనారాయణ, డీఈఓ సాక్షి,యాదాద్రి: బడిగంట మోగింది. నూతన విద్యా సంవత్సరం గురువారం నుంచి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలను పూలు, మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు గులాబీ పువ్వులు అందజేసి స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తోటి స్నేహితులు కలవడంతో విద్యార్థులు కబుర్లు చెప్పుకుంటూ.. ఉపాధ్యాయులు చెప్పే విశేషాలు వింటూ గడిపేశారు. తొలిరోజు కావడంతో విద్యార్థులు అంతంత మాత్రమే హాజరయ్యారు. పుస్తకాలు, యూనిఫాం అందజేత జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 754 ఉన్నాయి. వీటిలో సుమారు 53 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాలతో పాటు ఒక జత చొప్పున స్కూల్ యూనిఫాం అందజేశారు. విద్యార్థులు ఇలా.. తొలిరోజు పాఠశాలలకు 40 శాతం లోపే విద్యార్థులు హాజరయ్యారు. ఆత్మకూర్(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. సోమవారం నుంచి విద్యార్థుల హాజరు పెరగనుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వసతిగృహాల విద్యార్థులు ఇళ్లనుంచి రాలేదు. అంతేకాకుండా బడి బాటలో గుర్తించిన విద్యార్థులను పాఠశాల ల్లో చేర్పించాల్సి ఉంది.ఫ విద్యార్థులకు వినూత్నంగా వెల్కమ్ చెప్పిన ఉపాధ్యాయులు ఫ పాఠ్య, నోట్ పుస్తకాలు, ఒక జత చొప్పున యూనిఫాం పంపిణీ ఫ గతంలో మూతపడిన పాఠశాలలు విద్యార్థులతో కళకళ -
వార్డుల పరిధి మారుతోంది
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో వార్డుల పరిధి, ఓటర్ల సంఖ్య మారనుంది. ఇటీవల రెండో వార్డులో భాగమైన సాయిగూడెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన నేపథ్యంలో వార్డుల పునర్విభజన అనివార్యమైంది. ఈ వార్డు నుంచి సుమారు 888 ఓటర్లు సాయిగూడెంలోకి వెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఓటర్లు ఇలా.. 2020 మున్సిపల్ ఎన్నికల సమయానికి ఆలేరు మున్సిపాలిటీలో మహిళలు 6,597, పురుషులు 6,678 మొత్తం 13,275 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మహిళలు 6,902, పురుషులు 6,624 మొత్తం13, 526 మంది ఓటర్లు నమోదయ్యారు. కొత్తగా 251మంది ఓటర్లు పెరిగారు. కాగా వార్డుల పునర్విభజనలో భాగంగా ఒక వార్డు పరిధిలో సగటున 1,127 మంది ఓటర్లు ఉండాలని అధికారులు నిర్ణయించారు. ఈ సంఖ్యకు పది శాతం తక్కువ (1,014), ఎక్కువ శాతం(1,240) ఓటర్లకు మించకుండా వార్డుల విభజన చేపట్టారు. దాంతో ఒక వా ర్డు పరిధిలోని కాలనీ.. మరో వార్డులోకి వెళ్లనుంది. ఒక కాలనీ.. వేర్వేరు వార్డుల పరిధిలోకి.. ● పునర్విభజన వల్ల 2,3,4,5 వార్డుల్లో ఎక్కువగా మార్పులు చోటు చేసుకున్నాయి. ● 3వ వార్డు పరిధిలోని బుడిగజంగాల కాలనీ, ఆదర్శనగర్ కాలనీ(14–255 ఇంటి నుంచి చివరి ఇంటి వరకు కొంతభాగం), రైల్వే క్వార్టర్స్ కాలనీ 2వ వార్డు పరిధిలోకి వెళ్లాయి. ● 4వ వార్డులో ఉన్న కాటమయ్యనగర్ కొంతభాగం 3 వార్డులోకి వెళ్లింది. ● 5 వార్డు పరిధిలోని మెయిన్రోడ్డు కొంతభాగం 4వ వార్డు పరిధిలోకి వెళ్లింది. ఆయా కాలనీల ఓటర్లు మారిన వార్డు పరిధిలోకి వెళ్లనున్నారు. 16 వరకు దరఖాస్తుల పరిశీలన 16వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు. అనంతరం ఆమోదం కోసం కలెక్టర్కు పంపించనున్నారు. అనంతరం మున్సిపల్ ఉన్నతాధికారుల పరిశీలిస్తారు. తుది జాబితా ఈనెల 21న ఖరారుకానుంది. పారదర్శకంగా వార్డుల పునర్విభజన వార్డుల పునర్విభజన పారదర్శకంగా చేపట్టాం. విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐదుగురు దరఖాస్తులు అందజేశారు. వాటిని పరిశీలించి 16వ తేదీ వరకు పరిష్కారం చూపుతాం. ఆ తరువాత కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తాం. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆమోదం అనంతరం తుది జాబితా ఈనెల 21న ఖరారవుతుంది. –శ్రీనివాస్, ఆలేరు మున్సిపల్ కమిషనర్అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి వార్డుల పునర్విభజన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. వార్డుల విభజన, ఓటర్ల కేటాయింపు, వార్డులు, ఇంటి నంబర్లు, కాలనీల వారీగా ఓటరు జాబితా రూపొందించడంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్ చొరవ చూపాలి. –మొరిగాడి మాధవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడిపోయిన సాయిగూడెం ఫ గ్రామ పంచాయతీగా ఏర్పాటు ఫ మరోసారి వార్డుల పునర్విభజన ఫ విభజన అశాసీ్త్రయంగా ఉందంటూ పలువురి అభ్యంతరం అభ్యంతరాలు ఇవీ.. వార్డుల పునర్వివిభజనపై మున్సిపల్ కమిషనర్ ఈనెల 5వ తేదీన ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈనెల 11వ తేదీ వరకు గడువు ఇవ్వగా ఐదు దరఖాస్తులు వచ్చాయి. 11వ వార్డుకు చెందిన కొంతమంది ఓటర్లు వేరే వార్డులోకి వెళ్లడంతో పాటు కొత్త ఓటర్లు ఎక్కువగా ఉన్నారని అభ్యంతరం. బీసీ కాలనీ ఓట్లన్నీ రెండు వార్డుల్లో కాకుండా ఒకే వార్డు పరిధిలో ఉండాలి. 6వ వార్డులో న్యూశాంతినగర్, డబుల్ బెడ్రూం కాలనీ మాత్రమే ఉండాలి. అదనపు కాలనీలు వద్దు. ఇంటి నంబర్ల వారీగా ఓటర్లంతా ఒక వార్డుల్లోనే ఉండాలని ఆయా ప్రాంతాల ప్రజలు దరఖాస్తులు అందజేశారు. -
వయోవృద్ధులను గౌరవించాలి
భువనగిరి: వయోవృద్ధులను చులకన భావంతో చూడవద్దని, వృద్ధాప్యం, ఆరోగ్యస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి సేవలందించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సూచించారు. గురువారం భువనగిరి మండలం చీమలకొండూరు పరిధిలోని బెజ్జ లక్ష్మయ్య ఫౌండేషన్ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వయోవృద్ధులు ఒంటరివారు కారని, వారి సంరక్షణకు చట్టాలు, హక్కులు ఉన్నట్లు చెప్పారు. అనంతరం వృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామ పరిధిలో ఉన్న కోళ్ల ఫారంను సందర్శించి కూలీలతో మాట్లాడారు. పిల్లలు రేపటి దేశ సంపదని, వారిని పనిలో పెట్టవద్దని, పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. బడీడు పిల్లలను పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అధికారులను అదేశించారు. ఆమె వెంట పారా లీగల్ వలంటీర్లు మల్లేశం తదితరులు ఉన్నారు. -
మూత‘బడి’నవి ఓపెన్
విద్యార్థులు లేక మూతబడిన పలు పాఠశాలలు తెరుచుకున్నాయి. యావాపూర్, మహదేవ్పూర్, లక్ష్మిదేవిగూడెం, పెద్దపలు గుతండా, సోమరాజు బావి, బైరాంనగర్, పోతిరెడ్డిపల్లి, నూనెగూడెంలోని ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పదో తరగతిలో సాధించిన ఫలితాలు, నాణ్యమైన భోజనం తదితర అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో సఫలీకృతం అయ్యారు. బొమ్మలరామారం మండలం యావాపూర్తండా ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రారంభించారు. -
కార్పొరేట్ కళాశాలలకు 40 మంది ఎంపిక
భువనగిరిటౌన్ : 2025–26 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాల పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో లాటరీ ద్వారా 40 మందిని ఎంపిక చేశారు. వారికి అదనపు కలెక్టర్ భాస్కర్రావు గురువారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యమని, కార్పొరేట్ కళాశాలలకు ఎంపికై న వారికి ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందన్నారు. కేటాయించిన కళాశాలల్లో ఈనెల 21లోపు చేరాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జినుకల శ్యాంసుందర్, వెనుకబడిన తరగతుల అధికారి జిల్లా యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ పర్యటన సాగిందిలా..
