Yadadri
-
నిద్రలోనే దహించిన మృత్యువు
మిర్యాలగూడ అర్బన్: విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో నిద్రిస్తున్న అమ్మమ్మతో సహా మనువడు, మనవరాలు ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలాల్వాడలో రేకుల ఇంటిలో నివాసముంటున్న చంద్రకళ(50) ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన కుమార్తె పిల్లలైన లక్ష్మణ్(16), ప్రణతి(14)లను తన వద్దే ఉంచుకుని చదివిస్తోంది. గురువారం రాత్రి వీరంతా నిద్రిస్తున్న క్రమంలో ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. కొద్ది సేపటికే ఇంటిలోని వస్తువులన్నింటికీ మంటలు అంటుకున్నాయి. గమనించిన ఇంటిచుట్టుపక్కల వారు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నీళ్లను చల్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ లోగా మంటలు ఎక్కువై ఇంట్లోని గ్యాస్ సిలిండర్ అంటుకుని ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి మంటల్లో సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ కె.రాజశేఖర రాజు, వన్టౌన్ సీఐ నాగభూషణరావు, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ యాదగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. నేడు భర్త నెలమాసికం.. అంతలోనే విషాదం చంద్రకళ భర్త సైదులు పదేళ్ల క్రితం పక్షవాతంతో మంచాన పడగా ఆమెనే కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చింది. నెల క్రితం భర్త మరణించడంతో శనివారం నెలమాసికం జరగాల్సి ఉండగా.. ఇందుకోసం చంద్రకళ ఇల్లుకు సున్నం వేసి సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉండగా తన పెద్ద కుమార్తె ధనమ్మకు వివాహమైన కొన్నేళ్లకు ఆమె భర్త (అల్లుడు) మరణించడంతో కుమార్తెను చేరదీసి ఆమె పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలను తన వద్దే ఉంచుకుని చదివిస్తోంది. ధనమ్మ ఇళ్లల్లో పని చేసేందుకుగాను నాలుగు రోజుల క్రితమే పూణే వెళ్లగా.. ఈలోపే చంద్రకళతోపాటు ఆమె మనవడు, మనవరాలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి పేలిన గ్యాస్ సిలిండర్ ఇంట్లో నిద్రిస్తున్న అమ్మమ్మతో సహా మనువడు, మనవరాలు సజీవ దహనం మిర్యాలగూడలోని కలాల్వాడలో ఘటన విచారణ చేస్తున్నాం కలాల్వాడలో జరిగిన అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించాం. పూణేలో ఉన్న చంద్రకళ కుమార్తె ధనమ్మ వచ్చిన తరువాత ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడతాం. ప్రస్తుతం తమ ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించాం. – డీఎస్పీ రాజశేఖర రాజు క్షణాల్లో మంటలు వ్యాపించాయి అర్ధరాత్రి సమయంలో మంటలు రావడంతో ఇంటి పక్కన వారి సమాచారంతో ఇక్కడికి వచ్చాను. వచ్చే సరికి మంటలు భారీగా వస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు చాలా ప్రయత్నం చేశాం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల ధాటికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ముగ్గురు అందులోనే సజీవ దహనమయ్యారు. – రమేష్, కలాల్వాడ -
గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి
కొండమల్లేపల్లి : వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోటు ఆందోళన కలిగిస్తోంది. కొండమల్లేపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోట్ల జగదీష్, శ్రీలక్ష్మి దంపతుల 13 సంవత్సరాల కుమారుడు కోట్ల జతిన్కుమార్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో ఆడుకొని స్థానిక చౌరస్తాలో ఉన్న తమ ఇంటికి వచ్చి నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నవయస్సులోనే గుండెపోటుతో బాలుడు మృతిచెందడం స్థానికులకు కంటతడి పెట్టించింది. అదుపుతప్పి కారును ఢీకొట్టిన లారీచిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఓ కారు నార్కట్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఆ వెనకే వస్తున్న లారీ అదుపుతప్పి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డివైడర్కు ఢీకొని హైవేపై నిలిచిపోయింది. ప్రయాణికుడు కారులో ఇరుక్కుపోగా స్థానికులు కారు డోర్లు తెరిచి బయటికి లాగారు. ఈ ప్రమాదంతో కారు, లారీ హైవేపై నిలిచిపోవటంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్ సిబ్బందిపై దాడి కేసులో ముగ్గురికి జైలువలిగొండ : విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం రామన్నపేట కోర్టు తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండకు చెందిన కళ్లెం నరేష్, బల్లెపు కృష్ణ, పులిగిళ్లకు చెందిన వేముల నర్సింగ్ రావు ముగ్గురు 2003లో వలిగొండలో విద్యుత్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈమేరకు అప్పటి ఎస్సై ప్రభాకర్ వీరిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైనందున శుక్రవారం రామన్నపేట కోర్టు జడ్జి సబితా ఈ ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.11వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు. బాలికపై యువకుడి లైంగిక దాడి ● నిందితుడిపై పోక్సో కేసు నమోదు కేతేపల్లి: కేతేపల్లి మండలంలో మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన బాలిక కేతేపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వారం రోజుల క్రితం వచ్చింది. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన దుర్గం కమలాకర్ అనే యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతుండగా, శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నల్లగొండలోని సఖి కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. -
అట్టముక్కలు, సిరంజీలతో జేసీబీ రూపకల్పన
మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన బోయిని నర్సింహ, యాకమ్మల కుమారుడు బోయిని రిత్విక్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ వేసవి సెలవుల్లో ఏదో ఒకటి చేయాలనే తపనతో అట్టముక్కలు, సిరంజీలు, గ్లూకోజ్ పైపులు, ట్యాగ్ల సాయంతో జేసీబీ యంత్రాన్ని రూపొందించాడు. సిరంజీల్లో నింపిన వాటర్, గ్లూకోజ్ పైపుల ద్వారా హైడ్రాలిక్ మోడల్లో జేసీబీ మిషన్ను అటు ఇటు తిప్పుతూ, పైకి లేపుతూ ఆపరేట్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంలో ఎంతో ఆసక్తి ఉందని, గతంలో వైబ్రేషన్ మిషన్, వాటర్ మోటారును తయారు చేసినట్లు చెప్పాడు. -
యాదగిరిగుట్టలో 30 రిజిస్ట్రేషన్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం 30 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయినట్లు సబ్ రిజిస్టార్ ఖాధర్పాషా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. సుమారు గజానికి 51శాతం వరకు పెరిగినట్లు వెల్లడించారు. అత్యధికంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని గుండ్లపల్లి ప్రధాన రహదారి వెంట గజం రూ.8,100 ఉంటే కొత్తగా వచ్చిన విలువ రూ.12,200కు పెరిగింది. ఇక యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి గ్రామంలో పాత విలువ రూ.700 ఉంటే ఇప్పుడు రూ.1,500లకు పెరిగింది. కాగా.. నూతన ధరలు అమల్లోకి వచ్చిన మొదటి రోజు 30 మాత్రమే డాక్యుమెంట్లు రిజిస్టేషన్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలిభువనగిరిటౌన్ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. భువనగిరిలోని సీపీఐ కార్యాలయంలో ఏశాల అశోక్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సీపీ ఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సి ల్ సభ్యుడు గోదా శ్రీరాములు, నాయ కులు కురిమిద్ది శ్రీనివాస్, కళ్లెం కృష్ణ్ణ, గాలయ్య, ముత్యాలు పాల్గొన్నారు. సీఎం సభకు 3వేల మంది రైతులురామన్నపేట : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్న రైతు మహోత్సవ సభకు జిల్లా నుంచి మూడువేల మంది రైతులను తరలించేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 279 ఎకరాల్లో రూ.1,091 కోట్ల అంచనా వ్యయంతో కోహెడలో తలపెట్టిన పండ్ల మార్కెట్కు సీఎం శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభకు 62 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో 50 మంది వరకు తరలించనున్నారు. ఒక్కో బస్సుకు వ్యవసాయ విస్తరణాధికారితో పాటు వ్యవసాయాధికారులను బాధ్యులుగా, పది బస్సులకు సమన్వయ అధికారిని నియమించారు. రైతులకు అవసరమైన భోజనం, స్నాక్స్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. బహిరంగ సభ అనంతరం రైతులను సురక్షితంగా వారివారి స్వగ్రామాలకు తరలించడానికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. -
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత
భువనగిరి (బీబీనగర్) : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా 20 రోజులుగా ఆయన నిమ్స్ ఆస్పత్రిలో డైరెక్టర్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పరామర్శించారు. నర్సింహారెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1972, 1978లో జరిగిన ఎన్నికల్లో నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగు
కొర్రలుఖరీఫ్ పంటగా కొర్రను జూలై, ఆగస్టు మాసాల్లో విత్తుకోవాలి. కొర్ర పంట 70 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుంది. కొర్రలో ప్రసాద్, కృష్ణదేవరాయ, శ్రీలక్ష్మీ, సూర్యనంది, ఎస్ఐఏ 3085, ఎస్ఐఏ 3156 రకాలు అనుకూలం. పప్పు శనగకు ముందు 70–75 రోజులలో సూర్యనంది కొర్రలు సాగు చేసి శనగ వేసుకుంటే నికర ఆదాయం పెరుగుతుంది. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 17 కిలోల భాస్వరం వేసుకోవాలి. వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా తక్కువ నీటి వినియోగంలో ఉన్న చిరుధాన్యాల పంటలు ఎంచుకుంటే తక్కువ పెట్టుబడులతో అదాయాలు పొందవచ్చు.పెద్దవూర : ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు ప్రత్యామ్నాయంగా రైతులు చిరు ధాన్యాల పంటలైన జొన్న, సజ్జ, రాగి, కొర్ర పంటలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ చెబుతున్నారు. చిరుధాన్యాల సాగులో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. జొన్న వానాకాలంలో రాష్ట్రంలో జొన్న పంటను అన్ని జిల్లాలలో సాగు చేయవచ్చు. నల్లరేగడి, తేలికపాటి నేలలు జొన్న పంటకు అనుకూలం. ఖరీఫ్లో తొలకరి వర్షాలు కురవగానే వర్షపాతం ఆధారంగా జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వారం వరకు విత్తుకోవాలి. విత్తడం ఆలస్యమైతే కాండం తొలుచే పురుగు ఉధృతి పెరుగుతుంది. రకాలు: హైబ్రీడ్ రకాలైన సీఎస్హెచ్ 14, 16, 18, 21 రకాలతో పాటు ప్రాచుర్యం పొందిన ప్రై వేటు కంపెనీల హైబ్రీడ్ రకాలను సాగు చేయవచ్చు. హైబ్రీడ్ రకాలలో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. సాధారణ రకాలైన సీఎస్వీ 15, శ్రీశైల(పీఎస్వీ–56) రకాలు సాగు చేయవచ్చు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. విత్తే విధానం: జొన్న సాగుకు ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం వాడుకోవాలి. వరుసల మద్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మద్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తకోవాలి. అంతర పంట: జొన్నలో కందిని అంతర పంటగా 2:1 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. విత్తిన 42 గంటల్లోపు లీటరు నీటికి 4 గ్రాములు అట్రజిన్ కలుపు మందును కలిపి పిచికారీ చేస్తే మొదటి దశలో వచ్చే కలుపును నివారించవచ్చు. జొన్నలో ఎక్కువ కష్టం కలిగించే మల్లె(కలుపు) నివారణకు లీటర్ నీటికి 50 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 2.4–డి సోడియం సాల్ట్ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. రాగులువానా కాలంలో రాగి పంటను జూలై నుంచి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. రాగి పంట 80 నుంచి 115 రోజులలో చేతికి వస్తుంది. స్వల్పకాలిక రకాలైన మారుతి, చంపావతి, 80 నుంచి 90 రోజుల్లో.. మధ్యకాల రకాలైన సప్తగిరి, భారతి, గోదావరి, 100 నుంచి 115 రోజుల్లో, పీపీఆర్ 1012 రకం 115 నుంచి 120 రోజులలో పంట కోతకు వచ్చి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయి. రాగిని నేరుగా విత్తనాన్ని వెదజల్లి నారు పెంచి నాటే విధానంలో సాగు చేయవచ్చు. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎరువుల యాజమాన్యం: విత్తనాన్ని వరుసల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీ మీటర్లు దూరంలో విత్తుకోవాలి. నారుమడికి 640 గ్రాముల లెక్కన నత్రజని, భాస్వరం, 480 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రధాన పొలంలో నాలుగు టన్నుల పశువుల ఎరువులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 12 కిలోలు నత్రజని, 8 కిలోల పొటాష్, 12 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు విత్తేటప్పుడు లేదా నాటేటప్పుడు వేసుకోవాలి. విత్తనాన్ని వెదజల్లేటప్పుడు భూమిని మెత్తగా తయారు చేసి విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతో గాని, చెట్టు కొమ్మతో గాని చదును చేసుకోవాలి. విత్తిన వెంటనే మొలకలు రాక ముందు లీటర్ నీటిలో 3 మిల్లీ లీటర్లు పెండి మిథాలిన్ను కలిపి పిచికారీ చేయాలి. నాటిన 15 నుంచి 18 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఉంటే 2,4–డీ సోడియం సాల్టును రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుని కలుపు నివారించుకోవాలి. సస్యరక్షణ చర్యలపై పెద్దవూర మండల వ్యవసాయాధికారి సూచనలుసజ్జ విత్తనాలను జూన్ రెండో వారం నుంచి జూలై మూడో వారం వరకు విత్తుకోవచ్చు. రకాలు: ఐసీఎంహెచ్ 356(హైబ్రీడ్), పీహెచ్బీ3, ఏహెచ్బీ 1 పేరున్న హైబ్రీడ్ రకాలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం వాడుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి కాాఫ్టాన్ లేదా 3 గ్రాముల థైరామ్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం: ఒక టన్ను పశువుల ఎరువుతో పాటు ఎకరాకు వర్షాధార పంటకు 24–12–8 చొప్పున, నీటి వసతి కింద 32–16–12 కిలోల చొప్పున నత్రజని–భాస్వరం–పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును రెండు దఫాలుగా పంట విత్తేటప్పుడు, విత్తిన 30 నుంచి 35 రోజులకు వేయాలి. రెండు సాళ్లు సజ్జ పంటకు ఒక సాలు కంది పంటను అంతర పంటగా వేసుకోవచ్చు. అట్రజిన్ కలుపు మందుతో కలుపును నివారించాలి. పంట కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. సజ్జ పంట 70 నుంచి 80 రోజులలో కోతకు వచ్చి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. -
జిల్లాలో అత్యధికంగా హైవేల వెంట ఎకరం ధర రూ.కోటిన్నర
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు జిల్లాలోనూ భారీగా పెరిగాయి. హెచ్ఎండీఏ, వైటీడీఏ, జాతీయ రహదారులు, మున్సిపాలిటీల్లో సవరించిన విలువలు శుక్రవారం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ధరలు గతంకంటే రెండింతలయ్యాయి. హెచ్ఎండీఏ మండలాల్లో గల జాతీయ రహదారులు–163, 65 వెంట ఉన్న భూముల ధర అత్యధికంగా ఎకరం రూ.కోటిన్నర దాటింది. రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం పెరిగిన విలువల నేపఽథ్యంలో రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరిగాయి. దీంతో భూముల అమ్మకాలు మరింత దిగజారిపోనున్నాయని రియల్టర్లు వాపోతున్నారు. చౌటుప్పల్లో 50 శాతం పెంపు ● చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి వెంట గజానికి పాతధర రూ.21వేలు ఉండగా కొత్త ధర రూ.31,500తో యాభై శాతం పెరిగింది. పట్టణ కేంద్రంలో ఇతర ప్రాంతాల్లో గజం పాతధర రూ. 2,100 వేలు ఉండగా కొత్త ధర 80 శాతం పెరుగుతలతో రూ.3,700 వేలకు చేరింది. ● చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం, తూప్రాన్పేట గ్రామాల్లో జాతీయ రహదారి వెంట గజానికి కొత్త ధర రూ.7,200 పెరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఇతర గ్రామాల్లో గజానికి పాత ధర రూ.2,100 ఉండగా కొత్తధర రూ.3,200కు పెరిగింది. ● చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలో ఎకరం మార్కెట్ ధర రూ.59.20లక్షలుంటే ప్రస్తుతం రూ.88,93,500లక్షలకు పెరిగింది. ● చౌటుప్పల్ పట్టణ రెవెన్యూ పరిధిలో గతంలో రూ.11.25లక్షలు ఉండగా ఇప్పుడు రూ.22,50లక్షలకు పెరిగింది. గతంలో అత్యధిక ధర రూ.42లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.63 లక్షలకు పెరిగింది. మండలంలోని ఇతర గ్రామాల్లో పాత ధర ఎకరం రూ.7.50 లక్షలుండగా ప్రస్తుతం రూ.15లక్షలకు చేరింది. ఆలేరులో ఎకరం రూ.31.50లక్షలు ● ఆలేరులో జాతీయ రహదారి వెంట ఎకరం రూ.21 లక్షల నుంచి రూ.31.50లక్షలకు వరకు పెరిగింది. (సాయిబాబా గుడి నుంచి బహదూర్ పేట నేషనల్ హైవే వరకు) అదే మార్గంలో కందిగడ్డ తండా నేషనల్ హైవే వరకు రూ.29.64 లక్షల నుంచి రూ.44.10లక్షల వరకు పెరిగింది. ● మంతపురి, గొలనుకొండ, తూర్పుగూడెం, శారాజిపేట, కొల్లూరు, సాయిగూడెం ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. అదే మార్గంలో రోడ్డుకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో రూ.15.25 లక్షలు నుంచి రూ.26,68,750 వరకు పెరిగింది. మోత్కూరులో.. ● మోత్కూరులో మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్డు పక్కన గజానికి రూ.4,100 నుంచి రూ.5,200 వరకు పెంచారు. రోడ్డుకు లోపల రూ.2,100 నుంచి రూ.3,200, కొన్నిచోట్ల రూ.1,100 నుంచి రూ.2,000కు పెంచారు. మోత్కూరు మండలం సదర్శాపురంలో ఎకరాకు రూ.2.25 లక్షలు ఉండగా రూ.3.60లక్షల నుంచి రూ.6.70లక్షలకు పెరిగింది. కొన్ని చోట్ల రూ.9లక్షలు ఉంటే రూ.15 లక్షలకు, అత్యధికంగా మోత్కూరులో రూ.25 లక్షలు ఉండగా రూ.30 లక్షలకు పెరిగింది. భూదాన్ పోచంపల్లి మండలంలో.. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూదాన్ పోచంపల్లి మండలంలో గతంలో ప్రధాన రోడ్ల వెంట, నివాస గృహాలకు సమీపంలో ఉన్న భూముల విలువ ఎకరాకు రూ.9 లక్షలు ఉండగా ప్రస్తుతం దానిని వంద శాతం అనగా రూ.18 లక్షల వరకు పెంచారు. రోడ్డుకు లోపలి వైపున ఉన్న భూముల విలువ రూ.7.50 లక్షల నుంచి 70 శాతం అనగా రూ.13,12,500కు పెంచారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో.. వ్యవసాయ భూములకు ఎకరానికి గతంలో అత్యల్పంగా రూ.2.25 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.10 లక్షలుకు పెంచారు. గతంలో ఎకరాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ.20 వేలు ట్యాక్స్ కట్టాల్సివస్తే, ప్రస్తుతం రూ.80 వేల చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రాచకొండలో ఎకరాకు రూ.30 లక్షలు ఉంటే, ప్రస్తుతం రూ. 38.11 లక్షలకు పెంచారు. రామన్నపేట మండలంలో.. రామన్నపేటతో పాటు బోగారం గ్రామాల్లో అత్యధికంగా ఎకరాకు రూ.50 లక్షల వరకు భూమి విలువ పెరిగింది. బాచుప్పల, తుర్కపల్లి గ్రామాల్లో అతి తక్కువగా రూ.4 లక్షల వరకు భూమి విలువ పెంచారు. యాదగిరిగుట్ట మండలంలో.. అత్యధికంగా గుండ్లపల్లి ప్రధాన రహదారిలో గజానికి రూ.12,200 పెరిగింది. గతంలో ఇక్కడ రూ.8,100 మాత్రమే ఉండేది. ఇక జంగంపల్లిలో గజానికి రూ.700 ఉంటే.. ఇప్పుడు రూ.1,500లకు పెరిగింది. గజానికి సుమారు 51శాతం విలువ పెరిగింది. జాతీయ రహదారి వెంట ఎకరం ధర అత్యధికంగా రూ.10,16,400 నుంచి రూ.1.60 కోట్లు అత్యధికంగా నిర్ణయించారు. ఆతర్వాత జాతీయ రహదారి వెంట కొండమడుగు రూ.29.60 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు పెరిగింది. గూడూరులో రూ.71,15,500 నుంచి రూ.1.50 కోట్లకు పెరిగింది. హైదరాబాద్–హన్మకొండ జాతీయ రహదారి పక్కన గజం ధర రూ.48,300కు పెరిగింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ ధర ఫీట్కు రూ.2,200 నుంచి రూ.2,700 వరకు అనగా 23 శాతం పెరిగింది. జాతీయ రహదారి వెంట ఉన్న పాలక ఎస్టేట్ వంటి చోట్ల మాత్రం ధర రూ.12,600కుపెంచారు. పట్టణంలోని ఆబాదిలోని పలు ప్రాంతాల్లో ఽకనిష్ట ధర రూ.2,100 నుంచి రూ3,700 గా నిర్ణయించారు. వ్యవసాయ భూమి జాతీయ రహదారి పక్కన బగాయత్లో రూ.70 లక్షల నుంచి రూ.1,16,88,600కు పెంచారు. రాయిగిరిలో రూ.1.06 కోట్లకు పెరిగింది. మండలంలో ఎకరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.13,12,500 అనగా 85 శాతం పెరిగింది. కమర్షియల్ ప్లాట్లకు గజానికి రూ.32,200 నుంచి రూ.48,300 వరకు అనగా 50 శాతం పెరిగింది. అపార్ట్మెంట్లలో ఫీట్కు రూ.2,200 నుంచి రూ.3,100 వరకు పెరిగింది. వ్యవసాయ భూములు ఎకరాకు రూ.13.50 లక్షల నుంచి రూ.23.62లక్షలకు అనగా 85 శాతం పెరిగింది. ఫ హెచ్ఎండీఏ మండలాల్లో రోడ్ల పక్కన వంద శాతం పెరుగుదల ఫ భువనగిరిలో కమర్షియల్ ప్లాట్ గజం ధర 48,300 రూపాయలు ఫ వ్యవసాయ భూమి రూ.1.16కోట్లు ఫ అమలులోకి పెంచిన ధరలు -
అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ఫ రాష్ట్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ తుర్కపల్లి : అడవుల పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలోని ఫారెస్ట్ భూముల్లోని 5 ఎకరాల విస్తీర్ణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి 5వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి భూమిని, మానవ జీవ జాతులను కాపాడుకోవాలంటే చెట్ల నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, దారపు సంచులు, గోనె సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫారెస్ట్ కన్జర్వేటర్ శివల రాంబాబు, జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సస్ ఐనాల చైతన్య మహేందర్రెడ్డి, ఎంపీడీఓ గీతారెడ్డి, శైలజ, మల్లేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కనిపించకుండా పోతిరా బిడ్డలారా..
