breaking news
Yadadri
-
స్నాతకోత్సవానికి వేళాయే..
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి ముస్తాబైంది. స్నాతకోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో 12 కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఐఐటీ హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బిఎస్.మూర్తి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నారు. కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ స్నాతకోత్సవం నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్ ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి జిల్లా యంత్రాంగానికి, యూనివర్సిటీల బాధ్యులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా బాధ్యతలు అప్పగించారు. పాస్ ఉంటేనే అనుమతి స్నాతకోత్సవానికి యూనివర్సిటీలోకి విద్యార్థితో పాటు వారి వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని లోపలికి అనుమతించనున్నారు. వేదికపై వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే అతిథులు ఆసీనులు కావాల్సి ఉంటుంది. యూనివర్సిటీలోకి వెళ్లాలంటే వారికి ఇచ్చిన అనుమతి పత్రం (పాస్) తప్పనిసరిగా ఉండాలి. పాస్ లేకుంటే యూనివర్సిటీ లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించరు. లోపలికి వెళ్లే అధ్యాపకులు, ఇతర సిబ్బంది వెంట పిల్లలను, ఫోన్లు, బ్యాగ్లు, కెమెరాలను కూడా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఎంజీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆడిటోరియంలో వేదికపైన ఏర్పాట్లకు సంబంధించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని నిర్వహకులను ఆదేశించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించే స్నాతకోత్సవ ప్రాంతంలో పోలీసులు బాంబు స్క్యాడ్తో తనిఖీ చేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూనివర్సిటీ లోపలికి వెళ్లే వారిని తనిఖీ చేసిన తరువాతనే అనుమతించనున్నారు. పాస్లు, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే స్నాతకోత్సవ వేడుకకు అనుమతిస్తామని ఇప్పటికే ఎస్పీ శరత్చంద్రపవార్ స్పష్టం చేశారు. నేడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వేడుక ఫ ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఫ పీహెచ్డీ పట్టాలు అందుకోనున్న 22 మంది విద్యార్థులు ఫ 57 మందికి బంగారు పతకాలు అందజేయనున్న గవర్నర్ ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన 12 కమిటీలు -
రోడ్లకు మరమ్మతులు చేయించండి
భువనగిరి: జగదేవ్పూర్ రోడ్డు, రైల్వే బ్రిడ్జిపై గుంతలకు తక్షణమే మరమ్మతులు చేయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలోని జగదేవ్పూర్ రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మోకాలు లోతు గుంతలు ఏర్పడి రహదారులు అధ్వానంగా మారాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు దెబ్బతింటున్నాయన్నారు. పట్టణ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారని వాపోయారు. ఎమ్మెల్యే, అధికారులు మొద్దునిద్ర వీడి ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. పోలీసులు నచ్చజెప్పినా ధర్నా విరమించకపోవడంతో వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్షచ కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఖాజా అజీమోద్దీన్, నాయకులు ఇట్టబోయిన గోపాల్, కుశంగుల రాజు, తాడూరి భిక్షపతి, తాడెం రాజశేఖర్, వెల్దుర్తి రఘునందన్, బర్ల రమేష్, ఇక్బాల్ చౌదరి, ఇస్మాయిల్, మల్లయ్య, లక్ష్మీనారాయణ, ర్యాకల శ్రీనివాస్, మహేందర్రెడ్డి, కృష్ణ, కిష్టయ్య, పద్మ, సుభాష్,నర్సింగ్రావు, శ్రీనివాస్,మధు తదితరులు పాల్గొన్నారు. -
ఏటా ముంపు.. ఏదీ కనువిప్పు
మోస్తరు వానొచ్చినా వణుకుతున్న ఆలేరు.. నాలాల కబ్జాతో ముందుకెళ్లని వరద నీరు ఆక్రమణలు తొలగిస్తాంముంపు కాలనీ వాసుల కష్టాలను తొలగించడంపై దృష్టి సారించా. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా నాలాల ఆక్రమణల వల్ల పలు కాలనీలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించాం.ఆక్రమణలను తొలగించడంతో పాటు వరదనీటి ప్రవాహానికి ఉన్న ఇతర అడ్డంకులనూ తొలగిస్తాం. సమస్యపై ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నా. నాలాకు సంబంధించి రైల్వేట్రాక్ కింద మూసుకు పోయిన మార్గాలను క్లియర్ చేయాలని ఆదేశించాను. – ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యఆలేరు: మున్సిపాలిటీలోని పలు కాలనీలను ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆక్రమణలు తొలగిస్తామని ప్రకటిస్తున్నారు. తర్వాత అటువైపు కన్నెత్తి చూడటానికి తీరిక ఉండటం లేదన్న విమర్శలు న్నాయి. పాత మున్సిపల్ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి వద్ద నాలాలతో పాటు పెద్ద మోరి కబ్జాలతో కుంచించుకుపోయాయి. 40 అడుగులు ఉండాల్సిన పెద్దమోరీ 20 అడుగులే ఉండటం గమనార్హం. నాలాల పక్కల కొందరు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, మరికొందరు స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు చేయడంతో వరద ముందుకు వెళ్లడం లేదని, ఫలితంగా కాలనీలు ముంపునకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11వ తేదీ రాత్రి ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో బాధితులు ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. అన్నీ అడ్డంకులే..ఆలేరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న పెద్దమోరి వద్ద వరద ప్రవాహం పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ఈ మోరీ వద్ద మిషన్భగీరథ పైప్లైన్ వరదకు అడ్డుపడుతుంది. ఇదే ప్రాంతంలోని రైల్వేట్రాక్ కిందినుంచి వరదనీరు వెళ్లడానికి నాలుగు మార్గాలు ఉండగా అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మరో రెండు చెత్త ఇరుక్కుపోవడం తదితర కారణాలతో మూసుకుపోవడం వల్ల వరద నీరు ముందుకు వెళ్లడానికి ఆటంక ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. కాలనీల్లోకి వస్తున్న బ్యాక్ వాటర్ ఎగువనున్న బైరవకుంట, పర్రెకాల్వ నిండితే దిగువన 11,12 వార్డుల పరిధిలోని కల్వర్టులు, నాలా మీదుగా వరద నీరు వెళుతుంది. కానీ.. నాలాల కబ్జా, కల్వర్టుల సమస్యతో నీరు సాఫీగా ముందుకు వెళ్లడం లేదు. దీనికి తోడు మట్టి దిబ్బలు అడ్డుగా ఉండటంతో వర్షపు నీరు తిరిగి వెనక్కి వెళుతోంది. ఫలితంగా రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, పాత మున్సిపల్ కార్యాలయం ఏరియా, బ్రహ్మంగారి గుడి, ఈదమ్మగుడి వరకు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. సరుకులు, దుస్తులు తడిసి చీకట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ డిపే పరిస్థితులు ఏటా అనివార్యంగా మారాయి.ఎన్నడూ లేనంతగా ఈసారి వరద పోటెత్తింది. నాలాలు పొంగి మా కాలనీ ముంపునకు గురైంది. ఇళ్లలోకి మోకాలు లోతు నీళ్లు చేరాయి. రేషన్ సరుకులు, దుస్తులు తడిసిపోయాయి. నీళ్లలోనే పిల్లలు, వృద్ధులతో చీకట్లో భయంభయంగా గడిపాం. ఏటా వానాకాలం ముంపు సమస్యతో నరకం అనుభవిస్తున్నాయి. నాలాల కబ్జాల వల్లే వరద నీరు ముందుకెళ్లకుండా ఇళ్లలోకి వస్తుంది. – బండారు వెంకటయ్య, రంగనాయకుల వీధి కొన్నేళ్లుగా ముంపు సమస్యతో బాధపడుతున్నాం. వర్షం పడితే భయమేస్తుంది. ప్రతి సారి వరద పోటెత్తి కాలనీ ముంపునకు గురై, ఇళ్లలోకి నీరు చేరుతుంది.వర్షం తగ్గే వరకు భయంగా భయంగా గడపాల్సిన పరిస్థితి. నాలాల ఆక్రమణలే ముంపు సమస్యకు కారణం. అధికారులు లా దిశగా చర్యలు తీసుకోవాలి. – బాలరాజు, పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డుఆక్రమణలు.. అధికారుల నిర్లక్ష్యం.. సామాన్యులకు శాపంగా మారుతోంది. కబ్జాలతో నాలాలు కుంచించుకుపోవడంతో ఏటా వానాకాలం కాలనీలను వరద ముంచెత్తుతోంది. ప్రజలు నరకయాతన పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారు. ఇకనైనా ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ● బైరవకుంట, పర్రెకాల్వ బ్యాక్ వాటర్తోనూ ఇక్కట్లు పలు కాలనీలు జలమయం ఏటా ఇదే దురవస్థ.. కానరాని ప్రణాళిక -
గురుకులాల రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక
సంస్థాన్ నారాయణ పురం: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీని ఆది వారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఆధ్యక్షుడిగా సర్వేల్ గురుకుల పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ కేశిడి వెంకటనర్సయ్య, ఉపాధ్యక్షుడిగా డి.సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె.సుబ్బారావు, సంయుక్త కార్యదర్శిగా కె.రమాదేవి, కోశాధికారిగా వి. తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్.వెంకటాచార్యులు, ఆర్.ఉపేందర్రెడ్డి, గౌరవ సలహాదారులుగా రవిచందర్, తిరందాస్ శ్యాంసుందర్ను ఎన్నుకున్నారు. అమ్మపేరున మొక్క భువనగిరి: ఏక్ పేడ్ మాకే నామ్(అమ్మ పేరు మీద ఒక చెట్టు) కార్యక్రమంలో భాగంగా అదివారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తల్లులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాలలు, ఇంటి ఆవరణతో పాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి ఫొటో తీసుకుని ఏకో క్లబ్ పోర్టల్లో ఆప్లోడ్ చేసి సర్టిఫికెట్లు పొందారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి భువనగిరిటౌన్ : తెలంగాణ ప్రజలు ఈనెల 17వ తేదీన తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ కొమ్మిడి నర్సింహా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజు అని, కొందరు నేతలు సెప్టెంబర్ 17ను తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్రోహ దినమని కొందరు, విలీన దినమని మరికొందరు వాదిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 ప్రత్యేకమైన రోజని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం అన్నారు. వాస్తవాలను నేటి పాలకులు గుర్తించాలని కోరారు. లేకుంటే తెలంగాణ పోరాట చరిత్రను అవమానించడమేనని కొమ్మిడి నర్సింహారెడ్డి పేర్కొన్నారు. -
ఆధునిక దేవాలయం.. సాగర్
నాగార్జునసాగర్: ఆధునీక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్వదేశీ ఇంజనీర్ల పనితనానికి మచ్చుతునకగా నిలుస్తోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాలలో ఓ కొలిక్కి వచ్చింది. 45వేల మంది శ్రామికులు 24గంటలు పనిచేసి సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎద్దుల బండ్లలో రాళ్లను తీసుకొచ్చి డ్యాం వద్దకు చేర్చేవారు. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే రాతి నిర్మించిన కట్టడాలలో ఒకటి. 1967లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం 1974లో క్రస్ట్ గేట్ల నిర్మాణం పూర్తయ్యింది. ఆనాటి ఇంజనీర్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేసేవారని రిటైర్ ఇంజనీర్లు తెలిపారు. నేడు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం, మిషనరీ ఆనాడు లేవు. కనీసం సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా నేడున్నన్ని సమాచార సాధనాలు లేవు. అయినా ఆనాటి ఇంజినీర్ల బలమైన కోరిక ప్రాజెక్టును సకాలంలో అంచనా వ్యయం కన్నా తక్కువ వ్యయంతో పూర్తిచేశారు. 590 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టుండగా.. 110 చదరపు మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉంటుంది. ప్రాజెక్టు 408 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కల్గి ఉండేలా నిర్మించారు. కాలక్రమేణా పూడిక నిండటంతో ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం పలుమార్లు అంచనాకు మించి వరదలు వచ్చినప్పటికీ సాగర్ ప్రాజెక్టు నిలబడింది. స్పిల్వే మీదుగా 2009లో 14లక్షల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేశారు. -
ఇంజనీర్ల మేధోశక్తికి తార్కాణం ‘ఆసిఫ్నహర్’
రామన్నపేట/వలిగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఆసిఫ్నహర్ కాలువ ప్రధానమైనది. ఈ కాలువ ద్వారా వలిగొండ, రామన్నపేట, నార్కట్పల్లి, కట్టంగూర్, నల్లగొండ మండలాలలోని 15,245 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిజాం రాజు ఆసిఫ్ అలీ 1903లో ఈ కాలువ తవ్వకాన్ని ప్రారంభించి 1906లో పూర్తిచేశాడు. నహర్ అనగా ఉర్దూలో కాలువ అని అర్ధం. ఈ కాల్వను ఆసిఫ్ అలీ కాలంలో నిర్మించడంతో ఆసిఫ్నహర్ అనే పేరు వచ్చింది. ఆసిఫ్నహర్ కాలువ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నెమిలికాల్వ వద్ద ప్రారంభమవుతుంది. ఇక్కడ మూసీ నదిపై కత్వను ఏర్పాటుచేసి డిస్ట్రిబ్యూటరీని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కాలువ సామర్ద్యం 397క్యూసెక్కులు. కాలువ పొడవు 100కిలోమీటర్లు. ఇందులో సుమారు 13కి.మీ. కాలువ సహజ సిద్ధంగా ఉంది. కాలువ ద్వారా 21 పెద్ద చెరువులను, 32 చిన్న చెరువులను నింపడం జరుగుతుంది. కాలువ వెంట 135 తూములు, 15కత్వలు, 30వంతెనలు ఏర్పాటు చేశారు. నెమిలి కాల్వ కత్వ నుంచి నీళ్లు నేరుగా ఇంద్రపాలనగరం చెరువులోకి వస్తాయి. అక్కడి నుండి తూముల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. పన్నెండు దశాబ్దాలు దాటినా ఆసిఫ్నహర్ కాలువ పటిష్టంగా ఉండడం ఆనాటి ఇంజనీర్ల పనితీరుకు అద్దం పడుతోంది. ఆనాటి ఇంజనీర్లు కత్వలతో పాటు రెగ్యులేటరీలు, వంతెనలు, చెరువులు, కాలువలు, తూముల నిర్మాణానికి పూర్తిగా రాతిని ఉపయోగించారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో సహజ సిద్ధంగా కాలువలో నీరు పారేలా అప్పటి ఇంజనీర్లు డిజైన్ చేశారు. కాలువలో పూడికతీత, గుర్రపుడెక్క ఆకు తొలగింపు, గండ్లు పూడ్చివేత పనులు మినహా రెగ్యులరీలు, తూములకు వందేళ్ల కాలంలో చేసిన మరమ్మతులు చాలా తక్కువ. -
అద్భుతం.. కాల్వ నిర్మాణం
పెన్పహాడ్: పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శివారులో మూసీ నదిపై సాగర్ ఎడమ కాల్వ నిర్మాణం ఇంజనీర్ల అద్భుతమైన ప్రతిభకు గొప్ప నిదర్శనం. సాధారణంగా నదిపై ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేస్తారు. కానీ ఇక్కడ నదిపై నుంచి కాల్వ ప్రవహించేలా ఇంజనీర్లు నిర్మాణం చేపట్టారు. 1955–60 మధ్యన మూసీ నది పైనుంచి 50 అడుగుల ఎత్తులో 32 కానాలతో సాగర్ కాల్వను రాతి కట్టడంతో నిర్మించారు. దీని ద్వారా సాగర్ నుంచి వచ్చే నీరు మూసీ నదిపై ఎలాంటి అటంకాలు లేకుండా ప్రవహించేలా చేశారు. వంతెన కింది నుంచి మూసీ నీరు ప్రవహిస్తుంది. సాగర్ కాల్వ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. ఇంజనీర్ల దూరదృష్టి, నైపుణ్యం, పట్టుదలకు ఈ కట్టడం సాక్ష్యంగా నిలిచింది. -
కింద వాగు.. పైన సాగర్ ఎడమ కాల్వ
హాలియా: నాటి ఇంజనీర్ల మదిలో పుట్టిన ఎన్నో అపురూపమైన కట్టడాలల్లో మచ్చుకకు కొన్ని మన కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. వాటిలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అహల్య(హాలియా) వాగుపై నిర్మించిన ఆక్వెడక్ట్ నిర్మాణం ఒకటి. సాగర్ ఎడమ కాల్వ నిర్మాణ సమయంలో 1955–60 మధ్య కాలంలో హాలియా వాగుపై రాతితో ఈ ఆక్వెడక్ట్ను నిర్మించారు. ఆక్వెడక్ట్ అనేది కాల్వ నీటిని సహజ వాగులు, నదులు లేదా లోయల మీదుగా తీసుకెళ్లడానికి చేపట్టిన నిర్మాణం. హాలియా వాగుపై సుమారు 600 మీటర్ల పొడవు, 24 రాతి (కానాలు) పిల్లర్లతో పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేసి దాని పైభాగంలో సాగర్ ఎడమ కాల్వ నీరు ప్రవహించేలా, కింది నుంచి హాలియా వాగు ప్రవహించేలా ఈ ఆక్వెడక్ట్ను నిర్మించారు. 24 పెద్ద రాతి గోడలను హాలియా వాగులో నిర్మించి దానిపై బ్రిడ్జి కట్టి ఆ పైభాగంలో సుమారు 25 ఫీట్ల ఎత్తులో కాల్వ ఉండేలా డిజైన్ చేశారు. యూ ఆకారంలో దీని నిర్మాణం చేపట్టి సాగర్ ఎడమ కాల్వ నీటి ప్రవహం వేగంగా వెళ్లేగా నాటి ఇంజనీర్లు రూపకల్పన చేశారు. కింది భాగంలో ఉన్న హాలియా వాగు ఎగువ నుంచి వచ్చే వరదతో వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో ఈ బ్రిడ్జి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. -
నీటి కరువు తీర్చిన నిజాం చీఫ్ ఇంజనీర్
డిండి: డిండి ప్రాజెక్టు నిజాం కాలంలో నిర్మించబడి నేటికీ వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. కృష్ణానదికి ఉపనది అయిన దుందుబి నది పరివాహాక ప్రాంతంలో సాగు, తాగునీటి కష్టాలను దూరం చేయాలనే ఆలోచన నిజాం కాలం నాటి చీఫ్ ఇంజనీర్ ఖాజా అజీమొద్దీన్ మదిలో మెదిలింది. దీంతో దుందుబి వాగు ద్వారా వృథాగాపోతున్న నీటిని నిల్వ చేసేందుకు ప్రాజెక్టును నిర్మించాలని ఆయన అప్పటి నిజాం రాజు దృష్టికి తీసుకెళ్లారు. అజీమొద్దీన్ ఇంజనీరింగ్ ప్రతిభతో 1940–43 మధ్య కాలంలో రూ.34.36 లక్షలు ఖర్చుచేసి హైదరాబాద్–శ్రీశైలం వెళ్లే మార్గంలో డిండి మండల కేంద్రంలో పెద్ద పెద్ద బండరాళ్లు, గచ్చుతోటి ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచి వర్షాధారం పైనే ఆధారపడి నిండుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 12500, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల ఆయకట్టు సాగుకు నీరందిస్తోంది. డిండి ప్రాజెక్టు పూర్తికాగా మిగిలిన డబ్బుతో డిండి మండల కేంద్రానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో డిండి నుంచి దేవరకొండకు వెళ్లే మార్గంలో బాపన్కుంట వద్ద అజీంఘడ్ అనే కోటను కూడా నిర్మించారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న కోట అందాలను చూసేందుకు నిత్యం వస్తున్న పర్యాటకులు వస్తుంటారు. -
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా సనాతన ధర్మం
సూర్యాపేట: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా సనాతన ధర్మం నిలుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో సనాతన ధర్మ పరిరక్షణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సనాతన ధర్యంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా సనాతన ధర్మం విరాజిల్లుతుందని కొనియాడారు. దేశ నలుమూల నుంచి వచ్చిన స్వామీజీలు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాషాయానికి విలువ పెరుగుతుందని, మహా కుంభమేళాలో 15కోట్ల మంది హిందువులు పాల్గొన్నారని కొనియాడారు. హిందువుల్లో ఐక్యత లేక సనాతన ధర్మం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు సనాతన ధర్మం కోసం కృషి చేయాలన్నారు. ఇతర మతస్తుల దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి హిందువు సన్నద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ బీరెల్లి చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జాతీయ స్వామీజీ, పీఠాధిపతి సాధువుల అధ్యక్షుడు అంబికేశ్వరానంద స్వామీజీ, కక్కిరేని చంద్రశేఖర్, రాచర్ల కమలాకర్, ఈగ దయాకర్, బ్రాహ్మణపల్లి మురళీధర్, నూకా వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
దీర్ఘ దృష్టితో ప్రాజెక్టుల నిర్మాణం
దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా శాలిగౌరారం ప్రాజెక్టు, రాచకాల్వ నిర్మాణం చేపట్టారు. 117 సంవత్సరాలు గడిచినా నేటికీ ప్రాజెక్టు, రాచకాల్వ చెక్కుచెదరకపోవడానికి కారణం నాటి ఇంజనీర్ల ముందుచూపే. భవిష్యత్లో ఎన్ని అవాంతరాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ప్రాజెక్టుల నిర్మాణాలు పట్టిష్టంగా ఉండేలా ప్రణాళికలను రూపొందించుకోవడమే ఇంజనీరింగ్ విధానం. – సత్యనారాయణ, ఇరిగేషన్ ఈఈ, శాలిగౌరారం ప్రాజెక్టు, తిరుమలగిరి డివిజన్ -
రాతి గోడలతో రాజకోట
రాజాపేట: రాజాపేట మండల కేంద్రంలో 250 ఏళ్ల క్రితం రాజుల కాలంలో నిర్మించిన రాజకోట ఇన్నేళ్లవుతున్నా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. రాజరాయన్న 1775లో ఈ రాజకోటను రాతి గోడలతో నిర్మిచారు. అప్పటి నిజాం పాలకులు సంస్థాన్ నారాయణపురం, సంస్థాన్ రాజాపేట కోటను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. ప్రజా పాలన కోసం తమ రక్షణ కోసం అప్పటి శాసీ్త్రయ పద్ధతిలో ఈ కోటను శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఇందుకు గాను డంగుసున్నంతో పెద్దపెద్ద రాళ్లతో కోటగోడలు నిర్మించారు. ఈ రాజకోట బురుజులు, ఎత్తైన ప్రాకారాలతో ఉంది. శత్రువులు రాకుండా కందకాల్లో మొసళ్లను పెంచేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామం చుట్టూ ఒక పద్ధతిగా కందకాలను ఏర్పాటు చేశారు. -
చెక్కుచెదరని కట్టడాలు
నిజాం కాలంలో, దశాబ్దాల క్రితం ఉమ్మడి జిల్లాలో నిర్మించిన పలు సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేని కాలంలో నిర్మితమైన ఈ కట్టడాలు ఆనాటి ఇంజనీర్ల మేధస్సుకు, ప్రతిభకు తార్కాణంగా నిలస్తున్నాయి. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా పురాతన కాలం నాటి కట్టడాలు, ప్రాజెక్టులపై ప్రత్యేక కథనం.శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం శాలిగౌరారం ప్రాజెక్టు● ఉమ్మడి జిల్లాలో ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతున్న నిర్మాణాలు నేడు ఇంజనీర్స్ డే శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు శాలిగౌరారం మండలం వల్లాల గ్రామ శివారు నుంచి ఆకారం, శాలిగౌరారం, గురుజాల వరకు 12 కిలోమీటర్ల పొడవున ఉన్న ఏనెను ఆధారంగా చేసుకొని ఆకారం, శాలిగౌరారం చెరువులను నిర్మించారు. కానీ చెరువుల్లోకి నీరువచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. నిజాం నవాబులు 1908లో శాలిగౌరారం చెరువును ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. ప్రాజెక్టులోకి నీరు వచ్చేందుకు వీలుగా రామన్నపేట మండలం పల్లివాడ వద్ద మూసీ నదికి అడ్డంగా ఆనకట్టతో పాటు హెడ్రెగ్యూలేటర్ను నిర్మించారు. ఈ హెడ్రెగ్యులేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర రాచకాల్వను తవ్వారు. 117 సంవత్సరాలైన చెక్కుచెదరని ప్రాజెక్టు, రాచకాల్వ.. 117 సంవత్సరాల తర్వాత కూడా శాలిగౌరారం ప్రాజెక్టు, రాచకాల్వ చెక్కుచెదరలేదు. 1200 ఎకరాల విస్తీర్ణం, 21 అడుగుల నీటి సామర్ధ్యం ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టు కట్ట పొడవు 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ప్రాజెక్టుకు కుడి, ఎడమ తూములను నిర్మించి శాలిగౌరారం మండలంలోని తొమ్మిది గ్రామాల్లోని ఆరువేల ఎకరాలకు సాగునీరందేలా కాల్వలను తవ్వారు. రాచకాల్వలో నీటి ప్రవాహం ఎంత పెరిగినా కట్ట తెగకుండా 10 సర్ప్లస్ వియర్స్లను నిర్మించారు. అదేవిధంగా పల్లివాడ వద్ద హెడ్రెగ్యూలేటర్తో పాటు తుర్కపల్లి, అమ్మనబోలు వద్ద రెగ్యూలేటర్లను నిర్మించారు. ఆయా రెగ్యూలేటర్ల వద్ద షట్టర్ల నిర్మాణంతో పాటు ప్రవాహం పెరిగినప్పుడు నీటిని మూసీలోకి దారి మళ్లించేందుకు ఎస్కేప్ రెగ్యూలేటర్లను కూడా నిర్మించారు. రాచకాల్వకు ఒకవైపున మాత్రమే కట్ట ఉండటం విశేషం. ప్రాజెక్టు, రాచకాల్వపై ఉన్న రాతి కట్టడాలన్నీ డంగుసున్నంతో నిర్మించినవి కావడం గమనార్హం. శాలిగౌరారం ప్రాజెక్టుకు 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రాచకాల్వకు అనుసంధానంగా శాలిగౌరారం ప్రాజెక్టుతో పాటు 24 చెరువులు, కుంటలు ఉన్నాయి. -
నకిలీ జామీను పత్రాలు సృష్టిస్తున్న ఇద్దరి అరెస్ట్
భువనగిరిటౌన్ : నకిలీ జామీను పత్రాలు తయారుచేస్తున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనుగూడెం గ్రామానికి చెందిన తిరుగమల్ల సోమయ్య, ఖమ్మంకు చెందిన సింగిరెడ్డి విజయ్భూపాల్రెడ్డి కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శుల పేరిట నకిలీ రబ్బరు స్టాంపులు తయారుచేసి నల్లగొండలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఖాళీ ఇంటి టాక్స్ రశీదు పుస్తకాలు, విలువైన ఆస్తి పత్రాలు సేకరించారు. నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తూ నకిలీ డాక్యుమెంట్స్ రూపొందించి నిందితులకు స్వయంగా జామీను ఇవ్వడం, సీజ్ అయిన వాహనాల విడుదలకు నకిలీ డాక్యుమెంట్స్ అందజేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో డాక్యుమెంట్కు రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. పక్కా సమాచారం మేరకు వారిద్దరిని శుక్రవారం రాత్రి భువనగిరిలోని లాడ్జిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటివరకు 24 నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించినట్టు పోలీసులు వివచారణలో తేలింది. వారిద్దరిని శనివారం రాత్రి కోర్టులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్కు తరలించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చిలుకూరు: అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపంకు గురైన రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జెర్రిపోతుగూడెం గ్రామానికి తానం రవీందర్రెడ్డి(42) గతంలో ఫైనాన్స్ నడిపించేవాడు. ఫైనాన్స్లో ఇబ్బందులు రావడంతో కొంతకాలంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల గ్రామంలో రూ.60లక్షలతో కొత్త ఇల్లు నిర్మించాడు. మూడు నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన అప్పులతో ఇబ్బందులు పడుతున్నాడు. అప్పు ఇచ్చిన కొంతమందికి సోమవారం తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లుగా తెలిసింది. దీంతో వాళ్లకు డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియక మనస్తాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి గడ్డి మందు తీసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ గడ్డి మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి రవీందర్రెడ్డి కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆలేరు అభివృద్ధికి మోక్షం
ఆలేరు: ఆలేరు పట్టణవాసుల అవస్థలు తీరనున్నాయి. మున్సిపల్ ఖజనాలో మూలుగుతున్న తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) నిధులు రూ.15 కోట్లు ఖర్చు చేయడానికి కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అభివృద్ధి పనులకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. టీయూఎఫ్ఐడీసీ నిధులతో పాటు మున్సిపాలిటీకి చెందిన మరో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. రూ.12 కోట్లతో చేపట్టనున్న పనులు ఇవీ.. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. ఓపెన్ నాలాల వల్ల ఇళ్లు, కాలనీల మధ్య మురుగు నిలిచి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరహా సమస్యలు పరిష్కరించేందుకు టీయూఎఫ్ఐడీసీ నిధుల్లో రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేయనున్నారు. మున్సిపల్ భవనానికి రూ.3 కోట్లు రూ.3 కోట్లు మున్సిపల్ భవన నిర్మాణానికి వెచ్చించనున్నారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ చాంబర్లతోపాటు విశాలమైన కౌన్సిల్ సమావేశ మందిరం, సెక్షన్ల వారీగా సిబ్బంది గదులు రానున్నాయి. పాత పంచాయతీ కార్యాలయం వద్ద భవన నిర్మాణానికి శిలాఫలకం వేసిన సంగతి తెలిసిందే. టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే కాంట్రాక్టు శ్రీవెంకటేశ్వర కన్సల్టెన్సీ దక్కించుకుంది. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల సూచన మేరకు డీపీఆర్ను సిద్ధం చేసే పనిలో కన్సల్టెన్సీ ఉంది. మొత్తం మూడు సంస్థలు పోటీ పడ్డాయి. టీయూఎఫ్ఐడీసీ నిధులకు వీడిన గ్రహణం ఫ రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఫ మరో రూ.15 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు మున్సిపల్ శాఖ వద్ద డీపీఆర్ ఆమోదం పొందగానే టెండర్లు ఆహ్వానిస్తాం. అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలల్లో పూర్తికానుంది. – శ్రీనివాస్, ఆలేరు మున్సిపల్ కమిషననర్ -
21 సంఘాలకు రూ.3.15 లక్షలు విడుదల
భువనగిరి: స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. జిల్లాలో 14,848 సంఘాలు ఉండగా ఇందులో కొత్తగా ఏర్పాటైన 21 సంఘాలకు రూ.3,15,000 విడుదలయ్యాయి. ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున కేటా యించనున్నారు. ఈ నిధుల వినియోగాన్ని గ్రామీణాఽభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ మహిళా సమాఖ్యలు పర్యవేక్షించనున్నాయి. ఈ నిధులను ఆయా సంఘాల్లోని సభ్యులకు రుణాల రూపంలో ఇవ్వనున్నారు. మత్స్యగిరి క్షేత్రంలోకలెక్టర్ దంపతుల పూజలు వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం కలెక్టర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు ని ర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, స్వామివారి ఫొటో బహూకరించారు. నేడు, రేపు వర్ష సూచనభువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో నేడు, రేపు (ఆది, సోమవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షంతో పాటు 30 నుంచి40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రామన్నపేటలో 56 మి.మీ, సంస్థాన్నారాయణపురంలో 46 మి.మీ, తుర్కపల్లి 41 మి.మీ, బీబీనగర్ 27 మి.మీ, మోటకొండూరు 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆలేరు అభివృద్ధికి మరిన్నినిధులివ్వండి యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం హైదరాబాద్లో కలిశారు. ఆలేరు నియోజకవర్గ సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించారు. మరిన్ని నిధులిచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎన్సీసీ అధికారికి కెప్టెన్గా పదోన్నతిఆలేరు: ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్కు పదోన్నతి లభించింది.ఎన్సీసీ సెకండ్ (లెఫ్ట్నెంట్) ఆఫీసర్గా కొనసాగుతున్న ఆయనకు..ఫస్ట్ ఆఫీసర్(కెప్టెన్) గా పదోన్నతి కల్పిస్తూ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. నాగపూర్లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ కోర్సు పూర్తి చేసిన నేపథ్యంలో ఆయనకు లెఫ్ట్నెంట్ నుంచి కెప్టెన్గా పదోన్నతి దక్కింది. శుక్రవారం వరంగల్ జిల్లా మామూనూరు పోలీసు శిక్షణ కేంద్రంలో జరిగిన పిప్పింగ్ సెర్మనీలో వెంకటేష్కు కల్నల్ రామదుౖరై, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే ర్యాంకులు తొడిగి అభినందనలు తెలిపారు. పదవ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ అధికా రులు ఆయనకు అభినందించారు. -
ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శని వారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు కక్షిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఒక్క రోజే 36,182 కేసులు పరిష్కారం అయ్యాయి. భువనగిరి లో లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జయరాజు ప్రారంభించారు. రాజీమార్గం ద్వారా ఒక్కటైన దంపతులను, రూ.22 కోట్ల భూమి కొనుగోలు వివాదా న్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్న ఇరువర్గాలను, వారి తరఫు న్యాయవాదులను అభినందించి అవార్డు కాపీలు అందజేశారు. రాజీపడిన కేసులు క్రిమినల్ 2,500, సివిల్ 14, ప్రిలిటిగేషన్, టెలిఫోన్ బకాయిలు, ఎస్బీఐ, టీజీ బ్యాంకుల కేసులు 76, ట్రాఫిక్ చలానాకు సంబంధించి 33,592 కేసులు ఉన్నాయి. రాజీయే రాజమార్గం కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు ఎంతో దోహపడుతా యని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు పేర్కొన్నారు. రాజీయే రాజ మార్గం అని, కక్షిదారులు చిన్నచిన్న కేసులను లోక్ అదాలత్లలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, పీపీలు, ఏపీపీఓలు సౌజన్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఫ జాతీయ లోక్ అదాలత్కు భారీ స్పందన ఫ రాజీపడిన పలువురు కక్షిదారులకు అవార్డు కాపీలు అందజేత -
రైతుల శవాలపై రోడ్డు నిర్మాణం చేస్తారా..