● ఉదయం 10.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులు పోచంపల్లికి చేరుకున్నారు. ● 10.30నుంచి 11.00 వరకు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు ● 11.00 నుంచి 11.05.. టూరిజం పార్కులో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ● 11.05 నుంచి 11.20 అల్పాహారం స్వీకరించారు. ● 11.20 నుంచి 11.45.. టూరిజం పార్కులోని మ్యూజియంలో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. ● 11.45 నుంచి 12.40.. టూరిజం పార్కులో చేనేత కార్మికులతో ముఖాముఖి ● 12.40 నుంచి 12.55: పోచంపల్లి చేనేత పరిశ్రమ ప్రాముఖ్యతపై ప్రదర్శించిన ఏవీ తిలకించారు. ● 12.55 నుంచి 12.58.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ● మధ్యాహ్నం ఒంటి గంటకు పోచంపల్లి నుంచి రాజ్భవన్కు బయలుదేరి వెళ్లారు. -
ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ నిమితులయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్కుమార్ను ఇటీవల ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విధితమే. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇంచార్జిగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణా రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇంచార్జిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డికి ఈసారి ఎక్కడా బాధ్యతలు అప్పగించలేదు. 104 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు భువనగిరి: వేసవి సెలవుల్లో నిర్వహించిన వృత్యంతర శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులకు డీఈఓ సత్యనారాయణ గురువారం నోటీసులు జారీ చేశారు. మే నెలలో ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వగా 104 మంది వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీఈఓ పేర్కొన్నారు.మోత్కూరు మీదుగా ఎలక్ట్రిక్ బస్సులు మోత్కూరు: సూర్యాపేట డిపో ఆధ్వర్యంలో సూర్యాపేట నుంచి తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరి మీదుగా సికింద్రాబాద్ వరకు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 5 గంటలకు, 6.30, 7.10, 7.50, 8.30, మధ్యాహ్నం 12.30, 1.10, 1.50, 2.30, 3.10 గంటలకు సూర్యాపేట డిపోనుంచి బస్సులు బయలుదేరనున్నాయి. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి సూర్యాపేటకు సాయంత్రం 5 గంటలకు, 5.40, 6.20, 7, 7.40, 14.30, 3.15, 3.55, 4.35, 5.15 గంటలకు బస్సులు వస్తాయని సూర్యాపేట డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్: అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ అదనపు కలెక్టర్ వీరారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. అర్హులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబ యజమాని ఏ కారణం చేత మరణించినా పథకం వర్తిస్తుందన్నారు. మీసేవ కేంద్రాలు లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూలై 2022 నుంచి రైతు ఆత్మహత్యలకు సంబంధించి 624, వితంతు పింఛన్కు 2,269 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చాయన్నారు. -
చేనేత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం నల్లగొండ పట్టణంలోని పద్మానగర్ కాలనీలో చేనేత కార్మికుల మగ్గాలను ఆయన పరిశీలించి మాట్లా డారు. చేనేత కార్మికుల హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చేనేత సంఘాలకు ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం పాతబస్తీ హనుమాన్నగర్లో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సమస్యలపై పద్మశాలి సంఘం నాయకులు ఎంపీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పోతెపాక లింగస్వామి, మిర్యాల వెంకటేశ్వర్లు, గడ్డం మహేష్, కాశమ్మ, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పకీరు మోహన్రెడ్డి, పాలకూరి రవి పాల్గొన్నారు. -
వైభవంగా సుదర్శన నారసింహ హోమం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఉదయం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వైభవంగా జరిపించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతిఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): రోడ్డు దాటుతున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ పరిధిలోని దండు మైసమ్మ ఆలయం వద్ద గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం తేలువారిగూడేనికి చెందిన గట్టిగొర్ల మహేష్, శ్రావణి దంపతులు వారి కుమారుడు మోక్షిత్(4)తో కలిసి గురువారం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ పరిధిలోని దండు మైసమ్మ ఆలయ సన్నిధిలో తమ బంధువుల శుభకార్యానికి వచ్చారు. ఆలయం వద్ద మోక్షిత్ రోడ్డు దాటుతుండగా.. సూర్యాపేట నుంచి నెమ్మికల్లుకు వస్తున్న ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోక్షిత్ను సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. శ్రీకాంత్గౌడ్ తెలిపారు. -
యాదగిరీశుడి సేవలో హిమాచల్ప్రదేశ్ సీఎస్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయాధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండ కింద గల సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం ఆలయ ఉద్యోగులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు రూ.4,47,66,560, మిశ్రమ బంగారం 115 గ్రాములు, మిశ్రమ వెండి 6.50 కిలోలు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ ఆదాయం 44 రోజులదిగా ఈఓ పేర్కొన్నారు. -
గవర్నర్ పర్యటనలో అపశృతి
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లిలో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జనరేటర్ వాహనం నుంచి వినోబాభావే మందిరం గోడపై నుంచి టూరిజం పార్కులోనికి కరెంట్ వైరును అమర్చారు. ఈ క్రమంలో వినోబాభావే మందిరం టాయ్లెట్ స్లాబ్ గోడ పైనుంచి వెళ్తున్న వైరు కిందపడకుండా దాని మీద రాయి పెట్టారు. ఇది తెలియని పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు చింతకింది యాదగిరి వినోబాభావే మందిరం ప్రాంగణంలో కూర్చున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ జనరేటర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో వైరుపై ఉంచిన రాయి యాదగిరి తలపై పడటంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు అతడికి ప్రథమ చికిత్స చేశారు. గాయమైన ప్రదేశంలో కుట్లు వేశారు. ఫ గోడ పైనుంచి రాయి మీద పడి చేనేత కార్మికుడి తలకు గాయం -
హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశాం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాద విభాగంలోని గోదాంలో ఇటీవల చింతపండు చోరీ జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరిపించేందుకు హైలెవల్ కమిటీని వేసినట్లు ఈఓ వెంకట్రావ్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పైన తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చింతపండు చోరీ జరిగిన తర్వా నియమించిన ఫైమెన్ కమిటీతో సమగ్ర వివరాలు తెలియరాలేదన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు గతంలో ఏమైనా జరిగాయా అనే అంశాలను లోతుగా పరిశీలించేందుకు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో రీజినల్ జాయింట్ కమిషనర్, రంగారెడ్డి, నల్లగొండ, సికింద్రాబాద్కు చెందిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లతో హైలెవల్ కమిటీ వేశామని వెల్లడించారు. ఈ కమిటీ సభ్యులు సోమవారం నుంచి ఆలయానికి వచ్చి విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎండోమెంట్ కమిషనర్గా తానే ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు 4వేల మందికి ఉచితంగా పులిహోర ప్రసాదం.. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 3వేల నుంచి 4వేల మందికి 250 నుంచి 300 కిలోల పులిహోర ప్రసాదం ఉచితంగా అందజేస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి మాదిరిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించి, వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ సర్కిళ్లకు పేర్లు.. సత్యనారాయణస్వామి వ్రత మండపంలో వ్రతాలు చేయించే భక్తులకు స్వామి వారి శేష వస్త్రం, కనుమ, స్వామి వారి ప్రతిమను ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు రూట్ అర్థంకావడం కోసం యాదగిరి కొండ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డులో పలు సర్కిళ్లకు పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు. వైకుంఠద్వారం వద్ద సర్కిల్ రోడ్డుకు శ్రీఅభయాంజనేయ సర్కిల్ అని, ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లే మార్గంలో ఉన్న సర్కిల్కు గరుడ సర్కిల్, కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు వద్ద ఉన్న సర్కిల్కు రామానుజ సర్కిల్, మల్లాపురానికి వెళ్లే మార్గంలో ఉన్న సర్కిల్కు యాదర్షి సర్కిల్గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఆయా సర్కిళ్ల వద్ద మూడు, నాలుగు నెలల్లో విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసం పెద్ద లిఫ్టు (25 మంది ఒకేసారి వెళ్లడానికి) పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం అనుమతి తీసుకొని పనులు చేపడతామన్నారు. శనివారం, ఆదివారం క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో మజ్జిగ, తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. బ్యాటరీ వాహనాలను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొండ పైన హోంగార్డు సిబ్బంది తక్కువగా ఉన్నారని, భద్రతా సిబ్బందిని పెంచే దిశగా పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, అధికారులు దయాకర్రెడ్డి, రామారావు ఉన్నారు. వ్రత మండపాన్ని తనిఖీ చేసిన ఈఓ యాదగిరి కొండకు దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని ఈఓ వెంకట్రావ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్రతాల నిర్వహణ తీరును, భక్తులకు ఇస్తున్న సామాగ్రి, ప్రసాదాన్ని పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, అర్చకులకు సూచించారు. ఫ చింతపండు చోరీ ఘటనపై వారం రోజుల్లో విచారణ పూర్తిచేస్తాం ఫ యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
దేవరకొండ: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.17లక్షలు వసూలు చేసి పరారైన నిందితుడిని గురువారం దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మాదిన్నె కృష్ణ అలియాస్ వేణుగోపాల్రెడ్డి 2021లో దేవరకొండకు వలస వచ్చి స్థానిక బీఎన్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. అతడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్టు ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించాడు. అతడు పనిచేసే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి కాలనీకి చెందిన ముడావత్ స్వాతి, ఆమె భర్త రమేష్, షేక్ సైదాబేగం, ఆమె కుమారుడు షేక్ తబ్రీజ్తో పరిచయం పెంచుకున్నాడు. వారిని తన మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుంచి సుమారు రూ.17లక్షలు వివిధ దఫాలుగా తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వారు ఉద్యోగాల విషయం ఏమైందంటూ అడిగినప్పుడల్లా టైం పడుతుందని చెబుతూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల వారు కృష్ణను గట్టిగా నిలదీయగా ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. దీంతో బాధితులు మార్చి 1న దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం నిందితుడిని ఏపీలోని అనంతపురం జిల్లాలో అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే కృష్ణ గతంలో తన భార్యతో కలిసి ఖమ్మం జిల్లా తనికెళ్ల గ్రామంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడని, టైలరింగ్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక అక్కడ కొద్దిమందితో కలిసి చిట్టీలు నిర్వహించి అక్కడి నుంచి అనంతపురానికి పరారైనట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. అనంతపురంలో అక్కడ కూడా కొందరిని మోసం చేసి దేవరకొండకు వచ్చాడని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐలు కోటేష్, నారాయణరెడ్డి, పోలీస్ సిబ్బంది సతీష్, రాజారాం, అంజి, వెంకన్న, చాంద్పాషా, సింహాద్రి పాల్గొన్నారు. ఫ నిందితుడి అరెస్ట్ ఫ రూ.8లక్షలు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన దేవరకొండ ఏఎస్పీ మౌనిక -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
శాలిగౌరారం: రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి చెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామ శివారులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామ మాజీ సర్పంచ్ వజ్జె భిక్షం(56) బుధవారం పని నిమిత్తం బైక్పై శాలిగౌరారం మండల కేంద్రానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో వద్దిపాముల గ్రామ శివారులో రోడ్డు పక్కన బైక్ ఆపి మూత్రవిసర్జన చేసి తిరిగి బైక్ ఎక్కుతుండగా.. పెర్కకొండారం గ్రామానికి చెందిన గంట వీరయ్య అతివేగంగా వచ్చి భిక్షంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భిక్షం, వీరయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భిక్షం మృతిచెందాడు. వీరయ్య కోమాలో ఉన్నట్లు తెలిసింది. భిక్షంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భిక్షం భౌతికకాయానికి డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్ నివాళులర్పించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని..నార్కట్పల్లి: స్కూటీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందారు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్పల్లి మండల కేంద్రం శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన ఎస్కే అమీర్(23) తన స్నేహితుడు షోయబ్తో కలిసి స్కూటీపై హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వెళ్తున్నారు. మార్గమధ్యలో నార్కట్పల్లి మండల కేంద్రం శివారులోని త్రిపుర హాటల్ సమీపంలో.. నిజామాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. అమీర్ రోడ్డుపై పడిపోగా.. అతడి తల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటీపై వెనుక కూర్చున్న షోయబ్కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని అమీర్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బాబాయి మహ్మద్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ.. రామన్నపేట: తాటిచెట్టు పైనుంచి పడి గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన గీత కార్మికుడు నోముల నర్సింహ చిన్న కుమారుడు వంశీ(24) మంగళవారం సాయంత్రం గ్రామ శివారులో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. -