మిర్యాలగూడ అర్బన్: విద్యుదాఘాతంతో సిలిండర్ పేలి మృతి చెందిన లక్ష్మణ్, ప్రణతిల తల్లి నక్కధనమ్మ శుక్రవారం రాత్రి మిర్యాలగూడకు చేరుకుంది. ఇంటికి వచ్చిన వెంటనే సిలిండర్ పేలుడు ధాటికి కూలిపోయిన ఇంటిని చూసి తన కొడుకు, కూతురును తలుచుకుని కనిపించకుండా పోతిరా బిడ్డలారా అంటూ బోరున విలపించింది. నేను వెళ్లిన నాలుగు రోజులకే ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె వివరాలను సేకరించారు. అగ్ని ప్రమాదంపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● కూలిన ఇంటిని చూసి బోరున విలపించిన తల్లి -
ప్రజలకు భరోసా కల్పించాలి : ఎస్పీ
వలిగొండ : వివిధ సమస్యలపై స్టేషన్లకు వచ్చే ప్రజలకు పోలీసులు భరోసా కల్పించి పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన వలిగొండ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రౌడీ షీటర్ల కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అర్హత ఉన్న ఫిర్యాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. పెట్రోలింగ్, ప్రజా ఫిర్యాదులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ యుగంధర్, సిబ్బంది ఉన్నారు. వైభవంగా ఊంజల్ సేవయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయంలో పూజలను జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. -
హక్కుల నేత మరణం తీరని లోటు
మిర్యాలగూడ: హక్కుల నేత సుబ్బారావు మృతి తీరని లోటని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతరెడ్డి సుధాకర్రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు విమలక్క, అమర్ అన్నారు. ఈనెల 4న తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందిన పొన్నూరు సుబ్బారావు భౌతికకాయాన్ని వారు శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా హక్కుల కోసం దళితుల, కార్మికుల, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. వనరుల పరిరక్షణకు నిరంతరం శ్రమించిన మేధావి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా, కళాశాల అధ్యాపకుడిగా నాలుగు దశాబ్దాలుగా పనిచేసి అనేక మంది విద్యార్థులను ప్రజాస్వామ్య వక్తలుగా తీర్చిదిద్దిన ప్రజాస్వామ్యవాది సుబ్బారావు అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే ఘనమైన నివాళులని తెలిపారు. మెడికల్ కళాశాలకు అప్పగించిన సుబ్బారావు భౌతికకాయం సుబ్బారావు(92) భౌతికకాయాన్ని అశృనయనాల మధ్య శుక్రవారం ఉదయం 8గంటలకు అంబులెన్స్లో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. తన భౌతికకాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అప్పగించాలని సుబ్బారావు చివరి ఆకాంక్ష మేరకు అభిమానులు, శిష్య బృందం మెడికల్ కళాశాలకు అప్పగించారు. నినాదాలు చేస్తూ అంతిమ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, అమర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతరెడ్డి సుధాకర్రెడ్డి, కస్తూరి ప్రభాకర్, వేనేపల్లి పాండురంగారావు, మహబూబ్అలీ, ఖాదర్, అంబటి నాగయ్య, డాక్టర్ రాజు, కుటుంబసభ్యులు రమేష్, అజయ్, కిరణ్మయి, నీరజ, నజీర్ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనంపై కూలిన చెట్టు
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట నుంచి మోత్కూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కప్రాయపల్లి స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన చెట్టు కూలి తండ్రి, కూతురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంఖాన్పేటకు చెందిన బండారు రాములు గ్రామ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో కుమార్తె దివ్యను శుక్రవారం ద్విచక్రవాహనంపై మోత్కూరు బస్టాండ్లో దింపిరావడానికి వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో కప్రాయపల్లి స్టేజీ సమీపంలో చెట్టు కూలి వీరి వాహనంపై పడింది. దీంతో రాములుకు తీవ్రంగా గాయాలయ్యాయి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో ఆత్మకూర్(ఎం) మండలం పోలీస్స్టేషన్లో కానిస్టేబు ల్గా పనిచేస్తున్న శ్రీను స్వగ్రామం కేతేపల్లికి పోయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం గమనించి సర్పంచ్ కొంగరి యాదగిరికి సమాచారం ఇచ్చాడు. వారు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో చెట్టును తొలగించి గాయపడ్డ బండారు రాములును, దివ్యను చికిత్స నిమిత్తం భువనగిరికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ● తండ్రి, కూతురికి గాయాలు -
కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోండి
భూదాన్పోచంపల్లి : కాలుష్యకారక రసాయన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖకు పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ రైతులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మి దామోదర్రెడ్డి మాట్లాడుతూ పలు విషయాలను వివరించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు పీసీబీ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, దున్నపోతు ప్లెక్సీతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరాటసమితి నాయకులు గుమ్మి నరేందర్రెడ్డి, రావుల శశికిరణ్, ప్రభ, ధనలక్ష్మి, బాల్రెడ్డి, రాంరెడ్డి, నర్సింహచారి, మహేశ్, రేణుక, శారదమ్మ, ముత్తమ్మ, అండాలు, నర్సింహ పాల్గొన్నారు. -
ఎరువు.. మరింత బరువు
రామన్నపేట : ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులకు సాగు భారంగా మారనుంది. ఇప్పటికే విత్తనాలు, కూలీ రేట్లు, దున్నకం ఖర్చులు, హార్వెస్టర్ల అద్దెలు, పురుగు మందుల ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. పెరిగిన ఎరువుల ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగు అంచనా 4.75 లక్షల ఎకరాలు జిల్లాలో గడిచిన పదేండ్లలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ప్రస్తుత వానాకాలంలో 4.75లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు అవుతుందని అధికారులు అంచనా. ఇందులో 3.05లక్షల ఎకరాల్లో వరి, 1.40లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసే అవకాశం ఉంది. గత వానాకా లంతో పోలిస్తే పది వేల ఎకరాల సాగు అదనం. పంటల సాగుకు యూరియా 37,766 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,562 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్(ఎస్ఎస్పీ) 1,867 మెట్రిక్ టన్నులు, పోటాష్ 6,225 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 24,900 మెట్రిక్టన్నులు అవసరం అని అధికారులు గుర్తించారు. భారీగా పెరిగిన ధరలు కాంప్లెక్స్ ఎరువులతోపాటు, సింగిల్ సూపర్ పాస్పేట్ ధరలు భారీగా పెరగడం వల్ల జిల్లాలోని రైతులపై ఏడు నుంచి రూ.25కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఒక్కో కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర ఇప్పుడున్న దానికంటే రూ.200 నుంచి రూ.500 వరకు పెరిగింది. దీంతోపాటు 20:20:0:13 ఎరువు ధర రూ.1,600 నుంచి రూ.2,100 పెరిగింది. 17:17:17 ధర రూ.1,700 నుంచి రూ.2,100 పెరిగింది. రైతులు అధికంగా ఉపయోగించే యూరియా, డీఏపీ ధరలు యధాతథంగా ఉండడం రైతులకు పెద్ద ఊరటను ఇచ్చే అంశం. యూరియా బస్తా రూ.266.50, డీఏపీ రూ.1,350కే లభిస్తాయి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వం పంటల మద్దతు ధరను పెంచడం లేదు. ఏటా నామమాత్రంగా మద్దతు ధర పెంచుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి. – మేక అశోక్రెడ్డి రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఫ జిల్లా రైతులపై రూ.25 కోట్లకుపైగా అదనపు భారం ఫ కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ.500 వరకు పెంపు ఫ యూరియా, డీఏపీ ధరలు యధాతథంగా వానాకాలం–2026 సాగు అంచనా (ఎకరాల్లో..) వరి 3,05,000 పత్తి 1,40,000 కందులు 5,000 ఇతర పంటలు 25,000 అవసరమైన ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో..) యూరియా 37,766 డీఎపీ 15,563 ఎస్ఎస్పీ 1,868 పోటాష్ 6,225 కాంప్లెక్స్ ఎరువులు 24,900 -
పోచంపల్లిలో ట్రైనీ ఐఏఎస్ల పర్యటన
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ పరిశ్రమ తీరు తెన్నులను తెలుసుకునేందుకు శుక్రవారం 2025 బ్యాచ్కు చెందిన ఆరుగురు ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోచంపల్లిలో పర్యటించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఓరిఝెంటేషన్ శిక్షణ పొందుతున్న వీరు క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం పోచంపల్లిలోని టూరిజం పార్కు, చేనేత సహకార సంఘం, కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, చేనేత గృహాలను సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. వస్త్రోత్పత్తుల మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత పథకాలపై ఆరా తీశారు. భూదానోద్యమ చరిత్ర, ఇక్కత్ వస్త్రాల ద్వారా పోచంపల్లికి ఉన్న ఖ్యాతిని తెలుసుకున్నారు. వీరి వెంట చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ వెంకట్రెడ్డి, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు ఉన్నారు. యాదగిరీశుడి సేవలో.. యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రైనీ ఐఏఎస్ అధికారులు హరి ప్రసాద్, సురేష్, సాయి శివాని, సచిన్ బీజీ, శ్రీకాంత్రెడ్డి, పవన్ కుమార్లు శుక్రవారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరికి తహసీల్దార్ గణేష్ నాయక్ స్వాగతం పలికారు. -
కారు ఢీకొని దుర్మరణం
నాగారం : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని కారు ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన బుధవారం రాత్రి సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం మండలంలోని నాగారం బంగ్లా గ్రామం వద్ద చోటు చేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంబంగ్లా గ్రామానికి చెందిన పాశం శాంతమ్మ (80) అదే గ్రామంలో తన కుమారుడు పాశం యాదవరెడ్డి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా సూర్యాపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భగవాన్నాయక్ తెలిపారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న రఘువరేంద్ర తీర్థ స్వామిజీ
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని కర్ణాటకలోని భీమ కంటే మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీశంకర్ ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు సురేంద్రచార్యులు సమక్షంలో అర్చక బృందం ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను రఘు వరేంద్ర తీర్థ స్వామిజీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. స్వామిజీకి అర్చక బృందం వేద పారాయణం నిర్వహించారు. ఈఓ భవానీశంకర్ లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య
సూర్యాపేటటౌన్ : అప్పుల బాధతో అపార్ట్మెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని కృష్ణాటాకీస్ సమీపంలో బండారు బాలకృష్ణ(43) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం సాయంత్రం తన అక్క వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి తన అక్క నివాసముంటున్న మున్సిపల్ కాంప్లెక్స్ వెనుక గల క్షేత్ర అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. నేరుగా లిప్టులో ఐదో అంతస్తుకు వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ చూడలేదు. గురువారం ఉదయం అపార్ట్మెంట్ వాచ్మెన్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు ప్యాంట్ జేబులో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకు రూ.10లక్షల వరకు అప్పు ఉందని, కొంతకాలంగా మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాని రాశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. మృతుడు అవివాహితుడు. రూ.10లక్షల వరకు అప్పు ఉందని సూసైడ్ నోట్ రాసిన మృతుడు -
విద్యాశాఖను ప్రథమ స్థానంలో నిలపాలి
భువనగిరి: జిల్లా విద్యాశాఖను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి మండల విద్యాధికారులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి కోరారు. గురువారం భువనగిరి పట్టణంలో మండల విద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలును విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. బడిబాట కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులను వినియోగించుకుని ఈ నెల 12వ తేదీన పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను ప్రభుత్వం జపాన్, సింగపూర్ దేశాల పర్యటనలకు తీసుకెళ్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారులు పెసరు లింగారెడ్డి, శ్రీహరి అయ్యంగార్, జానీ అప్ఘన్, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో గురువారం లెక్కించారు. ఈ లెక్కింపులో భాగంగా రూ.3,18,37,261 నగదు వచ్చిందని ఈఓ తెలిపారు. మిశ్రమ బంగారం 179 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోలు వచ్చినట్లు వెల్లడించారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు సైతం హుండీల్లో లభించాయన్నారు. ఈ హుండీ ఆదాయం 30 రోజులదని ఈఓ భవానీశంకర్ పేర్కొన్నారు. వడదెబ్బతో ఇద్దరు మృతితిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన పోతరాజు దానయ్య(61) వడదెబ్బతో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మిర్యాలగూడ పట్టణంలో.. మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్నగర్కు చెందిన రాపోలు పుల్లారావు(47) అద్దె ఇంట్లో నివాసముంటూ గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎండల తీవ్రతకు పుల్లారావు వడదెబ్బకు గురై గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ట్రాక్టర్ చోరీ చేసేందుకు యత్నంఫ దొంగను పట్టుకున్న గ్రామస్తులు చిట్యాల : వ్యవసాయ పొలం వద్ద పార్కింగ్ చేసిన ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసి తీసుకెళ్తూ కారును ఢీకొట్టా డు.. గ్రామస్తులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గురువారం జరిగింది. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పొట్లపల్లి లింగయ్య తన ట్రాక్టర్ను పొలం వద్ద పార్కింగ్ చేసి ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆ ట్రాక్టర్ను దొంగిలించి డ్రైవింగ్ చేసుకుంటూ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి పైకి వచ్చే క్రమంలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఆ దొంగతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఆ ట్రాక్టర్ను చోరీ చేసి తీసుకెళ్తున్నట్లు గుర్తించి.. దొంగ కాళ్లు, చేతులు కట్టేసి వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. కాగా చోరీకి పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. -
ప్రభుత్వ పాఠశాలకు పంపే వారికే ఇందిరమ్మ ఇళ్లు
భూదాన్పోచంపల్లి: తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల కేటా యింపులో ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. గురువారం పోచంపల్లి మున్సిపాలిటీలోని 3వ వార్డులోగల రేవనపల్లిలో ప్రజాపాలన ప్రగతి నివేదిక వార్డుసభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, సన్నబియ్యం అన్ని సంక్షేమ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. నాణ్యమైన వైద్యసేవల కోసం సమీపంలో ఉన్న బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాంతో స్థానికులు స్పందిస్తూ పీహెచ్సీలో రోగులను పట్టించుకోవడంలేదని చెప్పడంతో అడిషనల్ కలెక్టర్ స్పందించి వెంటనే మండల వైద్యాధికారిణి శ్రీవాణికి ఫోన్చేసి సభకు పిలిపించారు. తమ తీరును మార్చుకొని రోగులకు నాణ్యమైన సేవలందించి వారి మన్ననలు పొందాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో మౌళిక వసతులు కల్పించి త్వరలో లబ్దిదారులకు ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.రెండో విడతలో కేవలం మున్సిపాలిటీలకు 40శాతం ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చెప్పారు. బస్వలింగేశ్వరకాలనీలో నిర్మించుకొని నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని, కొత్తగా నిర్మించుకునే వారికి అనుమతులను ఇప్పించాలని కర్నాటి పురుషోత్తం ఆధ్వర్యంలో కాలనీవాసులు అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, స్థానిక కౌన్సిలర్ రావుల జంగయ్య, కోఆప్షన్సభ్యురాలు రసూల్బీ, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్, వార్డు ఆఫీసర్ రావీష్, రావుల అనిల్ పాల్గొన్నారు. ఫ అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు -
దివికెగిసిన హక్కుల బాటసారి
మిర్యాలగూడ : ప్రజల హక్కుల కోసం దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసిన మానవ హక్కుల నేత పొన్నూరు సుబ్బారావు(92) తుది శ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆయన అనారోగ్య కారణాలతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. 1934 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో జన్మించిన సుబ్బారావు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1956లో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం 1971లో ఇంగ్లిష్ లెక్చరర్గా ప్రమోషన్ పొందిన ఆయన 1982లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలో చైతన్య పాఠశాలను స్థాపించి అనేక మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన సుబ్బారావు మార్క్సిస్టు భావజాలంలో, శాసీ్త్రయ దృక్ఫదంతో మిర్యాలగూడ ప్రాంత ప్రజాస్వామిక ఉద్యమాలలో కీలకపాత్ర పోషించారు. ప్రజాస్వామిక వాదులతో కలిసి చైతన్య సమాఖ్యను స్థాపించి అనేక సామాజిక ఉద్యమాలకు పునాదులు వేశారు. మానవ హక్కుల నేతలు అజంఅలీ, బాలగోపాల్లతో కలిసి రెండున్నర దశాబ్ధాలుగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.. కాగా పెద్ద కుమారుడు గతంలోనే మృతిచెందాడు. నాకు ఇంగ్లిష్ బోధించారు : మాజీ మంత్రి జానారెడ్డి పొన్నూరు సుబ్బారావు మృతి తనకు తీరని లోటని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. సుబ్బారావు మృతిచెందిన విషయం తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులను జానారెడ్డి ఫోన్లో పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. పొన్నూరు సుబ్బారావు వద్ద వద్ద శిష్యరికం పొందే అవకాశం లభించడం తన జీవితంలో మరిచిపోలేనని జానారెడ్డి అన్నారు. తాను మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10వ తరగతులు చదివినప్పుడు పొన్నూరు సుబ్బారావు తనకు ఇంగ్లిష్ పాఠాలు బోధించారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు. నేడు కామినేని ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత సుబ్బారావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో శుక్రవారం ఉదయం 8గంటలకు నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నారు. ఆయన భార్య సత్యవతి 2003 మే నెలలో, పెద్ద కుమారుడు శరత్ 2019 సెప్టెంబర్లో మృతిచెందగా వారి భౌతికకాయాలను సైతం అప్పట్లో మెడికల్ కళాశాలలకు అప్పగించారు. సుబ్బారావు మృతి పట్ల పలువురి సంతాపం ప్రముఖ విప్లవ కవి వరవరరావు, ప్రజా కవి గోరటి వెంకన్న సుబ్బారావు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి సంతాపం ప్రకటించారు. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీలు కెతావత్ శంకర్నాయక్, కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీషనవీన్, మానవ హక్కుల నేత జీవన్కుమార్, సీడీ.రవికుమార్, డాక్టర్లు రాజు, మువ్వా రామారావు, నాయకులు వేణుగోపాల్రెడ్డి, గురవయ్య, మోహన్, అంబటి నాగయ్య, వేనేపల్లి పాండురంగారావు, కస్తూరి ప్రభాకర్, రామయ్య, సుధాకర్, రమేష్, అజయ్, కిరణ్మయి, నీరజ, నజీర్, ఉదయ్ తదితరులు సుబ్బారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఫ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసిన పొన్నూరు సుబ్బారావు ఫ మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటం -
మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ధ్యేయం
సాక్షి, యాదాద్రి : మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు సంప్రదాయ వృత్తులకు మాత్రమే పరిమితం కాకుండా ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన వ్యాపార అవకాశాలను అన్వేషించాలనిసూచించారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, డిజిటల్ సేవలు, సూక్ష్మ పరిశ్రమలు, పర్యావరణ హితం ఉత్పత్తుల తయారీ, సేవా రంగం, ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలన్నారు. మహిళా సంఘాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న అన్ని పథకాల సమాచారాన్ని ఒక సమగ్ర పుస్తక రూపంలో రూపొందించి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీరన్న, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్, వ్యవసాయ అధికారి రమణారెడ్డి, హార్టికల్చర్ అధికారి హేమలత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి రచ్చ పల్లవి, కోశాధికారి అలివేలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
గర్భిణి మృతదేహంపై పుస్తెలతాడు మాయం
భువనగిరి : మృతిచెందిన గర్భిణి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయమైన ఘటన భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామానికి చెందిన దాసరి నాగరాజు భార్య సుశ్మిత(36) 8 నెలల గర్భిణి. గురవారం తెల్లవారుజామున ఆమెకు దమ్ము రావడంతో కుటుంబ సభ్యులు వలిగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గర్భిణిని పరిశీలించి అప్పటికే ఆమెతో పాటు కడుపులోని బిడ్డ కూడా మృతిచెందినట్లు తెలిపారు. కనిపించని పుస్తెలతాడు.. సుశ్మిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలోని మార్చురీకి తరలించే క్రమంలో ఒంటిపై బంగారు ఆభరణాలను పరిశీలించుకోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించగా. మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహించొద్దని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పరిశీలన.. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అనంతరం వార్డుల్లో ఉన్న సిబ్బందిని, సైక్యూరిటీని విచారించారు. మృతదేహాన్ని వార్డు నుంచి మార్చురీకి మార్చే క్రమంలో పుస్తెలతాడును ఆస్పత్రి సిబ్బందే మాయం చేసి ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ఒకవేళ ఆస్పత్రి సిబ్బందే పుస్తెలతాడు దొంగిలించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఫ పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఫ న్యాయం చేయాలని ధర్నా ఫ భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఘటన -
మార్క్ఫెడ్లో ఎన్డీసీఎంఎస్ విలీనం
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (ఎన్డీసీఎంఎస్)ను ప్రభుత్వం మార్క్ఫెడ్లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీఓ త్వరలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఎన్డీసీఎంఎస్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నిడమనూరు, హుజూర్నగర్, సూర్యాపేట, దేవరకొండలో విలువైన గోదాములు, ఖాళీ స్థలాలను కొన్ని విక్రయించినప్పటికీ ఇంకా కొన్ని ఆస్తులు నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్ నాలుగు కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. విత్తనాలు, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు సేవలందిస్తూ సంస్థ లాభాలను గడిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం భువనగిరిలో సంఘానికి చెందిన గోదాములు, ఖాళీ స్థలాన్ని విక్రయించగా స్టేషన్ రోడ్డులో దుకాణాల సముదాయం ప్రస్తుతం ఉంది. ఇందులో 13 మడిగెలు ఉన్నాయి. 1987వ సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రేడింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్డీసీఎంఎస్లో 120 మంది ఉద్యోగులు పని చేసేవారు. సహకార సంఘాలు రావడంతో ఎన్డీసీఎంఎస్పై ఉన్న బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. సంఘానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్తో ప్రయోజనం లేదని గుర్తించి వ్యయభారం తగ్గించుకునేందుకు మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీసీఎంఎస్ను మార్క్ఫెడ్లో విలీనం చేయడంతో సంస్థకు ఉన్న ఆస్తులు మార్క్ఫెడ్ పరం కానున్నాయి. మార్క్ఫెడ్లో విలీనమైతే రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థ మరిన్ని వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఫ రూ.కోట్లాది విలువ గల ఆస్తులు ఇక మార్క్ఫెడ్ చేతిలోకి ఫ రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం -
పదిలో సత్తా.. విమానంలో విహార యాత్ర
తిప్పర్తి : ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఊహించని బహుమతి ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలో ఇచ్చిన మాటను నెరవేర్చారు. ఈ మేరకు తిప్పర్తి మండలం నుంచి 530కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నెల విమానంలో విహార యాత్రకు విశాఖపట్నం తీసుకెళ్లారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల నుంచి ఏశబోయిన శ్రీజ, మానస, నరాల రజిత, వి. చరణ్, లహరిక, కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల నుంచి కె. వర్షిత, మధుశ్రీ, టి. వైశాలి, ప్రణీత, ఎం. నందిని, బాలికల ఉన్నత పాఠశాల నుంచి బుర్రి శ్రీనిధి, సింగం స్రవంతి, తిప్పర్తి మోడల్ స్కూల్ నుంచి శ్రావ్య మొట్టమొదటిసారి విమానం ఎక్కారు. విశాఖపట్నం టూర్కు విద్యార్థులు ఈ 13మంది విద్యార్థులు గత నెల 22న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరి విశాఖపట్నంలో దిగారు. రెండు రోజుల పాటు అరకు, బొర్రా గుహలు, సింహచలం, ఆర్కే బీచ్ తదితర ప్రదేశాలను చూసి తిరిగి వచ్చారు. తాము విమానం ఎక్కుతామని కలలో కూడా ఉహించలేదని, భూమి పైనుంచి విమానాన్ని చూసి ఆనందపడే తమకు నిజమైన విమానం ఎక్కడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటే ఇంకా ఎన్నో దేశాలు తిరగవచ్చని అనిపించిందన్నారు. తమలాగే మరికొంత మంది పేద విద్యార్థులను కూడా ప్రోత్సహించాలని మంత్రిని విద్యార్థులు కోరారు. నిజ జీవితంలో విమానం ఎక్కుతానని కలలో కూడా ఉహించలేదు. అసలు విమానం దగ్గర నుంచి చూస్తానని అనుకోలేదు. అలాంటింది నేరుగా విమానంలో ప్రయాణించడం మాటల్లో చెప్పలేకపొతున్నా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాలాంటి పేద విద్యార్దులను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. – ఏశబోయిన శ్రీజ, తిప్పర్తి ఉన్నత పాఠశాల చదువుతోనే ఏదైనా సాధించవచ్చని ఈ విమాన ప్రయాణం ద్వారా తెలుసుకున్నాను. పదో తరగతిలో జిల్లా టాపర్గా నిలిచాను. కష్టపడి చదివితే ఉన్నత స్థాయిలో ఉండవచ్చని విమాన ప్రయాణం ద్వారా అర్ధమైంది. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాకు బాసర ఐఐఐటీలో సీటు వచ్చింది. – బుర్రి శ్రీనిధి, బాలికల ఉన్నత పాఠశాల, తిప్పర్తి బొర్రా గుహల్లో తిప్పర్తి మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులువిమానాశ్రయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం కల్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే స్ఫూర్తి కలిగిందన్న విద్యార్థులు -
యాదగిరిగుట్టలో 115 రిజిస్ట్రేషన్లు
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచింది. ఈ రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ఎగబడ్డారు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం 115 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగానే అయ్యిందని సబ్ రిజిస్టార్ ఖాదర్ పాషా వెల్లడించారు. క్రయవిక్రయదారులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు పేర్కొన్నారు. 18ప్రాంతాల్లో మోస్తరు వర్షం ఫ అత్యధికంగా వలిగొండలో 36.3 మి.మీ. వర్షపాతం భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా గురువారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. జిల్లాలోనే అత్యధికంగా వలిగొండ మండల కేంద్రంలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొమ్మలరామారంలో 34.0 మి.మీ, ఇదే మండలంలోని మర్యాలలో 26.8 మి.మీ చొప్పున మోస్తరు వర్షం కురిసింది. మోత్కూర్లో 9.8 మి.మీ, తుర్కపల్లి మండలం మన్నెవారి తుర్కపల్లిలో 9.0 మి.మీ, ఆత్మకూర్లో 5.3 మి.మీ, వలిగొండ మండలం వెంకట్పల్లిలో 5.0 మి.మీ, మోత్కూర్ మండలం దత్తప్పగూడెంలో 4.0 మి.మీ వర్షం కురిసింది. భువనగిరి మండలం హన్మాపూర్, అడ్డగూడూరులలో 3.5 మి.మీ చొప్పున, చౌటుప్పల్, నారాయణపూర్లలో 3.3 మి.మీ చొప్పున, నారాయణపూర్ మండలం జనగాంలో 3.0 మి.మీ, భువనగిరి కలెక్టరేట్ పరిసరాల్లో 2.5 మి.మీ మేర వర్షం పడింది. పోచంపల్లి మండలం జలాల్పూర్, ఆలేరు మండలం కొలనుపాకలో 1.5 మి.మీ చొప్పున, షారాజీపేటలో 1.0 మి.మీ, గుండాలలో అత్యంత తక్కువగా 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం తుర్కపల్లి: వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ విమర్శించారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే జిల్లాలోమట్టిదందా కొనసాగుతోందని ఆరోపించారు. సమావేశంలో కొక్కొండ లక్ష్మీనారాయణ, చాంద్పాషా,యాట పెంటయ్య, కందుకూరి చెల్మయ్య, సత్యనారాయణ, వెంకటేశం, అకుల రమేష్, రమేష్ నాయక్, భిక్షపతి, భాను పాల్గొన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, బాల భోగం వంటి పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
ఫిట్నెస్ లేకుంటే సీజ్
భువనగిరి: ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బడి బస్సుల భద్రతపై రవాణాశాఖ నిఘా పెంచింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 380 స్కూల్ బస్సుల్లో ఇప్పటివరకు 250 వాహనాలు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయి. ఏడురోజులే గడువు ఉండడంతో మిగిలిన బస్సులు కూడా నిబంధనల ప్రకారం ఫిట్నెస్ నిరూపించుకోవాలని, లేదంటే రోడ్డెక్కిన వెంటనే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజూ సామర్థ్య పరీక్షలు ఏటా మే 15వ తేదీ నాటికి బడి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగుస్తుంది. విద్యాలయాలు ప్రారంభమయ్యే నాటికి యాజమాన్యాలు తమ బడిబస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అదికారులు ఆర్టీఏకార్యాలయాల్లో మే 16వ తేదీ నుంచి రోజూ బడిబస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.బస్సుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణపత్రాలు, విద్యార్థులకు వసతులు సక్రమంగా ఉన్నాయా? భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అని పరిశీలిస్తారు. ఎంవీఐలు బస్సులను నడిపి ఫిట్నెస్ను తనిఖీ చేస్తున్నారు. బస్సులకు ఏమైనామరమ్మతులు ఉంటే చేయించుకో వావాలని సూచించి వెనక్కి పంపించేస్తున్నారు. ఆ తరువాతే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ అందజేస్తున్నారు. ఈ ఏడాది మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నారు. బడి ఇన్చార్జి, ప్రిన్సిపల్, ఎంవీఐ సంతకాలు బడి బస్సు పై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సౌకర్యాలు తప్పనిసరి ● బడి బస్సులో అత్యవసర గ్లాస్ ద్వారం, మంటలార్పే పరికరాలు, ప్రథమ చికిత్స కిట్, పుస్తకాలు పెట్టుకునేందుకు హ్యాంగర్లు ● కిటికీల వద్ద ఇనుప గ్రిల్స్,ఫైర్ అలారం, మంటలార్పే వాటర్ స్ప్రింక్లర్లు ● పిల్లలు పట్టుకునేలా నిలువు స్తంభాలు, ఇండికేటర్ లైట్లు, అద్దాలు, తలుపుల వద్ద లాకింగ్ సిస్టం ● పిల్లలు ఎక్కేందుకు వీలుగా పటిష్టమైన ఫుట్బోర్డు, మెకానిక్ పరికరాలు ఉండాలి ● ఇంజన్ సామర్థ్యం బాగా ఉండాలి ఫ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ఫ జిల్లావ్యాప్తంగా 380 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫ ఇప్పటి వరకు సర్టిఫికెట్ పొందింది 250 బస్సులకే ఫ గడువు ఏడురోజులే..బడి బస్సులు ఈ నెల 11 తేదీ వరకు రవాణాశాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి.ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకుండా రోడ్ల పై బస్సులు నడిపితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను స్వాధీనం చేసుకుంటాం. ఈ నెల 12నుంచి తనిఖీలు చేపడుతాం. –ఎస్ నరేష్, జిల్లా రవాణా అధికారి -
ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
గట్టుప్పల్ : మండలం పరిధిలోని తేరట్పల్లి గ్రామానికి చెందిన బొట్ట మణివర్మ(19) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణివర్మ మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజులుగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాకుండా సెల్ఫోన్ చూస్తూ ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి అప్పటికే మృతిచెందాడు. బుధవారం మృతుడి తండ్రి బొట్ట యాదయ్య ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. ● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
పంటలకు మేలు చేసే వేప
నడిగూడెం : వేపలో ఔషధ గుణాలతో పాటు పర్యావరణానికి మేలు చేసే సుగుణాలున్నాయి. వేప నుంచి వేరుచేసిన రసాయనాలు, క్రిమికీటకనాశన గుణాలు కలిగి ఉండడంతో రసాయన కీటక నాశినుల స్థానంలో దీని వినియోగం పెరిగింది. వేప సంబంధ పురుగు మందులు మార్కెట్లో లభ్యమవుతున్నా రైతు తమ ఇంటి వద్దే తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే విధానాన్ని మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ వివరించారు. వేపగింజల కషాయం తయారీ వేపలో ఉండే అజాడిరెక్డిన్ అనే పదార్థం పురుగుల జీవిత దశలపై ప్రభావాన్ని చూపుతుంది. వేప ద్రావణాన్ని అన్ని పంటల్లోని లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, నామాల పురుగు, ఆకు ముడత పురుగు, రసం పీల్చే పురుగుల నివారణలో వాడుకోవచ్చు. వేప ద్రావణాన్ని నారుమడులు, పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. కావాల్సిన పదార్థాలు : వేప గింజలు ఐదు కిలోలు, కుంకుడు కాయలు 500 గ్రాములు, సరుపు పొడి 100 గ్రాములు తయారు చేయు విధానం : నీడలో బాగా ఎండిన వేప గింజలను పైపొట్టు తీసి మెత్తగా రుబ్బి పిండి చేయాలి. ఈ పించిన ఒక మూటలో కట్టి 10 లీటర్ల నీటిలో 10 నుంచి 12 గంటలు నానబెట్టాలి. తర్వాత మూట నుంచి 15–20 నిమిషాల పాటు ద్రావణాన్ని పిండాలి. మధ్య మధ్యలో మూటను నీటిలో ముంచుతూ ద్రావణాన్ని సేకరించాలి. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన ద్రావణానికి 100 గ్రాముల సరుపుపొడి, లేదా అర లీటరు కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ వేప గింజల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి. ఉపయోగాలు ఫ వేప గింజలను ప్రస్తుతం మే, జూన్లో సేకరించుకొని గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి. ఈ విధంగా సేకరించిన వేప గింజలను సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ వేప గింజల ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారీ చేయాలి. నిల్వ ఉంచొద్దు. ఫ పంట దశను, పురుగుల ఉధృతిని బట్టి మోతాదు పెంచుకోవాలి. ఫ వేప ద్రావణాన్ని పండ్ల తోటల్లో కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఫ వేప ద్రావణం చేసిన పిప్పిని ఇంట్లో ఉన్న పెరటి మొక్కలు, కుండీల్లో ఉన్న మొక్కలకు వేసుకోవచ్చు. అన్ని పంటల్లోనూ వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు ఉపయోగించవచ్చు. ఫ పంట తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగులు, చిన్న లార్వాల నియంత్రణలో వేప ద్రావణాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫ పంట పెరిగే కొద్దీ ద్రావణం మోతాదు పెంచుకొని పిచికారీ చేయాలి. ఫ పప్పు ధాన్యాల్లో ఎండిన వేపాకుల పొడి, గింజల పొడి లేదా నూనె కలిపి పురుగులు సోకకుండా నాలుగు నెలల పాటు భద్రపరచవచ్చు. పచ్చి ఆకు ఎరువుగానే కాక పురుగులు ఆశించకుండా పనిచేస్తుంది. వేప పిండిని ఎరువుగా వాడినప్పుడు అది వేర్ల వద్ద ఉన్న చెద పురుగులను, నులిపురుగుల నుంచి రక్షిస్తుంది. వేప పిండి పొలంలో వేయడంతో పంటలకు మేలు చేసే పురుగుల సంఖ్య పెరుగుతుంది. నేల స్వభావం కూడా అభివృద్ధి చెందుతుంది.ఫ వేప ద్రావణాన్ని తక్కువ ఖర్చుతో ఇంటివద్దే తయారు చేసుకోవచ్చు ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ -
విద్యార్థిని బలిగొన్న విద్యుత్ తీగలు
చండూరు : వ్యవసాయ భూమిలో వేలాడుతున్న 11కేవీ విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుదాఘాతానికి గురై పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన చండూరు మండలం చొప్పరివారిగూడెంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పరివారిగూడేనికి చెందిన చొప్పరి వెంకన్న చిన్న కుమారుడు చందు(16) నల్లగొండలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్వగ్రామంలోనే ఉంటున్న చందు బుధవారం ఉదయం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇటీవల వచ్చిన గాలి దుమారానికి 11కేవీ విద్యుత్ వైర్లు వదులై కిందకు వేలాడుతుండగా.. చందు వాటిని తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్లే వారు గమనించి చందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. -
జర్నలిస్టులకు భరోసా కల్పించాలి
నకిరేకల్ : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణరెడ్డి కోరారు. నకిరేకల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ముందుగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టులు నకిరేకల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కమిటీ నాయకుడు ప్రభాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శులు కె.నాగయ్య, బుడిగె శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, సాంబశివారెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు సతీష్, సంఘం ప్రతినిధులు రేపాల సతీష్, పరమేష్, బయన్న, కందగట్ల శ్రీధర్, బుడిగె సైదులు, శ్రీనివాస్రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఫ ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ -
ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆందోళన
మోత్కూరు: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, లారీలు అందుబాటులో లేక పోవడంతో మోత్కూరు మండలం పాలడుగు గ్రామ రైతులు బుధవారం రోడ్డెక్కారు. ఉదయం 7 గంటల నుంచే వలిగొండ–తొర్రూరు జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ ఆందోళన రెండు గంటలకు పైగా కొనసాగడంతో వాహనాలు నిలిచి పోయాయి. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేసి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ మిల్లులకు తరలించ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు రాక పోవడంతో ధాన్యం కల్లాల్లోనే ఉందని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. తహసీల్దార్ జ్యోతి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ధాన్యం మిల్లులకు తీసుకెళ్లిన తరువాత కూడా కోత విధిస్తున్నారని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. లారీ కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
నేటి నుంచి గ్రామ సభలు
సాక్షి, యాదాద్రి : వానాకాలం సీజన్ను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు, వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4వ తేదీ (గురువారం), 6, 8, 10వ తేదీల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో ప్రధానంగా పారిశుద్ధ్యం– విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు, భూములు, వ్యవసాయం, ఉపాధిహామీ ఇలా ఎనిమిది అంశాలపై చర్చించనున్నారు. నాలుగు రోజుల్లో నిర్వహించేలా.. జిల్లావ్యాప్తంగా 427 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించి ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో వందశాతం గ్రామపంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సభల్లో చర్చించే అంశాలు ● పారిశుద్ధ్యం–విద్యుత్: గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, మురికి కాలువల పూడికతీత, దోమల నివారణకు నూనె గుళికల తయారీ, వీధి దీపాల నిర్వహణ చేపట్టాలి. పడిపోయేలా ఉన్న ఇళ్లను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు ‘చెత్త, మురుగు నీటి నిర్వహణ–2026’ నిబంధనలను పక్కాగా అమలు చేయాలి. ● స్వచ్ఛమైన తాగునీరు: ఎత్తయిన నీటి నిల్వ తొట్టెలను నిర్ణీత వ్యవధిలో శుభ్రపరచాలి. పైపుల లీకేజీలను అరికట్టి, క్లోరినేషన్ చేసిన తాగునీటిని ప్రజలకు అందించాలి. ● ఓటర్ల జాబితా: రాబోయే జనగణన 2027కు సన్నాహాలు చేయడంతో పాటు ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ● వ్యవసాయం: వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించాలి. పంటల మార్పిడి పద్ధతులను ప్రోత్సహించాలి. ● ఉపాధి హామీ, నీటి సంరక్షణ: జల సంరక్షణ , మన సంరక్షణలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ కట్టడాలు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ● వైద్యం – ఆరోగ్యం: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రుతు సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ● విద్య, గృహ నిర్మాణం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టాలి, అల్పాహార భోజన పథకం అమలు చేయాలి. గృహాలపై సౌర విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాలు, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. ● శాంతిభద్రతలు: గ్రామాల్లో మత్తు పదార్థాల నివారణ, రోడ్డు ప్రమాదాల నిరోధం, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక నిఘా ఉంచాలి. మున్సిపాలిటీల్లో.. ● ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 అమలు ● ఇంకుడు గుంతల నిర్మాణం ● మురుగు కాలువలు శుభ్రం చేయడం, పూడిక తీత పనులు. ● వర్షాకాల సంసిద్ధత పై కార్యాచరణ ప్రణాళిక ● మంచి నీటి సరఫరా, నిర్వహణ. ● నీరు నిల్వ ఉండే ప్రాంతాల నివారణ, పారిశుద్ధ్యం ● రోడ్ల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు. ● మొక్కలు, పర్యావరణ సంరక్షణ , ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారం.గ్రామసభల నిర్వహణను అధికారులు అత్యంత ప్రాధాన్యత కలిగిన విధిగా భావించాలి. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, విస్తరణ అధికారులు, అన్ని సంబంధిత శాఖల అధికారులు నిర్దేశిత కాలపట్టిక ప్రకారం గ్రామసభలకు తప్పనిసరిగా హాజరుకావాలి. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విధులకు హాజరుకాకపోయినా, బాధ్యతల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటాం. – కలెక్టర్ అనురాగ్ జయంతి ఫ 4,6,8,10 తేదీల్లో నిర్వహణ ఫ ఎనిమిది అంశాలపై చర్చ ఫ ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారుల ప్రణాళిక -
పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగొస్తుండగా..