చౌటుప్పల్ : భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా వారి శవాలపై రోడ్డు నిర్మాణం చేస్తారా.. అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్లూ చౌటుప్పల్లో ఆగారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం అయ్యారు. అలైన్మెంట్ మార్పునకు కృషి చేయాలని భూనిర్వాసితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. నిర్వాసితుల విషయంలో ఎందుకు సానుకూలంగా ఆలోచించడం లేదన్నారు. నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, బేషజాలకు పోకుండా వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమావేశంలో భూ నిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్రెడ్డి, నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, పల్లె శేఖర్రెడ్డి, సుర్వి యాదయ్య, బచ్చనగోని గాలయ్య,గంగదేవి సైదులు, బోరెం ప్రకాష్రెడ్డి, సందగళ్ల మల్లేష్గౌడ్, బొమ్మిరెడ్డి ఉపేందర్రెడ్డి, పల్లె పుష్పారెడ్డి, పల్లె మధుకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
నేడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం
లక్ష్యం మేరకు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. పాఠశాలల ఆవరణ, ఇంటి పరిసరాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. విద్యార్థులు మొక్కలు నాటే క్రమంలో ఫొటో తీసుకుని వెంటనే ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైప్ ఫోర్టల్లో ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులకు మొక్కలు నాటినట్లుగా సర్టిఫికెట్ వస్తుంది. భువనగిరి: భవిష్యత్ తరాలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆదివారం ఏక్ పేడ్ మాకే నామ్ (అమ్మపేరు మీద ఒక చెట్టు) కార్యక్రమానికి పూనుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో మొక్కలు నాటించనుంది. ఒకే రోజు 10 వేల మొక్కలు నాటించాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. 45 వేల మంది విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు చెందిన 6 నుంచి 12వ తరగతి వరకు 45 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి వారి తల్లి పేరు మీద మొక్క నాటనున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అవసరమైతే తల్లితో కలిసి విద్యార్థులు మొక్క నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను విద్యార్థులకు అందజేయనున్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మొక్కలు నాటాలి. ఒకే రోజు లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ఆవరణలు, ఇళ్ల పరిసరాల్లో మొక్కలు నాటవచ్చు. విద్యార్థులంతా మొక్కలు నాటేలా వారిని సంసిద్ధులను చేయాలని ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలకు సూచించాం. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడంతో పాటు విద్యార్థులకు చెట్ల ప్రాధాన్యత తెలుస్తుంది. –సత్యనారాయణ, డీఈఓఫ ప్రతి విద్యార్థి మొక్క నాటేలా కార్యాచరణ ఫ లక్ష్యం 10 వేల మొక్కలు ఫ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి -
రూ.232 కోట్లతో పోలీసు గృహాల నిర్మాణం
నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా రూ.232 కోట్లతో పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్మించిన ఏఆర్ డీఎస్పీ రెసిడెన్షియల్ క్వార్టర్, సీఐ, ఎస్ఐ క్వార్టర్లను, శిశువిహార్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తున్నామన్నారు. ఎక్కడైనా క్వార్టర్లు శిథిలావస్థలో ఉంటే వాటిని తొలగించి కొత్తగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ రమేష్రెడ్డిని మంత్రి ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయం 50ఏళ్ల క్రితం నిర్మించిందని, త్వరలో దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏఆర్ కానిస్టేబుళ్ల క్వార్టర్లు కూడా నూతనంగా నిర్మిస్తామన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24గంటలు పనిచేస్తారని వారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. సమాజంలో మత్తు పదర్ధాల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఐజీ తఫ్సీర్ ఇక్బాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
నూతన ఆవిష్కరణలతో ప్రత్యేక గుర్తింపు
విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఎంజీయూ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. 12 మంది ఈఈఈ విద్యార్థులు రూ.3.50లక్షలతో 8 మంది ప్రయాణించే సోలార్ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనానికి నాలుగు గంటలు చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా సౌరశక్తితో చార్జింగ్ అయ్యేలా సోలార్ ప్యానెల్స్ బిగించారు. దాదాపు 8గంటల పాటు వాహనం ఎండలో ఉంటే.. బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీంతో పాటు అనేక నూతన ఆవిష్కరణలను ఎంజీయూ విద్యార్థులు చేపట్టారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీంద్రనాయక్ యాదగిరిగుట్ట: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. అందిస్తున్న వైద్యుల సేవలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో సమావేశమై జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా వైద్య, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, మెడికల్ ఆఫీసర్ పావని, డాక్టర్ హరీష్, సీహెచ్వో వెంకటయ్య, పీహెచ్ఎన్ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో కియోస్క్ యంత్రాలు ప్రారంభంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన స్వీయ సేవా కియోస్క్ యంత్రాలను ఈఓ వెంకట్రావ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ఆలయ ప్రసాద విభాగం వద్ద మూడు, చౌల్ట్రీస్, డోనార్ సెల్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాల వద్ద ఒక్కో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజిటల్ పేమెంట్ ద్వారా కియోస్క్ యంత్రాల ద్వారా భక్తులు సులభంగా దర్శనం, సేవల టిక్కెట్లు, ప్రసాదం, వ్రతాలకు సంబంధించిన టిక్కెట్లను పొందవచ్చన్నారు. భక్తులు వేగంగా, సులభంగా కౌంటర్ల వద్ద ఆలస్యం లేకుండా టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, కెనరా బ్యాంక్ అధికారులు, ఆలయాధికారులు పాల్గొన్నారు. -
క్యాంపు కార్యాలయం ముట్టడి.. నిర్వాసితుల అరెస్టు
నల్లగొండ: రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాగా.. రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న గట్టుప్పల్ మండలానికి చెందిన పలువురు రైతులు మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే భూనిర్వాసితులు నల్లగొండకు రాకుండా ముందస్తుగానే కొంతమందిని గట్టుప్పల్లో పోలీసులు అరెస్టు చేశారు. కొందరు నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి రాగా.. వారిని కూడా నల్లగొండ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసి అనంతరం వదిలేశారు. తమకు మార్కెట్ ధర కట్టించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాము మంత్రితో మాట్లాడతామని భూనిర్వాసితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతైన విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలం సుంకిశాలతండాకు చెందిన కేళావత్ శ్రీనునాయక్(45) ఐదేళ్లుగా పెద్దవూర మండలం పొట్టివానితండాలో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొట్టివానితండాకు చెందిన రమావత్ దత్తు శుక్రవారం శ్రీనునాయక్ పత్తి చేనులో అరక తోలడానికి వచ్చాడు. అయితే దత్తు కుమార్తె అంజలికి కొంతకాలంగా ఆరోగ్యం బాగుండకపోవడంతో అతడి భార్య, మరో వ్యక్తి కలిసి అంజలిని అల్వాల గ్రామఽ శివారులోని సాగర్ ఎడమ కాలువ పక్కన దర్గా వద్ద గల బావూజీ(మంత్రగాడు) వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని దత్తు శ్రీనునాయక్కు చెప్పి.. తాను అరక తోలుతున్న కావున శ్రీనునాయక్ను బావూజీ వద్దకు వెళ్లాలని కోరాడు. దీంతో శ్రీనునాయక్ బావూజీ పూజలు చేసే ప్రదేశానికి వెళ్లి దత్తు కుమార్తె అంజలికి పూజలు చేయించారు. అనంతరం దత్తు కుమార్తె అంజలికి స్నానం చేయించడానికి ఆమెతో పాటు శ్రీనునాయక్ సాగర్ ఎడమ కాలువలోకి దిగాడు. బాలిక స్నానం చేస్తున్న క్రమంలో కాలుజారి కాలువలో పడిపోయింది. శ్రీనునాయక్ గమనించి వెంటనే కాలువలోకి దూకి బాలికను ఒడ్డుకు చేర్చాడు. అనంతరం శ్రీనునాయక్ ఒడ్డుకు వస్తున్న క్రమంలో అప్పటికే అలసిపోయిన అతడు నీటి ప్రవహానికి కాలువలో కొట్టుకుపోయాడు. ఎంత గాలించినా శ్రీనునాయక్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి భార్య బుజ్జి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. -
ఎన్సీసీ జాతీయ శిబిరంలో ఆలేరు క్యాడెట్ల ప్రతిభ
ఆలేరు: వరంగల్ జిల్లా మామునూర్లోని పోలీసు శిక్షణ కేంద్రంలో జరుగుతున్న ఎన్సీసీ జాతీయ శిబిరంలో ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పది మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు గాను వివిధ రాష్ట్రాలకు చెందిన క్యాడెట్లు తమ సంస్కృతి, ఆచారాలు, భాషలు, వంటలు, అలవాట్లు తదితర అంశాలను పరస్పరం పంచుకున్నారు. ఆయా అంశాల్లో ప్రతిభ కబరిచినందుకు గాను ఆలేరు ఎన్సీసీ క్యాడెట్లు శ్రేణిక, శ్రీజ, వెన్నెల, దేవిక, అర్చన, మణి తదితరులకు క్యాంపు డిప్యూటీ కమాండెంట్ కల్నల్ రామదురై, జాతీయ శిబిరం శిక్షణాధికారి లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే, క్యాంపు అడ్జెసెంట్ డాక్టర్ ఎం. సదానందం తదితరులు అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్ శుక్రవారం తెలిపారు. -
విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
తిరుమలగిరి(తుంగతుర్తి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమలగిరిలో నిజాంకు వ్యతిరేకంగా కొనసాగిన పోరాటంలో అమరులైన బండి యాదగిరి, పోరెల్ల దాస్ స్మారక స్థూపాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న దోపిడి, అణచివేత, ఖాసీం రజ్వి అమానుష పీడనను చరిత్ర ఎప్పటికీ మరచిపోదన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ లభించిందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం లాగానే ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. బండి యాదగిరి, పోరెల్ల దాస్ త్యాగాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రామచంద్రయ్య, విమోచన కమిటీ రాష్ట్ర కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్రెడ్డి, పాతూరి కరుణ, బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, సూర్యాపేట జిల్లా విమోచన కమిటీ కన్వీనర్ మన్మథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ బీజేపీ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి -
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
గరిడేపల్లి: మహిళలు, యువతులు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ రిలేషన్షిప్ మేనేజర్ వి. అనిల్ అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో చిరుధాన్యాలతో ఉత్పత్తుల తయారీపై యువతులు, మహిళలకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఉపయోగాలను తెలియజేసిన ఈ శిక్షణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలు గ్రూపులుగా ఏర్పడి చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోగలిగితే ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆరోగ్యం, ఆదాయం కూడా లభిస్తుందన్నారు. బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరేష్, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్. సుగంధి, శాస్త్రవేత్తలు ఎ. కిరణ్, సీహెచ్. నరేష్, డి. ఆదర్శ్, పి. అక్షిత్ పాల్గొన్నారు. -
కొందరి కోసం రైతులను ముంచుతారా
చౌటుప్పల్ : చౌటుప్పల్లోని దివీస్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్చిందని, కొందరి ప్రయోజనాల కోసం రైతులను ముంచుతారా అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రశ్నించారు. గతంలో రూపొందించిన ప్రకారంగా రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ను ఉంచాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్, నారాయణపురం, వలిగొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల భూనిర్వాసితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనల ప్రకారం అలైన్మెంట్ను 40కిలోమీటర్ల దూరానికి మార్చాలని డిమాండ్ చేశారు. భూమికి భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారం మూడు రెట్ల పరిహారం చెల్లించాలని నిర్వాసితులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం పాల్గొని మాట్లాడుతూ.. కొందరికి మేలు చేసేందుకు వందలాది మందిని ఆగం చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమను రైతులపై చూపాలన్నారు. కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి ముసుగులో చేసే మోసానికి వ్యతిరేకమని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్రోడ్డు(ట్రిపుల్ఆర్) నడుమ దూరం 40కిలోమీటర్లు ఉండాల్సిందేనన్నారు. కోట్లు విలువ చేసే భూములు తీసుకుని, ప్రభుత్వం భూనిర్వాసితులకు చెల్లిస్తున్న డబ్బులతో స్థానికంగా ఒక్క ప్లాటు కూడా వచ్చే పరిస్థితులు లేవన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పిడికి దివీస్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి అందిన ముడుపులే కారణమని ఆరోపించారు. ముడుపులు ముట్టకుంటే జిల్లా మంత్రి, మునుగోడు ఎమ్మెల్యే రైతుల పక్షాన ఎందుకు ఉండడంలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ను 60కిలోమీటర్ల దూరం నుంచి వేయిస్తానని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. గతంలోని అలైన్మెంట్ను ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలైన్మెంట్ అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. అలైన్మెంట్ మార్పిడి అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. రాష్ట్రం అలైన్మెంట్ను మారిస్తే అందుకు అయ్యే ఖర్చు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం తీరుతో ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు ముక్కలవుతున్నాయని తెలిపారు. భూనిర్వాసితులకు న్యాయం చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్కు రాజకీయాలకతీతంగా పాలాభిషేకం చేస్తామన్నారు. నిర్వాసితుల వేదిక చైర్మన్ చింతల దామోదర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రమనగోని శంకర్, బూరుగు కృష్ణారెడ్డి, గుజ్జుల సురేందర్రెడ్డి, సుర్వి యాదయ్య, దూడల భిక్షంగౌడ్, శాగ చంద్రశేఖర్రెడ్డి, కై రంకొండ అశోక్, గిర్కటి నిరంజన్, పల్లె శేఖర్రెడ్డి, బొడ్డు శ్రీనివాస్రెడ్డి, చిలుకల శ్రీనివాస్, కడారి కల్పన, బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, చినుకని మల్లేశం, తాడూరి పరమేష్, తొర్పునూరి నర్సింహ్మ, భూనిర్వాసితులు పాల్గొన్నారు. ఉద్రిక్తత.. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి ముగిసిన తర్వాత తిరిగి బయల్దేరే క్రమంలో భూనిర్వాసితులు, అఖిలపక్ష నాయకులు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు హైవే పైకి వెళ్లి బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు లాక్కెళ్లి తమ వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినా వెనక్కి తగ్గని నిర్వాసితులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాస్తారోకో చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చేసేదేమీ లేక నిర్వాసితులు హైవే పైకి వెళ్లకుండా పోలీసులు పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలను అడ్డుగా పెట్టారు. రోప్ పార్టీల ద్వారా జనాలను అడ్డుకున్నారు. భూనిర్వాసితులు, అఖిలపక్ష నాయకులు చౌటుప్పల్ బస్టాండ్ వద్దకు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని ఆందోళన విరమించాలని పోలీసులు పలుమార్లు కోరడంతో శాంతించారు. కొంతసేపటి తర్వాత నిర్వాసితులను విడిచిపెట్టారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఫ అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రీజినల్ భూనిర్వాసితులు ఫ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నం -
హక్కులను కాలరాసే అధికారం లేదు
సాక్షి ఎడిటర్, విలేకరులపై ఏపీ సర్కార్ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల భావ స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టులపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య అనుసంధానంగా పనిచేసే విషయంలో జర్నలిస్టుల హక్కులను రాలరాసే హక్కులు ఎవరికీ లేదు. –మందడి ఉపేందర్రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ -
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా మీడియా స్వేచ్ఛను హరించడాన్ని పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, జర్నలిస్టు సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని మీడియాను, మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. – భువనగిరి, భువనగిరి టౌన్, యాదగిరిగుట్ట జర్నలిస్టులపై దాడి చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేయడం ప్రశ్నంచే గొంతుకను అణిచివేయడమే. ఏపీలో సాక్షి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదు. జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చట్టసభలు, బ్యూరోక్రాట్లు, పత్రికలు ప్రజాస్యామ్యానికి కీలకమైనవి. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. పత్రికలు, పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయడం మానుకోవాలి. –ఎండీ ఖదీర్, టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి మీడియాపై దాడులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పత్రికలు,జర్నలిస్టులపై రాజకీయ కక్ష సాధింపులు మంచి విధానం కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలో మీడియాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరం. సాక్షి ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసుల పట్ల పార్టీలకు అతీతంగా ఖండించాలి. –సురుపంగ శివలింగం, రాష్ట్ర కన్వీనర్, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ -
ఆరోగ్య భవిష్యత్ మహిళల చేతుల్లోనే..
భువనగిరి: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మహిళల కోసం వైద్యశిబరాలు నిర్వహించాలన్నారు. మాతాశిశు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ సంబంధిత వ్యాధులను గుర్తించడంతో పాటు పాఠశాలలు, వసతి గృహాల్లో పిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మనోహర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, జెడ్పీసీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ, డీసీహెచ్ఎస్ చిన్ననాయక్, డీడబ్ల్యూఓ నర్సింహరావు, ఎయిమ్స్ అడిషనల్ డైరెక్టర్ కళ్యాణి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి సర్కార్ తీరు అప్రజాస్వామికం
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి పత్రికలపై దాడి చేయడం, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అంతేకానీ అక్రమంగా కేసులను పెట్టడం, విచారణ పేరుతో విలేకరులను పిలువడం తగదు. ఆంధ్రప్రదేశలో సాక్షి జర్నలిస్టులపై జరుగుతున్న సంఘటనలు రాజ్యాంగం ప్రసాదించిన బావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి. జర్నలిస్టుల విషయంలో అక్కడి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామిక చర్య. –భగత్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు -
నేడు లోక్ ఆదాలత్
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జయరాజు, కార్యదర్శి మాధవిలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు లోక్ అదాలత్ ప్రారంభం అవుతుందని, రాజీపడదగిన అన్ని రకాల కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమ్మ పేరుతోమొక్కలు నాటాలి : డీఈఓ భువనగిరి : అమ్మపేరుతో ఈనెల 14న ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని డీఈఓ సత్యనా రాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 6నుంచి 12వ తరగతి విద్యార్థులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మొక్కలు నాటే సమయంలో పొటో తీసి సంబంధిత యాప్లో ఆప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హెచ్ఎంలు సహకరించాలని పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ గుండాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి తనిఖీ చేశారు. రికార్డులు, భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను 22ఏ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ హరికృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు. వైద్యుడి సస్పెన్షన్కు ఆదేశాలు ఆత్మకూరు(ఎం) : మండలంలోని కూరెల్ల పల్లె దవాఖాన వైద్యుడు అశోక్కుమార్ సస్పెన్షన్కు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో డాక్టర్తో పాటు ఏఎన్ఎం విధుల్లో లేకపోవడంతో అక్కడే ఉన్న ఆశా కార్యకర్తను ప్రశ్నించారు. ఏఎన్ఎం మందులు తీసుకురావడానికి వెళ్లిందని ఆశా కార్యకర్త సమాధానం ఇచ్చింది. కాగా డాక్టర్ అశోక్కుమార్ వారంలో ఒక రోజు మాత్రమే విధులకు వస్తాడని గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించగా ప్రతి రోజూ విధులకు హాజరవుతున్నట్లు వైద్యుడి సంతకాలు ఉండటంతో సస్పెండ్ చేయాలంటూ డీఎంహెచ్ను ఆదేశించారు. అనంతరం తుక్కాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరి శీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శి అంబోజు శేఖర్ ఉన్నారు. -
గడపగడపన మడుగే..
ఫ వర్షానికి ఆలేరు పట్టణంలో ముంపునకు గురైన కాలనీలు ఫ రాత్రంతా నిద్రలేకుండా గడిపిన ప్రజలు ఆలేరు: ఆలేరు పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి రంగ నాయకుల వీధి, కుమ్మరివాడ, పాత మున్సిపల్ కార్యాలయం, ప్రగతి స్కూల్, బ్రహ్మంగారి ఆలయం నుంచి ఈదమ్మ గుడి వరకు పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. నడుము లోతు వరకు వరద నీరు ప్రవహించింది. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. దాదాపు 40 ఇళ్లలోకి నీరు చేరింది. నీటిని తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు. సరుకులు, దుస్తులు పూర్తిగా తడిసాయని, భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఉంటుందని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఆరు ఇళ్ల గోడలు కూలిపోయాయి. రంగానాయకుల వీధిలో పట్ట నవీన్కు చెందిన ఆటోపై గోడ కూలి పడటంతో ధ్వంసమైంది. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. మీడియా సంస్థలపై కేసులు పెట్టడం గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సాక్షిపై అక్కడి ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహరించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. మీడియా పట్ల ప్రభుత్వాలకు గౌరవం ఉండాలి. మీడియాను, మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవు. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి సర్కార్ పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. –గొంగిడి మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ -
సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..
అక్రమాలను వెలికితీసి, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సాక్షి ఎంతగానో కృషి చేస్తుంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మీడియా, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం కూటమి సర్కార్కు తగదు. నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెబుతారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. మీడియా గౌరవాన్ని కాపాడాలే తప్ప.. స్వేచ్ఛకు విఘాతం కలిగించొద్దు. ప్రజా సమస్యలపై ప్రశిస్తే కేసులు పెట్టడం సరైంది కాదు. –బండి జంగమ్మ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను అణచివేయాలని చూడటం నియంతపాలనకు నిదర్శనం. ప్రజా సమస్యలపై వార్తలు రాస్తే ఆత్మ విమర్శ చేసుకొని సరిదిద్దుకోవాలే తప్ప.. కక్షపూర్తి చర్యలకు పాల్పడటం తగదు. శ్రీసాక్షిశ్రీ ఎడిటర్పై కేసులు బనాయించడం అంటే కిందస్థాయి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ప్రభుత్వాలు ప్రజల మెప్పు పొందలేవు. –డబ్బేటి సోంబాబు, టీయూడబ్ల్యూజే యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు -
ముమ్మరంగా సహాయక చర్యలు
ముంపు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు, మాన్సూన్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులకు అల్పాహారం, భోజనం అందజేశారు. జేసీబీ సహాయంతో వరద నీటిని, చెత్తను తొలగించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో నిలిచిన వరదనీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐఅయ్య ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ ఫౌడర్ చల్లించాలని సూచించారు. నష్టంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆస్తినష్టం తప్ప, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. -
బాధితులకు సాయమందించండి – ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు: భారీ వర్షానికి ఆలేరు పట్టణంలోని బైరవకుంట, ఏంకుంట, పర్రె కాల్వలు అలుగు పోయడంతో కొలనుపాక రోడ్డులో బ్రహ్మంగారి గుడి నుంచి పాత మున్సిపల్ కార్యాలయం, 11, 12 వార్డుల పరిధిలోని రంగనాయకుల వీధి, కుమ్మరివాడ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 30ఇళ్లు నీట మునిగాయి. ఆయా కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అత్యవసర మాన్సూన్ బృందంతో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బోట్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇళ్లలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వారం రోజులపాటు ముంపు బాధితులకు అవసరమైన సరుకులు, ఇతర సహాయం అందించాలని ఎమ్మెల్యే ఫోన్లో కలెక్టర్ హనుమంతరావును కోరారు. తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కొన్ని నాలాలు కబ్జాకు గురై ముంపు సమస్య ఏర్పడిందని, అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
భూదానయజ్ఞ బోర్డు పునరుద్ధరణకు కృషి
భూదాన్పోచంపల్లి : భూదానయజ్ఞ బోర్డు పునరుద్ధరణకు కృషిచేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో వినోబాభావే సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భూదానోద్యమ పితామహుడు వినోబాభావే 130వ జయంతి ఉత్సవాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూదానబోర్డును రద్దుచేసి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూదాన భూములను అన్యాక్రాంతం చేసిందని విమర్శించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్న భూదానోద్యమ వజ్రోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. చరిత్రపుటల్లో పోచంపల్లి : ఎంపీ చామల వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డిల భూదా నోద్యమ స్ఫూర్తితో పోచంపల్లి పేరు చరిత్రపుటల్లో నిలిచిపోయిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం భూదాన భూముల డేటా లేకుండా చేసి అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భూదానబోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేశ్వర్లు, పాక మల్లేశ్, భారత లవకుమార్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, తడక రమేశ్, తడక యాదగిరి, అంబరీష్రెడ్డి, సీత శ్రీరాములు, కుక్క దానయ్య, కొట్టం కరుణాకర్రెడ్డి, గునిగంటి రమేశ్, గునిగంటి వెంకటేశ్, కొయ్యడ శ్రీను, మెరుగు శశికళ, కాసుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఫ పోచంపల్లిలో వినోబాభావే జయంతి వేడుకలు ఫ హాజరైన ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
పత్రికా స్వేచ్ఛపై కత్తికట్టిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వాలు చేసే అవినీతి, అక్రమాలను ప్రతికలే వెలుగులోకి తెస్తాయి. ప్రభుత్వాలు మారగానే వ్యతిరేకంగా ఉన్న పత్రికలపై కక్షసాధింపు చర్యలు పెరుగుతున్నాయి. అబద్ధాలు రాస్తే కోర్టుల ద్వారా చర్యలు తీసుకోవాలి. పోలీస్ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారింది. పత్రికల్లో ఏది వచ్చిన ఎడిటర్ స్థాయి వారిపై కేసులు పెట్టడం సరికాదు. పత్రిక స్వేచ్ఛను కాపాడాలి. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. – కంచర్ల రామకష్ణారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, నాయకులు సాక్షి పత్రికపై దాడి చేయడం సరైంది కాదు. ఏదైనా రాజకీయ పరమైన విబేధాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ప్రతికా స్వేచ్ఛను హరించేలా పత్రికా ప్రతినిధులపై దాడి చేయడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలి. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ్రెడ్డి, బ్యూరో ఇన్చార్జ్లు, స్థానిక రిపోర్టర్లపై దాడులు చేసి కేసులు బానాంయించడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు పత్రికలు, విలేకరులు కృషి చేస్తారు. అలాంటి వారిపై దాడులు చేయడం, కేసులు పెట్టడం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి తగదు. – ఎండి జహంగీర్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం..