11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన అద్భుతం
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలో 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన అద్భుతంగా ఉందని, 70 ఏళ్లలో చేయని దేశాభివృద్ధిని 11 ఏళ్లలోనే ప్రధాని మోదీ చేసి చూపించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు 2జీ స్కాం, బొగ్గు స్కాం, భోఫోర్స్ స్కాం ఉండేవని తెలిపారు. గుజరాత్ మోడల్ అభివృద్ధి నమూనాతో మోదీ నాయకత్వంలోనే బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. స్వచ్ఛ భారత్ కింద కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు పేదలకు 4కోట్ల ఇళ్లు మంజూరు చేసిన ఘటన మోదీదే అన్నారు. గతంలో తెలంగాణలో 2500 కి.మీ. మేర జాతీయ రహదా రులు ఉండగా.. 11 ఏళ్లలోనే మరో 2500 కి.మీ. నిర్మించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త లైన్లు, గ్రామాల్లో బీటీ రోడ్లు లాంటి అభివృద్ధి చేసినా కాంగ్రెస్ నేతలు చూడలేకపోతున్నారని అన్నారు. 12 నెలల రేవంత్రెడ్డి పాలన చూసిన ప్రజలు మరో 20ఏళ్ల పాటు కాంగ్రెస్కు ఓటెయ్యరని అన్నారు. 10 శాతం కమీషన్ చెల్లిస్తేనే బిల్లులు వస్తున్నాయని, కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. నంబర్ వన్గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీయించిందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక 7సార్లు పొడిగించారని, ఫోన్ ట్యాపింగ్ తదితర వాటిపై వేసిన కమిషన్ల మీద ప్రజలకు నమ్మకం లేదన్నారు. అనంతరం మోదీ 11 ఏళ్ల సుపరిపాలన కరపత్రాలను బీజేపీ నేతలతో కలిసి ఈటల ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నాయకులు సునీతారెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజు, పల్లెబోయిన శ్యాంసుందర్, షేక్ బాబా, నివేదిత తదితరులు పాల్గొన్నారు. ఫ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
పేదలకు వరంలా బీబీనగర్ ఎయిమ్స్
బీబీనగర్ : బీబీనగర్లోని ఎయిమ్స్ వైద్య కళాశాల తెలంగాణ ప్రాంతంలోని పేదలకు వరంలా మారిందని ఎయిమ్స్ బోర్డు మెంబర్, ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె ఎయిమ్స్ను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి ప్రాంగణంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల గురించి ఎయిమ్స్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరపనుందని, దీంతో ఎయిమ్స్ను సందర్శించి వివరాలు తెలుసుకోవడం కోసం వచ్చినట్లు తెలిపారు. అతి తక్కువ ధరలకే వైద్య సేవలు, స్కానింగ్, ఇతర ల్యాబ్ పరీక్షలు జరుతున్నాయని దీంతో పేద ప్రజలకు ఎయిమ్స్లో చికిత్స పొందడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. దూర ప్రాంతాల నుంచి సైతం ఎయిమ్స్కు వచ్చి ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు, పేద ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ప్రధాన మంత్రి మోదీ ఎయిమ్స్ వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మరో ఏడాది లోపు బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, నిర్మాణాలు సైతం పూర్తవుతాయని ఆమె చెప్పారు. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ ఉన్నారు. ఫ ఏడాదిలోపు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి ఫ ఎయిమ్స్ బోర్డు మెంబర్, ఎంపీ డీకే అరుణ -
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ
భువనగిరిటౌన్ : అంగన్వాడీ కేంద్రాలు ఎగ్ బిర్యానీ తో ఘుమఘుమలాడాయి. ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో బుధవారం ఎగ్ బిర్యానీ అందజేసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. వారానికి రెండుసార్లు అందించనున్నారు. విద్య, ఆరోగ్య భద్రత అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విద్య, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాలని.. ఇందుకోసం మంచి పౌష్టికాహారం అందజేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో లబ్ధిదారులకు వారంలో రెండుసార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూలో మార్పులు చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఎగ్ బిర్యానీ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో చిన్నారులు 41,513, గర్భి ణులు 4,288, బాలింతలు 3,204మంది ఉన్నారు. తొ లిరోజు 11,224 మంది హాజరయ్యారు. సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి వారానికి రెండుసార్లు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎగ్ బిర్యాని అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు ఎగ్ బిర్యానీ వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, అందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వవిద్యతో పాటు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. అంతకుముందు అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శాగంటి శైలజ, సూపర్వైజర్ ఉమ, అంగ న్వాడీ టీచర్లు శైలజ, సరళ, లుద్దిమేరీ తదితరులు పాల్గొన్నారు. ఫ వారానికి రెండు సార్లు ఫ చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారలోపం ఏర్పడకుండాజాగ్రత్తలు ఫ 901 కేంద్రాల్లో ప్రారంభించిన అధికారులు -
కురిసిన వర్షం.. రైతన్న హర్షం
భువనగిరిటౌన్, రామన్నపేట: జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందంగా పొలంబాట పట్టారు. ఏరువాక పౌర్ణమి కావడంతో వ్యవసాయ పరికరాలను శుభ్రం చేసి కాడెద్దులు, నాగళ్లకు పూజలు చేసి పొలాలకు కదిలారు. కొందరు దుక్కులు దున్నగా, మరికొందరు విత్తనాలు వేశారు. అత్యధికంగా ఆత్మకూర్(ఎం), ఆలేరు మండలాల్లో 44 మి.మీ వర్షం కురిసింది. పది రోజులుగా ఎండలు ఠారెత్తించగా.. వర్షానికి వా తావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షపాతం మి.మీలలో ఆత్మకూర్(ఎం) 49, ఆలేరు 44, మోటకొండూరు 31, చౌటుప్పల్ 42, సంస్థాన్నారాయణపురం 21, రామన్నపేట 19, భూదాన్పోచంపల్లి 19, భువనగిరి 13, వలిగొండ 9, రాజాపేట 7, బొమ్మలరామారం మండలంలో 6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఫ ఏరువాక పౌర్ణమి రోజు పలుచోట్ల వర్షం ఫ పొలంబాట పట్టిన రైతులు -
ప్రజల సంక్షేమం, పార్టీ ముఖ్యం
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు : రాష్ట్ర ప్రజల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే తనకు ముఖ్యమని, తాను ఏ రోజూ పదవుల కోసం పాకులాడలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి వస్తుందని భావించగా ఇటీవల ప్రభుత్వం ముగ్గురికి మంత్రి పదవులకు ఎంపిక చేసింది. కానీ రాజగోపాల్రెడ్డికి పదవి దక్కలేదు. దీంతో ఆయన రెండు రోజుల పాటు ఎవ్వరితోనూ టచ్లో లేకుండా తన ఫాం హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. మంత్రి పదవిపై ఏవిధంగా స్పందిస్తారని అందరూ ఉత్కంఠతో చూశారు. అయితే బుధవారం తన మనస్సులో మాటను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. నూతనంగా మంత్రి పదవులు పొందిన ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తనకు పదవి రాలేదని ఎక్కడా బాధపడడం లేదని, పదవి ఉన్నా లేకనపొయినా ప్రజల కోసం పనిచేనని.. అదే తనకు ఎంతో శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. జీవితాంతం రాజకీయాల్లో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. మెరుగైన వైద్యసేవలందించాలి భువనగిరి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ మనోహర్ పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని అనంతారంలో గల అయుష్మాన్ అరోగ్య మందిర్ను సందర్శించారు. కాయకల్ప సేవల గురించి తెలుసుకున్నారు. ఉత్తమ వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏర్పాటు చేసిందన్నారు. సకాలంలో విధులకు హాజరై సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని, కమ్యూనిటీహెల్త్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్, రమేష్నాయక్, సురేష్కుమార్, వసుద, రమాదేవి, లింగలక్ష్మి, శోభ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలిభువనగిరిటౌన్ : ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎస్సీ సంక్షేమాధికారి శ్యాంసుందర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో సహాయ షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి, వసతి గృహాల సంక్షేమ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన భోజనం గురించి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. ఉపకార వేతనాల కోసం పాఠశాలల నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. అదే విధంగా ఆత్మకూర్ (ఎం), మోటకొండూర్లో హాస్టళ్లను సందర్శించారు. -
కిలోమీటరు దూరం నడిచి వెళ్లేవాళ్లం
మాది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దిలావర్పూర్ పంచాయతీ పరిధిలోని సుభాన్పూర్. మా గ్రామంలో స్కూల్ లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న దిలావర్పూర్కు కాలినడకన వెళ్లేది.మొదట్లో మాతాత స్కూల్కు తీసుకెళ్లి వదిలివచ్చేది. ఆ తరువాత ఉదయం, సాయంత్రం స్నేహితులతో కలిసి వెళ్లేది. వేసవి సెలవులు ఎప్పుడు ముగుస్తాయా, స్కూల్ ఎప్పుడు తెరుస్తారా.. అని ఆతృత ఉండేది. పాఠశాలకు సంతోషంగా వెళ్లేవాడిని. బాల్యంనాటి జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తుంటాయి. –శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్, భూదాన్పోచంపల్లి -
మెరుగైన బోధనకు కార్యాచరణ
ఫ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం ఫ ప్రారంభం నుంచే ప్రతి విద్యార్థిపై శ్రద్ధ ఫ నిరంతర పర్యవేక్షణకు తరగతులు, పాఠశాలలవారీగా వాట్సాప్ గ్రూప్లు ఫ టెన్త్ ఫలితాలతో సర్కారు స్కూళ్లపై నమ్మకం పెరిగింది ఫ స్వచ్ఛందంగా బడిలో చేరుతున్నారు ‘సాక్షి’తో డీఈఓ కందుల సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. పదో తరగతిలో సాధించిన ఫలితాలతో అంతటా ప్రభుత్వ స్కూళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వచ్చి తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంకా మెరుగైన బోధనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా పాటించాల్సిన బోధన పద్ధతులపై ఇటీవల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. నిరంతర పర్యవేక్షణకు పాఠశాలల వారీగా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. అని జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ తెలిపారు. గురువారం నుంచి నూతన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంతో ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. –సాక్షి యాదాద్రి సులువైన పద్ధతుల్లో బోధన విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం. ప్రతి విద్యార్థిపై ప్రారంభం నుంచే శ్రద్ధ వహిస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చేలా తీర్చిదిద్దుతాం. చాలా మంది విద్యార్థులు గణితం విషయంలో వెనుకబడుతుంటారు. ఆ సమస్య లేకుండా బోధన ఉంటుంది. -
విద్యారు్థల్లారా.. స్వాగతం
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఫ మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరణ ఫ విద్యార్థులకు పూలు అందజేసి స్వాగతించనున్న ఉపాధ్యాయులు ఫ మొదటి రోజే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం పంపిణీ సాక్షి,యాదాద్రి : వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. సెలవుల్లో ఆట, పాటలతో గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపట్టి పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్ని పాఠశాలల్లో పునఃప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు అందజేసి స్వాగతించనున్నారు. మౌలిక వసతుల కల్పన పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు. పిచ్చిమొక్కలు, చెత్తచెదారాన్ని మున్సిపల్ సిబ్బందితో తొలగించారు. టాయిలెట్లను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించారు. పలు చోట్ల పాఠశాల భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. పుస్తకాలు, యూనిఫాం సిద్ధం పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అందజేయనున్నారు. జిల్లాలో 754 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో సుమారు 53 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం యూనిఫాం 43,506 జతలు, పాఠ్య పుస్తకాలు 43,506, నోట్ బుక్స్ 2,17,530 సిద్ధం చేశారు. పాఠశాలలు, విద్యార్థుల వివరాలు పాఠశాల సంఖ్య బాలురు బాలికలు ప్రభుత్వ, జెడ్పీ 715 18,308 17,274కేజీబీవీ 11 -- 2,812 మోడల్ స్కూల్స్ 07 1,662 2487 యూఆర్ఎస్ 01 74 -- టీజీ రెసిడెన్షియల్ 03 941 1,226 ఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ 07 1,532 2,476 ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ 01 250 0ఆశ్రమ్ రెసిడెన్షియల్ 01 -- 129 బీసీ రెసిడెన్షియల్ 05 805 1,480మైనార్టీ రెసిడెన్షియల్ 03 648 310 -
చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని
మా సొంతూరు చౌటుప్పల్. నేను స్థానికంగా ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశాను.టెన్త్ 1985–86 బ్యాచ్. చదువుతోపాటు ఆటలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడిని. స్నేహితులతో కలిసి గాంధీ పార్కులో రకరకాల ఆటలు ఆడేవాళ్లం. ఆటల్లో పడి భోజనం కూడా చేసేవాడిని కాదు. వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లేవాడిని. సెలవులు ముగిసిన అనంతరం ఆనందంగానే స్కూల్కు వెళ్లేవాడిని. పాఠశాలలో చేరిన మొదట్లో కొన్ని రోజుల వరకు మా కుటుంబసభ్యులు తోలి వెళ్లేది. ఆ తర్వాత స్నేహితులతో కలిసే వెళ్లాను. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చి భోజనం చేసి వచ్చేవాళ్లం. నాటి రోజులు ఇంకా గుర్తుకొస్తుంటాయి. విద్యార్థులకు చదువుతోపాటు సమాజంపై అవగాహన ఉండాలి. 31 సంవత్సరాలుగా వివిధ హోదాలో ఉద్యోగం చేస్తున్నా. విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడం కోసం నావంతు కృషి చేస్తున్నా. ఇప్పుడు విద్యార్థులు సెల్ఫోన్, టీవీలు, సోషల్మీడియా వైపు వెళ్తున్నారు. వాటిలో మంచి కూడా ఉన్నప్పటికీ అవసరం ఉన్నంత వరకే వినియోగించాలి. –అలిసేరు గోవర్ధన్, బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్లర్ -
గవర్నర్ రాకకు అంతా సిద్ధం
భూదాన్పోచంపల్లి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులు గురువారం భూదాన్పోచంపల్లిని సందర్శించనున్నారు. ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు పోచంపల్లికి చేరుకోనున్నారు. చేనేత కార్మికుల యోగక్షేమాలు, వృత్తి, సాదకబాధకాలు స్వయంగా తెలుసుకునేందుకు గవర్నర్ వారి గృహాలను సందర్శించనున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యూజియానికి వెళ్లి కొకూన్స్లో నుంచి వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. ఆ తరువాత ఎంపిక చేసిన 25 మంది చేనేత కార్మికులతో టూరిజం పార్కులోనే ముఖాముఖి సమావేశం కానున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కలెక్టర్ హనుమంతరావు.. చేనేత జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, ఏడీ శ్రీనివాస్రావు, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏసీపీ మధుసూధన్రెడ్డి తదితర అధికారులతో కలిసి బుధవారం టూరిజం పార్కు, చేనేత కార్మికుల గృహాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ దంపతులు సందర్శించనున్న చేనేత గృహాల గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించాలని, సంప్రదాయకంగా బొట్టు పెట్టి స్వాగతం పలకాలని చేనేత కార్మికులకు సూచించారు. గవర్నర్ కు ఇంగ్లిష్లో అనువాదం చేయటానికి గైడ్ను ఏర్పాటు చేయాలని అధికారుకు సూచించారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ● గవర్నర్ గురువారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్ నుంచి బయలు దేరి 10.30 గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు. ● 10.30 నుంచి 11 గంటల వరకు టూరిజం పార్కు సమీపంలోని పెండెం కృష్ణ, భారత భాస్కర్, భారత మధు చేనేత కార్మికుల గృహాలను సందర్శిస్తారు. ● 11 నుంచి 11.15 వరకు టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలు పరిశీలిస్తారు. ● 11.15 నుంచి 11.45 వరకు చేనేతకార్మికులతో ముఖాముఖి మాట్లాడుతారు. ● 11.45 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చేనేత కార్మికులకు నేతన్న బీమా, త్రిఫ్ట్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తారు.నేడు పోచంపల్లిలో పర్యటించనున్న జిష్ణుదేవ్ వర్మ ఫ వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించనున్న గవర్నర్ ఫ చేనేత కార్మికులతో ముఖాముఖి -
రేషన్ బియ్యం పట్టివేత
దేవరకొండ: అక్రమంగా తరలిస్తున్న 30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దేవరకొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబావి నుంచి బొలెరో వాహనంలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కల్వకుర్తి వైపు తరలిస్తుండగా సమాచారం మేరకు వాహనాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అస్వస్థతకు గురై వలస కార్మికుడు మృతిచౌటుప్పల్ : వలస కార్మికుడు అస్వస్థతకు గురైన మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్కండ్ రాష్ట్రం వెస్ట్సింగ్భుం జిల్లా, మంజరి మండలం, బారాలగ్రా గ్రామానికి చెందిన కృష్ణ(39) జీవనోపాధి నిమిత్తం 40రోజుల క్రితం పట్టణంలోని శ్రీని ఫార్మా కంపెనీకి వచ్చాడు. పరిశ్రమలో కూలీ పని చేస్తూ అక్కడే ఉన్న కంపెనీ క్వార్టర్స్లో సహచరులతో కలిసి ఉంటున్నాడు. ఒళ్లు, కాళ్లనొప్పులు ఉన్నాయని గత రెండు రోజులుగా పనికి వెళ్లకుండా గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం సమయంలో చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో సహచరులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి అల్లుడు మహేంద్రపాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. బంగారం చోరీ కేసులో వ్యక్తికి జైలుచివ్వెంల(సూర్యాపేట) : బంగారం చోరీ కేసులో వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళీ బుధవారం తీర్పు వెల్లడించారు. అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన సూరారపు తిరుమలేష్ 2016లో సూర్యాపేట పట్టణంలో మూడు ఇళ్లలో చొరబడి, బంగారం అపహరించాడు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ మొగిలయ్య కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ చేశారు. పీపీ బి.హేమలత నాయుడు వాదనలతో ఏకీభవిస్తూ, పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఒక్కో కేసులో 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పీపీకి కోర్టు కానిస్టేబుల్ పత్తిపాక వెంకటేశ్వర్లు సహకరించారు. నీటిపారుదల శాఖ జేఈఈ ఆత్మహత్యబయ్యారం: నీటిపారుదల శాఖ జేఈఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కాపువారిగూడెం గ్రామానికి చెందిన పానుగోత్ దేవిలాల్(34) ఇరిగేషన్ శాఖలో జేఈఈగా గార్ల మండలంలో పనిచేస్తున్నాడు. దేవిలాల్ దివ్యాంగుడు. బయ్యారంలో గది అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో దేవిలాల్ బుధవారం రాత్రి తన గదిలో పురుగులమందు తాగగా.. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని చికిత్సనిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. జేఈఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
మోత్కూరులో చోరీకి యత్నం
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలీ కాలనీలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. పద్మశాలీ కాలనీలో ఉంటున్న పోచం అనసూయ రాత్రి సమయంలో ఇంటికి వెనుకవైపు ఉన్న కిటికీ మూసేందుకు వెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించగా ఆమె అప్రమత్తమై కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు రావడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాలనీ వాసులు ఇంటి పరిసరాల్లో వెతికినా ఎవరూ కనిపించలేదు. కొద్దిదూరంలో బైక్ కనిపించగా.. దాని యజమాని కనిపించకపోవడంతో 100 నంబర్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకొని, బైక్ను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం నాగారం : సూర్యాపేట – జనగాం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల పరిఽధిలోని నాగారంబంగ్లా గ్రామానికి చెందిన దోమల వెంకన్న(49) నాగారం ఎక్స్రోడ్డు వద్ద ఫెర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్పై వర్థమానుకోట రోడ్డు నుంచి నాగారంబంగ్లాలోని తన ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో సూర్యాపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో వెంకన్న తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య దోమల ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఐలయ్య తెలిపారు.ఫ కేకలు వేయడంతో నిందితుడు పరారు ఫ అతడి బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు -
సాగులో నూతన పద్ధతులు అవలంబించాలి
రామగిరి(నల్లగొండ): వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అన్నారు. త్రిపురారం మండలం కంపాసాగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బుధవారం నల్లగొండ మండలంలోని తొరగల్లు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ రావు యూరియా వినియోగం, సమర్థ సాగు వినియోగం, పంట అవసరాల కొనుగోళ్లలో రసీదులను భద్రపరుచుట, రసాయనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, రాములమ్మ నూతన వ్యవసాయ పద్ధతులను వివరించారు. పంటల సరళి, జీలుగ, జనుము ఉపయోగాలను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు లాభాలను ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి వివరించారు. కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ ఆఫీసర్ కిషోర్, వ్యవసాయ విస్తరణ అధికారి సత్యనారాయణ, అభ్యుదయ రైతులు రామ్రెడ్డి, కృష్ణారెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులు ఇవ్వాలని మహిళ బెదిరింపు
చిలుకూరు: తనకు డబ్బులు ఇవ్వాలని ఓ మహిళ యువకుడిపై బెదిరింపులకు పాల్పడింది. మంగళవారం రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువకుడి ఇంటికి చేరుకుని దాడికి దిగింది. అక్కడికి గ్రామస్తులు చేరుకోవడంతో ఇద్దరు పరారు కాగా.. ఒకరిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ ఘటన చిలుకూరు మండలంలోని సీత్లాతండా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సీత్లాతండాకు చెందిన నూనావత్ సక్రు – మంగమ్మ చిన్న కుమారుడు వినోద్ కారు ట్యాక్సీ డ్రైవర్గా పని చేసేవాడు. ఫోన్లో తమిళనాడుకు చెందిన మంగా అనే మహిళతో పరిచయం ఏర్పడడంతో ఆమె వద్ద కారు డ్రైవర్గా పని చేశాడు. ఈక్రమంలో వారి మధ్య వివాదం రావడంతో వినోద్ ఆమె దగ్గర ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. దీంతో ఆ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని వినోద్ను బ్లాక్ మొయిల్కు గురి చేస్తోంది. ఈమేరకు 2023 నవంబర్ 13న చిలుకూరు పోలీస్స్టేషన్లో వినోద్ తల్లి మంగమ్మ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురిని పిలిపించి మాట్లాడి సమస్యను సద్దమణిగించారు. ఈక్రమంలో సీత్లాతండాలో మంగళవారం రాత్రి గ్రామస్తులు తుల్జాభవానీ పండుగ నిర్వహిస్తుండగా.. తమిళనాడుకు చెందిన మంగా వైరాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి వినోద్ ఇంటికి వచ్చింది. తమకు డబ్బులు ఇవ్వాలని గొడవ చేసి, వినోద్ తండ్రి సక్రును తలపై కొట్టారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో వినోద్ తల్లి మంగమ్మకు కూడా గాయాలయ్యాయి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులు ముగ్గురిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న మహిళ తో పాటు మరో వ్యక్తి పరారు కాగా.. ఒకరిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సక్రు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతడిని స్టేషన్కు తీసుకెళ్లారు. ఉదయం పరారైన మరో వ్యక్తి బుధవారం పోలీస్స్టేషన్కు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా.. తమను స్తంభానికి కట్టేసి కొట్టారని వారు కూడా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఇరు కేసులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ ఇద్దరు వ్యక్తులతో కలిసి యువకుడి ఇంటికి వచ్చి దాడి ఫ ఇద్దరు పరారు కాగా.. ఒకరిని స్తంభానికి కట్టేసి చితకబాదిన గ్రామస్తులు ఫ చిలుకూరు మండలం సీత్లాతండాలో ఘటన -
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు చెవి కమ్మలు, కొంత నగదును తిరిగి వారికి అందజేసి బస్సు డ్రైవర్, కండక్టర్ తమ నిజాయితీని చాటుకున్నారు. చింతపల్లి మండలానికి చెందిన మహిళా ప్రయాణికురాలు బుధవారం దేవరకొండ నుంచి సంతోష్నగర్కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. సంతోష్నగర్ వెళ్లగానే అర్ధ తులం బంగారు చెవి కమ్మలు, కొంత నగదు ఉన్న చిన్న బాక్స్ను బస్సులోనే మర్చిపోయి దిగింది. గమనించిన డ్రైవర్ నజీరుద్దీన్, కండక్టర్ దార యాదయ్య ఆ బాక్స్ను డిపోలోని అధికారులకు అందజేశారు. డిపో ఏడీసీ ఉపేందర్ విచారణ చేసి సంబంధిత ప్రయాణికురాలి కుటుంబసభ్యులకు దేవరకొండ డిపోలో అందజేశారు. -
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థికసాయం
మునగాల: ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి పోలీసు కానిస్టేబుల్ ఆర్థికసాయం చేసి, వారి సొంతూరికి పంపించి తన సహృదయాన్ని చాటుకున్నాడు. నెల్లూరు జిల్లా కాగుటూరు గ్రామానికి చెందిన దంపతులు మణి– సరోజలు తమ ఇద్దరు చిన్నారులతో జీవనోపాధి నిమిత్తం జనగామ జిల్లాలోని ఓ బొగ్గుల బట్టి వ్యాపారి వద్ద పనికి చేరారు. నెలన్నర రోజుల పాటు పనులు చేయించుకున్న సదరు వ్యాపారి ఆ దంపతులకు ఇవ్వాల్సిన వేతనం ఇవ్వకుండా మోసం చేసి పంపించాడు. ఆ దంపతులు చేతిలో చిల్లిగవ్వ లేక జనగామ నుంచి కాలినడకన జాతీయ రహదారి వెంట నెల్లూరు జిల్లాకు బయలుదేరారు. సూర్యాపేటలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వర్తిస్తున్న మునగాల మండలంలోని విజయరాఘవపురం గ్రామానికి చెందిన మొగిలిచర్ల నరేష్ బుధవారం తన స్వగ్రామం వెళ్తుండగా ఈ దంపతులు కనిపించారు. వారిని చేరదీసి ఇంటికి తీసుకువెళ్లి ఆహారం అందించాడు. వారికి జరిగిన అన్యాయాన్ని తమ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. వారిని ఆదుకునేందుకు రూ.10వేల నగదును సేకరించి ఆ దంపతులకు అందజేశాడు. తమను ఆదుకున్న నరేష్కు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపి స్వగ్రామం బయలుదేరి వెళ్లారు. -
తహసీల్దార్ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారుల నిరీక్షణ
రాజాపేట: రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు, సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుందుకు తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. క్షేత్రస్థాయి విధులకు వెళ్లిన అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండకపోవడంతో దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
బాలుడి ఆచూకీ లభ్యం
నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిడ్నాప్కు గురైన బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్లోని దమ్మాయిగూడకు చెందిన నారాయణ దాస్ అరుణ, జంతిక చుక్కమ్మ అలియాస్ (పాలడుగు సుగుణమ్మ) ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు గుర్తించారు. బుధవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ మండలం తుంగపహాడ్కు చెందిన బైరం భాగ్యలక్ష్మి 8 నెలల గర్భిణి. రెండో కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఈ నెల 8వ తేదీన భర్త అంజిబాబు, కుమారుడు సోమేష్తో కలిసి వచ్చింది. వారి వెంట ఇంటి పక్కన ఉండే కుంచం పార్వతమ్మ కూడా ఆస్పత్రికి వచ్చింది. భాగ్యలక్ష్మి లేబర్ వార్డులో చేరింది. అప్పటి నుంచి ఆమె బాగోగులు పార్వతమ్మ చూస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఉన్న ప్రసూతి విభాగం ఎదుట భాగ్యలక్ష్మి తన కుమారుడు సోమేష్, వెంట వచ్చిన పార్వతమ్మ చెట్టు కింద కూర్చున్నారు. అక్కడే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వారితో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నారు. బాలుడిని ఆడిస్తున్నట్లుగా చేసి, మీరిద్దరూ భోజనం చేసి రండి బాలుడిని చూసుకుంటాం అని చెప్పడంతో వారు భోజనానికి వెళ్లారు. అదే అదునుగా భావించిన మహిళలు బాలుడిని కిడ్నాప్ చేశారు. తిరిగి వచ్చేసరికి బాలుడితో పాటు ఇద్దరు మహిళలు కనిపించలేదు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్లో పార్వతమ్మ ఫిర్యాదు చేసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలు పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేశారు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలోని ఏ1 నారాయణదాసు అరుణ తల్లి ఇంటి వద్ద వీరిద్దని పట్టుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుని కిడ్నాప్ కేసును ఏడు గంటల్లోనే చేధించి, నిందితులను పట్టుకున్న టూటౌన్ సీఐ రాఘవరావు నార్కట్పల్లి సీఐ నాగరాజు, టూటౌన్ ఎస్ఐ సైదులు, సతీష్, భువనగిరి సీఐ రమేష్, పోలీసులు రాజు, సాగర్ల శంకర్, జానకిరామ్, తిరుమలేష్లను ఎస్పీ అభినందించారు. కిడ్నాప్కు గల కారణాలు.. నారాయణదాసు అరుణకు కుమారుడు. కుమార్తె ఉన్నారు. సంవత్సరం క్రితం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మగ పిల్లలపై ప్రేమతో ఏ విధంగా నైనా బాలుడిని పెంచుకోవాలని అనుకుంది. ఈవిషయాన్ని దమ్మాయిగూడెంలో తాను నివసిస్తున్న ఇంటి పక్కన గల మరో మహిళ జంతిక సుక్కమ్మ అలియాస్ (పాలడుగు సుగుణమ్మ)తో చెప్పింది. ఇద్దరూ కలిసి నల్లగొండకు బస్సులో వచ్చి ఆస్పత్రి ఏరియాలో చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉండడాన్ని గమనిస్తూ వచ్చారు. తల్లిదండ్రులు లేని సమయం చూసి బాలుడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో బాలుడితో కలిసి భాగ్యలక్ష్మి, పార్వతమ్మ చెట్టుకింద కూర్చొని ఉండగా.. వారితో మాటలు కలిపి వారిని నమ్మించారు. వారు లేని సమయంలో బాలుడిని తీసుకుని పరారయ్యారు. ఫ కిడ్నాప్ కేసును 7 గంటల్లోనే చేధించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి -
వరిలో విత్తన ఎంపిక అత్యంత కీలకం
● జేజీఎల్–24423(జగిత్యాల రైస్–1) 125 రోజుల పంట కాలం. సుడి దోమ, చలి, చౌడును కొంత వరకు తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 82 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● కెపీఎస్–6251(పీఆర్సీ)పంట కాలం 115 నుంచి 120 రోజులు. అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు, సుడి దోమను కొంత వరకు తట్టుకుంటుంది. ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● కేపీఎస్–10329( చిరు సంచి స్థాయి) వానాకాలం 120 నుంచి 125 రోజులు, యాసంగి 130 నుంచి 135 రోజుల పంట కాలం. దిగుబడి ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్లు వస్తుంది. ● కేపీఎస్–10631 ( చిరు సంచి స్థాయి) వానాకాలంలో 120 నుంచి 125 రోజులు, యాసంగిలో 130 నుంచి 135 రోజులు. దిగుబడి 32 నుంచి 34 క్విటాళ్లు వస్తుంది. త్రిపురారం : తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. నారు మడులకు దుక్కి సిద్ధం చేసుకుంటున్నారు. వానాకాలంలో రైతులు విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటించాలని, వరి పంటల సాగులో విత్తనాల ఎంపిక అత్యంత కీలకమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట చీడపీడలను తట్టుకొని దిగుబడులు పెరిగే రకాలు ఎంపిక చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొంటున్నారు. మూడు రకాలుగా వరి విత్తనాలుఖరీఫ్ సీజన్లో సాగు చేసుకోవడానికి అనువైన వరి వంగడాలు మూడు రకాలుగా ఉంటాయి. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక రకాలుగా లభ్యమవుతాయి. దీర్ఘ కాలిక రకం 150 రోజుల పంట కాలం కాగా జూన్ నెలాఖరు వరకు నాటుకోవాలి. మధ్య కాలిక రకం 135 నుంచి 140 రోజుల పంట కాలం కాగా జూలై 15వ తేదీ వరకు నాటుకోవాలి. స్వల్ప కాలిక రకం 120 నుంచి 125 రోజుల పంట కాలం కాగా జూలై చివరి వరకు నార్లు పోసుకొని 25 రోజుల నారుతో నాట్లు పూర్తి చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలు : ● సాంబ మసూరి (బీపీటీ–5204)ఈ వరి రకం వంగడం విత్తనాలు 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. చీడ పీడల నివారణ చర్యలు జాగ్రత్తగా తీసుకోవాలి. హెక్టారుకు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● ఇంద్రా (ఎంటీయూ–1061)ఈ రకం వంగడం 160 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్విటాళ్ల దిగుబడి వస్తుంది. మధ్యకాలిక రకాలు : ● కంపాసాగర్ వరి(కేపీఎస్–2874)ఈ రకం వరి వంగడం 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులును కొంత మేర తట్టుకుంటుంది. హెక్టారుకు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● సోమనాథ్ఈ రకం వరి వంగడం130 నుంచి 135 రోజులకు పంట చేతికి వస్తుంది. సన్న రకం గింజ. నారు మడి దశలో చలిని తట్టుకుంటుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● వరంగల్ రైస్–1(డబ్ల్యూజీఎల్–915)ఈ రకం వంగడం 135 రోజుల్లో పంట చేతికి అందుతుంది. వానాకాలం సాగుకు అనువైన ఉత్తమ రకం. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● తెలంగాణ వరి–2(డబ్ల్యూజీఎల్–697)ఈ రకం వరి వంగడం పంటకాలం 135 రోజులు. సన్న గింజ రకం నాణ్యతతో ఉంటుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● ఆర్ఎన్ఆర్–11718((రాజేంద్ర నగర్ వరి–1)135 నుంచి 140 రోజుల పంట కాలం. చౌడు, అగ్గి తెగులు, సుడి దోమ, ఎండు తెగులు, పోట్ట కుళ్లును తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ● జేజీఎల్–27356(జగిత్యాల వరి–3)130 నుంచి 135 రోజులు పంట కాలం. అతి సన్న గింజ వరి రకం. హెక్టారుకు 70 నుంచి 75 క్విటాళ్ల దిగుబడినిస్తుంది. ● కేపీఎస్ – 10642 ( చిరు సంచి స్థాయి)పంట కాలం 130 నుంచి 135 రోజులు. చౌడు నేలకు కొంత వరకు అనుకూలం. దిగుబడి ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్లు వస్తుంది. స్వల్పకాలిక రకాలు : ● తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048)పంట కాలం 125 రోజులు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకు 65 కింటాళ్ల దిగుబడి వస్తుంది. ● జగిత్యాల సన్నాలు(జేజీఎల్–1798)ఈ రకం వంగడం పంటకాలం 120 రోజుల్లో చేతికి వస్తుంది. ఉల్లికోడును తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. హెక్టారుకు 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● తెలంగాణ వరి–4(జేజీఎల్–25958)115 నుంచి 120 రోజులకు పంట కోత చేతికి వస్తుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● జగిత్యాల రైస్(జేజీఎల్–24423). 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఉల్లికోడు, సుడిదోమ, గోదుమ రంగు, ఆకుపచ్చ తెగులును కొంత మేర తట్టుకుంటుంది. హెక్టారుకు 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● బతుకమ్మ రకం ఈ రకం వంగడం 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎండాకు తెగులు, సడిదోమ, పచ్చదోమ, తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● కూనారం వరి–2(కేఎన్ఎం–1638) ఈ రకం వరి వంగడం120 నుంచి 125 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టారుకు 76 నుంచి 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ● ఆర్ఎన్ఆర్–21278 (రాజేంద్ర నగర్ వరి–4)115 నుంచి 118 రోజులు పంట కాలం. సన్న గింజ, పొట్టి గింజ రకం. హెక్టారుకు 60 నుంచి 70 క్విటాళ్ల దిగుబడినిస్తుంది. ● ఆర్ఎన్ఆర్–29325(రాజేంద్ర నగర్ వరి–5) 120 నుంచి 125 రోజులు పంట కాలం. సుడి దోమ, చౌడును తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్విటాళ్ల దిగుబడునిస్తుంది. ● కేఎన్ఎమ్–1638(కూనారం రవి–1) 125 నుంచి 130 రోజులు పంట కాలం. ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్విటాళ్ల దిగుబడి వస్తుంది. ● కేఎన్ఎమ్–118(కూనారం సన్నాలు)125 రోజులు పంట కాలం. పంటపై గింజ రాలె శాతం తక్కువ. హెక్టారుకు 70 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు -
టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం
ఆలేరు, వలిగొండ : టీపీసీసీ నూతన కార్యకవర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి చోటు లభించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులైన ఆలేరుకు చెందిన జనగాం ఉపేందర్రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్, వలిగొండ మండలం టేకులసోమారం వాసి కసుబా శ్రీనివాసరావును ప్రధాన కార్యదర్శులుగా అధిష్టానం నియమించింది. దీంతో ఉపేందర్రెడ్డి మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ఫ ఆలేరు నుంచి జనగాం ఉపేందర్రెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్ ఫ వలిగొండ నుంచి కసుబా శ్రీనివాసరావు నియామకం -
వాసాలమర్రిలో అధికారుల సర్వే
తుర్కపల్లి : వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణ పనులకు నూతన ప్రణాళిక రూపొందించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం గ్రామంలో రీసర్వే నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో రెండు రోజుల క్రితం జరిగిన సర్వేను ఆధారంగా తీసుకొని ఇంటింటి రీసర్వే చేపట్టారు. అనంతరం తహసీల్దార్ దేశ్యానాయక్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు గ్రామ సచివాలయంలో సమావేశమయ్యారు. కార్యదర్శులతో చర్చించి పలు వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీఓలు దినకర్, సలీం, ఆవుల కిషన్, పంచాయతీ కార్యదర్శులు ఒగ్గు మధు, దార మహేందర్, సాయి, నవీన్, కొండయ్య, సురేష్, మణిప్రసాద్, బాలరాజ్, నాగరాజు, చందర్, సందీప్రెడ్డి, కారోబార్ ప్రశాంత్ పాల్గొన్నారు. -
యాటను తెస్తా.. బహుమతి ఇస్తా
ఆలేరు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి గృహప్రవేశానికి యాటను తీసుకొస్తా.. సెపరేట్ బహుమతి ఇస్తా అని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంగళవారం ఆలేరు పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తానని ఎమ్మెల్యే మరో ఆఫర్ ఇచ్చారు. పలువురి నిరసన ఈ సందర్భంగా అర్హత ఉన్న తమ కుటుంబానికి ఇళ్లు మంజూరు కాలేదని సాయిగూడెం గ్రామానికి చెందిన మక్బుల్ తదితరులు ఎమ్మెల్యే వెళ్లిన తరువాత సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతల అనుయాయులకు ఇళ్లు వచ్చాయని మున్సిపాలిటీకి చెందిన పలు వార్డుల మహిళలు బాధపడుతూ నిరాశతో వెనుదిరిగారు. కౌంటర్ల వద్ద ఇళ్లు మంజూరు పత్రాల అందజేసే క్రమంలో కాసేపు గందగోళం నెలకొంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ వేదిక మీద అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూర్చొవడం గమనార్హం. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి గోపాల్, ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ, సత్యాంజనేయప్రసాద్, ఎంపీఓ అనురాధ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది టీపీసీసీ నేత జనగాం ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఐలయ్య బంపర్ ఆఫర్ -
వంటలో నాణ్యత.. పరిసరాల పరిశుభ్రత
ఫ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి ఫ రుచికరమైన వంట తయారీ, స్కూళ్ల పరిశుభ్రతపై కార్యాచరణ ఫ ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో కార్మికులకు శిక్షణ పూర్తి నాణ్యమైన భోజనం అందించేందుకే శిక్షణ పాఠశాలల్లో వంట చేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వబడింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన, పోషణ విలువతో కూడిన భోజనం అందించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచనున్నారు. – సత్యనారాయణ, డీఈఓ భువనగిరి : జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం, వారు ఉండే పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో వంట చేసే ఇద్దరు మహిళలు, ఒక ఎస్ఓ, ఇద్దరు స్వీపర్లు (స్కావెంజర్లు), ఒక ఏఎన్ఎం చొప్పున ఎంపిక చేసి హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈనెల 9న పారిశుద్ధ్య, వంట కార్మికులతోపాటు 50 కాంప్లెక్స్లకు హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలు ఇలా.. జిల్లాలో 738 ఉన్నాయి. వీటిలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత, 11 కేజీబీవీ, 7 మోడల్ పాఠశాలలున్నాయి. ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 49,288 మంది విద్యార్థులున్నారు. పాఠశాలల్లో వంట కార్మికులు 1,270 మంది ఉండగా వీరితోపాటు ఒక్కో పాఠశాలల్లో ఒక్కో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కేజీబీవీలో వంట చేసేందుకు 3 నుంచి 5 వరకు వంట కార్మికులు ఉండగా స్వీపర్లు ఇద్దరు, ఒక ఏఎన్ఎంలు ఉంటారు. అలాగే మోడల్ స్కూళ్లలో నలుగురి వరకు వంట కార్మికులు, ఇద్దరు స్వీపర్లు, బాలికల పాఠశాలల్లో అయితే ఒక ఏఎన్ఎం సేవలు అందిస్తున్నారు. మార్పు తెచ్చేలా.. చాలా మంది వంట కార్మికులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం తయారీపై అవగాహన లేదు. దీంతో వారు వండిన ఆహారాన్ని పిల్లలు తినేందుకు ఆసక్తి చూపడంలేదు. పాఠశాలల్లో పరిశుభ్రత లోపించి విద్యార్థులు తరచు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలని విద్యాశాఖ భావించి శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో కార్మికులు కూరగాయల శుభ్రత, రుచికరమైన ఆహారం ఎలా తయారు చేయాలనే అంశాలపై శిక్షణలో నేర్చుకున్నారు. -
క్రీడా స్కూళ్లలో ప్రవేశానికి 16 నుంచి ఎంపిక పోటీలు