నార్కట్పల్లి : మినీ ట్రావెల్స్ బస్సులో పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగొస్తూ డీసీఎంను ఢీకొనడంతో బాలిక మృతిచెందింది. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై నార్కట్పల్లి శివారులోని ఫ్లైఓవర్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల నరేష్ కుటుంబంతో పాటు అదే గ్రామానికి చెందిన మరికొందరు హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వారంతా కలిసి మినీ ట్రావెల్స్ బస్సులో వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా.. బుధవారం అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై నార్కట్పల్లి శివారులోని ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై ఆపిన గుర్తుతెలియని వాహనాన్ని డీసీఎం ఢీకొని రహదారిపైనే నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎంను రోడ్డు పక్కకు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో వెనుకనే వస్తున్న మినీ ట్రావెల్ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనగందుల నరేష్ కుమార్తె ద్రోణిక (10) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు 108 వాహనంలో స్థానిక కామినేని హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. వాహనాలు ఆపడం వల్లే ప్రమాదాలు.. అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై రాత్రివేళ హోటళ్లు తెరిచి ఉండడంతో డ్రైవర్లు లారీలను రోడ్డుపైనే ఆపుతుండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు రాత్రివేళ పర్యవేక్షణ చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా వాహనాలు ఆపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు. ఫ డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు ఫ బాలిక మృతి.. మరో 14 మందికి గాయాలు ఫ నార్కట్పల్లి శివారులో ఘటన -
చెక్బౌన్స్ కేసులో జైలుశిక్ష, జరిమానా
కోదాడరూరల్ : చెక్బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ బుధవారం కోదాడ కోర్టు తీర్పు వెలువరించింది. 2016లో కోదాడ పట్టణానికి చెందిన కర్నాటి అశోక్ వద్ద ఎలగందుల శ్రీనివాసరావు రూ.11 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుకు సంబంధించి శ్రీనివాసరావు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును అశోక్ బ్యాంకులో వేయగా ఖాతాలో డబ్బులు లేక బౌన్స్ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు అప్పుగా తీసుకున్న రూ.11లక్షలు తిరిగి చెల్లించాలని లేదంటే మరో నెల రోజులు జైలుశిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు వెలువరించింది. వడదెబ్బతో వృద్ధుడు మృతిగుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన బత్తిని చినఅంజయ్య(70) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో అస్వస్థతకు గురై బుధవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తుంగతుర్తికి ఏసీబీ అధికారులుతుంగతుర్తి : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు బంధువుల ఇంట్లో తనిఖీ కోసం బుధవారం ఏసీబీ అధికారులు తుంగతుర్తికి వచ్చారు. తుంగతుర్తిలో ఉంటున్న భుజంగరావు మామ దుగ్యాల రాజేశ్వరరావు(రిటైర్డ్ పోలీస్ అధికారి) ఇంట్లో తనిఖీ చేసేందుకు రాగా.. ఇంట్లో ఎవరూ లేరని, తాళం వేసి ఉన్నట్లు ఏసీబీ అధికారి బాలకృష్ణ తెలిపారు. చిన్నారులను గాయపర్చిన కోతులుశాలిగౌరారం : మండల కేంద్రంలో బుధవారం కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన మనస్వి తన ఇంటిపై ఆరేసిన బట్టలు తీసుకొచ్చేందుకు వెళ్లగా కోతులు ఒక్కసారిగా ఆ చిన్నారిపై దాడి చేయడంతో చేతికి గాయాలయ్యాయి. అదేవిధంగా తమ కిరాణ షాపు ముందు కూర్చున్న సాయిపై కూడా కోతులు దాడి చేయడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలినల్లగొండ టూటౌన్ : పర్యావరణ పరిరక్షణకు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కృషి చేయాలని ఎంజీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు, ఎంజీయూ జాతీయ సేవా పథకం విద్యార్థులకు పర్యావరణ కాలుష్య నియంత్రణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, కాలుష్యంపై ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్లు విజయ్కుమార్, రామచంద్ర, ఎం. ఆనంద్, షరీఫ్, శ్రీనివాస్, రమేష్నాయక్, కట్టా కిరణ్మయి, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఆసరా.. నిరాశే!
భువనగిరి: కొత్త ఆసరా పింఛన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులకు మరోసారి నిరాశే ఎదురైంది. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం తీపికబురు చెబుతుందని ఆశించిన అర్హుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. అసలు పింఛన్లు ఇప్పట్లో వస్తాయా? రావా? అన్న అయోమయం నెలకొంది. ప్రకటనలకే పరిమితమైన ఈ కొత్త పింఛన్ల కోసం.. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హులు మళ్లీ నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్పష్టత రాక.. గ్రామీణ ప్రాంతాల్లో వయస్సు పైబడి ఎంతో మంది వృద్ధులు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులు పై అధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన ప్రకటనతో తమకు ఇక ఆసరా ఫించన్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం జాప్యంతో మళ్లీ ఎదురు చూపులు తప్పే పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. ఐదు వేల మందికి వచ్చే అవకాశం ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల పింఛన్ పొందుతున్న వారు 96,425 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా కొత్తగా ఫించన్ మంజూరు చేస్తామని ప్రకటన చేయడంతో జిల్లాలో జనాభా, అర్హుల జాబితా ప్రకారం సుమారు 5వేల మందికి కొత్తగా పింఛన్ వచ్చే అవకాశం ఉంది. నిలిచిన ప్రక్రియ జూన్ 2న కొత్తగా పింఛన్ ఇస్తామని ప్రకటించిన దానికి సంబంధించి ప్రక్రియ ఎక్కడా ప్రారంభం కాలేదు.కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి గానీ అర్హులను ఎంపిక చేయడానికి గానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆప్షన్ ను ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త పింఛన్లకు సంబంధించిన ప్రక్రియ పై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఎ లాంటి ఆప్షన్ ఇవ్వలేదు. గతంలో కొత్తగా చేసుకున్న వారి దరఖాస్తులు మండల స్థాయిలోనే ఉన్నాయి. –నాగిరెడ్డి డీఆర్డీఓ ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలు వృద్ధులు 35,419 వితంతువులు 35,908 వికలాంగులు 12,435 కల్లుగీత కార్మికులు 5,548 చేనేత కార్మికులు 3,006 ఫైలేరియా 500 డయాలసిస్ 221 ఒంటరిమహిళలు 2,473 బీడీ కార్మికులు 915 ఫ ప్రకటనలకే పరిమితమైన కొత్త పింఛన్లు ఫ అవతరణ వేడుకల్లో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఫ అర్హుల ఎదురుచూపులు -
రేషన్ కార్డు ఇప్పిస్తానని.. అక్రమంగా భూమి పట్టా
సూర్యాపేట : రేషన్ కార్డు ఇప్పిస్తానని చెప్పి, తన కుమారుడు అక్రమంగా భూమి పట్టా చేసుకున్నాడని, దీనిని రద్దు చేయాలని భీంరెడ్డి సరోజనమ్మ బుధవారం ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈమేరకు ఆర్డీఓ వేణుమాధవ్కు వినతిపత్రం అందించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, తుంగతుర్తి మండలం గానుగుబండలో తమకున్న భూమిని ముగ్గురు కుమారులకు 11 ఎకరాల చొప్పున 33 ఎకరాల భూమిని పంచి ఇచ్చినట్లు తెలిపింది. మరో నాలుగు ఎకరాల భూమిని తమ పోషణ కోసం ఉంచుకున్నామని పేర్కొంది. 2020లో తన భర్త నారాయణరెడ్డి మరణించగా.. అప్పటి నుంచి కుమారులెవరూ తన బాగోగులు చూడలేదని, పెద్ద కుమార్తె చేరదీసిందని చెప్పింది. కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో 2023లో తన చిన్న కుమారుడు దయాకర్ రెడ్డి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడని, ఈ సమయంలో రేషన్ కార్డు ఇప్పిస్తానని చెప్పి తనను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా నా పేరు మీద ఉన్న భూమిని బదిలీ చేసుకున్నట్లు తెలిపింది. రైతుబంధు రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కింది. మోసపూరితంగా చేసుకున్న భూమి పట్టాను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని ఆమె ఆర్డీఓను కోరింది. ఫ పట్టా రద్దు చేయాలని ఆర్డీఓను ఆశ్రయించిన వృద్ధురాలు -
పోగొట్టుకున్న సెల్ఫోన్లు అప్పగింత
పెద్దవూర : పోగొట్టుకున్న సెల్ఫోన్లను ట్రేస్ చేసి కనిపెట్టిన పోలీసులు బాధితులకు అప్పగించారు. పెద్దవూర మండలంలోని బెట్టలతండా, గేమ్యనాయక్తండాకు చెందిన బాణావత్ శంకర్, షేక్ అబ్దుల్ మజీద్ నెల రోజుల క్రితం తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐఎంఈఐ నంబర్, సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్లను ట్రేస్ చేసి కనిపెట్టారు. ఈ మేరకు బుధవారం ఎస్ఐ గోపాల్రావు బాధితులకు సెల్ఫోన్లు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక నగరి.. మన యాదగిరి
సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గత ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్ట క్షేత్రం ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న యాదగిరిగుట్ట ఆలయం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైంది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా, మారుతున్న కాలానికి తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని రూ.1200 కోట్లతో పునఃనిర్మించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైటీడీ యాదగిరిగుట్ట దేవస్థానం చట్టం చేసింది. త్వరలో ప్రత్యేక పాలకమండలి రాబోతోంది. ప్రధానాలయాన్ని కృష్ణ రాతి శిలలతో నిర్మించారు. ఇంపైన ప్రాకారాలు, సొగసైన రాజగోపురాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ప్రధాన గోపురాన్ని స్వర్ణమయం చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను గండిచెరువుకు రప్పించి నారసింహుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో యాదగిరిగుట్టలో తిరు మాడవీధులు లేవు. సున్నంతో ఆలయాన్ని సుందరీకరించేవారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత యాదగిరీశుడి ప్రధానాలయాన్ని 4.30 ఎకరాల్లో నిర్మించారు. బ్రహ్మోత్సవ మండపం, మాడవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిఫ్ట్ నిర్మించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదర్శనకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరిక మేరకు నిత్య గిరి ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం యాదగిరి క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మే 31న సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆలయ చరిత్రలోనే సరికొత్త రికార్డు. పెరిగిన సదుపాయాలు, ఆలయ సుందరీకరణతో యాదాద్రి క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. ఆదాయం సైతం లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు పెరిగింది. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి.. యాదగిరి కొండ పైన ఉన్న విష్ణుపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా కొండ పైకి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని, భక్తులకు సరిపడా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. టీటీడీ తరహాలో వైటీడీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు పాలకమండలిని ప్రకటించలేదు. మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొండ కింద గండి చెరువు అభివృద్ధి, దుకాణాల సముదాయం, దేవస్థానం బస్టాండ్, ఎంట్రీ ఫ్లైఓవర్ వంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.ఫ తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట ఫ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1200కోట్లతో పునర్నిర్మాణం ఫ నృసింహుడి దర్శనానికి పెరిగిన భక్తులుయాదగిరిగుట్టలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లక్షమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాం. సీఎం ఇటీవల కొండపైన దీక్షాపరుల మండపం, పార్కింగ్, నిత్య కల్యాణ మండపం, వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు. భక్తుల కోరిక మేరకు క్షేత్రంలో వసతులు కల్పిస్తాం. – భవానీ శంకర్, ఈఓ, యాదగిరిగుట్ట -
చేనేత ఓటర్ల సంఖ్య 8,758
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని చేనేత సహకార సంఘాల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత, పవర్ లూమ్ సహకార సంఘాల సభ్యుల ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్కు జిల్లా అధికారులు పంపించారు. జిల్లాలోని 42 సహకార సంఘాల్లో 31 సహకార సంఘాల జాబితా పూర్తికాగా , ఆలేరు శివశంకర్ సిల్క్ సొసైటీ సభ్యత్వాల కోసం హైకోర్టును ఆశ్రయించింది. మిగతా సంఘాల్లో కొందరు సభ్యుల ఫొటోలు లేకపోవడంతో వాటిని సరిచేసి ఒకటి రెండు రోజుల్లో పంపిస్తున్నారు.కాగా చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో పెద్ద ఎత్తున ఓటర్ల సంఖ్య తగ్గింది. తుది జాబితా ప్రకారం జిల్లావ్యాప్తంగా 8758 ఓటర్లు కాగా ఇందులో 5556 మంది పురుషులు, 3202 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ జాబితా ఆధారంగానే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలివలిగొండ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం వలిగొండ మండలం నాగారంలోని వాసవీ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ధాన్యం లోడు లారీలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. లోడ్ తో వచ్చిన లారీలను ఎప్పటికప్పుడు అన్లోడ్ చేయాలన్నారు. అనంతరం లోతుకుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. స్కూళ్లు తెరిచే సమయం ఆసన్నమైనందున మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాల వసతి గృహంలో పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారిణి రోజా రాణి, జిల్లా విద్యాధికారి భిక్షపతి, స్థానిక సర్పంచ్ గండు రాములు యాదవ్, స్థానిక తహసీల్దార్ దశరథ, పాఠశాల ఎస్ ఓ దుర్గ, ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. రవాణా శాఖ అధికారిగా నరేష్ బాధ్యతల స్వీకరణభువనగిరి: జిల్లా రవాణాశాఖ అధికారిగా ఎస్. నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సంగారెడ్డి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ డీటీఓగా విధులు నిర్వహించిన సాయికృష్ణ బదిలీపై నాగర్కర్నూల్ జిల్లాకు ఎంవీఐగా వెళ్లారు. ఎంవీఐగా విధులు నిర్వహించిన ఇమ్రాన్ అహ్మద్ నాగర్కర్నూల్ డీటీఓగా బదిలీపై వెళ్లారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. ఎంజీయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా అరుణప్రియ నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా కె.అరుణప్రియ నియమితులయ్యారు. రిజి స్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నుంచి బుధవారం ఆమె నియామకపత్రం అందుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్గా, అడిషనల్ కంట్రోలర్గా సేవలందించిన ఆమె తిరిగి ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు. -
గృహ ప్రవేశం ఏమాయే!
భువనగిరిటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా జూన్ 2 నాటికి పనులు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోవడంతో భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లవద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పనులు పూర్తి కాలేదన్న ఆగ్రహంతో లబ్ధిదారులు ఇళ్ల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ‘మా ఇళ్లను మేమే శుభ్రం చేసుకుంటాం.. మరమ్మతులు చేసుకుని ఇక్కడే ఉంటాం’ అంటూ లబ్ధిదారులు నిర్మాణంలో ఉన్న గదుల్లోకి చొచ్చుకెళ్లారు. పొరకలు పట్టి ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభించారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులతో ఆర్డీఓ చర్చలు లబ్ధిదారుల ఆందోళన తీవ్రంకావడంతో ఆర్డీఓ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని పిలిచి చర్చలు జరిపారు. పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయిస్తామని, పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపడతామని ఆర్డీఓ తెలియజేశారు. సాంకేతిక, ఆర్థిక కారణాల వల్లే గడువులోగా పూర్తి చేయలేకపోయామని నచ్చజెప్పారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బకాయిల కింద నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఈ నిధులతో నిలిచిపోయిన పనులను పూర్తి చేయిస్తామని భరోసా ఇచ్చారు. పెండింగ్ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని చెప్పారు. స్పష్టమైన హామీ లభించడంతో లబ్ధిదారులు నిరసనను విరమించుకున్నారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ వి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు నాకోటి నగేష్, చీమల రాజు, నాయకులు చెన్న మహేష్, ఖాజా అజీముద్దీన్, ఏలే శివ, తాడూరు భిక్షపతి, ఎన్నబోయిన జాంగీర్, ఇక్బాల్ చౌదరి, శాగంటి నరసింహ, కాజం,గుజ్జ పవన్, సిరిపంగ సుభాష్, వేముల కష్ణ, నాగారం సూరజ్, అంజాద్, రొయ్యల పవన్,చిన్న సంఘీభావం తెలిపారు. ఈ సమస్యపై చర్చించేందుకు బీఆర్ఎస్ నాయకులను గురువారం ఆర్డీఓ కార్యాలయానికి ఆర్డీఓ ఆహ్వానించారు. ఫ హామీ అమలు కాలేదని లబ్ధిదారుల ఆందోళన ఫ సింగన్నగూడెంలో నిర్మాణంలోఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను ఊడ్చి నిరసన -
ల్యాబ్ రిపోర్టుల్లో జాప్యం
ల్యాబ్ టెక్నీషియన్లు సమ్మె చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ప్రత్యేకంగా ల్యాబ్ టెక్నీషియన్స్ను ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాం. వెంటనే ఐదుగురిని ఏర్పాటు చేశారు. దీంతో డయాగ్నోస్టిక్ సెంటర్లో జాప్యం కాకుండా టెస్టులు చేసి రిపోర్టులు ఇస్తున్నాం –పాండునాయక్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ భువనగిరి: వేతనాలు అందలేదని ల్యాబ్ టెక్నీషియన్లు సమ్మెకు దిగడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, సీహెచ్సీల నుంచి వచ్చే శాంపిల్స్ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో రిపోర్టులు రెండు రోజులు ఆలస్యంగా వస్తుండటంతో సకాలంలో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 700 నుంచి 900 వరకు శాంపిల్స్ జిల్లా జనరల్ ఆస్పత్రి ఆవరణంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి జనరల్ ఆస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలలో పరీక్షల కోసం రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ను ప్రత్యేక వాహనాల ద్వారా పంపిస్తుంటారు. ఏ రోజు వచ్చిన శాంపిల్స్కు పరీక్షలు చేసి అదే రోజు సంబంధిత రోగుల సెల్ ఫోన్కు రిపోర్టులను చేరవేస్తారు. రిపోర్టులు అందిన మరుసటిరోజు ఆస్పత్రికి వెళ్లి వైద్యులచే చికిత్స చేయించుకుంటారు. కానీ వేతనాల కోసం ఈ నెల 1 నుంచి 104కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్స్ సమ్మెలోకి వెళ్లారు. ప్రస్తుం డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక్కరే టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని వల్ల టెస్టులు నిర్వహించి రిపోర్టులు చేరవేయడంతో ఆలస్యం అవుతోంది. రోజూ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు సుమారు 700 నుంచి 900 వరకు వివిధ రకాల పరీక్షల కోసం శాంపిల్స్ వస్తుంటాయి. ఫ వేతనాల కోసం టెక్నీషియన్ల సమ్మెబాట ఫ సిబ్బందిలేక జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో అందని రిపోర్టులు ఫ సకాలంలో వైద్యం చేయించుకోలేక రోగుల అవస్థలు -
జడ్చర్ల–కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
డిండి : జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 131 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కొడేరు మండలానికి చెందిన కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేత కొరకు ఆరు నెలల క్రితం ఏపీలోని గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో గొర్రెలను తిరిగి స్వగ్రామానికి ఐదు డీసీఎంలలో తీసుకొస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే ముందుగా వచ్చిన డీసీఎం రెండు టైర్లు పంక్చర్ కావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేశాడు. వెనకాలే వస్తున్న రెండో డీసీఎంను కూడా అక్కడే నిలిపి ఇద్దరు డ్రైవర్లు వాహనానికి మరమ్మతులు చేస్తుండగా.. అదే మార్గంలో వేగంగా వచ్చిన మూడో డీసీఎం ఆగి ఉన్న రెండు డీసీఎంలను ఢీకొట్టి పల్టీ కొట్టింది. మూడవ డీసీఎంలో ముందు కూర్చున్న చిటగోడు ఎల్లయ్య(35) అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి భార్య పద్మ, డ్రైవర్ గిద్ద రాముకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 131 గొర్రెలు మృతిచెందాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పశువైద్యాధికారులు మృతిచెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అక్కడే వ్యవసాయం పొలంలో వాటిని పూడ్చి పెట్టారు. ఎల్లయ్య మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి స్టేషన్ ఆఫీసర్ షరీఫ్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్మన్ సరితాయాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన గొర్రెల కాపరి ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అతడి భార్యకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార కార్పొరేషన్ నుంచి మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని చైర్మన్ సరితాయాదవ్ హామీ ఇచ్చారు. ఫ రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు డీసీఎంలను ఢీకొట్టిన మరో డీసీఎం ఫ ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు ఫ డీసీఎంలలో తరలిస్తున్న 131 గొర్రెలు మృత్యువాత ఫ డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ స్టేజీ వద్ద ఘటన -
20 మంది అధికారులు
119 ఆలయాలు..రామగిరి(నల్లగొండ) : నల్లగొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయాల సంఖ్యకు, పర్యవేక్షించే అధికారుల సంఖ్యకు పొంతన లేకపోవడంతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అర్చకుల వేతనాలు, దేవుడి భూముల రక్షణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ వంటి కీలకమైన బాధ్యతలు ఇన్చార్జిల పాలనతో కుంటుపడుతున్నాయి.నల్లగొండ అసిస్టెంట్ కమిషన్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాగ్రి భువనగిరి, జనగామ జిల్లాలో మొత్తం 119 ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక్కొక్కరు చొప్పున ఎండోమెంట్ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఐదుకు పైగా ఆలయాలకు ఒకే అధికారి..నిబంధనల ప్రకారం ప్రతి దేవాలయానికి ఒక పూర్తిస్థాయి ఎండోమెంట్ (కార్యనిర్వాహక) అధికారి ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండతో పాటు జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. దీనితో ఒక్కో అధికారికి సగటున ఐదు నుంచి ఆరు ఆలయాలకు అదనపు బాధ్యతలు (ఇన్చార్జి ఈఓగా) నిర్వహించాల్సి వస్తుంది. దూరభారాలు ఉన్నప్పటికీ, వేర్వేరు ప్రాంతాల్లోని ఆలయాలను ఒకే అధికారి పర్యవేక్షించాల్సి రావడంతో వారు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి..నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాల్లో పండగలు, ఉత్సవాల నిర్వహణ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆయాల దేవాలయాల పరిధిలో వేలాది ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు కేసుల నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. హుండీ లెక్కింపు, దాతల విరాళాలు, లీజుల వసూళ్లు వంటి ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ సకాలంలో జరగడం లేదు. ఆలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకుల సమస్యలను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. తక్షణ చర్యలు అవసరం..ఒక అధికారి వారంలో ఒక్క రోజు కూడా పూర్తిస్థాయిలో ఒక ఆలయానికి కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల కనీస వసతుల కల్పన పూర్తిగా నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వైభవాన్ని, ఆస్తులను కాపాడాలంటే ప్రభుత్వం స్పందించి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎండోమెంట్ అధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవాదాయ శాఖకు సిబ్బంది కొరత ఒక్కో అధికారికి ఐదు, ఆరు ఆలయాల ఇన్చార్జి బాధ్యతలు కష్టతరమవుతున్న ఆలయ భూముల రక్షణ, ఉత్సవాల నిర్వహణ -
హోటళ్లలో తనిఖీలు
యాదగిరిగుట్ట : పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా ఇన్చార్జి ఫుడ్సేఫ్టీ అధికారి శివశంకర్ ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న మంత్రాలయం హోటల్లో సోయా సాస్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వంటలకు ఉపయోగించే నూనె ఓవర్ హీట్ కావడం, కిచెన్లో వంట పాత్రలపై మూతలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న త్రినేత రాఘవేంద్ర హోటల్లో సైతం ఛాయ్ పత్తా కలర్ ఎక్కువగా ఉందని, పిండి పదార్థాలు బాగులేవని గుర్తించారు. సన్నిధి ఎమరాల్డ్ హోటల్లో ఆరు సాస్ బాటిల్స్ గడువు ముగిసినట్లు గుర్తించారు. వీటిని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపుతామని ఆయన వెల్లడించారు. త్రినేత్ర రాఘవేంద్ర, మంత్రాలయం హోటల్స్లో వాటర్ బాటిల్స్ శాంపిల్స్ తీసుకున్నామని, సోయా సాస్లను సైతం శాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా హోటల్స్ కిచెన్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని, శుభ్రత పాటించాలని ఆయన సూచించారు. వరి కొయ్యలకు నిప్పు● గడ్డివాములు, పైపులు దగ్ధం ఆత్మకూరు(ఎస్) : మండల పరిధిలోని బొప్పారం శివారు ఏపూర్ తండాలో ఆదివారం వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 4ఎకరాలకు పైగా పంట చేలలో పచ్చని చెట్లు, గడ్డివాములు, విద్యుత్ స్టార్టర్లు, పైపులు మంటల్లో కాలిపోయాయి. స్థానికులు ఫైరింజన్ సహకారంతో మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని అధికారులు ఎంత హెచ్చరించినా రైతులు ఆపడం లేదు. సాగర్లో పర్యాటకుల సందడినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వేసవివ సెలవులతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకు అధిక సంఖ్యలో తరలివచ్చి సాగర్ డ్యాం, బుద్ధవనం సందర్శించారు. విజయవిహార్ అతిథి గృహంలో బస చేసిన పలువురు పర్యాటకులు ప్రత్యేక సైకిళ్లతో పాటు బ్యాటరీ వాహనాల్లో సంచరించారు. వేసవి వేడిని తట్టుకునేందుకు విజయవిహార్ సమీపంలోని ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆలయ క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
వేతనాల్లో కోతపై తొందరెందుకు
సూర్యాపేటటౌన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ కొత్త ఆరోగ్య పథకం కోసం మే నెల వేతనం నుంచే కోతలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య అన్నారు. ఆదివారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి సంబంధించిన సర్వీసు బుక్లు, కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్ చేయడం ఇంకా పూర్తి కాలేదన్నారు. కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉండబోతుంది.? ఏయే ఆస్పత్రుల్లో సేవలు అందుతాయనే విషయాలు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదన్నారు. ఇవన్నీ పూర్తికాక ముందే వేతనాల్లో కోత విధించడంలో ప్రభుత్వానికి అంత దొందరెందుకని ప్రశ్నించారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు బి.దేవేందర్, గణిత, రాంసింగ్, కోటయ్య, సాహెబ్అలీ, ఫజల్ ఆబ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఖండనరాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూషన్తో కూడిన హెల్త్ కార్డులను అందించే క్రమంలో ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆర్థిక శాఖ హడావుడిగా మే నెల నుంచే ఉద్యోగుల వేతనాలలో 1.5శాతం మినహాయించడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, అనిల్ కుమార్లు ఖండించారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చలు జరపలేదని, రాష్ట్రంతో పాటు విజయవాడ, కర్నూలు తదితర పట్టణాల్లోనూ వైద్యం అందించాలన్న డిమాండ్ను పరిశీలించలేదన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య -
ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్ల బదిలీ
ఆలేరు : ఆలేరు, భువనగిరి పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణను మేడ్చల్ జిల్లా శామీర్పేట ఐటీఐకు, భువనగిరి ప్రిన్సిపాల్ జయను హైదరాబాద్లోని సంతోష్నగర్ ఐటీఐకి బదిలీ చేశారు. గద్వాల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్వీవీ సత్యనారాయణను ఆలేరుకు, శామీర్పేట ఐటీఐ ప్రిన్సిపాల్ లలితను భువనగిరికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు. ఆలేరు బ్రిడ్జిపై ప్రమాదాలను నివారిస్తాం – ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్రెడ్డి సాక్షి, యాదాద్రి : ఆలేరులో బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పక్కా చర్యలు తీసుకుంటామని భువనగిరి ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్రెడ్డి చెప్పారు. ఆలేరు బ్రిడ్జిపై వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి మాట్లాడారు. ఆలేరు బ్రిడ్జిపై బ్లాక్ స్పాట్ గాగుర్తించామన్నారు. ప్రధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు చెప్పారు. వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను అరికడతామన్నారు. బ్రిడ్జి సమీపంలో 11 ఎంఎం మందంతో రంబుల్ స్ట్రిప్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి వేళల్లో కూడా రోడ్డు స్పష్టంగా కనిపించేలా బ్రిడ్జిపై రేడియం లైటింగ్తో కూడిన రిఫ్లెక్టివ్ యూటర్న్, డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిడ్జికి యూటర్న్ల వద్ద వాహనాలు ఢీకొనకుండా మధ్యలో ప్లాస్టిక్ బొల్లార్డ్స్ను అమరుస్తామన్నారు. అనంతరం శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ డివైడర్ బ్లాకులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. బ్రిడ్జి ప్రారంభమయ్యే చోట ఇరువైపులా వాటర్ పౌంటెయిన్ సర్కిల్స్ను ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. బ్రిడ్జిపై జరుగుతున్న ప్రమాదాల నివారణ విషయమై రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరై చర్చిస్తామని డీఎస్పీ చెప్పారు. -
నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు
నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్లడించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ -
రహదారుల అభివృద్ధికి నిధులిస్తాం
రామన్నపేట : రామన్నపేటతోపాటు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో రహదారుల అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రామన్నపేట మండలం లక్ష్మాపురంలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి రామన్నపేట, నీర్నెముల, శోభనాద్రిపురం గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రికి దృష్టికి తీసుకు వెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారు. పట్టణ కేంద్రంలో రామన్నపేట–అమ్మనబోలు రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలతో తనను కలవాలని స్థానిక నాయకులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. మంత్రి వెంట మార్కెట్ వైస్చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సర్పంచ్లు గరిక సత్యనారాయణ, కందిమల్ల గోపాల్రెడ్డి, కంచి మధుసూదన్, డీసీసీ కార్యదర్శి అబ్రహంకుమార్, నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి, వనం చంద్రశేఖర్, గుత్తా నర్సింహారెడ్డి, ఎండీ జమీరొద్దిన్, కొండకింది శేఖర్రెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఎండీ కరీం, అంజద్, కె.వెంకటేశం తదితరులు ఉన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ప్రజల్లో చైతన్యానికి వినూత్న ప్రచారం
భువనగిరిటౌన్ : సమాజంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నకిలీ విత్తనాల నివారణే ధ్యేయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతతో పాటు వానాకాలం సీజన్లో రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లతో హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆయా పోస్టర్లను వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది. -
సర్కారు బడిలో స్పెషల్ కోచింగ్
చీమ – మిడతఫ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఫ నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో మూడేళ్లుగా కోచింగ్ ఇస్తున్న ఉపాధ్యాయులునార్కట్పల్లి : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇస్తున్నారు. గత మూడేళ్లుగా వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు దాతల సహకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు ఈ కోచింగ్ ఇప్పిస్తున్నారు. వేసవి సెలవులకు ముందే ప్రధానోపాధ్యాయుడు రాములు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఉన్నత చదువుల కోసం ప్రత్యేక కోచింగ్ ఇప్పించాలని సూచించగా.. డబ్బుల్లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆయనే స్వయంగా పాఠశాలలో ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. 50 మంది విద్యార్థులకు కోచింగ్..6 నంచి 10వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులు ఈ కోచింగ్కు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి) సంయుక్త సహకారంతో ఇద్దరు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తున్నారు.ఐఐటీ కోచింగ్ తీసుకోవడం వలన నా పై చదువుకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజు కోచింగ్కు వస్తున్నాను. మ్యాథ్స్ మంచిగా అర్ధమయమ్యలా కోచింగ్ ఇస్తున్నారు. – భాషపాక లోకేష్, 10వ తరగతి గతంలో ఇంగ్లిష్లో వెనుకబడి ఉన్నాను. నెల రోజుల నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ తీసుకోవటం వలన ఇంగ్లిష్ రాయటం, చదవడం వస్తుంది. కోచింగ్ ఎంతో ఉపయోగంగా ఉంది. – గడ్డం శ్రీనిత్య, 8వ తరగతి మూడేళ్ల కితం ప్రధానోపాద్యాయుడు రాములు వచ్చి అడగడంతో ప్రతి వేసవిలో గత మూడేళ్లుగా నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో ఐఐటీ కోచింగ్ ఇస్తున్నాను. విద్యార్థులకు సులభంగా అర్థమమ్యేలా కోచింగ్ ఇస్తున్నాను. – రాపోలు మాధవ, ఉపాధ్యాయుడుదాతల సహకారంతో పాఠశాలలో చదువుకునే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇస్తున్నాం. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఇంగ్లిష్లో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నాం. – రాములు, ప్రధానోపాధ్యాయుడు, నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్ బామ్మ చెప్పిన కథవేసవి కాలంలో ఒక చీమ వానాకాలం కోసం ఎంతో కష్టపడి గింజలు మోసుకుంటూ ఆహారాన్ని కూడబెట్టుకుంటోంది. పక్కనే చెట్టు మీద ఉన్న ఒక మిడత చీమను చూసి, ‘అంత కష్టం ఎందుకు? నాలాగా హాయిగా పాడుకుంటూ ఆనందించొచ్చు కదా’ అని ఎగతాళి చేసింది. చీమ దాని మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. కొన్నాళ్లకు వానాకాలం రానే వచ్చింది. బయట అంతా వర్షం, ఎక్కడా ఆహారం దొరకలేదు. మిడతకు ఆకలితో ప్రాణం పోయేలా ఉండి, సహాయం కోసం చీమ దగ్గరకు వెళ్లింది. అప్పుడు చీమ ‘కష్టపడాల్సిన సమయంలో పాడుకుంటూ కాలక్షేపం చేశావు, ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నావు. నీ బద్ధకమే నీకు శత్రువు’ అని చెప్పింది. నీతి: సమయాన్ని వృథా చేయకూడదు. కష్టకాలం రాకముందే మన భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.మంగినెపల్లి రోహిత్ చంద్ర, నకిరేకల్ స్విమ్మింగ్ ‘ ఫుల్ ’మేము బొమ్మలు గీశామోచ్ -
రెన్యువల్ చేస్తారా.. టెండర్లు పిలుస్తారా!
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో వర్తక సంఘాన్ని రద్దు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు, యువకులు, నిరుద్యోగులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. దుకాణాలను రద్దు చేస్తే తమతోపాటు నిరుద్యోగులు, నిరుపేద కుటుంబాల వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతాయని దుకాణదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ యాదగిరి కొండపైన వర్తక సంఘం దుకాణాలను రద్దు చేసి టెండర్లు వేస్తుందా.. రెన్యువల్ చేస్తుందా అనే అంశంపై చర్చనీయాంశమైంది. అరవై ఏళ్ల క్రితం నుంచే.. యాదగిరి కొండపైన దేవాదాయశాఖ ఏర్పడకముందు అంటే 60 ఏళ్ల క్రితం నుంచే దుకాణాలు నడుస్తున్నాయి. మొదటగా 12 దుకాణాలను స్థానికులు కొందరు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు మారుతున్న నేపథ్యంలో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 114 దుకాణాలుగా విస్తరించారు. 2014 తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన దుకాణాలను తొలగించారు. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొండకింద ఆధ్యాత్మిక వాడలో 120 దుకాణాల నిర్మాణం చేపట్టారు. దీంతో కొండపైన దుకాణాలు కోల్పోయిన తమకు కొండపైనే ఇవ్వాలని కోరడంతో 114కు గాను 10 దుకాణాలను విష్ణు పుష్కరిణి వద్ద కేటాయించారు. నాటినుంచి వర్తక సంఘం దుకాణదారులు 10 దుకాణాలను 114 మంది వర్తకులు నడిపిస్తున్నారు. వీరి వద్ద 500 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ప్రతినెలా రూ.14.16 లక్షలు చెల్లింపు వర్తక సంఘం కొండపైన పది షాపులు ఏర్పాటు చేసి ప్రతినెలా రూ.14.16లక్షల వరకు దేవస్థానానికి అద్దె చెల్లిస్తుంది. ఏడాదికి రూ.1.69 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ఈ దుకాణాలను రెండేళ్లకొకసారి రెన్యువల్ చేసుకుంటూ, దేవస్థానం పెంచిన 33 శాతం డబ్బు చెల్లిస్తుంటారు. ఆదివారం (మే 31) రెన్యూవల్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో దేవాదాయశాఖ మరో నెల రోజుల పాటు పొడిగించినట్లు తెలుస్తోంది. యాదగిరి కొండపైన ఉన్న వర్తక సంఘం దుకాణాలను రద్దు చేసి ఓపెన్ టెండర్ల ద్వారా కేటాయించాలని ఆరు నెలలుగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఉద్యమిస్తోంది. పలు శాఖల మంత్రులు, దేవాదాయశాఖ కమిషనర్కు వినతులు ఇచ్చారు. రెండు సార్లు హైదరాబాద్లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇదిలా ఉంటే యాదగిరీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా విలువైన భూములను వైటీడీఏకు అప్పగించామని, తమకు కొండపైన ఉపాధి కల్పనకు వర్తక సంఘం దుకాణాలు ఇవ్వాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫ యాదగిరి కొండపైన వర్తక సంఘం రద్దు కోసం ఉద్యమాలు ఫ ‘గుట్ట’లో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఫ ఉపాధి కోల్పోతామంటున్న దుకాణదారులు ఫ దుకాణాల గడువు మరో నెల రోజులు పొడిగించినట్టు సమాచారం -
నేటి నుంచి ఇంటర్ తరగతులు
భువనగిరి : జూనియర్ కళాశాలల విద్యార్థులకు శనివారంతో వేసవి సెలవులు ముగిశాయి. 2026–27 విద్యా సంవత్సరానికి గాను సోమవారం నుంచి ఇంటర్ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఉండగా ఇప్పటికే గతనెల 12 నుంచి అధ్యాపకులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇంటింటా ప్రచారం నిర్విహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో సుమారు 2వేలు మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మారిన ఫస్టియర్ సిలబస్ కొత్త విద్యా సంవత్సరంలో తొలి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వాటిని గత నెల 29 కళాశాలలకు చేరవేశారు. కాగా ఈ సారి ప్రథమ సంవత్సరంలో సిలబస్ మారిన విషయం తెలిసిందే. దీంతో సిలబస్ మారిన పుస్తకాలు సైతం ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధం చేసింది. డిజిటల్ హంగులు.. విద్యార్థులను ఆకట్టుకునేలా చిత్రాలు, డిజిటల్ హంగులతో పుస్తకాలను ముద్రించారు. వాటిపై ముద్రించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే వీడియో, ఆడియో ప్రత్యక్షమవుతాయి. వాటి ద్వారా పాఠాలు విని చదువుకోవచ్చు. ఈ సారి ప్రథమ సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండడంతో వాటికి సంబంధించిన పాఠాలను పొదుపర్చారు. దీంతోపాటు కళాశాలల్లో మరమ్మతులు చేసి భవనాలకు వైట్, బ్లూ రంగులు వేసి తీర్చిదిద్దారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తెలంగాణ బ్రేక్ ఫాస్ట్ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో అల్పాహారం, మూడు రోజులు పాలు(150 మి.లీ.), మూడు రోజుల రాగిజావ అందించనున్నారు. అల్పాహారంలో ఇడ్లీ, మిల్లెట్ఇడ్లీ, ఉప్మా, దోసె, బోండాలు, పూరీలను అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్తోపాటు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. ఫ తొలి రోజే పాఠ్యపుస్తకాల పంపిణీ ఫ ఈ ఏడాది నుంచే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమలు ఫ జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంటర్ పాఠ్యపుస్తకాలను కళాశాలలకు సరఫరా చేశాం. సోమవారం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి రోజే వాటిని పంపిణీ చేస్తాం. అన్ని కళాశాలల్లో మరమ్మతులు పూర్తి కావొచ్చాయి. – సురేష్రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి -
నల్లగొండ డీఈఓ బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యాధికారి(డీఈఓ) బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బ్రహ్మాచార్యులు, ఆంజనేయాచార్యులు, నరేందర్, భక్తులు పాల్గొన్నారు. -
హెడ్కానిస్టేబుల్ యాదగిరికి ఉత్తమ సేవా పతకం
సాక్షి, యాదాద్రి: యదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖకు ఘనమైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డుల్లో జిల్లాకు చెందిన ఆరుగురు అధికారులను సేవా పతకాలు వరించాయి. ఆలేరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్. యాదగిరి అందించిన విశేష సేవలకు ప్రభుత్వం పోలీస్ ఉత్తమ సేవా పతకం ప్రకటించింది. గతంలో సేవా పతకం అందుకోవడంతో పాటు, బొమ్మలరామారం దిశ కేసు పరిశోధన, పలు కీలక కేసుల దర్యాప్తు, ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో మెడల్స్ సాధించడం, కోచ్గా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. యాదాద్రి జిల్లా నుంచి ఈ ఏడాది ఈ పతకానికి ఎంపికై న ఏకై క అధికారి ఆయనే కావడం విశేషం. ఈ అవార్డు కింద మెడల్తో పాటు రూ. 30,000 నగదు బహుమతి లభిస్తుంది. రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పతకాన్ని త్వరలో ప్రదానం చేయనున్నారు. తుర్కపల్లి ఎస్ఐతో పాటు మరో నలుగురికి.. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాకు చెందిన ఐదుగురు పోలీస్ అధికారులకు సేవా పతకాలు దక్కాయి. వీరిలో తుర్కపల్లి ఎస్ఐ మహమ్మద్ తఖియొద్దీన్తోపాటు జిల్లా కేంద్రంలో ఫింగర్ ప్రింట్ యూనిట్ హెడ్ కానిస్టేబుల్ ఎం.డీ. హబీబుద్దీన్, జిల్లాకేంద్రంలో ఏఆర్ హెడ్కానిస్టేబు ళ్లు తోకల సంతోష్రెడ్డి, మారోజు రాములు, కేమిడి రమేష్లు ఉన్నారు. ఈ సేవా పతకాలను జిల్లా ఎస్పీ ద్వారా విభాగానికి పంపించి, స్థానికంగా అందించనున్నారు. ఎటువంటి రిమార్కులు లేకుండా నిరంతరం ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డులు దక్కడంపట్ల ఎస్పీ అక్షాంశ్ యాదవ్తోపాటు జిల్లా పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఫ మరో ఐదుగురికి సేవా పతకాలు ఫ ప్రకటించిన ప్రభుత్వం -
8గంటలకు జెండావిష్కరణ
ఫ ముఖ్య అతిథిగా హాజరుకానున్న శాసనమండలి చైర్మన్ గుత్తా భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను మంగళవారం నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవికాలం దష్ట్యా వేడుకలను ఉదయం 9:30 గంటల లోపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం7.45గంటలకు భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు.8గంటలకు కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఏర్పాట్ల పరిశీలన కలెక్టరేట్ ఆవరణలో వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి.. అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ఎండల తీవ్రత దష్ట్యా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డి, భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. డీఈఓగా భిక్షపతి బాధ్యతల స్వీకరణభువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారిగా బి. భిక్షపతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నల్ల గొండ డీఈఓగా పనిచేసిన భిక్షపతి ఇక్కడికి బదిలీపై వచ్చారు. హన్మకొండ ఏడీగా ఉంటూ ఇక్కడ ఇన్చార్జి డీఈఓగా కె. సత్యనారాయణ 20నెలల పాటు విధులు నిర్వహించారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న ప్రశాంత్రెడ్డి కరీంనగర్ ఇన్చార్జి డీఈఓగా బదిలీ పై వెళ్లారు. ఓవర్సీస్ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి అర్హులైన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి ఎం. జయమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్డీ చదవాలనుకునే ముస్లిం, క్రిస్టియన్ విద్యార్థులు ఈ పథకానికి అర్హులని ఆమె తెలిపారు. అభ్యర్థులు 2026 జనవరి 01 నుంచి 2026 జూన్ 30 లోపు విదేశీ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొంది ఉండాలని, వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఎంపికై న విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్షిప్తో పాటు, విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.60 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ www.tela nganaepass.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, 2026 జూన్ 30 సాయంత్రం 5.00 గంటల లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు యాదాద్రి కలెక్టరేల్లోని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని వివరించారు. రాజీవ్ యువ వికాస పథకంపై స్పష్టమైన హామీ ఇవ్వాలిభువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస పథకం అమలుపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కమిటీ సభ్యులు బండారు శ్రవణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రత్నం శ్రీకాంత్, సుందరయ్య, రియాజ్ పాల్గొన్నారు. -
బెంగాల్ తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం
యాదగిరిగుట్ట: బెంగాల్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి వస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం మేడ్చల్ రూరల్ జిల్లా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి 76 సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చిందన్నారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో మేడ్చల్ రూరల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
కరువు నేల నుంచి అన్నపూర్ణగా అవతరణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నూతన జిల్లాగా ఆవిర్భవించిన ‘యాదాద్రి భువనగిరి’ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కరువు ఛాయలు అలుముకున్న ఈ నేల.. సాగునీటి రాకతో పచ్చని పొలాలతో అన్నపూర్ణగా అవతరించి రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడులు సాధిస్తోంది. మూడు రెట్లు పెరిగిన వరి సాగు విస్తీర్ణంతో వ్యవసాయం పండుగలా మారింది. దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు ఊపందుకున్నాయి. బీబీనగర్ ఎయిమ్స్, నూతన మెడికల్ కళాశాలతో మెరుగైన వైద్యం, రీజినల్ రింగ్ రోడ్డు లాంటి మౌలిక వసతులతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ఈ అద్భుత అభివృద్ధిపై ప్రత్యేక కథనం. –సాక్షి, యాదాద్రిఫ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి ఫ ఎయిమ్స్తో మెరుగైన వైద్యం ఫ ఇండస్ట్రియల్ పార్కుతో ఉపాధి జోరు ఫ మారిన యాదాద్రి జిల్లా ముఖచిత్రం జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. దీంతోపాటు చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్, మోటకొండూరు, అడ్డగూడూరు మండలాలు నూతనంగా ఏర్పాటు చేశారు. ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ నిధులతో భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. జిల్లాలో వరి సాగుకు సానుకూల పరిస్థితి ఉంది. నాలుగైదేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగాయి. కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు నింపారు. అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ నాణ్యమైన వరి వంగడాలు వచ్చాయి. ప్రభుత్వం దగ్గరుండి ధాన్యం కొనుగోలు చేస్తోంది. వరిసాగుతో రైతుకు పనిభారం తక్కువైంది. ఎకరానికి సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పెట్టుబడి పోను ఎకరాకు రూ.50 వేల లాభం వస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతంలోని పోచంపల్లి, వలిగొండ మండలాల్లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుడబడి వస్తోంది. తాజాగా పెరిగిన భూగర్భజలాలతో రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, సంస్థాన్నారాయణపురం, ఆత్మకూర్(ఎం) , ఆలేరు వంటి మండలాల్లో వరిసాగు విపరీతంగా పెరిగింది. జొన్న, కంది, పెసర, ఆముదం, సజ్జ ఇలా పలు రకాల ప్రత్యామ్నాయ పంటలు వేసేవారు. ప్రస్తుతం మెట్ట పంటల సాగు తగ్గింది. మూడు రెట్లు పెరిగిన వరి సాగు 2012లో వానాకాలంలో కేవలం 50 వేల ఎకరాలు, యాసంగిలో లక్ష ఎకరాల్లో వరిసాగు అయ్యేది. 2025 నాటికి సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలం సాగు 2,98,937 ఎకరాలు. యాసంగిలో 3,14,621 ఎకరాలకు చేరుకుంది. అంటే దాదాపు మూడు రెట్లు సాగు విస్తీర్ణం పెరిగింది. పెరిగిన వడ్ల దిగుబడి 2012లో వానాకాలం ధాన్యం ఉత్పత్తి లక్ష మెట్రిక్ టన్నులు కాగా యాసంగి ధాన్యం ఉత్పత్తి 2లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. 2025వానాకాలం నాటికి 65,7661 మెట్రిక్ టన్నులు, యాసంగి ధాన్యం ఉత్పత్తి 6,92,166 మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఽపెరిగిన ధాన్యం దిగుబడులను నిల్వ చేయడానికి జిల్లాలో మిల్లులు, గోదాములు సరిపోవడంలేదు. అధికారులు పొరుగు జిల్లాలకు జిల్లా ధాన్యం పంపిస్తున్నారు. తుది దశకు నృసింహసాగర్జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నృసింహసాగర్ రిజర్వాయర్ తుది దశకు చేరింది. దీని ద్వారా యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు నల్లగొండలోని 256 చెరువులను నింపుతారు. తద్వారా 1,88,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ప్రజల మంచినీటి అవసరాలు,పరిశ్రమలకు నీటి సరఫరా చేస్తారు. గ్రావిటీ ద్వారా మల్లన్న సాగర్ నుంచి రెండేళ్ల క్రితమే బస్వాపూర్ రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపడానికి అధికారులు సిద్ధమయ్యారు. కానీ నిధుల మంజూరులో జాప్యంతో పనులు నిలిచిపోయాయి. ఆలేరు, మోత్కూరు, మోటకొండూరు, గుండాల, ఆత్మకూర్ ఎం మండలాలకు సాగునీరందించే దేవాదుల పనులు సాగుతున్నాయి.బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణ సాగుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి సాగునీరందించే గంధమల్ల రిజర్వాయర్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేజీబీవీ, మోడల్స్కూల్స్, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు కాగా 968 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదు జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు కాగా 2,356 మంది విద్యార్థులు చదువుతున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ మంజూరయ్యాయి. యాదగిరిగుట్టలో వేదపాఠశాల మంజూరైంది. సంస్కృత పాఠశాలను డిగ్రీ స్థాయికి పెంచారు. అర్జీల పరిష్కారంలో కాలయాపన చేయొద్దు -
లబ్ధిదారుల ఇళ్లలో ఇందిరమ్మ వెలుగులు
భువనగిరిటౌన్ : నిరుపేదల సొంతింటి కల సాకారమైంది. సొంత గూటికి చేరుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని 2, 7, 8 వార్డుల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందజేయడమే లక్ష్యమన్నారు. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో మొదటి దఫా కింద మొత్తం 531 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసుకున్న 300కు పైగా గృహప్రవేశాలు చేశారని వివరించారు. వేడుకలో మున్సిపల్ చైర్పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. అవేజ్ చిస్తి, కౌన్సిలర్లు పోలిశెట్టి అనిల్ కుమార్, కుక్కదూగ పద్మ, ఎం.డి తాహెరా, మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ
చౌటుప్పల్ : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ధరలు నూరు శాతం పెరగనుండడంతో జనం ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయేతర భూములకు సాధారణ రోజుల్లో 48స్లాట్లు ఉండగా ప్రస్తుతం మరో 32 అదనంగా పెంచారు. వ్యవసాయ భూములకు మాత్రం యథావిధిగా 30స్లాట్లు ఉన్నాయి. ధరల పెంపు నిర్ణయానికి ముందు చౌటుప్పల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యయసాయేతర రిజిస్ట్రేషన్లు 48స్లాట్లలోపుగానే జరిగేవి. ఇప్పుడు మాత్రం రెండింతలు పెరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయాల్లో 10–15వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగనుండగా ప్రస్తుతం 30 అవుతున్నాయి. ధరలు పెరిగితే తమపై భారీగా ఆర్థిక భారం పడుతుందని భావించి జనాలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఫ భూముల మార్కెట్ విలువ పెంపు నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్లు ఫ రిజిస్ట్రేషన్ల కోసం భారీగా తరలివస్తున్న జనం -
దండుమల్కాపురంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్..
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్కు 2019 నవంబర్ 1న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారు. 2022లో ఆయన చేతుల మీదుగానే ఇండస్ట్రియల్ పార్క్ను ప్రారంభించారు. మొదటి విడతలో 460 ఎకరాల విస్తీర్ణంలో 450 పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా భూ కేటాయింపులు జరగగా ప్రస్తుతం శరవేగంగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రూ. 2500 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కు ఏర్పాటు చేసింది. ప్రత్యక్షంగా 15,000 పరోక్షంగా 40,000 మందికి ఉపాధి లభించనుంది. గత సంవత్సరం సుమారు 80 వేల మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం మరో 1500 ఎకరాల భూసేకరణ జరుగుతోంది. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ఈ పార్కు స్థలాలు కేటాయిస్తుంది. ఈపార్కులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు తయారవుతున్నాయి. -
10లోపు గృహ ప్రవేశాలు చేయాలి
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు యాదగిరిగుట్ట రూరల్: ఈ నెల 10వ తేదీ లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించారు. మిగిలి ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో విద్యుత్ పనులకు రూ. 2 లక్షల చెక్కును తన ఫండ్ నుంచి కేటాయించి, గ్రామ పంచాయతీకి అందజేశారు. ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి, ప్రతీ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించి కరెంటు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఒగ్గు రవళి, రాణా ప్రతాప్, మాజీ సర్పంచ్ కానుగు కవిత, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కానుగు బాలరాజ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, వార్డు సభ్యులు కానుగు రాజీవ్ గౌడ్, కాల్నె వినోద్ కుమార్, చిన్నం మల్లేష్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో విఫలం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. వాతావరణం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.సాయంత్రం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లో జిల్లాలో వైద్య పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీబీనగర్ వద్ద నిమ్స్ను ఎయిమ్స్ ఆస్పత్రిగా ప్రకటించారు. రూ. 1300 కోట్లతో భవనసముదాయాల నిర్మాణం పూర్తి కావొచ్చింది. 15 రకాల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. రోజూ 2500 మంది ఔట్పేషెంట్లకు వైద్యం చేస్తున్నారు. భువనగిరిలో యాదాద్రి మెడికల్ కళాశాలను 50 సీట్లతో గత సంవత్సరం ప్రారంభించారు. నర్సింగ్ కళాశాలను 60 మంది విద్యార్థులతో ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రిని 100 పడకల నుంచి 225 పడకలకు అప్ గ్రేడ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె, బస్తీ దవాఖానాలుగా ఏర్పాటు చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా మార్చారు. ఇందులో 99 గ్రామీణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుండగా నాలుగు బస్తీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలున్నాయి. జిల్లా కేంద్రంలో 157 పరీక్షలను అందించే విధంగా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి తోపాటు ఆలేరు, చౌటుప్పల్ లో ఐదేసీ పడకలతో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసి కిడ్నీబాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. -
లక్ష మంది రాక.. రూ.82లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట: వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు సుమారు లక్షా వెయ్యిమందికి పైగా భక్తులు రావడంతో ధర్మ దర్శనానికి 4 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. యాదగిరి కొండపైన ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు.వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.81,77,104 వచ్చినట్టుఆలయాధికారులు వెల్లడించారు. కాగా, భక్తులు అధికంగా రావడంతో క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. దీంతో లోపలకు సరైన గాలి రాకపోవడంతో ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మూత్రశాలలు, మరుగు దొడ్లకు వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆలయ సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. ఆలయ మాడ వీధుల్లో మంచినీరు తాగేందుకు, బాటిల్స్లో నింపుకునేందుకు సైతం భక్తులు పోటీ పడ్డారు. వాహనాల బారులు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు తమ వాహనాల్లో రావడంతో కొండపైన, కొండ కింద ఎక్కడ చూసినా కార్లు, బైక్లే కనిపించాయి. భారీగా వాహనాలు రావడంతో సెంట్రల్ పార్కింగ్, ఘాట్ రోడ్డు, కొండపైకి వెళ్లే రూ.500 టికెట్ తీసుకునే చెక్పోస్టు వద్ద క్యూకట్టాయి. ఉదయం నుంచి భక్తులతో పాటు వాహనాల రద్దీ కనిపించింది. -
నాటి ‘రాజ’సానికి గుర్తులు ఇవీ..
నడిగూడెం : నాటి మునగాల పరగణాకు పాలనా కేంద్రమైన నడిగూడెం రాజావారి కోటలో పలు రకాల వస్తువులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నడిగూడెం రాజావారి కోటలో 1921లో నడిగూడెం జమీందారు రాజానాయిని వెంకటరంగారావు వద్ద వ్యవసాయాధికారిగా పని చేస్తూ, పరగణాలోనే తొలిసారిగా పత్తి పంటను పరిచయం చేసిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వాడిన టేబుల్, కుర్చీ నేటికీ చెక్కు చెదరలేదు. అలాగే అదే కోటలో నాడు 1919 మే 27న సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం నడిగూడెం రాజావారి కోటను సందర్శించి కూర్చున్న కుర్చీ ఇంకా పదిలంగా ఉంది. అదే కుర్చీలో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు 1923 జులై 13న అదే కుర్చీలో కూర్చొని మహారాష్ట్ర చరిత్రను చదివి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తూ తుదిశ్వాస విడిచారు. తదనంతరం 1923 నుంచి 1956 వరకు అదే కుర్చీలో కళా ప్రపూర్ణ, మునగాల పరగణా జమీందారు రాజానాయిని వెంకటరంగారావు కూర్చొని చదువుకునేవారు. ఇక 125 ఏళ్ల క్రితం రాజావారు వాడిన ఉయ్యాల కూడా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. వీటన్నింటినీ నడిగూడెం రాజావారి కోటలో డక్కన్ ఆర్కైవ్స్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జితేంద్ర బాబు ఆధ్వర్యంగా నాలుగేళ్ల కిందట కోటకు పూర్వ వైభవనం కనిపించేలా తీర్చిదిద్ది ప్రదర్శనగా పెట్టారు. వందేళ్ల క్రితం రాజానాయిని వెంకట రంగారావు ఉపయోగించిన ఉయ్యాల కందుకూరు వీరేశలింగం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజానాయిని వెంకట రంగారావు వాడిన కుర్చీ పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పనలో భాగంగా ఉపయోగించిన టేబుల్ -
కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి
యాదగిరిగుట్ట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో హిందుత్వ మతోన్మాద విధానాలు అమలు చేస్తోందని ఎన్పీఆర్డీ (నేషనల్ ప్లాట్ఫామ్ఫ్ర్ ద రైట్స్ ఆఫ్ ద డిసెబుల్) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంభు రాజన్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ శిక్షణ తరగతుల్లో శనివారం రెండవ రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం పని చేస్తుందన్నారు. ప్రజల సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ఉన్న అనేక చట్టాలను రద్దు చేయడంతో పాటు సవరణలు చేస్తుందని, చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిధులు కేటాయించకుండా అందరికి యూడీఐడీ కార్డులను ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వికలాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం ఉన్న పథకానికి నిధులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, రాష్ట్ర కోశాధికారి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్, సహాయ కార్యదర్శి రాజు, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగ ప్రకాష్, కోశాధికారి లలితలతో వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ ఎన్పీఆర్డీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంభు రాజన్ -
కూలీ బతుకుపై కూలిన మట్టి
కనగల్: మండల పరిధిలోని బుడుమర్లపల్లి గ్రామ వాగులో ఇసుక పొర కూలి కనగల్ గ్రామానికి చెందిన పాలకూరి సునిత(45) శనివారం మృతిచెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. సునీత రోజు మాదిరిగా బుడుమర్లపల్లి వాగు ఇసుక రీచ్ వద్దకు దినసరి కూలీగా ఉదయం 5గంటల వెళ్లి తిరిగి ఉదయం 9గంటలకు ఇంటికి చేరుకుంటుంది. ఈ క్రమంలో వాగులో నాణ్యమైన ఇసుకను తోడేందుకు వాగులోకి వెళ్లింది. ట్రాక్టర్లో ఇసుక లోడ్ పూర్తి చేసిన అనంతరం తిరిగి పార కోసం ఇసుక తీసిన ప్రాంతానికి సునీత వెళ్లింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పైన ఉన్న ఇసుక పొరతోపాటు మట్టిపెళ్ల్లలు పడడంతో అందులో కూరుకుపోయి మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్ఐ రాజీవ్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఇసుకలో కూరుకుపోయిన సునీత మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాకు దిక్కెవరు.. మృతురాలు సునీతకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఇద్దరికీ వివాహమైంది. భర్త యాదయ్య గత ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. తాను సొంతంగా పనులు చేసుకోలేడు. నాకు దిక్కెవరని, తనకు ఇంక తోడు ఎవరుంటారని కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి రోదిస్తున్న తీరును చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. ఫ వాగులో ఇసుక తోడేందుకు వెళ్లిన మహిళా కూలీ ఫ మట్టిపెళ్ల్లలు పడడంతో అందులో కూరుకుపోయి మృతి ఫ కనగల్ మండలం బుడుమర్లపల్లి వాగులో ఘటన -
శాంతిభద్రతల పరిరక్షణలో పాలీసుల పాత్ర కీలకం
భువనగిరి : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకంగాఉంటుందని ఎస్పీ అక్షాంశ్యాదవ్ అన్నారు. శనివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రవికుమార్, ఆత్మకూర్ పోలీస్ స్టేషన్లో విధులు ఏఎస్ఐ కేశవరెడ్డిలు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిని శాలవాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు కుటుంబ సభ్యులతో జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలుయాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జలనారాయణస్వామికి మంగళహారతులు భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి జలనారాయణ స్వామికి మంగళహారతులు సమర్పించారు. ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం తుర్కపల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ శనివారం ఆయన యాదగిరిగుట్ట పట్టణం నుంచి తుర్కపల్లి వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. మాదాపూర్, దత్తాయపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లిలోని ధాన్యం కొనుగొలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్ 2 వరకు ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ధాన్యం నిల్వలుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటాపురంలో భగీరథ పైప్లైన్కు లీకేజీలను గుర్తించి మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి మరుమ్మతులకు ఆదేశించాలని కోరా రు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైరపర్సన్ ఐనాల చైతన్యమహేందర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుటిపాటి మధుసూదన్రెడ్డి, శంకర్నాయక్, భాస్కర్రెడ్డి, వెంకటేశం, ఐలయ్య, భాస్కర్నాయక్, నారాయణరెడ్డి, నిఖిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో పోచంపల్లి.. ఇక్కత్ జాతర
భూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రసిద్ధ చేనేత వస్త్రాలు హైదరాబాద్లో ప్రదర్శించనున్నారు. నగర వినియోగదారులకు, చేతివృత్తి కళాకారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు జూన్ 5, 6, 7 తేదీల్లో హైటెక్ సిటీలో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో, జిల్లా చేనేత జౌళిశాఖ సమన్వయంతో ‘థ్రెడ్. పోచంపల్లి’ థీమ్తో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకే వేదికపై 100 స్టాల్స్.. చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో మొత్తం 100 ప్రత్యేక స్టాల్స్ ఉండనున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, నేషనల్ అవార్డు గ్రహీతలు, సంత్ కబీర్, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు గ్రహీతలు, ప్రొడ్యూసర్ కంపెనీలు, ఎంపిక చేసిన మాస్టర్ వీవర్స్ నేరుగా ఈ స్టాల్స్ను నిర్వహించనున్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలతో గ్రామీణ వంటకాల రుచులను ఆస్వాదించే స్టాల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. దారంపైన డిజైన్ వేసి.. వస్త్రం నేసి దారంపైన డిజైన్ వేసి మగువల మనసు దోచే ఆకర్షణీయమైన చేనేత వస్త్రాలను రూపొందించే కళ ఒక్క పోచంపల్లి చేనేత కళాకారులకే సొంతం. డిజైన్కు అనుగుణంగా దారంపైన రబ్బరుచుట్టి (టై), రంగులద్ది (డై) చేతి మగ్గాలపై రూపొందించిన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేర్గాంచాయి. ఎంతో ప్రత్యేకమైన పోచంపల్లి ఇక్కత్ కళకు 2003లో భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా వచ్చింది. వారసత్వంగా వస్తున్న చేనేతలో ఇక్కడి కళాకారులు కాలానుగుణంగా వస్తున్న మార్పులు, అభిరుచులకు అనుగుణంగా అనేక ప్రయోగాలు చేస్తూ, ఆధునితను జోడిస్తూ చేనేత పరిశ్రమను సజీవంగా నిలుపుతున్నారు. దాంతో భూదాన్పోచంపల్లి కేంద్రంగా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలోనే చేనేతలకు పెట్టింది పేరు. జిల్లా వ్యాప్తంగా 15 వేల కుటుంబాలు చేనేతవృత్తిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా చేతివృత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తూ తోటి కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నందుకు యునెస్కో అనుబంధ సంస్థ ప్రపంచ పర్యాటక సంస్థ 2021లో భూదాన్పోచంపల్లికి ఉత్తమ టూరిజం విలేజ్గా గుర్తించి అంతర్జాతీయ అవార్డు అందజేసింది. ‘థ్రెడ్. పోచంపల్లి’ థీమ్తో ఎగ్జిబిషన్ ఫ జూన్ 5 నుంచి 7 వరకు ప్రదర్శన ఫ ఒకే వేదికపై 100 స్టాల్స్ ఫ నేరుగా విక్రయించనున్న జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలు, మాస్టర్ వీవర్స్ ఫ ప్రత్యక్షంగా మగ్గాల ప్రదర్శన, తెలంగాణ గ్రామీణ రుచులుపోచంపల్లి, చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, ఆలేరు తదితర ప్రాంతాల నేతన్నలు నేసిన అద్భుతాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, పుట్టపాక శ్రీతేలియా రుమాళ్లుశ్రీ, సిల్క్, కాటన్ వస్త్రాలు, షర్టింగ్, డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, బెడ్షీట్స్, దివాన్ సెట్స్, హోమ్ ఫర్నీషింగ్ వస్తువులతో పాటు చిన్న పిల్లల లెహంగాలు, హ్యాండ్పర్సులు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. కేవలం వస్త్రాల విక్రయమే కాకుండా, ఇదొక సజీవ సాంస్కృతిక వేదికగా అలరించనుంది. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సంప్రదాయ మగ్గాలను ఏర్పాటు చేసి, దారానికి రంగులద్ది (టై అండ్ డై) వస్త్రం నేసే క్లిష్టమైన ప్రక్రియను సందర్శకులకు ప్రత్యక్షంగా చూపించనున్నారు. -
ఫ్లైఓవర్పై ప్రమాదాల నివారణకు చర్యలు
ఫ గుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు ఆలేరు : ఆలేరు పట్టణంలోని ఫ్లై ఓవర్పైన ప్రమాదాల నివారణపై దృష్టి సారించినట్టు గుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు పేర్కొన్నారు. శనివారం జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్రెడ్డి, మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఆయన మంతపురి రోడ్డు నుంచి రఘునాథపురం రోడ్డు వరకు ఫ్లైఓవర్ను పరిశీలించారు. స్థానికులతో అధికారులు మాట్లాడారు. వంతెన రోడ్డు మధ్యలో స్టబ్స్, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. వారివెంట యాదగిరిగట్టు ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఆలేరు మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, ఎస్ఐ వినయ్, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు. -
పరిశ్రమల్లో కార్మికుల భద్రతే ముఖ్యం
సాక్షి, యాదాద్రి : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతే ధ్యేయంగా యాజమాన్యాలు, అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం భువనగిరి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని 33 ప్రమాదకర పరిశ్రమలు తమ ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్న్స్ను వెంటనే సమర్పించాలన్నారు. నెల రోజుల తర్వాత పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేక సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమలను సందర్శించి ఇచ్చే నివేదికల ఆధారంగా పరిశ్రమలకు ‘భద్రత, కాలుష్య నియంత్రణ పనితీరు’పై ర్యాంకులు కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేవీ.శ్రీదేవి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
బడిబాట.. సాగేదెట్టా!
భువనగిరి : ఒక వైపు బడిబాట.. మరోవైపు జనగణన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో ఈ సారి కేంద్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం చేపట్టింది. ఎక్కువ మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. జనగణనతోపాటు తమ హెల్త్కార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం, సర్వీస్బుక్లకు సంబంధించి డిజిటలైజేషన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే మిగిలిన ఉపాధ్యాయులు బడిబాటను నామమాత్రంగా కొనసాగిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. జూన్ 19 వరకు బడిబాట.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాల్లో ఈ ఏడాది 715 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5వేల మందికి తగ్గకుండా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూన్ 19 వరకు కొనసాగనుంది. వీటితో పాటు జూన్ 3న గ్రామ సభ, 4న అవగాహన ర్యాలీ, 5, 6 తేదీల్లో ప్రత్యేక అవసరాల గల వారితోపాటు బడిబయట ఉన్న పిల్లలను గుర్తించాలి. 8 నుంచి 10వ వరకు ఇంటింటా ప్రచారం, 12న వెల్కమ్ డే, 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్ఎల్ఎన్ డే, 17న బాలిక, సమ్మిళిత దినోత్సవం, 18న డిజిటల్ అవర్ నెస్ డే, 19న స్పోర్ట్స్ డేతో బడిబాట కార్యక్రమం ముగియనుంది. జనగణన విధుల్లో 75 శాతం మంది జిల్లాలోని ఉపాధ్యాయులు జూన్ 9 వరకు జనగణన విధులు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ ఉండడంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. సుమారు 75 శాతం ఉపాధ్యాయులు జనగణనలో విధులు నిర్వహిస్తుండగా మిగిలిన 25 శాతం మంది ఉపాధ్యాయుల్లో కొందరు అదనంగా రెండు విధులను కేటాయించారు. ఒకే సమయంలో రెండు విధులు ఎలా నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను ప్రధానోపాధ్యాయులకు విన్నవిస్తుండడంతో వారు కూడా సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఫ జనగణనకు 75 శాతం మంది టీచర్లు ఫ మిగిలింది 25 శాతం మందే.. ఫ నామమాత్రంగా బడిబాట కార్యక్రమాలు ఫ లక్ష్యం పూర్తిపై అనుమానాలు -
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
నూతనకల్: అనారోగ్యంతో మృతిచెందిన మహిళకు గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈఘటన నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు ప్రాంతానికి చెందిన మబ్బు సుబ్బారెడ్డి, మబ్బు లక్ష్మి దంపతులు 50 సంవత్సరాల క్రితం మాచనపల్లి గ్రామానికి వలస వచ్చి సుతారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజకులు కాలేదు. ఆర్థిక ఇబ్బందులకు తోడు వయోభారం పెరిగి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మబ్బు లక్ష్మి(70) గత ఆరు సంవత్సరాల నుంచి అనారోగ్యానికి బాధపడుతుండగా శనివారం మృతి చెందింది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు వారి కుటుంబం వద్ద డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులే అండగా నిలిచి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. -
ఆకలి, దప్పిక తెలియదు.. కూర్చోలేరు.. నిలబడలేరు
నల్లగొండ : ఆ చిన్నారులకుకి ఆకలి దప్పిక తెలియదు.. మాటలు రావు... కూర్చోలేరు, నిలబడలేరు. జన్యుపరమైన వ్యాధితో 14 ఏళ్లుగా ఆ చిన్నారులు మంచానికే పరితమయ్యారు. రూ.లక్షలు ఖర్చు చేసినా రోగం నయం కాలేదని, కుటుంబ పోషణ కూడా భారమై పోయిందని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆ చిన్నారుల తల్లిదండ్రులు కలెక్టర్ను వేడుకున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం కలెక్టరేట్లో వృద్ధులకు, దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక ‘ప్రజావాణి’ కార్యక్రమానికి.. నార్కట్పల్లి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన వల్కి శంకర్–మధుమతి దంపతులు తమ కుమారుడు మణివర్షిత్(14), కుమార్తె ప్రేమాన్విత(11)లను తీసుకుని వచ్చి తమ గోడును కలెక్టర్కు విన్నవించారు. తమ ఇద్దరు పిల్లలు జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, మంచానికే పరిమితమయ్యారని చెప్పారు. ఏదీ అడగలేరు.. చెప్పలేరని, సమయానికి అన్నం పెట్టడం. పడుకోబెట్టడం అన్నీ తామే చేస్తున్నామని చెప్పారు. రూ.18 లక్షలు ఖర్చు చేసినా నయం కాలే... బాబు పుట్టిన 9 నెలల నుంచి వైద్యం కోసం తిరుగుతునే ఉన్నాం. ఆ తర్వాత మూడేల్లకు పాప పుట్టింది. పాప కూడా జన్యుపరమైన వ్యాధితో పుట్టింది. ఆ ఇద్దరు పిల్లలను హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రులు తిప్పి వైద్యం చేయించాం. ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశాం. 18 లక్షలు అయింది. అయినా పిల్లల ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఒకరైనా మాటలు వస్తాయి నడవగలరని అనుకున్నాం. డాక్టర్లు కూడా వారి పరిస్థితి చూసి మేమేమీ చెప్పలేమని అంటున్నారు. సమయానికి తినిపించడం, తాగించడం, మందులు వేయడం, పరిశుభ్రత చేయించడం మేమే చేస్తున్నాం. 24 గంటలు పిల్లల సంరక్షణలో ఒకరు ఉంటున్నాం. మొన్నటి వరకు మా అమ్మ ఉండేది. ఆమె కూడా చనిపోయింది. దీంతో నా భార్య మధుమతి ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉండి చూసుకోవాల్సి వస్తుంది. నేను పార్టు టైం డ్రైవర్గా పనిచేస్తున్నాను. కిరాయి దొరికితే డబ్బు వస్తుంది. లేకపోతే లేదు. కుటుంబ గడవని పరిస్థితి ఉంది. పిల్లల మందులకు కూడా డబ్బులులేవు అంటూ కలెక్టర్ ముందు తన దయనీయ స్థితిని చెప్పుకుని శంకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తమ పరిస్థితి పరిశీలించి ఏదేని పని చేసేందుకు తనకు ఉపాధి కల్పించాలని వేడుకున్నాడు. పిల్లలిద్దరూ మంచానికే పరిమితం ఫ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఫ రూ.లక్షలు ఖర్చు చేసినా నయం కాని రోగం ఫ ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకున్న తల్లిదండ్రులు -
జల సంరక్షణకు చర్యలు చేపట్టాలి
సాక్షి, యాదాద్రి : జలాల వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. శనివారం ఆయన అధ్యక్షతన కలెక్టరేట్లో 2025–26 నీటి సంవత్సరానికి భూగర్భ జలాల లభ్యత అంచనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సగటు కంటే 65 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ జనవరి నుంచే నీటి సమస్యలు మొదలయ్యాయని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం భూగర్భ జలాలు నవంబర్లో 3 మీటర్లు, మే మాసంలో 5 మీటర్ల లోతులో ఉండేలా చూడాలన్నారు. బోర్ల కింద రెండో పంటగా వరి సాగును తగ్గించాలన్నారు. అనంతరం భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్ పీపీటీ ద్వారా వివరాలు వెల్లడించగా, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2024–25 భూగర్భ జలాల అంచనా నివేదికను ఆవిష్కరించారు. జిల్లా భూగర్భ జలాల అంచనా కమిటీ మొదటి సమావేశానికి వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అటవీ, నీటిపారుదల, ప్రణాళిక శాఖల అధికారులు హాజరయ్యారు. -
‘బార్దాన్’ బాధలు
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు.. ఒకపక్క లారీల కొరత, తరుగు పేరుతో ధాన్యంలో కోతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క గన్నీ సంచులు (బార్దాన్) సమస్య వేధిస్తోంది. రహీంఖాన్పేటలో మోత్కూరు ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి శనివార ఉదయం పాత, చిరిగిపోయిన బార్దాన్ సంచులు రావడంతో సీరియల్ ఉన్న రైతులు అందులోంచి మంచివి ఏరుకుంటూ ఇలా కనిపించారు. -
డేంజర్ స్పాట్..!
ఆలేరు ఫ్లైఓవర్పై తరచూ ప్రమాదాలు ఫ వెలగని లైట్లు.. వంతెనపై చీకట్లు ఫ ఐదు నెలల్లోనే ఒకేచోట మూడు ప్రమాదాలు.. ముగ్గరు బలి ఫ భయాందోళనలో వాహనదారులు ఆలేరు : ఆలేరు పట్టణంలోని ఫ్లై ఓవర్.. ఇప్పుడు డేంజర్ స్పాట్గా మారింది. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ వాహనదారుల ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రమాదకర మలుపులు కలిగిన ఈ వంతెనపై రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. రెండు కిలోమీటర్ల పొడవునా వంతెన.. ఆలేరు పట్టణం మంతపురి రోడ్డు నుంచి రఘునాథపురం రోడ్డు వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్లోని ప్రమాదకర మలుపులు ఉన్నాయి. వంతెనపై వెలుతురు, సూచిక బోర్డులు లేని కారణంగా ప్రమాదాలకు జరుగుతున్నాయి. వంతెనపైకి వచ్చిన ప్రతి వాహనదారుడు భయం భయంగానే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే స్పాట్.. మూడు ప్రమాదాలు ఫ్లై ఓవర్పై ఉన్న మలుపు వద్ద ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలల్లో ముగ్గరు దుర్మరణం చెందారు. రెండు నెలల క్రితం మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్న తన తల్లిని రైల్వేగేట్ చౌరస్తాలో వదిలిపెట్టి, తిరిగి ఇంటికి వెళుతున్న పట్ణణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ (27)ను కర్నాటకకు చెందిన కారు ఢీకొట్టడంతో వంతెనపై నుంచి కింద పడి మృతి చెందాడు. అలాగే యాదగిరిగుట్ట మండలం కమటంగూడెంకు చెందిన రైతు శ్రీనాథ్(35) మలుపు వద్ద జారిపడి మరణించాడు. తాజాగా నాలుగు రోజుల కిత్రం ఆలేరు ఐటీఐలో అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారిగా పనిచేస్తున్న సుంకరినేని శ్రీనాథ్(40)ను కర్నాటకకు చెందిన వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈవంతెన మలుపు వద్ద, రఘునాథపురం నుంచి వచ్చే వాహనాలు, పోచమ్మ గుడి నుంచి వచ్చే వాహనాలు కనబడక వంతెన రోడ్డు వద్ద ఢీకొట్టుకున్న ఘటనలో పదిమంది వరకు గాయపడ్డారు. అయినా అధికారులు నివారణ చర్యలు చేపట్టడం లేదు. చీకటి కమ్మితే భయం మొదలు.. వంతెన పొడవునా వీధిదీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రి వేళ్లలో అంధకారం అలుముకుంటోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు చివరి క్షణం వరకు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వంతెనపై మలుపు వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందంటున్నారు వాహనదారులు. అతివేగం.. మరో కారణం ఈ వంతెన మీదుగా రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రఘునాథపురం, జనగాం, వరంగల్, యాదగిరిగుట్ట, కొలనుపాక, సిద్ది పేట, ఆలేరు పట్టణం (పోచమ్మగుడి)లోకి వెళ్లే వాహనాలకు ఈ ఫ్లై ఓవర్ ప్రధాన మార్గం. ఈ వంతెనపై గంటకు సుమారు 20కి.మీ. వేగ పరిమితి ఉన్నా పలువురు వాహనదారులు పట్టించుకోవడం లేదు. అతివేగంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు మరో కారణమవుతోంది. అధికారులూ... మేల్కోంటారా? మలుపుల వద్ద రేడియం సూచిక బోర్డులు, వంతెన ప్రారంభం, ముగింపు, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, అవసరమైతే డివైడర్లను ఏర్పాటు చేయాలి. వంతెన ప్రవేశం వద్ద ఫౌంటెయిన్ సర్కిల్ నిర్మించి లైటింగ్ ఏర్పాటు చేయాలి. వంతెన ప్రవేశం, చివరలో స్టాపర్లు ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయ డం ద్వారా ప్రమాదాల నియంత్రణకు ఆస్కారం ఉంది. ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేదో చూడాలి. మంతపురి రోడ్డు వైపు వంతెన ప్రవేశం వద్ద ఎలాంటి హెచ్చరిక/సూచిక బోర్డులు లేవు. దాంతో వంతెనపైకి ఎక్కే, దిగే వాహనాలలు ఒకదానికొకటి సరిగా కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ ఫ్లై ఓవర్ను బ్లాక్స్పాట్గా గుర్తించి, ప్రత్యేక రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలి. పూర్తి స్థాయిలో వీధిదీపాలు వెలిగేలా చూడాలి. పోలీసు, మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి. – తునికి దశరథ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి -
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
ఫ వద్దని వారించినా ఈత కొట్టేందుకు వెళ్లిన కుమార్తె ఫ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి కట్టంగూర్ : తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్ ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మిర్యాలగూడ టౌన్ : చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన నూకల శంకర్ (38) అనే వ్యక్తి గురువారం రాత్రి 11గంటలకు యాద్గార్పల్లి చెరువులో చేపల వల వేసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో సాగర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం శంకర్ మృతదేహం లభ్యంకాగా.. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆకట్టుకున్న ‘మాక్ పార్లమెంట్’
భువనగిరిటౌన్ : ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి కలెక్టరేట్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్నేహ సంఘాల సభ్యులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎంపికై న బాలికలు సభాపతి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు, ప్రజా ప్రతినిధుల పాత్రలు పోషిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా చూపించారు. పలు విషయాలపై చర్చించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ భాస్కర్రావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్ల పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా శిశు సంక్షేమ అధికారి నర్సింహారావు, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చిరుచేతుల్లో విరిసిన సృజనాత్మకత
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం 16 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోంది. సాధారణంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు అమ్మమ్మ, నానమ్మల ఇళ్లకు వెళ్తుంటారు. కానీ, ఈసారి విద్యార్థినుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ శిబిరానికి బాలికల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రధానంగా లలిత కళలు, క్రీడలు, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి అంశాలపై నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు వంద మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ తరగతులు జరుగుతున్నాయి. శిబిరానికి వచ్చే విద్యార్థినులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం చల్లని పెరుగు అన్నం, తాగునీరు అందిస్తున్నారు. ఈ శిబిరాన్ని మండల విద్యాధికారి ధర్మానాయక్ పర్యవేక్షిస్తుండగా, ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఇన్చార్జ్ కృష్ణకాంత్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఆకట్టుకుంటున్న విద్యార్థుల చిత్రకళా నైపుణ్యం చిత్రకళా ఉపాధ్యాయురాలు ఇనుగుర్తి రేణుక ఆధ్వర్యంలో విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కేవలం డ్రాయింగ్ బేసిక్స్ మాత్రమే కాకుండా.. పెన్సిల్ వర్క్, వాటర్ కలర్స్ ఉపయోగించి ప్రకృతి దృశ్యాలు, సామాజిక అంశాలపై దాదాపు 150కి పైగా చిత్రాలను గీశారు. చిత్రలేఖనంతో పాటు పేపర్ క్రాఫ్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విద్యార్థినుల చేత బ్యాడ్జీలు, ఎన్విలాప్ కవర్లు, పెన్ స్టాండ్లు, పర్సులు, బ్యాగులు, ఒరిగామి బొమ్మలను తయారు చేయిస్తున్నారు. ఈ సృజనాత్మక ప్రదర్శనను ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ జూలకంటి వెంకటేశ్వర్రెడ్డి సందర్శించి, బాలికల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకళా నైపుణ్యాలను నేర్చకున్నవి సాధన చేస్తూ చదువుల్లో అవసరమయ్యే డ్రాయింగ్, సైన్స్ బొమ్మలను చాలా సులువుగా వేయొచ్చు. క్రమం తప్పకుండా ఈ శిక్షణకు సమయానికి అనుగుణంగా వస్తున్నాను. దీని వలన ఎంతో ఉపయోగకరమైన చిత్రాలను వేస్తున్నాను. – చంద్రిక, 7వ తరగతి, ఎస్పీఆర్ స్కూల్, మిర్యాలగూడ ఫ వేసవి శిబిరంలో ఉత్సాహంగా సాగుతున్న చిత్రలేఖన శిక్షణ ఈ వేసవి శిక్షణలో ఎంతో నేర్చుకున్నాను. ప్రధానంగా బేసిక్స్, కలర్స్ వేయడం, షేడింగ్ వంటి వాటిని నేర్చుకున్నా. టీచర్ కూడా అదే రీతిలో బేసిక్స్ను నేర్పించారు. – భార్గవి 6వ తరగతి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మిర్యాలగూడ -
ఆ రెండు మండలాల్లో పొంచి ఉన్న
పింఛన్ పైసలు ఎప్పుడిస్తరు.. చేయూత పింఛన్లు సకాలంలో అందకపోవడంతో యాదగిరిగుట్ట పట్టణంలో లబ్ధిదారులు ధర్నాకు దిగారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.సంస్థాన్నారాయణపురం, ఆత్మకూర్(ఎం)లో ప్రమాద ఘంటికలు - 9లోశనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026విధి నిర్వహణలో అలసత్వం వద్దు : ఎస్పీవలిగొండ : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన వలిగొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి గడువులోగా చార్జీషీట్ వేయాలని సూచించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణమే సహాయం అందించాలన్నారు. పెట్రోలింగ్, ప్రజా ఫిర్యాదులపై సిబ్బంద కి కీలక ఆదేశాలు చేశారు. ఆయన వెంట రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ యుగంధర్, సిబ్బంది ఉన్నారు.వైభవంగా ఊంజల్ సేవయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. స్వర్ణగిరీశుడికి తిరువీధి ఉత్సవసేవభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం అర్చకులు శ్రీవేంకటేశ్వర స్వామికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుభ్రబాతం, తోమాలు, సహస్ర నామార్చన, పద్మావతి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన సేవలు నిర్వహించి స్వామి వారికి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సాక్షి, యాదాద్రి : భారీ వర్షాలు కురిసినా.. భూగర్భ జలాలు మాత్రం పాతాళానికి చేరుతున్నాయి. ఇష్టానుసారంగా బోరుబావుల ద్వారా నీటిని తోడేస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని జల సంక్షోభం ముంచుకొస్తోంది. జిల్లాలోని ఆత్మకూర్ (ఎం), సంస్థాన్ నారాయణపురం మండలాల్లో భూగర్భ జలమట్టాలు 11 మీటర్ల లోతుకు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025 వెల్లడించింది. భారీ వర్షాలు కురిసినా.. ఫలితం శూన్యం సాధారణంగా వర్షాలు బాగా పడితే భూగర్భ జలాలు పెరుగుతాయని భావిస్తాం. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. గత సంవత్సరం జిల్లాలో 174 శాతం అదనపు వర్షపాతం నమోదైనప్పటికీ, సంస్థాన్నారాయణపురం, ఆత్మకూర్(ఎం) మండలాల్లో భూగర్భ జలమట్టాల్లో ఆశించిన మార్పూ రాకపోవడం గమనార్హం. భూగర్భ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం, సర్వేల్ గ్రామాల్లో జలాలు 24.4 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో 11.98 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో సాధారణంగా ఉండాల్సిన నీటిమట్టం కంటే సగటున 4 మీటర్ల వరకు లోతుకు నీరు పడిపోయింది. మార్చిలో ఉండాల్సిన 4.25 మీటర్ల స్థానంలో 7.73 మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అవగాహన పెరిగింది కానీ.. ప్రజల్లో జల సంరక్షణపై అవగాహన పెరిగినా ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి. నీటిని భూమిలోకి పంపే రిచార్జ్ ప్రక్రియ ఒకవైపు జరుగుతున్నా దానికి రెట్టింపు స్థాయిలో బోరుబావుల ద్వారా నీటినితోడేస్తున్నారు. దీంతో జల సంక్షోభం ఏర్పడుతోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో గుట్టల ప్రాంతం అధికంగా ఉంది. నీటి నిలువ శాతం చాలా వరకు తగ్గిపోయింది. పర్యావరణంపై ప్రభావం ప్రతి సంవత్సరం నవంబర్ నాటికి (వర్షాకాలం ముగిశాక) 3 మీటర్లు, మే నాటికి 5 మీటర్ల జలమట్టం స్థిరంగా ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని అధికారుల లెక్కలు చెబుతున్నారు. అయితే నీటిమట్టాలు తగ్గిపోవడంతో అకాల వర్షాలు పడడంతోపాటు ఎండలు మండిపోతాయి. భూమికి కూడా నెలవారీగా అవసరమైన జలం అందకపోతే భూగర్భ వ్యవస్థ దెబ్బతింటుంది. పర్వతారోహణ ఒక కల. ఎవరెస్ట్ ఎక్కడానికి ఏప్రిల్, మే నెల అనువైనది. పర్వతారోహణకు కనీసం 6 నెలల ముందు నుంచే శిక్షణ తీసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటివి రోజూ సాధన చేయాలి. వీపుపై 15 నుంచి 20 కిలోల బరువున్న బ్యాగ్ని వేసుకుని ఎత్తయిన ప్రదేశాల్లో నడవడం ప్రాక్టీస్ చేయాలి. తీవ్రమైన చలి, శారీరక అలసటను తట్టుకునేలా మానసిక దృఢత్వం సాధించాలి. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ఉండేలా శిక్షణ పొందాలి. పర్వతం ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి తగ్గుతుంది. శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడటానికి బేస్ క్యాంపుల వద్ద కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా తగు జాగ్రత్తలు పాటించాలి.రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం కండి : కలెక్టర్ సాక్షి, యాదాద్రి : రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భువనగిరిలోని జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి కలెక్టర్ తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జూన్ 2న జాతీయ పతాకావిష్కరణలో భాగంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అతిథులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రముఖులు, మీడియా ప్రతినిధులు తదిరులకు సీటింగ్ గ్యాలరీలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతి నివేదిక సమగ్రంగా రూపొందించాలన్నారు. అమరవీరుల స్థూపం, స్టేజీ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శంకరమ్మ, శ్వేతలను సన్మానిస్తున్న మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే సామేల్, చెవిటి వెంకన్న, పున్న కైలాష్ మోత్కూరు : తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియామకమైన సందర్భంగా వారికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరులో సన్మాన సభ నిర్వహించారు. ముందుగా అయిలమ్మ, శ్రీకాంతాచారి చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలిదశ దశ ఉద్యమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పురుడు పోసుకున్నాయన్నారు. కాసోజు శంకరమ్మను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవమానిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెతోపాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియమించి తగిన గౌరవం ఇచ్చిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ గద్దర్ బిడ్డకు సైతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించిందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. రాష్ట్ర మహిళా కమి షన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. కళాకారుడు గిద్ద రామనర్సయ్య బృందం ఆటాపాటలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, జిల్లా అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్రావు, చౌటుప్పల్ డీఎస్పీ పి.మధుసూదన్రెడ్డి, మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, డీసీసీ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి అవిశెట్టి అవిలుమల్లు, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకన్న, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షు జీడు గుండగోని రామచంద్రు గౌడ్, గుండగోని జోజి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఎవరెస్ట్ అధిరోహణలోప్రాణాలు కోల్పోతే.. మృతదేహాలను కిందికి తీసుకురాలేక, అక్కడే వదిలేస్తారు. కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో ముందుకు సాగే సాహసకులు బరువును కోల్పోతారు. మైదాన ప్రాంతంలో పది కిలో మీటర్లు పరుగెత్తే వారు ఎవరెస్ట్ మీద ఆయాసంతో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి శవాలను తీసుకురావడానికి ముందుకు వచ్చే వారు తక్కువగా ఉంటారు. సాధారణ మనిషి బరువు 50 నుంచి 60 కిలోలు ఉంటే, వారి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సామగ్రి బరువు మరో 5 నుంచి 10 కిలోలు ఉంటుంది. ఎవరెస్ట్పై దారులు చాలా ఇరుగ్గా, లోయలతో ఉంటాయి. అడుగు అటుఇటు పడితే లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ దారుల్లో, ఒక మృతదేహం, లేదా ప్రమాదంలో చిక్కుకున్నవారిని కిందికి తీసుకురావాలంటే ఎంతో రిస్క్. ప్రస్తుతం ఎవరెస్ట్పై ఎక్కువ మరణాలు సంభవిస్తున్న ప్రాంతం ‘హిల్లరీ స్టెప్’. ఇక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి గానీ, తాడు కిందకి వేసి రక్షించడానికి గానీ వీలుండదు. ఎందుకంటే ఆ ఎత్తులో హెలికాప్టర్ ఎక్కువసేపు ఆగలేదు. భక్తజన సందోహంఫ 11 నుంచి 24 మీటర్ల లోతుల్లోకి పడిపోయిన జలాలు ఫ పరిమితికి మించి నీటినితోడేస్తుండడమే కారణం ఫ 2025 భూగర్భ జల నివేదికలో వెల్లడి మే నెలలో నీటిలోతు ఇలా (మీటర్లలో) వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..) మండలం 2023–24 2024–25 నారాయణపురం 624.2 682.8 ఆత్మకూర్(ఎం) 742.4 993.4 ఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఫ మోత్కూరులో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శంకరమ్మ, శ్వేతలకు సన్మానం -
చేనేత మహిళా కార్మికులు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ఫ ఆసుయంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశం భూదాన్పోచంపల్లి: చేనేత మహిళా కార్మికులు ఆర్థిక స్వావలంబన సాఽధించాలని ఆసుయంత్ర సృష్టికర్త, పద్మశ్రీ చింతకింది మల్లేశం అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని భద్రావతి కాలనీలో గల మాస్టర్వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో చేనేత మహిళా కార్మికులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు లూమ్, ప్రీలూమ్పై ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా తమ వృత్తి నైఫుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. గతంలో జనగాంలో విజయవంతంగా శిక్షణ తరగతులను పూర్తి చేశామని పేర్కొన్నారు. పోచంపల్లి పరిసరప్రాంతాల మహిళా చేనేత కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్ట్ లీడ్ కై రంకొండ దిలిప్కుమార్, మాస్టర్వీవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంకం మురళి, అధ్యక్షుడు రాపోలు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏలే పాండు, ప్రధాన కార్యదర్శి బోగ రమేశ్, సభ్యులు రుద్ర శ్రీశైలం, ఆడెపు అంజనేయులు, కుడికాల భాస్కర్, అంకం సాయి, చెన్నకేశవులు, చింతకింది దామోదర్, నక్క రాంచంద్రం, పెంట నవీన్, సకినాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అజాగ్రత్తకు ఐదు ఇళ్లు ఆహుతి
మద్దిరాల : వరికోతల అనంతరం మిగిలిన వరికొయ్యలకు పెట్టే నిప్పు నిరుపేదల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎండల తీవ్రతకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో ఈ మంటలు కిలోమీటర్ల మేర వ్యాపించి పొలాల్లోని మోటార్లు, వైర్లు, పైపులు, గడ్డివాములతో పాటు నివాసాలను కూడా బూడిద చేస్తున్నాయి. ఇటీవల మద్దిరాల, కుంటపల్లి, కుక్కడం, రెడ్డిగూడెం గ్రామాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. తాజాగా శుక్రవారం అక్కమ్మకుంట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలకు పెట్టిన నిప్పు కుక్కడం గ్రామ పరిధిలోని దేవాళ్లతండాలో పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపించిన మంటలు దేవాళ్లతండా సమీపంలోని అక్కమ్మకుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పు పెట్టారు. తీవ్రమైన ఎండ, గాలి తోడవడంతో ఆ మంటలు ఉధృతంగా మారి, పొలాల నుండి కిలోమీటరు మేర విస్తరించి నేరుగా దేవాళ్లతండాపైకి దూసుకొచ్చాయి. తండావాసులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఐదు పూరిగుడిసెలకు నిప్పంటుకోగా.. మూడు గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మరో రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం తప్పినప్పటికీ.. గుడిసెల్లో ఉన్న బియ్యం, బట్టలు, టీవీలు, ఫ్యాన్లు మరియు దాచుకున్న నగదు పూర్తిగా కాలిపోవడంతో తండావాసులు రోడ్డున పడ్డారు. సైదులు అనే రైతు రూ.15వేలు పెట్టి ఇటీవలే పైపులు తీసుకోగా అవికూడా మంటలకు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఫ వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో దేవాళ్లతండాకు వ్యాపించిన మంటలు ఫ దగ్ధమైన ఐదు పూరిగుడిసెలు ఫ నగదు, సామగ్రి కాలి నిరాశ్రయులైన గిరిజనులు కేతేపల్లి: వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి అక్కడే ఉన్న పైప్లైన్లు కాలిపోయాయి. ఈసంఘటన కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్తపేట గ్రామం నుంచి కొర్లపహాడ్ గ్రామానికి వెళ్లే డొంకదారి వెంట శుక్రవారం వరికొయ్యలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈదురు గాలులతో దాదాపు ఎకరాల భూమికి మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు రైతులకు చెందిన పైపులైన్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న నకిరేకల్, సూర్యాపేట ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
అంగన్వాడీ పోస్టుల భర్తీకి కసరత్తు
భువనగిరి : అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో జిల్లా అధికారిలు కసరత్తు ప్రారంభిచారు. మొదట పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టిన తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం విడుదల కావడంతో త్వరలో ప్రక్రియను చేపట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు సిద్ధమయ్యారు. బదిలీలు, పదోన్నతుల అనంతరం.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో టీచర్ల పోస్టులు 62, ఆయాల పోస్టులు 281 ఖాళీలు ఉన్నాయి. టీచర్ల పోస్టులను అర్హులైన ఆయాలకు పదోన్నతుల కల్పించడం ద్వారా భర్తీచేయనున్నారు. వీరిలో ఇంటర్మీడియేట్ చేసి ఐదేళ్లు అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఖాళీలను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం భర్తీ చేయనున్నారు. దీంతో పాటు ఆయాల విషయంలో 65 ఏళ్లు నిండిన వారిని గుర్తించి స్వచ్ఛంద విరమణపై ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. మౌఖిక పరీక్షకు 10 మార్కులు గతంలో 100 మార్కులను వెయిటేజ్ కింద కేటాయించగా ఇందులో ఇంటర్మీడియేట్ పూర్తిచేసిన వారికి 80, మిగతా వాటికి మౌఖిక పరీక్ష నిర్వహించేశారు. ఇందులోనే వితంతువులకు 5, అనాథలకు 10, దివ్యాంగులకు 5 మార్కుల చొప్పున రిజర్వేషన్ కేటాయించారు. తాజాగా 80 మార్కులే కేటాయించి ఇంటర్మీడియేట్ అర్హతకు 70 మార్కులకు కుందించారు. మిగతా 10 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో.. అంగన్వాడీ టీచర్ల ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఆర్డీఓ, జిల్లా వైద్యాధికారి, కన్వీనర్గా జిల్లా సంక్షేమ శాఖ అధికారి వ్యవహరించనున్నారు. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల వివరాలపై కలెక్టర్కు నివేదిక అందిజేస్తారు. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసిన దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపిక జాబితాను ప్రభుత్వానికి నివేదించి ఆమోదం పొందిన తర్వాతన నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఫ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం ఫ త్వరలో పదోన్నతులు, బదిలీలు ఫ ఆ తర్వాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఫ జిల్లాలో 62 టీచర్లు.. 281 ఆయా పోస్టులు ఖాళీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించాం. ముందుగా పదోన్నతుల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తాం, అనంతరం ఖాళీల వివరాలను సేకరించి కలెక్టర్కు నివేదిక అందజేస్తాం. అనంతరం మిగిలిన ఖాళీలపై నోటిఫికేషన్ విడుదల చేసి నిబంధనల ప్రకారం భర్తీ చేస్తాం. – కె.నరసింహారావు, జిల్లా సంక్షేమ అధికారి -
ఆర్థిక సాధికారతే లక్ష్యం
వికలాంగుల ఆర్థిక సాధికారతే లక్ష్యమని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. - 8లోఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు బెల్లంకొండ శంకరయ్య. సొంతూరు సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం. తనకున్న ఆరెకరాల్లో రెండు ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు. దానికోసం రెండేళ్ల కాలంలో 8 బోర్లు వేయించాడు. ఒక్కో బోరు 500 నుంచి 600 ఫీట్ల వరకు వేయించాడు. దీనికోసం సుమారు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశాడు. గత మార్చిలో కూడా వరి పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేయించాడు. వీటి కోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశాడు. ఈరెండింటిలో ఒక బోరు హాఫ్ ఇంచ్, మరొక బోరు ఇంచు నీళ్లు పోస్తున్నాయి. ఈ నీళ్లతో అర ఎకరం కూడా పారే పరిస్థితి లేదు. -
వికలాంగుల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సును సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అధ్యక్షతన యాదగిరిగుట్టలో ప్రారంభించారు. విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా సంఘం జెండాను వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ అమలవుతోందని తెలిపారు. రూ.3.75 కోట్ల నిధులతో 80వేల మంది వికలాంగులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వికలాంగులకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4,372 మంది వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. రెండో దఫా ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం వికలాంగులకు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రంలో 2 లక్షల మందికి చేయూత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగ ప్రకాష్, కార్యదర్శి ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.స్వామి, కోశాధికారి లలిత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు గౌడ్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ముత్యాలు, ఎన్పీఆర్డీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రాజు, యశోద, నాగలక్ష్మి, కాషప్ప తదితరులు పాల్గొన్నారు. ఫ టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య -
దొంగతనం కేసులో ఆటోడ్రైవర్ అరెస్ట్
ఫ 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఆటో స్వాధీనంసూర్యాపేటటౌన్ : మహిళను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బంగారు పుస్తెలతాడు దొంగత నం చేసిన ఆటో డ్రైవర్ను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వెంకటయ్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 27న చివ్వెంల మండల కేంద్రానికి చెందిన ధనలక్ష్మి పట్టణంలోని ఖమ్మం అండర్పాస్ వద్ద చివ్వెంల వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది. ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కించుకుని ఖమ్మం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం పరిసరాల్లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి ఆటో నంబర్ను గుర్తించారు. దాని ఆధారంగా ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన భూతం మహేష్ను నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాసనగర్లో అద్దె ఇంట్లో ఉన్న మహేష్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నంమిర్యాలగూడ: మండల కేంద్రంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లేందుకు యత్నించారు. సదరు మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వస్తున్నట్లు గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పడిగపాటి నారాయణమ్మ అనే మహిళ శుక్రవారం సాయంత్రం తన ఇంటి సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఆమెను అనుసరిస్తూ వచ్చారు. వారిలో బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించగా, వెనుక కూర్చొన్న మరో వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. నారాయణమ్మ దగ్గరకు రాగానే వారు ఒక్కసారిగా బైక్ ఆపారు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి కిందకు దిగి నారాయణమ్మ మెడలోని బంగారు గొలుసును దొంగలించడానికి ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో నారాయణమ్మ కిందపడిపోయి గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి రావడంతో ఇద్దరు దుండగులు బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తరుగు పేరుతో కోత విధించారని ధర్నా
గుండాల : కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించకుండానే తరుగు పేరుతో కోత విధించిన కేంద్ర ఇన్చార్జి, మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుండాల మండల కేంద్రంలో శుక్రవారం రైతులు రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిప్పంటించి ధర్నా చేశారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతు మేకల చంద్రయ్య ధాన్యాన్ని 382 బస్తాలు తూకం వేసినట్లు చెప్పారు. ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించకుండానే సెంటర్ ఇన్చార్జి 10 బస్తాలను తరుగు పేరు మీద తీసి వేసి 372 బస్తాలను లారీలోకి ఎగుమతికి ట్రక్ షీట్లో నమోదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతులు మేకల సోమయ్య, శ్రీరాముల ఉదయ్, బయ్య లింగస్వామి, యాకస్వామి, మాదరబోయిన రాంమల్లు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాలను ఇలా అధిగమించాలి..
పర్వతాలపై ప్రకృతి మన నియంత్రణలో ఉండదు. ప్రధానంగా తీవ్రమైన చలి వల్ల చేతులు, కాళ్ల వేళ్లకు రక్తం ప్రసరించదు. వేళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. ఒకవేళ మొద్దుబారినట్లు అనిపిస్తే వెంటనే కింది క్యాంపునకు దిగిపోవాలి. అనుభవజ్ఞులైన ‘షెర్పా’ గైడ్ల పర్యవేక్షణలోనే ఉండాలి. అక్కడ ఒక అగ్గిపెట్టె బరువు కూడా వంద కిలోలుగా అనిపిస్తుంది. అనవసరమైన బరువులు లేకుండా శరీరాన్ని సిద్ధం చేసుకుని వెళ్లడమే సురక్షితం. 8వేల మీటర్ల ఎత్తు తర్వాత ఆక్సిజన్ స్థాయి 5 నుంచి 10 శాతం మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాన్ని డెత్ జోన్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు సరిగా ఉపయోగించాలి. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. 2015, 2019లో మంచు చరియలు విరిగిపడి ఎంతో మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.పార్థివ దేహాలను అక్కడే వదిలేస్తారు -
ఎవరెస్ట్పై అడుగు
ఫ ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది సాక్షి, యాదాద్రి : ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతారోహణ కేవలం ఒక సాహస యాత్ర మాత్రమే కాదు, అది ప్రకృతి.. మనిషికి విసిరే అతిపెద్ద సవాలు. దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా శారీరకంగా, మానసికంగా శిక్షణ పొందాలి’ అంటున్నారు భువనగిరి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి. ఇటీవల హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఎవరెస్ట్ అధిరోహణలో ప్రాణాలు కోల్పోవడం.. ఆయన పార్థివదేహాన్ని అక్కడే వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. 2022 మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి అప్పటి తన అనుభవాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ఫ డెత్ జోన్లో ప్రాణాలకు పెనుముప్పు ఫ పర్వతారోహణకు ముందు సరైన శిక్షణ తీసుకోవాలి ఎవరెస్ట్ అధిరోహకురాలు పడమటి అన్వితారెడ్డి -
యాదగిరి క్షేత్రంలో గిరిప్రదక్షిణ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు ముఖ మండపంలో స్వాతి హోమం జరిపించారు. ముఖ మండపంలో బంగారు, వెండి కలశాలకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం వేడుక జరిపించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు యాదగిరికొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆయా వేడుకల్లో ఆలయ ఈఓ భవాని శంకర్, ఆలయాధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
కరెంట్ వైరు చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్
హుజూర్నగర్ : కరెంట్ వైరు చోరీ కేసులో ఆరుగురిని గరిడేపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.40లక్షల విలువైన వైరు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. హుజూర్నగర్లోని తన కార్యాలయంలో సీఐ చరమంద రాజు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. గరిడేపల్లి మండలం కొత్తూరు తాళ్ల్లమల్కాపురం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి నాగిరెడ్డి సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. మండలంలోని కీతవారిగూడెం నుంచి ముత్యాల్నగర్ వరకు సుమారు 16 కిలో మీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్ వేసేందుకు కాంట్రాక్ట్ పొందాడు. వైరు లాగే పనుల కోసం ఆత్మకూర్ మండలం మంగల్తండాకు చెందిన లూనవత్ అశోక్, లూనవత్ సైదులు, లూనవత్ నెహ్రూ, లూనవత్ సురేశ్, ధరావత్ ప్రసాద్, చివ్వెంల మండలం మంగల్ తండాకు చెందిన ధరావత్ ప్రసాద్లను పెట్టుకున్నాడు. వారు దురాశతో సుమారు 10 రోజులక్రితం కరంట్ వైర్ లాగుతున్న క్రమంలో 217 కేజీల 33 కేవీ వైర్ను వాగులో దాచి పెట్టారు. ఈవిషయం దొంతిరెడ్డి నాగిరెడ్డికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పొనుగోడు ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వైరు తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ 2.40 లక్షల విలువ గల వైర్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి, కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఫ రూ.2.40లక్షల విలువైన వైరు, ఆటో స్వాధీనం -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
మిర్యాలగూడ టౌన్ : చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన సంఘటన మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన నూకల శంకర్ తోటి మత్స్యకారులు నక్క అంజి, మేడారపు నాగయ్య, జిట్టబోయిన శివతో కలిసి గురువారం రాత్రి 11గంటల సమయంలో యాద్గార్పల్లి చెరువులో చేపల కోసం వలలు వేసేందుకు వెళ్లారు. చెరువు పెద్దగా ఉండటంతో నలుగురు నాలుగు దిక్కులుగా వెళ్లారు. వలలు వేసే సమయంలో ఈదురుగాలులు విపరీతంగా రావడంతో నూకల శంకర్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య నాగార్జున సాగర్ నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీం రప్పించి యాద్గార్పల్లి చెరువులో ఉదయం నుంచి బోట్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు కూడా శంకర్ ఆచూకీ కనిపించలేదు. అతడి తండ్రి నూకల లక్ష్యయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికంటి లక్ష్యయ్య తెలిపారు.ఫ రెస్క్యూ టీంతో గాలింపు -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. -
పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు
రామగిరి(నల్లగొండ) : సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అనుబంధంగా కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్, ఆటోమేషన్, అధునాతన మ్యాన్ఫ్యాక్చరింగ్ రంగాల్లో స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ఐదు కళాశాలల్లో కొత్త కోర్సులు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట) ఉన్నాయి. నల్లగొండలో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, నాగార్జునసాగర్లో అడ్వాన్స్డ్ మ్యాన్ఫాక్చరింగ్ టెక్నాలజీ, సూర్యాపేటలో ల్యాండ్ స్కేప్ డిజైన్, తిరుమలగిరిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, యాదగిరిగుట్టలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈసారి అడ్వాన్స్డ్ కోర్సులకు అనుమతులు మంజూరయ్యాయి. టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఈ కొత్త కోర్సులతో కలిపి ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్, 29 నుంచి జూన్ 1 వరకు సరిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, జూన్ 6న కళాశాలల కేటాయింపు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త కోర్సులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. -
బాల్యంలోనే బడిబాట
పాఠశాలల్లో అదనంగా ప్రీప్రైమరీ సెక్షన్లు రామన్నపేట : చిన్నారులు బ్యాలంలోనే బడిబాట పట్టేలా ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుసంధానంగా ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పా టు చేస్తోంది. దీంట్లో భాగంగా గత విద్యా సంవత్సరం జిల్లాకు 45 స్కూళ్లకు ప్రీప్రైమరీ సెక్షన్లు మంజూరు చేయగా వాటిని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. తాజాగా 62 ప్రీప్రై మరీ సెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పాఠశా ల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచే ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించనున్నారు. గతేడాది, ప్రస్తుతం మంజూరైన వాటితో కలిపి జిల్లాలో ప్రీప్రైమరీ స్కూళ్ల సంఖ్య 107కు చేరుకుంది. ప్రైవేట్కు దీటుగా.. ఐదేళ్లు నిండిన పిల్లలనే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో చేర్చుకుంటారు. అదే ప్రైవేటు పాఠశాలలో మూడేళ్లు నిండగానే ఎల్కేజీ, యూకేజీ సెక్షన్లలో చేర్చుకుంని పాఠశాలలకు అలవాటు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడం వల్ల పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి రూ.వేలకువేలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆచరణలో పెట్టింది. గత విద్యా సంవత్సరం జిల్లాకు 45 స్కూళ్లకు ప్రీప్రైమరీ సెక్షన్లు మంజూరు చేయగా కొత్తగా మంజూరైన వాటితో కలిపి వాటి సంఖ్య 107కు చేరింది. పిల్లల నమోదు పెంచాలని.. చిన్నపిల్లలకు బడి అంటే భయం పోగొట్టి పాఠశాలకు అలవాటు చేయడం, ఇంగ్లిష్ మీడియంకు సన్నద్ధం చేయడం ప్రీప్రైమరీ సెక్షన్స్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. చిన్నపిల్లలను పాఠశాలకు ఆహ్వానించడం, కథలు, పాటలు, ఆటలు ద్వారా ఆకట్టుకుంటూ యూకేజీ విద్యను అందించనున్నారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ సెక్షన్ నిర్వహణకు అదనంగా ఇంటర్ టీటీసీ కనీస విద్యార్హత కలిగిన ఇన్స్ట్రక్టర్తో పాటు, ఆయాను నియమిస్తారు. విద్యార్హత ప్రతిభ ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ వీరిని నియమిస్తుంది. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేల వేతనం ఇవ్వనున్నారు. ప్రీప్రైమరీ సెక్షన్ మంజూరైన ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.1.50లక్షలు మంజూరు అవుతాయి. ఆ నిధులతో ప్రీప్రైమరీకి కేటాయించిన గదిని చిన్నారులకు కావాలిసన వివిధ రకాల బొమ్మలతో కూడిన పేయింటింగ్ వేయిస్తారు. పిల్లలు కూర్చోవడానికి అనువైన ఇరవై కుర్చీలు, ఐదు గ్రూప్ టేబుల్స్, టీచర్ చైర్, టేబుల్, రెండు లేదా మూడు ఓపెన్ ర్యాక్స్, ప్లే మెటీరియల్ బిన్స్, బ్లాక్బోర్డు, చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులను, పడుకోవడానికి అనువైన బెడ్లను సమకూరుస్తారు. ఫ ఈ విద్యాసంవత్సరానికి 62 మంజూరు ఫ జూన్లోనే ప్రారంభానికి సిద్ధం ఫ గత ఏడాదిదే మంజూరైనవి 45 ఫ ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రీప్రైమరీ సెక్షన్లు -
ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ
అర్వపల్లిలోని జెడ్పీహెచ్ఎస్లో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బిగ్హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాలీబాల్లో శిక్షణ ఇస్తున్నాం. పిల్లల నుంచి మంచి స్పందన వస్తోంది. శిక్షణ సందర్భంగా బాలబాలికలకు తగిన మెలకువలు నేర్పుతున్నాం. – మల్లేష్, పీడీ, అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్ అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా వాలీబాల్ శిక్షణ శిబిరం ఎంతో బాగుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజు పిల్లలు వచ్చి వాలీబాల్ లో శిక్షణ పొందుతున్నారు. ఎండల్లో తిరగకుండా ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంది. – ఈద కోటిప్రసాద్, క్రీడాకారుడు అర్వపల్లి -
తడిసిన ధాన్యానికీ మద్దతు ధర
సాక్షి, యాదాద్రి : తడిసిన ధాన్యానికీ మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం భువనగిరి కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులతో ఆయన ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరి సాగు, దిగుబడి, కొనుగోళ్లలోనూ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారుల కృషిని మంత్రి అభినందించారు. ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధరను ప్రకటించడం తప్ప కొనుగోళ్లకు, రైతులకు గానీ ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీఽనివాస్రెడ్డి మాట్లాడూతూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యతను విస్మరించిప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంత్రి ధాన్యం కొనుగోళ్ల తీరును ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, బండ్రు శోభారాణి, ఎస్పీ అక్షాంశ్యాదవ్, అదనపు కలెక్టర్లు ఎ.భాస్కర్రావు, కె.వెంకారెడ్డి, ఆర్డీఓలు మాలి కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
అడ్డగోలుగా హోర్డింగ్లు!
హోర్డింగులు, భారీ ఫ్లెక్సీల విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే ప్రత్యేక సర్వే నిర్వహిస్తాం. మున్సిపాలిటీకి రావాల్సిన పన్నుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించం. నాణ్యత లేకుండా, ప్రమాదకరంగా ఉన్న బోర్డులను గుర్తించి వాటిని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకుంటాం. – కె.చంద్రప్రకాశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో కొందరు వ్యాపారులు నిబంధనలకు పాతరేస్తూ తమ వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగులు, డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు, భారీ ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నిబంధనల ప్రకారం బోర్డులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వ్యాపార ప్రకటనల పేరుతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్లుగా నయాపైసా పన్ను లేదు.. జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పుల్, ఆలేరు మున్సిపాలిటీల్లో 2024 సంవత్సరం నుంచి మున్సిపాలిటీల్లో వ్యాపార ప్రకటన పన్ను వసూళ్లు పూర్తిగా పడకేశాయి. నిధుల కొరతతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతున్నా.. ఉన్న ఆదాయ వనరులను కూడా మున్సిపాలిటీలు చేజేతులా వదిలేసుకుంటున్నాయి. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే హోర్డింగులు, భారీ ఫ్లెక్సీలపై రెండేళ్లుగా పన్ను వసూలు చేయకపోవడం వెనుక అంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రమాణాలు గాలికి.. కేవలం ఆదాయం కోల్పోవడమే కాకుండా, ఈ హోర్డింగుల ఏర్పాటులో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఈ భారీ బోర్డులకు నిర్మాణ నాణ్యత ఉందో లేదో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్టిఫై చేయాలి. కానీ, ఆ ఊసే ఎత్తడం లేదు. నాణ్యత లేని పాత ఇనుప పైపులు, తుప్పుపట్టిన రాడ్లతో ప్రధాన రహదారుల పక్కన, చౌరస్తాల్లో వీటిని నిలబెడుతున్నారు. గాలిదుమారాలు వస్తే.. అంతే సంగతులు ప్రస్తుతుం కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతకు ఈ నాణ్యత లేని భారీ హోర్డింగులు ఎప్పుడు ఊడి నెత్తిన పడతాయోనని రోడ్డుపై వెళ్లే వాహనదారులు, కాలినడకన వెళ్లే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు స్పందించి మున్సిపాలిటీల్లో వెలిసిన అక్రమ హోర్డింగులపై తక్షణమే తొలగించడంతో పాటు, బకాయి పన్నులను వసూలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫ పట్టణాల్లో వ్యాపారుల ఇష్టారాజ్యం ఫ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, ఎల్ఈడీ స్క్రీన్ బోర్డుల ఏర్పాటు ఫ మున్సిపల్ ఖజానాకు రూ.లక్షల్లో గండి ఫ గాలి దుమారానికి కూలుతున్న బోర్డులు ఫ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం -
సెలవుల్లో ఆటల పండుగ
అర్వపల్లి: వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. విద్యార్థులు బంధువుల ఇళ్లకు వెళ్లడమో, లేదా రోజంతా సెల్ఫోన్లతో కాలక్షేపం చేయడమో చేస్తుంటారు. కానీ, వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, వారిని క్రీడల వైపు మళ్లించేలా జిల్లా యువజన క్రీడాభివృద్ధి సంస్థ ఈ వేసవిలో ప్రత్యేక వాలీబాల్ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్, తుంగతుర్తి మండలంలోని అన్నారం, వెలుగుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపికచేసి ఈ పాఠశాలల్లో 14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. 28 రోజులుగా కొనసాగుతున్న శిక్షణ ఆయా పాఠశాలల్లో జిల్లా యువజన క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 1న వాలీబాల్ శిక్షణ ప్రారంభమైంది. జూన్ 5 వరకు మొత్తం 35 రోజులపాటు ఈ శిక్షణ జరగనుంది. ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ) విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మండల కేంద్రాలతో పాటు చ్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో శిబిరాలకు వచ్చి వాలీబాల్ ఆడుతున్నారు. అర్వపల్లి జడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న శిక్షణకు బిగ్హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒక్కో శిబిరానికి ప్రతి రోజు 50 మందికి పైగానే బాలబాలికలు హాజరవుతున్నారు. ఇంటి నీడలో కాలక్షేపం యాదగిరిగుట్ట: వేసవి సెలవుల్లో చిన్నారులు ఎక్కువగా బయట ఎండకు ఆటలు ఆడుతూ కనిపిస్తుంటారు. కానీ యాదగిరిగుట్టలో ఇంట్లోనే నీడ పట్టున ఉంటూ ఆటలు ఆడితే శ్రేయస్కరమని భావించి పలువురు చిన్నారులు క్యారమ్స్ ఆడుతూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఫ మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్సాహంగా సాగుతున్న వేసవి శిబిరాలు ఫ 28 రోజులుగా ఆటలో మెలకువలు నేర్చుకుంటున్న విద్యార్థులు -
భూముల విలువల ఖరారుపై అధికారుల కసరత్తు
తవ్వారు.. వదిలేశారు ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం నుంచి రహీంఖాన్పేట వరకు రోడ్డును తవ్వి, కంకర పరిచి వదిలేశారు.- 9లోశుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026సాక్షి, యాదాద్రి : వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు జిల్లాస్థాయి కమిటీల పర్యవేక్షణలో భూముల విలువ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతోంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రిజిస్టార్లు, హెచ్ఎండీఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. విపులంగా చర్చించిన అనంతరం భూముల, ఆస్తుల విలువలను ఖరారు చేయనున్నారు. పలుచోట్ల తప్పులు దొర్లడంతో మరోసారి సవరించిన భూముల విలువలను ఒకటిరెండు రోజుల్లో అమలులోకి తేవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. వీటిని భూ పరిపాలన శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా ఆమోదించనున్నాయి. సవరణ ప్రక్రియపై ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూములు, ఆస్తుల విలువల పెంపు నిర్ణయం కసరత్తు చర్చనీయాంశంగా మారింది. తమ భూములు, ఆస్తుల విలువలు పెరుగుతాయని జనంలో ఆసక్తి నెలకొంది. జిల్లాలో భూముల విలువల సవరణ ప్రక్రియ ప్రస్తుతం అధికారులు చేపట్టారు. కొన్ని గ్రామాల వివరాలను అధికారులు రీ–అప్లోడ్ చేస్తున్నారు. విలువల లెక్కింపు విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టారు. పరిగణనలోకి మార్కెట్ ధరలు భూభారతి బేస్ రేట్ ఉదాహరణకు ఎకరం రూ.2 లక్షలు ఉంటే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధర రూ.30 లక్షలు పలుకుతోంది. ఇలాంటి చోట మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని దాదాపు వంద శాతం ధరలను పెంచినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే దాదాపు రూ.4 లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయేతర భూములకు ఇలా.. ఇళ్ల స్థలాలు, కమర్షియల్ భూములకు జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) చైర్మన్గా ఉన్నారు. తహసీల్దార్లు, సబ్రిజిస్ట్రార్, మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామాలు అయితే ఎంపీడీవోలు సభ్యులుగా ఉన్నారు. హెచ్ఎండీఏ మండలాల్లో ఆ శాఖ అధికారులు ఉన్నారు. వ్యవసాయ భూములకు.. వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, తహసీల్దార్లు, సబ్రిజిస్ట్రార్, ఎంపీడీవో, హెచ్ఎండీఏ ఽప్రతినిధులు భూముల విలువల పెంపుపై సంతకాలు చేసిన తర్వాత అప్లోడ్ చేస్తున్నారు. అయితే తప్పులు దొర్లుతుండడంతో మళ్లీ తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం సబ్రిజిస్ట్రార్లు అధికారుల బృందం నిర్ణయించిన ఽవిలువలపై క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్ చేసి తుది ధరలను నిర్ణయిస్తున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు.. అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించే వరకు ఏ భూ మికి ఎంత ధర పెరింగిందన్న సమచారం వెల్లడించడంలేదు. ఎవరికి వారు అంచనాల్లో ఉన్నా రు. కొందరు అధికారులు ఇస్తున్న లీకులతో రేట్లు దాదాపు ఖరారు అయినట్లు ఆయా ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. రెండు మూడు రోజల్లో అధికారికంగా వెబ్సైట్లో భూముల విలువల పెంపు వివరాలు ప్రకటిస్తామని అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. చివరి గింజ వరకూ కొంటాంఏ పనులు చేసుకోలేరు నోష్ ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులు నేటికీ చికిత్స పొందుతున్నారు. - 8లోఫ ధాన్యం కొనుగోళ్లలో మొదటి స్థానం ఫ జిల్లా యంత్రాంగం పనితీరుకు అభినందనలు ఫ సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిజిల్లాలో జాతీయ రహదారుల వెంట వ్యవసాయ భూమి ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో రూ.కోట్లలో పలుకుతుంది. జాతీయ రహదారులు, యాదగిరిగుట్ట అభివృద్ధి, రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న హెచ్ఎండీఏ మండలాలు, రియల్ఎస్టేట్ వ్యాపారం, పారిశ్రామిక వాడలతో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ఆకాశన్నంటాయి. జాతీయ రహదారుల వెంట 25 శాతం ఽపెంపు చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఽగజం ధర రూ.లక్ష వరకు పలుకుతోంది. భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు, బీబీనగర్ ఎయిమ్స్, యాదగిరిగుట్ట, రాయగిరి వంటి ప్రాంతాల్లో గజం ధర రూ.50 వేలపైన పలుకుతోంది. ప్రధానంగా హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారుల వెంట భూముల ధరలు రూ.కోట్లలో ఉన్నాయి. అయితే ఇక్కడ మార్కెట్ విలువ ఇప్పటికే రూ.30 లక్షలకుపైగా ఉన్నాయి. 25 శాతం పెంపుతో ధరలు పెరుగనున్నాయి. భూముల రకాన్ని బట్టి జిల్లా స్థాయి కమిటీలు భూముల విలువలు నిర్ణయించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఫ తప్పులు దొర్లడంతో సవరిస్తున్న అధికారులు ఫ పెరగనున్న వ్యవసాయ భుములు, ఆస్తుల విలువ ఫ సాధారణ భూమి ఎకరం ధర వంద శాతం పెంపు ఫ హైవేల వెంట ఎకరాకు 25 శాతం పెంచే అవకాశం -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
అర్వపల్లి: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. వడదెబ్బతో వ్యక్తి మృతిమిర్యాలగూడ టౌన్ : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కాస నరసయ్య(49) అదే గ్రామానికి చెందిన బోలిశెట్టి రాము వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. దీంతో మైనం సుధాకర్ పొలంలో ట్రాక్టర్ ద్వారా మట్టిని ఒక చోట నుంచి మరో చోటుకు తరలించి మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఎండ తీవ్రంగా ఉందని, ప్రాణం బాగాలేదని ఆయన అంటుండగానే నరసయ్య అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తరలిస్తుండగా ఉట్లపల్లి గ్రామ శివారులోకి రాగానే మృతి చెందాడు. మృతుడి భార్య రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఫ పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన మహిళ -
ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమిస్తాం
భువనగిరిటౌన్ : యువజన, విద్యా రంగాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. గురువారం భువనగిరిలోని సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘం జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కోట్లాది ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే అందించాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, నాయకులు కొండూరి వెంకటేష్, ఎండీ. నయీమ్, నర్సింహా చారి, శోభన్ బాబు, ఆనంతుల నర్సింహా, కంబాల రాజు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..
భూసార పరీక్షల ఆధారంగా పంటలు రైతులు ముఖ్యంగా పండ్లతోటలు సాగ చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపు కొచ్చే దశలోనే క్షీణించి రైతుకు పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనుకూలమో నిర్ధారించుకోవాలి. పెద్దవూర: రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు ఇతర సాగు విధానాలపై రైతులు మెళకువలు, అవగాహన కలిగి ఉండాలని, వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ పేర్కొంటున్నారు. లోతు దుక్కులతో మేలు లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంటుంది. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్ధలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలుగ జేసే శిలీంద్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయట పడిన గ్రుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. భూమిలో 9 అంగుళాల వరకు లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం. కలుపు నివారణ తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలు నాశనం చేస్తాయి. కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి సత్తువ లేకుండా చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమేకాకుంగా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరికల వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు , దుంపలు ఏరి వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటులతో దున్నినప్పుడు నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి. ఫ గత ఖరీఫ్కు సంబందించి పొలాల్లో ఉన్న ప్రత్తి, కంది, ఆముదం కట్టెలను తొలగించి పొలంలోనే కాల్చివేయాలి. పొలంలో గట్టిపొర ఏర్పడితే ఎర్రని ఇసుక మట్టిని తోలడం వల్ల భూమి బాగుపడుతుంది. వేసిన పంట నుంచి వేర్లు సులభంగా భూమిలోకి దిగుతాయి. ఫ వేసవిలోనే సేంద్రియ ఎరువులు పంట పొలాలకు తరలించుకోవాలి. నీటి లభ్యత ఉన్న రైతులు పెంట కుప్పలపై నీటిని అడపదడపా చిలుకరించడం వల్ల తొందరగా ఎరువుగా మారుతుంది. పంట మార్పిడి తప్పనిసరి ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు సాగు చేసుకుని పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎప్పుడూ ఆహారం సమద్దిగా లభించి అవి వద్ది చెందుతాయి. ఆ పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి నేలసారాన్ని కాపాడుకోవడంతోపాటు తేమను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. ● వివిధ రకాల వేరు వ్యవస్థలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. ప్రత్తి, ఆముదం, పొద్దు తిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి. ● పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు , పొద్దు తిరుగుడు వంటి పంటలకు భూమికి పోషకాలు సమకూర్చే అవసరాల పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్ధితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుదాన్యాల పంటటు కాకుండా నూనె పంటలు సాగు చేయాలి. ● మిరుస, టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి పంటల ఎర పంటలుగా వేసుకోవాలి. టమాట, మిరుప, పుచ్చ పంటల్లో బంతిని కూడ ఎర పంటగా కొన్ని సాళ్లు వేసుకుని తెగుళ్లు, ఆకుముడత నివారించవచ్చు. ● పంట మార్పిడి చేసేటప్పుడు అనుకూలమైన పంటలు ఎంచుకోకపోతే చీడపీడల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బెండ తర్వాత పత్తి వేయొద్దు. జొన్న సాగు చేసిన వెంటనే మిరుప వేయకూడదు. ఈ పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్ట పరుస్తాయి. -
బైక్ దగ్ధం
మోతె: ఓ శుభకార్యానికి వచ్చి ఓ వ్యక్తి తన బైక్ను రోడ్డుపక్కన నిలపగా వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మోతె మండలంలోని రావిపహాడ్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి ఆలకుంట్ల రాములు శుభకార్యం నిమిత్తం బైక్పై రావిపహాడ్ గ్రామానికి వచ్చాడు. తన ద్విచక్రవాహనాన్ని పక్కకు ఆపిన కొద్దిసేపటికే బైక్ ప్లగ్ నుంచి పొగ రావడంతోపాటు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఎండ తీవ్రతకు బైక్ ఇంజన్ వేడెక్కి వాహనం దగ్ధమైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. తుమ్మలపెన్పహాడ్లో ట్రాన్స్ఫార్మర్.. ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో గురువారం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది. విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్పై లోడింగ్తో పాటు ఎండ తీవ్రతకు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మేక కడుపులో మూడు కిలోల ప్లాస్టిక్ కవర్లుకోదాడరూరల్ : కోదాడ పశువైద్యాశాలలో గురువారం మేక కడుపులో ఉండలు కట్టిన మూడు కిలోల ప్లాస్టిక్ కవర్లను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య బయటకు తీశారు. హుజూర్నగర్కు చెందిన ఉపేంద్రమ్మకు చెందిన మేక కొన్ని రోజులుగా మేత మేయకుండా ఇబ్బంది పడుతుండడంతో ఆ మేకను కోదాడకు తీసుకరాగా పరీక్షించిన డాక్టర్ పెంటయ్య.. మేక కడుపులో ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. సామూహిక పోరాటాలతోనే తెలంగాణ సాకారం మిర్యాలగూడ టౌన్ : సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సామాజికవేత్త, తొలి, మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ జాడీ రాజు అన్నారు. గురువారం మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి, గౌరవంగా సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులను సత్కరించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నేత మాళోతు దశరథనాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, వివిధ సంఘాల నాయకులు మాడుగుల శ్రీనివాస్, ధీరావత్ లింగానాయక్, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, మురళియాదవ్ పాల్గొన్నారు. -
తోపుడు బండిపై ధాన్యం బస్తాలు
ఫకొనుగోళ్లలో జాప్యానికి నిరసనఆలేరురూరల్ : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా తెలంగాణ రక్షణ సేన పార్టీ (టీఆర్ఎస్) ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి మణిపాల్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని ఖండిస్తూ గురువారం ఆలేరు కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కాళ్లుకు చెప్పులు లేకుండా దాదాపు 8 కిలోమీటర్ల మేర తోపుడు బండిపై ధాన్యం బస్తాలు వేసుకొని ఆలేరు మార్కెట్ యార్డు వరకు బండిని తోచుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విషయం తెలుసుకొని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే నిరసన కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పారు. శాసీ్త్రయ ఆలోచనతోనే కార్మికులకు విముక్తిభువనగిరిటౌన్ : శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ అన్నారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఆఫీస్ బేరర్లు దాసరి పాండు, మాయ కష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి, చెక్క రమేష్, పొట్ట యాదమ్మ, నకిరేకంటి రాము, పైళ్ల గణపతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నందీశ్వర్, మాతయ్య, శ్రీరాములు, లలిత, జహంగీర్, మధు, సురేందర్ పాల్గొన్నారు. స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గురువారం శ్రీవేంకటేశ్వరస్వామికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి 450 కిలోల అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, సుదర్శన నారసింహ హవనం, నిత్యకల్యాణం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. -
సాగర్ను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్
నాగార్జునసాగర్ : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ పద్మదోర్జి గంబే గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సాగునీటి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, క్రస్ట్గేట్లు, రైట్ కెనాల్ హెడ్రెగ్యులేటర్, స్పిల్వే, గ్యాలరీలు, ప్రధాన జల విద్యుదుత్పాదన కేంద్రాన్ని సందర్శించారు. విద్యదుత్పాదన కేంఽద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి మ్యూజియాన్ని సందర్శించారు. సాధారణ పర్యటకు వచ్చిన ఆయనకు విజయ విహార్ వద్ద సాగర్ డ్యాం ఎస్ఈ మల్లికార్జున్రావు, ఆంధ్రా ఎస్ఈ వెంకటరత్నం ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట జీఆర్ఎంబీ కార్యదర్శి అఖిలేష్కుమార్జా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్ ఉన్నారు. -
బతికినా.. ఏ పనులూ చేసుకోలేరు
చిట్యాల: చిట్యాల మండలం బొంగొనిచెర్వు పరిధిలోని ‘నోష్ ల్యాబ్స్’ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగి 29 రోజులు కావస్తున్నా.. ఆస్పత్రి బెడ్లపై నరకం చూస్తున్న కార్మికుల గాయాలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. ఈ నెల 1న నోష్ ల్యాబ్స్లోని బ్లాక్–3లో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆసుపత్రిలో చేరిన ఏడుగురిలో ముగ్గురు వైద్య చికిత్స అనంతరం డిశార్చి కాగా మరో నలుగురికి తీవ్ర గాయాలవటంతో నేటి వరకు వైద్య చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు పరిహారం ఏదీ.. రియాక్టర్ పేలుడులో తీవ్రంగా గాయపడిన ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డేవిడ్ కుజుర్, ఏపిలోని మలిచర్లకు చెందిన టి.లోకేష్, సంస్థాన్ నారయణపురానికి చెందిన హరిప్రసాద్, పంతంగికి చెందిన శంకర్లు గత ఇరవై ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలో వైద్య చికత్స పొందుతున్నారు. పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో లేచిన మంటలతో వీరికి చేతులకు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడుతో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి నోష్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యం పరిహారం అందజేసింది. ఇదే ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రం పరిశ్రమ యాజమాన్యం వైద్య చికిత్సను అందజేస్తుంది. కానీ ఇప్పటి వరకు గాయపడిన కుటుంబాలకు పరిహారం విషయమై యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. పరిశ్రమలో గత రెండు నెలల కాలంలో వరుసగా రెండు సార్లు రియాక్టర్ పేలుడు జరగటం వల్ల పదుల సంఖ్యలో కార్మికులు గాయపడటం, ఒకరు మృతి చెందడంతో పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు పరిశ్రమలో నిబంధనల మేరకు అనుమతులు, తగిన రక్షణ చర్యలు తీసుకునేంతరకు ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న మూడు వందలకు పైగా కార్మికులు, ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. ‘నోష్ ల్యాబ్స్’ పేలుడు ఘటనలో క్షతగాత్రులకు అందని పరిహారంఫ ప్రమాదం జరిగి 29 రోజులు కావస్తున్నా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న బాధితులు -
పోరాటం చేస్తున్నా స్పందించరేం
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. వర్తక సంఘాన్ని రద్దు చేసి, టెండర్లు వేయాలని కోరుతూ బుధవారం యాదగిరిగుట్ట పట్టణ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. వర్తక సంఘాన్ని రద్దు చేయాలని నెలరోజులుగా పోరాటం చేస్తుంటే అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ ధర్నాకు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మద్దతు పలికారు. ఇందులో యాదాద్రి పరిరక్షణ కమిటీ నాయకులు కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య, బండ రామస్వామి, దేవపూజ అశోక్, బుగ్గా ఆంజనేయులు, కొన్నె సంజీవ, బండి అనిల్, ముక్కెర్ల వెంకటేష్, నర్సింహ, కర్రె ప్రవీణ్, మాటూరి బాలయ్య, మిర్యాల క్రిష్ణ, పల్లపు రవి, ధార నవీన్, దొమ్మాట ప్రభాకర్, మందోజ్ నరేష్, వాల్మీకి అజయ్, సుధాగాని శివ, మెరుగు వెంకటేష్, కర్రె శ్యామ్, లక్ష్మయ్య, గుండు కుమార్, లింగాల వెంకటేష్, నరేష్, కాంటెకర్ శ్రవణ్, నాగేందర్ రెడ్డి, గడ్డమీది శ్రీకాంత్, శ్రీనాథ్, రమేష్, గణేష్, సంతోష్ పాల్గొన్నారు. -
రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే విముక్తి లభించనుంది. ము న్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారి విస్తరణ పనులకు మున్సిపల్ కౌన్సిల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీ వాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రోడ్డు విస్తరణపై నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల నివారణకే.. స్థానిక నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు ప్రస్తుతం ఉన్న వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. రోడ్డు ఇరుకుగా మారడం వల్ల వాహనదారులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కౌన్సిల్ దష్టికి తెచ్చారు. పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రహదారిని విస్తరించాలని కౌన్సిల్ నిర్ణయించింది. రెండు విడతల్లో పనులు.. ఈ విస్తరణ పనులను ప్రజల సౌకర్యార్థం, వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా రెండు విడతలుగా చేపట్టాలని తీర్మానించారు. మొదటి విడత కింద నల్లగొండ చౌరస్తా నుంచి ఎల్.బి. నగర్ చౌరస్తా వరకు పనులు చేపడతారు. రెండవ విడత కింద ఎల్.బి. నగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు విస్తరణ పనులు జరుగుతాయి.ఈ మేరకు అధికారులు కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ పోతంశెట్టి మంజుల, కమిషనర్ కె. చంద్రప్రకాశ్రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు 60 ఫీట్ల రోడ్డు ఫ రెండు విడతల్లో పనులు.. మున్సిపల్ అత్యవసర సమావేశంలో నిర్ణయం -
బహార్పేట్ రోడ్డు విస్తరణ 60ఫీట్లు వద్దు
ఫ అఖిలపక్షాలు, బాధితుల ధర్నాభువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు 60ఫీట్లు వద్దని 30 ఫీట్లకు కుందించాలని అఖిలపక్షాల నేతలు, బాధితులు ఆందోళనకు దిగారు. నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు (బహార్పేట వీధి) ప్రతిపాదించిన 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడుతాయని బుధవారం ఉదయం భువనగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి అఖిలపక్ష నాయకులు, ప్రజలు ధర్నా చేపట్టారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పూర్తిస్థాయి ఆర్థిక ప్యాకేజీ, నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో అధికార పార్టీ కౌన్సిలర్లు వచ్చి ఆఫీస్లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, నాయకుల మధ్యతోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లను లోనికి పంపిచారు. అఖిల పక్ష నాయకులను నిలువరించారు. ఆ సమయంలో కార్యాలయం తలుపులు మూసేశారు. తోపులాటలో మహిళలకు స్వల్పగాయాలయ్యి. బహార్పేట రోడ్డు విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోయే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 127 ఆస్తులకు నష్టం 60ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారులు నష్టం అంచనా వేశారు. దీని వల్ల మొత్తం 127 గృహాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లనుంది. ఇందులో 22 గృహాలు పునాదులతో సహా పూర్తిగా నేలమట్టం కానుండగా, మరో 105 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిననున్నాయి. బాధితుల్లో అత్యధికులు 30 నుంచి 60 గజాల లోపు ఇళ్లు ఉన్నవారే. -
యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలను నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజను చేపట్టారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులను అలంకరించి, వివిధ సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు, తులసీ దళాలతో శ్రీస్వామి వారికి లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు. -
స్మార్ట్ టాయిలెట్!