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ పట్ల రాజకీయ పార్టీలకు గౌరవంగా ఉండాలి. ప్రస్తు తం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై అందులో పనిచేసే సిబ్బందిపై దాడులకు దిగడం, పోలీసుల చేత కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛను హరించేయడమే. దీనిని టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలు, పాత్రికేయుల్లో విభిన్న సైదాంతిక భావజాలంతోపాటు వివిధ వర్గాల ప్రజలు ఉంటారు. అధికార బలంతో సాక్షి సిబ్బందిపై పోలీసులు దాడులు చేయడం, నోటీసులు అందజేయడం బాధాకరం. – వివేకానంద, టీడబ్ల్యూజేఎఫ్, రాష్ట్ర కార్యదర్శి -
కలంపై కక్షకట్టిన కూటమి ప్రభుత్వం
ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం అసమర్థతను కలం రూపంలో ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్షకట్టి అక్రమ కేసులు పెట్టడం బాధాకరం. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధగా పాలించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ప్రతికా స్వేచ్ఛగా భంగం కలిగిస్తోంది. సాక్షి యాజమాన్యానికి, ఎడిటర్ ధనంజయ్రెడ్డికి మేమంతా మద్దతుగా నిలుస్తాం. – కళ్లెం కృష్ణ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
16న మత్స్యగిరి ఆలయంలో టెండర్లు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ వస్తువుల సరఫరాకు ఈ నెల 16న టెండర్లు ఆహ్వానిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహనబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాల్ పోస్టర్ ప్రింటింగ్, తడకల పందిర్లు, ఆర్చీలు వేయుట, టికెట్ పుస్తకాలు, స్టేషనరీ ప్రింటింగ్, ఫ్లెక్సీ బ్యానర్లు, సున్నం రంగులు వేయుట, రోజు వారీగా పాలు, పెరుగు, కూరగాయలు, విద్యుత్ పరికరాలు, డెకరేషన్, మైకుసెట్, వివిధ వస్తువుల సరఫరాకు ఏడాది కాలానికి గాను టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి బారిన పడకుండా చూడాలిసాక్షి.యాదాద్రి : యువత గంజాయి బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లాలో గంజాయి నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ, విద్యా, వైద్య, పోలీస్, ఎకై ్సజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎంహెచ్ఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గురువారం అందుబాటులోఉంటా.. భువనగిరిటౌన్ : పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటానని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భువనగిరి కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. పలు దరఖాస్తులను స్వీకరించి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఫోన్ ద్వారా సదరు అధికారులను ఆదేశించారు. రెండు కంపెనీల మూసివేతకు ప్రభుత్వం ఉత్తర్వులుయాదగిరిగుట్ట: మోటకొండూర్ మండలం కాటేపల్లిలో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీలైన మహతి ఇండస్ట్రీస్, శ్రీజ ఇండస్ట్రీస్ మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీచేసింది. కొంత కాలంగా ఈ రెండు కంపెనీల్లో టైర్లు కాల్చి, రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో వాతావరణం కలుషితమై దుర్వాసన రావడంతో పాటు కంపెనీల నుంచి వచ్చే బూడిదతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ కంపెనీలను తొలగించాలని రైతులు, గ్రామస్తులు ఉద్యమించారు. గ్రామస్తులతో పాటు ఇదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మంత్రి సుభాష్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. మహతి ఇండస్ట్రీ, శ్రీజ ఇండస్ట్రీస్లను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులపై కాటేపల్లి రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కోసం ఇంగ్లాడ్ నుంచి వచ్చి తమకు అండగా పోరాటం చేసి, కంపెనీలను మూసివేతకు ఉద్యమించిన మంత్రి సుభాష్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. -
రైతుల యూరియా కష్టాలు తీరుస్తాం
నిడమనూరు : కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నిడమనూరు మండలంలోని వెనిగండ్ల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి దృష్టికి పలువురు రైతులు, కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత విషయం తీసుకువచ్చారు. మిర్యాలగూడ ర్యాక్ పాయింట్కు ఒకటి, రెండు రోజుల్లో యూరియా రానుందని, సాగర్ ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చేవిధంగా యూరియా అందించి కష్టాలు తీరుస్తానని ఈ సందర్భంగా జానారెడ్డి వారికి చెప్పారు. వెనిగండ్ల గ్రామ సీలింగ్ భూ వివాదాలు కూడా జానారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఊట్కూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్కుమార్.. జానారెడ్డిని కోరారు. ఊట్కూరులో ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉందని, మరో 8 ఎకరాలు సేకరిస్తే చాలని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమికోసం సర్వే చేసినట్టు జానారెడ్డికి తహసీల్దారు జంగాల కృష్ణయ్య వివరించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన కొప్పోలు మట్టపల్లిరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జానారెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి సత్యం, నర్సింగ్ విజయ్కుమార్, ముంగి శివమారయ్య, నందికొండ మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జానారెడ్డి -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
దేవరకొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.2.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు దేవరకొండ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన పిట్ల గంగాధర(అలియాస్) సాంబ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చదువు మధ్యలో ఆపేసి కూలి పనులు చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గంగాధర జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న దేవరకొండ పట్టణంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటున్న రాపోతు రమేష్ ఇంట్లో ప్రవేశించి రూ.6 లక్షల నగదు, 2.2 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ చేసిన నగదులో సగం డబ్బు దేవరకొండ పట్టణంలోని ఖిలా పార్క్ వద్ద గంగాధర దాచిపెట్టాడు. ఆ నగదును తిరిగి తీసుకునేందుకు గురువారం పట్టణానికి వచ్చిన గంగాధరను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీ చేసిన విషయం ఒప్పుకున్నాడు. కాగా గంగాధరపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో సుమారు 100 పైచిలుకు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు చేధించిన దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐలు నారాయణరెడ్డి, మౌనికలతోపాటు సిబ్బంది సతీష్, అంజయ్య, సింహాద్రిలను ఏఎస్పీ అభినందించారు. ఫ రూ.2.5లక్షల నగదు స్వాధీనం -
కేసు నమోదు
మోతె : వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, పోలీసుల అనుమతి లేకుండా డీజే వినియోగించిన నిర్వాహకులపై కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో పోలీసుల అనుమతి లేకుండా సోమవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే వినియోగించారు. దీంతో వేడుకల నిర్వాహకుడు పులగుజ్జు కార్తీక్, ఆర్గనైజర్ కోడి మహేష్పై కేసు నమోదు చేసి డీజే, వాహ నం సీజ్ చేసినట్లు మోతె ఎస్ఐ టి.అజయ్కుమార్ గురువారం తెలిపారు. ఆర్టీసీలో ‘యాత్రాదానం’రామగిరి(నల్లగొండ) : యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలు, శుభకార్యాలకు ప్రత్యేక బస్సుల్లో వారిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఈ పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. దాతలు టీజీఎస్ఆర్టీసీ పోర్టల్, క్యూఆర్ కోడ్ యూపీఐ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. సిలిండర్లు స్వాధీనంచౌటుప్పల్ : అక్రమంగా నిల్వ ఉంచిన వంటగ్యాస్ సిలిండర్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. వంటగ్యాస్ సిలిండర్లలోని గ్యాస్ను చిన్న సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు చౌటుప్పల్ పట్టణంలోని రత్నానగర్కాలనీలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న తడకమళ్ల రామలింగస్వామి మడిగెలో సోదాలు చేశారు. అందులో నిల్వ ఉంచిన 13 సిలిండర్లు, వెయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఎరువుల డీలర్లపై కేసుగుర్రంపోడు : గుర్రంపోడు మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి తన సిబ్బందితో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధిక ధరలకు యూరియా విక్రయించిన ముగ్గురు డీలర్లపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పసుపులేటి మధు తెలిపారు. యూరియా బస్తా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రూ.266 లకు విక్రయించాల్సి ఉండగా కొంతమంది రైతుల వద్ద రూ.300 తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో శరవణ ఫర్టిలైజర్ యజమాని ఎర్ర శ్రీనివాసరావు, శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ యజమాని బొమ్ము ఆనంద్, సాయిరాం ఏజెన్సీ యజమాని చందా గోవింద్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ శివారులో కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ ఆర్టీసీ డిపోనకు చెందిన టీజీ 05 జెడ్ 0045 నంబర్ గల బస్సు గురువారం చండూరు నుంచి జనగాం మీదుగా చౌటుప్పల్కు వెళుతోంది. ఈ క్రమంలో జనగాం నుంచి సంస్థాన్ నారాయణపురం వెళ్లే దారిలో కారు ఒకేసారి రోడ్డుపైకి వచ్చింది. కారును తప్పించే క్రమంలో బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బస్సు టైర్లు, ఇంజన్ భూమిలోకి దిగబడ్డాయి. బస్సు డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ పక్కనే బొంగోల కుంట ఉంది. కొంత అజాగ్రత్తగా వ్యవహరించినట్లయితే బస్సు కుంటలోకి దూసుకెళ్లేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తర్వాత వచ్చిన బస్సులో ప్రయాణికులను తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఫ బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఫ అందరూ సురక్షితం -
చోరీకి గురైన మొబైల్ ఫోన్లు అప్పగింత
సూర్యాపేటటౌన్ : మొబైల్ పోయినా, చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లాలో సెల్ఫోన్లను వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 100 మందికి, రికవరీ చేసి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైందని, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫొటోలు ఫోనన్లో నిక్షిప్తం చేసుకుంటున్నామన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందన్నారు.ే నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. సెల్ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ను అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మొబైల్స్ ను రికవరీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ మొబైల్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ -
అమ్మ పేరుతో మొక్క
గుర్రంపోడు : అమ్మ.. మొక్క.. భూమాత.. మూడింటి మధ్య సారుప్యత ఉంటుంది. అమ్మ కుటుంబానికి బాధ్యత వహిస్తే, మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి. భూమాత జీవ రాశులను, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ మూడింటికి ముడి పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి పేరుతో మొక్క నాటితే శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం చేపట్టింది. పర్యావరణ దినోత్సవమైన జూన్ 5, 2024లో ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రతిఒక్కరూ తల్లి పేరుతో మొక్క నాటాలని విస్త్రృత ప్రచారం చేసి భారీ సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు. ఇటీవల ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినుల భాగస్వాములను చేసి, ప్రతి విద్యార్థి తన తల్లితో కలిసి మొక్కను నాటాలని నిర్ధేశించారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కను పాఠశాల ఆవరణలోగాని, పరిసరాల్లోగాని నాటి నాటి ఏకో క్లబ్ మిషన్ లైఫ్ అనే పోర్టల్లో ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ విడుదల చేసిన లింక్లో విద్యార్థిని పేరు, తల్లి పేరు, పాఠశాల డైస్ కోడ్ వివరాలు నమోదు చేసి ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోను తీసుకుని అప్లోడ్ చేయగానే వారి పేరిట ఆన్లైన్లోనే ప్రశంసాపత్రం లభిస్తుంది. నాటిన ప్రతి మొక్కకు ప్రశంసాపత్రం లభిస్తుంది. ప్రశంసాపత్రాన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశంసాపత్రం ఫోన్లో డౌన్లోడ్లోగాని మరెక్కడా కనిపించదు. వెబ్ పోర్టల్కు సంబంధించి లింక్ను కూడా విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేసింది. మండలానికి 4 వేల మొక్కల చొప్పున.. ఒక విద్యార్థిని ఎన్ని మొక్కలైనా, ఎక్కడైనా తల్లితో కలిసిగానీ, పాఠశాలలో అయితే మహిళా టీచర్తో కలిసి గానీ నాటాలి. జిల్లాకు లక్ష మొక్కలు నాటేలా లక్ష్యం నిర్ధేశించగా మండలానికి 4 వేల మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలకు 70 ఫొటోలు లక్ష్యం నిర్ధేశించారు. వన మహోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నందున ఇందులోనే తల్లిలో కలిసి విద్యార్థిని ఫొటోలు తీయాల్సి ఉంటుంది. నాటిన ప్రతి మొక్కకు విద్యార్థినికి ప్రశంసాపత్రం లభిస్తుండడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ ఇంటి పరిసరాల్లో మొక్కను నాటి పాఠశాల యూడైస్ కోడ్, ఇతర వివరాలు నమోదు చేసి సొంతంగా అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.విద్యార్థినులు తమ తల్లితో కలిసి మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేసేలా అన్ని పాఠశాల హెచ్ఎంలకు దిశానిర్ధేశం చేశాం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే అవసరాన్ని వివరించి విరివిగా మొక్కలు నాటిస్తాం. గ్రామస్థాయిలో వన నర్సరీల నుంచి మొక్కలు పొంది నాటాలని సూచిస్తున్నాం. పాఠశాలలో సరిపడా స్థలం లేని చోట విద్యార్థిని ఇంటి వద్దగాని, పరిసరాల్లో గాని మొక్కను నాటి సంరక్షించాలని వివరిస్తున్నాం. –నోముల యాదగిరి, గుర్రంపోడు మండల విద్యాధికారి ఫ నాటిన ప్రతి విద్యార్థినికి ప్రశంసాపత్రం ఫ మొక్కల పెంపకంలో భాగస్వామ్యం ఫ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం -
చోరీకి గురైన వినికిడి యంత్రాలు
చౌటుప్పల్ : కన్న కూతురికి పుట్టుకతో చెవులు వినిపించవు. మాటలు కూడా రావు. ప్రస్తుతం ఐదేళ్ల వయస్సు ఉన్న ఆ చిన్నారి అవస్థలకు తల్లడిల్లిన తల్లిదండ్రులు గతేడాది ఆగస్టులో ఆపరేషన్ చేయించారు. అదేఏడాది అక్టోబర్ నెలలో చెవులకు ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. దాంతో వినికిడి సమస్యకు పరిష్కారం దొరికింది. అదేవిధంగా నోటి మాటలను రప్పించేందుకు కూడా పడరానిపాట్లు పడుతున్నారు. స్వగ్రామం నుంచి నిత్యం హైదరాబాద్కు కూతురును తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారికి చెందిన వినికిడి యంత్రాలు బస్సులో చోరీకి గురయ్యాయి. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ నాగమణి తన కూతురు హాద్వికకు బుధవారం హైదరాబాద్లో థెరపీ చేయించి తిరిగి మధ్యాహ్నం 12.40కి దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన బస్సులో చౌటుప్పల్కు చేరుకుంది. ఇక్కడి నుంచి నల్లగొండ డిపో బస్సు పల్లెవెలుగు ద్వారా 2.00గంటల ప్రాంతంలో మునుగోడులో దిగింది. అటు నుంచి నేరుగా ఇంటికి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన బ్యాగును పక్కన పెట్టింది. మరుసటి రోజు ఉదయం సమయంలో తనకు వినికిడి ఇబ్బంది అవుతోందని కూతురు చెప్పడంతో కూతురు చెవికి ఉన్న పరికరానికి చార్జింగ్ పెట్టేందుకుగాను బ్యాగులో ఉన్న బాక్స్ను తెచ్చేందుకు వెళ్లింది. బ్యాగులో బాక్స్ కన్పించకపోవడంతో ఇళ్లంతా వెతికినా ఎక్కడా లభ్యమవ్వలేదు. తాను ప్రయాణం చేసే క్రమంలో బ్యాగు నుంచి ఆ బ్యాక్స్ చోరీకి గురైందని ఆమె ఆలస్యంగా గుర్తించింది. దీంతో రెండు రోజులుగా కనిపించిన వారినందరినీ ఆరా తీస్తోంది. రూ.1.50లక్షల విలువ చేసే వినికిడి పరికరాలు ఎవరికై నా దొరికితే ఇవ్వాలని వేడుకుంటోంది. ఫ రూ.1.50 లక్షల విలువ ఉంటుందన్న బాధితురాలు -
హైవేపై గూడ్స్ లారీ బోల్తా
బీబీనగర్: జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గూడ్స్ లారీ భువనగిరి వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పోలీస్స్టేషన్ దాటగానే బ్రిడ్జిపై అదుపు తప్పింది. లారీ పల్టీ కొట్టగానే డ్రైవర్ సుక్శాంత్ దావ్లే లారీలోనుంచి ఎగిరి బ్రిడ్జి కింద వాగులో పడిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన డ్రైవర్ను వాగులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. లారీ హైవేపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సర్వీస్ రోడ్డు గుండా వాహనాలను మళ్లించి క్రేన్తో లారీని పక్కకు తీయించారు. తండ్రిపై మమకారం.. వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరూపంఆత్మకూర్ (ఎస్) : కనిపెంచిన తండ్రి విలువను వారు వదులుకోలేదు. తమ నుంచి తండ్రి దూరమై ఏడాదైనా ఆ జ్ఞాపకాలను అలాగే నెమరవేసుకున్నారు. తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించుకుని ప్రేమను చాటుకున్నారు ఆ కుమారులు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గుండు అబ్బయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా తమ తండ్రి జ్ఞాపకార్థం ఆయన కుమారులు గుండు లింగయ్య, గుండు రమేష్.. అబ్బయ్య విగ్రహాన్ని తయారు చేయించారు. గురువారం అబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో స్థానిక సీపీఎం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుండు చిన్న లింగయ్య, రాచకొండ రమేష్, మడ్డి రమేష్, బుర్ర సోమయ్య, దండంపెల్లి కృష్ణయ్య, బైరు వెంకన్న, శంకర్, గుండు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
47 గ్రామాల్లో ప్రమాదకర స్థాయికి..
సాక్షి, యాదాద్రి: జిల్లాలో భూగర్భజలాలు పడి పోయాయి. గత సంవత్సరం మే నుంచి ఈ ఏడాది జూన్ నెల వరకు భూగర్భ జలవనరుల శాఖ పరి శీలనలో ఈ విషయం వెల్లడైంది. 45 గ్రామాల్లో ప్రమాదకరస్థాయిలో.. రెండు గ్రామాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. సమృద్ధిగా వర్షాలు కురువకపోవడం, వ్యవసాయానికి అధికంగా నీటిని వినియోగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాటర్ ఇయర్ నివేదికలో పేర్కొంది.భూమిలోకి ఇంకిన నీరు ఇలా..భూగర్భ జల వనరుల శాఖ ఏటా మే నెల నుంచి జూన్(వాటర్ ఇయర్) వరకు నీటి నిల్వలు, వినియోగంపై పరిశీలన చేసి నివేదిక ఇస్తుంది. అందులో భాగంగా ఈ వాటర్ ఇయర్ ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యధికంగా వర్షాల వల్ల 31 శాతం నీరు భూమిలోకి ఇంకింది. చెక్డ్యాంలు, పర్క్యులేషన్ ట్యాంకులతో 7 శాతం, చెరువులు, కుంటల వల్ల 6 శాతం, బోరుబావుల కింద సాగు చేసిన వరి ద్వారా వృథా నీటితో 20 శాతం, చెరువులు, రిజర్వాయర్ల కింద వరి సాగుద్వారా 26 శాతం నీరు భూమిలోకి ఇంకిందని భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. భూమిలోకి 100 యూనిట్ల జలాలు ఇంకి 70 యూనిట్లు మాత్రమే వాడుకుంటే సేఫ్జోన్గా పరిగణిస్తారు. 70నుంచి 90 యూనిట్లు వాడుకుంటే సెమీ క్రిటికల్గా, 90 నుంచి 100 అత్యంత ప్రమాదకరమని, 100 నుంచి 110 అత్యంత జఠిలంగా పరిగణిస్తారు.85 శాతం నీళ్లు వ్యవసాయానికే..భూగర్భంలోకి ఇంకిన మొత్తం నీటిలో సింహభాగం సేద్యానికి వినియోగించారు. వానాకాలం, యాసంగి సీజన్లలో 85శాతం నీటిని పంటల సాగుకు తోడేశారు. పరిశ్రమలకు 9 శాతం, గృహసరాలకు 6 శాతం నీటిని వాడారు. నాన్ ఆయకట్టులో ఒక లక్షకు పైగా బోర్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. పరిశ్రమల్లో 60 వేల వరకు బోర్లు ఉన్నాయి. ఇవి కాకుండా పంక్షన్హాళ్లు,ఇళ్లు హోటళ్లు, అపార్ట్మెంట్లలో ఉన్న బోర్ల ద్వారా నీటి వినియోగం పెరిగింది. ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం అధికంగా ఉంది.అధికంగా నీటిని తోడేసిన గ్రామాలు ఇవీ..ఆలేరు, బహుద్దూర్పేట, గొలనుకొండ, శ్రీనివాసపురం, టంగుటూరు, ఆత్మకూర్(ఎం), ధర్మాపూర్, కాల్వపల్లి, కప్రాయపల్లి, కొరటికల్, లింగరాజుపల్లి, మొరిపిరాల, పల్లెపహాడ్, రహీంఖాన్పేట,రాయిపల్లి, సర్వేపల్లి, భాగా యత్ భువనగిరి, తాజ్పూర్, మహదేవ్పూర్, రాయరావుపేట, రామలింగంపల్లి, అల్లాపూర్, చౌటుప్పల్, దేవలమ్మనాగారం, ఖైతాపురం, లక్కారం, లింగోజిగూడెం, పీపల్పహాడ్, తంగెడుపల్లి, తాళ్లసింగారం, ఎల్లగిరి, బుజిలాపూర్, చిల్లాపురం, చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, గుజ్జ, జనగామపల్లె, కొత్తగూడెం, కోతులాపురం, మహమ్మదాబాద్, నారాయణపురం, సర్వేల్, వాయిల్పల్లి, చల్లూరు, కోమటికుంటలో ప్రమాదకరస్థాయిలో భూగర్భ నీటి మట్టాలు ఉన్నాయి. సంస్థాన్నారాయణపురం, ఆత్మకూర్(ఎం)లో అత్యంత దారుణంగా 100 శాతం పైగా నీటిని తోడేశారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలం కొంత మేరకు పెరిగే అవకాశం ఉంది.నీటి సంరక్షణకు చర్యలుజిల్లాలో 45 గ్రామాల్లో భూగర్భ నీటి వినియోగం అధికంగా ఉంది. జలశక్తి అభియాన్ పథకంలో భూగర్భజలాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –జ్యోతికుమార్, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలవనుల శాఖ -
అందుబాటులోకి తేవాలి
క్రీడా ప్రాంగణాన్ని గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఏర్పాటు చేశారు. అంతదూరం వెళ్లడానికి యువత, విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. అందుబాటులోకి తీసుకువస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. –బండి నవీన్, మైలార్గూడెం, యాదగిరిగుట్ట మండలం ఆత్మకూరు (ఎం)లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం గ్రామానికి దూరంగా ఉంది. దూరంగా ఉన్నప్పటికీ ఆటలకు అనువుగా లేదు. పేరుకే క్రీడా ప్రాంగణం అనట్టుగా ఉంది. ఇప్పటికై నా క్రీడా ప్రాంగణం అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. –నాతి మల్లికార్జున్, ఆత్మకూరు (ఎం) -
60 దాటినా ఆరి్థక భరోసా..
రామన్నపేట: స్వయం సహాయక మహిళా సంఘాల్లో (ఎస్హెచ్జీ) సభ్యుల వయసును 60 ఏళ్లకే పరిమితం చేయడంతో ఆ వయసు దాటిన వారు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను గుర్తించిన సర్కార్.. ఇందిరా మహిళాశక్తి మిషన్–2025లో భాగంగా వృద్ధ మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 5,309 మంది వృద్ధ మహిళలను గుర్తించారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకులో ఖాతాలు తెరిపించారు. సామాజిక మద్దతు కుటుంబాల్లో వృద్ధులు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. సంపాదించే శక్తి సన్నగిల్లి ఆర్థిక భద్రత లేకపోవడం, అనారోగ్యం, మానసిక, శారీరక నియంత్రణ శక్తి లేకపోవడం, న్యూనతా భావం పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలను అధిగమించి సామాజిక మద్దతు కల్పించేందుకు 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సంఘాల్లో కొనసాగుతున్న వారిని వయసు నిండిన వెంటనే గ్రూప్ల నుంచి తొలగించకుండా వృద్ధుల సంఘాల్లోకి మారుస్తారు. ఒక్కో గ్రూప్లో 10నుంచి 15 మంది సభ్యులు ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఐదుగురు ఆపై సభ్యులతో కూడా గ్రూప్గా ఏర్పడవచ్చు. తమ దైనందిన చర్యలను చేసుకోగలిగే వారు, కొంత వరకు ఇతరుల సహాయం పొందేవారు సభ్యులుగా చేరవచ్చు. సంఘం ఏర్పాటైన తరువాత గ్రూప్ పేరుమీదు ఎస్బీ ఖాతా తెరిచి తమ ఆదాయం మేరకు పొదుపును నిర్ణయించి నెలనెలా బ్యాంకులో జమచేయాలి. సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వం గ్రేడింగ్ చేసి ఆర్ఎఫ్, వీఆర్ఎఫ్ నిధులను సంఘాలకు అందజేస్తుంది. సభ్యులకు అవగాహన జిల్లాలో 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలతో 1,482 సంఘాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు 5,309 మంది వృద్ధ మహిళలను గుర్తించి వారితో 218 సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాల పేరున బ్యాంకులో ఖాతాలు తెరిచారు. వారి వివరాలను ప్రత్యేక యాప్లోనూ నమోదు చేశారు. వృద్ధ మహిళలు ద్ధార్థిక సమస్యలను అధిగమించడానికి స్వయం సహాయక సంఘాలు దోహదపడతాయి. వృద్ధ మహిళలతో సంఘాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 218 సంఘాలు ఏర్పాటు చేశాం. ఇంకా 1,264 సంఘాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అర్హత కలిగిన వృద్ధ మహిళలందరికీ సంఘాల్లో అవకాశం కల్పిస్తాం. ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. –నాగిరెడ్డి డీఆర్డీఓ ఫ ఎస్హెచ్జీల్లో వృద్ధ మహిళలకూ అవకాశం ఫ జిల్లాలో 5,309 మంది గుర్తింపు ఫ 218 సంఘాలు ఏర్పాటు -
ఆటకు దూరం.. వృథాగా మైదానం
ఇది రాజాపేట మండలం రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు గ్రామంలోని క్రీడా ప్రాంగణం. గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంతో అంతదూరం వెళ్లడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. క్రీడా పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది యాదగిరిగుట్ట మండలం మైలార్గూడెంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం. దీని ఏర్పాటుకు రూ.2లక్షలు ఖర్చు చేశారు. ఊరికి కిలో మీటరు దూరంలో ఉండటం, ఆటలు ఆడేందుకు అనకూలంగా లేకపోవడంతో ఎవ్వరూ వెళ్లడం లేదు. ప్రాంగణంలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, గడ్డి మొలిచి ఇలా తయారైంది. -
నేడు వినోబాభావే జయంతి వేడుకలు
భూదాన్పోచంపల్లి: భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబాభావే 130వ జయంతి వేడుకలను గురువారం భూదాన్పోచంపల్లిలో నిర్వహించనున్నట్లు వినోబాభావే సేవా సంఘం నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ప్రఽథమ భూదాత కుటుంబసభ్యులు, వినోభానగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు గున్నా రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తడక వెంకటేశ్వర్లు, కల్పన ఫౌండేషన్ అవార్డు గ్రహీత, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 17నుంచి ‘సేవాపక్షం’భువనగిరి: ప్రధానమంత్రి నరేంద్రమోది పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవాపక్షం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ తెలిపారు.బుధవారం భువనగిరిలోని పార్టీ కార్యా లయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సేవాపక్షంలో భాగంగా స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరాలు, ఆత్మనిర్భర్ భారత్, పేదలకు, దివ్యాంగులకు సహకరంచడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సేవాపక్షం జిల్లా కన్వీనర్ పడమటి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కో కన్వీనర్ మాధురి, జంగా రెడ్డి, కత్తుల శంకర్, భూక్య నరేష్ నాయక్, మాజీ అధ్యక్షుడు పాశం భాష్కర్, శ్యాంసుందర్రెడ్డి, గూడూరు నరోత్తంరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, యాదిరెడ్డి, అచ్చయ్య, కృష్ణ, మల్లారెడ్డి, సోమనర్సయ్య, నర్సింహ్మరావు, సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, లింగస్వామి,విజయభాస్కర్రెడ్డి, సుర్వి శ్రీనివాస్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో కార్డన్ సెర్చ్ యాదగిరిగుట్ట: సేఫ్ యాదగిరిగుట్ట పేరుతో బుధవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణంలో ఏసీపీ శ్రీనివాస్నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గణేష్ నగర్, ప్రశాంత్నగర్ నివాస గృహాలు, లాడ్జీల్లో తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 29 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, ఒక కారు సీజ్ చేశారు. రూ.18 వేల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. ముగ్గురు పాత నేరస్తులు, లాడ్జీల్లో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీననివాస్నాయుడు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట క్షేత్ర భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా సీపీ సుఽధీర్బాబు, డీసీపీ అకాంశ్యాదవ్ ఆదేశాల మేరకు కార్డన్సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్డన్ సెర్చ్లో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తుది ఓటరు జాబితా విడుదల
ఫ ‘స్థానిక’ ఓటర్లు 5,32,240, పోలింగ్ కేంద్రాలు 1,001 ఫ జెడ్పీ, మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితాల ప్రదర్శన సాక్షి, యాదాద్రి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఆరు పోలింగ్ కేంద్రాలు పెరిగినట్లు జెడ్పీ సీఈఓ శోభారాణి తెలిపారు. అదే విధంగా 5,32,240 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. మండలం ఎంపీటీసీలు పోలింగ్ ఓటర్లు కేంద్రాలు అడ్డగూడూరు 07 44 23,022 ఆలేరు 07 40 21,537 ఆత్మకూర్(ఎం) 08 49 25,533 పోచంపల్లి 10 54 27,497 భువనగిరి 13 75 39,654 బీబీనగర్ 14 79 42,876 బొమ్మలరామారం 11 63 29,503 చౌటుప్పల్ 12 67 38,501 గుండాల 09 48 26,069 మోటకొండూరు 07 39 21,103 మోత్కూర్ 05 27 13,215 నారాయణపూరం 13 73 40,113 రాజాపేట 11 57 30,236 రామన్నపేట 15 83 45,358 తుర్కపల్లి 10 55 27,977 వలిగొండ 17 96 52,431 యాదగిరిగుట్ట 9 52 27,615 మొత్తం 17 1,001 5,32,240 -
మహిళా సంఘాలకు రుణాలు ఇస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : నాబార్డు ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి కోరారు. బుధవారం డీసీసీబీలో నిర్వహించి నాబార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 వేలకుపైగా కొత్త సంఘాలు ఉన్నాయని కొన్ని గ్రూప్లకు రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందని తెలిపారు. డీఆర్డీఓ శేఖర్రెడ్డి మాట్లాడుతూ కొత్త గ్రూపులకు సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తే సంఘాల్లోని మహిళలతోపాటు బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్నారు. నాబార్డు సీజీఎం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ నాబార్డు ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాల వివరాలను వివరించారు. ఆప్కాబ్ జనరల్ మేనేజర్ అశ్వని మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్లో కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, బ్యాంకు మేనేజర్లు, నాబార్డు అధికారులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
రీజినల్ రింగ్ రోడ్డు మాకొద్దు
గట్టుప్పల్: రీజినల్ రింగ్ రోడ్డు తమకొద్దని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం గటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూముల కోల్పోతున్న రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రైతులు సారవంతమైన భూములు కోల్పోతున్నారని అన్నారు. భూములు కోల్పోతున్న వారికి భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూయేషన్ మీద నాలుగు రెట్లు పెంచి ఇవ్వాలన్నారు. మహబూబ్నగర్, కల్వకుర్తి ప్రాంతాల్లో ఎకరానికి రూ.80 నుంచి రూ.90 లక్షల వరకు కొంతమంది రైతులకు ఇచ్చారని, మరికొందరికి రూ.కోటి వరకు కూడా ఇస్తున్నారని అన్నారు. నామాపురం, తేరట్పల్లి, వెల్మకన్నె రైతుల ఆమోదం లేకుండా అలైన్మెంట్ రూపొందించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, సీపీఎం నాయకులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, అచ్చిన శ్రీనివాస్, పగిళ్ల శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టి. శంకర్, ఇడెం కై లాసం, బాలం శ్రీను, అయితరాజు హనుమంతు, బండ లింగయ్య, పగిళ్ల నరసింహ, నల్లవెల్లి భిక్షం, పెద్దగాని నరసింహ, హనుమంతు, పగిళ్ల శంకర్, సాయిబాబా, శంకర్, హరి, నరేష్, చిననరసింహ పాల్గొన్నారు. ఫ గట్టుప్పల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా -
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది
సూర్యాపేటటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ–ఫార్ములా కాదు.. యూరియా ఫార్ములా ఏందో చెప్పాలన్నారు. హైకోర్టు ఆర్డర్తో గ్రూప్–1 ఫార్ములా తేలిపోయిందన్నారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని.. కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతీది అబద్ధం అని తేలిపోయిందని పేర్కొన్నారు. గ్రూప్–1 విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు బయటపడడంతో.. ఈ ఫార్ములాపై కేసు అంటూ సీఎం రేవంత్రెడ్డి నాటకాలు ఆడుతున్నారన్నారు. అసలు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులను వంద సార్లు జైలులో పెట్టొచ్చన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్నారో.. యువత ఎంత కోపంగా ఉన్నారో చూస్తున్నామన్నారు. హాస్టళ్లలో విషాహారం తిని చనిపోయిన విద్యార్థుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని హితవు పలికారు. కేసీఆర్ను తిట్టడం, కేసులు పెడతామనే చిల్లర మాటలను సీఎం రేవంత్రెడ్డి బంద్ చేయాలన్నారు. రైతులు ఒక పక్క యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని, వాళ్ల దృష్టిలో రేవంత్రెడ్డి ఎప్పటికీ ద్రోహిగానే మిగిలిపోతాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. కేసును సీబీఐకి అప్పగించడంతోనే ప్రధాని నరేంద్ర మోదీతో రేవంత్రెడ్డి బంధం బహిరంగమైందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
ఎయిమ్స్లో ఆత్మహత్య నివారణ వారోత్సవాలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆత్మహత్య నివారణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు, వారి బంధువులకు ఆత్మహత్య నివారణపై నర్సింగ్ విద్యార్థులు అవగాహన కల్పించారు. అనంతరం ఓపీడీ బ్లాక్లో మానసిక ధైర్యం పెంపొందించుకునే విధంగా విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్, డీన్ నితిన్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా తదితరులు పాల్గొన్నారు. -
భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భర్త
మిర్యాలగూడ టౌన్: భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. బుధవారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం లచ్చతండా గ్రామానికి చెందిన పానుగోతు సందీప్ కుటుంబంతో కలిసి గత నాలుగేళ్లుగా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా సందీప్కు మానసికస్థితి సరిగా ఉండటంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 8న అతడు భార్య పద్మతో గొడవపడి మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్నగర్లో నివాసముంటున్న తన బావమరిది నేనావత్ గోవింద్ ఇంటికి వెళ్లాడు. సందీప్ చిన్న కుమారుడు మహేష్ వరంగల్లో చదువుతుండగా.. అతడి వద్దకు వెళ్తానని చెప్పడంతో సందీప్ను అతడి బావమరిది గోవింద్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో దించాడు. అనంతరం సందీప్కు కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఎంత వెతికినా సందీప్ ఆచూకీ లభించకపోవడంతో అతడి తమ్ముడు పానుగోతు మేఘా బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇంటికి చేరుకున్న హాస్టల్ విద్యార్థి
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామ పరిధిలోని నేతాజీ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలుర హాస్టల్ నుంచి మంగళవారం అదృశ్యమైన విద్యార్థి తన ఇంటికి చేరుకున్నాడు. గద్వాల జిల్లా లతిపురం గ్రామానికి చెందిన విద్యార్థి గొల్లతిప్పడంపల్లి శ్రీకాంత్ మంగళవారం ఉదయం 9 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయి కొత్తగూడెం వద్ద బస్సు ఎక్కి హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడి నుండి రైలు ఎక్కి గద్వాలలో దిగి స్వగ్రామం లతిపురం చేరుకున్నాడు. శ్రీకాంత్ తండ్రి వెంటనే ప్రిన్సిపాల్కు ఫోన్ చేసి తన కొడుకు ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్పాడు. హాస్టల్లో ఉండలేక తల్లిదండ్రులను చూడాలని విద్యార్థి టీచర్లకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. -
యువకుడిపై పోక్సో కేసు
కనగల్: కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన గణేష్ శోభాయాత్ర కొనసాగుతుండగా యువకుడు బాలిక ఇంటికి వెళ్లి ఆమైపె అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు, కుటుంబ సభ్యులు యువకుడిని బంధించే ప్రయత్నం చేశారు. అదే గ్రామానికి చెందిన యువకుడి స్నేహితులు ఇద్దరు అక్కడికి చేరుకొని బాధితురాలి తల్లిదండ్రుల నుంచి అతడిని తప్పించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు కనగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి బుధవారం అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో కేసు, అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులపై మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఊట్కూరు వాగులో కొట్టుకుపోయిన వలస కూలీఫ రక్షించిన యువకులు నిడమనూరు: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిడమనూరు మండలంలోని ఊట్కూరు వాగులో ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. స్థానికంగా బొగ్గు బట్టీలో పనిచేసే వలస కూలీ మద్యం మత్తులో బుధవారం వాగులో పడి కొంత దూరం కొట్టుకపోయాడు. స్థానిక యువకులు అతడిని రక్షించారు. -
పంట మార్పిడితో లాభాల బాటలో..
తుర్కపల్లి: ఎప్పుడూ ఒకే రకం పంట సాగుచేసి నష్టాలపాలవ్వకుండా ప్రతి ఏడాది వేర్వేరు పంటలు సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు తుర్కపల్లి మండలం నాగాయపల్లికి చెందిన రైతు లకావత్ అంజయ్య, ఆయన కుమారులు మంగ్తా, మోహన్. వారు అనుసరిస్తున్న పద్ధతి పలువురు రైతులకు ఆదర్శంగా మారింది. లకావత్ అంజయ్య కుటుంబ సభ్యులు గతంలో వరి సాగు చేసేవారు. అధిక పెట్టుబడి, నీటి వినియోగం, ఆరు నెలల నిరీక్షణ వంటి సమస్యలతో కూరగాయలు, పూలు, పండ్ల తోటల సాగువైపు అడుగులు వేశారు. గతేడాది వంకాయ పంట వేసి మంచి లాభాలు పొందారు. ఈ ఏడాది బొప్పాయి సాగుపై దృష్టి సారించారు. మూడు ఎకరాల్లో మూడు వేల మొక్కలు.. మిత్తం మూడు ఎకరాల్లో మూడు వేల బొప్పాయి మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు రూ.20 ఖర్చు కాగా.. దున్నకాలు, పేడ, ఎరువులు, డ్రిప్ సదుపాయం ఇతరత్రా కలసి మొత్తం రూ.2.5లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఎనిమిది నెలల్లోనే పండ్లు రావడం ప్రారంభమై.. సంవత్సరం పొడువునా దిగుబడి వస్తుంది. తెగుళ్ల నివారణ కోసం వారానికి ఒకసారి మందులు పిచికారీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా బొప్పాయి తోటలో అంతర పంటగా బంతి పూల సాగు కూడా చేపట్టారు. మొదటి కోతలోనే రెండు టన్నుల దిగుబడి వచ్చిందని, వారానికి ఒకసారి పూలు కోసి మార్కెట్కు తరలిస్తున్నట్లు రైతు అంజయ్య, ఆయన కుమారులు పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చు రూ.2.5 లక్షలు కాగా.. ప్రకృతి అనుకూలించి, మార్కెట్లో మంచి ధరలు లభిస్తే సుమారు రూ.6లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ ప్రతి ఏడాది వేర్వేరు పంటలు సాగు చేస్తున్న తుర్కపల్లి మండలం నాగాయపల్లికి చెందిన రైతు ఫ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా ప్రణాళికలు -
అనుమతి లేని క్లినిక్ సీజ్
తుంగతుర్తి: అనుమతులు లేకుండా నడిపిస్తున్న క్లినిక్ను సూర్యాపేట జిల్లా ఉప వైద్యాధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో సర్గం సంపత్కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీసంజీవని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నడిపిస్తున్నాడు. అంతేకాకుండా అందులో అనధికారికంగా రోగులకు చికిత్స కూడా చేస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో తనిఖీ చేసినట్లు సూర్యాపేట జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓలు జయ మనోహరి, జి. చంద్రశేఖర్ తెలిపారు. సంపత్కుమార్ ఎలాంటి అర్హత లేకున్నా రోగులకు ఇంజెక్షన్లు, గ్లూకోజ్లు అందిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ మేరకు క్లినిక్ను సీజ్ చేసినట్లు తెలిపారు. వారి వెంట జిల్లా ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం అధికారి నాజియా తబస్సుం, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి ఆశ్రిత తదితరులు ఉన్నారు. -
పరిశుభ్రత లోపిస్తే ఉపేక్షించేది లేదు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపిస్తే ఉపేక్షించేది లేదని ఆలయ ఈఓ వెంకట్రావ్ అన్నారు. యాదగిరి కొండపైన బుధవారం ఆలయ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీ కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిబంధనల ప్రకారం సిబ్బంది ఏర్పాటు, సిబ్బంది పనితీరు, నాణ్యమైన మెటీరియల్ సరఫరా అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. పరిశుభ్రత విభాగంలో పనిచేసే సిబ్బంది, సూపర్వైజర్లు, క్లీనింగ్ సిబ్బంది విధిగా అటెండెన్స్, వర్క్ చార్జ్, డ్రెస్కోడ్ పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. పరిశుభ్రత నిర్వహణలో శాసీ్త్రయ, మెకనైజ్డ్ పద్ధతులు అవలంబించాలని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు దయాకర్రెడ్డి, రామారావు, ఏఈఓలు, సీఎస్ఓ, సంబంధిత పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఫ యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ చెవిదిద్దులు, రూ.20వేల నగదు, 15 చీరల అపహరణ కోదాడరూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని భవానీనగర్లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్లో నివాసముండే వేనేపల్లి నాగేశ్వరరావు దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారిద్దరు నడిగూడెంలో ఉంటూ వారంలో రెండు రోజులు కోదాడకు వచ్చి వెళ్తుంటారు. బుధవారం నాగేశ్వరరావు ఇంటికి పనిమనిషి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా.. బీరువాలోని రెండు జతల చెవిదిద్దులు, కిడ్డీ బ్యాంకులో పిల్లలు దాచుకున్న రూ.20వేల నగదు, 15 చీరలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు. ఇంజన్లో మంటలు చెలరేగి ఆటో దగ్ధంచౌటుప్పల్ రూరల్: ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆటో దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అంబర్పేట్ నుంచి ఏపీలోని విజయవాడకు పేపర్ లోడ్తో ఆటో వెళ్తుండగా.. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్దకు రాగానే ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ గమనించి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఆటో ఆపుతుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ పక్కన ఉన్న డోరు తెరుచుకోకపోవడంతో ఎడమ వైపు డోరు నుంచి డ్రైవర్ జడ నాగరాజు ఆటోలో నుంచి కిందకు దూకాడు. ఆటోలో పేపర్ లోడ్ ఉండడంతో చూస్తుండగానే ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు. -
సిద్ధాంతానికి కట్టుబడిన నేత.. సురవరం
నల్లగొండ టౌన్: నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగిన నేత సురవరం సుధాకర్రెడ్డి అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జీఎల్ గార్డెన్స్లో సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సురవరం సుధాకర్రెడ్డి నల్లగొండ ఎంపీగా పనిచేశారని, పార్లమెంట్లో కార్మికులు, రైతుల సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ఆయన ఎంపీగా పనిచేసిన సమయంలో నల్లగొండలో ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తే ప్రజా సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కామ్రేడ్ అంటే వంద మందితో సమానమని.. ఒక్కడున్నా ఎర్రజెండాతో అన్యాయాన్ని ప్రశ్నిస్తాడని గుర్తుచేశారు. కమ్యూనిస్టులంటే తనకు గౌరవమని మంత్రి తెలిపారు. సుధాకర్రెడ్డి బతికున్నంత కాలం ప్రజల కోసం పనిచేసి, చనిపోయిన తర్వాత కూడా వైద్య విద్యార్థుల కోసం తన భౌతికకాయాన్ని ఇవ్వాలని కోరుకున్న గొప్ప నాయకుడని అన్నారు. సుధాకర్రెడ్డి విగ్రహాన్ని నల్లగొండలో ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాతో పాటు దేశ ప్రజల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించిన ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం అని కొనియాడారు. సుధాకర్రెడ్డి విద్యార్థి దశనుంచే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడై వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారన్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎంపీగా పనిచేశారని గుర్తుచేశారు. తామిద్దరం వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతానికి తాగు, సాగునీరు సాధించేందుకు కమ్యూనిస్టులు చేసిన పోరాటానికి తాను సంఘీభావం తెలిపానని చెప్పారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించి చారిత్రక ఉద్యమ విజయాలను చవిచూసిన వ్యక్తి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు మృతిచెందినా ప్రజల మధ్యలో జీవిస్తారని అదే కోవలోకి సురవరం వస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, నాయకులు పల్లా నర్సింహారెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, పల్లా దేవేందర్రెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, కలకొండ కాంతయ్య, శ్రీనివాస్, పల్లె నర్సింహ, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, హాశం, పబ్బు వీరస్వామి, రామచంద్రం, వెంకటేశ్వర్లు, నర్సింహ, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండలో సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ -
స్వచ్ఛ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరి: జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ, హరిత పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, నీటి వినియోగం, విద్యార్థుల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, మొదలైన అంశాలపై రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా 200 పాఠశాలలను ఎంపిక చేసి పురస్కారాలు ఇస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంపికై న ఒక్కో పాఠశాలలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 875 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ పురస్కారాల ఎంపిక కోసం ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు అక్టోబర్లో తనిఖీలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయిలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అండాలు, జిల్లా మాస్టర్ ట్రైనర్ కృష్ణప్రసాద్, ఎంఈఓలు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణ -
ఎయిడ్స్పై అవగాహన ఉండాలి
భువనగిరి: ఎయిడ్స్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూత్ ఫెస్ట్–2025, 5కే రెడ్ రన్ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు క్విజ్ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్ తెలిపారు. అంతకుముందు 5కే రెడ్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ సాయిశోభ, సంపతయ్య, ముత్యాలు, చంద్రమౌళి, సతీష్, నర్సింహ, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెపటైటిస్ ‘బి’ వ్యాక్సిన్తో వ్యాధుల నుంచి రక్షణహెపటైటిస్ ‘బి’ వ్యాక్సిన్తో జీవితకాల కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ సాయిశోభ, డాక్టర్ యశోధ, మధురిమ, స్వప్నరాథోడ్, సృజన, సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ -
మండుతున్న ఎండలు
భువనగిరి: వర్షాకాలంలో ఎండాకాలాన్ని తలపించేలా భానుడు తనప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండవేడిమితో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కనిష్టంగా 25 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు ఉండగా గరిష్ట ఉష్ణోగ్రతలు 37.3 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. తగ్గని ఉక్కపోత భారీ వర్షాలు కురిసి మందగించిన తర్వాత కూడా ఉక్కపోత ఏమాత్రం తగ్గలేదు. సెప్టెంబర్లోనూ ఏసీలు, కూలర్లను, ఫ్యాన్లు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలకు బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. మరో వైపు ఉక్కపోతతో ఒక్కరిబిక్కరి అవుతున్నారు.ఈనెలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు (డిగ్రీలలో)తేదీ కనిష్ట గరిష్ట6వ తేదీ 30.4 35.8 7 29.3 35.1 8 30.7 36.0 9 30.6 37.3 గత నాలుగు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం -
దళితుల ద్రోహిగా మిగిలిన కేసీఆర్
● ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ● గతంలో కేసీఆర్ చేసిన వర్టూర్ గ్రామంలోనే పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే మోటకొండూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను పూర్తిగా విస్మరించి పాలన సాగించి దళిత ద్రోహిగా మిగిలారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం మోటకొండూర్ మండలంలోని వర్టూర్ గ్రామంలోని దళిత వాడలో ఆయన పల్లె నిద్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009 తెలంగాణ ఉద్యమ సమయంలో మోటకొండూర్ మండలంలోని వర్టూర్ గ్రామంలోని దళిత వాడలో కేసీఆర్ పల్లె నిద్ర నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రం సిద్దిస్తే 60 దళిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.5 వేల నగదు ఇస్తామని హామీలు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అదే దళితవాడలో కేసీఆర్ పల్లెనిద్ర చేసిన ఇంటి వద్దే తాను పల్లె నిద్ర చేసి దళితులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దళిత వాడలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం వారితో కలిసి సామూహిక సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య, ఆలేరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరిగౌడ్, మండల అధ్యక్షులు గంగాపురం మల్లేష్, పచ్చిమట్ల మదార్గౌడ్, నెమ్మాణి సుబ్రమణ్యం, తండ రంగయ్య గౌడ్, కొంతం మోహన్రెడ్డి, మోర శ్రీనివాస్రెడ్డి, పల్లె శ్రీనివాస్, భూమండ్ల శ్రీనివాస్, బుగ్గ కొమురయ్య, జూకంటి మధు, గువ్వ హరిబాబు, పేరబోయిన కార్తీక్, బుగ్గ శ్రీశైలం, వంగాల మల్లేష్గౌడ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
కలగానే వంతెన నిర్మాణం
ఆలేరురూరల్: కొలనుపాక వాగుపై దశాబ్దాల నాటి కాజ్వే శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 100 మీటర్లు ఉన్న కాజ్వే పూర్తిగా దెబ్బతింది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు కాజ్వే మీదుగా నీరు ప్రవహించి కొన్ని రోజుల వరకు రాకపోకలు స్తంభిస్తాయి. వాహనాలతో కాజ్వేపై జారిపడి ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రూ.4.50 కోట్లు మంజూరు రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో ఏడాది క్రితం జీహెచ్కే సంస్థతో టెండర్ అగ్రిమెంట్ జరిగింది. ఏడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఉపరితలం మీదుగా నీటి ప్రవాహం ఉన్నా తట్టుకునేలా 3.5 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాలి. బ్రిడ్జి నిర్మాణాన్ని 15 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. పలు జిల్లాలకు ప్రధాన మార్గంకొలనుపాక రాఘవాపురం బైరాంనగర్, గ్రామాల్లో సుమారు 2500 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వీరంతా తమ అవసరాల నిమిత్తం ఆలేరు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. అంతేకాకుండా రాజాపేట, జనగాం జిల్లా బచ్చెనపేట, పోచన్నపేట, చేర్యాల, సిద్దిపేటకు ఇది ప్రధాన మార్గం. నిత్యం వందలాదిగా వాహనాలు కాజ్వేపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. జరిగిన ప్రమాద ఘటనలు ఇలా.. ● కొలనుపాకకు చెందిన ధర్మ శ్రీనివాస్రెడ్డి తన బైక్పై సాయంత్రం సమయంలో ఆలేరు నుంచి కొలనుపాకకు వెళ్తుండగా నీటి ప్రవాహానికి జారిపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ● బచ్చనపేటకు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా నీటి ఉధృతికి వంతెన నుంచి దిగువకు పడిపోయారు. అదేవిధంగా ప్రయాణికులతో వెళ్తున్న కొలనుపాకకు చెందిన ఆటో వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆటో ఉన్న ప్రయాణికులకు గాయపడ్డారు. ● ఉపాధ్యాయురాలు స్కూటీపై ఆలేరుకు వస్తూ వాగుదాటే క్రమంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కొలనుపాక వాగుపై శిథిలావస్థకు చేరిన కాజ్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు ఏటా వర్షాకాలంలో తప్పని అవస్థలు కొలనుపాక వాగుపై వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్తో ఒప్పందం జరిగింది. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది వాస్తవమే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక మరమ్తతులు చేపడుతాం. – బాలప్రసాద్, ఈఈ ఆర్అండ్బీ, భువనగిరి డివిజన్ -
యాదాద్రి ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభం
నిడమనూరు : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి చౌటుప్పల్ వద్ద (92.378 కిలోమీటర్ల దూరం) ఉన్న విద్యుత్ టవర్లకు మంగళవారం కేబుల్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా ప్రారంభించినట్టు ట్రాన్స్కో ఏఈ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా నిడమనూరు మండల పరిధిలోని రైతులు వరిపొలాల మీదుగా వెళ్తున్న 400 కేవీ విద్యుత్ లైన్ తీగలను తాకవద్దని సూచించారు. ఈ లైన్ మొత్తం దామరచర్ల మండలంలో తిమ్మాపురం, వీర్లపాలెం, త్రిపురారం మండలంలో అంజనపల్లి, నీలాయిగూడెం, అన్నారావుక్యాంపు, రాగడప, నిడమనూరు మండలం నిడమనూరు, బంకాపురం, శాఖాపురం, పార్వతీపురం, రాజన్నగూడెం, నారమ్మగూడెం, వెనిగండ్ల, పనసయ్య క్యాంపు, తుమ్మడం, అనుముల మండలంలో మారేపల్లి, నారాయణపురం, యాచారం, కుపాసిపల్లి, పాలెం, రామడుగు, శ్రీనాథపురం, చింతగూడెం, గుర్రంపోడు మండలంలో కొప్పోలు, కనగల్ మండలంలో రేగట్టే, కుర్రంపల్లి, జీ ఎడవెల్లి, పొనుగోడు, కనగల్, గౌరారం, తుర్కపల్లి, లచ్చుగూడెం, చండూరు మండలంలోని ఉడుతలపల్లి, బోడంగిపర్తి, మునుగోడు మండలంలోని పాల్వాయి, కిష్టాపురం, ఇప్పర్తి, చీకటిమామిడి, మునుగోడు, కమ్మగూడెం, చొల్లేడు, సోలిపురం, కొరటికల్ నుంచి చిట్యాల మీదుగా చౌటుప్పల్ వరకు 92.378 కిలోమీటర్ల పొడవున ఉందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ టవర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, టవర్లను ఎక్కకూడదని, టవర్ల కింద ఏపుగా పెరిగే మొక్కలు నాటవద్దని పేర్కొన్నారు. చౌటుప్పల్ వద్ద టవర్లకు 400కేవీ లైన్ ద్వారా సరఫరా తీగలను తాకకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలి ట్రాన్స్కో ఏఈ ప్రవీణ్కుమార్ సూచన -
వాగు దాటలేకపోతున్నాం
ప్రతి సంవత్సరం వానా కాలం కొలనుపాక వాగు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం, ఆటోలో స్కూల్ విద్యార్థులతో వాగు దాటే క్రమంలో బయపడుతున్నాం, ఏ చిన్న పనికై నా ఆలేరు పట్టణానికి వెళ్లాలి. ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులు, నాయకులను వేడుకుంటున్నాం ఓట్ల కోసం వస్తారే తప్పా.. సమస్యను పట్టించుకోరు. – దూడల కృష్ణ, కొలనుపాక కొలనుపాక నుంచి సిద్దిపేటకు ప్రధాన రహదారిగా ఉంది. వాగు దాటే క్రమంలో వాహనాలు జారిపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు గతంలో హామీలిచ్చినా నీటి మూటలాగే మిగిలిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకొని వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. – గడ్డ నాగరాజు కొలనుపాక ● -
ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల పర్యటన
రామన్నపేట, చౌటుప్పల్ రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామాన్ని, చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామాన్ని సందర్శించారు. ఆ రాష్ట్ర డీపీఆర్ఓ బులానంద్ సహాన్, డీపీఓ నవీన్మిత్ర సారథ్యంలో 30మంది ప్రజాప్రతినిధులు వెల్లంకి గ్రామ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పంచాయతీ కార్యాలయం నిర్వహణను పరిశీలించారు. రైతువేదికలో గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. అనంతరం ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని సందర్శించారు. వారి వెంట అడిషనల్ డీఆర్డీఓ సురేష్, డీఎల్పీఓ ప్రతాప్నాయక్, ఎంపీడీఓ రాములు, ఎంపీఓ రవూఫ్అలీ, ఏఈలు గాలయ్య, ఆశిష్రాఘవ, ఏపీఓ వెంకన్న, టీఏ సుచరిత, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దేవలమ్మ నాగారం గ్రామం సందర్శన.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 30 మంది సర్పంచులు తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కు వచ్చారు. 2024లో హెల్త్ పంచాయతీ విభాగంలో చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం జాతీయ స్థాయిలో నామినేట్ అయిన నేపథ్యంలో హెల్త్ పంచాయతీ విభాగంలో తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయడానికి వారు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ అమలుచేస్తున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట యూపీ రాష్ట్రానికి చెందిన జిల్లా పంచాయతీ అధికారి శ్రీవాత్సవ్, ట్రైనింగ్ కన్సల్టెంట్ అశ్విన్కుమార్, ట్రైనింగ్ కో ఆర్డినేటర్ అనిల్కుమార్, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, ఎంపీడీఓ సందీప్కుమార్, డీఎల్పీఓ ప్రతాప్నాయక్, ఎంపీఓ అంజిరెడ్డి, పీఆర్ ఏఈ నితీష్, వైద్యాధికారి డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట వరి సాగుతో బహుళ ప్రయోజనాలు
త్రిపురారం: మెట్ట వరి సాగుతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని భారతీయ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త పద్మావతి అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), భారతీయ వరి పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సౌజన్యంతో నల్లగొండ జిల్లాలోని రైతులకు వరి సాగులో యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పద్మావతి వరిలో మొగి పురుగు నిర్మూలన, సమగ్ర యాజమాన్యం, మొగి పురుగు గుర్తించే పద్ధతులతో పాటు లింగాకర్షక బుట్టలు వరి పొలంలో ఉపయోగించే విధానం, వాటి ప్రయోజనాలను తెలియజేశారు. మొట్ట వరి సాగులో కలుపు యాజమాన్యం అత్యంత కీలకమని ఆమె రైతులకు సూచించారు. రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం నీలాయిగూడెం గ్రామంలో రైతు కంచి సోమయ్య సాగు చేసిన మెట్ట వరి పొలాన్ని రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, యంగ్ ప్రొఫెషనల్స్ సుష్మ, అజయ్, సాయికుమార్, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త పద్మావతి -
సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. ప్రస్తుతం 70,038 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్ల ద్వారా 16,012 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,277 క్యూసెక్కులు మొత్తం 48,289 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలలకు 21,819 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నీటిమట్టం 589.10 అడుగులు (309.3558 టీఎంసీలు)గా ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం ● మరో ఇద్దరికి గాయాలు గరిడేపల్లి, మేళ్లచెరువు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం యర్రకుంట తండాకు చెందిన భూక్య భగ్యా(60) తన కుమారుడు భూక్య కృష్ణ, బంధువు ధరావత్ కమిలితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ మండలం అవంతిపురం సంతకు గొర్రె పొట్టేళ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అక్కడ బేరం కుదరకపోవడంతో తిరిగి హుజూర్నగర్ మీదుగా యర్రకుంట తండాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ వైపు కారులో అతివేగంగా వెళ్తున్న కుమ్మరికుంట ప్రణయ్ గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భూక్య భగ్యా మృతిచెందాడు. కృష్ణ, కమిలిని మెరుగైన వైద్యం కోసం కోదాడకు తరలించారు. మృతుడి భార్య భూక్య తిర్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో యర్రకుంట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని దాడి మేళ్లచెరువు: భార్యను వదిలి వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై అతడి భార్య తరఫు బంధువులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఖాజామియా తన భార్యను వదిలి వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి మంగళవారం భార్య తరఫు బంధువులు ఖాజామియాపై దాడి చేశారు. తన భార్యతో పాటు వారి బంధువులే తనపై దాడికి కారణమని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉదయ్పూర్లో తెలంగాణ టీచర్ల ప్రదర్శన
నకిరేకల్: రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో గల సాంస్కృతిక వనరుల కేంద్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఉత్తమ సాధక ఉపాధ్యాయుల శిక్షణలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఉపాధ్యాయులు మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలపై నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ బృందానికి నకిరేకల్ మండలం చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కనుకుంట్ల నవీన్రెడ్డి సారథిగా వ్యహరించి ప్రశంసలు అందుకున్నారు. మొత్తం 13 రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొని వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. 14వ రోజు తెలంగాణ బృందం గ్రామీణ ప్రజల పని సంస్కృతి(ఊరు మనదిరా) బోనాలు, బతుకమ్మ, బంజారా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనను సీసీఆర్టీ అధికారులు అభిషేక్ సర్కార్, హితేష్, పనెరి అభినందించారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మాదరి ఎల్లన్న, పి. రఘురాం, జి. వెంకటేష్, ఈశ్వరయ్య, వి. అంజని, జయంత్కుమార్, ఎ. సౌజన్య, నిఖత్ ఫాతిమా, డి. రమేష్ పాల్గొన్నారని నవీన్రెడ్డి తెలిపారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
సంస్థాన్ నారాయణపురం: ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్థాపంతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన పానగంటి క్రాంతి(28) చేనేత కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం గ్రామంలో ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తాను, వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి చేనేత పనులు అంతంతమాత్రంగానే ఉండడంతో కుటుంబ పోషణకు కూడా అప్పులు చేసినట్లు గ్రామస్తులు చెప్పారు. మొత్తంగా క్రాంతికి ప్రస్తుతం సుమారు రూ.15లక్షల అప్పులు ఉన్నట్లు తెలిసింది. చేనేత మీద వచ్చే సంపాదన కుంటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, అప్పులు ఎలా తీర్చలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం గ్యాస్ సిలిండర్ తీసుకుని వస్తానని గ్రామం నుంచి సంస్థాన్ నారాయణపురం వెళ్లాడు. అక్కడ గడ్డి నివారణ మందు కొనుగోలు చేసి, అక్కడే తాగి ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద వాంతి చేసుకొవాడానికి ప్రయత్నం చేశాడు. కుంటుంబ సభ్యులు గమనించి అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. అక్కడ నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదారాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్ తెలిపారు. -
ఎంజీ యూనివర్సిటీలో కబడ్డీ పోటీలు
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో సోషల్ వెల్ఫేర్ ఆర్మీ డిగ్రీ కళాశాల, భువనగిరి విద్యార్థినులు మొదటి స్థానంలో నిలువగా.. పురుషుల విభాగంలో కేఆర్ డిగ్రీ కళాశాల, మిర్యాలగూడ విద్యార్థులు విజయం సాధించారు. అదేవిధంగా మహిళల విభాగంలో రన్నరప్గా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల, నల్లగొండ, పురుషుల విభాగంలో రన్నరప్గా ఎన్జీ కళాశాల, నల్లగొండ విద్యార్థులు నిలిచారు. గెలుపొందిన జట్లకు యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ హరీష్కుమార్, జి. ఉపేందర్రెడ్డి, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ వై. ప్రశాంతి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సాయుధ పోరాటం ద్వారానే స్వేచ్ఛ
భువనగిరిటౌన్ : ఆనాడు తెలంగాణ రైతాంగం చేసిన సాయుధ పోరాటం ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సదస్సులో రాఘవులు పాల్గొని మాట్లాడారు. ఆనాడు భూస్వాముల దౌర్జన్యాలు శృతిమించడంతో తెలంగాణ సాయుధ పోరాటం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి వెనుక 4000 మంది సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలు ఉన్నాయన్నారు. నాడు నిజాం సర్కారు ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దినట్లే.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నిస్తోందన్నారు. అప్పట్లో నిజాం అవలంబించిన ఫాసిస్టు విధానాలనే నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అవలంబిస్తున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లిం వివాదంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ పోరాటాలపై తప్పుడు వక్రీకరణలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తెలంగాణ విముక్తి పోరాటంలో ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. చదువు లేని ఆడవారికి ఓటు హక్కు వద్దన్న వ్యక్తులు.. నేడు దేశాన్ని పాలిస్తూ ఓటరు జాబితాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు. ఓటరు జాబితాలో మైనార్టీలు, ఆడవారితో పాటు తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పేర్లు తీసేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, కులం, మతం పేరిట గెలవాలని చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆడవారు ఇంటికి సేవలు అధికంగా చేయాలని అనడం ఆయనలోని ఫాసిస్టు విధానాలకు తార్కాణమన్నారు. అనంతరం సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. పోరాట వీరురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 30 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రాలు ఉన్నాయని, వాటిల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. కళాకారులు పోరాట చరిత్రను కళారూపాల ద్వారా ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయాలన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జి. శ్రీనివాస్చారి, నాయకులు గూడూరు అంజిరెడ్డి, మాయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడుతున్న బీవీ రాఘవులుబీఆర్ఎస్ పార్టీది అవ కాశవాద రాజకీయం సాక్షి యాదాద్రి : కీలకమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ అవకాశవాదంగా వ్యవహరించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం భువనగి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయాన్ని రక్షించేందుకు, రాజ్యాంగంలోని మౌలిక విలువలను కాపాడేందుకు ప్రతిపక్షాలు జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతుగా నిలిచాయన్నారు. ఎన్నికకు దూరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రాలకు అమ్మకం పన్ను అనేది ముఖ్యమైన ఆదాయమని, జీఎస్టీ వచ్చిన తర్వాత కేంద్రం.. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిందన్నారు. దేశంలో రెండు విధానాల జీఎస్టీ అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టపరిహారం కేంద్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు చాలా కష్టంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు రూ.9వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆర్థిక శాఖ కమిషన్ వెల్లండించిన విషయాన్ని రాఘవులు గుర్తుచేశారు. నీటి వాడకం ఎక్కువ ఉండే పంటలను తగ్గించేందుకు యూరియాను కంట్రోల్ చేసి రైతుల బలవంతం గా పంటల మార్పిడి విధానం తేవాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వాస్తవాలు వక్రీకరిస్తే తిరుగుబాటు తప్పదు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు -
15న ఎంజీయూ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. యూనివర్సిటీలోని తన ఛాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్మూర్తి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. వారి చేతుల మీదుగా 22 మంది పీహెచ్డీ పరిశోధకులకు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంజీయూ పరిధిలోని కళాశాలల్లో 2022–23, 2023–24 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన 16,210 మందికి, పీజీ పూర్తిచేసిన 3,200 మందికి, బీఈడీ పూర్తి చేసిన 7,800 మందికి పట్టాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటుకు అనుమతి లభించిందని, రానున్న రోజుల్లో మరో మూడు కొత్త కోర్సులు వస్తాయని స్పష్టం చేశారు. 2007లో 500 మందితో ప్రారంభమైన ఎంజీయూలో ప్రస్తుతం 2500 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. మొత్తం 18 డిపార్ట్మెంట్లు ఉండగా వాటిలో 12 కోర్సుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి మొత్తం 70 పోస్టులు మంజూరు కాగా.. 35 మందిని తీసుకున్నారని, మిగతా పోస్టుల్లో 46 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారని తెలిపారు. రూ.60 కోట్లతో వసతి గృహాలు, రూ.12 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అకడమిక్ సంస్కరణల్లో భాగంగా 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎంజీయూకి న్యాక్ బీ ప్లస్ ర్యాంకు ఉందని, 2028 నాటికి న్యాక్ ఏ ప్లస్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంజీయూ సీఓఈ జి. ఉపేందర్రెడ్డి, లక్ష్మీ ప్రభ, సంధ్యారాణి, ప్రవళిక పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా హాజరుకానున్న గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ 57 మందికి గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించిన వీసీ -
దక్షిణంలోనూ ఆందోళన
‘రీజినల్’ అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసితుల డిమాండ్సాక్షి,యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తర భాగంలోని రైతులు మూడేళ్లుగా పోరాటం చేస్తుండగా.. తాజాగా దక్షిణ భాగంలోనూ ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారం హైదరాబాద్ మైత్రివనంలోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఉత్తరభాగం భూ నిర్వాసితులతో కలిసి దక్షిణభాగంలోని పలు మండలాల రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. తమ బతుకులను రోడ్డున పడేస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు వద్దేవద్దంటూ హెచ్ఎండీఏ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అలైన్మెంట్ మార్పుపై ఆగ్రహం తొలుత రూపొందించిన ఆలైన్మెంట్ కాకుండా మరోప్రాంతం నుంచి అలైన్మెంట్ మార్చడంపై రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ సమీపంలో ఓ పరిశ్రమను కాపాడేందుకు, భువనగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం రాజకీయ నేతలు, అధికారులు కుమ్మకై ్క అలైన్మెంట్ మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు, చౌటుప్పల్ మండలాల్లో జాతీయ రహదారుల వెంబడి ఎకరం రూ.4 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య దూరం నిబంధనల ప్రకారం 40 కిలో మీటర్లు ఉండాల్సి ఉన్నా దాన్ని 28 నుంచి 30 కిలో మీటర్లకు కుదించారు. అలైన్మెంట్ మార్చడం వల్ల, భువనగిరి, చౌటుప్పల్ పట్టణాలు రెండు ముక్కలు కానున్నాయి. అదే విధంగా రాయగిరి, చౌటుప్పల్ వద్ద నిర్మించనున్న ఎలివేటెడ్ జంక్షన్ వద్ద గతంలో 70 –80 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ 180 ఎకరాలకు పైగా భూములు సేకరిస్తున్నారు. అలైన్మెంట్ మార్పుతో చాలా మంది రైతులు తమకు జీవనాధారమైన, విలువైన భూములు కోల్పోతున్నారు. కొందరు గుంట భూమి లేకుండా కోల్పోతున్నారు. ఉత్తర భాగంలో మొదలై.. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ఉత్తర భాగంలో మొదలైన ఆందోళన కార్యక్రమాలు ఇప్పుడు దక్షిణ భాగానికి చేరాయి. ఉత్తర భాగంలో భువనగిరి, రాయగిరి, ఎర్రంబెల్లి, కేసారం గ్రామాల రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు దక్షిణ భాగంలో సంస్థాన్నారాయణపురం మండలంలో గుడిమల్కాపురం, చిమిర్యాల, కోతులాపురం, కంకణాలగూడెం, సర్వేల్, లింగవారిగూడెం, పుట్టపాక గ్రామాలు, నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ మండలం గట్టుప్పల్, తెరేట్పల్లి, మర్రిగూడ మండలంలోని బట్లపల్లి, దామర భీమనపల్లి, మర్రిగూడెం, నామాపురం, మట్టి చందాపూర్, సరంపేట, వట్టిపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. దక్షిణ భాగంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సర్వే నంబర్లను అధికారులు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుత అలైన్మెంట్ ప్రకారంగా తమ విలువైన భూములను కోల్పోవాల్సి వస్తుందని, భూములివ్వడానికి సంస్థాన్నారాయణపురం మండలంలోని పుట్టపాక, సర్వేల్ గ్రామాల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలంటూ రైతుసంఘాల ఆధ్వర్యంలో పోరాటానికి శ్రీకారం చుట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, పుట్టపాకలో రాస్తారోకో చేశారు. ఆదివారం సంస్థాన్నారాయణపురం, గట్టుప్పల్ మండలాల పరిధిలోని భూ నిర్వాసితులు సంస్థాన్నారాయణపురంలో సమావేశం అయ్యారు. వీరికి అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా నిలిచారు. మా భూములు లాక్కోవద్దు చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం: రీజినల్ రింగ్రోడ్డు భూనిర్వాసితులు మరోసారి కదంతొక్కారు. ఉత్తర, దక్షిణ భాగాలకు చెందిన 8 జిల్లాల రైతులు స్వచ్ఛందంగా తరలివెళ్లి హైదరాబాద్లోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని లోనికి అనుమతి ఇవ్వకపోవడంతో కార్యాలయ ప్రాంగణంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత కార్యాలయం వద్ద నుండి వెళ్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరి ప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. అన్యాయాన్ని సరిచేయకుండా నోటిఫికేషన్లు విడుదల చేయడం సరికాదన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు గుండెలు ఆగిపోయాయని, ఇంకెంతమంది ప్రాణాలను బలిగొంటారని నిలదీశారు.ఎంతవరకైనా పోరాడుతామని, భూములు మాత్రం ఇవ్వబోమన్నారు.అనంతరం హెచ్ఎండీఏ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, భూ నిర్వాసితులు, నాయకులు బోరెం శేఖర్రెడ్డి, దబ్బటి రాములు, గుజ్జుల సురేందర్రెడ్డి, సుర్వి యాదయ్య, బోరెం ప్రకాష్రెడ్డి, సందగళ్ల మల్లేష్గౌడ్, జాల శ్రీశైలం, పల్లె శేఖర్రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, నాగెళ్లి దశరథ, జాల జంగయ్య, శశికళ, పాండుయాదవ్, జోసెఫ్, అనిల్, కృష్ణ, పల్లె పుష్పారెడ్డి, ఐతరాజు రాములు, నెల్లికంటి రాములు, నాగరాజు , ఐతరాజు గాలయ్య, దొంతగోని పెద్దులు, అంజయ్య పాల్గొన్నారు. భూములిచ్చే ప్రసక్తే లేదు నాకు నాలుగు ఎకరాల సాగు భూమి ఉంది. అదే నాకు జీవనాధారం. రీజి నల్ రింగ్ రోడ్డులో నా లుగు ఎకరాలు పోతుంది. నమ్ముకున్న భూమి పోతే తర్వాత జీవనోపాధి ఎలా. ఎంతవరకైనా పోరాడుతాం కానీ భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. సాగు జలాలు అందితే బంగారు పంటలు పండుతాయి. –నెల్కంటి రాములు, పుట్టపాక రైతుల ప్రాణాలు తీయొద్దు నాది 5 ఎకరాల భూమి పోతుంది. మా భూమి పక్క రైతు ఇటీవల ఎకరం రూ.2 కోట్లకు విక్రయించాడు. ఇంత విలువైన భూమికి ప్రభుత్వం రూ.22.50 లక్షలు పరిహారం ఇస్తానంటుంది. కొందరి ప్ర యోజనాల కోసం అలైన్మెంట్ మార్చారు. చౌటుప్పల్ మండలం చిన్నాభిన్నం అవుతుంది. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి. దౌర్జన్యంగా భూములు లాక్కొని రైతుల ప్రాణాలు తీయొద్దు. –బోరం ప్రకాష్రెడ్డి, మందోల్లగూడెం ఔటర్ నుంచి 40 కిలో మీటర్ల దూరం నిబంధన పాటించాలి. అంతేకానీ చౌటుప్పల్ వద్ద 32 కిలో మీటర్లు, నారాయణపురం మండలం వద్ద 30 కిలో మీటర్ల దూరం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది. తక్కువ దూరం నుంచి వెళ్లడం వల్ల నారాయణపురం మండలంలో ఎ క్కువ భూములు పోతున్నాయి. మాది భూమి మిగిలే అవకాశమే లేదు. –పల్లె పుష్పారెడ్డి, సంస్థాన్నారాయణపురం మండలం ఫార్మర్ ఫెడరేషన్ చైర్మన్ ఫ వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు ఫ హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో ఫ ఇప్పటికే ఉత్తర భాగంలో మూడేళ్లుగా కొనసాగుతున్న పోరాటం -
గణేష్ ఉత్సవ ఖర్చు రూ.193 కోట్లు!
భువనగిరి : గణేశ్ నవరాత్రి ఉత్సవాలంటే తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని పూజించడమే కాదు.. తమ కమిటీ గొప్పతనాన్ని, సత్తాను చాటే ప్రదర్శనగా మారింది. ఐక్యత, భక్తిప్రవత్తుల కోసం నిర్వహించే ఈ ఉత్సవాలు ఆర్భాటం, హంగామా చాటుకునే వేదికగా మారుతున్నాయి. భక్తులు పోటాపోటీగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు నిర్వాహకులు రూ.193 కోట్లకు పైగా ఖర్చు చేశారు. వినాయక విగ్రహాల కొనుగోలు మొదలు నిమజ్జనం చేసే వరకు ప్రతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఎక్కడా తగ్గ లేదు. సుమారు 4,826 వినాయక విగ్రహాలు గత నెల 27వ తేదీన వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 17 మండలాల పరిధిలో పల్లెలు, పట్టణాల్లో వాడవాడనా విగ్రహాలు ఏర్పాటు చేశారు. భువనగిరిలో 286 విగ్రహాల వరకు ఏర్పాటు చేయగా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూర్తో పాటు జిల్లావ్యాప్తంగా ఈ సారి 4,826 గణనాథులను నెలకొల్పారు. ఇందులో 6 అడుగుల ఎత్తునుంచి 25 అడుగుల ఎత్తు విగ్రహాలు ఉన్నాయి. వీటిలో రూ.10 వేల నుంచి రూ.1.30 లక్ష వరకు విలువ చేసే విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను చాలా వరకు హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చారు. ఉత్సవాల నిర్వహణ ఇలా.. ఆధ్యాత్మిక ఊట్టిపడేలా, వివిధ నమూనాల్లో ఆకర్షణీయంగా మండపాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ పూజారితో పూజలు, పూజా సామగ్రి కొనుగోలు, అన్నదానాలు, మైకుసెట్, భజన కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనం రోజు మహారాష్ట్ర, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కళాకారులచే ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. వెనుకాడని ఉత్సవ కమిటీలు ఒక్కో వినాయకునికి సగటున రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. దీని ప్రకారం 4,826 మండపాల వద్ద సుమారు రూ.193 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటీలు అంటున్నాయి. అత్యధి కంగా రూ.48 కోట్లు, మండపాలకు రూ.24 కోట్లు, పూజారులకు రూ.28లక్షలు,అన్నదానాలకు రూ.38. 60 లక్షలు, సౌండ్ బాక్స్లు రూ.28.50 లక్షలు, రవాణా చార్జీలు రూ.4.86 లక్షలు, పూజాసామగ్రి రూ.2 లక్షలు, ఇతరత్రా ఖర్చులకు మిగిలినవి వెచ్చించారు. మండపాల నిర్వహకులు ఆధ్యాత్మికతను చాటేందుకు, ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఒక్కో మండపం వద్ద రూ.లక్షల్లో ఖర్చు చేశారు. భారీ విగ్రహాలతో పాటు ఆకర్షణీయంగా మండపాలు ఏర్పాటు చేసిన వారు రూ.8నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. సాధారణ మండపాల వద్ద రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. –రత్నపురం శ్రీశైలం, భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఫ 4,826 విగ్రహాలకు రూ.48 కోట్లు ఫ మండపాలకు రూ.24 కోట్లు ఫ అన్నదానం, పూజా సామగ్రి ఇతర వ్యయం భారీగానే.. -
రోడ్లు, వంతెనల సమస్య తీర్చండి
సాక్షి,యాదాద్రి : నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, బ్రిడ్జిల సమస్యను పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మూసీ నదిపై బొల్లెపల్లి– సంగెం బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ పిలిచి పనులు త్వరితగతిన ప్రారంబించాలని కోరారు. జూలూరు – రుద్రవెల్లి హైలెవల్ బ్రిడ్జి పనులు 12 ఏళ్లుగా ముందుకు సాగడం లేదన్నారు. బ్రిడ్జి పనులను కాంట్రాక్టర్ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారని పేర్కొన్నారు. పాత కాంట్రాక్ట్ టెండర్ రద్దు చేసి హెచ్ఎండీఏ నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించాలని కోరారు. భువనగిరి – చిట్యాల రోడ్డు విస్తరణకు నిధులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ రహదారి నాగిరెడ్డిపల్లి వరకు నేషనల్ హైవే 161 ఏఏలో ఉందని, ఆర్అండ్బీకి బదిలీ చేయాలని విన్నవించారు. హ్యామ్ పథకంలో నాలుగు లేన్లుగా విస్తరించి పనులు వేగవంతం చేయాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఫ మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి వినతి -
అదే గోస.. అదే యాతన
మోత్కూరు: అదును దాటుతున్నా రైతులకు యూ రియా తిప్పలు తప్పడం లేదు. మోత్కూరులోని పీఏసీఎస్, ఫర్టిలైజర్ల వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. పీఏసీఎస్కు 444, మన గ్రోమోర్కు 444, శ్రీరామ ఫర్టిలైజర్స్కు 150, బాలాజీ ఫర్టిలైజర్స్కు 150, లక్ష్మీనర్సింహ ఫర్టిలైజర్స్కు 70, పాటిమట్ల ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న మన గ్రోమోర్కు 444 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. ముందుగానే రైతులకు టోకెన్లు అందజేసిన అధికారులు.. ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాలు పంపిణీ చేశారు. -
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ భువనగిరి, : ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నలుగురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. ముగ్గురికి ఉపాధ్యక్ష పదవులు దక్కగా, మరొకరికి రాష్ట్ర కార్యదర్శి, ఇంకొకరికి ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆమోదంతో రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, జరుప్లావత్ గోపి (కళ్యాణ్నాయక్)లను నియమించారు. రాష్ట్ర కార్యదర్శిగా తూటుపల్లి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భువనగిరికి చెందిన వేముల అశోక్కు అవకాశం కల్పించారు. రవికుమార్ గతంలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఒడిపోయారు. సంజయ్ అనుచరుడిగా ముద్ర పడినందుకేనా.. ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా వ్యవహరించే గంగిడి మనోహర్రెడ్డికి ఈసారి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కలేదు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో అనేక సంవత్సరాలు పనిచేసిన ఆయన గతంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ బాధ్యతల్లో చాలా కాలం సేవలందించారు. కాగా, బండి సంజయ్ ప్రధాన అనుచరుడిగా మనోహర్రెడ్డి వ్యవహరించారాని, రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించకుండా కొందరు ఎంపీలే నడ్డాపై ఒత్తిడి చేశారని అనుచరులు మండిపడుతున్నారు. దీనిపై మనోహర్రెడ్డి స్పందిస్తూ.. కార్యవర్గంలో తన పేరు లేకపోవడం వాస్తవమేనని, పార్టీ తన సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటుందేమోనని పేర్కొన్నారు. క్రియాశీల కార్యకర్తగా ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఫ సీనియర్ నేత గంగిడి మనోహర్రెడ్డికి దక్కని స్థానం -
10న తుది ఓటరు జాబితా వెల్లడిస్తాం
సాక్షి,యాదాద్రి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూ చించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10న తుది జాబితా వెలువరిస్తామన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభా రాణి తదితరులు పాల్గొన్నారు. వైద్యశిబిరాలతో గ్రామీణ ప్రజలకు మేలు బొమ్మలరామారం: కార్పొరేట్ ఆస్పత్రులు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలతో పేద ప్రజలకు మేలు జరుగుతుందని డీసీపీ అక్షాంశ్యాదవ్ అన్నారు. బొమ్మలరామారం మండలంలోని జలాల్పూర్ జెడ్పీ హైస్కూల్లో సోమవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సుధీర్బాబు, వైస్ చైర్మన్ సుధాకర్ల మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో సోమ, మంగళవా రాల్లో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యశిబిరంలో బసవతార కం క్యాన్సర్ ఆస్పత్రి, జీనియా, ఈన్టీ పోలీస్ ఐ ఆస్పత్రి, స్మైల్గార్డ్ ఆస్పత్రుల వైద్యులు సేవలందించారు. ఎస్ఐ బుగ్గ శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ రాహుల్రెడ్డి, డీఈఓ సత్యనారాయణ, సీఐ చంద్రబాబు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రఘువీర్, జాయింట్ సెక్రటరీ వాసుదేవ్, చీఫ్ కో ఆర్డినేటర్ సావిత్రి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, ఎంఈఓ రోజారాణి, హెచ్ఎం పగిడిపల్లి నిర్మల జ్యోతి, మాజీ సర్పంచ్ మోటే గట్టయ్య, విజయ్కుమార్ రెడ్డి, డాక్టర్ రేణుక, తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్కు రాష్ట్ర ఉత్తమ అవార్డు ఆలేరు: ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణకు రాష్ట్ర ఉత్తమ ఐటీఐ ప్రిన్సిపాల్ అవార్డు దక్కింది. సోమవారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లకిడికాపూల్లోని తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్ల చేతుల మీదుగా హరికృష్ణ అవార్డుతో పాటు ప్రశంసపత్రాన్ని అందుకున్నారు. అవార్డు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
ఆలకించి.. పరిష్కారానికి హామీ ఇచ్చి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు అర్జీలను స్వీకరించడంతో పాటు వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి సమస్యను నమోదు చేయించి వినతిపత్రాలను ఆయా శాఖలకు పంపించారు. జాప్యం చేయకుండా సత్వరపరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 57 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ 34, పంచాయతీరాజ్ 5, శిశు సంక్షేమ 4, సర్వే ల్యాండ్ 2, గ్రామీణాభివద్ధి 2, వైద్యారోగ్య 2, ఎంపీడీఓ పో చంపల్లి 2, మున్సిపాలిటీ, అగ్రికల్చర్, విద్య, ఇరిగే షన్, రెసిడెన్షియల్ స్కూల్, ఆర్టీసీ ఒక్కొక్కటికి చొ ప్పున ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్ఓ జయమ్మ, హౌసింగ్ పీడీ విజయ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ ఫ సత్వర పరిష్కారానికి ఆదేశం -
సాగర్కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్: సాగర్ వద్ద 14రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం జలా శయం నుంచి 1,67,448 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. 14క్రస్ట్గేట్లు, విద్యుదుత్పాదనతో దిగువ కృష్ణానదిలోకి 1,45, 882 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాల్వలలకు 21,166 క్యూసెక్కుల నీరువిడుదల అవుతుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 590.00అడుగులు, 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులు, 309.6546 టీఎంసీలుగా నమోదైంది. -
విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహకం
చిలుకూరు: కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించి ఉపకార వేతనాలను తపాలా శాఖ ద్వారా దీన్దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో మంజూరు చేస్తోంది. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం(ఫిలాటెలీ)తో కలిగే ప్రయోజనాలపై పోటీలు నిర్వహించి ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఉపకార వేతనాలు అందించనుంది. 2024–25 విద్యాసంవత్సరంలో వార్షిక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 55 శాతం, బీసీ, ఓసీలు 60 శాతం మార్కులు సాధించినవారు ఈ పోటీలకు అర్హులు. రెండు దశల్లో పరీక్షరెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో తరగతి నుంచి పది మంది చొప్పున (6 నుంచి 9వ తరగతి వరకు) 40 మందిని ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. మొదటి దశ పరీక్షలో జనరల్ నాలెడ్జ్కు 5 మార్కులు, చర్రితకు 5, జాగ్రఫీకి 5, సైన్స్లో 5, క్రీడలు, సంస్కృతి, పర్సనాలిటీ అంశాలకు 5, లోకల్ ఫిలాటెలీకి 10 మార్కులు, నేషనల్ ఫిలాటెలీకి 15 చొప్పున మొత్తం 50 మార్కులు కేటాయిస్తారు. మొదటి దశలో ప్రతిభ చాటిన వారిని రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో విద్యార్థులు తపాలా శాఖ ఇచ్చే అంశాలపై ఉత్తమ ప్రాజెక్టు రూపొందిస్తే ఎంపిక చేస్తారు. వారికి ఏడాది పాటు నెలకు రూ. 500 చొప్పున రూ. 6 వేలు చెల్లిస్తారు. ఎంపికై న విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు తెరిపించి ప్రతి నెల డబ్బులు జమ చేస్తారు. ఈ నెలాఖరున మొదటి దశ పరీక్ష నిర్వహించి అక్టోబర్లో ఫలితాలు విడుదల చేస్తారు. ఆ తరువాత రూపొందించిన ప్రాజెక్టును వచ్చే నెల 30లోగా సమర్పించాలి. తుది ఫలితాలు డిసెంబర్లో ప్రకటిస్తారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని డీఈఓ అశోక్ తెలిపారు.13వ తేదీ వరకు గడుపు అర్హులైన విద్యార్థులు ఈ నెల 13లోగా తపాలా కార్యాలయాల నుంచి దరఖాస్తులు పొందవచ్చు. చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకొని తపాలా కార్యాలయానికి వెళ్లి రూ. 200 చెల్లించి ఫిలాటెలీ డిపాజిట్(పీడీ) ఖాతాను తీసుకోవాలి. అయితే ఈ పథకంపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో నేటి వరకు ఏ ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోలేదని తపాలా శాఖా వారు చెబుతున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు రెండు దశల్లో పరీక్షలు ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ. 500 చొప్పున ఉపకార వేతనం దరఖాస్తుకు 13 వరకు గడువు -
బత్తాయిలో వేసవి పంటకు అనువైన సమయమిదే..
గుర్రంపోడు : బత్తాయి తోటల్లో కాయల కోతలు చివరిదశలో ఉండి ఇప్పటికే కాయలు కోసిన తోటల్లో వేసవి పంట తెచ్చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు అనంతరం వాతావరణం వేడిగా మారడం వల్ల బత్తాయిలో కొద్దిపాటి వాడు లక్షణాలు కనిపించినా కత్తెర పంటకు అనుకూలంగా ఉంటుంది. బత్తాయిలో వర్షాకాలంలో కోతకు వచ్చే కాయల కంటే వేసవిలో వచ్చే పంటకు రెండింతల ధర అధికంగా లభిస్తుంది. ఈ రెండు సీజన్లలో కాయల ధరల్లో ఎక్కువ వ్యత్యాసానికి వర్షాకాలంలో బత్తాయి కాయల వినియోగం చాలా తక్కువగా ఉండటమే కారణం. వేసవిలో అధిక పంట పొందాలంటే సెప్టెంబర్లో చెట్లు వాడుపట్టాలి. ఈ మాసంలో వర్షాలు ఉంటున్నందున కష్టంతో కుడుకున్న పనే అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికే కాయల కోతలు పూర్తయిన రైతులు వేసవి పంట తెప్పించేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, మెళకువలను హాలియా ప్రాంతీయ ఉద్యానవన శాఖాధికారి మురళి వివరించారు. లేత తోటలు బత్తాయి తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే ఐదవ సంవత్సరం నుంచి కాపు వస్తుంది. తోటలను దున్నడం, పాదులు తవ్వడం, ఎండు పుల్లలను తొలగించడం లాంటి అంతరకృషి పనులు పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నీటి తడులను ఆపివేసి చెట్లు వాడుకు గురయ్యేటట్లు చేయాలి. ప్రతి చెట్టుకు 40 కిలోల పశువుల ఎరువు లేదా 10 కిలోల వర్మి కంపోస్టు మూడున్నర కిలోల ఆముదం లేదా వేప పిండి, 600 గ్రాముల యూరియా, 900 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పెట్, 400 పోటాష్ను కలిపి పాదంతా సమంగా వేసి నీటి తడులు ఇవ్వాలి. ఇలా చేస్తే కాయలు మే మాసంలో కోతకు వస్తాయి. ఈ కాపు నిలబడాలంటే డిసెంబర్, జనవరి మాసాల్లో చెట్లను వాడుకు గురి చేయకుండా నీటిని అందించాలి. అయినప్పటికీ రుతు క్రమాన్ని బట్టి చెట్లలో కొంత పూత వస్తుంది. వర్షాకాలంలో కాయలు వస్తాయి. దీని వల్ల వేసవిలో అధిక పంట, వర్షాకాలంలో సీజన్ పంట తక్కువగా వస్తాయి. ఇలా ఒకటి, రెండు సంవత్సరాలు అలవాటు చేసుకుంటూ పోతె చెట్లు ఈ పద్ధతికి అలవాటు పడతాయి. ఎండాకాలం పంట ఎక్కువగానూ వర్షాకాలం పంట తక్కువగానూ వచ్చి రైతులకు రాబడులు పెరుగుతాయి. ముదురు తోటలు ప్రస్తుతం కాపునిస్తున్న ముదురు తోటల్లో వేసవి పంట పెంచేందుకు 50 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప పిండి లేదా ఆముదం పిండి, 750 గ్రాముల యూరియా, 1200 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పెట్, 500 గ్రాముల పోటాష్లను ప్రతి చెట్టుకు వేసి నీరందించాలి. దీంతో కొత్తగా వచ్చిన చిగురు, రెమ్మలను పురుగుల బారి నుంచి కాపాడుకునేందుకు లీటర్ నీటికి 1.5 మీల్లిలీటర్ల మోనో ప్రోటోపాస్ మందును పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషక లోపాలను సవరించేందుకు 5 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్, 2 పెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్, 6 గ్రాములు సున్నం, 10 గ్రాముల యూరియాను లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో ద్రావణాన్ని రెండుసార్లు చెట్లప పిచికారీ చేయాలి. ఈ వేసవి కాపు చెట్టుపై అధికంగా ఉంటే జనవరి మాసంలో మళ్లీ చెట్లకు వాడు అవసరం లేకుండానే సాధారణంగా వచ్చే పంటను మాత్రమే తీసుకోవాలి. చీడపీడల నివారణ వర్షాకాలంలో బత్తాయి తోటల్లో ఎక్కువగా గజ్జి తెగులు, కాయ తొడిమ కుళ్లు తెగులు, దోమకాటు ఎక్కువగా సోకుతాయి. గజ్జి తెగులు : ఈ తెగులు బత్తాయి, నిమ్మ తోటలకు వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది. గజ్జి మచ్చలు ఆకులు, కొమ్మలు, ఆకు తొడిమలపై ఏర్పడతాయి. దీని నివారణకు తెగులు సోకిన ఎండు కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. 10 లీటర్ల నీటిలో 1 గ్రాము సెప్టో సైక్లిన్, 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును వర్షాకాలంలో 20 రోజులకు ఒక్కసారి రెండు సార్లు పిచికారీ చేయాలి. దోమకాటు : బత్తాయి పండ్లు పక్వానికి వచ్చే దశలో దోమలు రాత్రిపూట కాయలపై కాటు వేసి రసాన్ని పీల్చడం వల్ల విపరీతమైన నష్టం ఏర్పడుతుంది. ఈ తెగులు ఆశించిన కాయలు కుళ్లిపోయి రాలిపోతాయి. దీని నివారణకు తోటల్లో రాత్రి పూట లైట్లు పెట్టి అక్కడక్కడా ప్లేట్లలో మలాథీయాన్ ఒక మిల్లీ లీటర్ మందును ఒక శాతం చక్కెర, పండ్లరసంతో కలిసి విషపు ఎరను ఉంచాలి. వెళుతురుకు దోమలు ఆకర్శించబడి మిశ్రమాన్ని పీల్చి చనిపోతాయి. కాయ తొడిమ కుళ్లు తెగులు మొదట తొడిమకు దగ్గరగా కుళ్లు మచ్చ ఏర్పడుతుంది. మచ్చ వక్క రంగులో తొడిమ చుట్టూ కాయపై ఏర్పడుతుంది. క్రమంగా ఈ మచ్చ కాయంతా వ్యాపించి లోపలి భాగాలు కుళ్లి మెత్తబడతాయి. తెగులు సోకిన కాయలు రాలిపోవడం గాని లేదా ఎండి చెట్లు అంటిపెట్టుకుని ఉంటాయి. దీని నివారణకు వర్షాకాలంలో నెలకొకసారి 1 గ్రాము కార్బండిజం మందును ఒక లీటర్ నీటికి కలిపి కాయలు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. -
సాంకేతికతకు శ్రీకారం
మాన్యువల్కు స్వస్తి..ఆలేరు: ప్రకృత్తి వైపరీత్యాలు సంభవించి విద్యుత్ స్తంభాలు నేలకొరిగిప్పుడు, ఈదురు గాలులకు తీగలు తెగినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఎవరో ఒకరు విద్యుత్ అధికారులు, సిబ్బందికి చెబితే తప్ప సమస్య వారికి తెలిసేది కాదు. విద్యుత్ సరఫరా లోపాన్ని గుర్తించేందుకు పోల్ నుంచి పోల్ను పరిశీలిస్తే కానీ సమస్య సిబ్బందికి తెలిసేది. దీనిని గుర్తించడానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదు. దీంతో లోపాన్ని గుర్తించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(లి)టీజీఎస్పీడీసీఎల్ మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏయిమ్స్ మొబైల్ యాప్భవిష్యత్లో ఈ తరహా కరెంట్ కష్టాల సత్వర పరిష్కారానికి డిస్కమ్ ‘ఏయిమ్స్’ (అసెట్ ఇన్స్పెక్షన్ మెయింటెన్స్ సిస్టం)మొబైల్ యాప్ను రూపొందించింది. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే క్షేత్రస్థాయిలో లైన్మెన్ నుంచి ఎస్ఈ వరకు ఈ యాప్ ద్వారా సమాచారం వెళ్లి, వారిని అప్రమత్తం చేస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో లైన్ల వారీగా డిఫాల్ట్ లోకేషన్ వివరాలు అధికారులు, సిబ్బంది అరచేతిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో సిబ్బంది సులువుగా డిఫాల్ట్ లొకేషన్కు చేరుకొని, సాధ్యమైనంత తొందరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈక్రమంలో గతంలో మాదిరిగా విద్యుత్ నిర్వహణ లోపాలను గుర్తించి సరఫరా పునరుద్ధరణలో జరిగే జాప్యానికి చెక్ పడుతుంది. జీఐఎస్ మ్యాపింగ్యాదాద్రి జిల్లాలోని 11కేవీ, 33కేవీ ఫీడర్లతోపాటు సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, అండర్గ్రౌండ్ కేబుల్, ఏబీ స్విచ్లు, కండక్టర్లు, డీటీఆర్లు తదితర నెట్వర్క్ భాగాల పూర్తి వివరాలను నిల్వ చేయడానికి భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాంకేతికను ఉపయోగిస్తున్నారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది రెండు నెలలుగా ఈ వివరాలను సేకరిస్తూ జీఐఎస్లో నిక్షిప్తం చేస్తూ మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నారు. డేటా మొత్తం డిజిటలైజేషన్యాప్ ద్వారా డిస్కం నెట్వర్క్ వివరాలన్నీ డిజిటలైజేషన్ చేస్తుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తీగలు తెగటం, డిస్క్, ఇన్సులేటర్, ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ తదితర బ్రేక్డౌన్స్ సమాచారం వెంటనే తెలుస్తోంది. లొకేషన్కు సిబ్బంది తొందరగా చేరుకునే వీలు కలుగుతుంది. తక్కువ సమయంలో సరఫరా పునరుద్ధరణకు వెసులుబాటు కలగనుంది. ఇలా సబ్స్టేషన్ పరిధిలోని చివరి పోల్ వరకు రోడ్డు క్రాసింగ్ వద్ద అండర్గ్రౌండ్ కేబుల్తో సహా సమస్యను జీఐఎస్ మ్యాపింగ్తో గుర్తించి పరిష్కరిస్తారు. కరెంట్ కష్టాల సత్వర పరిష్కారానికి ‘ఏయిమ్స్’ యాప్ రూపొందించిన టీజీఎస్పీడీసీఎల్ దీని సాయంతో లైన్మెన్ నుంచి ఎస్ఈ వరకు సమాచారం విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యానికి చెక్ కొనసాగుతున్న నెట్వర్క్ మ్యాపింగ్ ప్రక్రియ -
మరో నెలలో మ్యాపింగ్ పూర్తి
జిల్లాలో 432కి.మీ.11కేవీ, 59 కి.మీ. పొడవు 33/11కేవీ ఫీడర్లు ఉన్నాయి. మొత్తం 97 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని ఎన్ని స్తంభాలు వాటి కేటగిరి తదితర నెట్వర్క్ వివరాలు ఏయిమ్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటాయి. మరో నెలలో జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ మొబైల్ యాప్ ద్వారా నిర్వహణ లోపాల గుర్తింపు, సత్వర పరిష్కారం, వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ పంపిణీ సేవలు అందనున్నాయి. లైన్మెన్ల నుంచి ఏఈ, ఏడీఏ, డీఈ, ఎస్ఈల వరకు ఎవరి పరిధిలో వారికి యాప్ ద్వారా బ్రేక్డౌన్ తదితర సమస్యల సమాచారం వెంటనే తెలుస్తుంది. – సుధీర్కుమార్, ఎస్ఈ యాదాద్రి జిల్లా -
ఎంజీయూలో క్రీడాపోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్: ఎంజీ యూనివర్సిటీలో సోమవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొని రాణించాలన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత, దేహదారుడ్యం పెరుగుతుందన్నారు. విద్యార్థుల నాయకత్వ లక్షణానికి క్రీడలు దోహదపడుతాయని తెలిపారు. ప్రతి కళాశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రోజు ఏదో ఒక క్రీడలో విద్యార్థులు పాల్గొనే విధంగా చూడాలని పేర్కొన్నారు. మహిళా విభాగంలో ఫైనల్ పోటీలు తెలంగాణ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నల్లగొండ, తెలంగాణ ఆర్మీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భువనగిరి మధ్య జరగనున్నట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి, మురళి, శ్రీనివాస్రెడ్డి, శివశంకర్, వ్యాయామ ఉపాధ్యాయులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నాన్ ఆయకటు్టకు జలసిరి
ఆలేరు ప్రాంతంలో ఇలా.. చెరువులు, కుంటలు 726అలుగులు పోస్తున్నవి 18075–100 శాతం నిండినవి 13250–75 శాతం నిండినవి 12825–50 శాతం నీళ్లున్నవి 1740–25 శాతం.. 100యాదగిరిగుట్ట రూరల్: నాన్ ఆయకట్టు ప్రాంతమైన ఆలేరు నియోజకవర్గానికి ఈ వానాకాలం ఆలస్యంగానైనా జలసిరి సిద్ధించింది. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరడంతో ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయి. 132 చెరువులు అలుగుపోయగా, 132 చెరువులు వంద శాతం నిండాయి. మిగతావి జలకళను సంతరించుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే కళకళలాడాల్సిన పొలాలు చాలా చోట్ల బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. సాగు చేసిన పొలాలకూ సరిపడా నీరందని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కురిసిన వర్షాలు అన్నదాతకు ఊపిరిపోశాయి. చెరువులే ఆధారంఆలేరు నియోజకరవర్గ రైతులు బోర్లు, బావులు, చెరువుల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలోని చెరువులో నీళ్లుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆయకట్టు సాగవుతుంది. పశుపక్షాధులకు తాగు నీరు లభిస్తుంది. మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుంది. చెరువుల్లో నీరు లేకుంటే ఈ ప్రాంతం ఎడారిని తలపిస్తుంది. బోర్లు ఎండిపోయి పంటలకు నీరందని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లోకి భారీగా నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక బీళ్లుగా భూములుఆలేరు డివిజన్లో సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా చెరువులు, బోర్లు, బావుల ఆధారంగానే సాగువుతుంది. సీజన్ ప్రారంభం నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల భూములు సాగుకు నోచుకోలేదు. దీనికి తోడు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆశావహ పరిస్థితులు నెలకొ న్నాయి. మరో భారీ వర్షం కురిస్తే నాన్ ఆయకట్టులో చెరువులన్నీ అలుగుపోసి యాసంగికి సాగునీటి చింత ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. జూన్ వరకు లోటు వర్షపాతం ఉన్నప్పటికీ ఆగస్టులో సాధారణం కంటే అధికంగా నమోదైంది.భారీ వర్షాలతో చెరువులకు జలకళ సగానికి పైగా చెరువుల్లో 70 శాతం నీరు బోర్లు, బావుల్లో పెరిగిన నీటి మట్టాలు సీజన్ చివరి దశలో పంటలకు ఊపిరి యాసంగికి ఆశావహ పరిస్థితులుబోర్లలో నీట్టిమట్టం పెరిగిందిమొన్నటి వరకు బోర్లలో నీళ్లు సరిగా లేవు. వానాకాలం చివరి దశలో ఉన్న పంటలకు వర్షాలు ఊపిరి పోశాయి. చెరువులు, కుంటలు నిండడం వల్ల నీటి మట్టం పెరిగింది. ఇప్పటికై తే నీటి కొరత ఉండదు. సీజన్ ప్రారంభంలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉండగా చెరువులు నిండటంతో పెరిగింది. – తాళ్ల ఉప్పల్రెడ్డి, గుండ్లపల్లిచేప పిల్లలు పోస్తాంపది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చాలా చెరువులు నిండాయి. గతంలో చెరువుల్లో నీళ్లు సరిగ్గా లేక చేప పిల్లల పెంపకంలో నష్టం వాటిల్లింది. ప్రస్తుతం చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరింది. మా ఊరి చెరువులో చేప పిల్లలు వేయడానికి సిద్ధమయ్యాము. ఆర్థికంగా ఉపాధి లభిస్తుంది. – ఎల్లంల సత్తయ్య, మహబూబ్పేట -
ఎన్నో సార్లు రాష్ట్రస్థాయికి వెళ్లాం
మా పాఠశాలకు చెందిన విద్యార్థులం చాలాసార్లు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యాం. హెచ్ఎం నిర్మలజ్యోతి మేడం విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ గోపాల్ సార్ ప్రోత్సామం ఎంతో ఉంది. క్రీడల్లో మెళకువలను సులభరీతిలో నేర్పుతున్నారు. – చరణ్, 9వ తరగతిక్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు క్రీడలపై విద్యార్థులకు ఉన్న ఆసక్తిని ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సమిస్తున్నారు. క్రీడల్లో క్షణ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై న విద్యార్థులకు ప్రయాణ, ఇతర ఖర్చులు సమకూర్చేందుకు హెచ్ఎం మేడమ్ చొరవ తీసుకుంటున్నారు. – హరిష్మ, 9వ తరగతి● -
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
భూదాన్పోచంపల్లి: స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ)లో నిర్వహించే వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకొని, అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించి ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ డాక్టర్ కిషోర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ కిషోర్రెడ్డి సమక్షంలో అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, ఎస్ఆర్టీఆర్ఐ డైరెక్టర్ హరికృష్ణ అవగాహన పత్రాలపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యయోజన పథకం ద్వారా అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ, శిక్షణ పూర్తికాగానే ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు కల్పిస్తామని కిషోర్రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, స్కిల్ డెవలప్మెంట్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సోలమన్, ఆయా విభాగాల డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు. -
ఆటల్లోనూ మెరికలే..
జాతీయ, రాష్ట్ర స్థాయికి మర్యాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులురాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపికై న విద్యార్థినులు నిహారిక, సంధ్యజాతీయ స్థాయికి వెళ్లింది వీరే.. 2011లో మర్యాల గ్రామానికి చెందిన ఎండీ.అస్మా కౌసర్ 2014 కాండ్లకుంట తండాకు చెందిన వైజయంతి జాతీయస్థాయిక ఖోఖో పోటీల్లో ప్రాతినిథ్యం వహించారు. సైన్స్ఫెయిర్లోనూ సత్తా చాటారు పాఠశాల విద్యార్థులు సైన్స్ఫెయిర్లో సైతం సత్తా చాటారు. దివ్యాంగులకు ఉపయోగపడేలా రూపొందించిన బస్సు రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత 2024–25 విద్యా సంవత్సరంలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో మర్యాల జిల్లా పరిషత్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలోనూ ఈ పాఠశాల విద్యార్థులు మండల, జిల్లా టాపర్లుగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణకు సైతం.. చదువు, ఆటల్లోనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు కృషి చేస్తున్నారు. చెట్ల ప్రాధాన్యత తెలిసేలా పాఠశాల ఆవరణలో తరగతి గదుల వెంట వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేశారు. పోటీలు ఎక్కడ జరిగినా విజయం వారిదే.. సైన్స్ ఫెయిర్లోనూ రాష్ట్ర స్థాయికి పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రధానోపాధ్యాయురాలు నిర్మలజ్యోతిబొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తూనే క్రీడల్లోనూ రాణిస్తున్నారు. అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ, పట్టుదలతో సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులను ఆటల వైపు ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. హెచ్ఎం నిర్మల జ్యోతి. పలుమార్లు రాష్ట్ర స్థాయికి.. 2024 సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరిగిన రాష్ట్ర సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో దరావత్ దీపిక సత్తా చాటింది. 2024 నవంబర్ 3,4,5 తేదీల్లో కామారెడ్డి జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలికల విభాగం ఖోఖో పోటీల్లో ఉమ్మడి నల్లగొండ తరఫున జగ్గారి హరిస్మా, కె.శ్రేష్ట ప్రతిభ కనబరిచి 68వ రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. 2024 నవంబర్ 7న సూర్యాపేటలో జరిగిన ఉమ్మడి నల్లగొండ అండర్–17 బాలికల జిల్లాస్థాయి పాఠశాలల ఖోఖో క్రీడల్లో ప్రవళ్లిక, నిహారిక, అక్షయ 68వ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్–14 బాలుర విభాగంలో ఎల్.నరేష్ రాష్ట్రస్థాయికి ఎంపికై ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. 2024 డిసెంబర్లో భువనగిరిలో జరిగిన అండర్–16 క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీల్లో డి.నిహారిక ప్రథమ, డి.సంధ్య రాణించి నాగర్కర్నూల్లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. 2024 డిసెంబర్లో భువనగిరిలో నిర్వహించిన జిల్లాస్థాయి సీఎం కప్ మహిళా కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానం. అక్షిత, శ్రావణి, రేణుకలు రాష్ట్రస్థాయిక పోటీలకు ప్రాతినిథ్యం వహించారు. జిల్లాస్థాయిలో ఫుట్బాట్ పోటీల్లో దీపిక, సోనియా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ సాధించిన హరిష్మా, ప్రవళ్లిక, అక్షయ, సంధ్య నిహారిక, చరణ్, నరేష్, దీపక్ రాష్ట్రాస్థాయికి ఎంపిక. ఖోఖో పోటీల్లో నిహారిక, వేదశ్రీ, చరణ్, గోవింద్ సింగ్ రాష్ట్రస్థాయికి ఎంపిక. -
చాలా గర్వంగా ఉంది
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు మర్యాల స్కూల్ కేరాఫ్గా నిలువడం గర్వంగా ఉంది. గత సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాం. గతంలో మండల టాపర్గా నిలిచాం. తమ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్స్ సైతం రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. మర్యాల పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. దాతలు సహకరిస్తే మరిన్ని వసతులు సమకూరి విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతాయి. – పగిడిపల్లి నిర్మలజ్యోతి, హెచ్ఎం● -
ఏడాదిన్నరగా ఎదురుచూపుల్లోనే..
భువనగిరిటౌన్ : చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరిమహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు 12,218 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిరుత్సాహంలో దరఖాస్తుదారులురాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 18 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దరఖాస్తుదారులు నిరుత్సాహ పడుతున్నారు. పింఛన్దారులకు గత ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున అందించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే రూ. 4016కు పెంచుతామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణి కార్యక్రమంలోనూ మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు. నిలిపివేస్తున్నారే తప్ప.. మంజూరేదీ? వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు మృతి చెందితే వారి పింఛన్ నిలిపివేస్తున్నారే తప్ప.. అతని భార్య మాత్రం వితంతు పింఛన్ మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం 12 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. ఆఫ్లైన్, ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు విచారణకు నోచుకోకుండా కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. నెలకు రూ.25.24 కోట్లు జిల్లాలో ప్రస్తుతం 98,650 మంది లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారు. వీరిలో వద్ధాప్య, వితంతు, వికలాంగుల, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు ఉన్నారు. వీరికి నెలకు రూ.25.24 కోట్లు పంపిణీ చేస్తున్నారు. నాకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ఆసరా పింఛన్ కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలు ముగిసి కూడా ఏడాదిన్న కావస్తుంది. నేటికీ పింఛన్ మంజూరు కావడం లేదు. పంచాయితీ కార్యదర్శి, మండల పరిష్యత్ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించిన ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదన్నారు. పింఛన్ వస్తే ఆసరా అవుతుంది. – పి.బాలనర్సయ్య, దరఖాస్తుదారుడుచేయూత పింఛన్ కోసం 12వేలకు పైగా దరఖాస్తులు ఫ నేటికీ వెలువడని మార్గదర్శకాలు ఫ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులుప్రస్తుతం లబ్ధిదారులు ఇలా.. వృద్ధులు 36,820వితంతు 36,797దివ్యాంగులు 12,816కొత్త దరఖాస్తులు 12,218 -
యువకుడిపై హత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామంలో యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ జి. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్పల్లి గ్రామానికి మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు షేక్ బాషా తనపై బాటిల్తో దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడని అదే గ్రామానికి చెందిన షేక్ మునీర్ చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు బాషాపై కేసు నమోదు చేసి ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు చేరుకుని బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆందోళన చేపట్టారు. దీంతో చివ్వెంల సీఐ పెన్పహాడ్, సూర్యాపేట రూరల్ ఎస్ఐలను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాధితుడి వెంట బాషా వచ్చినట్లు గుర్తించి అతడిపై హత్యయత్నం కేసు నమోదు చేశారు. మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అనంతరం తదుపరి విచారణకు సహకరించాలని తెలుపుతూ బాషాను ఇంటికి పంపించారు. ఈ కేసులో ఇంకా కొన్ని సీసీ కెమెరాలు పరిశీలించాలని, పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.● బాధితుడి ఫిర్యాదు మేరకు మాజీ కౌన్సిలర్పై కేసు నమోదు ● పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకుల ఆందోళన -
ఆలయ అభివృద్ధిపై సమావేశం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించేందుకు గాను హరే కృష్ణ మూమెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస స్వామిజీ, ఆయన బృందంతో ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదివారం సమావేశమయ్యారు. ఆలయంలో ఎలాంటి వైధిక, ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలను ఈఓ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని హరే కృష్ణ మూమెంట్ బృందాన్ని ఈఓ కోరారు. ఈ సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్శర్మ పాల్గొన్నారు. -
చదివింది పీజీ.. చేస్తోంది పారిశుద్ధ్య పని
మిర్యాలగూడ టౌన్: పీజీ చదివిన యువకుడు కుటుంబ పోషణ కోసం పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన అవిరెండ్ల సందీప్ పీజీ చదివాడు. సందీప్ తల్లి ధనమ్మ చాలకాలం వరకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసింది. ఆమె ఆనారోగ్యానికి గురికావడంతో 2021లో తల్లి స్థానంలో సందీప్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. అయితే పీజీ చేసిన సందీప్ పారిశుద్ధ్య కార్మికుడిగా మురుగు కాలువలను శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనులు పని చేస్తున్నాడు. తన చదువు తగినట్లుగా మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటున్నాడు. -
బుద్ధవనాన్ని సందర్శించిన ఢిల్లీ బృందం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ హెరిటేజ్ సంస్థకు చెందిన బృందం సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధ చరితం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనాలను సందర్శించి మహాస్థూపంలోని అంతర్భాగంలో ఉన్న ధ్యాన మందిరాన్ని వీక్షించారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రులు బుద్ధవనం వివరాలను వివరించారు. అనంతరం పంచశీల కండువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. గ్రామీణ వారసత్వం, అభివృద్ధి కోసం భారతీయ ట్రస్ట్ సంస్థ నాగార్జునసాగర్లో బుద్ధిజం అకాడమీ స్థాపించడానికి విజయపురి సౌత్లోని అవసరమైన స్థల పరిశీలన చేశామని అన్నారు. ఈ సంస్థ గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతులను పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. స్థానిక యువతకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన చేసిన వారిలో ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ ఏజీకే మీనన్తో పాటు బృందం సభ్యురాలు ప్రీతి, పల్నాడు జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్ప్రేయర్ల ఎంపిక కీలకం
ఫుట్ స్ప్రేయర్ ఇది కాళ్లతో పనిచేస్తుంది. మినుము, పెసర వంటి పంటలతో పాటు కూరగాయ తోటలు, మామిడి, బత్తాయి వంటి పండ్లతోటల్లో సస్యరక్షణ మందులను పిచికారీ చేయొచ్చు. రోజుకు రెండు ఎకరాల్లో, పండ్ల తోటల్లో సగటున రోజుకు 150 చెట్లకు పిచికారీ చేయొచ్చు. ధర రూ.4వేల లోపే ఉంటుంది. ఇత్తడితో తయారైన పుట్స్ప్రేయర్లో ప్రధానంగా చిన్న బ్యారల్, కదిలే పిస్టన్ ఉంటుంది. బ్యారల్ అడుగుభాగానికి ప్లాస్టిక్ గొట్టం కలపబడి ఉంటుంది. రెండో చివరన ఫిల్టర్ గరాటు బిగించబడి ఒక పాత్రలోని రసాయన ద్రావణంలో మునిగి ఉంటుంది. పెడల్ను కాళ్లతో తొక్కినప్పుడు పిస్టన్ బ్యారల్లో పైకి కిందికి కదలడంతో ద్రావణం బ్యారల్ పైభాగానికి చేరి అక్కడి నుంచి గాలి గది ద్వారా రెండో గొట్టం చివర ఉన్న నాజిల్ గుండా బయటకు వెళ్తుంది. గాలి గది అమరిక వల్ల ద్రావణంపై పీడనం ఎల్లప్పుడు సమానంగా ఉంచి పిచికారీ ఒకే విధంగా ఉండటానికి తోడ్పడుతుంది. దీనిలో చదరపు సెంటీమీటర్కు 8 నుంచి 13 కిలోల ఒత్తిడి తీసుకురావచ్చు. అధిక ఒత్తిడి వలన ఎత్తుగా ఉన్న మామిడి చెట్లకు సులభంగా పిచికారీ చేయొచ్చు.పెద్దవూర: మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలను పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులకు పంటలపై ఒకటికి రెండుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం పరిపాటిగా మారింది. పిచికారీ చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లను సరిగ్గా ఎంపిక చేసుకోకపోతే రసాయన మందులు వృథా కావడంతో పాటు పిచికారీ చేసే వ్యక్తి శరీరంపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం పత్తి, మిరప, వరి పంటలకు చీడపీడల బెడదతో పాటు తెగుళ్లు విజృంభిస్తున్నాయి. రైతులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల స్ప్రేయర్లకు సంబంధించిన విషయాలను పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ వివరించారు. తైవాన్ పవర్ స్ప్రేయర్..ఇటీవల అన్ని రకరాల పంటలకు తైవాన్ పవర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. దీని ఖరీదు కంపెనీలను బట్టి రూ.20వేల వరకు ఉంటుంది. దీనికి తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో వెదజల్లే సామర్థ్యం ఉంది. ఇతర వాటితో పోల్చితే దీనిలో సస్యరక్షణ మందులు మూడు వంతులు అధికంగా పోయాల్సి ఉంటుంది. రోజుకు సగటున 8 నుంచి 10 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. దీనికి అమర్చిన బెల్డ్ ద్వారా భుజాల వెనుక సులభంగా తగిలించుకోవచ్చు. ఈ పవర్ స్ప్రేయర్ చదరపు సెంటీమీటర్కు 30–35 కిలోల ఒత్తిడిని కలగజేస్తుంది. ధ్వని కాలుష్యం తక్కువ, ఒకేసారి 20 అడుగుల వెడల్పుతో పిచికారీ చేయొచ్చు. మందు వేగం గంటకు 60 కి.మీ. ఇంజిన్ సహాయంతో గాలి అధిక ఒత్తిడితో బయటకు రావడం వలన మందును స్ప్రేయర్ నాజిల్ 150–200 మైక్రాన్ సైజుతో ఉండే చిన్నచిన్న బిందువులుగా విడగొట్టి అధిక విస్తీర్ణంలో మందు పడేలా చేస్తుంది. నీటి బిందువులు గుండ్రంగా తిరగడం వలన ఆకుల పైభాగాన, కింది భాగాన పడతాయి. ఇంజిన్ పనిచేయడానికి గంటకు లీటర్ పెట్రోల్ అవసరం అవుతుంది. లీటర్ పెట్రోల్ ఆరు ఎకరాలకు సరిపోతుంది. నిమిషానికి 7.2 లీటర్ల మందును చల్లవచ్చు. బరువు తొమ్మిది కిలోలు ఉంటుంది. దీనిలో 20 లీటర్ల రసాయం ద్రావణం, 900 మి.లీ. పెట్రోల్ పడుతుంది. ఇటీవల వచ్చిన ఆధునాతన పవర్ స్ప్రేయర్లతో ఒక వ్యక్తి మందు ద్రావణ డబ్బాను భుజానికి తగిలించుకుంటే రెండు వైపులా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో రసాయన మందును పిచికారీ చేయొచ్చు. నాప్సాక్ స్ప్రేయర్దీని బరువు తక్కువగా ఉండేందుకు పాలిథిన్తో తయారు చేశారు. స్ప్రేయర్ ట్యాంకు పరిమాణం 15–16 లీటర్లు. దీనికి ఉన్న బెల్టుల ద్వారా భుజాల వెనక సులువుగా తగిలించుకోవచ్చు. పంట అన్ని దశల్లో మందు పిచికారీకి స్ప్రేయర్ సులువుగా ఉపయోగపడుతుంది. ధర రూ.2వేల లోపే ఉంటుంది. ట్యాంకు లోపలి భాగాన పంపు, గాలి గది, పైభాగాన ఒక రంధ్రానికి ప్లాస్టిక్ గొట్టం బిగించబడి ఉంటుంది. రెండో చివర నాజిల్ ఉంటుంది. ట్యాంకులో అమర్చబడిన పిస్టన్ పైకి కిందకు కదలడం వలన ద్రావణంపై ఒత్తిడి ఏర్పడి రబ్బరు గొట్టం ద్వారా నాజిల్ ద్వారా బయటకు వెలువడుతుంది. పిస్టన్ కదిలించటానికి హ్యాండిల్ ఉంటుంది. దీనితో రసాయన ద్రావణం అంతటా సమంగా పడుతుంది. సరైంది ఎంచుకోకపోతే రసాయనం వృథా -
యాదగిరిగుట్ట క్షేత్రంలో నిత్య కల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా జరిపించారు. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమాన్ని జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12.05గంటలకు మూసివేశారు. మాంట్రియల్ నగరంలో.. తెలంగాణ కెనడా అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్ నగరంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారి గజివెల్లి రఘు, టీసీఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం ఆధ్వర్యంలో శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మాంట్రియల్ నగరంలోని ఓ హాల్లో స్వామి, అమ్మవార్లను అలంకరించి పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా కల్యాణం జరిపించారు. ఈ వేడుకలో తెలంగాణ కెనడా అసోసియేషన్ సభ్యులు, కెనడాలోని వివిధ నగరాల భక్తులు పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో.. ఆన్లైన్ ఉచ్చులో..
ఆలేరురూరల్: పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్, గంజాయి మత్తు క్రమక్రమంగా పల్లెలకు కూడా పాకుతోంది. అంతేకాకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుండడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారు. గతంలో పల్లెల్లో విచ్చలవిడిగా ఉన్న గుడుంబా దుకాణాలు ప్రస్తుతం కనిపించకుండా చేసిన అధికారులు.. బెల్ట్ షాపులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఆలేరు బైపాస్ రోడ్డులో రాత్రి సమయంలో ప్రతి షాపులో మద్యం అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయి. ఆలేరు మండలంతో పాటు మిగతా మండలాల్లోని గ్రామాలు, మండల కేంద్రాల్లో యువత గంజాయికి అలవాటు పడుతూ తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఎంత మందలించినా మార్పు ఉండడం లేదని కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. కొంత మంది యువత గంజాయి మత్తుకు బానిసై చదువు మధ్యలోనే ఆపేసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు. మరికొందరు గంజాయి సేవించడానికి అప్పులు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ప్రధానంగా ఇటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాలను కేంద్రంగా చేసుకొని గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. మత్తులో బలవన్మరణాలతో పాటు హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి.. యువత ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడటం, క్రికెట్ బెట్టింగ్లు పెట్టి నష్టపోతున్నారు. ఆలేరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటై అప్పులపాలయ్యాడు. అతడి కుటుంబ సభ్యులు కొంత పొలం అమ్మి అప్పులు తీర్చారు. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్తో పాటు గంజాయి, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.పల్లెల్లో బెల్ట్ షాపుల వలన యువత చెడిపోతున్నారు. మద్యం దుకాణాలను మండల కేంద్రాలకు మాత్రమే పరిమితం చేయాలి. బెల్ట్ షాపులు గ్రామాల్లో 24 గంటలు అందుబాటులో ఉండటంతో తాగుడుకు బానిసలవుతున్నారు. ఇంట్లో పెద్దలు తాగి గొడవలు చేస్తుండటంతో పిల్లలు కూడా అదే తోవ పడుతున్నారు. – బైరి మహేందర్గౌడ్, సాయిగూడెం గ్రామాలకు విస్తరిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్న యువతచెడు వ్యసనాలకు, గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలి. పిల్లలు కదలికలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఆన్లైన్ బెట్టింగ్లు, పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – యాలాద్రి ఎస్హెచ్ఓ, ఆలేరు పోలీస్ స్టేషన్ -
జాతీయ పోటీలకు ఎంపిక
పెద్దవూర: జాతీయస్థాయి ట్రిబు ల్ జంప్ పోటీలకు పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన నడ్డి బాలరాజు యాదవ్, అంజలి దంపతుల కుమారుడు జతీన్యాదవ్ ఎంపికయ్యాడు. గత నెల ఏపీలోని నెల్లూరులో నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి అండర్–19 సీబీఎస్సీ క్లస్టర్ ట్రిబుల్ జంప్ పోటీల్లో జతీన్యాదవ్ పాల్గొని రజత పతకం సాధించాడు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన జతీన్యాదవ్ ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జతీన్యాదవ్ ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
అవసరమైతే ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం: రాజ్గోపాల్రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణలో రాజకీయాలు హాట్హాట్గా ఉన్నాయి. సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తోంది. తమ పార్టీలోని సొంత నాయకులపైనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్లో కవిత చేసిన కామెంట్స్తో ఆ పార్టీకి చెందిన నేతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెలయే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎపిసోడ్. పార్టీలో ఆందోళన కల్గిస్తోంది. తనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పటివరకూ తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది నిన్న మొన్నటి వరకూ రాజ్గోపాల్రెడ్డి నుంచి వచ్చిన మాట. ఇప్పుడు అదే రాజ్గోపాల్రెడ్డి పదవి కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తానంటున్నారు. కాకపోతే మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధం. మునుగోడు కోసం ఎంత త్యాగమైనా చేస్తా. ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఎదురుచూస్తా’ అని పేర్కొన్నారు. ఒకవైపు మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తానని, అదే సమయంలో తన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తానంటూ సంయమనంతో మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పెద్దల్ని ఆలోచనలో పడేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని, అవసరమై ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమనే వ్యాఖ్యలు మరోసారి హీట్ పుట్టించేవిగా ఉన్నాయని, రాజ్గోపాల్రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శమనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. -
కనుల పండువగా గజవాహన సేవ
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్యారాధనల్లో భాగంగా గజవాహన సేవ కనుల పండువగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య నిత్యకల్యాణం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఆ తరువాత బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు తదితర కైంకర్యాలు గావించారు. సాయంత్రం వెండిజోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. వేద ఆశీర్వచనం, నిత్యకల్యా ణం తదితర పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ
చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం.. అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగదుర్గను శనివారం ‘సాక్షి’ పలకరించగా.. ఆమె తన కేరీర్కు సంబంధించిన విషయాలను పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..రామగిరి (నల్లగొండ) : మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. ఉద్యోగరీత్యా మా అమ్మానాన్న గుత్తా చలపతిరావు, వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు. నేను పదో తరగతి వరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాను. హైదరాబాద్లో ఇంటర్, బీఏ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను. మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం. తను నేర్చుకోవాలకుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను చిన్ననాటి నుంచి డాన్స్ బాగా వేసే దాన్ని. అమ్మ గుర్తించి కూచిపూడి నేర్పించింది. పాలబిందెల బాలు మాస్టారు వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. అనేక సందర్భాల్లో స్టేజీ ప్రోగ్రాముల్లో కూచిపూడి నాట్యం చేశాను. అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ డాన్స్ పైనా ఎక్కువ శ్రద్ద పెట్టాను. పేరిణి లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజుభార్గవి వద్ద కూచిపూడి వర్క్షాపుకు హాజరయ్యాను. నల్లగొండకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వద్ద రీ రికార్డింగ్లో పనిచేశాను. ఆ తర్వాత జానదప పాటల్లో నటించే అవకాశం లభించింది.2021లో మొదటి అవకాశం2021లో సై టీవీ రూపొందించిన ‘తిన్నాతీరం పడతలే’ అనే పాటలో మొదటిసారి నటించాను. ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు సంవత్సరాల్లో 300 వరకు జానపద పాటల్లో నటించాను. చాలా అవకాశాలు వస్తున్నా.. అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను. ఫోక్ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది. యూట్యూబ్లో 100 మిలియన్ బేంచ్ మార్క్కు చేరింది. శాసీ్త్రయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కలివి వనం’ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కూచిపూడిలో పీహెచ్డీ చేస్తా..చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నా. అనేక వర్క్షాపులకు హాజరయ్యా. డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ చదివాను. అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పీహెచ్డీ చేయాలనేది నా లక్ష్యం. అంతే కాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని భావించాను. నల్లగొండలో మాకు సొంత ఇల్లు ఉంది. అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాం. నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా. 60 మంది వరకు విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి శని, ఆదివారం నల్లగొండకు వస్తాం. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భువనగిరి, బీబీనగర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. భువనగిరి పరిధి లోని కస్తూరిబా గాంధీ పాఠశాల, కళాశాలను శని వారం ఆయన తనిఖీ చేశారు. కిచెన్, వంట సామగ్రి, భోజనం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం టమాట, గుడ్డుతో విద్యార్థులకు భోజనం అందించాలి. కానీ, ఆ రెండు మెనూలో లేకపోవడంతో టెండర్దారుడికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంంతో తన కాంట్రాక్ట్ ముగిసిందని సమాధానం చెప్పడంతో కొత్త టెండర్కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగాభువనగిరి మండలం వడాయిగూడెం, బీబీనగర్ మండలం గూడూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
జీపీఓలు వస్తున్నారు..
సాక్షి, యాదాద్రి: క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నియమించిన గ్రామ పాలనాధికారులు(జీపీఓ) పల్లెలకు రానున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన 148 మందికి నియామకపత్రాలు అందజేశారు. వీరికి శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. వీరంతా సోమవారం తమకు కేటాయించిన క్లస్టర్లలో విధుల్లో చేరనున్నారు. భూ భారతి చట్టం పటిష్టంగా అమలుకు..రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. చట్టాన్ని గ్రామ స్థాయిలో పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామ పాలనాధికారుల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి గ్రామానికి జీపీఓను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం పూర్వపు వీఆర్ఓలు, వీఆర్ఏలకు అవకాశం కల్పించింది. అందుకు ఇష్టమైన వారు ఆప్షన్ పెట్టుకోవాలని సూచించింది. వారికి రెండు దఫాల్లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైనవారిని జీపీఓలుగా నియమించింది. సొంత నియోజకవర్గంలో నో చాన్స్ గ్రామ పాలనాధికారులుగా నియమితులైన వారికి సొంత నియోజకవర్గంలో కాకుండా పొరుగు నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్లో తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో యాదాద్రి జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలతో పాటు నాగార్జునసాగర్, నల్లగొండ, మేడ్చల్ మల్కాజిగిరి జల్లాలకు చెందిన వారు ఉన్నారు. తమ స్థానికతకు సంబంధించిన వివరాలను 143 మంది సమర్పించగా.. ఇంకా ఐదుగురు గ్రామ పాలనధికారులు సమర్పించ లేదు. మెరిట్ ప్రకారంగానే కౌన్సెలింగ్జిల్లాకు కేటాయించిన జీపీఓలకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ పూర్తి చేశారు. స్థానికత వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం తమకు కేటాయించిన క్లస్టర్లలో విధుల్లో చేరాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు మాలి కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, ఉద్యోగ సంఘాల నాయకులు మందడి ఉపేందర్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.203 క్లస్టర్ల ఏర్పాటుజిల్లాలో 318 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గ్రామ పాలనాధికారులు సరిపోను లేనందున ప్రస్తుతం 203 రెవెన్యూ క్లస్టర్లుగా వాటిని ఏర్పాటు చేశారు. 148 మంది రాత పరీక్ష ద్వారా జీపీఓలుగా నియామకం అయ్యారు. వీరికి తోడుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను జీపీఓలుగా నియమిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాలనాధికారిని నియమిస్తున్నారు. కాబట్టి ఖాళీగా ఉన్న జీపీఓ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తారు. నియోజకవర్గం జీపీఓలు పోస్టులుఆలేరు 52 59 భువనగిరి 52 45 మునుగోడు 19 22తుంగతుర్తి 11 12నకిరేకల్ 06 10నల్లగొండ 01 00నాగార్జునసాగర్ 01 00మేడ్చల్ 01 00వివరాలు సమర్పించని వారు 05 00మొత్తం 148 148కేటాయించిన జీపీఓలు148 మంది గ్రామ పాలనాధికారులకు కౌన్సెలింగ్ మెరిట్ ఆధారంగా క్లస్టర్ల కేటాయింపు ప్రోసీడింగ్ ఆర్డర్స్ అందజేత 8వ తేదీన విధుల్లో చేరిక -
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ
ఆలేరు: ఆలేరు మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మురళీపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ ఆలేరు పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్గౌడ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. త్రిఫ్ట్ పథకంలో బీనామీ పేర్లతో రూ.70లక్షల గోల్మాల్ అయ్యాయని, ఆలేరులోని సిల్క్నగర్ సొసైటీలోనూ నిధులు పక్కదారి పట్టాయని, ఈ వ్యవహారాల్లో మురళి ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్టు స్పష్టం చేశారు. ఈ విషయమై చేనేత కార్మికులు గతంలోనే కలెక్టర్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తనపై చర్యలనుంచి తప్పించుకోవడానికే మురళి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో నాయకులు మొరిగాడి వెంకటేష్, ఆడెపు బాలస్వామి,పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, జల్లి నర్సింహులు,జూకంటి ఉప్పలయ్య పాల్గొన్నారు. మురళీపై చర్య తీసుకోవాలి: చేనేత కార్మికులునిధుల గోల్మాల్పై విచారణ జరిపి మురళీపై చర్యలు తీసుకోవాలని, నిధులు రికవరీ చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే ఐలయ్యకు పద్మశాలి సంఘం నాయకులు పాశికంటి శ్రీనివాస్, భేతిరాములు, బింగి రవి, చేనేత కార్మికులు గట్టు రాజు, మార్కేండేయ, మెరుగు కృష్ణలు విజ్ఞప్తి చేశారు. ఆలేరులో నిర్వహించనున్న సమావేశానికి, పద్మశాలి సంఘానికి, కులానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆరోపణలు అవాస్తవం : చింతకింది మురళిబీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను మురళి ఖండించారు. కాంగ్రెస్లో తన చేరికను అడ్డుకునే కుట్రలో భాగమన్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే ఐలయ్య ఆహ్వానం మేరకు ఈనెల 9న కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు.త్రిఫ్ట్లో నిధుల గోల్మాల్ తప్పుడు ప్రచారమేనని పేర్కొన్నారు.ఫ ఆలేరు మాజీ సర్పంచ్ మురళీపై ఆరేళ్లు వేటు -
వినాయకుడి పూజకు వెళ్లొచ్చేలోగా ఇంట్లో చోరీ
ఆత్మకూరు(ఎం): వినాయకుడి వద్దకు పూజకు వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన గుండెగాని మల్లయ్య ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి వినాయకుడి వద్ద పూజలు చేయడానికి వెళ్లారు. పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఇంటికి వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో బీరువా పరిశీలించి చూడగా.. అందులోని రూ. 50వేల నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం సాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు. -
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలి
నాగార్జునసాగర్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. శనివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్కాలనీలో గల బీసీ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టిక, తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు అందిస్తుందని తెలిపారు. పాఠశాల దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రవికుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, ఏటీపీ సంతోష్, సరిత తదితరులున్నారు. ● గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ -
గీతకార్మికుడి నరకయాతన
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని జనగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండూరి చంద్రయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కే క్రమంలో మోకు బిగుసుకుపోవడంతో చెట్టు సగం వరకు జారి మధ్యలోనే కదలకుండా ఉండిపోయాడు. గమనించిన తోటి గీత కార్మికులు కొండూరి యాదయ్య, తొలుపూరి ఇస్తారి చెట్టు ఎక్కి దించేందుకు ప్రయత్నించగా.. వీలు కాలేదు. అంతలోని మరో ఇద్దరు గీత కార్మికులు కందుల లింగస్వామి, కొండూరి కృష్ణయ్య సాయంతో చెట్టు ఎక్కి చంద్రయ్యను క్షేమంగా కిందకు దించారు. -
హోటల్లో భారీ చోరీ
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్రోడ్డులో గల వైష్టవీ గ్రాండ్ హోటల్లో భారీ చోరీ జరిగింది. వన్టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ నిర్వాహకుడు రావిరాల రవికుమార్ రోజుమాదిరిగా శుక్రవారం రాత్రి తన చాంబర్కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చాంబర్ తలుపునకు ఉన్న తాళం పగులకొట్టాడు. గదిలోని కౌంటర్ను బద్దలుకొట్టి అందులో దాచిన రూ.80లక్షలను అపహరించాడు. మరుసటి రోజు ఉదయం చాంబర్ తలుపు తాళం పగులకొట్టి ఉండటాన్ని గమనించిన సిబ్బంది నిర్వాహకులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐలు నాగభూషణం, పీఎన్డీ ప్రసాద్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డీఎస్పీ రాజశేఖరరాజు హోటల్కు చేరుకుని వివరాలు సేకరించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీని పరిశీలిస్తున్నామని అందులో ఒక వ్యక్తి వచ్చి బ్యాగ్తో వెళ్లిన దృశ్యాలు కనిపించాయని డీఎస్పీ తెలిపారు. క్లూస్ టీం ఆధారాలు, సీసీ పుటేజీ, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హోటల్ నిర్వాహకుడు రావిరాల రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగభూషణం తెలిపారు.● రూ.80 లక్షలు దోచుకెళ్లిన దుండగులు -
నిరసనల నడుమ గణేష్ శోభాయాత్ర
భువనగిరి: భువనగిరి పట్టణంలో జరిగిన గణేష్ శోభాయాత్ర నిరసనలు, ధర్నాల నడుమ కొనసాగింది. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న విగ్రహాలను పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు తరలించారు. మరికొన్ని భారీ విగ్రహాలను సాయంత్రం తర్వాత కదిలించడం ప్రారంభించారు. ఈక్రమంలో తాతానగర్లో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజేకి అనుమతి లేదని పోలీసులు దానిని తొలగించారు. సింగిల్ పిన్ డీజేకు ముందుగానే అనుమతించి ఇప్పుడు లేదని చెప్పడం సరికాదని మండప నిర్వాహకులు స్థానిక బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. లాఠీచార్జ్ చేయడంతో.. సాధారణంగా భువనగిరి పట్టణంలో వినాయక శోభాయాత్ర సమ్మద్ చౌరస్తా మీదుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో వినాయక విగ్రహాలకు సమ్మద్ చౌరస్తాకు చేరుకున్న తర్వాత కొద్ది సమయం అక్కడ భజన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున మండపాల నిర్వాహకులు భజన చేస్తున్న క్రమంలో పోలీసులు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని భజనలు చేయకుండా వెళ్లిపోవాలని సూచించారు. కొద్దిసేపు భజన చేసి వెళ్తామని చెప్పి భజనలు చేస్తుండగా పోలీసులు వారిని ముందుకు తోశారు. దీంతో మండపాల నిర్వాహకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో మండపాల నిర్వాహకులు అక్కడే నిరసన తెలిపారు. అనంతరం లాఠీచార్జ్ను నిరసిస్తూ భువనగిరి గణేష్ ఉత్సవ సమితితో కలిసి నిర్వాహకులు ప్రిన్స్చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ డీసీపీ, పట్టణ సీఐ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఽసర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. పట్టణ సీఐ రమేష్ను వివరణ కోరగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాత్రమే వారిని ముందుకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. డీజే తొలగించినందుకు పోలీసులతో మండపాల నిర్వాహకుల వాగ్వాదం భజనలు చేయకుండా అడ్డుకుంటున్నారని ధర్నాకు దిగిన ఉత్సవ సమితి నాయకులు కానిస్టేబుల్పై దాడికోదాడరూరల్ : వినాయక శోభాయాత్రలో కొందరు అల్లరిమూకలు కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డారు. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఉన్న పెద్ద చెరువులో గణనాథులను నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనంతగిరి రోడ్డులో కొంతమంది అల్ల రిమూకలు గొడవపడుతున్నారు. కానిస్టేబుల్ నరేష్ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న అల్లరిమూకలు కానిస్టేబుల్ తలపై ఐరన్రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, సిబ్బంది అతడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్రెడ్డి ఆస్పత్రికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్ను పరామర్శించారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
జలనారాయణ స్వామికి మంగళహారతి
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం జల నారాయణ స్వామికి మంగళహారతులు సమర్పించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. నేడు స్వర్ణగిరి ఆలయం మూసివేత సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ ఆచార్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు మూసివేసి తిరిగి సోమవారం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయం తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం 2.30 గంటల వరకు ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. -
మూడేళ్లుగా మూలకు..
కోదాడ: మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు పంపించిన దాదాపు మూడు వేల చీరలు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర పంచాయతీ కార్యాలయంలో మూలన పడేశారు. తమ్మర పంచాయతీ కోదాడ మున్సిపాలిటీలో కలిసిన తరువాత నాలుగు గదులతో ఉన్న పంచాయతీ భవనంలో ఒక గదిలో పోస్టాఫీస్, మరొక గదిలో హెల్త్ సెంటర్ నిర్వహిస్తుండగా.. మరొక గదిలో మున్సిపాలిటీ సామగ్రి వేశారు. మిగిలిన గదిలో ఈ బతుకమ్మ చీరలు పడేశారు. ఈ చీరలను వచ్చే బతుకమ్మ పండుగకు అయినా పేద మహిళలకు పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.● పంపిణీ చేయకుండా పంచాయతీ కార్యాలయంలో పడేసిన బతుకమ్మ చీరలు -
గంజాయి విక్రేతల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవించడంతోపాటు, చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి స్థానిక యువకులకు విక్రయిస్తున్న ఐదుగురిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం డీఎస్పీ రాజశేఖర రాజు నిందితుల వివరాలు వెల్లడించారు. రైస్మిల్లులో పని చేసేందుకు బిహార్ రాష్ట్రం నుంచి సౌగంధ్కుమార్ సింగ్, కరణ్ కుమార్ అనే ఇద్దరు యువకులు మిర్యాలగూడకు వచ్చారు. వీరు తమ రాష్ట్రానికి వెళ్లి వచ్చే సమయంలో వారి వెంట గంజాయిని తీసుకొచ్చి రైస్ మిల్లుల్లో పని చేసే మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కుక్కల వంశీ, దైద జగదీష్, తాళ్లగడ్డకు చెందిన షేక్ హైమాద్, చైతన్యనగర్ కు చెందిన జంపాల నిఖిల్కు అలవాటు చేశారు. వీరు గంజాయిని సేవించడంతో పాటు బయట వ్యక్తులకు విక్రయిస్తే డబ్బులు సంపాదించవచ్చని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు వారిపై నిఘా పెట్టారు. శనివారం రోజు మాదిరిగా గంజాయిని విక్రయించేందుకు పట్టణ శివారు ప్రాంతమైన రాంనగర్ బంధం శ్రీ హనుమాన్ వెంచర్ కు వెళ్లగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.40 కిలోల గంజాయితో పాటు ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్టౌన్ సీఐ నాగభూషణం, ఎస్ఐ సైదిరెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీను, నర్సింహ, బూర వీరబాబు, సంధ్య, ప్రసాద్ పాల్గొన్నారు. ● కిలో నలభై గ్రాముల గంజాయి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర రాజు -
జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళి
భువనగిరి : పట్టణ కేంద్రం తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రైతు బజార్ ఎదుట అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకరమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్, కుటుంబ సభ్యులు సునిత, వివేకానంద, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కో ఆర్డినేటర్ కోల్పుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అంజనేయులు, వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్, నాయకులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, జనగాం పాండు, ర్యాకల శ్రీనివాస్, నువ్వుల సత్యనారాయణ, గోమారి సుధాకర్రెడ్డి, చిలుగూరి సత్తిరెడ్డి, రత్నపురం శ్రీనివాస్, నవీన్, మదు తదితరులు పాల్గొన్నారు. జిట్టా పోరాటం మరువలేనిది బీబీనగర్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన పోరాటం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కొనియాడారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని జిట్టా విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిట్టా సునిత , నాయకులు పింగళ్రెడ్డి, శ్యామ్గౌడ్, లక్ష్మినారాయణ, నరేంధర్రెడ్డి, బాలకృష్ణ, సుదర్శన్రెడ్డి, అశోక్, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు. -
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
రాజాపేట : వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాజాపేటలో జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా ప్రాణనష్టానికి రూ.25లక్షలు, పంట నష్టానికి ఎకరానికి రూ.30వేలు చెల్లించాలన్నారు. రైతులకు అవసరం మేరకు యూరియా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, సందిల భాస్కర్గౌడ్, గుంటి మధుసూదన్రెడ్డి, వీరేశం, యాదగిరి, నాగరాజు, వెంకటేశ్వర్రెడ్డి, రాములునాయక్, లక్ష్మణ్నా యక్, రాములునాయక్ పాల్గొన్నారు.యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవచేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో నిజాభిషేకం తదితర పూజలు నిర్వహించారు.టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తులభువనగిరి: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. టీచర్లకు ఇంటర్ లేదా తత్సమానం, ఆయాలకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. అర్హత, అసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకు ధ్రువీకరణ పత్రాలు జతపరిచి సంబంధిత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 12 లోపు అందజేయాలని కోరారు. -
‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలం
గుండాల: నవాబుపేట రిజర్వాయర్ నీటితో గుండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం నవాబుపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీటిని విడుదల చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమలు పూలు సమర్పించి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. కాల్వలకు మరమ్మతులు చేపడతామన్నారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. అప్పుల పాలు చేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరిగౌడ్, ద్యాప కృష్ణారెడ్డి, ఇమ్మడి దశరథ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులతో వాగ్వాదం
మోత్కూరు: మోత్కూరు రైతు సేవా సహకార సంఘంలో యూరియా పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంటుంది. శుక్రవారం ఉదయం యూరియా లోడ్ రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. సీరియల్ లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించడంతో పోలీసులు టోకెన్ల ప్రకారం పంపిణీ చేశారు. 163 మంది రైతులకు ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున 326 బస్తాల యూరియా పంపిణీ చేశారు. ఇంకా 118 బస్తాల యూరియా మిగలగా టోకెన్లు లేని రైతులకు ఇచ్చారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదారు రోజుల క్రితమే టోకెన్లు పొందిన తమకు యూరియా ఇవ్వకుండా వెనుక వచ్చిన రైతులకు ఇచ్చారంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్విండో సిబ్బందిని సీఐ మందలించి అందుబాటులో ఉన్న ఆరు బస్తాల యూరియాను మహిళా రైతులకు ఇప్పించి మిగిలిన రైతులకు సర్దిచెప్పారు. కాగా ఆధార్, పాస్బుక్, జిరాక్స్లు తీసుకున్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలు పంపిణీ చేశామని సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఆశల ఇంటికి రుణ సాయం
సాక్షి యాదాద్రి: ‘వలిగొండ మండలం సుంకిశాలకు చెందిన పోలేపల్లి అనురాధకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కానీ, పని మొదలు పెడదామంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆమెకు ప్రభుత్వం అండగా నిలిచింది. స్వయం సహాయక సంఘంలో పావలా వడ్డీకి రూ.2 లక్షల రుణం ఇప్పించింది. ఇందుకు గాను ప్రతి నెలా రూ. 8 వేల చొప్పున కిస్తులు చెల్లిస్తుంది. బేస్మెంట్ వరకు రూ.1 లక్ష బిల్లు వచ్చింది. చాలా కాలంగా ఇల్లు లేక ఇబ్బంది పడ్డామని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడం ఆనందంగా ఉందని లబ్ధిదారుల అనురాధ తెలిపారు’. ఇటువంటి వారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. నిరుపేదల సొంతంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. రెండు విడతల్లో 9,495 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల పలువురు నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు ఇప్పిస్తూ ఆర్థికంగా చేయూతనిస్తోంది. రూ.19.75 కోట్లు ఇచ్చారు.. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.19.75 కోట్ల రుణాలు ఇచ్చారు. గ్రామాల్లో 1,202 ఇళ్లకు రూ.14.24 కోట్లు, ఆరు మున్సిపాలిటీల్లో 546 ఇళ్లకు రూ. 5.51 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా భువనగిరి, బీబీనగర్లో వందమందికి పైగా రుణాలు మంజూరు చేశారు. 8వేల ఇళ్లకు మార్కింగ్ రెండు విడతల్లో 9,495 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 8 వేల ఇళ్లకు ముగ్గు పోశారు. చాలా మందికి మహిళా సంఘాల ద్వారా అత్యవసర రుణాలు అందాయి. అయితే ఇళ్లు మంజూరైనప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పనుల ప్రారంభానికి జాప్యం అవుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. మహిళా సంఘాలతో మాట్లాడి రుణాలు ఇప్పించడంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగింది. స్రీనిధి, బ్యాంకు లింకేజీ, అంతర్గత పొదుపు నుంచి రుణం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాలకు సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ, సంఘం అంతర్గత పొదుపు నుంచి రుణం ఇచ్చారు. గతంలో రుణాలు తీసుకున్న సంఘాలకు మళ్లీ రుణం ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని నాలుగు విడతల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాలి. అయితే సంఘంలో సభ్యుల ఆర్థిక స్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2.50లక్షల వరకు రుణాలు ఇచ్చారు. ఈ రుణాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణం కింద ఇస్తున్నారు. ఆర్థిక సమస్యలున్నవారికి మహిళా సంఘాల చేయూత ఫ రూ.50వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణం ఫ ఇప్పటి వరకు రూ.19.75 కోట్లు మంజూరు ఫ అత్యధికంగా భువనగిరి, బీబీనగర్లో.. ఫ వేగం పుంజుకోవడానికి రుణం దోహదం మాది మాసాయిపేట. ఇందిరమ్మ ఇళ్లు మంజ.ఊరైంది. కానీ, బేస్మెంట్ వరకు నిర్మిస్తేనే రూ.1 లక్ష బిల్లు వస్తుంది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటి నిర్మాణం ఆపేశారు. దీంతో మంజులకు గ్రామంలోని అఖిల మహిళా సంఘం రూ. 2,50 లక్షలు మంజూరు చేసింది. ఈ డబ్బులతో మంజుల ఇంటి నిర్మాణం ప్రారంభించింది. ప్రతి నెలా సంఘబంధానికి రూ. 10 వేల చొప్పున చెల్లిస్తుంది. –వాకిటి మంజుల, లబ్ధిదారు, మాసాయిపేట ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్ధికంగా చేయూతనిస్తున్నాం. గతంలో సంఘంలో అప్పులు ఉన్నా కూడా ఇంటి నిర్మాణం కోసం రూ. లక్ష వరకు రుణం ఇప్పిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు రూ.19.75 కోట్ల రుణాలు ఇచ్చాం. క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలిచింది. –భాస్కర్, అదనపు కలెక్టర్ -
6 గంటల నుంచే క్యూలైన్
అడ్డగూడూరు: యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అడ్డగూడూరు సొసైటీకి గురువారం సాయంత్రం 444 బస్తాల యూరియా వచ్చింది. టోకెన్ ఇచ్చిన 228 మంది రైతులకు శుక్రవారం ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ కార్యాలయానికి తరలివచ్చి బారులు దీరారు. పొద్దస్తమానం నిరీక్షించినా యూరియా అందలేదు. శనివారం, సోమవారం రోజు పంపిణీ చేసేందుకు 210 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాలకు టోకెన్లు ఇచ్చామని వ్యవసాయ అధికారి పాండురంగాచారి తెలిపారు. గుండాల: గుండాల పీఏసీఎస్ వద్ద చెప్పులను క్యూలో పెట్టి రైతులు నిరీక్షించారు. ఒక్క బస్తా కోసం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. ఫ పీఏసీఎస్ల వద్ద యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు ఫ ఒక్క బస్తా కోసం గంటల తరబడి నిరీక్షణ -
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య
ఘనంగా గణనాథుల నిమజ్జనం ఫ శోభాయమానంగా సాగిన ఊరేగింపు ఫ యువత నృత్యాలు, డీజేలతో కోలాహలం భువనగిరి: తోమ్మిది రోజుల పాటు భక్తులచే విశేష పూజలందుకున్న గణనాథులు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయకులను ఉంచి యువత నృత్యాలను చేస్తూ కోలాటాలు వేస్తూ జై గణేశా..బైబై గణేశా అంటూ నినాదాలు చేస్తూ మేళతాళాల మధ్య బాణా సంచాలు కాల్చూతూ నిమజ్జానికి తరలించారు. పోయిరా గణపయ్య అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. మహారాష్ట్ర, కేరళ, కళాబృందాలు, నృత్యాలు, ఆగోరా వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భువనగిరిలో శోభాయాత్ర సాగిందిలా.. జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్ర ఐదు రూట్లలో కొనసాగింది. పాత బస్టాండ్, కిసాన్నగర్, రాంనగర్, తాతానగర్, హోసింగ్బోర్డు కాలనీల నుంచి బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా వరకు వచ్చిన విగ్రహాలు.. అక్కడి నుంచి శోభాయాత్రగా పెద్ద చెరువుకు చేరాయి. భువనగిరి పెద్ద చెరువు వద్ద మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనాన్ని ప్రారంభించారు. బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా వద్ద భువనగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధాన రహదారి వెంట భక్తులకు ఆర్ట్ఆఫ్లివింగ్, ఇన్నర్వీల్ క్లబ్, టీఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల నుంచి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భువనగిరిలో రాత్రి 9 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. శ్రీరామ భక్త భజనమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలంలో శ్రీ పోల్కం రాములు రూ.1,12,100కు దక్కించుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు గణేష్ నిమజ్జనం సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలో డీసీపీ అక్షాంశ్యాదవ్ పర్యవేక్షణలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు నిమజ్జనంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రధాన కూడళ్లల్లో పోలీసులు భారీగా మొహరించారు. తాతానగర్లో డీజేకి అనుమతి లేదని పోలీసులు సూచించడంతో ఉత్సవ సభ్యులు ధర్నాకు దిగారు. భువనగిరి పట్టణంతో పాటు చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, బీబీనగర్ మండల కేంద్రాలు, పాటు ఇతర మండలాల పరిధిలోని గ్రామాల్లో గణేష్ నిమజ్జనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయగా, అందులో 85 శాతం వరకు నిమజ్జానికి తరలించారు. -
యూరియా సరిపడా సరఫరా చేయాలి
భువనగిరిటౌన్ : యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అవసరం మేరకు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ చేశారు. శుక్రవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. రైతులు వేకువజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా జాప్యం చేయకుండా రైతులకు సరిపడా యూరియా అందించాలి కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరు బాలరాజు, దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ -
విద్యార్థుల ఉన్నతిలో గురువులే కీలకం
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి భువనగిరి: విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకమని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను సమాజ మార్గదర్శకులుగా రూపుదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే రెండు దఫాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని కోరారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో ఉండడం వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి ఉందన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలుపాలన్నారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 50 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఈఓ సత్యనారాయణ, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, ఏడీ ప్రశాంత్రెడ్డి, సెక్టోరియల్ అధికా రులు, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
అంతర పంటలతో అధిక ఆదాయం
గుర్రంపోడు : పండ్ల తోటలు సాగు చేసే రైతులు మొక్కలు నాటిన తర్వాత కాపు వచ్చే 4–5 సంవత్సరాల వరకు అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలైన మునగ, చిక్కుడు జాతి పంటలు, వేరుశనగ, పెసర, మినుము, కూరగాయలు, పుచ్చ సాగు చేసుకుని ఆదాయం పొందే వీలుంది. అంతర పంటల సాగుపై మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచనలు ఆయన మాటల్లోనే.. అంతర పంటలతో లాభాలు A పండ్లతోటలు ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడంతో భూమిలో కలుపు పెరిగే అవకాశం ఉంది. ఈ కలుపును అంతర పంటలు నివారిస్తాయి. A సహజ వనరులైన భూమి, నీరు, సూర్యరశ్మి సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. A వివిధ రకాల అంతరపంటల సాగువల్ల నేలలో వివిధ లోతుల్లో గల తేమ పోషక పదార్థాలు క్రమబద్ధంగా ఉపయోగపడటమేకాకుండా నేల లోపలి వరకు గుల్లబారి తర్వాత పంటలు బాగా పెరగటానికి దోహదపడుతుంది. A ప్రధాన పంటలతోపాటు అంతరపంటలు ఒకే సమయంలో పండించడం వల్ల రైతులకు రాబడులు స్థిరంగా ఉంటాయి. A అంతరపంటలుగా అపరాల పంటలు సాగుచేసుకుంటే భూసారం అభివృద్ధి చెందుతుంది. వేసుకోదగిన అంతర పంటలు మామిడి : నేల లోతు, ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి మామిడి మొక్కలను 7–10 మీటర్ల దూరంలో నాటుతారు. కాబట్టి మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. A లేత తోటల్లో సూర్యరశ్మి, గాలి ప్రసారం బాగా ఉంటుంది. ఇందులో అంతర పంటలుగా కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు బొప్పాయి, మునగ లాంటి మొక్కలు వేసుకోవచ్చు. పెద్దతోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు పైర్లు వేసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయానిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేసుకోవచ్చు. బత్తాయి, నిమ్మ : బత్తాయి, నిమ్మ మొక్కలను 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుతాం. కాబట్టి కాపునకు వచ్చే ఐదు సంవత్సరాల వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. వేరుశనగ, అపరాల రకాలైన కంది, మినుము, పెసరలతోపాటు దోస, ఉల్లి, పుచ్చ పంటలు వేసుకోవచ్చు. మిరుప, టమాటో, వంగ పైర్లు వేయకూడదు. ఈ పైర్లు వేయడం వల్ల నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. సపోటా : సపోటాను కూడా 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుకోవడం వల్ల అంతరపంటలుగా బొప్పాయి, మునగ లాంటి పంటలు వేసుకోవచ్చు. కూరగాయల పంటలైన టమాట వంగ, దోసలను కూడ సాగుచేయొచ్చు. చెట్ల వరుస మధ్యలో కొందరు ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేసుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా అంతర పంటల సాగు పండ్లతోటల్లో అంతరపంటల సాగులో కొన్ని మెళుకువలు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా డ్రిప్ ద్వారా నీరందించినప్పుడు అంతరపంటల సాగుకు ప్రత్యేకంగా లాటరల్ పైపు లైన్ వేసుకోవాలి. దీని ద్వారా ప్రధాన పంటకు, అంతరపంటకు వేర్వేరుగా సరిపడా నీరు అందించవచ్చు. ఫ అంతర పంటల సాగుపై వ్యవసాయాధికారి సూచనలు -
ఉపాధ్యాయ దినోత్సవం రోజే విషాదం
ఆలేరు: ఉపాధ్యాయ దినోత్సవం రోజే ఓ టీచర్ మృతి చెందారు. అతని కుటుంబాన్ని విషాదంలో ముంచింది. శుక్రవారం అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించిన సదరు ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. వైద్యం వికటించడమే టీచర్ మృతికి కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతదేహాంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. యాదగిరిగుట్ట మండలం కమటంగూడేనికి చెందిన ఏనుగుల ఉదయ్కుమార్(42) భువనగిరిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య కావేరి, మోహన, ఆద్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఉదయ్కుమార్కు ఛాతిలో నొప్పి రావడంతో అతన్ని చికిత్స కోసం ఆలేరులోని ఓ నర్సింగ్హోంకు కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. నొప్పి తగ్గేందుకు నర్సింగ్హోం డాక్టర్ సూచన మేరకు ఉదయ్కి ఆసుపత్రి సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంటికి వెళుతున్న క్రమంలో ఉదయ్కు నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. ఫిట్స్ వస్తున్నాయనే అనుమానంతో నర్సింగ్హోం వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఉదయ్ మార్గమధ్యలో మృతి చెందాడు. ఆసుపత్రికి వచ్చిన ఉదయ్కుమార్ను డ్యూటీ డాక్టర్ పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించినట్టు ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆగ్రహించిన కుటుంబసభ్యులు నర్సింగ్హోంకు వచ్చి వైద్యం వికటించడం వల్లనే ఉదయ్ మరణించాడని డాక్టర్ ప్రతాప్రెడ్డితో వాదనకు దిగారు. నొప్పి తగ్గటానికే ఇంజెక్షన్ ఇచ్చానని డాక్టర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న వామపక్షాల నాయకులు ఆసుపత్రికి చేరుకొని నర్సింగ్హోం వర్గాల తీరును తప్పుబట్టారు. సరైన పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వైద్యం వికటించడమే ఉదయ్ మరణానికి కారణమని, డాక్టర్పై చర్య తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి కుటుంబసభ్యులతో కలిసి నాయకులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్కు కాసేపు అంతరాయం కలిగి, పరిస్థితి గందగోళంగా మారడంతో సీఐ యాలాద్రి, ఎస్ఐ వినయ్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు కృషి చేశారు. భార్య కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం డాక్టర్ ప్రతాప్రెడ్డిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు.మృతికి గుండెపోటా? అసలు కారణం పోస్టుమార్టం తర్వాతనే తెలుస్తుందని సీఐ తెలిపారు. పరిహారం చెల్లించాలి ఉదయ్కుమార్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ డిమాండ్ చేశారు. సుధా నర్సింగ్హోంలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయని కలెక్టర్, వైద్యాధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఫ ఆలేరులో ప్రైవేట్ టీచర్ మృతి ఫ వైద్యం వికటించడమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ఫ నర్సింగ్హోం ఎదుట ఆందోళన -
యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
సూర్యాపేటటౌన్ : రైతులకు సరైన సమయంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత పట్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరత లేదని, రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులే యూరియా లేదటుంటే.. సీఎం రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెపుతున్నారన్నారు. 2014 కు ముందు నీళ్లకోసం కొట్టుకున్నోళ్లు.. నేడు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హాస్టళ్లల్లో భోజనం సరిగా లేదని పిల్లలే ధర్నా చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని ఆరోపించారు. ఒకపక్క వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే.. నల్లగొండ గడ్డపైన ఉన్న ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ఎండిపోతుందన్నారు. ఎప్పటికై నా కోమటిరెడ్డి, సీఎం రేవంత్లు బీజేపీలో చేరేవాళ్లేనని విమర్శించారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రామన్నపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన నకిరేకంటి మహేష్(40) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై రామన్నపేటకు బయలు దేరాడు. సిరిపురం గ్రామశివారులో వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో మహేష్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన యువకుడు 108కు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. రామన్నపేట ప్రభు త్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
నిమజ్జనానికి వెళ్లి కాల్వలో గల్లంతు
వేములపల్లి : వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లిన తండ్రి, కుమారుడు గల్లంతయ్యారు. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన తండ్రి, కుమారులు పున్నా సాంబయ్య(46), పున్నా శివమణి(20) తమ గ్రామంలోని వినాయకుడిని తమ కాలనీవాసులతో కలిసి వేములపల్లి మండల కేంద్రం సమీపంలో ఎడమకాల్వలో నిమజ్జనం చేయడానికి వచ్చారు. నిమజ్జనం అనంతరం తండ్రి, కుమారుడు తమపై ఉన్న రంగులను శుభ్రం చేసుకోవడానికి కాల్వలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తు తండ్రి సాంబయ్య జారిపడ్డాడు. తండ్రిని కాపాడుదామని కుమారుడు ప్యాంటును అందించి కాపాడే సమయంలో కాల్వ లోకి జారిపోయాడు. కాల్వలో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వారు గల్లంతయ్యారు. సాంబయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొనసాగుతున్న గాలింపు పున్నా సాంబయ్య, పున్నా శివమణి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, డీఎస్పీ రాజశేఖర్రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ హేమలత ఉన్నారు. అనాథగా మిగిలిన కుమార్తె.. ప్రమాదానికి గురైన సాంబయ్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య చనిపోయింది. సాంబయ్య వంట మాస్టర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు శివమణి ఐటీఐ చదువుతుండగా, కుమార్తె తుంగపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తండ్రి, అన్న కాల్వలో గల్లంతు కావడంతో బాలిక అనాథగా మిగిలింది. నిమజ్జన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా కొంతమందిని మాత్రమే సిబ్బందిని నియమించారని తెలిపారు. గజ ఈతగాళ్లు లేకపోవడం వల్లే వారిని కాపాడలేకపోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఫ తండ్రి, కుమారుడి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు ఫ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ -
గ్యాస్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో తనిఖీలు
బొమ్మలరామారం: మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో గల కీర్తి పెట్రో కమ్ గ్యాస్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీని శుక్రవారం జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి కందగడ్ల వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. 15 కమర్షియల్ సిలిండర్లలో తక్కువ పరిమాణంలో గ్యాస్ రీఫిల్ చేసినట్లు అధికారులు గుర్తించి సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యనకిరేకల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన దుబ్బాక యాదగిరి అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో మద్యం బాటిల్లో పురుగులు మందు కలుపుకుని తాగాడు. అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబీకులు యాదగిరిని నకిరేకల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. డీజే నిర్వాహకుడిపై కేసుచివ్వెంల(సూర్యాపేట): గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా చివ్వెంల మండల పరిధిలోని జగన్నాయక్ తండాలో డీజే నిర్వహిస్తున్న మండల పరిధిలోని రామ్కోటి తండాకు చెందిన ధరావతు శివపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్వర్ శుక్రవారం తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా డీజే పెడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
తిరుమల తరహాలో యాదగిరి క్షేత్రం అభివృద్ధి కావాలి
యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయ తరహాలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆలయ ఈవో వెంకట్రావ్కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని ఈవో వెంకట్రావ్ మర్యాద పూర్వకంగా కలిశారు. యాదగిరి క్షేత్రానికి ఈవోగా తనను కొనసాగిస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డికి వెంకట్రావ్ కృతజ్ఞతలు తెలిపి, శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదం, శేష వస్త్రాన్ని అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, ఉత్తర్వులను తీసుకోవాలని సీఎం సూచించారు. ఫ ఈవో వెంకట్రావ్కు సూచించిన సీఎం రేవంత్రెడ్డి -
లక్ష మందితో బీసీ సింహగర్జన
భువనగిరిటౌన్ : దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. గురువారం భువనగిరిలోని ఎస్వీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టంతో పాటు ఆర్డినెన్స్ చేయటంపట్ల సీఎం రేవంత్రెడ్డికి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన రిజర్వేషన్ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆపటం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ పార్టీలది గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాటగా ఉందని, నెల రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగితే రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సింహగర్జన సభకు బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్చారి, జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహస్వామి, నాయకులు మాటూరి ఆశోక్, నర్సింహచారి, వరికుప్పల మదు, బాబురావు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారుఫ జాజుల శ్రీనివాస్గౌడ్ -
27 సంఘాల పదవీకాలం పొడిగింపునకు నో!
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి యాదాద్రి : ఉమ్మడి జిల్లాలో 27 సహకార సంఘాల పాలకవర్గాల పొడిగింపు నిలిచిపోయింది.ఆయా సొసైటీల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో సహకార శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరిలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా ఇందులో చందుపట్ల, వలిగొండ, చౌటుప్పల్, జూలురు పాలకవర్గాలపై ఆరోపణలున్నాయి. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో 43 సొసైటీలు ఉండగా నాలుగు సంఘాలపై, నల్లగొండలో 43 సొసైటీలకు గాను 19 సంఘాలపై ఆర్థికపరమైన ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. సహకార సంఘాల బైలాను కాలదన్ని నిబంధనలను విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడం, దుర్వి నియోగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘాల సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గాల సభ్యులు సహకారం చట్టానికి విరుద్ధంగా తమ పేరున తీర్మానాలు చేసుకుని తప్పుడు బిల్లులతో లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపిన సహకార శాఖ అధికారులు.. రాష్ట్ర శాఖకు పంపిన నివేదిక ఆధారంగా 27 సొసైటీలపై చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. –శ్రీధర్, జిల్లా సహకార అధికారి, భువనగిరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొసైటీల పాలకవర్గాల పొడిగింపు నిలిపివేశాం. నిధుల దుర్వినియోగం, డైరెక్టర్ల రాజీనామ వంటి విషయాలతో ప్రస్తుతానికి పొడిగింపు ఇవ్వలేదు. ఆరు నెలల పాటు సొసైటీల్లో పర్సన్ఇంచార్జ్ల పాలన కొనసాగుతుంది. ఫ సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణలు ఫ చట్ట విరుద్ధంగా తీర్మానాలు ఫ తప్పుడు బిల్లులు సృష్టించి రూ.లక్షలు స్వాహా ఫ 27 సొసైటీల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు నిలిపివేత ఫ సహకార శాఖ ఉత్తర్వులు -
నేడు గణేష్ నిమజ్జనం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ తదితర పట్టణాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువుల వద్ద లైట్లు, బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు స్వాగతం పలికేందుకు వేదికలు ఏర్పాట్లు చేసుకున్నారు. 153 మంది జీపీఓలు మోత్కూరు: జిల్లాకు 153 మంది గ్రామ పాలనాధికారులు (జీపీఓ) రానున్నారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. జిల్లాకు 203 మంది గ్రామ పాలన అధికారులు అవసరమని రెవెన్యూ అధికారులు గుర్తించారు. సీసీఎల్ఏ నుండి కలెక్టరేట్కు వచ్చిన నిబంధనలు, సూచనల మేరకు పరీక్ష ఆధారంగా గ్రామ పరిపాలన అధికారుల జాబితా సిద్ధం చేశారు. గవర్నర్ను కలిసిన నారాయణరెడ్డి సాక్షి, యాదాద్రి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ కార్యవర్గ సభ్యుడు, రజాకార్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణరెడ్డి గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు సి.అంజిరెడ్డితో వెళ్లి కలిశారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు. అమృత్ పనుల్లో వేగం పెంచండి సాక్షి,యాదాద్రి : అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో పబ్లిక్హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షనిర్వహించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రూ.123.44 కోట్లతో అమృత్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ నిధులతో చేపట్టిన మంచినీటి ట్యాంకులు, పైప్లైన్లు, అంతర్గత పైప్లైన్ల పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఇటీవల కాంట్రాక్టర్లకు రూ.22 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో పబ్లిక్హెల్త్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీఈ మనోరమ, ఏఈలు పాల్గొన్నారు. -
సేవాదృక్పథం.. ఆయన సొంతం
అర్వపల్లి: వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్ దండుగుల యల్లయ్య. 1998 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఆయన ఎంఎన్ఓగా, సెక్టోరియల్ అధికారిగా, రిసోర్స్ పర్సన్గా వివిధ పదవులను సమర్థంగా నిర్వర్తించారు. గతంలో కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్లో కేవలం 31మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు 60మంది వచ్చేలా కృషిచేశారు. బడికి సక్రమంగా రాని పిల్లల ఇళ్లకు వెళ్లి తన బైక్పై తీసుక వస్తుంటారు. ఈ పాఠశాల చెరువు సమీపంలో ఉండటంతో వర్షాలు పడినప్పుడు మునుగుతుంది. ప్రజాప్రతినిధుల సహకారంతో 200 ట్రాక్టర్ల మట్టిని తోలించి ఇబ్బందులను తొలగించారు. దాతల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నారు. -
క్రీడా నైపుణ్యాల వెలికితీత
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జెడ్పీ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎంత కృషి చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. -
ఉత్తమ విద్యాప్రమాణాల పెంపునకు గుర్తింపు
గరిడేపల్లి: గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పానుగోతు ఛత్రునాయక్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నల్ల గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆయన 1996 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. 2003లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు. చిలుకూరు, వేములపల్లి, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడులో మండల విద్యాధికారిగా సేవలు అందించారు. ఎంఈఓగా విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేశారు. పనిచేసిన ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. మఠంపల్లి పాఠశాలలో 680 మొక్కలు, గరిడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 500లకు పైగా మొక్కలు నాటించారు. ఆయన పనిచేసిన చోట పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేశారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. ఆకస్మిక సెలవులు తప్పా ఎలాంటి ఇతర సెలవులను ఆయన ఉద్యోగ జీవితంలో వాడుకోలేదు. -
అదే గోస.. అదే వరుస
యూరియా కోసం తప్పని బారులు.. రోడ్డెక్కుతున్న రైతులు ఫ వేకువజామునుంచే క్యూలైన్లు ఫ పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ అడ్డగూడూరు పీఏసీఎస్కు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులుఅడ్డగూడూరు : మడంల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి బుధవారం రాత్రి 440 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. స్టాక్ తక్కువగా ఉండటంతో రైతులు ఎక్కవ సంఖ్యలో తరలిరావడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. శుక్రవారం మరో లోడ్ వస్తుదని, యూరియా అదని 228 మంది రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయ అధికారి పాండురంగాచారి తెలిపారు. రామన్నపేట: యూరియా కోసం పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చిన రైతులు చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం సాయంత్రం వచ్చిన లారీలోడ్ యూరియాను ఎవరికి ఇచ్చారో చెప్పాలని అధికారులను ప్రశ్నిం ఆరు. రాస్తారోకో గంట సేపటికి పైగా కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియాను ప్రభుత్వ ధరకే ఇప్పిస్తామని ఏఈవోలు, సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ నాగరాజు రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సీపీఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు బోయిని ఆనంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, యూత్ అధ్యక్షుడు బత్తుల వెంకటేశం,మాజీ ఎంపీటీసీ గొరిగె నర్సింహ, మాజీ కో ఆప్సన్మెంబర్ ఎండీ ఆమేర్ రైతులకు మద్దతు తెలిపారు. ఆలేరురూరల్: సొసైటీకి 440 యూరియా బస్తాలు రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు ఆందోళనకు దిగారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి నిలువ ఉంచుకోవద్దని మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడతగా 1030 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, ఇంకా 400 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అవుతుందని, రైతులందరికీ సరఫరా చేస్తామని చెప్పారు. -
బోధన వినూత్నం.. వరించిన పురస్కారం
ఫ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక ఫ నేడు సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అవార్డులు ప్రదానం సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఈఐఎస్ విభాగంలో సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల కళాశాలకు చెందిన అర్థశాస్త్రం అధ్యాపకురాలు కొండ కవిత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. కవిత 1996లో కాలేజీ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ ఆధ్యాపకురాలుగా ఎంపికై సర్వేల్ గురుకుల బాలుర కళాశాలలో చేరారు. ఇక్కడ పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత హసనపర్తి, హైదరాబాద్లోని నాగోల్ మైనార్టీ కళాశాలో విధులు నిర్వహించారు. 2004లో బదిలీపై తిరిగి సర్వేల్ గురుకుల కళాశాలకు వచ్చారు. తన 29 ఏళ్ల సర్వీస్లో తాను బోధిస్తున్న అర్థశాస్త్రం సబ్జెక్ట్లో విద్యార్థులు ప్రతి సంవత్సరం 100 శాతం ఫలితాలు సాధిస్తూ వచ్చారు. చదువులో వెనకబడిన విద్యార్థులను ముందజలో ఉంచడంలో ఆమెకు ఆమె సాటి. ఆమె శిష్యుల్లో 50మందికి పైగా సీఏ పనిచేస్తున్నారు.