భువనగిరి : తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మండలాలకు చెందిన ఎంఈఓలు నిర్ణయించిన తేదీల ప్రకారం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపికై న బాలబాలికలకు ఈ నెల 25న ఉదయం 8గంటలకు భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణంలో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలకు హాజరు కానున్న విద్యార్థులు 2016 నవంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు వచ్చేవారు జనన ధ్రువీకరణ పత్రం, 3వ తరగతికి సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8309992451ను సంప్రదించాలని కోరారు. హనుమంతుడికి ఆకుపూజయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేధ్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడుసేవలు వంటి పూజలు కొనసాగాయి. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలిభువనగిరి : సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఆశ నోడల్ ఆఫీసర్స్, ఫెసిలిటేటర్స్తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రాఫిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలను అందించాలని, అబార్షన్ రేటును తగ్గించి వ్యాధి నిరోధక టీకాలను 100 శాతం వేయాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ శిల్పిని, యశోద, డాక్టర్ రామకృష్ణ, వీణా, ఆశ నోడల్ అధికారులు సత్యవతి, హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భువనగిరిలో బాంబ్స్క్వాడ్ బృందం తనిఖీలుభువనగిరిటౌన్ : ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కంగార్ జరుగుతున్న నేపథ్యంలో భువనగిరిలో మంగళవారం పోలీసులు ముమ్మర తనిఖీ చేపడుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాంటీబాంబ్ స్క్వాడ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. అలాగే రహదారి బంగ్లాలో తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలోలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారంలో రోజుల నుంచి భువనగిరి పట్టణంలో అనుమానం వచ్చిన ప్రతి చోట తనిఖీలు చేపడుతున్నారు. -
బడులిలా.. చదివేదెలా!
25 శాతం పనులే పూర్తి మోత్కూరు : మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన బస్తి–మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.52 లక్షలతో చేపట్టిన నిర్మాణాలు పిల్లర్స్ దశలోనే ఆగి పోయాయి. 600లకు పైగా బాలబాలికలున్న ఈ సూ్క్ల్లో మేజర్, మైనర్ వర్క్స్, 25 శాతం పనులు రంగులు, విద్యుద్ధీకరణ, స్లాబ్ మరమ్మతులు పూర్తిచేశారు. టాయిలెట్స్ పనులు పిల్లర్ల దశలో వదిలి వేశారు. అదే విధంగా డైనింగ్ హాల్ (భోజనశాల) బేస్మెంట్ నింపి పిల్లర్ల దశలోనే ఆపేయడంతో విద్యార్థులకు శాపంగా మారనుంది. ఆలేరు : మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఉన్నత బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలల్లో మనఊరు–మనబడి కింద విద్యు త్, ఫ్యాన్లు, కిటికీల మరమ్మతులు పూర్తయ్యాయి. తరగతి గదుల ఫ్లోరింగ్ పనులు జరిగాయి. కొన్ని తరగతి గదుల్లో కొన్ని ఫ్యాన్లు పనిచేయటం లేదు. అలాగే కరెంట్ ఆన్ఆఫ్ స్వీచ్లు, ఫ్యాన్ల రెగ్యులేటర్లు సరిగా లేవు. పాఠశాలల ఆవరణలు పిచ్చిమొక్కల నిండి ఉన్నాయి. ఎంఆర్సీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. ఈ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనం నిర్మించేందుకు కలెక్టర్కు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ భవనం వద్ద పరిసరాలు అధ్వానంగా మారాయి. బాలికల ఉన్నత పాఠశాల వెనుక ఉన్న మరో స్కూల్ భవనం కూడా శిథిలమైంది. ఈభవనాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించాలని కలెక్టర్కు ప్రతిపాదన చేశారు. అసంపూర్తిగా బడి పనులు రాజాపేట : మండలంలోని 14 పాఠశాలలకు మన ఊరు మనబడి పథకం ద్వారా 64 పనుల నిమిత్తం రూ. 2.84కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. పాఠశాలల్లో మౌలిక వసతలు కల్పించాల్సి ఉన్నా ఇప్పటి వరకు కేవలం విద్యుత్ పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులు అసంపూర్తిగానే వదిలేశారు. రాజాపేట, పాముకుంట, రఘునాథపురం, చల్లూరులో బోజన ఏర్పాటు కోసం చేపట్టిన క్యాంటీన్ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఆగింది. ఆగిన అదనపు గది నిర్మాణం ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని కప్రాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ క్రూసీయల్ బ్యాలన్స్ ఫండ్ కింద రూ.8లక్షలతో మంజూరై అదనపు గది నిర్మాణం పనులు నాలుగు సంవత్సరాల నుంచి పిల్లర్లకే పరిమితమైంది. ఈ పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థుల వరకు ఉంటారు. గదులు సరిపోక గతేడాది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు, ఉపాధ్యాకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద మౌలిక వసతులు కల్పించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పూర్తికాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తరగతి గదులు నిర్మాణం వంటి పనులు చేపట్టినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం శ్రీసాక్షిశ్రీ ఆయా పాఠశాలలను విజిట్ చేసింది. దీంతో ఎంపికై న పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్న వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ విద్యాసంవత్సరంలో చేరనున్న విద్యార్థులకు సమస్యలను స్వాగతం పలకనున్నాయి. ఫ ప్రభుత్వ స్కూళ్లలో నిలిచిన ‘మన ఊరు–మనబడి’ పనులు ఫ నిధుల లేమితో ఎక్కడచూసినా అసంపూర్తిగానే నిర్మాణాలు ఫ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి.. ఫ రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం పెచ్చులూడుతూ.. శిథిలావస్థలో.. బొమ్మలరామారం : మండలంలోని కంచల్తండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి. గత విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు గాను 64 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివారు. ఈ భవనం బేస్మెంట్ శిథిలావస్థకు చేరుకొని పందికొక్కులకు ఎలుకలు స్థావరంగా మారింది. -
ఈవీఎంలకు ప్రత్యేక భద్రత కల్పించాలి
భువనగిరిటౌన్ : ఈవీఎంల గోదాము వద్ద ప్రత్యేక భద్రత కల్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన.. కలెక్టర్ హనుమంతరావుతో కలిసి భువనగిరి కలెక్టరేట్లోని గోదాములో భద్రపర్చిన ఈవీఎంలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ను తెరిపించి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జలకుమారి, డీటీ సురేష్బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు. ఫ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి -
నకిలీ విత్తనాల ముఠా అరెస్టు
సూర్యాపేటటౌన్ : నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట ఎస్పీ కె. నర్సింహ తెలిపారు. వారి నుంచి రూ.65 లక్షల విలువ గల 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ బస్ స్టేజీ వద్ద ఈ నెల 9న సీపీఎస్ పోలీసులు, ఆత్మకూర్(ఎస్) పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన తండా నగేష్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడు 120 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను గోనె సంచిలో పెట్టుకొని ని బైక్పై వెళ్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. నగేష్.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన పంది రాము వద్ద విత్తనాలు తెస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పంది రామును అతని గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో బానోతు జయరాం షాపులో కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అలాగే జయరాం షాపునకు గుంటూరు జిల్లా బాలాజీనగర్కు చెందిన తరిగొప్పుల శ్రీనివాసరావు సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో జయరాంను, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా.. బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన మాగులూరి సాంబశివరావు అనే వ్యక్తి అరుణోదయ అనే నకిలీ పత్తి విత్తన కంపెనీ నిర్వహిస్తూ విత్తనాలు తయారు చేస్తున్నాడు. తరిగొప్పుల శ్రీనివాసరావు మధ్యవర్తిగా ఉంటూ కర్నూలు జిల్లా పల్లిపాడు గ్రామానికి చెందిన చెవుల నర్సింహులుతో సరఫరా చేస్తున్నట్లు తేలింది. జయరాం షాపులో నిల్వచేసిన 37 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోగా ఈ బస్తాలో ఒక్కొక్క దానిలో 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ సుమారు రూ.63 లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. ఈ కేసులో తండ నగేష్, పంది రాము, బాణోతు జయరాం, తరిగొప్పుల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్కు పంపగా.. ఏ–1 అయిన అరుణోదయ నకిలీ పత్తి విత్తనాల కంపెనీ ఎండీ మాగులూరి సాంబశివరావు, ఏ–6 చెవుల నర్సింహులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మరో కేసులో ఇద్దరు అరెస్టు ముందస్తు సమాచారం మేరకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన వెలుగు శ్రీను అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 9న జిల్లా సీపీఎస్, మోతె పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అతని ఇంట్లో అడ్వాన్స్ 333, అరుణోదయ అనే నకిలీ పత్తి విత్తనాల కంపెనీల పేరుతో ఉన్న 98 ప్యాకెట్ల స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. శ్రీను బంధువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహన అనే వ్యక్తితో కలిసి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ రైతులకు ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నామని ఒప్పుకున్నాడు. వెంటనే శాతవాహన అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద 30 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరికి ఈ విత్తనాలు సరఫరా చేస్తున్న మరో వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నలుగునూర్కు చెందిన తిరుమల్గా గుర్తించారు. ప్రస్తుతం తిరుమల్ పరారీలో ఉండగా అతనిని పట్టుకునేందుకు పోలీస్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో రూ.2లక్షల విలువ చేసి 58 కేజీల నకిలీ విత్తాలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో బాగా పని చేసిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ రూ.65లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ -
నీటి కుంటలో పడి బాలుడి మృతి
డిండి: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండలం నగారాదుబ్బతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగారాదుబ్బతండాకు చెందిన కరంటోతు చంద్రు, బుజ్జి దంపతుల కుమారుడు సిద్ధు(13) నాగరకర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అక్కడే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్వగ్రామంలోనే ఉంటున్న సిద్ధు సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన నలుగురి స్నేహితులతో కలిసి ిఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని మెట్టన్కుంట వద్దకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో సిద్ధు ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయాడు. అతడి స్నేహితులు నలుగురు భయంతో అక్కడి నుంచి చేరుకున్నారు. కానీ సిద్ధు నీటి కుంటలో పడిపోయిన విషయం ఎవరికీ చెప్పలేదు. రాత్రయినా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో సిద్ధు తల్లిదండ్రులు గ్రామంలో ఎక్కడ వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. మంగళవారం తెల్లవారుజామున సిద్ధు వెంట వెళ్లిన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు, తండావాసులు మెట్టన్కుంటలో వెతకగా సిద్ధు మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సిద్ధు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి చంద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా నుంచి అతివేగంగా వస్తున్న కారు నల్లగొండ నుంచి ఎస్ఎల్బీసీ వైపు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడేనికి చెందిన వంశీ (22) అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన బైక్ నడుపుతున్న రుద్రాక్షి తిలక్ స్వల్పంగా గాయపడ్డాడు. వీరు పేటీఎం కంపెనీలో పనిచేస్తున్నారు. కారు బైక్ను ఢీకొట్టిన తర్వాత పక్కనే ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లోకి దూసుకెళ్లింది ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులు అప్రమత్తమై తప్పించుకోవడంతో వారికి ప్రాణపాయం తప్పింది. ఈ ఘటనలో కారు టైరు పేలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఉన్న వ్యక్తులు ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య గుర్రంపోడు: రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. తెరాటిగూడెం గ్రామానికి చెందిన నారబోయిన సురేందర్(20) రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. సోమవారం కూడా సురేందర్ మద్యం తాగి ఇంటికి రావడంతో.. ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిదండ్రులు నారబోయిన అచ్చమ్మ, మల్లయ్య మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సురేందర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి తమ బత్తాయి తోట లో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వ్యక్తిపై దాడి కేసులో నలుగురి రిమాండ్
చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన నలుగురిని మంగళవారం పోలీసులు రిమాండ్ చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామానికి చెందిన ధరావతు అశోక్పై గత నెల 23వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గ్రామ శివారులోని లక్ష్మీనగర్ టౌన్షిప్లో దాడి చేశారు. దీంతో అశోక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన అల్లకుంట్ల రాము, ఓర్సు కేశవ, ఇద్దరు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ కనకరత్నం, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణంగరిడేపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయినిగూడెం గ్రామానికి చెందిన గుండు మహేష్(36) గత కొన్నేళ్లుగా కీతవారిగూడెంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు ఇటీవల పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో పిల్లల చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ జీవితంపై విరక్తితో మంగళవారం ఉదయం తన భార్య షాపు వద్దకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య సంధ్యావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విహారయాత్రకు వద్దన్నారని..యాదగిరిగుట్ట: విహారయాత్రకు వెళ్లేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం జరిగింది. వివరాలు.. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లికి చెందిన గంగాధార్ భరత్(17) ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం విహారయాత్రకు వెళ్తానని తల్లిదండ్రులను అడిగాడు. ఇల్లు కట్టుకోవడానికే డబ్బులు లేవు.. ఇప్పుడు టూర్కు ఎందుకని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన భరత్ ఇంటి వెనుక గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి భువనగిరి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే భరత్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాస్కర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతినకిరేకల్: మద్యం మత్తులో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని అరెంపుల గ్రామానికి చెందిన వల్లురు భూపాల్రెడ్డి(52)కి నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన జానకితో వివాహమైంది. గతేడాది నుంచి భూపాల్రెడ్డి మండలాపురంలో తన అత్తగారింట్లోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు(కవల పిల్లలు) ఉన్నారు. మద్యానికి బానిసైన భూపాల్రెడ్డి ఈ నెల 8వ తేదీన తన అత్తగారి నిమ్మతోటకు వెళ్లాడు. మద్యంలో మత్తులో తోటలో గడ్డి మందు తాగాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తాను గడ్డి మందు తాగానని కుటుంబ సభ్యులతో చెప్పాడు. అప్పటికే అపస్మాకరస్థితిలోకి వెళ్లిన భూపాల్రెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నకిరేకల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రిష్ణమాచారి తెలిపారు. -
నేడే ఏరువాక పౌర్ణమి
ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లుబీబీనగర్: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలలోని అంకుశాపూర్ పరిధిలో గల ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 సంవత్సరానికి గాను అడ్మిషన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నుట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాసైన మహిళా అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఇంటర్మీడియట్ మెమో, బోనాఫైడ్ సర్టిఫికెట్ తో పాటు 2025 జనవరి తర్వాత పొందిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు జిరాక్స్, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించాలని సూచించారు. ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంజెడ్సీ, బీజెడ్సీ, బీకాం, సీఏ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7995010687, 7981199283 నంబర్లను సంప్రదించాల ప్రిన్సిపాల్ సూచించారు. హాలియా, రామన్నపేట: తొలకరి జల్లులు.. రైతన్నల మోములో చిరునవ్వు.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరవాక పౌర్ణమి. ప్రతి ఏడాది వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి వర్షాలు పడి భూమి మెత్తబడుతుంది. దీంతో రైతులు దుక్కులు దున్నడం, వ్యవసాయ పనులను ఏరువాకతోనే మొదలుపెడతారు. బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కథనం. ఏరువాక అంటే.. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుకనే ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్ధం. ఈ రోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టే కాడిని పూజించి, ఎద్దులకు భక్షాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేసి దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య వ్యవసాయ పనులు మొదలు పెడతారు. ఏరువాక పౌర్ణమి నేపథ్యం.. ఏరువాకను జ్యోతిష్య శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఏరువాక పౌర్ణమి జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసంలో ప్రారంభమయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం అంతటా ఒకేలా ఉంటుంది. 80శాతం వర్షం నైరుతి రుతుపవనాల వల్లనే కలుగుతుంది. దీంతో పొలం పనులకు ఆటంకం కలగవద్దని, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఏరువాకను మహా యజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు. రామాయణంలో నాగేటి సాళ్లల్లో సీతమ్మ అమ్మవారు దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగా కూడా భావిస్తారు. ఇదే రోజున ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి స్నానోత్సవం కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా పూర్వం శ్రీకృష్ణదేవరాయల వారు తన పాలనా కాలంలో ఏరువాక పండుగ రోజున రైతుల శ్రమ, కృషిని గుర్తించి తగిన రీతిలో రైతులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇదే రోజున శుద్ధోదన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభించి బంగారు నాగలిని రైతులను బహూకరించినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. ఏరువాకతో దున్నడం ప్రారంభిస్తాం ఏరువాక పౌర్ణమి రోజు మా ఊర్లో రైతులందరం కలిసి వ్యవసాయ పనిముట్లు, భూదేవికి, ఎద్దులకు పూజలు చేస్తాం. అనంతరం నాగళ్లు కట్టి దుక్కులు దున్నడం ప్రారంభిస్తాం. వర్షాలు అనుకున్నట్లు పడితే ఈ ఏడాది వ్యవసాయ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదు. – అనుముల శ్రీనివాస్రెడ్డి, రైతు, త్రిపురారంవ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది ఆధునిక పరిజ్ఞానం పెరగడం, యంత్రాలను విరివిగా ఉపయోగించడం, ప్రభుత్వం వివిధ రూపాల్లో తగిన ప్రోత్సాహం అందించడం వల్ల కొంతకాలంగా వ్యవసాయరంగం బాగా అభివృద్ధి చెందింది. పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో రైతులకు చాలా మేలు జరుగుతుంది. వివిధ రంగాల్లో స్థిరపడిన వారి దృష్టి సైతం వ్యవసాయం వైపు మళ్లింది. – కూనూరు రమేష్ రైతు సిరిపురం, రామన్నపేటఫ వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఈ ఏడాది ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం 2025–26 వ్యవసాయ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు డీలర్ల వద్ద, పీఏసీఎస్లలో అందుబాటులో ఉన్నాయి. మెట్ట పంటలు సాగు చేసే రైతులు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిన తర్వాతే పత్తి, కంది సాగు చేయాలి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి మంచి దిగుబడులు వచ్చి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. – డి. గోపాల్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయాధికారి -
నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో బాలుడి కిడ్నాప్
నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం బాలుడు(20 నెలలు) కిడ్నాప్కు గురయ్యాడు. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామానికి చెందిన బైరం భాగ్యలక్ష్మి, అంజిబాబు దంపతులకు మొదటి కాన్పులో కుమారుడు సోమేష్ కుమార్(20 నెలలు) జన్మించాడు. భాగ్యలక్ష్మి ఈ నెల 8న రెండో కాన్పు కోసం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం మధ్యాహ్నం భాగ్యలక్ష్మితో పాటు ఆమె కుమారుడు సోమేష్కుమార్, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎదుట గల చెట్టు కింద సేదతీరారు. అప్పటికే ఇద్దరు మహిళలు భాగ్యలక్ష్మితో పాటు ఆమె బంధువులతో పరిచయం పెంచుకున్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత భాగ్యలక్ష్మి తన కుమారుడు సోమేష్కుమార్ను తనకు పరిచయమైన ఇద్దరు మహిళల వద్ద ఉంచి కాన్పుల వార్డుకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి కుమారుడు, ఇద్దరు మహిళలు కనిపించలేదు. దీంతో భాగ్యలక్ష్మి, ఆమె బంధువులు ఆస్పత్రి మొత్తం వెతికినా సోమేష్కుమార్ ఆచూకీ లభించకపోవడంతో నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. భాగ్యలక్ష్మికి ఇంకా రెండో కాన్పు కాలేదు. నాలుగు బృందాలతో గాలింపు.. నల్లగొండ: బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో నాలుగు టీంలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. అంతేకాకుండా డీఎస్పీ తన సిబ్బందితో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఫ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు భువనగిరిలో కనిపించిన కిడ్నాపర్లు భువనగిరిటౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిడ్నాప్ అయిన బాలుడితో పాటు ఇద్దరు మహిళలు భువనగిరి బస్టాండ్ ఆవరణలో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వారు బస్టాండ్ నుంచి బయటకు వచ్చి యాదగిరిగుట్ట వైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళలు భువనగిరి బస్టాండ్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ పే నంబర్ అధారంగా కిడ్నాప్ అయిన బాలుడితో సహా ఆ ఇద్దరు మహిళలను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలిద్దరు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్, ఆత్మకూర్ మండలాలకు చెందినవారిగా సమాచారం. అయితే కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామనే భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. -
రేపు పోచంపల్లికి గవర్నర్ రాక
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లికి గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేనేత జౌళిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్కుతో పాటు సమీపంలోని చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా టూరిజం పార్కులోని కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కార్మికులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించనుండడంతో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. చేనేత బీమా, త్రిఫ్ట్ పథకం చెక్కులను గవర్నర్ లబ్ధిదారులకు అందజేయనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన పోచంపల్లి, కుంట్లగూడేనికి చెందిన చేనేత కార్మికులకు సమాచారం ఇచ్చి వారు సకాలంలో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ చేనేత కార్మికుల గృహాలను సైతం సందర్శించి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొంటారని.. దీంతో టూరిజం పార్కు సమీపంలో ఉన్న చేనేత కార్మికులైన భారత భాస్కర్, భారత మధు, పొట్టబత్తిని శేఖర్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్, చేనేత జౌళిశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట రాష్ట్ర చేనేత జౌళిశాఖ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, జిల్లాఏడీ శ్రీనివాస్రావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ పి. శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎస్ఐ భాస్కర్రెడ్డి, జౌళిశాఖ అభివృద్ధి అధికారి రాజేశ్వర్రెడ్డి, చేనేత నాయకులు తడక రమేశ్, భారత లవకుమార్, అంకం పాండు, ఏలే భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన ఇలా.. గురువారం ఉదయం 10.45 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పోచంపల్లికి చేరుకుంటారు. 11.15 వరకు చేనేత గృహాల సందర్శన, 11.15 నుంచి 11.30 గంటలకు టూరిజం పార్కును సందర్శించి పార్కులో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియను పరిశీలిస్తారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12గంటలకు చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12.15 వరకు చేనేత కార్మికులకు బీమా, త్రిఫ్ట్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం 12.15 గంటల తర్వాత గవర్నర్ తిరిగి రాజ్భవన్కు పయనమవుతారు. అయితే గవర్నర్ పర్యటన షెడ్యూల్డ్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఫ ఏర్పాట్లను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ప్రెస్
రామగిరి(నల్లగొండ): సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజన్లో మంగళవారం సాంకేతిక లోపం ఏర్పడింది. నల్లగొండ రైల్వే స్టేషన్కు రైలు ఉదయం 9.10 గంటలకు వచ్చింది. అదే సమయంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి అక్కడే ఆగిపోయింది. అప్పటికే ప్లాట్ఫాం మీదకు వచ్చిన హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. రెండు రైళ్లు సుమారు గంటకు పైగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రైలు ఇంజన్ను తెప్పించి జన్మభూమి రైలును పంపించారు. ఆ వెంటనే ఫలక్నూమా రైలు కూడా వెళ్లింది. 10.20 గంటలకు రెండు రైళ్లు కదిలాయి. సుమారు గంటకు పైగా ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. ఫ లైన్ సిగ్నల్ లేక ఫలక్నూమా.. ఫ నల్లగొండ రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచిన రెండు రైళ్లు -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
‘వ్యవసాయ పాలిటెక్నిక్’లో ప్రవేశాలు
త్రిపురారం: అగ్రికల్చర్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థుల కోసం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా త్రిపురారం మండలం కంపాసాగర్లో గల వ్యవసాయ పరిశోధనా స్థానంలో పాలిటెక్నిక్ కళాశాలను 2007లో ప్రారంభించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, అగ్రికల్చర్ విభాగంలో పాలిసెట్–2025లో ర్యాంకు సాధించిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరేందుకు గాను ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు :దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 2024 డిసెంబర్ 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు. పదో తరగతిలో వచ్చిన మార్కులు, పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. అర్హత సాధించిన వారికి మాత్రమే సమాచారం అందిస్తారు. వివరాలకు www.pjtsau. edu.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల వ్యవధి రెండేళ్లు కాగా.. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి మూడేళ్లు ఉంటుంది. కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ● దరఖాస్తు ఫీజు : దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులకు రూ.1200, ● ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : జూన్ 28● ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : జూన్ 29● దరఖాస్తులు తప్పుల సవరణకు చివరి తేదీ : జూన్ 30 ఆన్లైన్లో దరఖాస్తునకు ఈ నెల 29 వరకు గడువు పదో తరగతి మార్కులు, పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ఎంపికయూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎంపికవిద్యార్థుల ఎంపిక యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. కంపాసాగర్ పాటిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ప్రశాతం వాతావరణంలో విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులపై క్షేత్రస్థాయిలో మెళకువలు నేర్చుకుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ లింగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం -
కోతుల దాడి.. వృద్ధుడికి తీవ్ర గాయాలు
మోత్కూరు : కోతుల దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన కొంపెల్లి భిక్షమయ్య(75) తన ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి అతడిపై దాడికి పాల్పడ్డాయి. అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భిక్షమయ్య కుటుంబ సభ్యులు గమనించి కోతులను తరిమేసి అతడిని మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా గ్రామంలో కోతుల సంచారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, కోతుల బెడద నుంచి రక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. -
యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్ అధికారులు
యాదగిరిగుట్ట: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 2024 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు సౌరబ్ శర్మ, సలోని ఛబ్రా, హర్ష చౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్కుమార్ సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు ట్రైనీ ఐఏఎస్ అధికారులకు ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు. జైన మందిరంలో పూజలు.. ఆలేరురూరల్: ఆలేరు మండలం కొలనుపాకలోని జైన మందిరం, సోమేశ్వరాలయాన్ని కూడా ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పరిసరాలను పరిశీలించారు. వారి వెంట ఆర్డీఓ తదితరులు ఉన్నారు. -
పశుగ్రాసం సాగులో మెళకువలు
పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటి సాగుకు ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే శాసీ్త్రయ పద్ధతిలో పశుగ్రాసం సాగు చేస్తే ఖర్చు తగ్గించవచ్చని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి చెబుతున్నారు. డెయిరీ ఫాంల నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుందని, మేత ఖర్చును తగ్గిస్తే లాభాలు పెంచుకునే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లై చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై, అదేవిధంగా పశుసంవర్ధకశాఖ అధికారులు సైతం 50శాతం రాయితీపై పాడి రైతులకు విత్తనాలు ఇస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని ఆయన సూచిస్తున్నారు. పశుగ్రాసం సాగు చేసే విధానం● పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నైపర్, కో1, కో 2, ఎస్ఎస్జీ–825 రకాలు. ● 85శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు. ● ఒకసారి నాటితే 4 నుంచి 5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ● జనవరి నుంచి ఆగస్టు నెల వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. ● అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది. ● పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ● ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ● దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ● విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ● అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలే జీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు. పాల దిగుబడి ఎక్కువే..పశుగ్రాసం సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చి మేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చి మేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చి మేత ద్వారా 5 నుంచి 6లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న పాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. -
కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి
గట్టుప్పల్: కుక్కల దాడిలో కృష్ణ జింక మృతిచెందింది. ఈ ఘటన గట్టుప్పల్ మండల పరిధిలోని నామాపురం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నామాపురం గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం సమీపంలో గడ్డి మేస్తున్న కృష్ణ జింకను కుక్కలు వెంటాడి చంపాయి. సమీపంలోని రైతులు గమనించి కృష్ణ జింకను విడిపించే ప్రయత్నం చేయగా.. కుక్కలు రైతుల వెంటపడడంతో వారు తప్పించుకున్నారు. అటవీశాఖ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి జింకల పార్కు ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్, భీమనపల్లి రాములు డిమాండ్ చేస్తున్నారు. బాలుడికి గాయాలు..నేరేడుచర్ల: కుక్కల దాడిలో బాలుడు గాయపడిన ఘటన సోమవారం నేరేడుచర్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రావిరాల మన్విత్ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నేరేడుచర్ల మున్సిపాలిటీలోని చింతబండకు వచ్చాడు. బంధువుల ఇంటి వద్ద పిల్లలతో కలిసి మన్విత్ ఆడుకుంటుండగా.. కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే మన్విత్ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి పున్న నాగిని తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం వలిగొండ: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాపురం గ్రామానికి చెందిన సోలిపురం నర్సిరెడ్డి(55) ఆదివారం సాయంత్రం తన ఇంటి నుంచి వ్యవసాయ బావి వద్దకు తొర్రూరు–వలిగొండ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్ : భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జంకుతండాకు చెందిన బుడిగపాక నరేష్, శోభ దంపతుల కుమార్తె దివ్య(23) మిర్యాలగూడ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుండగా.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన బొంత నాగరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు బొంత వెంకటేష్తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె లాస్య, కుమారుడు తరుణ్కుమార్ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా యాద్గార్పల్లి గ్రామానికే చెందిన మహిళతో వెంకటేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి దివ్య భర్తను నిలదీసింది. దీంతో ‘నీవు కట్నం ఏమైనా తెచ్చావా.. నీవు తక్కువ కులం దానివి’ అంటూ దివ్యను కొంతకాలంగా వెంకటేష్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం భార్యాభర్తల మధ్య మరో సారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన దివ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. -
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం
మిర్యాలగూడ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంపై కోర్టుకు వెళ్తామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణ కమిటీ ముందు హరీష్రావు అన్ని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ అప్పులు మిగిల్చిపోయాడని, కాంగ్రెస్ ప్రభుత్వం 16నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఇటీవల రూ.5వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. రూ.22వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల భారం పడిందన్నారు. రాబోయే మూడేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీళ్లు అందిస్తామన్నారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పిందని, ఆ దయ్యాలెవరో ఇంతవరకు బయటకు రాలేదన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
అధ్యక్ష పాలన దిశగా బీజేపీ ప్రయత్నాలు
యాదగిరిగుట్ట: అమెరికా తరహాలో మన దేశంలోనూ అధ్యక్ష పాలన దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం. సాయిబాబా అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో ప్రారంభమైన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. బీజేపీ విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు. దేశంలో ఇప్పటివరకు 14 మంది ప్రధాన మంత్రులు రూ.50లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోదీ ఒక్కరే రూ.170 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. మన దేశం ఆకలి సూచీలో ప్రపంచంలోనే 104 స్థానంలో ఉందని, దీనిని అభివృద్ధి అనాలి అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాక ముందు దేశంలో 100 మంది కోటీశ్వరులు ఉంటే ఇప్పుడు 200మంది అయ్యారని దుయ్యబట్టారు. మోదీ పేదల సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు. భద్రతా లోపం వల్లే పహల్గాంలో ఉగ్రదవాదుల దాడిలో 21 మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులకు ముందు పార్టీ మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి పార్టీ జెండాను ఎగురవేశారు. పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబా -
గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట–మల్లాపురం రహదారిలో సోమవారం గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పరిధిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 65 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి సోమవారం యాదగిరిగ్టుట–మల్లాపురం రహదారిలో ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద ఆవుల కృష్ణకు చెందిన పశువుల కొట్టం విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుకు గురై మహిళ మృతి వలిగొండ: పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన వలిగొండ మండలం గుర్నాథపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్నాథపల్లి గ్రామానికి చెందిన తోట జయమ్మ(65) ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించగా.. రాత్రి 10గంటల సమయంలో ఆమెను పాము కాటేసింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. అన్నివర్గాల మద్దతుతోనే ఎస్సీ వర్గీకరణ● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ చిట్యాల: అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల మద్దతుతోనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. చిట్యాలలో సోమవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంద కృష్ణమాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా చేసిన రాజీలేని పోరాటంతో చివరికి విజయం దక్కిందన్నారు. ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఏర్పాటైన ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఫలితంగానే మంద కృష్ణమాదిగను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందని అన్నారు. ఈ సమావేశంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎరసాని గోపాల్, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం, జీడిమెట్ల రవీందర్, కావలి కృష్ణ, జోగు ప్రవీణ్, మేడి లింగస్వామి, మేడి నర్సింహ, జనగాం అర్జున్, రుద్రవరం లింగస్వామి, మేడి ధనుంజయ పాల్గొన్నారు. -
దారులన్నీ యాదగిరిగుట్టకే..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ సన్నిధితో పాటు పట్టణ పరిసరాలు, ఆధ్యాత్మిక వాడ.. ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు.. శ్రీస్వామి జన్మ నక్షత్రం స్వాతి కలిసి రావడంతో ఆదివారం శ్రీస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశంలోని ఆయా ప్రాంతాల భక్తులు అధికంగా తరలి వచ్చారు. ఉదయం నుంచే యాదగిరీశుడి క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలన్నీ నిండిపోయాయి. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీనృసింహస్వామిని 90 వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ పూజలతో ఆలయానికి నిత్యాదాయం రూ.85,57,558 వచి్చనట్లు అధికారులు వెల్లడించారు. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని ఆదివారం భక్తులు, ఆలయాధికారులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేశారు. ఉదయం 5 గంటలకు కొండ కింద గల వైకుంఠద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు వివిధ ప్రాంతాల కళాకారులు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, ఈవో వెంకట్రావు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు రాష్ట్రం, దేశం నలుదిశల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకు ధర్మదర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. ఒక్క రోజులో లక్ష మంది భక్తులు శ్రీస్వామిని దర్శించుకోవడం ఇదే మొదటి సారని ఆలయాధికారులు చెబుతున్నారు. గత వారం 90 వేల మంది భక్తులు దర్శించుకోగా.. శనివారం రాత్రి 10.30 గంటల తరువాత భక్తులు అధికంగా క్యూలైన్లలో శ్రీస్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం స్వాతి నక్షత్రంతో పాటు సెలవు రోజు కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయాధికారులు చెబుతున్నారు. -
ఎర్ర జెండాతోనే అసమానతలు లేని సమాజం
వేములపల్లి: ఎర్ర జెండాతోనే అసమానతలు లేని సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం వేములపల్లి మండల కేంద్రంలో సీపీఐ 7వ మండల మహాసభలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సీపీఐ పేద, బడుగు, బలహీనవర్గాలు సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. దేశంలో అసమానతలు విపరీతంగా పెరిగి ధనికులు మరింత ధనికులుగా, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ మహాసభలో మద్దిరాల రంగారెడ్డి, అంజనపల్లి రామలింగం, శాంతమ్మ, ఉదయ్, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, పుట్టల నాగయ్య, పుట్టల కృష్ణ, వల్లంపట్ల వెంకన్న, మున్నయ్య, సుధాకర్, జయ, సత్యం, పరమేష్, లింగయ్య, ఆనందం తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం