breaking news
Yadadri
-
‘తెల్ల’బోతునా్నరు!
సాక్షి, యాదాద్రి: పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన వరుస వర్షాలకు నష్టాన్ని చవిచూడగా, పంట చేతికొచ్చే దశలో మోంథా తుఫాన్ కోలుకోకుండా చేసింది. మిగిలిన పత్తిపై ఆశలు పెంచుకున్న రైతులకు నిబంధనల కత్తి మెడపై వేలాడుతోంది. ఎకరానికి 7 క్వింటాళ్లు పరిమితి విధించడంతో అధిక దిగుబడి వచ్చిన రైతులు అయోయంలో ఉన్నారు. మరోవైపు స్లాట్ బుకింగ్కు ఆడ్డంకులు ఎదురవుతున్నాయి. తేమ శాతం సాకుగా చూపి సీసీఐ కేంద్రాల్లో కొనుగోలుకు నిరాకరిస్తుండటంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఓపెన్ కాని సైట్ సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించాలంటే రైతులు స్లాట్ బుకింగ్ చేయాలి. రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, గ్రామాల్లో సిగ్నల్స్ అందకపోవడంత కసాప్ కిసాన్ యాప్ ఓపెన్ కావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఆన్లైన్ సెంటర్లు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సీసీఐ కేంద్రాల్లో ఎకరాలకు 12 క్వింటాళ్ల పత్తి అమ్ముకునేందుకు గతంలో రైతులకు వెసులుబాటు ఉండేది. కాగా తాజాగా ఏడు క్వింటాళ్ల పరిమితి విధిస్తూ కేంద్రం తాజాగా తీసుకువచ్చిన కొత్త రూల్ రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. నానా అవస్థలు పడి స్లాట్ బుక్ చేసి, పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఒకసారి స్లాట్ బుక్ చేస్తే 24 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. మళ్లీ స్లాట్ బుక్ కాకపోవడంతో రైతులు తీసుకెళ్లిన పత్తిని తిరిగి ఇంటికి తెస్తున్నారు. నిర్ధిష్ట తేమ శాతం ఉన్నా కొర్రీలే.. తేమశాతం 15నుంచి 18 ఽమధ్య ఉన్నా కొనుగోలు చేయడానికి సీసీఐ అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి వేచి ఉండలేక దళారులకు అమ్ముకుంటున్నారు. దళారులు ఇదే అదనుగా తీసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. హమాలీల కూలీ, వాహనాల చార్జ్, వెయిటింగ్ చార్జ్, తేమ శాతం తదితర కారణాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల పేరుతో దళారుల దందా దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువస్తున్నా దళారులు రూట్ మార్చి దందా చేస్తున్నారు. రైతుల పాస్ పుస్తకాలు తీసుకువచ్చి వారి పేరునే పత్తి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు స్లాట్ బుక్ కాకుండా పరోక్షంగా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. సీసీఐ అధికారులు సైతం దళారులతో కుమ్మక్కవుతున్నారు. రైతుల పేరుతో దళారులు తెచ్చిన పత్తి.. నిర్ధిష్ట శాతానికి ఎక్కువగా తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు ఫ పత్తి ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి ఫ తేమ పేరుతో కొనుగోలుకు కొర్రీలు ఫ స్లాట్ బుకింగ్కు ఆటంకాలు ఫ దిక్కుతోచని స్థితిలో కర్షకులు -
విద్యుత్ శాఖ.. ప్రజాబాట
ఫ వారంలో మూడు రోజులు వినియోగదారులతో ప్రత్యేక సమావేశాలు ఫ తొలుత పట్టణాల్లో ప్రజాబాట ఫ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ ఫ అక్కడికక్కడే పరిష్కారం భువనగిరి: ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి కరెంట్ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్పెట్టి, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో విద్యుత్ అధికారులు ప్రజాబాట పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళ, గురు, శనివారం రోజుల్లో.. వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శనివా రం) ప్రజాబాట నిర్వహిస్తున్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టణాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యలను తెలుసుకొని తక్కువ ఖర్చుతో కూడుకున్న వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఎక్కువ వ్యయంతో కూడుకున్న పనులకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులే కాకుండా ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెట్ల పొదలు, తీగ జాతి చెట్లను తొలగిస్తున్నారు. ఇనుప స్తంభాలను గుర్తిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడితే జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందుబాటులో 1912 విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, సమస్యలు తలెత్తినా ఫిర్యాదు చేయడానికి వినియోగదారుల సౌకర్యార్థం ఫ్యూజ్ ఆఫ్ కాల్ నంబర్ 1912 ఏర్పాటు చేశారు. ఈ నంబర్పైనా ప్రజాబాటలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలపైనా వివరిస్తున్నారు.విద్యుత్ స్తంభం వద్ద చెట్లనుతొలగిస్తున్న సిబ్బంది సమస్యలను గుర్తించి నమోదు చేసుకుంటున్న విద్యుత్ అధికారులు, సిబ్బంది వినయోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం. ఇందులో భాగంగా ప్రజాబాట పేరుతో సమస్యలను గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఎక్కువ ఖర్చుతో కూడిన వాటికి ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నాం. నిధులు రాగానే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. –సుధీర్కుమార్, ట్రాన్స్కో ఎస్ఈ -
గుట్ట ఆలయ పవిత్రతను కాపాడుదాం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. యాదగిరీశుడి క్షేత్రంలో అవినీతి, అక్రమాలపై విచారణ చేయించి, బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 11 జ్యోతులతో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఈఓ, డిప్యూటీ ఈఓ, ఏఈఓ స్థాయి అధికారులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుండగా.. ఆలయంపై పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. యాదగిరి క్షేత్ర పరిరక్షణ కోసం తాము చేస్తుంది ఉద్యమం కాదని, ధర్మయుద్ధం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, ప్రధాన కార్యదర్శులు కాదూరి అచ్చయ్య, చందా మహేందర్, యాదిరెడ్డి, ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శులు కృష్ణ, కొక్కొండ లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పక్కీర్ రాజేంజేందర్రెడ్డి, రాష్ట్ర కమిటీసభ్యులు రచ్చ శ్రీనివాస్, పట్టణ, మండల అధ్యక్షులు కర్రె ప్రవీణ్, గుంటిపల్లి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ‘ఆర్చరీ’కి 20 మంది ఎంపిక
భువనగిరి: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 20 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. భువనగిరిలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో బుధవారం ఉమ్మడి నల్లగొండ ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో 25 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ప్రతిభ కనబరచిన 20 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, టి.విద్యాసాగర్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో ఈ నెల 9, జూనియర్ విభాగంలో 16వ తేదీన హైదరాబాద్లో పోటీలు ఉంటాయని, క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ రా ణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసికోల్లాసం పెంపొందడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుభాష్రెడ్డి, టీజీపీఈటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజుగౌడ్, ఉపాధ్యక్షుడు స్వామి రాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, పీఈటీ విష్ణువర్ధన్రెడ్డి, కోచ్ సాయిరాం పాల్గొన్నారు. -
నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి
భువనగిరి టౌన్: కలెక్టరేట్లో నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలను అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన గావించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు చేశారు. అదే విధంగా శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, కార్తీక దీపారాధన, స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నేటి నుంచి గురుకుల జోనల్స్థాయి క్రీడా పోటీలు రాజాపేట: 11వ జోనల్ స్థాయి గురుకుల క్రీడా పోటీలకు రాజాపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సిద్ధమైంది. నేటి నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. 13 గురుకుల విద్యాలయాల నుంచి విద్యార్థులు క్రీడాపోటీల్లో పాల్గొంటారని జోనల్ అధికారి అరుణకుమారి, యాదాద్రి, జనగామ జిల్లాల డీసీఓలు సుధాకర్, శ్రీనివాసరావు తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాల్బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో, క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్లో పోటీలు ఉంటాయని, వీటి నిర్వహణకు కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో గురుకుల విద్యాలయాల స్పోర్ట్స్ ఆఫీసర్ రుతుమణి, జోనల్ స్పోర్ట్స్ ఇంచార్జ్ శ్రీనివాస్, పీడీలు కిషన్, వెంకటేశ్వర్లు, పీఈటీ శృతి పాల్గొన్నారు. కొత రూల్స్పై ఎందుకు ప్రశ్నించడం లేదు?భువనగిరిటౌన్ : ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం తీసుకువచ్చిన నిబంధనతో రైతులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య అన్నారు. బుధవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన నిబంధనపై కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలోని రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బట్టుపల్లి అ నురాధ, బాలరాజు, కల్లూరి మల్లేశం, పాండు, జెల్లెల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
చౌటుప్పల్లో రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు
చౌటుప్పల్: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్లోని ట్రినిటీ స్కూల్ సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు మంగళవారం చౌటుప్పల్లో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయా జిల్లాలకు చెందిన జట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో ప్రాచీణమైన మల్లఖంబ్ క్రీడను నేటి విద్యార్ధులకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని అన్నారు. భావితరాల కోసం విద్యారంగానికి ఎంత ఖర్చు చేసినా తక్కువేనని తెలిపారు. అందులో భాగంగానే తాను ప్రభుత్వ నిధులతో పాటు తన మాతృమూర్తి పేరిట నడుస్తున్న సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలు, హాస్టళ్లను బాగు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని గుర్తుచేశారు. 168మంది క్రీడాకారుల హాజరు అండర్–14, అండర్–17 విభాగాల్లో జరిగే ఈ మల్లఖంబ్ పోటీల్లో పాల్గొనేందుకు 7 ఉమ్మడి జిల్లాల నుంచి జట్టుకు 24మంది చొప్పున 168మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను ఈ నెలలోనే జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంఈఓ గురువారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెల్మ శేఖర్రెడ్డి, డీఈఓ కె. సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, గాంధీ గ్లోబల్ ఫ్యామిటీ ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ దశరథరెడ్డి, ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ. కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ఎస్జీఎఫ్ మండల సెక్రటరీ ఏ. లింగయ్య, ఆయా జిల్లాల నుంచి వచ్చిన కోచ్లు, క్రీడాకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఫ 7 ఉమ్మడి జిల్లాల నుంచి 168మంది క్రీడాకారులు హాజరు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
నల్లగొండ: అంతర్ రాష్ట్ర దొంగను మంగళవారం నల్ల గొండ వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని శాంతినగర్లో నివాసముంటున్న జెర్రిపోతుల రవి ఇటీవల తన ఇంటికి తాళం వేసి ఊరికెళ్లి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వన్టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి కేసు నమోదు చేసి రవి ఇంటి పక్కన వ్యక్తి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి అంతర్రాష్ట్ర దొంగ, పాత నేరస్తుడు రుద్రాక్షి శ్రీను చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. మంగళవారం మునుగోడు రోడ్డులో వన్టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రుద్రాక్షి శ్రీను బైక్పై అటుగా వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. అతడి నుంచి 6 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. రుద్రాక్షి శ్రీనును రిమాండ్కు తరలించామన్నారు. త్రిపురారం: మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన ఇద్దరిని త్రిపురారం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. హాలియా సీఐ సతీష్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన ఉమ్మడి శకుంతలమ్మ గత నెల 27న మధ్యాహ్నం త్రిపురారం వైపు ఉన్న తన పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన కొండేటి చరణ్తేజ్, కుంచం వెంకటేష్ బైక్పై శకుంతలమ్మ వద్దకు వచ్చి త్రిపురారం ఎటువైపు వెళ్లాలంటూ అడిగారు. ఆమె అడ్రస్ చెబుతుండగానే మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగిలించిన బంగారు గొలుసు విక్రయించేందుకు నిందితులు మంగళవారం ఆటోలో దేవరకొండ వైపు వెళ్తుండగా.. బాబుసాయిపేట రోడ్డు సర్కిల్ వద్ద త్రిపురారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండటాన్ని గమనించి ఆటో దిగి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించారు. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసినట్లు నిందితులు నిజం ఒప్పుకున్నారు. నిందితులిద్దరిపై మిర్యాలగూడ రూరల్, వేములపల్లి, హైదరాబాద్లోని ఆర్సీపురం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. వారి నుంచి 3 తులాల బంగారు గొలుసు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
బీసీ రాజ్యాధికార పార్టీకే అధికారం
నల్లగొండ: 2028లో బీసీ రాఽజ్యాధికార పార్టీ ఽఅధికారంలోకి వస్తుందని, బీసీ ముఖ్యమంత్రి అవుతాడని బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్లో జానారెడ్డి దీన్ని అడ్డుకున్నాడని ఆరోపించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో శ్రీఓపెన్ టాక్ విత్ మల్లన్నశ్రీ నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రశ్నలు వేయగా మల్లన్న వాటికి సమాధానాలు చెప్పారు. తన రాజ్యాధికార పార్టీలో బీసీలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని, ఓసీలకు చట్ట సభలో 5 టికెట్లు మాత్రమే ఇస్తామన్నారు. తమ పార్టీలో అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. సామాజిక, ఆర్ధిక న్యాయం జరుగుతుందని, వ్యక్తి ఆరాధన ఉండదని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి మొదలుకుని సర్పంచ్ వరకు, తహసిల్దార్ నుంచి కలెక్టర్ వరకు అన్ని కార్యాలయాల ముందు డిజిటల్ టీవీలు ఏర్పాటు చేస్తారని, లోపల ముఖ్యమంత్రి, కలెక్టర్లు, గ్రామాల్లో సర్పంచ్లు, ప్రజలు బయట ఆన్లైన్లో చూసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ప్రజల డబ్బు నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు రహస్యంగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. విద్యకు అతి తక్కువ ఖర్చుపెట్టింది తెలంగాణే..... దేశంలో విద్యా వ్యవస్థకు అతి తక్కువ ఖర్చు పెట్టేది తెలంగాణ ప్రభుత్వమేనని, ఈ ప్రభుత్వానికి బుద్ది లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జెండాల తరహాలో రాజ్యాదికార పార్టీ జెండా ఉండదని, మా గుండెల మీద పూలే వంటి మహనీయుల బొమ్మలు ఉంటాయి కాబట్టి జెండాలపై బొమ్మలు పెట్టలేని విద్యార్థి సంఘం నాయకుడు అడిగిన ప్రశ్నకు మల్లన్న సమాధానం చెప్పారు. పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తే పిల్లలు తప్పులు చేయరని అన్నారు. అలాంటి విద్యా విధానాన్ని తమ పార్టీ అమలు చేయబోతుందన్నారు. సీఎంకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేదు.... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి లేడని మల్లన్న ఆరోపించారు. బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ జన్మలోనే ఏదో ఒకటి చేయాలి. మల్లన్నకు మరల జన్మ అనేది రాదు. కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించానని చెప్పారు. మొదటి బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని మల్లన్న చెప్పారు. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయబోతున్నామన్నారు. బీసీలకు ప్రభుత్వాలు కార్పోరేషన్లు ఇచ్చి అభివృద్ధి అని చూపెడుతున్నాయని, వాటిని నమ్మవద్దన్నారు. కుల గణన తప్పుల తడక.. కుల గణన తప్పుల తడక అని తాము ఆధారాలతో బయట పెట్టామన్నారు. ప్రభుత్వం దగ్గర గాడిదల లెక్కలు ఉన్నాయి కాని, కులాల వారీగా జనాభా లెక్కలు లేవని ఆయన విమర్శించారు. బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టే ప్రభుత్వం కోర్టుకు డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును, జనాభా సర్వే రిపోర్టు ఇవ్వలేదన్నారు. దీంతో కోర్టు కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొట్టేసిందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అన్ని ముఖ్యమైన రంగాల్లో బీసీలకు అవకాశం లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎస్సీ సెల్, బీసీ సెల్ పెట్టిన విధంగానే మా రాజ్యాధికార పార్టీలో ఓసీ సెల్ పెట్టి వారికి పదవులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వట్టె జానయ్యయాదవ్, సంగెం సూర్యారావు, బీసీ జేఏసీ నాయకులు డేగల జనార్దన్, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, దుడుకు లక్ష్మీనారాయణ, ఐతగాని జనార్దన్గౌడ్, మేధావులు, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ అవినీతి, అక్రమాలకు మా పార్టీలో తావుండదు ఫ 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు ఫ కుల గణన రిపోర్టు ప్రభుత్వం కోర్టుకు ఇవ్వనందున కొట్టేసింది ఫ బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు !
కోదాడ: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే డబ్బుతో ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న లోన్ ఈఎంఐల నుంచి విముక్తి పొందాలని కొందరు.. కుమార్తె వివాహం చేసి కుటుంబ బాధ్యతలు తీర్చుకోవాలని మరొకరు.. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లాలని మరికొందరు.. సొంతింటి నిర్మాణం చేయాలని ప్రణాళికలు వేసుకున్నవారు ఇంకొందరు.. వీరందరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆరు పదుల వయస్సులో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు దశాబ్ధాలుగా వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 19 నెలలుగా ఎదురు చూస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 763 మంది వివిధ స్థాయి ఉద్యోగులు 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందారు. నెలకు సగటున 50 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం వివిధ స్ధాయిల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే వాపోతున్నారు. 19 నెలలుగా ఎదురుచూపులు 2021 మార్చిలో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో అప్పటి నుంచి 2024 మార్చి వరకు ఉద్యోగుల ఉద్యోగ విరమణలు ఆగిపోయాయి. 2024 ఏప్రిల్ నుంచి తిరిగి ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 2025 అక్టోబర్ వరకు 19 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 763 మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరికి సగటున ఒక్కొక్కరికి రు.40లక్షల చొప్పున రు.229 కోట్ల వరకు ఆర్ధిక ప్రయోజనాలు రావాల్సి ఉంది. వీటి కోసం రిటైర్డ్ ఉద్యోగులు వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి ప్రభుత్వం వీరి ఆందోళనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నెల 7న ఛలో హైదరాబాద్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటి వరకు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 7న ఛలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలు పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని పెన్షనర్స్ నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వీరు చూస్తున్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 17న మహాధర్నా నిర్వహిస్తామని కొందరు రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు అంటున్నారు. జిల్లా ఉద్యోగ విరమణ పొందినవారు నల్లగొండ 310 సూర్యాపేట 234 యాదాద్రి భువనగిరి 219 మొత్తం 763 ఫ కమ్యుటేషన్ బకాయి – రూ.7లక్షల నుంచి రూ.10లక్షలు ఫ ఈపీఎఫ్ – రూ.10లక్షల నుంచి రూ.12లక్షలు ఫ గ్రాట్యుటీ – రూ.10లక్షల వరకు ఫ ఫైనల్ లీవ్ ఎన్క్యాష్మెంట్ – రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఫ ప్రభుత్వ జీవిత బీమా – సుమారు రూ.5లక్షల వరకు ఫ 19 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 763 మందికి అందాల్సిన ప్రయోజనాలు ఫ ఒక్కొక్కరికి రూ.40 లక్షల వరకు బకాయిలు -
జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద మంగళవారం జిల్లా ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు నల్లగొండ, నకిరేకల్ డివిజన్లకు చెందిన దాదాపు 30 మంది పోలీసులు కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎలాంటి మాదక ద్రవ్యాలు పట్టుబడలేదని తెలిసింది. అప్పుల బాధతో ఆత్మహత్య భువనగిరి: అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని బల్కంపేటకు చెందిన బైరి జగన్(38) నిర్వహిస్తున్న ఫుడ్ బిజినెస్లో నష్టం రావడంతో పాటు అప్పులు పెరిగిపోవడంతో ఈ నెల 2వ తేదీ రాత్రి బీబీనగర్కు చేరుకొని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గల పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగన్ కనిపించకపోవడంతో అతడి భార్య పూర్ణిమ హైదరాబాద్లో బల్కంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. కాగా మంగళవారం ఉదయం పెద్ద చెరువులో వ్యక్తి మతృదేహం తేలియాడుతుండటం గమనించిన స్థానికులు బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్ణిమ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలతో మృతదేహం ఆనవాళ్లు సరిపోలడంతో బీబీనగర్ పోలీసులు బల్కంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పూర్ణిమకు జగన్ మృతిచెందిన విషయం తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి మృతికేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లికి చెందిన మారగోని బిక్షం(60) గేదెలను మేపేందుకు పక్కనే కొర్లపహాడ్ గ్రామ శివారులోకి వెళ్లాడు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి వెంట గేదెలను మేపుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ భిక్షంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షం తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని నిలపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భిక్షం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ యు. సతీష్ తెలిపారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
హుజూర్నగర్: వేధింపులు తట్టుకోలేక ఉరేసుకున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణా నికి చెందిన తవుడోజు అనూష(28)కు వేములపల్లి మండల కేంద్రానికి చెందిన దాసోజు జితేందర్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె సంతానం. వీరి కాపురం కొంతకాలం బాగానే కొనసాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనూష తల్లి గతంలోనే చనిపోగా.. తండ్రి నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో నివాసముంటున్న తన మేనమామ సొల్లేటి సోమాచారి వద్దకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో అనూషకు నర్సయ్యగూడేనికి చెందిన నన్నెపంగు మధుతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా అనూష వేరే వ్యక్తితో మాట్లాడుతుండటంతో మధు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆదివారం అద్దె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుంది. మేనమామ సోమాచారి కుమార్తె చూసి తన తండ్రికి సమాచారం అందించడంతో అనూషను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాజాపేట: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. రాజా పేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన తరిగొప్పుల తిరుపతి(45)కి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుపతి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి చిన్న కుమార్తెకు పుట్టకతోనే అంగవైకల్యం ఉండడంతో ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన తిరుపతి సోమవారం గ్రామ శివారులోని తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గ్రామస్తులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఆలేరు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని వారి ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలేరు పట్టణంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం సరిగ్గా చూడాడని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. కొలనుపాక వాగుపై ప్రమాదకరంగా ఉన్న లోలెవల్ బ్రిడ్జిని, వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. వరద ప్రవాహంతో బ్రిడ్జి దెబ్బతి నడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య, తహసీల్దార్ ఆంజనేయులు, ఏఓ శ్రీనివాస్, అధికారులు, రైతులు ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఏపూర్లో యాదాద్రి అధికారులు
జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పొందిన ఏపూర్ గ్రామాన్ని యాదాద్రి జిల్లా అధికారులు సందర్శించారు. - 9లోఘనంగా యువజనోత్సవాలు భువనగిరి : జిల్లా యువజన సర్వీసులు, క్రీడలశాఖ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి ఖిలా వద్ద యువజనోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ భా స్కర్రావు ప్రారంభించారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, కవిత, జానపద నృత్యాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు, పురావస్తు శాఖ అధికారి నాగలక్ష్మి, కపిల్, రమేశ్రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కుంగిన లోలెవల్ వంతెన
ఆలేరు : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు–కొలనుపాక మార్గంలో ఉన్న లోలెవల్ వంతెన కుంగిపోయింది. కూలిపోయే దశకు చేరడంతో అప్రమత్తమైన పోలీసులు కుంగిన ప్రదేశంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిద్దిపేటకు వెళ్లేందుకు ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. భారీ వాహనాలు సైతం ఈ రోడ్డు గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి.ఈ రోడ్డుపై ఉన్న లోలెవల్ వంతెన కూలిపోయే దశకు చేరడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెను ప్రమాదం జరుగక ముందే అధికారులు తేరుకొని దెబ్బతిన్న వంతెన ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. హైలెవ్ వంతెన నిర్మాణానికి రెండేంళ్ల క్రితమే రూ.4.50 కోట్లు మంజూరు చేశారు. కానీ నేటికీ ఎలాంటి పనులు చేపట్టక పోవడంతో ప్రస్తుతం వంతెన కుంగింది. -
అమ్మేందుకు.. లక్కీడ్రా
స్థిరాస్తి విక్రయానికి కొత్త పంథా ప్రజలు ఇలాంటి స్కీంలను నమ్మి మోసపోవద్దు. ఎవరూ కూడా ఇలాంటి స్కీంలలో పాల్గొనవద్దు. లక్కీ డ్రా స్కీంల పేరుతో ప్రజలను మోసం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేట సూర్యాపేటటౌన్ : ఇప్పటి వరకు వినాయక మండపాలు, దుర్గమాత మండపాల వద్ద, దసరా పండుగ వేళలో స్కూటీలు, బైక్లు, లడ్డూలు, చీరలు, గొర్రెపోతులంటూ లక్కీ డ్రా నిర్వహించడం చూశాం. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చింది. ఏకంగా కొందరు తమ స్థిరాస్తిని విక్రయించడానికి కొత్త పంథా ఎంచుకున్నారు. ప్లాట్లు, ఇళ్లకు సైతం లక్కీ డ్రా పేరిట రూ.500 నుంచి రూ.1000దాకా కూపన్లకు ధర నిర్ణయించి దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇది హాట్టాపిక్గా మారింది. అదృష్టం కలిసి వస్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాటు, ఇళ్ల యజమానులు తమకు సంబంధించిన ప్రాపర్టీని అమ్ముకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టడం, ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో తమ స్థిరాస్తిని ఎలాగైనా అమ్ముకునేందుకు కొత్త దందాకు తెరలేపారు. పోతే వెయ్యి.. వస్తే లక్షలు విలువ చేసే ప్లాటు అంటూ ఫ్లెక్సీలు, కరపత్రాలను ముద్రించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రా కూపన్లతో వారికి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఈ స్కీంలు పెడుతున్నారు. రూ.వెయ్యి పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తే డ్రాలో ప్లాటు గెలుపొందవచ్చనే ఆశతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాపారులు, యజమానులు ఎక్కువ డబ్బులు రావాలనే ఆలోచనతో ఈ లక్కీ డ్రా స్కీం పెడుతున్నప్పటికీ చట్టబద్ధంగా ఇది ఎంత వరకు నిజమనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త దందా నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ఈ లక్కీ స్కీంల దందా ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది. సంబంధిత ప్లాట్ల వద్ద యజమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కరపత్రాలను విరివిగా పంచిపెడుతున్నారు. చౌటుప్పల్లో మూడు నెలల క్రితం ఓ యజమాని లక్కీ డ్రాం స్కీం ప్రారంభించి గత ఆదివారం లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో 3,600 మంది రూ.500 చొప్పున కొనుగోలు చేసి పాల్గొనగా ఆ యజమానికి రూ.18లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. అతని ప్లాటుకు రూ.12లక్షల వరకు ధర చెప్పినా ఎవరూ కొనకపోవడంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాగా, ప్లాటు, ఇల్లుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా.. లేవా అనేది, చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఫ పోతే వెయ్యి..వస్తే ఇల్లు అని సోషల్ మీడియాలో ప్రచారంఫ చౌటుప్పల్లో ఇప్పటికే డ్రా తీసిన ఇంటి యజమాని ఫ సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో మూడు నెలల గడువుతో లక్కీడ్రా పెట్టిన ఇద్దరు యజమానులు ఫ లక్కీడ్రాలు నేరం అంటున్న పోలీసులు -
యాదగిరి క్షేత్రంలో నేడు కార్తీక పూజలు
యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు గోష్టి, గర్భాలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉభయ దర్శనాలు ప్రారంభిస్తామని, సాయంత్రం 6.30 గంటలకు ఆకాశ దీపారాధన జరిపిస్తామని తెలిపారు. ఆంజనేయుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం అర్చకులు ఆకుపూజ నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామిని సుగంధ ద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు కొనసాగాయి. సురేంద్రపురిలో వేంకటేశ్వరస్వామి కల్యాణంభువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలోని సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు స్వామి వారికి పంచామృతాభిషేకం, తులసి పూజ, పురుష సూక్త హవనం, హోమం, శేషవాహన సేవ, సాయంత్రం ఆకాశదీపారాధన, మంగళహరతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుందా ప్రతిభ ప్రతాప్, కాటేపల్లి మాధవరావు, గడ్డం సోంచంద్ పాల్గొన్నారు. రూ.10 లక్షల విరాళం యాదగిరిగుట్ట: హన్మకొండకు చెందిన ఏపూరు శ్రవణ్కుమార్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందించారు. మంగళవారం స్వామి వారిని దర్శించుకున్న ఆయన నిత్యాన్న పథకానికి రూ.8 లక్షలు, గరుడ ట్రస్ట్కు రూ.2 లక్షలు అందించారు. ఈ మేరకు ఇన్చార్జి ఈఓ రవి కుమార్కు ఆయన చెక్కులను అందించారు. విద్యార్థులు ఇష్టపడి చదువాలి సంస్థాన్నారాయణపురం : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే భవిష్యత్లో ముందుకెళ్తారని డీఈఓ సత్యనారాయణ అన్నా రు. కస్తూర్బా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలలో మంగళవారం మానసిక వికాసంపై విద్యార్థులకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అనంతరం మానసిక నిఽపుణులు విద్యార్థులు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మానసిక నిపుణురాలు డాక్టర్ శైలజ, ఉమామహేశ్వరి, నారాయణ పాల్గొన్నారు. అక్రమార్కులపై ఇంటలిజెన్స్ నిఘా యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ఉద్యోగులపై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. మంగళవారం ఇంటలిజెన్స్లో సీఐ స్థాయి అధికారి సిబ్బందితో వచ్చి ప్రధానాలయ పరిసరాలు, పరిపాలనా విభాగంలో నిఘా పెట్టినట్లు సమాచారం. ఇటీవల ఎలక్ట్రికల్ ఈఈ వెంకట రామారావు రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. దాంతో ఇంటలిజెన్స్ అధికారులు రెండు రోజులుగా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిసింది. అధికారులు, ఉద్యోగుల పని తీరు, కొండపై దేవస్థానం పరిధిలో జరిగిన టెండర్లలో కాంట్రాక్ట్ తీసుకున్న వారి నుంచి ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారా అనే విషయమై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పరిపాలన విభాగంలోని పలు సెక్షన్లలో అధికారుల తీరుపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. -
తేమ యంత్రాల పరిశీలన
రాజాపేట : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతంలో వ్యతా సం వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయమై సాక్షిలో ‘అన్నదాతకు తేమ టెన్షన్’ శీర్షికతో మంగళవారం కథనం ప్రచురితమైంది. దాంతో అధికారులు స్పందించారు. ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్ రాజాపేట మండలంలోని పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో వినియోగించే మాయిశ్చర్ మిషన్లను పరిశీలించారు. వ్యత్యాసం వచ్చే మిషన్లను స్థానిక రైస్ మిల్లులో వినియోగించే మాయిశ్చర్ మిషన్లకు అనుగుణంగా మార్పులు చేశారు. మిషన్లో కేవలం 100 గ్రాముల ధాన్యం పోసి తేమ శాతాన్ని చూడాలన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
భువనగిరి : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక పోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసిన కళాశాలను తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు , ఈర్ల రాహుల్, హిందూ రాణి ,ధరావత్ జగన్ నాయక్ నాయకులు జ్యోతిబాస్, వెంకటేష్, కావ్య పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కళాశాలల యాజమాన్యాలు ప్రవీణ్కుమార్, ప్రభాకర్, మణిపాల్రెడ్డి పాల్గొన్నారు. -
దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. - 9లో15న ప్రత్యేక లోక్అదాలత్రామన్నపేట : పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్కోర్టు జడ్జి ఎస్.శిరీష తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణ, విజయవంతం కోసం మంగళవారం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు, న్యాయవాదులు లోక్ అదాలత్ల ఉద్దేశ్యాన్ని కక్షిదారులకు తెలియజేసి చట్ట పరిధిలో ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు. కక్షిదారులు లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్ఐలు డి.నాగరాజు, యుగంధర్ పాల్గొన్నారు. -
ఇల్లు కూల్చారని పెట్రోల్ డబ్బాతో నిరసన
మోత్కూరు : అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని బాధిత కుటుంబం పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపింది. ఈ సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడెం కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాశవారిగూడెంలోని ప్రభుత్వ భూమి అయిన సర్వే నంబర్ 402లో మహ్మద్ పకీర్ అహ్మద్ గత 30 సంవత్సరాలుగా గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. గత పది సంవత్సరాల క్రితం దశల వారీగా ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే ఆ స్థలం తనదని, అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన బెల్లి నగేష్ తహసీల్దార్ను సంప్రదించాడు. కాశవారిగూడెంలో సర్వే నంబర్ 402లోని 242 గజాల భూమి తనదేనని, ప్రభుత్వం క్రీడాకారుల కోటాలో 2020లో తనకు కేటాయించిందని, ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరాడు. దీంతో తహసీల్దార్ అనుమతులతో మున్సిపాలిటీ వారు ఆ ఇంటిని జేసీబీ సాయంతో సోమవారం నేలమట్టం చేశారు. దీంతో మహ్మద్ పకీర్ అహ్మద్ కుటుంబం కాలనీవాసులతో కలిసి కాలనీ ఎదుట పెట్రోల్ డబ్బాతో రోడ్డుపై బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సదరు బెల్లె నగేష్ క్రీడాకారుల కోటాలో మోత్కూరు కాశవారిగూడెంలోనే కాకుండా భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు సమకూర్చిందని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఎలా కేటాయిస్తారని పేర్కొన్నాడు. అతడికి డబుల్ బెడ్ రూం ఇచ్చినందున మోత్కూరు కాశవారిగూడెంలోని ప్రభుత్వ స్థలం తమకు ఇప్పించాలని అహ్మద్ కోరాడు. ఈ విషయంపై తహసీల్దార్ జ్యోతిని వివరణ కోరగా.. కాశవారిగూడెంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కూల్చివేసినట్లు తెలిపారు. -
దుందుభి వాగులో చిక్కుకున్న గొర్రెలకాపరులు
డిండి: దుందుభి వాగు మధ్యలో చిక్కుకున్న గొర్రెల కాపరులకు సోమవారం రెవెన్యూ అధికారులు డ్రోన్ సహాయంతో ఆహారం, నిత్యావసర సరుకులను చేరవేశారు. డిండి మండలం గోనబోయనపల్లి గ్రామానికి చెందిన బద్దెల వెంకటయ్య, సిగ వెంకటయ్య, రగడంపల్లి పెద్దయ్యకు దాదాపు 300 వరకు గొర్రెలు ఉన్నాయి. గొర్రెలను మేపేందుకు సదరు గొర్రెల కాపరులు పది రోజలు క్రితం గ్రామ సమీపంలో దుందుభి వాగు మధ్యలో ఉన్న బీడు భూముల్లోకి తోలుకెళ్లారు. కాగా మోంథా తుపాన్ కారణంగా ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు అలుగు పోసింది. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న దుందుభి వాగు వరద ప్రవాహం అధికమైంది. దీంతో గొర్రెల కాపరులు వాగు మధ్యలో చిక్కుకున్నారు. అయితే తమ వెంట తెచ్చుకున్న ఆహార సరుకులు అయిపోవడంతో గ్రామానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు జామున నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ శివారులోని వాగు వెంట వ్యవసాయం చేస్తున్న ఓ రైతు తాడు సహాయంతో దుందుభి వాగు దాటుకుంటూ గొర్రెల కాపరుల వద్దకు చేరాడు. రైతు వద్ద ఉన్న ఫోన్తో తమకు ఆహార సరుకులు కావాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, స్థానిక ఎస్ఐ.బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వాగు మధ్యలోంచి సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తామని గొర్రెల కాపరులకు తెలియజేశారు. గొర్రెలు తీసుకురావడం ఇబ్బందికరంగా ఉందని, గొర్రెలను విడిచి తాము రాలేమని గొర్రెల కాపరులు తేల్చి చెప్పారు. దీంతో వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అధికారులు డ్రోన్ ద్వారా పంపించారు. వాగు మధ్యలో చిక్కుకున్నందున ఆహారం, ఇతర సరుకులను పంపించటం పట్ల గొర్రెల కాపరులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల వెంట స్థానికుడు బద్దెల శ్రీనువాస్ ఉన్నాడు. ఫ డ్రోన్ సాయంతో ఆహారం, సరుకులు పంపిన అధికారులు -
వదలని వరుణుడు
పలు మండలాల్లో భారీ వర్షం ఫ కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం ఫ నీట మునిగిన పొలాలు చౌటుప్పల్ : అన్నదాతను వరుణుడు వదలడం లేదు.ఆదివారం రాత్రి, సోమవారం పలు మండలాల్లో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పల కిందికి నీరు చేరింది. ఆరబోసిన ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్పలుగా చేసుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. వారం రోజుల్లోనే మూడు సార్లు వర్షం కురవడంతో ధాన్యం నిర్ధిష్ట తేమశాతం రాక కాంటా వేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. మోత్కూరు: వర్షానికి సదర్శాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్మూరిబావి చెరువు కింద ఉన్న పొలాలు ముంపునకు గురయ్యాయి. కోత దశలో ఉన్న 12 ఎకరాల వరి పొలాలు పూర్తిగా నీట మునిగినట్లు రైతులు దొండ శ్రీశైలం, కొమ్మూరి కరుణాకర్రెడ్డి, కొమ్మూరి వెంకట్రెడ్డి, కొమ్మూరి నర్సిరెడ్డి, కొమ్మూరి యాదిరెడ్డి తెలిపారు. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వర్షం కురిసింది. అడ్డగూడూరు పెద్దచెరువు అలుగు పోస్తుడటంతో కోత దశలో ఉన్న పొలాలు నీట మునిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్య తడిసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. రామన్నపేట : వర్షానికి రామన్నపేట మార్కెట్ యార్డులో వడ్లు కొట్టుకుపోయాయి. వరుస వర్షాలకు ధాన్యం కుప్పల కిందకు నీరు చేరి మొలకెత్తుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
సీఐ చంద్రబాబుకు దక్షతా పదక్ అవార్డు ప్రదానం
భువనగిరి: భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పదక్ అవార్డు అందుకున్నారు. నేర పరిశోధనలో విధులు సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోలీసులకు అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐ సోమవారం హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్లో సీపీ సుధీర్బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మహిళ అదృశ్యంచౌటుప్పల్ : పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత మహిళ అదృశ్యమైంది. ఆమె భర్త సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం గ్రామానికి చెందిన మహిళ(35) కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో నివాసం ఉంటుంది. భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లిన భర్త ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా భార్గవచారిహుజూర్నగర్ : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడేనికి చెందిన కన్నెకంటి భార్గవచారి రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని అల్వాల్లో గల పల్లవి మోడల్ స్కూల్లో తెలంగాణ రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా కన్నెగంటి భార్గవచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు నియామక పత్రం అందజేశారు. భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్కట్టంగూర్ : అనుమానంతో భార్యను హత్య భర్తను కట్టంగూర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీఐ కొండల్రెడ్డి ఎస్ఐ మునుగోటి రవీందర్తో సోమవారం వివరాలు వెల్లడించారు. కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామానికి చెందిన మహేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మహిళను ప్రేమ వివాహం చేసుకుని నిత్యం వేధించడంతో ఆమె విడాకులు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత సంవత్సరం డిసెంబర్లో వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన సుమలతను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా మహేష్ నిత్యం మద్యం సేవించి భార్య సుమలతను వేధించసాగాడు. అంతేకాకుండా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 1న తెల్లవారు జామున సుమలతను తీవ్రంగా కొట్టి హతమార్చి చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. సుమలత మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె బంధువులకు ఫోన్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన పై సుమలత తల్లి మారెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండల్రెడ్డి కేసు నమోదు చేశారు. మహేష్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
వైభవంగా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం యాగ్నికులు సముద్రాల వెంకటరమణ ఆధ్వర్యంలో స్వామివారిని ఊరేగింపుగా తోడ్కొని వచ్చి తిరు కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణానికి ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరుకు చెందిన నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఘాట్ రోడ్డుకు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రేలింగును ప్రారంభించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ దశరథ, వాకిటి అనంతరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన బాబు, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, గుర్రం లక్ష్మ రెడ్డి, బోల శ్రీనివాస్, బత్తిని సహదేవ, కంకల కిష్టయ్య పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
వలిగొండ : వలిగొండ మండలంలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్నేపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లారెడ్డి(52) తండ్రి ఇటీవల మృతి చెందడంతో సోమవారం దశదినకర్మ నిర్వహించాల్సి ఉంది. అయితే మల్లారెడ్డి ఆదివారం సాయంత్రం సామగ్రి తీసుకురావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటికి ఫోన్ చేసి తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు, బంధువులతో కలిసి మల్లారెడ్డి ఆచూకీ కోసం వెతకగా.. ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశాడు. ఈక్రమంలో గోకారం గ్రామ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉండడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించి మల్లారెడ్డిదిగా గుర్తించారు. పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు. యువకుడిపై కేసు నమోదుచౌటుప్పల్ : మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్కు చెందిన యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో మహిళలు నిల్చున్నప్పుడు, బస్సు ఎక్కే సమయంలో తన సెల్ఫోన్తో వారి ఫొటోలను తీస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ మహిళ గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వారు బస్టాండ్కు చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి సెల్ఫోన్లో మహిళలు, యువతుల ఫొటోలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని ఆలయ అధికారులు దుకాణదారులకు సూచించారు. సోమవారం సాక్షి దినపత్రికలో శ్రీఅంతా ఇష్టారాజ్యంశ్రీ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయాధికారులు స్పందించారు. దీంతో ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ దూశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు కొండపైన దుకాణాదారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ ఎంతకు అమ్ముతున్నారనే అంశాలను పరిశీలించారు. ఒక్క కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని, రూ.100కు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవస్థానం నిర్ణయించిన రూ.40కే కొబ్బరికాయ అమ్మాలని స్టిక్కర్లు సైతం అతికించారు. మరోసారి అధిక ధరలకు విక్రయిస్తే దేవస్థానం యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, టెండర్ సైతం రద్దు చేస్తామన్నారు. ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ వెంట ఏఈఓ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ రాకేష్రెడ్డి, అడ్మినిస్టేషన్ ఏఈఓ మహేష్ తదితరులున్నారు. ఫ కొండపైన దుకాణాదారుల వద్దకు వెళ్లి పరిశీలించిన ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ -
సాగర్కు తగ్గిన వరద
పెద్దవూర: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్గేట్లను పూర్తిగా మూసి వేశారు. జలాశయం నీటిమట్టం సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు 589.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీ) కాగా ప్రస్తుతం 589.40 అడుగుల(310.2522 టీఎంసీ)లుగా ఉంది. జలాశయం నుంచి కుడి కాల్వకు 8023 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31424 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 40047 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 31424 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏడవ యూనిట్లో వందరోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు నాగార్జునసాగర్ జెన్కో చీఫ్ ఇంజనీర్(సీఈ) మంగేష్కుమార్ తెలిపారు. సోమవారం నాగార్జునసాగర్ జెన్కో ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ జలాశయానికి నీటి రాక ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఏడవ నంబర్ యూనిట్లో ఎలాంటి అంతరాయం లేకుండా సోమవారం వరకు విద్యుదుత్పత్తి కొనసాగించినట్లు తెలిపారు. ఈ వంద రోజుల్లో ఈ యూనిట్ ద్వారా 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్కో ఎస్ఈలు రఘురాం, శ్రీనివాస్రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ క్రస్ట్గేట్లను మూసివేసిన అధికారులు -
నీటి గుంతలో పడి బాలుడు మృతి
కేతేపల్లి: అంగన్వాడీ పాఠశాలకు వెళ్లిన బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసనగోడు గ్రామానికి చెందిన కుంచం జగదీష్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆయాన్(4)ను స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆయాన్ను బహిర్భూమి కోసం సిబ్బంది ఆరుబయటికి తీసుకెళ్లారు. పాఠశాల పక్కనే నీటి గుంత వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన అంగన్వాడీ ఆయా ఆయాన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేసేందుకు యత్నించారు. వారు భయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ సతీష్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి తండ్రి జగదీష్ ప్రస్తుతం పనినిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిసింది. నలుగురు సిబ్బంది ఉన్నా.. కాసనగోడు గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండింటిలో కలిపి పది మందికి లోపే పిల్లలు ఉండడంతో రెండు కేంద్రాలను కలిపి ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. కేంద్రం నిర్వహణకు ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలు మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. సోమవారం పాఠశాలకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే వచ్చినప్పటికీ వారి పర్యవేక్షణపై సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు నీటిగుంతలో పడి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు పక్కా భవనం, ప్రహరీ, మరుగుదొడ్లు సౌకర్యం ఉన్నప్పటికీ బాలుడిని బహిర్భూమికి ఆరుబయటకు ఎందుకు తీసుకెళ్లారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మృతదేహంతో ఆందోళన అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందాడని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట బాలుడి మృతదేహాన్ని ఉంచి ఆందోళకు దిగారు. బాలుడి మృతికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయటంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేతేపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి వరకు మృతదేహంతో ఆందోళన చేశారు. ఫ బహిర్భూమి కోసం అంగన్వాడీ విద్యార్థిని సిబ్బంది ఆరుబయటికి తీసుకెళ్లడంతో ఘటనబాధ్యులపై చర్యలు తీసుకుంటాం నల్లగొండ: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సంఘటన అంగన్ వాడీ కేంద్రం బయట జరిగినప్పటికీ సంబంధిత అంగన్వాడీ టీచర్, ఆయాలపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
అన్నదాతకు తేమ టెన్షన్
రాజాపేట: గిట్టుబాటు ధర దక్కుతుందని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లిన రైతులు.. తేమ, తరుగు సమస్యతో నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే కాంటా తిరస్కరిస్తారు. కాగా తేమ శాతాన్ని పరిశీలించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగిస్తున్న మాయిశ్చర్ మిషన్లపై అపోహలు నెలకొన్నాయి. నిర్వాహకులకు యంత్రాలపై సరైన అవగాహన లేకపోవడంతో తేమ శాతంలో వ్యత్యాసం వస్తుంది. 10 శాతానికి పైగా వ్యత్యాసం రాజాపేటలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి రాజాపేటకు చెందిన రైతు సోమసాని రాజు, పారుపల్లికి చెందిన గౌరబావు ధాన్యాన్ని తీసుకువచ్చారు. వడ్లు గలగల చప్పుడు వచ్చేలా ఎండబెట్టారు. కాగా కేంద్రం నిర్వాహకులు సోమవారం తేమచూడగా రాజుకు చెందిన వడ్లు 24 శాతం, గౌరబాబు తెచ్చిన వడ్లు 29 శాతం చూపించాయి. అనుమానం వచ్చిన రైతులు.. విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక రైస్ మిల్లులో మరోసారి మాయిశ్చర్ మిషన్ ద్వారా పరిశీలించగా ఇద్దరి ధాన్యం 15 శాతం లోపే వచ్చింది.10 శాతానికి పైగా వ్యత్యాసం చూపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్మిల్లులోని యంత్రంలో వచ్చిన తేమ శాతం ఇదీ..కొనుగోలు కేంద్రంలో వచ్చిన తేమ శాతం ఫ ఎలక్ట్రానిక్ యంత్రాలతో ఇబ్బందులు ఫ తేమ శాతంలో తేడాలు -
అధికంగా మూలమలుపులు.. తరచూ ప్రమాదాలు
సాక్షి యాదాద్రి: భువనగిరి – చిట్యాల రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ మార్గంలో నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరుకు రోడ్డు, కిలో మీటరుకు ఒక మలుపు, భద్రతాచర్యల లేమితో వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నా.. రహదారి విస్తరణకు నోచడం లేదు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడో, ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించడం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో భువనగిరి–చిట్యాల రహదారిపై భద్రత చర్చనీయాంశమైంది. రోజూ 10వేలకు పైగా వాహనాల రాకపోకలు ఉత్తర– దక్షిణ భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ప్రధాన మార్గం భువనగిరి – చిట్యాల రోడ్డు. దీనికి తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి వివిధ రకాల వాహనాలు, బస్సులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. 43 కిలో మీటర్ల ఈ మార్గంలో రోజూ 12 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రాణాలు తీస్తున్న మలుపులు చిట్యాల నుంచి రామన్నపేట వరకు 10 చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇందులో అతి ప్రమాదకరమైనది ఇంద్రపాలనగరం నుంచి నిధానపల్లి గ్రామానికి వెళ్లే చౌరస్తా ఒకటి. 2015 అక్టోబర్ 7న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. చిట్యాల సమీపంలోని ఐడీఎల్ ప్యాక్టరీ వద్ద రెండు మలుపులు, రామన్నపేట డిగ్రీ కళాశాల వద్ద, రామన్నపేట హరిహరపుత్ర రైస్ మిల్ వద్ద, ఇంద్రపాలనగరం చెరువు, రామన్నపేట కుంట, ఇంద్రపాలనగరం అయ్యప్ప దేవాలయం, గుర్జాలబావి, వలిగొండ మండలం నాగారం–మూసీ బ్రిడ్జి, వలిగొండ జూనియర్ కళాశాల, అక్కంపల్లి అంజనేయస్వామి టెంపుల్, భువనగిరి మండలం నందనం పోచమ్మగుడి, నందనం–అనాజిపురం హన్మాన్గుడి వద్ద, నాగిరెడ్డి రైల్వే స్టేషన్ ముందు, మాందాపురం దుర్గమ్మగుడి టెంపుల్, అనాజిపురం వద్ద మూల మలుపులు అతి ప్రమాదకరంగా ఉన్నాయి. అలాగే భువనగిరి మండలం వడపర్తి, తిర్మలాపురం, సంగ్యాతండా వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న మలుపులు 30 వరకు ఉంటాయి. జాతీయ రహదారిగా గుర్తింపు చిట్యాల నుంచి భువనగిరి మీదుగా గజ్వేల్ వరకు రోడ్డు ఉంది. జిల్లాలోని ఎన్హెచ్–65 నుంచి ఎన్హెచ్– 163 మీదుగా బెంగళూరు నుంచి నాగ్పూర్ జాతీయ రహదారి వెళ్లే నేషనల్ పర్మిట్ వాహనాల ప్రయాణానికి అనుసంధానంగా ఉంటుంది. ఇందులో గజ్వేల్నుంచి తుర్కపల్లి, భువనగిరి మీదుగా నాగిరెడ్డిపల్లి, చౌటుప్పల్ వరకు జాతీయ రహదారి 161 ఏఏగా నామకరణం చేసి వదిలేశారు. నాగిరెడ్డిపల్లి నుంచి వలిగొండ, రామన్నపేట చిట్యాలవరకు రాష్ట్ర రహదారిగానే ఉంది. ఈ మార్గంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, డిల్లీ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రదప్రదేశ్.. ఇలా దేశ నలుమూలలకు సరుకు రవాణాకు చెందిన భారీ వాహనాలు నిత్యం ప్రయాణిస్తాయి. అయితే ఇదే మార్గంలో స్థానిక ప్రయాణికులు ఆర్టీసీ బస్లు, కార్లు,ఆటోలు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తారు. పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. భువనగిరి నుంచి తుర్కపల్లి మీదుగా 161 ఏఏ రహదారి ప్రమా దకరంగా ఉంది. భువనగిరి – చిట్యాల వరకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 43 కిలో మీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. భువనగిరి నాగిరెడ్డిపల్లి, టేకులసోమారం, వలిగొండ, నాగారం, తుమ్మలగూడెం, బోగారం, రామన్నపేట, చిట్యాల వరకు రోడ్డును అభివృద్ధి చేస్తా రు. రోడ్ల వెడల్పు, మధ్యలో డివైడర్లు, అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు, జంక్షన్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న జంక్షన్లను వెడల్పు చేస్తారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో 2015 అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. 18 మంది తీవ్రగాయాల పాలయ్యారు. నార్కట్పల్లి డిపోకు చెందిన బస్ భువనగిరి నుంచి మధ్యాహ్నం 2.45గంటలకు 40మంది ప్రయాణికులతో నల్లగొండకు బయలు దేరింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దాటిన తరువాత నిధానపల్లికి వెళ్లే దారి వద్ద ఉన్న మూలమలుపునకు రాగానే రామన్నపేట నుంచి భువనగిరి వైపు అతివేగంగా పుస్తకాల లోడుతో వచ్చిన లారీ బస్సును ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఫ ఇంద్రపాలనగరం వద్ద పదేళ్ల క్రితం జరిగిన ఘటనలో 10 మంది మృతి ఫ చేవెళ్ల ఘటన నేపథ్యంలో రహదారి భద్రతపై చర్చ -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
భువనగిరి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే లక్ష్యంమని ట్రాన్స్కో ఎస్ఈ సుధీర్కుమార్ అన్నారు. సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భువనగిరిలోని విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యుత్కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న ఫిర్యాదు చేయాలన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంతకుముందు వినయోగదారులు వివిధ విద్యుత్ సమస్యలపై విన్నవించారు. మోత్కూర్, ఆలేరులో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్ ఆఫీసర్ హరీష్కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏడీఈ ఆనంద్రెడ్డి, ఏఈ సాయికృష్ణ, అధికారులు భాస్కర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ ట్రాన్స్కో ఎస్ఈ సుధీర్కుమార్ -
ఎకరానికి రూ.30వేలు చెల్లించాలి
భువనగిరి, ఆత్మకూర్ (ఎం) : వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేలు చెల్లించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. సోమవారం ఆయన భువనగిరి మండలం తుక్కాపురం, ఆత్మకూర్(ఎం)లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఏప్రిల్, మే నెలలో వచ్చిన అకాల వర్షాలకు 55 వేల ఎకరాల్లో, ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చిన వర్షాలకు 2.50 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బు వేయలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పరిహారం ఇస్తామని ప్రకటన చేయడంతప్ప ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతుల సమస్యలను పక్కన పెట్టి ముంబాయికి పెళ్లిళ్లకు వెళ్లి హీరోలను కలుసుకోవడం తప్ప సీఎం చేస్తుంది ఏమీ లేదన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా బస్తాకు 4కిలోల చొప్పున తరుగు కింద తీస్తున్న ధాన్యం ఎక్కడికి పోతుందని ప్రశ్నంచారు.ఽ రైతులకు ఇస్తానని చెప్పిన రూ.500 బోనస్ ఇవ్వకపోగా, రైతు భరోసా ఒక విడత పెండింగ్లోనే ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మహేశ్వర్రెడ్డి వెంట కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, తడిసిన మల్లారెడ్డి, ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాఽథ్, నాయకులు బొట్టు అబ్బయ్య, తుమ్మల మురళీధర్రెడ్డి, బొబ్బల ఇంద్రారెడ్డి, బండారు సత్యనారాయణ, శ్యాంసుందర్రెడ్డి, పట్నం శ్రీనివాస్, ఫక్కీర్ రాజేందర్రెడ్డి, సురేష్రెడ్డి, వినోద్కుమార్, మాణిక్యంరెడ్డి, అంజనేయులు, అనిల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఫ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి -
బోధనతోనే సరి.. ప్రయోగాలేవీ?
భువనగిరి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ మొక్కుబడిగా మారాయి. ల్యాబ్లలో సరైన పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నేటికీ నిధులు రాకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఇంటర్బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రాక్టికల్స్ పూర్తికాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 11 ప్రభుత్వ కాలేజీలు జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,295 మంది ఉన్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు ప్రభుత్వం గత విద్యా సంవత్సరం ఒక్కో కాలేజీకి రూ.25వేల చొప్పున కేటాయించింది. ఈ నిధులతో ప్రాక్టికల్స్కు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేశారు. ఈ విద్యాసంవత్సరం పరిస్థితి భిన్నంగా ఉంది. మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు భావిస్తున్నా.. నిధులు విడుదల చేయడంలో జరుగుతన్న జాప్యం శాపంగా మారింది. ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. నిధులు రాకపోవడంతో.. గత ఏడాది మిగిలిపోయిన రసాయనాలు, పరికరాలతోనే విద్యార్థులకు అరకొరగా ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే విద్యార్థులతో ప్రాక్టికల్స్ పూర్తి చేయించి పరీక్షలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. ‘ప్రైవేట్’లోనూ మొక్కుబడిగా.. జిల్లాలో 23 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు కాలేజీలు మొక్కుబడిగా ప్రాక్టికల్స్ చేయిస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్పై అవగాహన లేకుండాపోతుంది. కేవలం బోధనతోనే సరిపెడుతున్నాయి. ఫ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పరికరాలు, రసాయనాల కొరత ఫ గత ఏడాది మిగిలిపోయిన వాటితో అరకొరగా ప్రాక్టికల్స్ ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఫ విద్యార్థుల్లో ఆందోళన 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు రావాలి. త్వరలోనే మంజూరవుతాయి. అప్పటి వరకు గత విద్యా సంవత్సరం మిగిలిన రసాయనాలతో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ వచ్చినందున.. నిధులు కూడా విడదల చేస్తారు. ప్రైవేటు కళాశాలలు విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించపోతే చర్యలు తీసుకుంటాం. –రమణి, డీఐఈఓ -
ఎక్కువగా రెవెన్యూ సమస్యలే..
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతులు స్కీరించారు. 68 అర్జీలు రాగా అందులో అధికంగా 56 అర్జీలు రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ప్రజా వాణి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగొద్దు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో విజిట్ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజావాణి ముగిసిన అనంతరం ప్రత్యేక అధికారులతో సమావేశమైన ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. నిర్ధిష్ట తేమశాతం రాగానే కాంటా వేయించి ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి చేయాలని ఆదేశించారు. లారీల కొరత ఏర్పడుకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఫ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వినతులు -
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు ఆలయ ముఖమండపంలో స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన గావించారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజావాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి వేళల్లోనూ ధాన్యంకాంటా వేయాలి యాదగిరిగుట్ట రూరల్: ధాన్యం నిర్ధిష్ట తేమశాతం వస్తే రాత్రి సమయంలో కూడా కాంటా వేయాలని కలెక్టర్ హనుమంతరావు నిర్వాహకులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లతో భద్రపరచుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ధాన్యం కుప్పల వద్దకు తేమశాతం చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ గణేష్ నాయక్, ఏడీఏ శాంతినిర్మల, ఏఓ సుధారాణి, ఏఈఓ శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈఓ భద్రారెడ్డి ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ను కలిసిన ఎంపీ బీబీనగర్: ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ను కలిశారు. ఎయిమ్స్ అభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం కల్పిస్తున్నవి, కల్పించాల్సిన మౌలిక సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఎయిమ్స్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, ఎయిమ్స్ వద్ద అన్ని బస్సులు ఆపించాలని, ఉప్పల్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీకి ఎయిమ్స్ అధికారులు విన్నవించారు. వాహనాలరద్దీ చౌటుప్పల్ : హైదరాబాద్ – విజయవాడ జాతీ య రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో సోమవారం వాహనాల రద్దీ నెలకొంది. సాయంత్రం సమయంలో పాఠశాలలు విడిచిపెట్టడం, అదే సమయంలో వర్షం తగ్గడంతో రోడ్ల వెంట ని లిపిన వాహనాలు ఒక్కసారిగా బయలుదేరాయి. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లల మర్రి గ్రామంలో ఓ ఇంట్లోకి ఆదివారం కారు దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పిల్లల మర్రి శివాలయాలకు ఆదివారం కారులో వచ్చిన భక్తులు బొడ్రాయి దగ్గర ఓ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు ప్రతిరోజు ఇంటి ముందు కూర్చునేదని అదృష్టశాత్తు ఆదివారం అక్కడ కూర్చోలేదని స్థానికులు పేర్కొన్నారు. క్లచ్ బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెప్పాడు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
భువనగిరి, రాజాపేట: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన ఆదివారం బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు నర్సింహులు, మహేశ్వరి దంపతుల కుమారుడు గర్ధాసు ప్రశాంత్(32)కు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన ప్రసూన(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లోని టెలిఫోన్ కాలనీలో నివాసముంటున్నారు. ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలిద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తూ.. బీబీనగర్ పెద్ద చెరువు వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ప్రసూన బైక్తో పాటు చెరువులో పడిపోగా ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో పడిన ప్రసూనను బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ షణ్ముఖ్తో పాటు డోర్నాల భార్గవ్, కొండ సైరిత్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గర్ధాసు ప్రశాంత్ మృతితో రాజాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు యువకులకు గాయాలు బీబీనగర్లో ఘటన -
అంతా ఇష్టారాజ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులను కొండ పైన కొబ్బరికాయల వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు కొబ్బరికాయ కొనేందుకు వెళ్తే.. స్వామివారికి తులసి మాల సమర్పించటం ఎంతో శ్రేష్టమంటూ సెంటిమెంట్ మాటలు చెప్పి కొబ్బరికాయతో పాటు తులసి మాలను కూడా వ్యాపారులు కొనిపిస్తూ కొత్త దందాకు తెర తీశారు. ఆదివారం రూ.50కి అమ్మాల్సిన కొబ్బరికాయ కార్తీక మాసం పేరు చెప్పి రూ.100కు అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో భక్తులు వీడియోలు తీసి వైరల్ చేశారు. యాదగిరి కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్లో, ప్రధాన బుకింగ్ కౌంటర్ సమీపంలో కొబ్బరికాయల దుకాణాలు నడిపిస్తున్నారు. ఒక్క కొబ్బరికాయ రూ.50కే విక్రయించాలని దేవస్థానం అధికారులు సూచించినప్పటికీ వ్యాపారులు మాత్రం కొబ్బరికాయతో పాటు తులసీ మాల ఇస్తున్నామని చెప్పి ఒక్కో కొబ్బరికాయను రూ.100కు విక్రయిస్తున్నారు. గతంలో రెండు కొబ్బరికాయలు, చిన్న తులసి మాల కలిపి రూ.100కు విక్రయించేవారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో తమను నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపైన ఇన్చార్జి ఈఓ, డిప్యూటీ ఈఓ లేకపోవడంతో పాటు ఇతర ఆలయ అధికారుల పర్యవేక్షణ లేక వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తుల వద్ద అధిక ధరకు కొబ్బరికాయలు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలో నోటీసులు ఇచ్చినా..యాదగిరి కొండపై కొబ్బరికాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని గతంలో సైతం విమర్శలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు దుకాణాల వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. దేవస్థానం నిర్ణయించిన రూ.50కే కొబ్బరికాయలు అమ్మాలని వ్యాపారులకు సూచించారు. అప్పట్లో దుకాణదారులు రూ.50తో కూడిన స్టిక్కర్లు అక్కడ వేసుకున్నారు. ఆ తర్వాత ఈఓ మారడం, ఇన్చార్జి ఈఓలు రావడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇప్పటికై నా ఆలయాధికారులు పర్యవేక్షించి కొబ్బరికాయలు తక్కువ ధరలకు అమ్మేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. యాదగిరి కొండపై భక్తుల నిలువు దోపిడీ ఒక్క కొబ్బరికాయ రూ.100కు విక్రయిస్తున్న దుకాణదారులుయాదగిరి కొండ పైన వ్యాపారస్తులు ఒక్కో కొబ్బరికాయను రూ.50కే భక్తులకు అమ్మాలి. ఇది దేవస్థానం నిర్ణయించిన ధర. రూ.100కు ఒక్క కొబ్బరికాయ అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్ముతున్న వ్యాపారులను పిలిచి మాట్లాడాం. తులసీ మాల, పూలు, కొబ్బరికాయ కలిపి రూ.100కు అమ్ముతున్నామని వ్యాపారస్తులు మా దృష్టికి తీసుకొచ్చారు. కానీ దేవస్థానం నిర్ణయించిన ధర రూ.50కే విక్రయించాలని లేదంటే దుకాణాలు మూసివేస్తామని హెచ్చరించాం – జి. రఘు, ఏఈఓ, యాదగిరి క్షేత్రం -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
తిరుమలగిరి:తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆదివారం గ్రామస్తులు తెలిపారు. ఎస్సీల సమాధుల వద్ద రెండు రాతి గుండ్ల మధ్యలో వ్యక్తులు నిమ్మకాయలు కోసి, కొబ్బరికాయలు కొట్టి, పసుపు కుంకుమ చల్లి పూజలు చేసిన తర్వాత తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు. సుమారు నాలుగు అడుగుల లోతులో గుంతను తవ్వారని, అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతిసూర్యాపేట: ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. దూపహాడ్ గ్రామానికి చెందిన బిట్టు వీరభద్రయ్య చిన్న కుమారుడు బిట్టు అభివర్మ(24) గ్రామంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆది వారం ఉదయం గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాపేట: పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన మాచర్ల వెంకటేశ్(45)కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్ పెయింటింగ్, కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తన అత్తగారి ఊరైన చల్లూరుకు వెళ్లొచ్చిన వెంకటేశ్ ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి తల్లి గమనించి గ్రామస్తులకు విషయం చెప్పడంతో వారు అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. బెయిల్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్సూర్యాపేట: బెయిల్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 22న సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్ రోడ్డులో గల తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని, మహిళను రూరల్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వారికి కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన వంగూరి సురేష్ బెయిల్ ఇప్పిస్తానని రూ.70వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. ఇంకా రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సురేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సురేష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
అదృశ్యమై.. కృష్ణా నదిలో శవమై తేలి..
హుజూర్నగర్: ఇంట్లో నుంచి అదృశ్యమైన వ్యక్తి ఆదివారం కృష్ణా నదిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన మేడతి ఆంజనేయులు(36) గత నెల 30న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం మేళ్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మఠంపల్లి మండలం మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఆంజనేయులు బైక్, చెప్పులను పోలీసులు గుర్తించారు. కాగా ఆదివారం మేళ్లచెరువు మండలం పాత కిష్టాపురం వద్ద కృష్ణా నదిలో వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆంజనేయులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా.. వారు వచ్చి చూసి మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. ఈ మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్రెడ్డి తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వైభవంగా నిత్యకల్యాణం
హుజూర్నగర్: మఠంపల్లి మండలం మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం గావించారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. నలభై వసంతాలకు ఒకే వేదికపైకి.. హుజూర్నగర్ : పదో తరగతిలో ఒకే పాఠశాలలో చదువుకున్న స్నేహితులు.. నలభై వసంతాల తర్వాత కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో 1984–85 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, పి.వీరబాబు, విజయకుమారిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎడవెల్లి వెంకటరెడ్డి, కంబాలపల్లి వెంకటనారాయణ, కడియం వెంకట్రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరు మృతి
నకిరేకల్: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో 365వ నంబర్ జాతీయ రహదారిపై ఆది వారం ఉదయం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రంలోని గొర్రెకుంటకు చెందిన పొనుగంటి కిరణ్కూమార్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్బీఐ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం కిరణ్కుమార్ తన భార్య సంధ్యారాణి(36)తో కలిసి కారులో మిర్యాలగూడ నుంచి వరంగల్లోని గొర్రెకుంటకు బయల్దేరాడు. అదేవిధంగా కట్టంగూర్ మండల అయిటిపాముల గ్రామానికి చెందిన వానరాశి మహేందర్(19) ముగ్గు అమ్మేందుకు శాలిగౌరారం మండలం పెర్కకొడారం గ్రామానికి వెళ్లి తిరిగి టీవీఎస్ ఎక్సెల్పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో 365వ నంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో కిరణ్కుమార్ కారు మహేందర్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్తి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కిరణ్కూమార్ భార్య సంధ్యారాణి అక్కడికక్కడే మృతిచెందింది. మహేందర్కు, కిరణ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మహేందర్ మృతిచెందాడు. మృతుడు మహేందర్ పెద్దనాన్న కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు.ధ్వంసమైన కారు ఒకరికి తీవ్ర గాయాలు -
ముగిసిన రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలు
చౌటుప్పల్ : 10వ అంతర్ జిల్లా రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు ఆదివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ముగిశాయి. అండర్–14, అండర్–16, అండర్–19 విభాగాల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల క్రీడాకారులు సంయుక్తంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అంబిటస్ స్కూల్, జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. సైక్లింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఒలంపిక్ సంఘం కార్యదర్శి పి. మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను తిలకించారు. అనంతరం అంబిటస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబిటస్ స్కూల్ చైర్మన్ కె. జైపాల్రెడ్డి, డైరెక్టర్ పిసాటి శ్రీకాంత్రెడ్డి, జేబీ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేందర్, సైక్లింగ్ సంఘం ప్రతినిధులు విజయకాంత్, దత్తాత్రేయ, రమేష్, పాష, మనోహర్కుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఇష్టారాజ్యం
యాదగిరీశుడి కొండపైన కొబ్బరికాయల వ్యాపారులు భక్తులను నిలువునా దోచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025- 8లోమోటకొండూర్: మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాఠశాలలో ఆరు గదులు, క్రీడా ప్రాంగణం, ప్రహరీ, బాత్రూమ్స్ ఇలా అన్ని వసతులు ఉన్నప్పటికీ ఎంపీడీఓ కార్యాలయం అందులోనే నిర్వహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఈ పాఠశాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తరగతి గదులు లేక తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్య మోటకొండూర్ ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం 44 మంది విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య 71కి చేరింది. నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. 2016లో మోటకొండూరు నూతన మండలంగా ఏర్పడగా ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కొరతతో ప్రాథమిక పాఠశాల ఆరు గదుల్లోనే నాలుగు గదులను ఎంపీడీఓ కార్యాలయానికి కేటాయించారు. మిగతా రెండు గదుల్లోని ఒక గదిలో పాఠశాల ఆఫీస్ రూమ్, కిచెన్, 1, 2 తరగతులకు సంబంధించి 30 మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరొక గదిలో 3, 4వ తరగతులకు సంబంధించి 21 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇక 5వ తరగతికి చెందిన 18 మంది విద్యార్థులకు పాఠశాల వరండాలోనే బోధిస్తున్నారు. సరిపడా తరగతి గదులు లేవన్న కారణంతో 8 మంది విద్యార్థులు తిరిగి వెళ్లిపోయారు. బ్లాక్ బోర్డుల సమస్యవిద్యార్థులకు బోధించేందుకు వీలుగా ప్రతిగదికి ఒక బోర్డు చొప్పున అందిస్తాయి. మోటకొండూర్ పాఠశాలలోని ఐదు తరగతులకు 5 బోర్డులు ఇవ్వాల్సి ఉండగా.. పాఠశాలకు రెండు గదులు మాత్రమే కేటాయించటంతో బోర్డులు కూడా రెండు మాత్రమే ఇచ్చారు. ఆవరణలో పాఠాలు వింటున్న వారికి బోర్డు కేటాయించాలని ఎంఈఓను కోరగా.. అమ్మనబోలు స్కూల్ నుంచి ఒక బ్లాక్ బోర్డ్ను ఇప్పించారు. కానీ ఇది పెట్టేందుకు ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఉపయోగించటానికి కష్టంగా మారింది. మోటకొండూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత 70 మంది విద్యార్థులకు రెండే గదులు నాలుగు గదులు ఎంపీడీఓ కార్యాలయానికి కేటాయించడంతో తలెత్తుతున్న ఇబ్బందులు గదులు లేక తిరిగి వెళ్లిపోతున్న విద్యార్థులు తరగతి గదులు కేటాయిస్తే ఇంకో 25 మంది వరకు వచ్చే అవకాశంభారంగా ప్రయాణ ఖర్చు..మోటకొండూర్లో చదువుకునేందుకు ముస్త్యాలపల్లి గ్రామం నుంచి 16 మంది విద్యార్థులు వస్తుంటారు. అందులో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 9 మంది, ఏడుగురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రామం నుంచి మోటకొండూర్కు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నెలకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున చెల్లిస్తూ ప్రైవేట్ వాహనంలో వస్తున్నారు. అయితే పాఠశాల ఊరికి దూరంగా ఉండటంతో హైస్కూల్ నుంచి ప్రైమరీ వరకు ఉన్న కొంతమంది చిన్నారులను తీసుకురావటానికి టీచర్లు నెలకు 2500 అదే వ్యాన్కు చెల్లిస్తూ తీసుకువచ్చి దిగబెడుతున్నారు. -
యాదగిరి శ్రీలక్ష్మీనారసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. ఆదివారం ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ఆలయ ద్వార బంధనం చేశారు. -
కంటి సమస్య ఉన్నవారు అధైర్యపడొద్దు
చౌటుప్పల్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారెవరూ అధైర్యపడొద్దని, అందరికీ తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో గల పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటికే తొమ్మిది విడతలుగా నియోజకవర్గంలో శిబిరాలు నిర్వహించి 6,618 మందికి పరీక్షలు చేశామని, అందులో 1330మందికి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ప్రస్తుతం లక్కారంలో పదో విడత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు కంటి చూపు సమస్య ఉండకూడదన్నదే తన లక్ష్యమన్నారు. కంటిచూపు బాగుంటే పదేళ్లపాటు అధికంగా జీవించొచ్చని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు చిలుకూరి ప్రభాకర్రెడ్డి, తాడూరు వెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజుగౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, నాయకులు చెన్నగోని అంజయ్య, మొగుదాల రమేష్, జాల మల్లేష్, అర్ధ వెంకట్రెడ్డి, బత్తుల విప్లవ్కుమార్, పెద్దగోని రమేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
వానొస్తే రాస్తా బంద్
రామన్నపేట: వానపడితే రామన్నపేట – సిరిపురం రైల్వే అండర్పాస్ నీళ్లతో నిండిపోతోంది. అందులోనుంచి వెళ్లేందుకు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. లోతు తెలియక కొందరు వెనక్కి తగ్గుతుండగా.. అలాగే వెళ్లిన వారు నీటిలో చిక్కుకుంటున్నారు. మెంథా తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు అండర్పాస్ పూర్తిగా జలమయం అయ్యింది. ఫలితగా ఆ మార్గంలో ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిర్మాణలోపం వల్లే సమస్య! రామన్నపేట – చౌటుప్పల్ మార్గంలో సిరిపురం వద్ద ఐదేళ్ల క్రితం రైల్వేశాఖ అండర్పాస్ నిర్మించింది. రెండువైపులా మలుపు వచ్చినా పట్టించుకోకుండా అండర్పాస్ నిర్మాణం చేశారు. వర్షపునీరు వెళ్లడానికి వీలుగా డ్రెయిన్ ఏర్పాటు చేసి సమీపంలోని కుంటలోకి కలిపారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడు కుంట నిండి అండర్పాస్ నుంచి నీళ్లు ముందుకెళ్లడం లేదు. ఈనెల 28,29 తేదీల్లో కురిసిన వర్షాలకు అండర్పాస్లో భారీగా నీళ్లు నిలిచాయి. దీంతో ఈ రూట్లో నడిచే ఏకై క ఆర్టీసీ బస్సును అధికారులు రద్దు చేశారు. విద్యార్థులు, వాహనదారులు బోగారం, కొమ్మాయిగూడెం లేదా పెద్దకాపర్తి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. లోతు తెలియక అండర్పాస్ గుండా వెళ్లడానికి ప్రయత్నించిన వాహనాలు నీళ్లలో ఆగిపోతున్నాయి. వెల్లంకి గ్రామానికి చెందిన దంపతులు అండర్పాస్ మధ్యలోకి వెళ్లాక బైక్ అదుపుతప్పి నీళ్లలో పడి గాయాల పాలయ్యారు. ఓ కారు కూడా నీళ్ల మధ్యలోకి వెళ్లిన తరువాత మొరాయంచి ఆగిపోయింది. సమస్యకు శాశ్వత పరిష్కారం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఫ వర్షాలకు నిండిన రామన్నపేట –సిరిపురం రైల్వే అండర్పాస్ ఫ ఐదు రోజులుగా రాకపోకలు బంద్ ఫ చుట్టూ తిరిగి వెళ్తున్న జనం -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిద్ధం
ఆలేరు: విద్యుత్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ‘డిస్కం’ సిద్ధమైంది. శాఖపై నమ్మకాన్ని మరింత పెంచుతూ.. వినియోగదారులకు విద్యుత్ సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ఇందుకు విద్యుత్ సమస్యలపై ఎక్కడికి వెళ్లాలో.. ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్ విద్యుత్ డివిజన్ల పరిధిలో సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవ వేదిక నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆయా డివిజన్ల పరిధిలోని డీఈలు, ఏడీఈ,ఏఈలకు జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తూ విసిగిపోయిన వినియోగదారులకు ఈవేదిక ద్వారా ఊరట లభించనుంది. సిబ్బంది ఇబ్బంది పెట్టినా..జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగనున్న ఈ కార్యక్రమంలో రైతులు, ఇతర విద్యుత్ వినియోగదారుల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. సమస్యలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది, అధికారి ఎవరైనా ఇబ్బంది పెట్టినా, డబ్బులు అడిగినా వినియోగదారులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సమస్యలకు ప్రాధాన్యంకొత్త విద్యుత్ మీటర్ ఏర్పాటు, పాత విద్యుత్ మీటరు మార్పు, రీడింగ్లో పొరపాట్లు, విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడం, కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను మార్చడం తదితర సమస్యలపై చాలా మంది వినియోగదారులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియదు. కొంతమంది లైన్మెన్లకు చెప్పినా పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. ఏఈలు ఎవరో తెలియదు. అలాంటి వారికి విద్యుత్ దినోత్సవ వేదిక ద్వారా అవకాశం కల్పించి, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోనున్నారు. పలు అంశాలపై అవగాహన..విద్యుత్ పొదుపునకు పాటించాల్సిన అంశాలు, నాణ్యమైన పంపుసెట్లు, రాపిడి లేని ఫుట్ వాల్వ్లు, పైప్లు, కెపాసిటర్ల వాడకంపై, విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యుత్ౖ లెన్ల షిఫ్టింగ్..రోడ్డు, దారి మధ్యలో విద్యుత్ స్తంభాలను తొలగించుట. ప్రజలకు అసౌకర్యం, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్పై వచ్చే వినతులను పరిష్కరించనున్నారు. ఒకవేళ అవి వ్యక్తిగతమైనవి అయితే సదరు వ్యక్తులు విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్కు నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయొచ్చు విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో వినతిపత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోతే కన్జూమర్ గ్రీవెన్స్ రీడ్రెసల్ ఫోరం(సీజీఆర్ఎఫ్)లో తెలపాలి. అక్కడా ఫలితం రాకపోతే వినియోగదారులు అంబుడ్స్మెన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. సమస్యలపై సీజీఆర్ఎఫ్లో ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు 040–23431432 నంబర్ను సంప్రదించాలి.ఫ భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లో నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవ వేదిక ఫ వినతుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తివిద్యుత్ దినోత్సవం కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై వినియోగదారుల సమర్పించిన వినతులు, ఫిర్యాదులను పరిశీలిస్తాం. జాప్యానికి కారణాలు తెలుసుకొని, సిబ్బంది పొరపాటు ఉంటే మందలిస్తాం. ఆయా వినతులు, ఫిర్యాదులను వారంలో పరిష్కరించేలా అధికారులకు సూచనలు ఇస్తాం. సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అధికారులు, అన్ని స్థాయిల సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటారు. – సుధీర్కుమార్, ఎస్ఈ, యాదాద్రి భువనగిరి జిల్లా -
గంధం ఊరేగింపు
భువనగిరి : భువనగిరి పట్టణంలో ఆదివారం స్థానిక గంజ్ మసీదు వద్ద గంధం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిరాజ్ ఓ ఓలియా కదబుద్దీన్ ఒలియా గంధం, పూలచదర్ను హజరత్కు సమర్పించారు. కార్యక్రమంలో ఖాజా బషీర్ ఉద్దీన్, అమీన్మెమన్,ఇబ్రహీం అనీఫ్,ఇమ్రాన్, షరీఫ్, రహమాత్అలీ పాల్గొన్నారు. నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు బంద్ భువనగిరి: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, నర్సింగ్ కళాశాలలు బంద్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. -
నేడు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ద్వారతోరణం, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభ ఆరాధన, చతుస్నానార్చన, నిత్యహోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కళాకారులు నృత్య ప్రదర్శనతో హనుమత్ వాహనాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. సోమవారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మోహనబాబు, ఆలయ కమిటీ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటి నుంచి సురేంద్రపురిలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలుభువనగిరి: సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానంలో సోమవారం నుంచి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ మేనేజర్ నరసింహరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3న ఉదయం విఘ్నేశ్వర పూజ, నాగేశ్వర మూలమత్ర హోమం, నవగహ్ర హోమం, అకాశదీపారాధన, 4న అలివేలుమంగ, పద్మావతి సహిత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, శేషవాహన సేవ, 5న పంచముఖ పరమేశ్వర మూలమూర్తికి పంచామృత నిజాభిషేకం, రుద్రహోమం, పంచముఖ హనుమదీశ్వర సంయుక్త మహామూర్తుల పాదాలకు అష్టోత్తర శత కలశాలతో క్షీరాభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతం, కుంభసంప్రోక్షణ, కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణగిరి క్షేత్రంలో తులసీ కల్యాణంభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం కార్తీక శుద్ధ ద్వాదశి వేడుకల్లో భాగంగా వైభవంగా తులసీ కళ్యాణం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 5వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మానవీయ విలువల సమాహారం బైరెడ్డి కవిత్వం నల్లగొండ : మానవీయ విలువలు బైరెడ్డి కృష్ణారెడ్డి కవిత్వమని సాహితీవేత్త ప్రసేన్ అన్నారు. నల్లగొండలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన కృష్ణారెడ్డి రాసిన ది అన్ ఫేడింగ్ అన్ ఫోల్డ్ అనే ఆంగ్ల గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కృష్ణారెడ్డి రాసిన ఆర్తి 5వ సంపుటాన్ని కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ఆవిష్కరించారు. ఆర్తి కవిత్వంపై ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ సీతారాం, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, పగడాల నాగేందర్ మాట్లాడారు. ది ఆన్ పెండింగ్ అన్ ఫోల్డ్ గ్రంథంపై సతీష్ బైరెడ్డి, డాక్టర్ ఎం.రాంభాస్కరరాజు, దొన్నగంటి కృష్ణ విశ్లేషించారు. అనంతరం జరిగిన సాహితీ మిత్రుల చర్చ గోష్టికి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షత వహించారు. ఆర్తి కవిత్వంపై చర్చను మునాసు వెంకట్, ఆంగ్ల గ్రంథంపై చర్చను డాక్టర్ నోముల రాహుల్ నిర్వహించారు. సమన్వయకర్తలుగా డాక్టర్ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంవి.గోనారెడ్డి, అంబటి వెంకన్న, చకోనా, ఎలికట్టె శంకర్రావు, పెరుమాళ్ల ఆనంద్, నోముల రజనీష్, రాహుల్, పెద్దిరెడ్డి గణేష్, శీల అవిలేను, మధుసూదన్, రాజేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. -
తరగతి గదులు సరిపోను లేవు
మాది ముస్త్యాలపల్లి గ్రామం. మా గ్రామం నుంచి 16 మంది విద్యార్థులం వ్యాన్ కట్టుకుని మోటకొండూర్ పాఠశాలలకు వస్తున్నాం. మా గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఒకే టీచర్ ఉన్నారు. మోటకొండూరులో నలుగురు టీచర్లు ఉన్నారని ఇక్కడకు వస్తున్నాం. ప్రయాణ సౌకర్యం లేక మిగిలిన వారు ఇక్కడికి రావటం లేదు. ప్రయాణ సౌకర్యం కల్పిస్తే అందరం రావటానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించాలి. – సాయివర్షిత్, 5వ తరగతి విద్యార్థి ● -
40 వసంతాల అపూర్వ కలయిక
ఆలేరురూరల్ : మండలంలోని శారాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాల 1985–86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సైదా బేగం, పాములపర్తి రాంచంద్రారెడ్డి, దయ్యాల దేవేందర్, తమ్మలి ఆశయ్య, కాండ్రాజు సత్తయ్య, చెన్నోజు శ్రీనివాస్, దోడ కొండయ్య, మద్దెల శ్రీనివాస్, నవనీత, స్వరూప, కళాభాయ్, సయ్యద్ అభ్బాస్, శ్రీనివాస్, చంద్ర రుషి, కొండల్రెడ్డి, దూడల జంగయ్య, నీలేందర్రెడ్డి, సాయిరెడ్డి, మాల్లారెడ్డి, హేమలత, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. -
విచారణ చేయాలి
సాక్షి,యాదాద్రి : యాదగిరిగుట్ట దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరుతూ బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ మాట్లాడుతూ ఆలయ ఏఈఓ, డీఈఓ అక్రమాలకు పాల్ప డుతూ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. విదేశాల్లో స్వామివారి కల్యాణం పేరిట ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పే ర్కొన్నారు. కార్లలో సీటు బెల్టు వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను తరలించడం, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో తిప్పడం, కల్యాణం పేరిట డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మ ప్రచారం అంటూ దాతలను సృష్టించి కల్యాణం తేదీలను నిర్ణయించి నెలలకొద్దీ అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. చింతపండు చోరీ విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేశారని ఆరోపించారు. ఏఈఓపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని, రూల్స్కు విరుద్ధంగా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందారని స్పష్టం చేశారు. ఏఈఓ అధికార దు ర్వినియోగానికి పాల్పడుతున్నాడని.. బినామీల పేర్లతో టెండర్లు వేయిస్తున్నాడని, స్వర్ణగిరిపై ప్రచారం చేస్తూ ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వివరించారు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందామహేందర్, కాదూరి అచ్చయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ మహేష్గౌడ్, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీమార్గం ద్వారానే కేసులు సత్వర పరిష్కారం
భువనగిరి: రాజీమార్గం ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా మొదటి అదనపు జడ్జి ముక్తిదా అన్నారు. ఈనెల 15న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసు అధికారులు చొరవ చూపాలని కోరారు. శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదుల మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. సివిల్ జడ్జి ఉషశ్రీ మాట్లాడుతూ జిల్లాలో 1,147 కేసులు రాజీకి ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, భువనగిరి న్యాయవాదుల సంఘం సెక్రటరీ బోల్లేపల్లి కుమార్, ఏసీపీ శ్రీనివాస్నాయుడు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భుపాల్రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.ఫ జిల్లా మొదటి అదనపు జడ్జి ముక్తిదా -
రైతువేదిక.. నిర్వహణ లేక
రాజాపేట : పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇచ్చేందుకు నిర్మించిన రైతు వేదికలు నిస్తేజంగా మారాయి. నిర్వహణకు నిధుల్లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 37 నెలలుగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా పలు చోట్ల రైతువేదికలు గ్రామానికి దూరంగా నిర్మించడంతో రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 92 రైతువేదికలు నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. ప్రతి 5 వేల మంది రైతులకు ఒకటి చొప్పున జిల్లాలో 92 రైతువేదికలు ఏర్పాటు చేసింది. ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది. అంతేకాకుండా రూ.3 లక్షలతో మండలానికి 3 చొప్పున 51 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) సెట్లు ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వీడియో కాన్షరెన్స్ ద్వారా రైతులకు వివిధ రకాల పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అధునాతన సాంకేతిక పద్ధతులపై శిక్షణ, బ్యాంకుల రుణాల సమాచారం, పశుసంవర్ధక శాఖ వివరాలు, పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, పంట మా ర్పిడి అంశాలపై సమాచారం అందిస్తున్నారు. వీటిలో మండల కేంద్రాల్లోని వేదికల్లో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. మిగతా చోట్ల వృథాగా ఉన్నాయి. సౌకర్యాలు అంతంతే.. పలుచోట్ల రైతువేదికల్లో నేటికీ విద్యుత్, నీటి వసతి లేదు. జిల్లాలో 92 రైతు వేదికలకు గాను 35 రైతు వేదికలు గ్రామాలకు చివరగా ఉన్నాయి. అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలంటే మహిళా ఏఈఓలు భయపడుతున్నారు. దీంతో అవి మద్యం ప్రియులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. 35 వేదికలు నిరుపయోగం ఫ మూడేళ్లుగా విడుదల కాని బడ్జెట్ ఫ ఏఈఓలకు భారంగా మారిన నిర్వహణ ఫ వీడియో కాన్ఫరెన్స్లు, సమీక్షంలో సమయంలో చేతినుంచే ఖర్చు -
3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
భువనగిరి: విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విద్యుత్ శాఖ భువనగిరి డివిజన్ డీఈ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భువనగిరి డివిజన్ కార్యాలయ ఆవరణలో ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుందన్నారు. విద్యుత్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై మెరుగైన విద్యుత్ సరఫరాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నృసింహుడి సన్నిధిలో దేవాదాయ కమిషనర్ యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఇంచార్జ్ ఈఓ హరీష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష పుష్పార్చనలో పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అంతకుముందు ఆలయానికి చెందిన యాదగిరి మాస పత్రిక మూడవ సంచికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సురేంద్రచార్యులు, యాదగిరి మాసపత్రిక ఎడిటర్ ఈశ్వర్కుమర్ పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్కింగ్చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లోని తాళ్లసింగారం వద్ద మార్కింగ్ వేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి గ్రామ శివారులోని ము త్యాలమ్మ ఆలయం వద్ద మార్కింగ్ వేసినట్లు స్థానికులు తెలిపారు. చౌటుప్పల్తో పాటు మరే ప్రాంతంలోనూ మార్కింగ్ వేయలేదు. కాగా మార్కింగ్ వేసినట్లు తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మార్కింగ్ విషయం తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. 5న ఆర్చరీ పోటీలునల్లగొండ టూటౌన్ : భువనగిరిలో ఈనెల 5న ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, తునికి విజయసాగర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు పుట్టిన తేదీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో న్యూ డైమెన్షన్ పాఠశాల వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99120 55678 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
సురేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
భువనగిరి: అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు నరేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు అనవసర ఒత్తిడిలు పెట్టడంతోనే విద్యుత్ కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 అధ్యక్షుడు పడిగం యాదగిరి, కార్యదర్శి బొబ్బలి మురళి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు దొడ్డి యాదగిరి, రాజేష్, కుసంగి శ్రీనివాస్, బోట్ల రమేష్, జోగు వెంకటేశం, మీర్జా షకిల్ బేగ్, రమేష్రెడ్డి, సత్యనారాయణ, బాలనర్సింహ, లింగం, బాబురావు, రవీందర్, విజయకుమార్, స్వరూప, స్వప్న, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రిమాండ్
యాదగిరిగుట్ట: రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడేపు వెంకట రామారావును ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్కు తరలించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు యాదగిరి కొండపైన గల ఆయన కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు. గురువారం ఆయన యాదగిరి కొండపైన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు ప్రసాదం మిషనరీ రిప్లేస్మెంట్, రిపేర్ల బిజినెస్లో భాగంగా బిల్లు మంజూరు చేసేందుకు వెంకటరామారావు రూ.2లక్షలకు పైగా డబ్బులు డిమాండ్ చేశాడని, ఒప్పందం ప్రకారం.. రూ.1.90లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో రామారావు వ్యవహారంపై నిఘా పెట్టి, గతంలో ఉన్న ఆరోపణలు, వీడియో, ఆడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. దేవాదాయశాఖ ఇన్చార్జ్ ఎస్ఈగా ఉన్న రామారావు మేడారం ఆలయ పరిశీలనకు వెళ్లి, హైదరాబాద్కు తిరిగి వచ్చే క్రమంలో కాంట్రాక్టర్ల నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న క్రమంలో మేడిపల్లిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకొని యాదగిరిగుట్ట ఆలయంలోని కార్యాలయంలో రికార్డులు పరిశీలించినట్లు చెప్పారు. ఆయనొక్కడే డీలింగ్ ఈఈ రామారావు అక్రమంగా సంపాదించే విషయంలో అంతా ఆయన ఒక్కడే డీలింగ్ చేస్తాడని తేలింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రూపంలో వచ్చే డబ్బుల విషయంలో అతనొక్కడే తీసుకుంటాడని తెలిసింది. విచారణలో ఉన్నతాధికారుల ప్రమేయం లేదని రామారావు ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. కొండపైన తనకు సంబంధించిన శాఖలో ఎవరైనా కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే కమిషన్ పర్సంటేజ్ మాట్లాడిన తరువాతే బిల్లులు మంజూరు చేశాడని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఈఈ రామారావు నివాసం ఉంటున్న ఇంటిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో విలువైన భూమి పత్రాలు, డాక్యుమెంట్లు, నగదు దొరికినట్లు తెలుస్తోంది. రామారావు అక్రమంగా సంపాదించిన నగదు, భూముల పత్రాలను, ఆయన ఎవరి పేరున భూములు రిజిస్ట్రేషన్ చేశాడు, ఆయనకు వచ్చే జీతం ఎంత, అక్రమంగా సంపాదించిన నగదు అంశాలపై ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిసింది. ఎల్బీనగర్లోని రామారావు ఇంట్లో హైదరాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు 8 మంది సోదాలు చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవాలయంలోని ఈఈ కార్యాలయంలో 15మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
ఆగని దుందుబి ఉధృతి
డిండి: మోంథా తుపాన్ కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దిగువకు ప్రవహిస్తున్న దుందుబి వాగు ఉధృతి కొనసాగుతోంది. డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు గుండా నీటి ప్రవాహం అధికమవడంతో హైదరాబాద్–శ్రీశైలం వెళ్లే 765 హైవేపై నిర్మించిన బ్రిడ్జి బుధవారం అర్ధరాత్రి దెబ్బతిని కూలిపోయింది. -
స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం శ్రావణ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కళ్యాణమహోత్సవం, తిరుప్పావడ సేవ జరిపించారు. సాయంత్రం స్వామి వారికి రథోత్సవ సేవ నిర్వహించారు. వరుసగా వాహనాలు ఢీనార్కట్పల్లి: నార్కట్పల్లి సమీపంలోని హైదరాబాద్ – విజయవాడ రహదారిలో గురువారం వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. నార్కట్పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. అదే రోడ్డుగుండా వస్తున్న హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఖైదీలను తరలిస్తున్న పోలీస్ వాహనం ముందున్న కారును ఢీకొంది. ఈ పోలీస్ వాహనాన్ని మరో కారు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆయిల్ పరిశ్రమలో తనిఖీలుచిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో గల అగ్రో ఆయిల్ పరిశ్రమలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పరిశ్రమలో తయారు చేస్తున్న రిఫైన్డ్ ఆయిల్ ప్యాకింగ్ డబ్బాలపై సరైన వివరాలు లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై రికార్డు చేసిన పత్రాలపై సంబంధిత పరిశ్రమ ఉద్యోగులు సంతకాలు చేయకుండా నిరాకరించడంతోపాటు తనిఖీలు చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయికి తెలపడంతో ఆమె పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు. సుమారుగా 1600 లీటర్ల ఆయిల్ డబ్బాలతోపాటు, 4800 కేజీ ఆయిల్ ముడి పదార్థాలు గుర్తించారు. ఆయిల్ డబ్బాలు నిబంధనల మేరకు లేనట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి పరీక్ష నిమిత్తం ల్యాబ్కు తరలించారు. దాడికి పాల్పడిన వారికి ఆరు నెలల జైలు తుంగతుర్తి : భూ వివాదం కారణంగా ఓ వ్యక్తిపై కరలత్రో దాడి చేసిన నలుగురికి ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండీ గౌస్పాషా గురువారం తీర్పునిచ్చారు. తిరుమలగిరి మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన రాగుశాల నరసింహ స్వామికి, లింగంపల్లి నరసింహస్వామి మధ్యన భూ వివాదం ఉంది. ఈక్రమంలో 2015లో రాగుశాల నరసింహస్వామిపై లింగంపల్లి నరసింహ, ఆయన భార్య లక్ష్మి, వారి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సుజాత కర్రలతో దాడి చేశారు. దీంతో రాగుశాల నరసింహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. గురువారం సాక్షులను విచారించిన న్యాయమూర్తి ఎండీ గౌస్ పాషా నిందితులైన లింగంపల్లి నరసింహతో పాటు అతని భార్య లక్ష్మి, వారి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సుజాతలకు ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చికిత్స పొందుతున్న మరో యువకుడు గురువారం మృతిచెందాడు. అమ్మనబోలు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఇద్దరు యువకులు కొత్త చంద్రశేఖర్, దుర్గం రుషికేష్ ఈనెల 20న బైక్పై అమ్మనబోలు రోడ్డు నుంచి నార్కట్పల్లికి వస్త్తుండగా.. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో వీరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తరలించగా చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స నిమిత్తం రుషికేష్ను హైదరాబాద్కు తరలించగా.. గురువారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు. -
నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ
భువనగిరి: సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మోంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను నల్లగొండ రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. అయితే ఇప్పటికే తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు భువనగిరి మీదుగా ఢిల్లీకి వెళ్తున్నాయి. రద్దు చేసిన రైళ్లు శుక్రవారం నుంచి భువనగిరి మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. మద్యం దుకాణంలో చోరీభువనగిరిటౌన్ : భువనగిరిలోని లక్ష్మి వైన్స్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ వెనుక డోర్ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగలు కౌంటర్ లోని రూ.50 వేల నగదు, ఐదు మద్యం ఫుల్ బాటిళ్లను అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం వైన్స్ నిర్వాహకుడు షాపు తెరిచేందుకు రాగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వైన్స్ నిర్వాహకుడు విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి పైకప్పు కూలి రెండు ఆవులు మృతిగుండాల : మండలంలోని వెల్మజాల గ్రామంలో రైతు నర్రముల యాదయ్యకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఆవులు వ్యవసాయ బావి పక్కన నిరుపయోగంగా ఉన్న ఇంట్లోకి వెళ్లాయి. వాటిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా ఇంటి స్లాబ్ కూలి ఆవులు మృతి చెంది ఉన్నాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
ప్రమాణస్వీకారం చట్టవిరుద్ధం
ఫ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం యాదగిరిగుట్ట రూరల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అజారుద్దీన్ను మంత్రిగా ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయడం చట్ట విరుద్ధమని, ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన ప్రజాస్వామ్య పరిరక్షణ కన్వీనర్ గుజ్జుల రాంచంద్రారెడ్డి గురువారం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికా రికి వినతి పత్రం అందజేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక వర్గాన్ని ప్రలోభ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. -
నందనంలో విషాదఛాయలు
భువనగిరి: భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి చెందిన రచ్చ కృష్ణవేణి(45) తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణవేణి తండ్రి రవీందర్ ఈ నెల 25న మృతిచెందగా అంత్యక్రియల నిమిత్తం ఇబ్రహీంపట్నం నెర్రపల్లి గ్రామానికి వెళ్లింది. గురువారం పంచదినకర్మ సందర్భంగా తండ్రి అస్థికలను వాడపల్లిలోని కృష్ణానదిలో కలిపేందుకు ఆమె భర్త ప్రభాకర్తో కలిసి వెళ్లింది. సాయంత్రం తిరిగి నెర్రపల్లి గ్రామానికి వచ్చారు. అనంతరం బైక్పై భర్తతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని మజీద్పూర–బాటసింగారం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో అందులో పడిపోయారు. స్థానిక యువకులు గమనించి ప్రభాకర్ను బయటకు తీయగా కృష్ణవేణిని కాపాడేలోపు ఆమె మృతి చెందింది. కృష్ణవేణి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉంది. ఫ తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మహిళ మృతి -
పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తాం
నాగార్జునసాగర్: నీతి, నియమావళిని అవలంబిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో విధులు నిర్వహిస్తామని నాగార్జునసాగర్లోని తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. జెన్కో లోని విజిలెన్స్ విభాగం వారు ఈనెల 21న నిఘా అవగాహన (విజిలెన్స్ అవేర్నెస్ వీక్) వారోత్సవాలు చేపట్టి నవంబర్ 2వ తేదీవరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్లో సెంట్రల్ ఆఫీసులో ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. నైతిక వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తామని, నిజాయితీ, సమగ్రత సంస్కృతిని పెంపొందిస్తామని, సమాజం యొక్క హక్కులు, ప్రయోజనాలను రక్షిస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్కో సీఈ మంగేశ్కుమార్ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్మెన్ మృతి
మోత్కూరు : వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఈసంఘటన గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పాలడుగు గ్రామ శివారులో బొడిగ కిష్టయ్య వ్యవసాయ బావి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్లింత్ప్లాట్ ఫామ్ నుంచి ఒరిగింది. దానిని సరి చేసేందుకు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు సురేష్ (34), మరొక హెల్పర్తో కలిసి అక్కడికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ను సరి చేసి బిగించే క్రమంలో ఎల్టీ వైరు హెచ్టీ వైరుకు తాకడంతో సురేష్ విద్యుత్షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి మృతుడికి భార్య, పదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పది రోజుల్లోపే విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు మృతి పది రోజుల లోపే విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ నెల 25న మోత్కూరులోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో రోజువారీ వర్కర్గా పనిచేస్తున్న బద్దిపడగ భాస్కర్రెడ్డి (23) వైండింగ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ చేస్తున్న క్రమంలో మెయిన్ హ్యాండిల్ ఆన్ చేయగా విద్యుత్షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే దత్తప్పగూడేనికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ సురేష్ ట్రాన్స్ఫార్మర్ వద్ద రిపేరు చేస్తుండగా మృతి చెందాడు. ఇద్దరూ విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది కావడంతో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి. ఫ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తుండగా ఘటన -
శాలిగౌరారం మార్కెట్ యార్డుకు తాళం
శాలిగౌరారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి గురువారం మార్కెట్యార్డు ప్రధాన గేట్కు మార్కెట్ కార్యదర్శి చీనానాయక్, పీఏసీఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు తాళం వేశారు. ధాన్యం రాశులతో వ్యవసాయ మార్కెట్యార్డు పూర్తిగా నిండిపోవడంతో స్థలం కొరత ఏర్పడిందని, అందుకే రైతులు ధాన్యం తీసుకురాకుండా మార్కెట్యార్డు ప్రధాన గేటుకు తాళం వేసినట్లు వారు తెలిపారు. మార్కెట్యార్డులోని ధాన్యం రాశులు మోంథా తుఫాన్తో తడవడంతో ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు యార్డు ఆవరణలో స్థలసమస్య ఏర్పడిందన్నారు. తడిసిన ధాన్యం రాశులను కనీసం తిరగబోసుకునేందుకు కూడా స్థలం లేకపోవడంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడడం, జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ప్రయోజనాల కోసం బయటి నుండి మార్కెట్యార్డు లోపలికి ధాన్యం తరలిరాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మార్కెట్ గేటుకు తాళం వేసినట్లు తెలిపారు. నవంబర్ 4 వరకు మార్కెట్యార్డు గేటుకు తాళం వేయనున్నట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించి కొనుగోలు ప్రారంభమైతే 4వ తేదీ నుంచి మార్కెట్యార్డు లోపలికి ధాన్యాన్ని అనుమతిస్తామన్నారు. రైతులు వాస్తవ పరిస్థితులను గమనించి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సహకరించాలని కోరారు. ఫ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రంలో స్థలం కొరత -
మూసీకి పోటెత్తిన వరద
నకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి వరద పోటెత్తింది. అధికారులు తొమ్మిది క్రస్ట్ గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. మోంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్, జనగాం, ఆలేరు, వరంగల్ తదిరత ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, వసంత వాగు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా వాగుల ద్వారా గురువారం ఉదయం రిజర్వాయర్లోకి 49,791 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో గురువారం ప్రాజెక్టు ఏడు క్రస్ట్గేట్లను పది అడుగులు, రెండు క్రస్ట్గేట్లను ఐదు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 51,990 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 33,931 క్యూసెక్కులకు తగ్గటంతో అధికారులు ఒక గేటును మూసివేసి ఎనిమిది గేట్లను పది అడుగులకు ఎత్తి ఉంచి 33,931 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. -
రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి
యాదగిరిగుట్ట: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని డీసీపీ అక్షాంశ్యాదవ్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని రాచకొండ సీపీ సుధీర్బాబు ఆదేశాల మేరకు గురువారం యాదగిరిగుట్టలో ఏసీపీ శ్రీనివాస్నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీసీపీ పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను నిలిపిన వారవుతారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారిని స్మరించుకుంటూ ఈనెల 31వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు భాస్కర్, యాలాద్రి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్, తుర్కపల్లి, గుండాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ డీసీపీ అక్షాంశ్ యాదవ్ -
రూ.500 కోట్లతో చౌటుప్పల్ అభివృద్ధి
చౌటుప్పల్ : రానున్న 25 సంవత్సరాలకు అనుగుణంగా చౌటుప్పల్ను అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి చెరువులను గురువారం ఆయన సందర్శించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చౌటుప్పల్ ముందుంటుందన్నారు. కొద్ది రోజుల్లోనే ఇక్కడ 5 లక్షల మంది నివాసం ఉండబోతున్నారని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు రూ.500 కోట్లు అవసరం అవుతాయని, ఈ విషయాన్ని ఇటీవల మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. చౌటుప్పల్ ఊర చెరువు, లక్కారం చెరువులను సుందరీకరిస్తామని చెప్పారు. ఊర చెరువు అలుగునీరు, వర్షపు నీరు దిగువకు వెళ్లేందుకు సర్వీస్రోడ్డు వెంట రూ.100 కోట్లతో ప్రత్యేకంగా కాలువ నిర్మాణం చేయించనున్నట్లు వెల్లడించారు. ఊరచెరువు నిండితే తలెత్తే ఉపద్రవాన్ని అందరి సహకారంతో అడ్డుకట్ట వేశామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ వీరాభాయి, మా ర్కెట్ వైస్చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ, నాయకులు పబ్బు రాజుగౌడ్, పాశం సంజయ్బాబు, ఉప్పు భద్రయ్య, మొగుదాల రమేష్, చెన్నగోని అంజయ్య, కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివాస్రెడ్డి, ఎండీ హన్నుభాయ్, ఎండీ బాబాషరీఫ్, ఊడుగు శ్రీనివాస్, గుండు మల్లయ్య, బొడిగె బాలకృష్ణ, పస్తం గంగరాములు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
యూనిట్ మార్చ్ను జయప్రదం చేయాలి
సాక్షి,యాదాద్రి : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే యూనిట్ మార్చ్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు పిలుపునిచ్చారు. యూనిటీ మార్చ్ కార్యక్రమం అమలులో భాగంగా రాజ్యసభ సభ్యుడు శ్రీభగవత్ కరద్ గురువారం అధికారులు, మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. కళాశాలు, పాఠశాలల్లో విద్యార్థులకు డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 10న పాదయాత్ర, 26న మహా ఐక్యత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఆఫీసర్ గంటా రాజేష్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనంజయనేయులు, డీఐఈఓ రమణి, సివిల్ సప్లై జిల్లా అధికారి అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
ఇండస్ట్రియల్ పార్కుపై పట్టింపేదీ!
తుర్కపల్లి: తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన ప్రతిష్టాత్మకంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పరిశ్రమల విస్తరణలో భాగంగా రెండున్నర ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ను ప్రతిపాదించి ఏర్పాట్లు ప్రారంభించింది. రైతుల నుంచి భూ సేకరణ సైతం పూర్తిచేసి 90 శాతం పరిహారం చెల్లించింది. కానీ, రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా పార్క్ పరిస్థితి తయారైంది. 93 ఎకరాలు సేకరణ తుర్కపల్లి గ్రామ పరిధిలోని 72 సర్వే నంబర్లో 93 ఎకరాల భూమిని 76 మంది రైతులనుంచి అప్పట్లోనే ప్రభుత్వం సేకరించింది. భూ నిర్వాసితులకు పరిహారం 82 ఎకరాలకు గాను రూ.16.54 కోట్లు చెల్లించారు. 11 ఎకరాలకు పెండింగ్లో ఉంది. రైతుల నుంచి సేకరించిన భూమికి తోడు మరో 47 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కేటాయించి మొత్తం 140 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం నిర్ధారించారు. పార్కు అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రధానంగా తుర్కపల్లి, రాజాపేట, బొమ్మలరామారాం, జగదేవపూర్, అలేరు మండలాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ, పార్క్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు. తొలుత రోడ్ల నిర్మాణంతో పాటు విద్యుత్, నీరు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు అడుగు పడటం లేదు. ఫ రెండున్నర సంవత్సరాల క్రితమే భూ సేకరణ పూర్తి ఫ అప్పట్లోనే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ఫ పార్కు అందుబాటులోకి వస్తే మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు భూ సేకరణ కూడా పూర్తి కావడంతో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తుందని ఆశించాం. భూ సేకరణ పూర్తై రెండేళ్లు గడిచినా పార్క్ స్థలంలో ఇప్పటి వరకు ఇటుక కూడా వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ దశలోనూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకపోవడం వల్ల ప్రజల్లో నిరాశ నెలకొంది. –డొంకెన రాజు, తుర్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్ అంశం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కల కాగితాల మీదే మిగిలిపోతుంది. ఇప్పటికై నా పట్టించుకొని పనులు ప్రారంభించాలి. –ఇమ్మడి అనిల్కుమార్, తుర్కపల్లి -
పిలాయిపల్లిలో గవర్నర్
భూదాన్పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లిలోని సప్తపర్ణి గోశాలను గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. అక్కడ సప్తపర్ణి ఫౌండేషన్, వేదభారతి ట్రస్ట్ సంయుక్తంగా అంధుల కొరకు బ్రెయిలీ లిపిలో రూపొందించిన భగవద్గీత, హనుమాన్చాలీసా గ్రంథాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఎయిమ్స్లో టెలీ మెడిసిన్ సేవలు బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నర్సింగ్ నిపుణుల కోసం ఈకో ఇండియా సహకారంతో టెలీ మెడిసిన్ సేవలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ మాట్లాడుతూ గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అంశాలను లెర్నింగ్ ద్వారా తెలుసుకునేందుకు టెలీ–మెంటరింగ్ దోహదపడుతుందన్నారు. మీసేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్ : అడ్డగూడూరు, ఆత్మకూర్ (ఎం), మోత్కూర్లో మీ–సేవ కేంద్రాల నిర్వహణకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాలు నిర్వహించడానికి డిగ్రీ విద్యార్హతతో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి స్థానికులై ఉండాలని, 21 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులన్నారు. ఆర్థిక స్థోమత కలిగి ఉండాలని, సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవా లని పేర్కొన్నారు. రాత, మౌఖిక పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. దరఖాస్తు ఫారాన్ని yadadri.teanga na.gov.in/ వెబ్సైట్ నుంచి పొందాలని సూచించారు. నవంబర్ 7వ తేదీలోగా కలెక్టరేట్లోని ఇన్వార్డు, అవుట్ వార్డులో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9121147135 సంప్రదించాలని పేర్కొన్నారు. నేడు భువనగిరిలో 2కే రన్ భువనగిరిటౌన్ : నేషనల్ యూనిటీ డేను పురస్కరించుకొని శుక్రవారం భువనగిరిలో 2 కే రన్ నిర్వహించనున్నట్లు పట్టణ సీఐ రమేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డీసీపీ అక్షాంశ్యాదవ్ ప్రారంభించనున్నారని, పోలీసు సిబ్బంది రన్లో పాల్గొనాలని కోరారు. రైల్వే స్టేషన్ నుంచి పట్టణ పో లీస్ స్టేషన్ వరకు రన్ కొనసాగుతుందన్నారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల బృందం పర్యటన బీబీనగర్: ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల బృందం గురువారం బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించింది. పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ తీరుపై వారు అధ్యయనం చేశారు. వారికి జెడ్పీ సీఈఓ శోభారాణి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, పీఆర్ ఏఈ రాకేష్ పంచాయతీరాజ్ శాఖ పనితీరు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. అనంతరం జెడ్పీ సీఈఓతో కలిసి రుద్రవెళ్లి వద్దకు వెళ్లి మూసీలో లెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పరిశీలించారు. నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణంయాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధిలో గురువారం నిత్యారాధనలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఇక ఆలయ ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
వాగుల వద్దకు వెళ్లొద్దు : కలెక్టర్
భూదాన్పోచంపల్లి, బీబీనగర్ : వర్షాలు కురుస్తున్నందున వాగుల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు సూచించారు. బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద మూసీలో వరద ప్రవాహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం బీబీనగర్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ట్రక్ షీట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు జరగాలని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా భూదాన్పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మాయిశ్చర్ యంత్రం పనిచేయకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మిషన్ను మార్చాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్లు శ్యామ్ సుందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, పిలాయిపల్లి పీఏసీఎస్ సీఈఓ రెబ్బాస్ నర్సింహ తదితరులు ఉన్నారు. -
ఈఓ యూఎస్లో.. డిప్యూటీఈవో యూకేలో
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై పర్యవేక్షణ కొరవడింది. ఈఓ వెంకట్రావు నెలరోజులకు పైగా వ్యక్తిగత సెలవుపై అమెరికాకు వెళ్లారు. ఆయన లేనప్పుడు బాధ్యతలు చూడాల్సిన డిప్యూటీ ఈఓ లండన్, యూరప్ దేశాల్లో ఉన్నారు. ఇక ఇన్చార్జ్ ఈఓగా నియమితులైన రవినాయక్ సెప్టెంబర్ 24న బాధ్యతలు స్వీకరించారు. మొక్కుబడిగా రెండు, మూడుసార్లు విధులకు హాజరై.. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తులకు అందుబాటులో ఉండి, ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంటుంది. కానీ, ఉన్నతస్థాయి అధికారులు ఏ ఒక్కరూ లేకపోవడంతో ద్వితీయశ్రేణి, క్షేత్రస్థాయి సిబ్బందిదే ఇష్టారాజ్యంగా మారింది.ఉన్నతాధికారులంతా సెలవుల్లో..ఆలయ ఈఓ వెంకట్రావు ఆగస్టు 30వ తేదీన పదవీవిరమణ పొందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత పది రోజులు మాత్రమే విధులకు హాజరయ్యారు. సెప్టెంబర్ 25న వ్యక్తిగత సెలవులపై అమెరికాకు వెళ్లారు. ఆయన స్థానంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ రవినాయక్ (ఐఏఎస్) ఇన్చార్జ్ ఈఓగా గత నెల 24న బాధ్యతలు చేపట్టారు. సెలవులపై వెళ్లిన ఈఓ వెంకట్రావు ఇంకా రాకపోవడం.. ఇన్చార్జ్ ఈఓ సరిగా రాకపోవడంతో దేవస్థానం పాలన అస్తవ్యస్తంగా మారింది.డీఈఓ, అనువంశిక ధర్మకర్త సైతంఈఓ సెలవుపై వెళితే ఆ బాధ్యతలను డీఈఓ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్) చూసుకోవాలి. కానీ, డీఈఓ కూడా ఈఓ కంటే ముందుగానే యూకే, యూరప్ దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణం చేసేందుకు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అర్చకులతో కలిసి వెళ్లారు. పరిపాలన, పర్యవేక్షణ చేసేలా అధికారులు ఉన్నతస్థాయి వారు ఎవరూ లేకపోవడంతో భక్తులకు సమస్యలు ఎదురైనా పరిష్కరించేవారు లేకుండాపోయారు. ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ ఈఓ వచ్చినా..ఇన్చార్జ్ ఈఓగా నియమితులైన రవికుమార్ బాధ్యతలు ఈనెల 25వ తేదీతో ముగిశాయి. ఆ తర్వాత దేవాదాయశాఖ ఇన్చార్జ్ కమిషనర్ హరీశ్కు ఇన్చార్జ్ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఇటీవల దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు.చెక్పోస్టు వద్ద అక్రమాలుఅధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యాదగిరి క్షేత్రంలో అక్రమాలు పెరుగుతున్నాయి. యాదగిరికొండపైకి కార్లలో రావాలంటే మూడవ ఘాట్ రోడ్డు చెక్పోస్టులో రూ.500 రుసుము చెల్లించాలి. చెక్పోస్టు సిబ్బంది టికెట్ జారీ చేసిన తర్వాతనే కొండపైకి వాహనాలను అనుమతిస్తారు. వాహన నంబర్, రుసుము వివరాలు లేకుండానే ఖాళీ టికెట్లు జారీ చేస్తుండటం వెలుగుచూసింది. ఈ విషయంపై ఓ వాహనదారుడు ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మరికొందరు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించగా, వారు లేరని తెలిసి వెనుదిరిగారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
నాపై కాంగ్రెస్ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.పార్టీ మార్పుపై.. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే..
నల్గొండ జిల్లా: వారిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పన్నెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష(20) ప్రేమించుకున్నారు. మొదట్లో అనూష తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ నెల 17న గ్రామంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకన్నారు. నవీన్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. నవీన్, అనూష కలిసి బుధవారం బైక్పై గుర్రంపోడుకు వస్తున్నారు. అదే సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందిన రేపాక లచ్చయ్య బైక్పై తన పిల్లలకు తీసుకుని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాగు ప్రవాహాన్ని చూపించి మళ్లీ గుర్రంపోడు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నవీన్ సడన్ బ్రేక్ వేస్తూ లచ్చయ్య బైక్ను ఢీకొట్టి నల్లగొండ– దేవరకొండ రహదారిపై ఎడుమ వైపునకు పడిపోయాడు. బైక్పై వెనుక కూర్చున్న అనూష ఎగిరి బ్రిడ్జి రెయిలింగ్పై నుంచి వాగులోకి పడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఎవరో వాగులో పడినట్లు గుర్తించి వాగులోకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అర్ధగంట తర్వాత వాగు ప్రవాహం అంచున గుంతలో అనూష మృతదేహం లభ్యమైంది. తలకు తీవ్ర గాయమైన నవీన్ను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాలి్సన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే..అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బు«ధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్.యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..?ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలుఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఎంపిక
నల్లగొండ: దేశ రాజ ధాని ఢిల్లీలో గురువారం, శుక్రవారం జరగనున్న ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు నల్లగొండ పట్టణంలోని గొల్ల గూడ పీఏసీఎస్ ఎంపికై ంది. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు బుధవారం సీఈఓ కంచర్ల అనంతరెడ్డితో కలిసి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా నాగరత్నంరాజు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 5 సొసైటీలు ఎంపిక కాగా అందులో గొల్లగూడ సొసైటీ ఒకటని పేర్కొన్నారు. ఆత్మకూర్(ఎం) పీఏసీఎస్ కూడా.. ఆత్మకూరు(ఎం): ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్ కూడా ఎంపిక కాగా.. పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, సీఈఓ యాస కిరణ్ బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు రామన్నపేట: కుటుంబ సమస్యలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. బుధవారం రామన్నపేట ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన శివరాత్రి తేజ, అతడి భార్య శిరీష మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో శిరీష తరఫు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు తేజను మందలించారు. దీంతో ఈ నెల 25న తేజ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తేజ భార్య శిరీష రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జాతీయ రహదారిపై కెమికల్ ట్యాంకర్ బోల్తా
నకిరేకల్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం హైదరాబాద్ నుంచి కెమికల్ ట్యాంకర్ విజయవాడకు బయల్దేరింది. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా దాటిన వెంటనే ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్యాంకర్లోని కెమికల్ రోడ్డుపై పడి నురగలు రాటడంతో పాటు తెల్లని పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు, నకిరేకల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన పారిన కెమికల్ను నీటితో శుభ్రం చేశారు. అనంతరం పోలీసులు క్రేన్ల సహాయంలో ట్యాంకర్ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. -
కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని బుధవారం పోలీసులు కాపాడారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీరా మనగర్ కాలనీకి చెందిన పరసగాని శ్రీను మంగళవారం తెల్లవారుజామున చింతలపాలెం మండలం పాతవెల్లటూరు గ్రామ పరిధిలోని కృష్ణా నదిలోకి పడవలో చేపల వేటకు వెళ్లాడు. వేట మధ్యలో వర్షం పడుతుండగా పడవ ఇంజన్ రిపేరు వచ్చింది. దీంతో పడవను ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారింది. ఎలాగో అలా అతడు నది ఒడ్డుకు వెళ్లి రాత్రంతా వర్షంలో బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. బుధవారం ఉదయం శ్రీనుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. ఎటు వెళ్లాలో దారి తెలియక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులకు సమాచరం అందించగా.. వారు శ్రీను చిక్కున్న ప్రదేశానికి వెళ్లి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. సకాలంలో స్పందించి శ్రీనును కాపాడినందుకు చింతలపాలెం ఎస్ఐ సందీప్రెడ్డికి, బెల్లంకొండ పోలీసులకు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
రిటర్న్ గిఫ్ట్గా రాజ్యాంగం పుస్తకాలు
ఇబ్రహీంపట్నం రూరల్: తన కుమార్తె వివాహ వేడుకకు హాజరైన బంధువులు, అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఓ న్యాయవాది. వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరికి చెందిన విశాఖ మాధవ కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసముంటున్నారు. బుధవారం తన కుమార్తె ఆశృతరెడ్డి వివాహాన్ని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో పాటు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెళ్లికి హాజరైన వెయ్యి మందికి పైగా అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను అందజేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచె అయిలయ్య తదితరులు రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని వకీల్సాబ్ ఆలోచనను అభినందించారు. 45 గొర్రెల అపహరణభువనగిరి: భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో 45 గొర్రెలను మంగళశారం రార్రి దుండగులు అపహరించారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తి గ్రామానికి చెందిన మేడబోయిన బాలయ్య మంగళవారం సా యంత్రం గ్రామ సమీపంలోని తన వ్యవసాయ బావి వద్ద ఉన్న షెడ్డులోకి గొర్రెలను తోలాడు. రాత్రి 7.30 గంటలకు పాలు పిండుకుని ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు గొర్రెల షెడ్డు వద్దకు రాగా.. 45 గొర్రెలు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా గొర్రెలు కనిపించకపోవడంతో సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తులు గొర్రెలను అపహరించుకెళ్తున్నట్లు అందులో రికార్డయ్యింది. దీంతో బాధితుడు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు.మహిళపై దాడి కేసులో ఆరుగురికి జైలుశిక్ష రామన్నపేట: మహిళపై దాడిచేసి గాయపరిచిన కేసులో ఆరుగురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎస్. శిరీష బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఓ మహిళపై 2019వ సంవత్సరంలో విజయదశమి వేడుకల్లో అదే గ్రామానికి చెందిన కవాటి మహేష్, కవాటి నరేష్, కవాటి శివ, ఏనుగుల ఉప్పలయ్య, జక్కుల రామకృష్ణ, కవాటి సుదర్శన్ దాడి చేసి గాయపరిచారు. దీంతో సదరు మహిళ ఆరుగురిపై వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్ఐ పి. శివనాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి ఆరుగురిపై కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో ఆరుగురు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. -
యాదగిరి క్షేత్రానికి ‘మోంథా’ ఎఫెక్ట్
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మోంథా తుపాన్ కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బుధవారం స్వామివారి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు భక్తులు తక్కువగా కనిపించారు. ఆరు బ్యాచ్లుగా సత్యనారాయణస్వామి వ్రత పూజలను 114 జంటలు నిర్వహించాయి. వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.9,17,614 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. తుపాన్ కారణంగా తగ్గిన భక్తులు -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాల్సిన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే.. అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బుధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్. యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..? ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలు ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రసాదం మెయింటనెన్స్ మిషన్ల కాంట్రాక్టర్ వద్ద డబ్బులు డిమాండ్ రూ.1.90లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 9 నెలలు సస్పెండ్ అయ్యి.. ఏప్రిల్లోనే తిరిగి ఉద్యోగంలోకి.. -
అక్రమ దత్తత నుంచి శిశువులకు విముక్తి
నల్లగొండ: ఇద్దరు శిశువులను అక్రమంగా దత్తత తీసుకున్న వారి నుంచి పోలీసులు విడిపించి శిశుగృహకు తరలించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన కుర్ర బాబుకు 11 ఏళ్ల క్రితం పార్వతితో వివాహమైంది. వీరు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని బీటీఎస్లో నివాసముంటున్నారు. బాబు కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాబు, పార్వతి దంపతులకు మొదట కుమారుడు పుట్టి చనిపోగా.. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక పాప 2సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. 15 రోజుల క్రితం హాలియాలోని నిర్మలా ఆస్పత్రిలో పార్వతి మళ్లీ ఆడపిల్లకు జన్మించింది. కాగా.. ఆడపిల్లను పెంచి పోషించడం తనకు భారమవుతుందని అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న శాంతిప్రియ అనే డాక్టర్కు బాబు చెప్పాడు. దీంతో డాక్టర్ శాంతిప్రియ ఆ పాపను దత్తత ఇప్పించేందుకు తనకు తెలిసిన ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి, రజిత దంపతులకు చెప్పింది. సాంబమూర్తి, రజిత దంపతులు ఈ నెల 25న నల్లగొండకు వచ్చి సాయంత్రం 7గంటల సమయంలో నల్లగొండ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో బాబు, పార్వతి దంపతుల నుంచి రూ.2.30లక్షలకు పాపను దత్తత తీసుకుంటామని ఒప్పందం చేసుకుని రూ.10వేలు ఇచ్చారు. పాప హెల్త్ చెకప్ చేసిన తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తిచేసి మిగతా డబ్బులు ఇస్తామనే ఒప్పందంతో పాపను సాంబమూర్తి దంపతులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి నల్ల గొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు డాక్టర్ శాంతిప్రియను మంగళవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసి హాలియాలోని నిర్మల ఆస్పత్రిలో డాక్టర్గా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డాక్టర్ శాంతిప్రియ తమ బంధువు సరస్వతి ద్వారా ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్నారని తెలుసకుందని, కుర్ర బాబు దంపతులు కూడా తమకు పుట్టిన పాపను విక్రయిస్తామనడంతో సాంబమూర్తి దంపతులకు శాంతిప్రియ సమాచారం ఇచ్చిందని ఎస్పీ వివరించారు. ఈ కేసులో కుర్ర బాబుతో పాటు సాంబమూర్తి, ఆయన భార్య రజిత, డాక్టర్ శాంతిప్రియను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.21 రోజుల బాబును అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. భార్య సుజాత, పిల్లలకు దూరంగా ఉంటున్న ఓర్సు శ్రీను ఆరేళ్ల క్రితం మట్టి పని కోసం ఒరిస్సాకు వెళ్లి అక్కడ జంకర్మాల అలియాస్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప పుట్టింది. మమత రెండోసారి గర్భవతి కాగా.. రెండు నెలల క్రితం ఆమెతో కలిసి ఓర్సు శ్రీను స్వగ్రామానికి వచ్చాడు. అయితే కోనాయిగూడేనికే చెందిన వేముల నాగరాజు, సువర్ణను తమ దూరపు బంధువైన కనగల్ మండలం బోయినపల్లికి చెందిన శ్రీను రెండు నెలల క్రితం కలిసి పిల్లలు విక్రయించేవారుంటే చెప్పాలని కోరాడు. ఈ విషయాన్ని నాగరాజు, సువర్ణ కలిసి ఓర్సు శ్రీను, మమత దంపతులకు చెప్పారు. దీంతో ఓర్సు శ్రీను, మమత దంపతులు తమకు పుట్టబోయే బిడ్డను విక్రయించి తిరిగి ఒరిస్సా వెళ్లాలని నిర్ణయించుకుని అందుకు ఒప్పుకున్నారు. ఈ నెల 8న మమత మగ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్న ఓర్సు శ్రీను, మమత దంపతులు వేముల నాగరాజు, సువర్ణకు విషయం చెప్పారు. రూ.6లక్షలకు శిశువును విక్రయిస్తామని చెప్పడంతో మధ్యవర్తి అయిన శ్రీను, నాగరాజు, సువర్ణ ఈ నెల 10న ఈ నెల 10న రూ.4.50లక్షలకు ఒప్పందం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెల 15న డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లారు. ఈ ఘటనపై కూడా ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి మధ్యవర్తి శ్రీనుతో పాటు బాబును కొన్న వేముల నాగరాజు, సువర్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, బాలుడి తండ్రి ఓర్సు శ్రీను, మమత పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. పై రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, శిశువులను శిశుగృహకు అప్పగించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల, సీఐలు రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.మరో కేసులో ముగ్గురి అరెస్టు శిశుగృహకు అప్పగించిన పోలీసులు ఏడుగురి అరెస్టు వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
భువనగిరి గుండా వెళ్లే పలు రైళ్లు రద్దు
భువనగిరి: మోంథా తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం భువనగిరి రైల్వే స్టేషన్ గుండా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. సమచారం తెలుసుకుని ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రయాణికుల ఇబ్బందులు..బీబీనగర్ : రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీబీనగర్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు రైళ్లు రద్దయిన విషయం తెలుసుకుని వరంగల్–హైదరాబాద్ హైవేకు చేరుకొని బస్సులను ఆశ్రయించారు. తుపాన్ కారణంగా సికింద్రాబాద్–బీబీనగర్ రైల్వే మార్గం గుండా వెళ్లే భాగ్యనగర్, నారాయణాద్రి, విశాఖ, కాకతీయ నర్సాపూర్ ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు.రైళ్ల రాకపోకలు ఇలా..సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే రైలును అప్ అండ్ డౌన్లో రద్దు చేశారు. భాగ్యనగర్ రైలును, సికింద్రాబాద్ నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. కాకినాడ నుంచి వచ్చే రైలు యథావిధిగా నడుస్తోంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్కు వచ్చే అప్ అండ్ డౌన్ రైలును కాజీపేట మీదుగా కాకుండా దారి మళ్లించి గుంటూరు–నడికుడి మీదుగా.. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ రైలును ఖాజీపేట మీదుగా కాకుండా బీబీనగర్–నడికుడి మీదుగా నడిపిస్తున్నారు. కాకతీయ, పుష్పుల్ రైళ్లను యథావిఽధిగా నడిపిస్తున్నారు. -
చేలలో కన్నీళ్లు
ఇప్పటికే వరుస వానలతో కోలుకోలేని స్థితిలో ఉన్న రైతులను.. మోంథాన్ మరింత దెబ్బతీసింది. ముఖ్యంగా చేతికొచ్చిన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మూసీ ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టులోనూ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా చోట్ల వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కొందరు రైతులు అప్రమత్తమై ధాన్యంపై టార్పాలిన్లు కప్పి తడవకుండా కాపాడుకున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, పల్లపు ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తుండటంతో ధాన్యం రాశుల కిందకు నీరు చేరింది. నీటిని తొలగించేందుకు రైతులు అవస్థలు పడ్డారు.ఇక పత్తి రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కూలీల కొరత వల్ల ఏరకుండా చేలపైన ఉన్న పత్తి చాలా వరకు వర్షానికి నేలపాలైంది. కొంత రంగు మారినట్లు రైతులు వాపోయారు. పలుచోట్ల చేలలో నీరు నిలిచింది. వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
చౌటుప్పల్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. చౌటుప్పల్లోని ఊరచెరువును బుధవారం ఆయన సందర్శించారు. చెరువు అలుగు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలతో మాట్లాడి, వారికి సూచనలు చేశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, చెరువుల వద్ద అధికారులు గస్తీ నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే ప్రయాణాలు సాగించాలని, వాగుల్లోకి, చెరువుల వద్దకు వెళొద్దని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ శేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ వీరాభాయి, నీటిపారుదల శాఖ ఈఈ మనోహర్, డీఈ రాజవర్థన్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సీఐ మన్మథకుమార్, ఆర్ఐలు సుధాకర్రావు, బాణాల రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు మొగుదాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’
ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకునేందుకు ఎంపీడీఓలు జాబితా తయారు చేస్తారు. జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు పంపి అనుమతి తీసుకుంటారు. అనంతరం గృహనిర్మాణ శాఖ పీడీకి నివేదిస్తారు. ఇప్పటికే 972 మందిని లబ్ధిదారులను గుర్తించగా.. వారంతా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఆలేరురూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులను వినియోగించుకుంటున్నారు. రోజుకు రూ.370 చెల్లించి 90 రోజుల పాటు పనిదినాలు కల్పిస్తున్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సంకల్పించిన ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసకుంది. ఇప్పటికే 972 మంది లబ్ధిదారులను గుర్తించగా.. వారంతా పనుల్లో పాల్గొంటున్నారు. లబ్ధిదారులకు తొలగనున్న ఇబ్బందులు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ.3,500 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా లబ్ధిదారుల్లో చాలా మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ప్రారంభించిన చోట పనుల్లో పురోగతి లేదు. ప్రధానంగా కూలీల కొరత వెంటాడుతోంది. పనికి వచ్చిన కూలీలు రోజుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేశారు. అంత కూలి చెల్లించలేక లబ్ధిదారులు ఆర్థికంగా సతమతం అవుతున్నారు. ఫలితంగా ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. సమస్యను అధిగమించేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన వారికి 90 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించింది. రోజుకు రూ.307 చొప్పున కూలి చెల్లించనున్నారు. పనిదినాల విభజన ఇలా.. 90 పనిదినాల్లో.. బేస్మెంట్ లెవల్ వరకు 40, స్లాబ్ వరకు 50 రోజుల చొప్పున వినియోగించుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో పాల్గొనే లబ్ధిదారులకు వారం రోజుల్లో వారి ఖాతాలో వేతనం జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుసంధానం చేసిన లబ్ధిదారులు ఇతర పనులకు వెళ్లే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో ఎక్కువ మంది కూలీలకు పని లభించనుంది. ఈజీఎస్తో అనుసంధానం ఫ జాబ్కార్డు కలిగిన లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలు ఫ జిల్లాలో 972 మంది గుర్తింపు ఫ ఒక్కొక్కరికి రోజుకు రూ.307 వేతనం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉన్నవారిని 972 మందిని గుర్తించాం. వారికి 90 రోజల పనిదినాలు కల్పించి, రోజుకు రూ.307 వేతనం చెల్లిస్తాం. వారం రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలో వేతనం డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది –నాగిరెడ్డి డీఆర్డీఓ -
పుష్కరిణిని శుభ్రంగా ఉంచాలి
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆసక్తి చూపుతారని, వారికి శుభ్రమైన నీటిని అందించాలని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ శ్రీనివాసరాజు దేవస్థానం అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి వెళ్తూ యాదగిరికొండ దిగువన ఉన్న లక్ష్మీపుష్కరిణిని సందర్శించారు. పుష్కరిణిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని అధికారులను.. స్నానాలు ఆచరించే సమయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరిణిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని, నీరు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆయన వెంట అధికారులు వసంత్నాయక్, రామారావు తదితరులు ఉన్నారు.ఫ సీఎం సీఎస్ శ్రీనివాసరాజు -
నేడు పాఠశాలలకు సెలవు
భువనగిరి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించినట్లు డీఈఓ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, రవాణా వ్యవస్థకు ఆ టంకం ఏర్పడుతుందని, విద్యార్థులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ వెల్లడించారు. నేడు ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం జరగాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే గురువారం యథావిధిగా గ్రీవెన్స్ ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. స్లాట్ బుక్ చేయొద్దు రాజాపేట: పత్తి అమ్మకాల కోసం కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు వాటిని రద్దు చేసుకోవాలని రాజాపేట మండలం వ్యవసాయ అధికారి పద్మలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా మార్కెటింగ్ శాఖ, సీసీఐ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన తరువాత జిల్లా అధికారులు తదుపరి ప్రకటన చేస్తారని, అప్పటి వరకు స్లాట్ బుక్ చేసుకోవద్దని సూచించారు. ఆరెగూడెం పంచాయతీ రికార్డులు స్వాధీనం చౌటుప్పల్ రూరల్: మండలంలోని ఆరెగూడెం గ్రామ పంచాయతీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సురేష్, సిబ్బంది జి.శ్రీశైలం, కె.రత్నయ్య అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, గ్రామ సభల్లో తీర్మానాలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు పలువురు గత నెల 1న కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఎంపీఓ అంజిరెడ్డి బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం డీపీఓకు నివేదిక అందజేస్తామని ఎంపీఓ తెలిపారు. పథకాలపై అవగాహనభువనగిరిటౌన్ : బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతోపాటు, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ సుబ్బారావు పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యత, జన సురక్ష, పీఎం స్వనిధి పథకాలపై బుధవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో లీడ్ బ్యాంక్, మెప్మా సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళ ఆర్థిక అక్షరాస్యత సాధించాలన్నారు. అనంతరం డిజిటల్ మోసాల నియంత్రణపై అవగాహన కల్పించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ బాబు, మెప్మా కోఆర్డినేటర్ శ్యామల, కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ శాంతికుమార్, చీఫ్ మేనేజర్ మిథిన్రాజ్, మహిళా సంఘాల సభ్యులు, వీధి వ్యాపారులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం తేవాలి చౌటుప్పల్: స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని డీజీపీ శివధర్రెడ్డి సూ చించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లికి చెందిన ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లోని కార్యాలయంలో డీజీపీని కలిశారు. శాలువాతో సత్కరించారు. సన్మానపత్రం అందజేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆ యనకు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని డీసీపీ తమకు సూ చించినట్లు నిర్వాహకులు తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో ఎంవీ ఫౌండేషన్ చైర్మన్ ముటుకుల్లోజు వెంకటేశ్వరాచారి, ప్రతినిధులు గ్యార కృష్ణ, రాజుల ఆంజనేయులు ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ బొమ్మలరామారం : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మీక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్య తీసుకోవాలని, రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలని ఆదేశించారు. -
పోరాట స్ఫూర్తితో ముందుకెళ్దాం
భువనగిరిటౌన్ : సీపీఐది త్యాగాల చరిత్ర అని.. అనేక పోరాటాలు, ఉద్యమ నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచిందని పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. వందేళ్ల ఉత్సాహం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరిలోని సీపీఐ కార్యాలయంలో ఎండీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రో ద్యమంలో సీపీఐ ముందు నిలిచిందని, తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనన్నారు. ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ చారిత్రాక ఘట్టంగా మిగిలిపోనుందని, ప్రతి కార్యకర్త తరలిరావాలని కోరారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యా నాల దామోదర్ రెడ్డి, నాయకులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, గోద శ్రీరాములు, కొల్లూరి రాజయ్య, కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ బచ్చనగోని గాలయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి -
మూసీకి పోటెత్తిన వరద
భూదాన్పోచంపల్లి, వలిగొండ: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. దీంతో పాటు హైదరాబాద్లోని ఉస్మాన్సాగర్, హుసేన్సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ ఉరకలు వేస్తోంది. బుధవారం ఉదయం నుంచి భూదాన్పోచంపల్లి మండలం జూలూరు–రుద్రవెల్లి లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మూసీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ మార్గంలో భూదాన్పోచంపల్లి నుంచి బీబీనగర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీబీనగర్, భువనగిరికి వెళ్లడానికి వయా పెద్దరావులపల్లి, పిలాయిపల్లి, మక్తఅనంతారం మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. వాహనాలను దారి మళ్లించారు. -
పత్తికి ఆంధ్రా కూలీలు
ప్రస్తుతం ఇక్కడికి పత్తి తీసేందుకు మా ఇద్దరి పిల్లలతో కలిసి వచ్చాం. వారి చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తరువాత గుంటూరుకు మిర్చి ఏరేందుకు వెళ్తాం. మా రాష్ట్రంలో ప్రభుత్వం మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే పూట గడిచేది. వలస రాకుండా ఉంటే మా పిల్లలు చదువుకునేవారు. – బోయ చంద్ర, కూలీ, కర్నూలు మా ప్రాంతంలో వరి సాగు చేస్తున్నారు. కానీ అంతగా పనులు ఉండవు. తెలిసిన వారి వల్ల పత్తి పనుల కోసం ఇక్కడి వచ్చాను. కూలి బాగానే గిట్టుబాటు అవుతుంది. అక్కడ పనులు లేని సమయంలో ఇక్కడ పని దొరికినందుకు సంతోషంగా ఉంది. ఇటీవల వరుసగా వర్షం కురుస్తుడటంతో పనులు చేయలేకపోతున్నాం. – బాలయ్య, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ: గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కూలీలు పనుల కోసం ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆంధ్రా నుంచి కూలీలు తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారు. నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ మండలాల వ్యాప్తంగా రైతులు అధికశాతం పత్తి సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి పంట పాడవుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. దీనికి తోడు స్థానికంగా కూలీల కొరత ఏర్పడడంతో రైతులు తమ చేలల్లో పత్తి ఏరడానికి ఆంధ్రా నుంచి వేల సంఖ్యలో కూలీలను తీసుకువచ్చారు. ఎక్కువగా ప్రకాశం, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన కూలీలు పత్తి తీయడానికి పెద్దఎత్తున వచ్చారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాల, జొన్నారం, అబ్దుల్లాపూర్మెట్లతో పాటు దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చిన వారు పత్తితీత పనులు చేస్తున్నారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు పత్తి తీసేందుకు, వరి నాట్లు వేయడానికి ఇక్కడే ఉండనున్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను స్థానిక రైతులే చూస్తున్నారు. తమ చేలల్లోనే వారికి గుడారాలు ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు, సరుకులు అందిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే పని ప్రారంభం.. పెద్ద రైతులు ప్రకాశం, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు వచ్చేందుకు రవాణా ఖర్చులతో పాటు తీసుకొచ్చిన రైతులు ఉచిత నివాసం, వంట చేసుకోవడానికి అవసరమైన కట్టెలను అందజేస్తున్నారు. కూలీలు ఉదయం 6గంటల నుంచే పని ప్రారంభించి, సాయంత్రం వరకు పనిచేస్తున్నారు. మండలంలోని సర్వేల్, మల్లారెడ్డిగూడెం, గుజ్జ, కొత్తగూడెం, జనగాం, గొల్లగూడెం తదితర ప్రాంతాలలో వీళ్లు పనులు చేస్తున్నారు. మునుగోడు మండలంలోని మునుగోడు, కొంపల్లి, చీకటిమామిడి, పలివెలతో పాటు తదితర ప్రాంతాల్లో కూడా పత్తి తీసే పనులు చేస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలానికే సుమారు 2వేల మందికి పైగా ఆంధ్ర కూలీలు పత్తి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. మర్రిగూడ మండలంలోని సరంపేట, లెంకలపల్లి, దామెరభీమనపల్లి, ఇందుర్తి, కమ్మగూడ, వట్టిపల్లి, మర్రిగూడ గ్రామాల్లో రైతులు 90శాతం పత్తి సాగు చేయడంతో అధక సంఖ్యలో కూలీలను తీసుకువచ్చారు. ముందుగానే అడ్వాన్స్లు చేలల్లో పత్తిని తీసేందుకు రైతులు ఆంధ్రా నుంచి కూలీలకు అడ్వాన్స్ చెల్లించి మరీ తీసుకువస్తున్నారు. వారు ఉదయం లేచిన నాటి నుంచి సాయంత్రం వరకు 70 నుంచి 80కిలోల వరకు పత్తి ఏరుతున్నారు. కిలో పత్తికి రైతులు రూ.15 చెల్లిస్తుండడంతో ఒక్కో కూలీ రోజుకు రూ.1050 నుంచి రూ.1200వరకు సంపాదిస్తున్నాడు. తమ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని, తమ పిల్లల చదువులు కూడా వదిలేసి తమతోపాటే తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆంధ్రా ప్రాంతానికి చెందిన కూలీలు ఆందోళన చెందుతున్నారు. అయితే పత్తి తీసేందుకు అధిక సంఖ్యలో కూలీలు రావడంతో నెల రోజుల్లోనే పత్తి ఏరే పనులు పూర్తవుతాయని, తరువాత పనుల కోసం వెతుక్కోవాల్సి వస్తుందని స్థానిక కూలీలు పేర్కొంటున్నారు. ఆంధ్రా కూలీలే కాకుండా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కూలీలే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి ఆరుట్ల, మంచాల, లోయపల్లి, జొన్నారం, అబ్దుల్లాపూర్మెట్, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, వివిధ తండాల నుంచి గిరిజనులు పత్తి తీసేందుకు వస్తున్నారు. వీరికి రోజుకు రూ.400చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో పాటు రవాణా ఖర్చుల కింద రూ.50నుంచి రూ.60 వరకు చెల్లిస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన కొంత మంది కూలీలు కిలో పత్తి తీయడానికి రూ.12చొప్పున తీసుకుంటున్నారు. ఫ పత్తి ఏరేందుకు ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి కూలీలను పిలిపించిన రైతులు ఫ కేజీ, రోజు కూలీ చొప్పున డబ్బులు చెల్లింపులు ఫ తమ చేలల్లోనే గుడారాలు ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు సమకూరుస్తున్న రైతులు -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నెమ్మికల్ బాలుడికి చోటు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన వెల్గూరి రాజేష్, లిఖిత దంపతుల కుమారుడు అద్వైత్ (23 నెలలు) అతి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. అద్వైత్ చిన్నప్పటి నుంచి యాక్టివ్ గా ఉండడాన్ని గమనించిన తల్లి లిఖిత ప్రతిరోజు వివిధ రకాల అంశాలను చెబుతూ ఉండేది. ఈమేరకు అద్వైత్ 26 ఆంగ్ల వర్ణమాల పదాలు, 9 మంచి అలవాట్లు, ఐదు రకాల వాహనాలు, 9 మంది స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, 10 శరీర భాగాలు, 10 రకాల జంతువులు, 12 రకాల ఫలాలు, నాలుగు రకాల రంగులను అతి చిన్న వయసులోనే వివిధ కేటగిరీల్లో 10 అంశాలను గుర్తించినందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇటీవల ఆన్లైన్లో ప్రశంసా పత్రం, మెడల్ను ప్రకటించారు. ఉరేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్యకట్టంగూర్ : భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో చేనేత కార్మికుడు మద్యానికి బానిసయ్యాడు. మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాముల గ్రామానికి చెందిన సంగిశెట్టి శేఖర్(65) భార్య పద్మ రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తి రీత్యా అతడి కుమారులు నల్లగొండలోని ఆర్జాలబావి వద్ద మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శేఖర్ కుమారుల వద్దే ఉంటున్నాడు. 10 రోజుల క్రితం పింఛన్ డబ్బులు తీసుకువస్తానని కుమారులకు చెప్పి అయిటిపాములకు వెళ్లాడు. మంగళవారం గ్రామ శివారులోని శ్మశాన వాటికలో ఉన్న గదిలో లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదలనకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్కు మంగళవారం ఎగువ నుంచి 2,964 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలో ఉండటంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 2,815 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. -
ఆడపిల్ల భారమవుతోందని..
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : వారసుడు కావాలనే కోరిక వారితో ఏదైనా చేయిస్తుంది. ఎంతవరకై నా తీసుకెళ్తోంది. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రెండు కాదు, మూడు కాదు ఏకంగా నాలుగు, ఐదు సార్లు గర్భం దాల్చుతున్నారు. ఆ కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే సాకలేమనే కారణంతో కన్న పేగు బంధాన్ని మరచి విక్రయించడమో, శిశుగృహకు తరలించడమో చేస్తున్నారు. చివరికి బ్రూణహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో తిరుమలగిరి(సాగర్) మండలంలో చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. శిశువిక్రయాలపై అధికారులు పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి గిరిజనుల్లో ఏలాంటి మార్పు రావడం లేదనడాని చెప్పడానికి సోమవారం మండలంలో వెలుగులోకి వచ్చిన శిశు విక్రయం సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. అవగాహన మూణ్నాళ్ల ముచ్చటే శిశువిక్రయాలపై తండాల్లో అధికారులు గిరిజనులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పిస్తున్నా అది ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. గతకొన్ని నెలల క్రితమే మండలానికి చెందిన ఓ గిరిజన దంపతులు పుట్టిన బిడ్డను ఆస్పత్రిలో విక్రయించిన సంఘటన మరువకముందే సోమవారం మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మచ్చుకు ఒకటి రెండు సంఘటలు వెలుగులోకి వస్తున్నా తండాల్లో, గ్రామాల్లో ఆడపిల్లల విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయనే ఆరోపలు వినిపిస్తున్నాయి. గిరిజనులకు ఆడపిల్లలు భారం కాకుడదనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిపుత్రిక పేరుతో గిరిజన బాలికలకు రూ. లక్ష డిపాజిట్ చేస్తుంది. అలాగే బాలికల సంక్షేమానికి సుఖన్యయోజన అమలు చేస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గురుకుల, రెసిడెన్షియల్, కస్తూర్భాగాంధీ విద్యాలయాలతో పాటు సన్నబియ్యంతో నాన్యమైన భోజనం, కళ్యాణలక్ష్మీ పథకం, షీ టీమ్స్తో ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తున్నా గిరిజనుల్లో మార్పురాకపోవడం గమనార్హం. శిశు విక్రయాలకు పాల్పడే వారిపై జూనల్ జస్టిస్(జేజే) యాక్టు ద్వారా కేసు నమోదు చేస్తాం. శిశువిక్రయాలు, బ్రూణహత్యలు జరుగకుండా పోలీస్శాఖ నిఘా ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే సమాచారమివ్వాలి. అదేవిధంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. – వీరశేఖర్, ఎస్ఐ ఫ ఆడ శిశువులను విక్రయిస్తున్న కొందరు దంపతులు ఫ భ్రూణహత్యలకు సైతం వెనకాడని వైనంఫ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కనిపించని మార్పు తిరుమలగిరి(నాగార్జునసాగర్): శిశు విక్రయం కేసును తెలంగాణ లోకాయుక్త సుమోటాగా స్వీకరించింది. సాక్షి ప్రధాన సంచికలో మంగళవారం చెల్లిని ఇవ్వొద్దు.. శీర్షికన శిశువును అమ్మేసిన గిరిజన దంపతులు అనే కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త సుమోటాగా స్వీకరించి సీ్త్ర,శిశు సంక్షేమ, వికలాంగ, వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా అఽధికారులకు జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. మంత్రి సీతక్క ఆరా.. శిశు విక్రయం ఘటనపై మంత్రి సీతక్క ఆరా తీశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శిశువును వెంటనే సంరక్షణలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో నల్లగొండ నుంచి పోలీస్ బృందాలు వెళ్లి శిశువు సమాచారాన్ని తెలుసుకొని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. శిశువిక్రయాలపై అవగాహన కల్పించేందుకు శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు మొదటి కాన్పులో ఆగబిడ్డకు జన్మనిచ్చి రెండు, మూడో సారి గర్భందాల్చిన గర్భిణుల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తాం. ఓవైపు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. – కృష్ణవేణి, డీడబ్ల్యూఓ, నల్లగొండ -
అదృష్టం కలిసొచ్చినా ఆయుష్షు దక్కలేదు!
మాడుగులపల్లి: నల్లగొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రాలో అదృష్టం వరించినా.. కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆ వ్యక్తికి అదే రోజు ఆయుష్షు తీరింది. దీంతో మద్యం షాపు దక్కిన ఆనందంలో ఉండాల్సిన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. మాడుగులపల్లి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్ (38) తిప్పర్తి మండల కేంద్రంలోని రైస్ మిల్లులో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 21న పని నిమిత్తం నల్లగొండకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి పని ముగించుకుని తిరిగి వస్తున్నాడు. తిప్పర్తి మండలం మల్లెపల్లివారిగూడెం వద్దకు రాగానే ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అశోక్ మద్యం షాపుకై టెండర్ వేయగా ఇటీవల అధికారులు నిర్వహించిన లక్కీ డ్రాలో మాడ్గులపల్లిలోని షాపు దక్కించుకున్నాడు. ఆనందంలో ఉండాల్సిన కుటుంబసభ్యులు అశోక్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. ఫ లక్కీ డ్రాలో దక్కిన మద్యం షాపు.. అంతలోనే దూరమైన సంతోషం ఫ రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి -
కాపుగల్లులో ఆరు మేక పిల్లలు మృతి
కోదాడ రూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరు మేక పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మేకల కాపరి పిట్టల పుల్లయ్య సోమవారం రాత్రి తన మేక పిల్లలను దొడ్డిలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం దొడ్డి వద్దకు వచ్చి చూడగా కుక్కల దాడి చేయడంతో ఆరు మేక పిల్లలు మృతి చెంది ఉన్నాయి. తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. కుక్కల దాడిలో పలువురికి గాయాలు నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లిలో మంగళవారం ఉదయం కుక్కలు దాడి చేయడంతో సుమారు పది మంది గాయపడ్డారు. జ్యోతి, పద్మ, శివరాంకు తీవ్రగాయాలు కావడంతో నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కుక్కలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను గ్రామం నుంచి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ఆత్మకూరు(ఎం): ఇనుప పైప్ తొలగిస్తుండగా విద్యుత్తీగలు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూషి నర్సింహ– శోభ దంపతుల కుమారుడు బూషి గణేష్(23)కు ఏడాది క్రితం బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఇంటి వెనుక భాగంలో ఉన్న ఇనుప పైప్ను తొలగిస్తుండగా పైన 11 కేవీ విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గణేష్ అవివాహితుడు. మృతుడి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
పోచంపల్లి చేనేత వస్త్ర తయారీపై అధ్యయనం
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ, చేనేతపై అధ్యయనం చేయడానికి మంగళవారం యునైటెడ్ వే హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫెర్నాడ్ రికార్డ్స్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ప్రీలూమ్స్, మగ్గాలపై శిక్షణ పొందుతున్న 50 మంది ట్రైనీ కార్మికులు భూదాన్పోచంపల్లిని సందర్శించారు. చేనేత కళాకారులైన రాపోలు శ్రీను, చెరిపల్లి రాము, ఆడెపు ఆంజనేయులు, మంగళపల్లి శ్రీహరి గృహాలను సందర్శించి అక్కడ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, నూలు వడికే విధానం, చిటికి కట్టడం, ఆసుపై గ్రాఫ్ డిజైన్ వేయడం, రంగులద్దకం, మార్కెటింగ్ విధానాలు, చేనేతలో ఆధునిక పరికరాల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేశం తాను ఆసుయంత్రాన్ని రూపొందించడానికి కల్గిన ప్రేరణ, ఇబ్బందులు, సాధించిన విజయాలను ట్రైనీ కార్మికులకు వివరించారు. వీరి వెంట యునైటెడ్ వే హైదరాబాద్ ప్రతినిధులు దిలీప్కుమార్, కోమల్ ఉన్నారు. -
నిబంధనలు పాటించేనా!
కొత్త దుకాణాలైనా.. ● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పాతగుట్టకు వెళ్లే దారిలో ఉన్న రెండు వైన్స్ల వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఆలయానికి వెళ్లే భక్తులకు, వివిధ గ్రామాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శని, ఆదివారాల్లో ఇక్కడి ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉంటాయి. జనావాసాల్లోనే వైన్స్లు, పర్మిట్ రూమ్లు ఫ హైవేల వెంట బెల్టు షాపులు ఫ రోడ్లపైనే వాహనాల పార్కింగ్ తప్పని ట్రాఫిక్ సమస్యలు ఫ ఇబ్బందుల్లో మహిళలు, విద్యార్థులు ఫ ఇళ్ల మధ్యలోని మద్యం షాపులను మార్చాలంటున్న ప్రజలు సాక్షి, యాదాద్రి : నిబంధనలను అతిక్రమించి జనావాసాల్లో మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు వెలుస్తున్నాయి. బడి, గుడి సమీపాల్లోనూ బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీనికితోడు జాతీయ రహదారుల వెంట దాబాలు, కిరాణ దుకాణాల మాటున మద్యం విక్రయాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని పోలీస్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలనైనా జనావాసాల మధ్య, హైవేల వెంట ఏర్పాటు చేయొద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎకై ్సజ్ శాఖ పట్టించుకోదా.. మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఎకై ్సజ్ అధికారులు నిబంధనలను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నా యి. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, జాతీయ, రాష్ట్ర రహదారులు, జనావాస ప్రాంతాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, దేవాలయాలను విస్మరిస్తూ వైన్స్ల ఏర్పాటుకు అనుమతులిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కమర్షియల్ జోన్లో ఇవ్వాల్సిన అనుమతులు జనం నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఇస్తున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో జనావాసాలు, హైవేల వెంటే.. బొమ్మలరామారం మండలం గుడిబావి చౌరస్తా మూలమలుపులో వైన్స్ ఉండడం.. అక్కడ రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లి నుంచి రాయిపల్లి వరకు ప్రధాన స్టేజీల వెంట బెల్టు దుకాణాల్లో మద్యం అమ్ముతున్నారు. మోత్కూరు–రాయిగిరి రోడ్డు వెంట రహీంఖాన్ పేట, ఆత్మకూరు (ఎం), రాయిపల్లి స్టేజీల వద్ద బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. మోత్కూరులో చెరువు కట్ట వద్ద ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఉంది. దీన్ని తొలగించాలని గతేడాది కొందరు ఫిర్యాదులు చేశారు. అమ్మనబోలు రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద ఉన్న వైన్స్, భువనగిరి రోడ్డులో పూలే విగ్రహం వద్ద ఉన్న వైన్స్, సిట్టింగ్ ఉండడంతో రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ చేస్తున్నారు. చౌటుప్పల్లో ఆరు వైన్స్లు, మూడు బార్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారుల వెంట ఉండడంతో సర్వీస్ రోడ్లు పూర్తిగా ట్రాఫిక్తో స్తంభించిపోతున్నాయి. రామన్నపేటలో చిట్యాల రోడ్డు వెంట మూడు వైన్స్లు ఉన్నాయి. సాయంత్రం వేళలో జనం కిక్కిరిస్తుడడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అడ్డగూడూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్యం షాపులు ఉన్నాయి. కార్యాలయానికి వచ్చిన రైతులతోపాటు ఈ వైన్స్లకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. తుర్కపల్లి లో దుర్గమ్మ గుడి, బీసీ కాలనీ దగ్గర్లో వైన్స్లు ఉండడం వల్ల కాలనీవాసులకు ఇబ్బందులు పడుతున్నారు. ములకలపల్లి, రుస్తాపూర్లో బెల్ట్ షాపులు, రోడ్డు పక్కన హోటల్స్ ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. భువనగిరిలో కొత్త, పాత బస్టాండ్ల వద్ద ఉన్న వైన్స్లను తొలగించాలని స్థానికులు గతంలో ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదు. బీబీనగర్లో ఇళ్ల మధ్య వైన్స్, పర్మిట్ రూమ్లు ఉన్నాయి. భట్టుగూడెంలోని ఆలయాలకు సమీపంలో వైన్స్ ఉంది. కొండమడుగులోని ఇళ్ల మధ్య వైన్స్, పర్మిట్ రూమ్ ఉన్నాయి. పోచంపల్లిలో ఇళ్ల మధ్య మూడు వైన్స్లు, పర్మిట్రూమ్లు ఉండడంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలను ఊరికి దూరంగా తరలించాలని కోరుతూ సోమవారం వివిధ యువజన సంఘాల నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆలేరులో సిల్క్నగర్ వద్ద రోడ్డు వెంట వైన్స్, పర్మిట్ రూమ్ ఉన్నాయి. పట్టణంలోని రైల్వేగేట్, బస్టాండ్వద్ద ఉన్న వైన్స్లు, పర్మిట్ రూమ్లు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. -
అమరుల త్యాగాలు మరువలేనివి
భువనగిరిటౌన్ : పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి ఏఎస్పీ కె.రాహుల్రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అమరులైన పోలీసుల సేవలను కొనియాడారు. భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ ఎం.రమేష్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ ప్రభాకర్రెడ్డి, సీఐలు చంద్రబాబు, రమేష్ కుమార్, అర్జునయ్య, ఎస్ఐలు మధుసూదన్, లక్ష్మీనారాయణ, అనిల్కుమార్, లక్ష్మీనర్సయ్య, నరేష్, జయరాజు, శివశంకర్రెడ్డి, సంధ్య, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
చేలమీదే తడిసి ముద్దవుతున్న పత్తి
రామన్నపేట : మోంథా తుపాను పత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చిన పత్తిపంట కళ్లెదుటే తడిసి ముద్దవుతుండడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు చేల ఎదుగుదలపై ప్రభావం చూపగా సెప్టెంబర్తోపాటు ఈ నెలలో వరుసగా కురుస్తున్న వర్షాలు పత్తిచేలకు నష్టం కలిగిస్తున్నాయి. అధిక వర్షాలకు పత్తిచేలల్లో నీళ్లునిల్చి ఎర్రబారి తెగుళ్లబారిన పడుతున్నాయి. ప్రస్తుతం పత్తి తీసే సమయంలోనూ వర్షాలు కురుస్తుండడంతో పత్తి తడిసి రంగుమారుతోందని రైతులు వాపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో తడిసి రంగుమారిన పత్తిని గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. పత్తితీతకు ఆటంకాలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1.13 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగైంది. రైతులు ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టారు. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 15క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉండేది. కానీ, సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలకు సరైన పోషకాలు అందక ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దీంతో సరైన పూత పూయలేదు. కాత కాయలేదు. గతనెల, ఈనెలలో కురిసిన వానలకు పత్తిచేలలో నీరు నిలిచి తేమ ఎక్కువ కావడం వల్ల పూత, కాయలు రాలిపోయాయి. అధిక తేమవల్ల రసం పీల్చే పురుగులు, తెల్ల, పచ్చదోమ, ఎర్రనల్లి, ఆకుముడుత, పండాకు తెగుళ్లు పంటనాశించాయి. తెగుళ్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. అనేక సమస్యలను అధిగమించి మొదటి (మైల)పత్తి తీసిన రైతులు, నాణ్యమైన పత్తిని తీసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వరుసగా వానలు కురుస్తుండడంతో త్తితీతకు ఆటంకం కలుగుతోంది. చేలమీదనే పత్తి తడిసి జారిపోతుంది. చిరుజల్లులకు తడిసిన పత్తిని ఆరబెట్టడానికి రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ సారి ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి పెటుబడి ఖర్చులు మిగులుతాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ వరుస వర్షాలతో పత్తి రైతుల్లో తీవ్ర ఆందోళన ఫ పత్తితీతకూ ఆటంకంగా ముసురు ఫ రంగు మారుతున్న తెల్లబంగారం ఫ సీసీఐ కేంద్రాలు లేక వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయం ఫ పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆవేదనఈ చిత్రంలోని రైతు పేరు నడిగోటి సైదులు. ఈయనది రామన్నపేట మండలం జనంపల్లి గ్రామం. ఈ యేడు రెండున్నర ఎకరాల్లో పత్తిసాగు చేశాడు. దున్నకం, విత్తనాలు, ఎరువుల కోసం రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు రెండు క్వింటాళ్ల దిగుబడి రాగా క్వింటాకు రూ.6వేల చొప్పున అమ్మాడు. చేనును చీడపీడలు ఆశించి ఎండుబారింది. పూత కాయ రాలిపోవడం వల్ల మరో నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదని, చేతికష్టం అటుంచితే పెట్టుబడి మందం కూడా రాని పరిస్థితి నెలకొందని రైతు సైదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలోని పత్తిసాగు చేసిన ప్రతి రైతులు పరిస్థితి ఇలాగే ఉంది. పత్తిసాగు విస్తీర్ణం 1,13,193 ఎకరాలు దిగుబడి అంచనా 16 లక్షల క్వింటాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న దిగుబడి 11 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్ల లక్ష్యం 9 లక్షల క్వింటాళ్లు ఏర్పాటుకు నిర్ణయించిన సీసీఐ కేంద్రాలు 12 ఇప్పటి వరకు ప్రారంభించినవి 04 కొనుగోళ్లు మొదలైనవి 03 -
పత్తి రైతుల రాస్తారోకో
మోటకొండూర్: కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనా లని డిమాండ్ చేస్తూ మంగళవారం మోటకొండూ ర్ మండలం కాటేపల్లి గ్రామంలోని రాయిగిరి రో డ్డుపై పత్తి రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తేమ శాతం ఎక్కువ ఉందని కొనకుండా తిరస్కరించడం తగదన్నారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, డీఏఓ వెంకటరమణారెడ్డి, ఏఓ రమాదేవి రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. సాయంత్రం వరకు కొనుగో లు చేస్తామని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు బచ్చ శ్రీశైలం, రేగు ఇస్తారి, మంత్రి రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తాటి ఉత్పత్తులను ప్రోత్సహించాలి
చౌటుప్పల్: నీరా, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణంలో జరిగిన సంఘం జిల్లా మహాసభలో వారు మాట్లాడారు. గీత వృత్తిలో ఉన్న వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియా నిధులు విడుదల చేయాలని కోరారు. స్వదేశీ వస్తువులు వాడాలని చెబుతున్న కేంద్రం కల్లుగీత వృత్తిని కూడా ప్రోత్సహించాలన్నారు. నవంబర్ చివరిలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు రాగీరు కిష్టయ్య, మద్దెల రాజయ్య, దూపాటి వెంకటేశ్, బొలగాని జయరాములు, గాజులు ఆంజనేయులు, అశోక్, వెంకటేశ్, లక్ష్మయ్య, బాలరాజు, లింగయ్య, మల్లేశ్, శంకరయ్య, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ -
28 పాఠశాలలకు ఫైవ్స్టార్
భువనగిరి : స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరుతో ప్రోత్సహకాలు అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్వచ్ఛతలో ఆరు అంశాలకు సంబంధించి వాటి చిత్రాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 15 నాటికి ఆన్లైన్లో నమోదు చేశారు. నమోదు చేసిన వివరాల ఆధారంగా రేటింగ్స్ ప్రకటించారు. ఇందులో జిల్లాలోని 28 పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించకున్నాయి. 60 ప్రశ్నల ఆధారంగా.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్వచ్ఛతా కార్యక్రమాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ రేటింగ్ సమర్పించారు. నీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, చేతుల శుభ్రత, ప్రవర్తనా మార్పులు, విద్యార్థుల నడవడిక, మిషన్ లైప్ కార్యక్రమాల ఆరు అంశాలు, 60 ప్రశ్నల ఆధారంగా మార్కులు కేటాయించారు. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో చేసిన నమోదు ప్రకారం మొదటి కేటగిరీ కింద 1 నుంచి 8వ తరగతి వరకు, రెండో కేటగిరీ కింద 9 నుంచి 12వ తరగతి వరకు గల పాఠశాలలను తీసుకున్నారు. 819 పాఠశాలలకు వివిధ రేటింగ్స్ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయం రేటింగ్ కింద జిల్లాలో 819 ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేశారు. ఇందులో 28 పాఠశాలలకు 5 స్టార్, 352 పాఠశాలలకు 4 స్టార్, 383 పాఠశాలలకు 3 స్టార్, 50 పాఠశాలలకు 2 స్టార్, 6 పాఠశాలలకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. రేటింగ్ ప్రకటించిన పాఠశాలలను క్షేత్ర స్థాయిలో త్వరలో పరిశీలించనున్నారు. ఇందు కోసం ఈ నెల 27న 50 మంది కాంప్లెక్స్, సీనియర్ హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంపిక చేయబడిన పాఠశాలలో రాష్ట్ర స్థాయికి రూరల్ నుంచి 6, అర్బన్ నుంచి 2 పాఠశాలలను ఎంపిక చేసి వాటికి అవార్డులు ఇస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇతర జిల్లాల అధికారులు మదింపు చేసి ఆయా పాఠశాలలను పరిశీలన చేస్తారు. జాతీయస్థాయికి ఎంపికై తే రూ.లక్ష బహుమతి 5, 4 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలు సందర్శించి వాటిల్లోని స్వచ్ఛత కార్యక్రమాలు, విద్యార్థుల నమోదును పరిశీలిస్తాయి. 3 స్టార్ రేటింగ్ పొందిన వాటికి జిల్లా స్థాయి, 5 స్టార్ రేటింగ్ పొందిన వాటికి రాష్ట్ర స్థాయి, 5 స్టార్ రేటింగ్ పొందిన బడులకు జాతీయ స్థాయిలో ప్రోత్సహకాలు అందిస్తాయి. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదు బహుమతితో పాటు కేంద్రం పురస్కారం లభించనుంది. జిల్లా స్థాయిలో రేటింగ్ ప్రకటించిన పాఠశాలలను మూడు రోజుల్లో హెచ్ఎంలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇందు కోసం 50 మందికి శిక్షణ ఇచ్చాం. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలకు ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదు అందనుంది. – సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి ఫ స్వచ్ఛత కార్యక్రమాల ఆధారంగా ప్రకటించిన రేటింగ్ ఫ మరో 791 పాఠశాలలకు వివిధ గ్రేడ్లు ఫ ‘ఎస్హెచ్వీఆర్’లో భాగంగా ఎంపిక ఫ త్వరలోనే పరిశీలనకు ప్రధానోపాధ్యాయులు -
క్రమశిక్షణతో చదవాలి
భువనగిరి : విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. భువనగిరి పట్టణ శివారులోని కేజీబీవీని మంగళవారం రాత్రి ఆయన సందర్శించారు. కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యత గురించి విద్యార్థినులకు వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు. ఆలేరు సీహెచ్సీకి డెంటల్ సర్జన్ ఆలేరు: ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)కి ఎట్టకేలకు డెంటల్ సర్జన్ నియమించారు. ఈ సీహెచ్సీలో వైద్యుల కొరతపై ఈ నెల 6న సాక్షి దినపత్రికలో ‘వందల్లో రోగులు.. ఏడుగురే వైద్యులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ హనుమంతరావు చొరవతో డీసీహెచ్ ఇటీవల కాంట్రాక్ట్ పద్ధతిలో సీహెచ్సీకి డెంటల్ సర్జన్గా భువనగిరికి చెందిన డాక్టర్ బి.గాంధీని నియమించారు. ఆయన వారం రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే దాదాపు ఏడాదిన్నరగా డెంటల్ సర్జన్ లేకపోవడంతో ఆలేరు సీహెచ్సీకి వచ్చే రోగులు భువనగిరి, జనగాం ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా ఆలేరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ వ్యయప్రయాసలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చొరవతో డెంటల్ సర్జన్ నియామకంతో దంత రోగుల కష్టాలు తీరుతున్నాయి. అయితే ఆలేరు సీహెచ్సీలో త్వరలో రూట్ కెనాల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని డెంటర్ సర్జన్ డాక్టర్ గాంధీ తె లిపారు. మెనూ ప్రకారం భోజనం అందించాలిచౌటుప్పల్ రూరల్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. చౌటుప్పల్ మండలం తుప్రాన్పేటలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలతోపాటు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె మంగళవారం సందర్శించి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో పూర్తిచేసేలా అధికారులు దృష్టిసారించాలన్నారు. ఆమె వెంట చౌటుప్పల్ ఎంపీడీఓ సందీప్కుమార్, పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్ ఉన్నారు. ఎమ్మెల్యే ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుయాదగిరిగుట్ట: అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య చేసిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సీఐ భాస్కర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై వస్తున్న అక్రమ ఆస్తుల ఆరోపణలపై ప్రజల నుంచి దృష్టిని మళ్లించేందుకే ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్రావుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్గౌడ్, నరహరి, తోటకూరి బీరయ్య, పేరబోయిన సత్యనారాయణ, కొన్యా ల నరసింహారెడ్డి, దేవపూజ అశోక్, కవిడే మహేందర్, ఆరె శ్రీధర్గౌడ్, పబ్బాల సాయి, అంకం నర్సింహ, యాకూబ్ పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు
రామన్నపేట : విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను ఉపేక్షించబోమని కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, వసతులపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఫార్మసీ సేవలతోపాటు రికార్డులు, ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న ఆయుర్వేదిక్ వైద్యాలయాన్ని సందర్శించారు. విధులకు గైర్హాజరైన వైద్యాధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రామన్నపేట వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేందాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల విన్నపం మేరకు షెడ్లపై నుంచి ప్లాట్పామ్పై నీరు పడకుండా డోర్లు బిగించాలని, గుంతల్లో మట్టినింపాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. పొడవైన స్తంభాలను అమర్చి విద్యుత్తీగల ఎత్తు పెంచాలని ట్రాన్స్కో ఎస్ఈని ఆదేశించారు. తేమ ఎక్కువగా చూపిస్తున్న మాయిశ్చర్ మిషన్ను సీజ్ చేశారు. రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఆయనవెంట డీసీహెచ్ఎస్ చిన్నానాయక్, తహసీల్దార్ సి.లాల్బహదూర్శాస్త్రి, ఎంపీడీఓ ఎ.రాములు, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సీసీ నర్సింహ తదితరులు ఉన్నారు. కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక రామన్నపేట ఏరియా ఆసుపత్రి తనిఖీ విధులకు గైర్హాజరైన వైద్యుల సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
సాక్షి, యాదాద్రి : రైతుల పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు, అలాగే పత్తి కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలపై సోమవారం భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటావేసి మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్ష సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఏసీపీ రాహుల్రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, డీఎస్ఓ రోజారాణి, డీఏఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించాలిరాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
లకీ్కగా వరించిన కికు్క
భువనగిరి : కొత్త మద్యం దుకాణాలకు టెండర్ల వేసిన దరఖాస్తుదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 82 మద్యం షాపులకు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించగా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేలా ట్రాఫిక్ సమస్యతోపాటు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెండర్ల కోసం దరఖాస్తు వేసిన వారిని మాత్రమే ఫంక్షన్ హాల్లోకి అనుమతించారు. దీంతో ఫంపక్షన్ హాల్ దరఖాస్తులదారులతో నిండిపోయింది. లాటరీ పద్ధతిలో షాపుకు ఎంపికై న వారు కేరింతలు చేస్తుంటే ఎంపిక కానివారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారి విష్ణుమూర్తి, ఏసీపీ రాహుల్రెడ్డి, రూరల్ సీఐ చంద్రబాబు, ఎకై ్సజ్ శాఖ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లక్కీ లాటరీలో విశేషాలు..● చౌటుప్పల్ మండలం ఎల్లంబావి మద్యం షాపునకు అత్యధికంగా 91 దరఖాస్తులు రాగా ఈ షాపు వలిగొండకు చెందిన పోలు అండాలుకు లాటరీ ద్వారా లక్కు దక్కింది. అలాగే 83 దరఖాస్తులతో రెండో స్థానంలో ఉన్న అరూర్ మద్యం షాపు వలిగొండలోని బీసీ కాలనీకి చెందిన మైసోళ్ల ప్రవీణ్కు దక్కింది. ఇతడు ఈ షాపుకు ఒకటే దరఖాస్తు వేయడం ఎంపిక కావడం విశేషం. ● ఈ సారి మద్యం షాపుల ఎంపిక 22 మంది మహిళలకు అదృష్టం వరించింది. ఇందులో యువతులు సైతం ఉన్నారు. సెంటిమెంట్ పనిచేస్తుందని చాలా వరకు వ్యాపారులు మహిళలు, యువతుల పేరు మీదగా దరఖాస్తులు వేశారు. ● మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూర్ ఎస్హెచ్ఓ క్రమంలో ఎంపిక చేశారు. ఆయా ఎస్హెచ్ఓ పరిధిలో ఉన్న షాపులకు 15 నంబర్ గల వారికి ఎక్కువగా షాపులు దక్కాయి. ● మద్యం షాపులను దక్కించుకునేందుకు ఎక్కువగా 10 నుంచి 20 మంది వ్యాపారుల వరకు సిండికేట్గా మారి టెండర్లు వేశారు. ప్రతి సిండికేట్ గ్రూపునకు 3 నుంచి 6 వరకు షాపులు దక్కాయి. ● ఈ సారి పాత వ్యాపారుల కంటే కొత్త దరఖాస్తుదారులకు ఎక్కువగా షాపులు దక్కాయి. ● లక్కీ డ్రాలో భార్యభర్తలకు ఆత్మకూర్(ఎం)లో ఒకరికి, మోత్కూరులో మరొకరి షాపులు దక్కడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ● మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30వరకు నిర్వహించుకోనున్నారు. ప్రశాంతంగా మద్యం షాపుల లక్కీ డ్రా రెండు గంటల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో దుకాణాలు కేటాయింపు -
31న యువజనోత్సవాలు
భువనగిరి : ఈ నెల 31న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కె.ధనుంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదరగిరిగుట్టలోని స్కిల్ డవెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు డిక్లమేషన్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. నవంబర్ 4న ఉదయం 9 గంటలకు భువనగిరి కోట వద్ద ఫోక్ డ్యాన్స్, ఫోక్సాంగ్ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 15 సంవత్సరాల వయస్సు పైబడి 29 సంవత్సరాలలోపు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ :8309992451, 8374333378 నంబర్లను సంప్రదించాలని కోరారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కేసులురాజాపేట : నాణ్యత లోపించిన, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా కేసులు తప్పవని జిల్లా తూనికలు, కొలతల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం రాజాపేట మండల కేంద్రంలోని కిరాణం షాపులు, జ్యూవెలరీ, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న ఆహార పదార్థాల గడువు, కంపెనీల వివరాలు, తూకం వేసే మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు దాటిన వస్తువులు, గుర్తింపులేని కంపెనీల పదార్ధాలను విక్రయించొద్దన్నారు. ఆయన వెంట సిబ్బంది, ఆయా షాపుల యజమానులు ఉన్నారు. ముగిసిన తిరునక్షత్ర వేడుకలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలు సోమవారం ముగిశాయి. గత రెండు రోజులుగా ఆలయంలో మహాముని తిరునక్షత్ర వేడుకలు కొనసాగాయి. సాయంత్రం వేళ శ్రీస్వామి వారి సేవతో పాటు ఆళ్వారుల సేవను ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. తిరువీధిలో పురఫ్పాట్ సేవను ఊరేగిస్తూ, ప్రబంధ పాశురాలను ఆలయ పారాయణీకులు, అర్చకులు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. శివకేశవులకు విశేష పూజలు యాదగిరిగుట్ట : శివ కేశవులు కొలువున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివుడికి, స్పటిక లింగానికి పూజారులు రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి భువనగిరి : జిల్లా స్థాయిలో 5, 4 స్టార్ పొందిన పాఠశాలలను భౌతికంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. సోమవారం రాయగిరి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్, సీనియర్ ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఎంపిక చేసిన పాఠశాలల్లో పక్కాగా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ అండాలు, శిక్షకులు శ్రీనివాస్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
● పోలీస్ అమరులను స్మరించుకుంటూ..
హామీలన్నీ అమలు చేస్తాంమోటకొండూర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నూతన తహసీల్థార్, ఎంపీడీఓ కార్యాలయాల భవన నిర్మాణాలకు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రూ.10 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో పాటు రూ.250 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు కూడా మంజూరు చేయించామన్నారు. ప్రజాపాలనలో భాగంగా పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సాకారం చేస్తున్నామన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం, మహిళకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు వడ్డీలేని రూణాలు అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భవిష్యత్లో మంత్రిగా ఎదగాలంటే ఇక్కడి ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి కేసీఆర్ ఆండ్ కో మాత్రం రూ.లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. మోటకొండూర్ మండల కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయటం ఇందుకు నిదర్శనమన్నారు. రెండేళ్లలో ఎంతో అభివృద్ధి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో రూ.10 కోట్ల వ్యయంతో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోపు మార్కెట్ యార్డు, పీఏసీఎస్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ నూతన భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఝెల్లంల సంజీవరెడ్డి, బీర్ల శంకర్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఆలేరు, మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు ఐనాల చైతన్య మహేందర్రెడ్డి, విమల వెంకటేష్, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, పచ్చిమట్ల మదార్గౌడ్, కొంతం మోహన్రెడ్డి, గంగపురం మల్లేష్, నెమ్మాణి సుబ్రమణ్యం, భాస్కరుణి రఘునాథరాజు, సిరబోయిన మల్లేష్ యాదవ్, తండ పాండురంగయ్య గౌడ్, భూమండ్ల శ్రీనివాస్, బాల్ధ రామకృష్ణ, ఆరె ప్రశాంత్గౌడ్, గుండ్లపల్లి భరత్, బి.అశోక్, పి.కార్తీక్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మోటకొండూరులో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి భూమిపూజ -
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ మల్లెతోట సమీపంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారనే విస్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. పున్రెడ్డి కార్తీక్రెడ్డి, గొర్రెల సాయిశ్రీరామ్, బంటు నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. వారికి టీహెచ్సీ కిట్లతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని ఎస్ఐ తెలిపారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్లు పేర్కొన్నారు. కల్వర్టుపై వరద నీటిలో అదుపుతప్పిన కారు పెద్దవూర: కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిలో కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలంలోని తుంగతూర్తి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతూర్తి గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు బంధువులు కారులో వచ్చారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొంచెం లోతులోనే నీరు ప్రవహిస్తుందని తప్పుగా అంచనా వేసిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కల్వర్టు సగానికి పోగానే వరద ప్రవాహానికి కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. గమనించిన గ్రామస్తులు కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. పది మందికి పైగా ప్రయత్నించినా కల్వర్టు కింది నుంచి కారును పైకి తీసుకురాలేకపోయారు. దీంతో ట్రాక్టర్కు తాళ్లను బిగించి అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. -
స్కాన్ చేస్తే పాఠాలు
రామగిరి(నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు సాంకేతికతను వినియోగించి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో దీక్ష(డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) యాప్ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు రోజువారీ పాఠాలు వినేలా ఈ యాప్ను రూపొందించారు. ఇదొక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఏదైనా కారణాల చేత విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు అయితే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినే అవకాశం ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా దీక్ష యాప్ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పాఠ్యపుస్తకంపై ఉన్నక్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠాలు వినవచ్చు. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ వంటి ప్రముఖ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఫ దీక్ష యాప్లో పాఠశాల సిలబస్ ఫ ప్రతి పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఫ సులభంగా అర్ధమయ్యేలా రూపకల్పన -
అందుబాటులోకి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రి కోసం 2009లో నిర్మించిన భవనంలో కొనసాగుతూ వచ్చిన కార్యకలాపాల విభాగాలను నూతన భవనం నుంచి కొనసాగిస్తున్నారు. నూతన భవనాన్ని అధునాతనంగా నిర్మించడంతో లోపలి భాగం అద్దాల మేడలా దర్శనమిస్తోంది. భవనం ముందు గ్రీనరీ, విద్యుత్ దీపాల ఏర్పాటు, ఎంట్రెన్సీ పనులను చేపడుతున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ భవనం ఆకట్టుకుంటోంది. -
ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ద్వితీయ స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ పోటీల రాష్ట్ర పరిశీలకుడు ప్రసాద్, కళాశాల పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు అంజనేయులు, నర్సింహ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఫ ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్లు ఫ జాతీయ స్థాయి పోటీలకు 15 మంది ఎంపిక -
త్రిఫ్ట్ డబ్బులేవీ..!
భూదాన్పోచంపల్లి: చేనేత కార్మికులకు నాలుగు నెలలుగా త్రిఫ్ట్ (పొదుపు పథకం) డబ్బులు రావడంలేదు. ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి త్రిఫ్ట్ (పొదుపు పథకాన్ని) అమలు చేస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉన్న మండలాలు, గ్రామాలలో అధికారులు సమావేశాలు నిర్వహించి త్రిఫ్ట్ పథకంపై అవగాహన కల్పిస్తూ కార్మికుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,790 మంది మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు త్రిఫ్ట్ పథకంలో చేరారు. అమలు ఇలా.. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులు తమ వేతనం నుంచి 8 శాతం వాటాను రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) అకౌంట్–1లో జమ చేస్తే ప్రభుత్వం ఆ మొత్తానికి రెండింతలు అనగా 16 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఆర్డీ అకౌంట్–2లో కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది. కార్మికుడు పనిచేసిన నెల వేతనం నుంచి గరిష్టంగా రూ.12వేలు, అనుబంధ కార్మికుడైతే రూ.800 బ్యాంకులో జమచేసుకోవచ్చు. రెండేళ్ల మెచ్యూరిటీ అనంతరం జమ అయిన మొత్తాన్ని కార్మికుడు డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మర మగ్గాలకు కూడా కార్మికులు గరిష్టంగా నెలకు రూ.1000, అనుబంధ కార్మికుడు రూ.600 జమచేస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో ఆర్డీ–2 అకౌంట్లో జమ చేస్తుంది. ఒక్క నెల మాత్రమే జమ.. త్రిఫ్ట్ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులు ఆయా బ్యాంకుల్లో ఆర్డీ–1 అకౌంట్లు తెరిచి నెలనెలా వస్తున్న ఆదాయం నుంచి తమ వాటా కింద రూ.1.85 కోట్లు జమ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తమ వాటా కింద రెండింతలు అనగా రూ.2.17 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం మే నెల మాత్రమే తమ వాటా జమ చేసింది. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలుగా అకౌంట్లో డబ్బులు జమ చేయడంలేదు. ఫ నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి జమకాని డబ్బులు ఫ నెలనెలా డబ్బులు జమ చేయాలని కోరుతున్న చేనేత కార్మికులు -
అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. అక్కడి జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు మృతురాలి ఆధార్ కార్డు, తండ్రి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంట్ జిరాక్స్లను తీసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువులకు మృతదేహం అప్పగించినట్లు చెప్పారు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని వస్తాకొండూర్ తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 2 గంటల సమయంలో మృతదేహం గ్రామానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనూషారెడ్డి కుటుంబానికి పరామర్శ అనూషారెడ్డి కుటుంబాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆదివారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతిసంస్థాన్ నారాయణపురం: తల్లి కళ్ల ముందే కుమారుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జ గ్రామానికి చెందిన చెన్నోజు రామాచారి(26) హైదరాబాద్లో అద్దెకు ఉంటూ చిన్న చిన్న కంప్యూటర్ పనులు చేస్తూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గుజ్జ గ్రామంలో నెల రోజుల క్రితం తన ఇంటికి మర్మమతులు చేపట్టారు. శనివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన రామాచారి కొత్తగా కొనుగోలు చేసిన మోటారును ఆదివారం ఫిట్టింగ్ చేసి గోడలకు నీళ్లు కొట్టాడు. ఈ క్రమంలో రామాచారి పూర్తిగా తడిసిపోయాడు. గోడలకు నీళ్లు కొట్టడం పూర్తికావడంతో తల్లి చంద్రకళను మోటారు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు. ఈ క్రమంలో మోటారు దగ్గర ఉన్న వైరు ప్లగ్ తీస్తుండగా.. రామాచారి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చంద్రకళకు కూడా ఎర్తింగ్ రావడంతో ఆమె కర్ర తీసుకొని రామాచారి చేతిలోని వైరును తొలగించి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్ల వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ తెలిపారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరిణులున్నారు. -
రామ్మూర్తి యాదవ్తో అనుబంధం మరువలేనిది
త్రిపురారం: చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్తో తన అనుబంధం మరువలేనిదని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాన్ని ఆదివారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కెతావత్ శంకర్నాయక్, రామ్మూర్తి యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్లకంటిగూడెంలో ఉన్న ఎల్–10 లిప్టు ఇరిగేషన్కు రామ్మూర్తి యాదవ్ పేరు పెడుతున్నట్లు గ్రామస్తుల సమక్షంలో జానారెడ్డి ప్రకటించారు. వరద కాల్వకు కూడా రామ్మూర్తి యాదవ్ పేరు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే జైవీర్రెడ్డి మాట్లాడుతూ.. రామ్మూర్తి యాదవ్ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. గుండెబోయిన కోటేష్ యాదవ్, గుండెబోయిన నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి, మండల అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సోమయ్య, బహునూతుల నరేందర్, మర్ల చంద్రారెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్, గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల వెంకట్రెడ్డి, బహునూతుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అంబటి రాము, నాయిని సంతోష్కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి యాదవ్ సేవలు మరువలేనివి చలకుర్తి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్యాదవ్ అన్నారు. పెద్దదేవులపల్లి గ్రామంలో రామ్మూర్తి యాదవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరై నివాళులర్పించారు. వారి వెంట ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల శ్యాంసుందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి -
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది
నల్లగొండ: రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చైతన్యం లేకనే అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. టీఆర్ఎల్డీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఆదివారం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా క్లాక్టవర్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 98శాతం బడుగు వర్గాలే ప్రాణాలు వదిలారన్నారు. అయినా బహుజన తెలంగాణ రాలేదన్నారు. హరీష్రావు, సంతోష్రావు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించారని కల్వకుంట్ల కవిత ఆరోపించిందని గుర్తుచేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆయనకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి బీఫారం లభించని వారు తనను సంప్రదిస్తే టీఆర్ఎల్డీ పార్టీ నుంచి బీఫారంలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు ముద్దము మల్లేష్, బండిపాడు జానయ్య, నర్సింగ్ రావు, సుధాకర్, బీరప్ప, కోరే సాయిరాం పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వాహనాల బారులుచౌటుప్పల్ : 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్తో పాటు పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండడంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలో వాహనాలు బారులుదీరాయి. రద్దీ కారణంగా చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా జంక్షన్ను పోలీసులు మూసివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆర్టీసీ బస్స్టేషన్, వలిగొండ క్రాస్రోడ్డుల మీదుగా రాకపోకలు కొనసాగించాల్సి వచ్చింది. వాహనాల రద్దీకి వారాంతపు సంత జనం సైతం తోడుకావడంతో మరింత గజిబిజి ఏర్పడింది. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం భువనగిరి వైపు, సాయంత్రం హైదరాబాద్ వైపు వాహనాలు బారులుదీరాయి. ఫ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ -
నిరుపేదల కళ్లలో వెలుగులు
రామన్నపేట: తల్లితండ్రులను స్ఫూర్తిగా తీసుకొని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి పూనుకున్నారు.. మునిపంపులకు చెందిన ఎన్నారై దేవిరెడ్డి పద్మా వీరేందర్రెడ్డి దంపతులు. స్వగ్రామంతో 14 పరిసర గ్రామాల ప్రజల కోసం మునిపంపులలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్సలు చేసి వారికి వెలుగులు పంచుతున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో సామాజిక సేవ దేవిరెడ్డి రామిరెడ్డి 25 ఏళ్లు మునిపంపుల సర్పంచ్గా పనిచేశారు. ఆయన సతీమణి సావిత్రమ్మ కూడా ఏడేళ్లు సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్దికి పాటుపడ్డారు. 80 పదుల వయసులోనూ సావిత్రమ్మ ఇప్పటికీ గ్రామాభివృద్ధికి, పేదవారి బాగోగుల కోసం తాపత్రయ పడుతుంది. వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్రెడ్డి అమెరికాలో స్థిరపడ్డాడు. తల్లిచేతుల మీదుగా పేదలకు, అపన్నులకు సహాయం అంద జేస్తున్నారు. కంటిపొర చికిత్స శిబిరానికి భారీ స్పందనకొద్ది రోజుల క్రితం ఊరికి వచ్చిన వీరేందర్రెడ్డి–పద్మ దంపతులు ఉచిత కంటిపొర చికిత్స శిబిరం నిర్వహించాలని సంకల్పించారు. తల్లి సావిత్రమ్మతో తమ అభిప్రాయాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు 50 మందికి వలంటీర్లుగా ఏర్పడి తో డ్పాటునందించారు. వైద్యశిబిరం ఏర్పాటుపై 14 గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామాల వారీగా తేదీలు నిర్ణయించి టోకెన్లు జారీ చేశారు. ఈనెల 22న నకి రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ హను మంతరావు చేతుల మీదుగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. హెదరాబాద్ శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఐదు రోజుల్లో 1,200 మందికి నేత్ర పరీక్షల చేసి 914మందికి ఉచితంగా కళ్ల దాలు పంపిణీ చేశారు. 60మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించి.. ఆదివారం మొబైల్ థియేటర్లో 24మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ వైద్యశిబిరం ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఫ ఎన్ఆర్ఐ చొరవతో మునిపంపులలో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం ఫ ఇళ్ల వద్దకు వెళ్లి ఆపరేషన్లు, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ ఫ శంకర్ నేత్రాలయం వారి మొబైల్ థియేటర్లో 1,200 మందికి చికిత్స -
పత్తి రైతుకు కపాస్ కష్టాలు
అడ్డగూడూరు: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకువచ్చిన నూతన నిబంధనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దళారుల ప్రమేయాన్ని నివారించేందుకు కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తెచ్చింది. సీసీఐలో పత్తి అమ్మాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్పై రైతులకు వారం రోజులుగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దళారులకు చెక్ పెట్టడానికి, కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి రైతులు నిరీక్షించకుండా ఉండేందుకు కొత్త విధానం బాగానే ఉన్నప్పటికీ రైతుల్లో అయోమయం నెలకొంది. ప్రధాన సమస్యలివీ.. పత్తి సాగు చేసిన రైతుల్లో అధికంగా నిరక్షరాస్యులే ఉన్నారు. వీరిలో చాలా మందికి స్మార్ట్ఫోన్లు లేవు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న రైతులకు వాటి వినియోగంపై సరైన అవగాహన లేదు. దీంతో యాప్ను ఫోన్లో డౌన్లోడ్, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఇతరులపై రైతులు ఆధారపడాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ ద్వారా స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్లినా వారు సమయానికి అందుబాటులో ఉండటం లేదని రైతులు అంటున్నారు.మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా రావడం లేదని రైతులు అంటున్నారు. ఫోన్లలో ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని సిగ్నల్స్ అందే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇన్ని గందరగోళ పరిస్థితుల్లో రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే అవకాశాలున్నాయి. కొనుగోళ్లకు ఏర్పాట్లు పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జిన్నింగ్ మిల్లులను అలాడ్ చేయగా.. సోమవారం (నేడు) నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుంది. జిల్లాలో 65,198 మంది రైతులు 1,27,06 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 6 నుంచి 8లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.8,110, 12 శాతం ఉన్న ఉన్న పత్తికి క్వింటాకు రూ.7,785 మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చిన సీసీఐ ఫ యాప్లో స్లాట్ బుక్ చేస్తేనే కొనుగోళ్లు ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు ఫ నిరక్షరాస్యత, స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, సిగ్నల్స్ అందక కర్షకుల ఇబ్బందులు ఫ మరొకరిపై ఆధారపడాల్సిన దైన్యం ఫ నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పత్తి విక్రయించే రైతుల కోసం సీసీఐ హెల్ప్లైన్ 8978978517, టోల్ఫ్రీ 8005995779 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్ల ద్వారా సీసీఐ కేంద్రాల వివరాలు, స్లాట్ బుకింగ్ తేదీ, తక్ పట్టి, చెల్లింపులు తదితర అంశాలను రైతులు తెలుసుకునేందుకు వీలుంటుంది. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం. సోమవారం నుంచి కపాస్ కిసాన్ యాప్ అందుబాటులో వస్తుంది. సీసీఐకి పత్తి విక్రయించే రైతులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలి. నూతన విధానంతో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐకి పత్తి అమ్ముకోవచ్చు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి. –వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీమణవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలను ఆదివారం నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం స్నపన తిరుమంజన అభిషేకం, సేవా కాలాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి పురఫ్ఫాట్ సేవ జరిపించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆల య ముఖ మండపంలో సేవాకాలం జరిపించి, ప్రబంధ పారాయణాలను పఠించారు. మోటకొండూరుకు నేడు మంత్రుల రాక మోటకొండూర్: రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సోమవారం మోటకొండూర్కు రానున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంత రం బహిరంగ సభలో మంత్రులు ప్రసంగిస్తారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్యరెడ్డి, పచ్చిమట్ల మదార్గౌడ్, నెమ్మాణి సుబ్రహ్మణ్యం, కొంతం మోహన్రెడ్డి, భాస్కరుణి రఘునాథరాజు, తహసీల్దార్ నాగదివ్య, భూమండ్ల శ్రీనివాస్, బాల్ద సిద్ధులు, సీఐ శంకర్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలన చేస్తుండగా ఎమ్మార్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమ భూములు అంటూ వాగ్వాదానికి దిగారు. ఎస్సీల భూములు తీసుకోబోమని, ఇది ఎస్సీలది అయితే పక్కన అంతే భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు. స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవ భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం సాయంత్రం శ్రీవేంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ కనుల పండువగా నిర్వహించారు.అంతకు ముందు ఉదయం ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, నిత్యకల్యాణం, దామోదర హవనం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. చేనేత కళ భేష్చౌటుప్పల్ రూరల్: ప్రాచీన హస్తకళలు, ప్రకృతి రంగులతో చేనేత వస్త్రాలు తయారీ చేయడం అభినందనీయమని నార్వే దేశస్తుడు లాస్ నీల్సన్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలో చేనేత వస్త్రాలు తయారు చేసే విధానం, దండుమల్కాపురం టెక్స్టైల్ పార్క్లో వస్త్రాల తయారీని ఆదివారం పరిశీలించారు. కొయ్యలగూడెంలో జాతీయ పురస్కార గ్రహీత దుద్యాల శంకర్ ఇంటిని సందర్శించారు.మగ్గంపై వస్త్రాలను నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వెదురుతో ఇళ్లు నిర్మించడంతో పాటు కళాకారుడు శ్రవణ్ వివిధ రకాలుగా తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. -
లక్కు ఎవరికో?
భువనగిరి: మద్యం దుకాణాలకు సోమవారం డ్రా తీయనున్నారు. ఇందుకోసం భువనగిరి మండలం రాయగిరిలోని సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఎకై ్సజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,766 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి షాపునకు 91, కని ష్టంగా మోటకొండూరులోని వైన్స్కు 18మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. అదృష్టం ఎవరిని వ రించనుందోనని దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంట్రీపాస్ ఉంటేనే అనుమతి కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. ఫంక్షన్ హాల్లోకి ఫోన్ అనుమతి లేదు. మొదట భువనగిరి, తర్వాత రామన్నపేట, ఆలేరు, మోత్కూర్ సర్కిళ్ల పరిధిలోని వైన్స్లకు డ్రా తీయనున్నారు. ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం కానుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. కార్యక్రమం సాఫీగా ముగిసేందుకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. ఫ నేడు మద్యం దుకాణాలకు డ్రా ఫ సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు -
వలస కూలీలపై ఫోకస్
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో ఇటీవల పశ్చిమబెంగాల్కు చెందిన ఓ వ్యక్తి ఒకరికి రూ.12 వేల నగదు ఇచ్చి తనకు అకౌంట్కు ఫోన్ పే చేయించుకున్నాడు. తీరా చూస్తే అవి దొంగనోట్లుగా తేలాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన మరో వ్యక్తి చైన్ స్నాచింగ్కు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వలస కూలీలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది.వారు అద్దెకు ఉంటున్న ఇళ్లకు వెళ్లి యజమానులను సంప్రదించి కూలీల వివరాలు సేకరిస్తుంది. వేలల్లో వలస కార్మికులు జిల్లాలో వలస కూలీలు నానాటికీ పెరిగిపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులు భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్తో పాటు ఆయా మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, ఇటుకబట్టీలు, గృహ నిర్మాణ పనులు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికంగా.. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ఎక్కువగా జిల్లా కేంద్రంలో తిష్టవేశారు. అనధికార లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 30వేల మంది వలస కార్మికులు ఉండగా.. వీరిలో భువనగిరి పట్టణంలోనే 10 వేల మంది వరకు ఉంటున్నట్లు తెలిసింది. చాలా కాలనీల్లో ఐదారుగురు కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తున్నారు. వారి డేటాను పోలీసుల ఆధీనంలో ఉండాలన్న ఉద్దేశంతో సెర్చ్ చేస్తున్నాం. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో వలస కార్మికుల కార్యకలాపాలపై నిఘా పెట్టాం. అందులో భాగంగానే వారి వివరాలు సేకరిస్తున్నాం. ఇక నుంచి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి భువనగిరికి ఎవరు వచ్చినా పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలు నమోదు చేయించుకోవడంతో పాటు బయోమెట్రిక్ వేయాలి. –రమేష్కుమార్, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే మకాం ఫ పలు నేరాల్లో వీరి ప్రమేయం ఫ అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఫ భువనగిరి పట్టణంలో తనిఖీలు, వివరాల సేకరణ, రికార్డుల్లో నమోదు ఫ కొత్తగా వచ్చిన కూలీలు పోలీస్స్టేషన్లో బయోమెట్రిక్ వేయాల్సిందేభువనగిరిలో పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ నెల 22వ తేదీ నుంచి వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. పట్టణంలో వివిధ ప్రాతాల్లో నివాసం ఉంటున్న వలస కార్మికుల వద్దకే పోలీసులు వెళ్లి ఒక్కొక్కరిని పిలిచి పేరు, రాష్ట్రం, చేస్తున్న పని, ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తి పేరు రికార్డులో నమోదు చేసుకుంటున్నారు. ఆధార్కార్డులను పరిశీలించి నంబర్ రికార్డ్ చేస్తున్నారు. సెల్ఫోన్లో వారి ఫొటోలను తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంటి యజమానులను సైతం ప్రశ్నిస్తున్నారు. ఎవరి చెబితే వలస కార్మికులు ఇల్లు అద్దెకు ఇచ్చారని వివరాలు తీసుకుంటున్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు(అండర్–19) శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు పెంచాలని అన్నారు. క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అననారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ రమణి, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, పీడీ ఎన్. ప్రసాద్, వాలీబాల్ క్రీడల రాష్ట్ర పర్యవేక్షకుడు శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్ బాలరాజు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఫ వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు -
అప్పు చేసి.. జూదం ఆడి
ఆలేరు: అప్పు చేసి జూదం ఆడి లక్షల రూపాయలు నష్టపోయిన వ్యక్తిని అప్పు ఇచ్చినవారు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం వారి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి తాళం వేవశారు. బాధిత కుటుంబం డయల్ 100కు ఫోన్చేసి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఆలేరు పోలీసులు వచ్చి విడిపించారు. బాధిత కుటుంబం, ఆలేరు సీఐ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బిర్రు లక్ష్మీపతి వాటర్ ప్లాంట్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొందరు వ్యక్తులు గోవా క్యాసినో జూదం ఆడితే లక్షల్లో సంపాదించవచ్చని లక్ష్మీపతికి ఆశ చూపారు. మల్లేష్ అనే వ్యక్తి లక్ష్మీపతితో పాటు మరికొందరిని 30 రోజులకొకసారి గోవాకు తీసుకువెళ్లి క్యాసినో జూదం ఆటను పరిచయం చేశాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా దడిగ రమేష్ అనే వ్యక్తి అప్పు రూపంలో లక్ష్మీపతికి ఇస్తూ వచ్చాడు. ఇందుకు గాను రూ.లక్షకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వడ్డీ వేశాడు. గడిచిన ఆరు నెలలుగా రమేష్ నుంచి లక్ష్మీపతి సుమారు రూ.13లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఇందుకు లక్ష్మీపతికి చెందిన రెండు వందల గజాల ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. మరికొందరి నుంచి కూడా లక్ష్మీపతి అధిక వడ్డీకి రూ.17లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఆరు నెలల్లో రూ.30లక్షలు నష్టం ఇలా మొత్తం రూ. 30లక్షల మేరకు అప్పులు చేశాడు. మొదట క్యాసినో జూదంలో కాస్తోకూస్తో డబ్బులు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత లక్ష్మీపతి రూ.లక్షల్లో నష్టపోవడంతో రూ.30లక్షల అప్పు మిగిలింది. ఈ విషయం తెలుసున్న అప్పు ఇచ్చినవారు తీసుకున్న అప్పు చెల్లించాలని లక్ష్మీపతిపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. తాకట్టు పెట్టిన ఇంటి స్థలాన్ని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని రమేష్ లక్ష్మీపతిపై ఒత్తిడి పెంచాడు. ఆరు నెలలు గడువు ఇస్తే దశలవారీగా అందరి అప్పు చెల్లిస్తానని లక్ష్మీపతి ప్రాధేయపడినా అప్పు ఇచ్చినవారు వినకుండా వేధించడం మొదలుపెట్టారు. రెండు నెలల కిత్రం లక్ష్మీపతికి చెప్పకుండా అతడి ఇంటి వద్ద ఉన్న ఆటోను సైతం అప్పు ఇచ్చినవారు తీసుకెళ్లారు. శనివారం ఉదయం లక్ష్మీపతితో పాటు అతడి కుటుంబ సభ్యలు ఇంట్లో ఉండగా బయట నుంచి అప్పు ఇచ్చిన రమేష్ తాళం వేసి వారిని నిర్బంధించాడు. దీంతో లక్ష్మీపతి డయల్ 100కు ఫోన్చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలేరు పోలీసులు వచ్చి నిర్బంధం నుంచి వారిని విడిపించారు. అనంతరం లక్ష్మీపతి, అతడి భార్య పోలీస్ స్టేషన్కు చేరుకొని దడిగే రమేష్తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి అప్ప ఇచ్చినవారి నుంచి రక్షణ కల్పించాలని, అప్పు తీర్చడానికి ఆరు నెలలు గడువు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ యాలాద్రి పేర్కొన్నారు. ఫ లక్షల రూపాయలు నష్టపోయిన బాధితుడు ఫ అప్పు తీర్చాలంటూ బాధిత కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి తాళం ఫ డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వచ్చి విడిపించిన పోలీసులు -
యాదగిరిగుట్టలో భక్తులకు అన్న ప్రసాదం
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో వచ్చే ప్రతి శని, ఆదివారాల్లో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామని ఇటీవల ఆలయ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం దీక్షపరుల మండపంలో రెండు వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేసి అన్న ప్రసాదాన్ని అందించారు. నల్లబెల్లం, పటిక పట్టివేత ఫ నలుగురి అరెస్ట్, రిమాండ్కు తరలింపు తిప్పర్తి: అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వ్యక్తులను తిప్పర్తి శివారులో శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తిప్పర్తి మండల కేంద్రం శివారులో వాహనాలు తనిఖీల్లో భాగంగా పోలీసులు అటుగా వచ్చిన గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 2880 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటికను గుర్తించారు. గూడ్స్ వాహనంలోని గరికమల్ల హిమవత్తు, దూదేకుల ముబారక్, యన్నమల్ల సాయి, మాలవత్ సాయిని అదుపులో తీసుకొని విచారించగా.. ఏపీలోని చిత్తురు నుంచి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బంగ్లాకు సరఫరా చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నాఉ. పట్టుబడిన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వి. శంకర్ తెలిపారు. -
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో..
చౌటుప్పల్ రూరల్: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెగూడెం గ్రామానికి చెందిన గండికోట విగ్నేష్(26) ఇంటర్ వరకు చదివి ట్రాక్టర్ కొనుక్కొని గ్రామంలోనే తమకున్న వ్యవసాయ భూమితో పాటు మరో 10ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. విగ్నేష్ అన్న దుబాయ్లో పనిచేస్తుండగా దీపావళి పండగకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం విగ్నేష్ అన్న తిరిగి దుబాయ్కి వెళ్తుండడంతో అతడిని కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దించి వచ్చాడు. అనంతరం రాత్రి తాను ప్రేమించిన యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన విగ్నేష్ తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ స్టేటస్లో పోస్టు చేశాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లి చూడగా.. అప్పటికే విగ్నేష్ పురుగుల మందు తాగి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం విగ్నేష్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు దుబాయ్ నుంచి రాగానే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి గండికోట రాందాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నర్సిరెడ్డి తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య -
మిర్యాలగూడ డిపో బస్సుకు ఏపీలో ప్రమాదం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు లారీకి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ గోనానాయక్, కండక్టర్ వి. లింగయ్య, ప్రయాణికులు ఎస్. రవి, మంజుల, ధనమ్మ, సంతోషం, దేవసాయం, రజనిబాయి, నజీమా, రిజ్వానాకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురజాల, దాచేపల్లిలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డిపో మేనేజర్ రాంమోహన్రెడ్డి, సేఫ్టీ వార్డెన్ శ్రీనివాస్, టీఐ– నాగమణి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ జానకిరాంరెడ్డి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులను పరామర్శించారు. ఈ మేరకు దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన పల్లె వెలుగు బస్సు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద ఘటన -
విద్యుదాఘాతంతో మృతి
మోత్కూరు, ఆత్మకూరు(ఎం): ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్న వర్కర్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరులో శనివారం జరిగింది. ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మద్దిపడిగె నర్సిరెడ్డి–శ్రీలత దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు భాస్కర్రెడ్డి (23) మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్నాడు. శనివారం వైండింగ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ను టెస్టింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. గమనించిన తోటి వర్కర్లు కరెంట్ బంద్ చేసి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భాస్కర్రెడ్డి మృతిచెందాడు. రిపేరు సెంటర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే భాస్కర్రెడ్డి చనిపోయారని తోటి సిబ్బంది ఆరోపించారు. షెడ్డులో వర్కర్లకు సరైన రక్షణ పరికరాలు సమకూర్చడం లేదన్నారు. గతంలో రెండు సంవత్సరాల పాటు ట్రాన్స్ఫార్మర్ రిపేరు సెంటర్లో పనిచేసి జీతం సరిపోవడం లేదని హైదరాబాద్కు వెళ్లిపోగా.. జీతం పెంచుతానని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో తిరిగి ఇక్కడికి వచ్చినట్లు తోటి వర్కర్లు తెలిపారు. భాస్కర్రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భాస్కర్రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం పారుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
డ్రయ్యర్ ట్రయల్ రన్
చౌటుప్పల్: ‘నిరుపయోగంగా డ్రయ్యర్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించారు. మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో ఉంచిన డ్రయ్యర్ను శనివారం యార్డులోకి తీసుకొచ్చారు. మార్కెట్ సెక్రటరీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్తో పాటు డ్రయ్యర్ కోసం 40లీటర్ల డీజిల్ను తెప్పించారు. ట్రాక్టర్ ట్రాలీ నిండుగా ఉన్న ధాన్యాన్ని డ్రయ్యర్లో నింపారు. డ్రయ్యర్ వినియోగంపై రైతులు అవగాహన కల్పించారు. -
పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లిలో శనివారం ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు సందడి చేశారు. హైదరాబాద్లోని హామ్స్టక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటిక్ టెక్నాలజీకి చెందిన 42 మంది విద్యార్థులు స్థానిక టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ ఇక్కత్ ప్రాముఖ్యతను తెలియజెప్పే ఏవీని తిలకించారు. అనంతరం మగ్గాలు, ఆసు యంత్రం, చిటికి కట్టడం, ఇక్కత్ చేనేత వస్త్రాలు, డిజైనింగ్ను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల తయారీ విధానం, వాటి ప్రాముఖ్యత, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర తదితర విషయాలను చేనేత కళాకారుడు భారత ప్రవీణ్ వారికి వివరించారు. అనంతరం కళాశాల టెక్స్టైల్ ఫ్యాకల్టీ సౌజన్య మాట్లాడుతూ.. ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలిష్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చేనేత కార్మికుల జీవన స్థితిగతులు, ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత, వారు అవలంబిస్తున్న సాంప్రదాయ విధానాలు, కళాకారుల శ్రమ విలువను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వారి వెంట మార్కెటింగ్ ఫ్యాకల్టీ దివ్యలక్ష్మి, క్యాడ్ ఫ్యాకల్టీ ప్రతిమ ఉన్నారు. -
శోకసంద్రంలో అనూషారెడ్డి కుటుంబం
గుండాల: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేశ్వరం విజిత, శ్రీనివాస్రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లే కావడంతో అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారని బంధువులు పేర్కొన్నారు. కూతుర్లే అండగా ఉంటారని ఆశించిన తమకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడని అనూషారెడ్డి తల్లిదండ్రులు విలపించారు. చిన్నతనం నుంచి అనూషారెడ్డి తన తెలివితేటలతో తమకు వారసుడు లేడన్న ఆలోచన లేకుండా చేసిందని విలపిస్తున్న తీరును చూసి బంధువులు కంటతడి పెట్టారు. కాగా కాలిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. మృతదేహాన్ని 48 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి ఆత్మహత్యయాదగిరిగుట్ట రూరల్: ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతం ఆదిత్య నగర్లో నివాసముంటున్న లింగాల భానుప్రకాష్(30)కు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రసన్నతో వివాహం జరిగింది. భానుప్రకాష్కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై స్కూటీపై ఇంటి నుంచి బయల్దేరి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో రైల్వే ట్రాక్ ప్రక్కన స్కూటీని ఉంచి, శుక్రవారం అర్ధరాత్రి ఆలేరు–వంగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నాడు. శనివారం రైల్వే మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
హాలియా: బైక్పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడపు వెంకటయ్య(55) శనివారం బైక్పై గుర్రంపోడులో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైన్స్లకు 27న లక్కీ డ్రా
భువనగిరి: జిల్లాలో మద్యం దుకాణాల కేటా యింపునకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి మండలం రాయగిరి పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలకే ఫంక్షన్హాల్కు చేరుకోవాలని, కార్యక్రమం సజావుగా సాగేలా సహకరించాలని అధికారులు కోరారు. కేసుల పరిష్కారానికి చొరవ చూపండిభువనగిరి: డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు కోరారు. శనివారం భువనగిరిలోని కోర్టులో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదా లత్పై కక్షిదారులకు అవగాహన కల్పించి కేసులు రాజీపడేలా చూడాలన్నారు. అనంతరం పెండింగ్ కేసులు, సబ్ జైలులో ఖైదీలకు సంబంధించిన కేసుల వివరాలపై వారితో చర్చించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిద, న్యాయ సేవా అధి కార సంస్థ కార్యదర్శి మాదవిలత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, ఏసీపీలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ నా యు డు, సబ్జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, పట్టణ సీఐ రమేష్ పాల్గొన్నారు. అదే విధంగా ఫోక్సో చట్టం కింద పెండింగ్లో ఉన్న కేసుల గురించి న్యాయమూర్తి ముక్తిద చర్చించారు. బాధితులకు అందాల్సిన పరిహారం గురించి సమీక్షించారు.గ్లోస్టర్ నగరంలో నృసింహుడి కల్యాణం యాదగిరిగుట్ట: లండన్లోని గ్లోస్టర్ నగరంలో యాదగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణాన్ని ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు స్వామి వారి కల్యాణం ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నారసింహుడి ఘట్టాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలో ఆలయ ఉప ప్రధానార్చకుడు నర్సింహమూర్తి, అర్చకులు కిరణ్ కుమారాచార్యులు, యూకే తెలుగు అసో సియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మూసీకి 5,015 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. శనివారం ప్రాజెక్టులోకి 5,015 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్గేట్లను పైకెత్తి 4,719 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 244 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు.. కాగా 4.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
మెగా స్పందన
ఫ ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు ఫ 20,523 మంది అభ్యర్థులు హాజరు ఫ ఉద్యోగాలకు ఎంపికై న 3,041 మంది హుజూర్నగర్ : డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హుజూర్నగర్లో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుంచే మెగా జాబ్మేళా ప్రాంగణానికి అభ్యర్థుల రాక మొదలైంది. వచ్చిన అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా జాబ్మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్మేళా ద్వారా వచ్చన అనుభవం, గుణపాఠంతో మున్ముందు ఇంతకన్నా మెరుగ్గా జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. 20వేల మందికిపైగా హాజరు జాబ్మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 40 వేల మందికిపైగా ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 20 వేల మందికిపైగా హాజరయ్యారు. వచ్చిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టోకెన్లు ఇచ్చి వారిని వరుస క్రమంలో కూర్చోబెట్టారు. అ నంతరం విద్యార్హతలను బట్టి వారికి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. కంపెనీల వారీగా ఇంటర్వ్యూలు ఐటీ, ఎడ్యు టెక్నాలజీ, స్కిల్స్ ట్రైనింగ్ విభాగంలో 5,547 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 827 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశా రు. మరో 370 మంది అభ్యర్థుల ఉన్నత అర్హతల ఆధారంగా షార్ట్లిస్ట్ రూపొందించారు. అలాగే సర్వీస్ మొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 3,850 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 391 మందిని ఎంపికచేసుకున్నారు. 804 మంది అభ్యర్థుల షార్ట్లిస్టు రూపొందించారు. మ్యాన్ఫ్యాక్చరింగ్, టెక్నికల్ రంగంలో 4,520 మంది హాజ రుకాగా 610 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ విభాగంలో 2,440 మందికి 713 మంది, ఫార్మా హెల్త్కేర్, హాస్పిటాలిటీ విభాగంలో 2,167 మందికి 210 మంది ఎంపికయ్యారు. మరో 195 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించారు. ఆటోమొబైల్స్ రంగంలో 952 మందికి 102 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. 154 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును సిద్ధం చేశారు. లాజిస్టిక్, ఎయిర్ పోర్ట్ రంగంలో 1,047 మందికి 188 మంది ఎంపిక కాగా 10 మంది షార్ట్లిస్టును ఆయా కంపెనీల ప్రతినిధులు రూపొందించారు. మొత్తంగా 20,523 మంది ఇంటర్వ్యూలకు రాగ 3,041 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 1,533 మంది అభ్యర్థులతో షార్ట్లిస్టును రూపొందించారు. నేటి జాబ్మేళా వాయిదా ఇతర ప్రదేశాలలో కూడా జాబ్ మేళా నిర్వహించాల్సి ఉన్న కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఆదివారం నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావడం లేదు. ఈ కారణంగా ఆదివారం నిర్వహించే జాబ్మేళా వాయిదా వేస్తునట్లు ఆయన తెలిపారు. తిరిగి ఈ జాబ్ మేళాను ఎప్పుడు నిర్వహించేది ఆతేదీని తర్వాత ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. -
పూజితమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది
యాదగిరిగుట్ట: ‘పూజితమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి భోజనం చేస్తున్నావా.. మందులు వేసుకుంటున్నావా? గర్భధారణ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.. పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతాడు’ అని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా శనివారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధి గుండ్లపల్లిలో గర్భిణి పూజిత ఇంటికి కలెక్టర్ వెళ్లారు. పూజితకు న్యూట్రిషన్ కిట్ అందజేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమెకు సూచించారు. కాన్పు అనంతరం 102 వాహనంలో తల్లీబిడ్డను ఇంటి వద్ద చేరుస్తారని పేర్కొన్నారు. సమయానికి భోజనం చేయాలని, డాక్టర్ల సూచన మేరకు మందులు వేసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్, వైద్యసిబ్బంది ఉన్నారు. ఫ ఆరా తీసిన కలెక్టర్ హనుమంతరావు,న్యూట్రిషన్ కిట్ అందజేత -
పర్యాటకుల భద్రతకు భరోసా..
భూదాన్పోచంపల్లి: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిస్టు పోలీసులను నియమించింది. పర్యాటకులకు మెరుగైన భద్రత, ఆతిథ్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, ఆర్కియాలజీల్లో విధులు నిర్వహించేలా 80 మంది పోలీసులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. అందులో యాదాద్రి జిల్లాలోని భూదాన్పోచంపల్లికి ఐదుగురు, యాదగిరిగుట్టకు ఆరుగురు, భువనగిరి ఖిలాకు నలుగురు చొప్పున మొత్తం 15 మందిని నియమించింది. వీరంతా వారం రోజుల క్రితం విధుల్లో చేరారు. పర్యాటక ప్రాంతాల్లోనే విధులు నిర్వరిస్తున్నారు. షిఫ్ట్ల వారీగా విధులు భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కులో ఇప్పటి వరకు కేవలం టూరిజం మేనేజర్, సిబ్బంది మాత్రమే ఉండేవారు. తాజాగా పోలీసులు కూడా చేరారు. టూరిజం పోలీసులు ప్రత్యేకంగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. టూరిజంశాఖ, పోలీస్ శాఖ సంయుక్త పర్యవేక్షణలో వీరు పనిచేస్తారు. టూరిజం పోలీసుల రాకతో పర్యాటక కేంద్రాల పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పడనుందని స్థానికులు అంటున్నారు. కాగా భూదాన్పోచంపల్లికి కేటాయించిన టూరిజం పోలీసుల్లో రాజశేఖర్, ప్రవీణ్రెడ్డి, భవానీ, జాహ్నవి, లావణ్య ఉన్నారు. ఫ జిల్లాకు 15 మంది టూరిస్టు పోలీసుల నియామకం ఫ పర్యాటక ప్రాంతాల్లో భద్రత వీరి డ్యూటీ -
వాలీబాల్ పోటీలు..
భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. - 8లో- 9లోయూత్ లైఫ్స్టైల్ మారింది. క్రీడా రంగంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొస్తోంది. ఇలా పాశ్చాత్య క్రీడ అయిన స్నూకర్ చిన్నపట్టణాలకూ విస్తరిస్తోంది. ఈ ఆటకు గతంలో మన దగ్గర మంచి ఆదరణ ఉండేది. సినిమాల్లో హీరోలు స్నూకర్ గేమ్ ఆడుతూ ఉన్న సీన్లు ఉండేవి. కొంతకాలం కనుమరుగైన ఈ స్నూకర్ గేమ్ ఇప్పుడు మెల్లమెల్లగా నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తోంది. స్టేటస్కు ప్రతీకగా భావించే ఈ క్రీడను ఆడేందుకు ప్రస్తుతం యువత ఆసక్తి చూపిస్తోంది. స్నూకర్.. చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న పాశ్చాత్య క్రీడ పట్టణాల్లో వెలుస్తున్న స్నూకర్ పాయింట్లు ఆసక్తి చూపుతున్న యువతరిలాక్సేషన్ గేమ్రామగిరి (నల్లగొండ) : స్నూకర్ గేమ్ మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర పట్టణాల్లో స్నూకర్ పాయింట్లు వెలుస్తున్నాయి. స్నూకర్ ఆడేందుకు పట్టణవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ.లక్షల వెచ్చించి స్నూకర్ పాయింట్లను ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బ్రిటన్ గేమ్ స్నూకర్.. పార్టీ గేమ్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి మన దగ్గరకు దూసుకొచ్చింది. యూరప్లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ ఆట పురుడు పోసుకుంది. కాలక్రమేణా మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. రిలాక్సేషన్తోపాటు టీమ్ బాండింగ్కు ఉపయోగపడే ఈ స్నూకర్ ఇప్పుడు యూత్కు క్రేజ్గా మారింది. చిన్న పట్టణాలకు విస్తరణ ఒకప్పుడు క్లబ్బులు, స్పోర్ట్స్ అకాడమీల్లో ఉండే స్నూకర్ గేమ్ ఇప్పుడు చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మాదిరిగా ప్రస్తుత యువతకు స్నూకర్ ఒక గేమ్గా మారింది. దీని కోసం ప్రత్యేకంగా హాల్ నిర్మించి గేమ్ ఆడడానికి కావాల్సిన సామగ్రిని సమకూర్చుతున్నారు. ఒకేచోట రెండు నుంచి మూడు టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆడేవారి నుంచి గంటల వారీగా లేదా ఒక ఆటకు రూ.150 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. స్నూకర్ పాయింట్లలో చదువుకునే వారు ఉద్యోగాలు చేసేవారు రోజూ సాయంత్రం వచ్చి గేమ్ ఆడుతున్నారు. కొన్నిసార్లు యువతులు కూడా వచ్చి స్నూకర్ ఆడుతున్నారు. స్నూకర్ ఆట అంటే అమితమైన ఇష్టం. 1994 నుంచి స్నూకర్ ఆడుతున్నా. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే స్నూకర్ గేమ్ ఆడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్నూకర్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత ఎక్కువ మంది ఆడడానికి అవకాశం ఉంది. – షకీర్, నల్లగొండ నేను రోజూ స్నూకర్ ఆడతాను. ఏడు సంవత్సరాలుగా ఈ గేమ్ అడుతున్నాను. ఒకవేళ హాలిడేస్లో వేరే పట్టణాలకు వెళ్తే అక్కడ కూడా ఆడుతాను. రోజుకు కనీసం రెండు గేమ్లు ఆడతాను. –ఎండీ.ఇమద్, నల్లగొండ నల్లగొండ స్నూకర్ పాయింటు ఏర్పాటు చేసి సంవత్సరం అవుతోంది. మొదటగా ఆడేవారు పెద్దగా రాలేదు. ఇప్పుడు యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సమయాల్లో లేడీస్ కూడా వచ్చి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆదరణ బాగానే ఉంది. హాలిడేస్లో ఆడే వారి సంఖ్య ఎక్కవగా ఉంటుంది. – ఎండీ.ముజఫర్, స్నూకర్ పాయింట్ నిర్వాహకుడు, నల్లగొండ -
ఆరు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు విడుదల
డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పార్కులు, ఓపెన్ జిమ్ల అభివృద్ధి చేస్తారు. అలాగే విలీన గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు చేయనున్నారు.సాక్షి, యాదాద్రి: నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు కొంత మేర ఊరట కలిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ –2027లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.90 కోట్లు విడుదల చేసింది. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున కేటాయించింది. నిధుల విడుదల పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భువనగిరి మినహా కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీలు అనేక సమస్యలు తిష్టవేశాయి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు వీధుల్లో, నివాసాల మధ్య పారుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నిధులు రాకతో సమస్యలు కొంతమేర పరిష్కారం అవకాశం ఉంది. 2026 మార్చి నాటికి పనులు పూర్తి జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మినహా మిగతా ఐదు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డాయి. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం (యూఐడీఎస్) కింద ప్రభుత్వం రెండు నెలల క్రితమే రూ.90 కోట్లు మంజూరు చేయగా.. శనివారం వాటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. కలెక్టర్ ఆమోదం కొరకు పంపారు. పరిపాలనా ఆమోదం పొందగానే టెండర్లు పిలువనున్నారు. వెంటనే పనులు ప్రారంభించి 2026 మార్చి నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉంది. ● భువనగిరిలో.. జిల్లా కేంద్రంలో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.46.4లక్షలు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీలకు రూ.45లక్షలు, పార్కుల అభివృద్ధికి రూ.4లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి రూ. ఒక కోటి, జంక్షన్ల అభివృద్ధికి రూ. 4 కోట్లు ఖర్చు చేయనున్నారు. ● ఆలేరు.. హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్, వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణంతో పాటు ఒక పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థల పరిశీలన చేస్తున్నారు. విలీన గ్రామమైన బహుద్దూర్పేటలో కొన్ని పనులకు నిధులు ఖర్చు చేస్తారు. ● భూదాన్పోచంపల్లి.. సీసీ రోడ్లకు రూ.5 కోట్లు, డ్రెయినేజీలు, పార్కు నిర్మాణం, మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి సమీపంలో కల్వర్టు నిర్మాణం, మున్సిపల్ కేంద్రంతో పాటు విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవనవల్లిలో శ్మశానవాటికల నిర్మాణానికి రూ.5కోట్లు వెచ్చించనున్నారు. మిగతా నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు చేస్తారు. ● మోత్కూర్.. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణంతో పాటు గతంలో ప్రారంభించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు. విలీన గ్రామాలైన కొండగడప, బుజ్జిలాపురంలోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ● యాదగిరిగుట్ట.. రూ.5 కోట్లతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తారు. మిగతా 10 కోట్లు డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. మున్సిపాలిటీలో విలీనం చేసిన పాతగుట్ట, పెద్దిరెడ్టిగూడెంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఫ ఒక్కో పట్టణానికి రూ.15 కోట్ల చొప్పున కేటాయింపుఫ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఫ కలెక్టర్ ఆమోదం పొందగానే టెండర్లు -
రైలు కింద పడి యువకుడి బలవన్మరణం
బీబీనగర్, భూదాన్పోచంపల్లి: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి బీబీనగర్ మండల కేంద్ర పరిధిలోని ఎయిమ్స్ ఎదురుగా రైల్వే ట్రాక్పై జరిగింది. రైల్వే జీఆర్పీ ఇన్చార్జి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు వస్పరి వెంకటేశ్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు అభిలాష్(19) సంతానం. అభిలాష్ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజుమాదిరిగా బుధవారం కళాశాలకు వెళ్లి వచ్చిన అభిలాష్ అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారు తీసుకొని బయటకు వచ్చాడు. బీబీనగర్ ఎయిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన సర్వీస్ రోడ్డులో కారును నిలిపి ట్రాక్పై చేరుకొని ఎదురుగా వస్తున్న మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులోని సిమ్ తీసి వేరే మొబైల్లో వేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అంతమ్మగూడెంలో విషాదఛాయలుఅభిలాష్ మృతితో అంతమ్మగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు అభిలాష్ తన చిన్న సోదరికి ఫోన్కు తన మెడలో బంగారు చైన్ ఉందని, అలాగే కొందరు స్నేహితులు డబ్బులు ఇవ్వాలని మెసేజ్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామంలో అభిలాష్ అంత్యక్రియలు నిర్వహించారు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఆత్యహత్య చేసుకోవడంతో అభిలాష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభిలాష్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. -
పాడి పశువుల పెంపకంపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం–రాజేంద్రనగర్, సద్గురు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గరిడేపల్లి మండలంలో ని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో పాడి రైతులకు పాడి పశువుల యాజ మాన్యంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వెటర్నరీ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు పాల ఉత్పిత్తి పెంపుదల, తక్కువ ధరలో దాణా తయారీ, పునరుత్పత్తి, విచక్షణాపూరితంగా ఔషధ వినియోగం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ డాక్టర్ కిరణ్కుమార్ రైతులకు సబ్సిడీలు, ఇతర పథకాల గురించి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్లోని మామ్నూరు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బిందుమాధురి, మామ్నూరు కేవీకే శాస్త్రవేత్తలు అరుణజ్యోతి, సాయికిరణ్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు ఎన్. సుగంధి, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, పి. అక్షిత్, పశువైద్యాధికారిణి జయసుధ, 50మంది రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా డ్రయ్యర్లు !
చౌటుప్పల్: తడిసిన, తేమ అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు గాను చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలను(డ్రయ్యర్లు) యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సమకూర్చారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో దానికి రూ.14.90లక్షలు వెచ్చించి ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసి మార్కెట్ యార్డులకు పంపించారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఈ యంత్రం సాయంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. అయితే ఆయా మార్కెట్ యార్డులలో ఉన్న ఈ యంత్రాలను ఇప్పటివరకు ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు. ట్రాక్టర్ ధాన్యానికి రూ.4000 ఖర్చు.. ఈ డ్రైయింగ్ మిషన్ ద్వారా ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు పెను భారంగా మారింది. ఒక్కో ట్రాక్టర్ ధాన్యం(సుమారు 24 క్వింటాళ్లు) ఆరబెట్టేందుకు సుమారుగా రెండు గంటల సమయం పడుతోంది. ఈ యంత్రాన్ని నడిపించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్ కావాల్సి ఉంది. ధాన్యం ఆరబెట్టుకోవాలంటే ట్రాక్టర్తో పాటు డ్రయ్యర్కు 10లీటర్ల చొప్పున డీజిల్ అవసరం అవుతుంది. రెండు గంటల సమయంలో ఒక ట్రాక్టర్ ధాన్యం మాత్రమే ఆరబెట్టే అవకాశం ఉంది. అలా ఒక్కో ట్రాక్టర్ ధాన్యం ఆరబెట్టేందుకు గాను రైతుకు సుమారుగా అన్ని ఖర్చులు కలిపి రూ.4000కు పైగానే అవుతుండడంతో ఈ యంత్రాన్ని వినియోగించుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. మార్కెట్ యార్డులోనే యంత్రం డ్రయ్యర్ వినియోగించకపోవడంతో ప్రస్తుతం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉంది. ఈ విషయాన్ని మార్కెట్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిరుపయోగంగా ఉన్నందున వేరే చోటుకై నా తీసుకెళ్లాలని కోరారు. అయితే ఆ యంత్రాల వినియోగానికి అయ్యే ఖర్చు మార్కెట్ నుంచి భరించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఖర్చులు భరించలేమని పాలకవర్గం, అధికారులు చేతులెత్తేశారు. అటు రైతులు ముందుకు రాక, మరోవైపు అధికారులు స్పందించక చివరికి ఆ డ్రయ్యర్లు నిరుపయోగంగా మారాయి. చౌటుప్పల్, రామన్నపేట మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు సమకూర్చిన మార్కెటింగ్ శాఖ రెండు గంటల పాటు వినియోగించడానికి రూ.4000 ఖర్చు ఆర్థిక భారంతో ముందుకురాని రైతులు -
వివాహేతర సంబంధంతో పరువు తీసిందని హత్య
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులే మహిళను హత్య చేశారు. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, భిక్ష్మమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మల్లయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భిక్ష్మమమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు హెచ్చరించినా భిక్షమమ్మ మాట వినకపోవడంతో కుటుంబం పరువు పోతుందని భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు ప్రవీణ్, భరత్తో కలిసి భిక్ష్మమ్మను హత్య చేయాలని స్కెచ్ వేశారు. ఈ మేరకు మల్లయ్య అన్న కుమారుడు మహేష్, స్నేహితులు వంశీ, జనార్దన్తో కలిసి గ్రామంలో నడిరోడ్డుపై భిక్షమమ్మని కర్కశంగా కత్తితో గొంతుకోసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్గౌడ్, మహేశ్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపూర్ గ్రామంలో మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు -
గాలికుంటు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చిట్యాల: తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి తెలిపారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆవులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకా వేయించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ప్రతి యేటా రెండు పర్యాయాలు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు వస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన పాడి, పశు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు. రైతులు విధిగా తమ ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి జీవీ రమేష్, మండల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్, సిబ్బంది శ్రీను, సైదులు, శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకన్న, సునీత, సతీష్ గోపాలమిత్ర సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకుడు గోపి -
‘మీ డాడీ బాగున్నాడా అమ్మ.. మళ్లీ కేసీఆర్ రావాలి’
యాదగిరిగుట్ట: ‘మీ డాడీ బాగున్నాడా.. మళ్లీ కేసీఆర్ రావాలి.. ఒక్క మీటింగ్ పెట్టమను నాయనను.. అందరం కలిసికట్టుగా వస్తాం.. రేవంత్రెడ్డి వచ్చినాక బంగారం లేదు.. చీరలు లేవు.. ఏమీ ఇస్తలేడు’ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మహిళలు సంభాషించారు. గురువారం యాదగిరి క్షేత్రానికి వచ్చిన కల్వకుంట్ల కవితను కొండపైకి వెళ్లే మార్గంలో రెండవ ఘాట్ రోడ్డు వద్ద వడాయిగూడెం గ్రామానికి చెందిన సుక్కల లక్ష్మితో పాటు పలువురు మహిళలు కలిశారు. ఈ సందర్భంగా బాగున్నారా అంటూ కవిత వారిని పలకరించి ‘రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.4వేలు ఇస్తుందా.. కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉంది.. అందరికి చీరలు వచ్చాయా.. పథకాలు అందుతున్నాయా’ అని అడిగారు. దీంతో సుక్కల లక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ ఉండగా చీరలు ఇచ్చిండు, ఒక్కసారి కేసీఆర్ను మీటింగ్ పెట్టమనుండ్రి ఎంత మందిమి వస్తామో రేవంత్రెడ్డికి తెలుస్తుంది. డాడీ బాగుండా.. మీ నాయన ఆరోగ్యంగా ఉండాలి అంటూ చెప్పింది. రేవంత్రెడ్డికి ఓటు వేసి ఘోరంగా మోసపోయామని కవితతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ● వాహనాల నిలిపివేతకల్వకుంట్ల కవిత కాన్వాయ్లోని వాహనాలు కొండపైకి వెళ్లకుండా ఎస్పీఎఫ్ సిబ్బంది నిలిపివేశారు. అన్ని వాహనాలకు అనుమతి లేదని, కవిత వాహనంతో పాటు మరో 4 వాహనాలను మాత్రమే పంపిస్తామని చెప్పారు. అనంతరం దేవస్థానం అధికారులు జోక్యం చేసుకొని వాహనాలను కొండపైకి పంపించారు. యాదగిరిగుట్టలో కల్వకుంట్ల కవితతో మహిళల సంభాషణ -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చండూరు: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల మెండువారిగూడంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండువారిగూడానికి చెందిన నంద్యాల నర్సిరెడ్డి(48) వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది గ్రామాని వెళ్లే దారిలో చండూరు శివారులోని మూతబడిన పాఠశాల సమీపంలో బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. నర్సిరెడ్డి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతకగా మూతబడిన పాఠశాల సమీపంలో మృతిచెంది కనిపించాడు. గురువారం మృతుడి కుమారుడు కిరణ్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. విద్యుదాఘాతంతో మేసీ్త్ర మృతి మునగాల: విద్యుదాఘాతంతో మేసీ్త్ర మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం ముకుందాపురంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన షేక్ పెదబోడయ్య(57) సుతారి మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా గురువారం పెదబోడయ్య పిల్లర్లు ఏర్పాటు చేసే క్రమంలో పిల్లర్లకు ఉండే సువ్వలు పైన ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. బంగారం అపహరణ కేసులో ఇద్దరికి జైలు శిక్ష చివ్వెంల(సూర్యాపేట): బంగారం అపహరణ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. ఆత్మకూరు(ఎస్) మండల కోటినాయక్తండాకు చెందిన కోమటిరెడ్డి ఇంట్లో 2005 మార్చి 23న గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బంగారు చైన్, బ్రేస్లెట్, చెవి బుట్టలు, రూ.10 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేకు స్థానిక ఎస్ఐ బత్తిని శ్రీకాంత్గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన తుపాకుల చందు, కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన సున్పపు ధనుంజయ్ చోరీ చేసినట్లు గుర్తించి వారిని రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.హేమలతనాయుడు వాదనలతో ఏకీభవిస్తూ తుపాకుల చందుకు 4 నెలల 23 రోజులు, ధనుంజయ్కి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కోర్టు కానిస్టేబుల్ చైతన్య సహకరించారు. -
ఖర్చు ఎక్కువ అవుతోంది
మంచి ఉద్దేశంతో అదనపు కలెక్టర్ డ్రయ్యర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానిని వినియోగించాలంటే ప్రత్యేకంగా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సొంత ట్రాక్టర్ లేని రైతులు అద్దెకు తెచ్చుకోవాలి. ట్రాక్టర్కు కిరాయితో డీజిల్, డ్రయ్యర్కు డీజిల్ ఖర్చు భరించడం రైతులకు సమస్యగా మారుతోంది. 20 నుంచి 30ఎకరాల్లో పంట సాగు చేసే రైతులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం సాధ్యమవుతుంది. సాధారణ రైతులకు సాధ్యమయ్యే పరిస్థితి ఎంతమాత్రం లేదు. – ఉబ్బు వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, చౌటుప్పల్ -
రోడ్డు నిండా ధాన్యం.. బురదలోకి స్కూల్ వాహనం
తిప్పర్తి : నల్లగొండ పట్టణం నుంచి తిప్పర్తి మండలం దుప్పలపల్లి వరకు ఉన్న అద్దంకి–నార్కట్పల్లి రహదారి సర్వీస్రోడ్డులో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. దీంతో వాహనాలు రోడ్డు దిగి వెళ్లాల్సి వస్తోంది. గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోజు మాదిరిగానే విద్యార్థులను తీసుకెళ్లడానికి దుప్పలపల్లికి వస్తుండగా ధాన్యం రాశులు రోడ్డు కిందకు దిగింది. రోడ్డు కింది భాగం వర్షాలతో బురదమయంగా మారడంతో బస్సు బురదలో కూరుకుపోయి ఒక పక్కకు ఒరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులోకి ఇంకా పిల్లలు ఎక్కలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.