టాయిలెట్లో పూర్తిగా సెన్సార్ ఆధారిత వ్యవస్థను వినియోగిస్తున్నారు. వినియోగించే వారు చేతితో తాకాల్సిన అవసరం లేకుండానే పనిచేసే ఫ్లషింగ్ సిస్టమ్, సెన్సార్ వాటర్ ట్యాప్లను ఇందులో అమర్చనున్నారు. భువనగిరిటౌన్ : పట్టణ ప్రజలకు సురక్షితమైన, గౌరవప్రదమైన, అధునాతన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద భువనగిరి పట్టణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాంక్షాత్మక శౌచాలయం ప్రాజెక్టు పేరుతో నిర్మించనున్నారు. 10 సీట్ల (నాప్స్) సామర్థ్యంతో నిర్మించనున్న ఈ స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్కు స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ.32.50 లక్షల నిధులు మంజూరు చేశారు. సాధారణ పబ్లిక్ టాయిలెట్లకు భిన్నంగా, కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రజలకు అందుబాటు ఉండే స్థలం పరిశీలించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట మహిళల రక్షణ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులో ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు. మహిళా విభాగంలో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లతోపాటు, ఉపయోగించిన నాప్కిన్లను సురక్షితంగా పారేసేందుకు అధునాతన డిస్పోజల్ యూనిట్లను అమర్చనున్నారు. పురుషులు, మహిళలకు విడివిడిగా ప్రైవసీ సౌకర్యం ఉండనుంది. దివ్యాంగులు, పిల్లలకు అనుకూలం దివ్యాంగులు, చిన్న పిల్లలు సైతం ఎవరి సహాయం లేకుండా సులభంగా టాయిలెట్స్ను ఉపయోగించుకునేలా ప్రత్యేక ర్యాంప్లు, గ్రాబ్ బార్స్ కలిగిన సీట్లను డిజైన్ చేశారు. లింగ భేదం లేకుండా ఎవరైనా ఉపయోగించుకునేలా జెండర్ న్యూట్రల్ టాయిలెట్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది. పర్యావరణ హితం విద్యుత్ ఆదా చేసే స్మార్ట్ లైటింగ్, సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా మెరుగైన వెంటిలేషన్ వ్యవస్థను ఈ పబ్లిక్ టాయిలెట్స్లో ఏర్పాటు చేస్తారు. నీటిని పొదుపు చేసే ఎకోఫ్రెండ్లీ సాంకేతికతను, కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్ వసతి ఉంటుంది. నిరంతరం నిపుణులైన సిబ్బందితో క్లీనింగ్ చేయిస్తూ, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మార్కెట్లు, రద్దీ ప్రాంతాలకు వచ్చే మహిళలు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ భువనగిరిలో సెన్సార్ ఆధారిత పరిజ్ఞానంతో నిర్మించేందుకు ప్రణాళిక ఫ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ. 32.50 లక్షల నిధులు మంజూరు ఫ మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ ఫ త్వరలో పనులు ప్రారంభం -
ఉపాధికల్పనే లక్ష్యంగా చేనేత ఎగ్జిబిషన్
భూదాన్పోచంపల్లి: చేనేత కార్మికులకు ఉపాఽధి కల్పనే లక్ష్యంగా హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో జూన్ 5,6,7 తేదీల్లో ప్రత్యేకంగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనురాగ్జయంతి వెల్లడించారు. థ్రెడ్ పేరిట నిర్వహిస్తున్న పోచంపల్లి ఇక్కత్వస్త్రాల ఎగ్జిబిషన్ వాల్పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర చేనేత, జౌళిశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఈ ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా మంత్రిని కలెక్టర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్లో కేవలం యాదాద్రి భువనగిరి జిల్లాలో తయారయ్యే పోచంపల్లి చేనేత వస్త్రోత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో పోచంపల్లికి చెందిన 100 స్టాల్స్, అనుబంధంగా శ్రీశక్తి సంఘాల స్టాల్స్ కూడా ఉంటాయని ఆయన వివరించారు. కార్మికుల కళానైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు వారికి ప్రత్యక్షంగా మార్కెటింగ్ కల్పించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన ఘనత..
విహారెడ్డి భవిష్యత్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ స్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే ఎఫ్ఐబీఏ ఆసియా కప్ అండర్–18 బాస్కెట్బాల్ టోర్నీలో భారతజట్టును విజేతగా నిలపడమే తన తదుపరి లక్ష్యమని విహారెడ్డి పేర్కొంది. రోజూ గంటల తరబడి సాధన చేస్తూ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటోంది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో రాణించగలరని నిరూపిస్తోంది విహారెడ్డి.విహారెడ్డి సాధించిన ఈ అంతర్జాతీయ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు.. అంతకుమించి కఠిన శ్రమ ఉన్నాయి. 2023లో జరిగిన ఒక టోర్నమెంట్లో ఆడుతున్న సమయంలో ఆమె కుడికాలికి గాయమైంది. గాయం నుంచి కోలుకోగానే పట్టుదలతో మళ్లీ సాధన మొదలు పెట్టింది. 2024లో జాతీయ పోటీల సమయంలో కాలి మడిమకు తీవ్ర గాయమైంది. ఆ గాయాన్ని జయించి రెట్టింపు పట్టుదలతో ఆటలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విహారెడ్డి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చింది. అంతకుముందు 2025 అక్టోబర్ బహ్రెయిన్లో నిర్వహించిన మూడో ఏసియా యూత్ గేమ్స్ బాస్కెట్బాల్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించింది. -
గవర్నర్ను కలిసినశంకరమ్మ
మోత్కూరు : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హైదరాబాద్లోని గవర్నర్ భవన్లో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలిమోత్కూరు : శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామాలు, పట్టణాల్లో పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కాంప్లైంట్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు సూచించారు. రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ను మంగళవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో వర్రె వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీసీ ఫుటేజీల నిర్వహణ, ఫ్రెండ్లీ పోలీసింగ్తో శాంతి భద్రతలు అదుపులోకి రావడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరి రక్షణలో దేశంలోనే పోలీస్ వ్యవస్థ నంబర్ వన్గా నిలవడం హర్షణీయమన్నారు. యాదగిరిగుట్ట కొండపై వర్తక సంఘం రద్దు చేయాలియాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన గల వర్తక సంఘాన్ని రద్దు చేసి, టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అన్నల్ధాస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని దేవాదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయం ఎదుట కళాకారులు ..శ్రీనృసింహస్వామి, లక్ష్మీదేవి, రాక్షసుల వేషధారణలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. కొండపైన వ్యాపారుల దోపిడీని అరికట్టాలని కోరారు. యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిక్షేత్రంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. -
క్రీమీలేయర్ విధానం ఎత్తి వేయాలి
మోత్కూరు : బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రీమీలేయర్ విధానాన్ని ఎత్తి వేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూరు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీ బాయి ఫూలే విగ్రహాలను మంగళవారం ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెడతామని తెలిపారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్లో రిజర్వేషన్ల కేసులో సుప్రీం కోర్టు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల నుంచి బలమైన సిఫార్సులు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. విద్య, ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్లపై మాత్రమే క్రీమీలేయర్ నిబంధన విధించడం వివక్షకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.2 కోట్లతో పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశం విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు కూరాకుల అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమారస్వామి, రాష్ట్రకార్య నిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేందర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కంపెనీ అధ్యక్షుడు పి.యాదగిరి, బొబ్బిలి మురళి, ఎస్ఈ కందాల సురేష్కుమార్, డీఈఈలు సుధీర్కుమార్, హరీష్కుమార్, సంఘం వెంకటేశ్వర్లు, ఎస్.మల్లిఖార్జున్ గౌడ్, టి.శ్రీనివాసులు, విజయభాస్కర్రెడ్డి, ఏడీఈ బాలునాయక్, ధర్మికోట నరేష్, జిల్లపల్లి వెంకటేశ్వర్లు, పల్లెగొర్ల మోది, రామ్దేవ్ యాదవ్, కలిమెల నర్సయ్య, అవిశెట్టి అవిలుమల్లు, పురుగుల శ్రీనివాస్, పుల్కరం శేఖర్, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ -
పచ్చిరొట్ట.. పైరుకు బలం
పండ్ల తోటల్లో .. పండ్ల తోటల్లో జనుము పంట సాగు చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పండ్ల మొక్కలు కాపునకు వచ్చేంత వరకు అంతరంగా జనుమును సాగు చేసి పూత వచ్చే సమయంలో కలియదున్నాలి. ఎకరాకు 16 కిలోల జనుము విత్తనాలు సరిపోతాయి. పండ్ల తోటలు ఏపుగా ఎదగడానికి పచ్చిరొట్ట ఎరువు ఎంతగానో దోహదపడుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి పండ్ల మొక్కలు తెగుళ్ల బారిన పడకుంగా ఉంటాయి. ఎకరాకు 10 క్వింటాళ్ల పచ్చిరొట్ట తయారవుతుంది. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల జరిగే నష్టాన్ని పచ్చిరొట్ట ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చు. పండ్ల తోటల్లో జనుము సాగు వల్ల కలుపు మొక్కల సమస్య ఉండదు. పచ్చిరొట్టను పండ్ల తోటల పాదుల్లో వేసి మట్టితో కప్పి వేయాలి. పచ్చిరొట్ట ఎరువుగానే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. గుర్రంపోడు : ప్రస్తుత వానాకాలం సీజన్లో ప్రధాన పంటల సాగుకు ముందు రైతులు తమ వ్యవసాయ భూముల్లో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ సాగు చేసుకుని భూమిలో కర్బన సేంద్రియం పెంచుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో జాతీయ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధలు పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయశాఖ ద్వారా 50శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నాయి. ఆయా మండల కేంద్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యవసాయశాఖ పర్యవేక్షణలో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే ఉపయోగాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుని పూత దశలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువులా పనిచేసి ప్రధాన పంట పైరుకు బలానిస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మూడు శాతం పైగా సేంద్రియ కర్బనం ఉండగా మన దేశంలో ఒక్క శాతానికి మించి ఉండటం లేదు. భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు పచ్చిరొట్ట పంటలు వేయాలి. మే రెండో పక్షం నుంచి జులై రెండో పక్షం వరకు రైతులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పంటలు సాగు చేసుకుంటే ఎకరాకు పది టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఈ పంటలు పూత దశలో నేలలో కలియదున్నడం ద్వారా ఎకరాకు 25 నుంచి 35 కిలోల నత్రజని, ఐదు కిలోల పొటాష్ లభ్యమవుతంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు జనుము, జీలుగలు సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై 30 కిలోల బస్తా రూ.2,452కు, జనుము 40 కేజీల బస్తా రూ.3,110కు పంపిణీ చేస్తుంది. వరి మాగాణుల్లో ..వరి మాగాణుల్లో జీలుగ సాగు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. దుక్కిని బాగా దున్నుకుని ఎకరాకు 12 కిలోల జీలుగ విత్తనాలు వేసుకోవాలి. వరి నాటు వేసే నాటికి పూత దశలో ఉండే జీలుగను కలియదున్నడం వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. 45 రోజులు మించకుండా జీలుగకు నీళ్లు పెట్టి కలియదున్నాలి. గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి సూచనలు -
అన్న కొడుకే హతమార్చాడు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట రూరల్ పరిధిలోని సోలిపేట గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన మేకల జయరాములు(54) హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి గెట్టు పంచాయితీతో సొంత అన్న కొడుకే ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. సోలిపేటకు చెందిన మేకల జయరాములు గతంలో తన పిల్లల చదువుల కోసం సూర్యాపేటలో నివాసముండేవాడు. గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన మూడెకరాల వ్యవసాయ భూమిని తన చిన్న అన్న మేకల కృష్ణయ్యకు 12 ఏళ్లు కౌలుకు ఇచ్చాడు. అనంతరం గ్రామానికి తిరిగి వచ్చిన జయరాములు తన భూమిని తానే సాగు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో భూమి గెట్లు, ఇంటి హద్దుల విషయంలో జయరాములు కుటుంబానికి, అన్న కృష్ణయ్య కుటుంబానికి తరచూ గొడవలు జరుగుతుండేవి. దావత్ సమయంలో హత్యకు పథకం..జయరాములు అన్న మేకల కృష్ణయ్య కుమారుడు మేకల కిరణ్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు. కిరణ్ తన భార్య మౌనికతో కలిసి వారం క్రితం గ్రామానికి వచ్చాడు. ఇటీవల పొలంలో బోరు వేయించగా.. సోమవారం మోటారు అమర్చారు. అనంతరం కృష్ణయ్య, అతడి భార్య లక్ష్మమ్మ, కుమారుడు కిరణ్, అతడి భార్య మౌనికతో పాటు అదే గ్రామానికి చెందిన మట్టపల్లి రామచంద్రు కలిసి అక్కడే దావత్ చేసుకున్నారు. అదే సమయంలో జయరాములు పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. భూమి పంచాయితీల నేపథ్యంలో జయరాములును అంతమొందించాలని వారు పథకం రచించారు. జయరాములు సాయంత్రం మళ్లీ పొలానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. గ్రామ ఆర్చీ వద్ద కిరణ్, అతడి భార్య మౌనిక స్కూటర్పై కాపుగాశారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో జయరాములు బైక్పై అక్కడికి చేరుకోగానే అతడిని అడ్డగించి గొడవకు దిగారు. ఈ క్రమంలో కిరణ్ గొడ్డలితో జయరాములుపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం కిరణ్, అతడి భార్య మౌనికతో పాటు కిరణ్ తల్లిదండ్రులు, రామచంద్రు గ్రామం నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. భూమి గెట్టు వివాదం కారణంగానే హత్య చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, స్కూటర్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జయరాములు హత్య కేసును ఛేదించిన పోలీసులు భూమి గెట్టు పంచాయితీ కారణంతో గొడ్డలితో దాడి చేసి హత్య ఐదుగురు నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
వడదెబ్బతో వృద్ధురాలు మృతి
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డుకు చెందిన చిట్యాల జమునాబాయి(75) వడదెబ్బకు గురై సోమవారం రాత్రి మృతిచెందింది. తీవ్రమైన ఎండ వేడిమికి సోమవారం సాయంత్రం జమునాబాయి అస్వస్థతకు గురైంది. రాత్రి ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్లు కుమారుడు రవి పేర్కొన్నారు. మృతురాలి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. తప్పిన ప్రమాదంచివ్వెంల(సూర్యాపేట) : లారీలో డ్రైవర్ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కాగా.. గ్యాస్ సిలిండర్ను బయటకు విసరడంతో చెట్టుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీగూడెం గ్రామంలోని వరి పొట్టు కంపెనీకి సంబంధించిన లారీని డ్రైవర్ సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన ఆపాడు. లారీలోనే చిన్న గ్యాస్ పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న మర్రి చెట్టుపైకి గ్యాస్ పొయ్యిని విసిరాడు. దీంతో చెట్టుకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు లేచాయి. లారీలో వరి పొట్టు ఉండటం, చెట్టు పైనుంచి 11 కేవీ విద్యుత్ లైన్లు వెళ్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. కుమారులతో కలిసి మహిళ అదృశ్యంపెద్దవూర : మండలంలోని మల్లెవానికుంటతండాకు చెందిన మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైంది. మంగళవారం పెద్దవూర ఎస్ఐ గోపాల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లెవానికుంటతండాకు చెందిన రమావత్ ప్రభాకర్, నాగమణి దంపతుల కుమార్తె మౌనికకు 2021లో ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నాగార్జునతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్, నాగచైతన్య ఉన్నారు. రెండేళ్ల క్రితం నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మౌనిక తన ఇద్దరు కుమారులతో కలిసి మల్లెవానికుంటతండాలో తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ నెల 22న మౌనికకు తన తల్లి నాగమణితో చిన్న గొడవ జరిగింది. దీంతో 23న ఉదయం తన ఇద్దరు కుమారులను తీసుకుని మౌనిక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మౌనిక సోదరి శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 87126 7098, 87126 75111 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. కత్తితో దాడి.. ఇద్దరి రిమాండ్చండూరు : యువకుడిపై కత్తితో దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణంలో ఆదివారం దోటి శివ అనే యువకుడిపై నాగిళ్ల నరేష్, బుషిపాక విజయ్ కత్తితో దాడి చేశారు. శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం నరేష్, విజయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పాలకవీడు : విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా వద్ద 33/11కేవీ సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పాలకవీడు మండలంలో పలు చోట్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. దీంతో దామరచర్ల మండలం గణేష్పహాడ్ గ్రామానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ కొర్ర రవి(31)కి మరమ్మతుల పనులను విద్యుత్ శాఖ అధికారులు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రవి జాన్పహాడ్ దర్గా వద్ద గల సబ్స్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి మృతిచెందాడు. అంబులెన్స్లో అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రవి మృతిచెందాడని బంధువులు, గ్రామస్తులు సబ్స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మరమ్మతుల కోసం ఎల్సీ తీసుకునే విషయమై విద్యుత్ అధికారులు, రవికి మధ్య సమన్వయం లోపించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంట్లో విద్యుత్ తీగలు తగిలి..కొండమల్లేపల్లి : మండలంలోని గుడితండా గ్రామానికి చెందిన నేనావత్ చందు(52) మంగళవారం సాయంత్రం ఇంట్లో విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతడిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో మంటలు
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెట్లకు నిప్పంటుకుని తగలబడుతుండడంతో గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ అంబటి రాము గ్రామస్తులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సమయానికి అక్కడికి చేరుకోకపోవడంతో రెడ్డీస్ ల్యాబ్లో అందుబాటులో ఉన్న అగ్నిమాపక ట్యాంకర్ తీసుకొచ్చారు. ట్యాంకర్లో నీరు లేకపోవడంతో కొంత ఇబ్బంది తలెత్తింది. సమీపంలోని వ్యవసాయ పొలంలో గడ్డికి నిప్పు పెట్టడం వల్లే చెట్లకు నిప్పు అంటుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వ్యాపించిన మంటలుమాడుగులపల్లి : మండలంలోని కల్వపాలెం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో సుమారు 25 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. ఎస్ఐ కృష్ణయ్య, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గ్రామస్తుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి వెంట సర్పంచ్ చిట్యాల సునీతాడానియేల్, సతీష్ తదితరులున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల అరిగోస
ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రైతు గోస–బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోగల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభా పక్ష ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సింగ్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎంపీ కోడెం నగేష్తో కలిసి ఆయన పరిశీలించారు. రైతులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు బంద్ చేసి ధాన్యం తరలించేందుకు లారీ ట్రిప్పులు పెంచాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్రావు, అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి సురేష్, జగన్మోహన్రెడ్డి, మరళీధర్రెడ్డి, దాసరి మురళి, వట్టిపల్లి శ్రీనివాస్, కాదూరి అచ్చయ్య పాల్గొన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న సీఎం భువనగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.రైతు గోస–బీజేపీ భరోసా బస్ యాత్ర మంగళవారం భువనగిరి మండలంలోని వడపర్తికి చేరుకుంది. ఈసందర్భంగా ధాన్యాన్ని పరిశీంచిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 శాతం ధాన్యం కొనుగోలు చేశామని సీఎం చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ గోదాం నగేష్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్రెడ్డి, వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణగుప్తా, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, వేముల అశోక్, గౌతమ్ రావు, శ్రీనివాస్, పడమటి జగన్మోహన్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాయ దశరథ, ఏలె చంద్రశేఖర్, పాశం భాస్కర్, పట్నం శ్రీనివాస్, శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు.ఫ బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి -
పుస్తకం.. మన నేస్తం
పుస్తకాలతో మరింత జ్ఞానంప్రస్తుత సమాజంలో విద్యార్ధులతో పాటు పెద్దలు కూడా పుస్తకాలు చదవడం మరిచిపోయారు. గతంలో ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు లేని రోజుల్లో గ్రంథాలయాలకు వెళ్లి కథల పుస్తకాలు చదివేవాళ్లు. ప్రస్తుత వేసవి సెలవుల్లో విద్యార్ధులకు తల్లిదండ్రులు పుస్తక పఠనం అలవాటు చేయిస్తే వారి జ్ఞానం పెరుగుతుంది. – గడ్డమీది పాండుగౌడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంచి పుస్తకాలు కొనివ్వాలిపిల్లలకు తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనిచ్చే బదులు పుస్తకా కొనివ్వాలి. పిల్లలకు చిన్ననాటి నుంచి పుస్తకాలను చదవడం అలవాటు చేస్తే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి వెళ్తారు. పుస్తకాలు చదవడం వలన ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్లారు. ఒత్తిడి చేయకుండా పుస్తక పఠనం అలవాటు చేస్తే ఉపయోగం ఉంటుంది. – సుక్క సందీప్, ఆర్కిటెక్ట్, యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట : చేతిలో స్మార్ట్ఫోన్, వేలి కొనలపై సోషల్ మీడియా ప్రపంచం.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ రీల్స్తో నేటి తరం కాలక్షేపం చేస్తోంది. కానీ ఒకప్పటిలా మంచి కథల పుస్తకాలు, చందమామ కథలు చదివే రోజులు పోయాయి. సాంకేతిక ఎంత పెరిగినా పుస్తకం ఇచ్చే జ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని ఇంటర్నెట్ ఇవ్వలేదు. చిన్నతనంలో అలవడే పఠనాసక్తి భవిష్యత్తులో వివేకవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఈ వేసవిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పుస్తకాన్ని నేస్తం చేసి పుస్తక పఠనం అలవాటు చేయాలి. పుస్తకాలతో తెలివితేటలు..ప్రతిరోజు నిద్రపోయే ముందు చిన్నారులతో కథల పుస్తకాలు చదివిస్తే భవిష్యత్తులో వారి తెలివితేటలు బాగా వృద్ధి చెందుతాయని ఓ అధ్యయనంలో తేలింది. చిన్న వయస్సులో పిల్ల లు కథలంటే ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి కథల పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే పుస్తకం పఠనమే ముఖ్యం. పిల్లలకు అసమాన ప్రతిభా పాఠవాలను నేర్పించే వారు గురువులైతే.. వారికి తెలియని విషయాలను విశదీకరించే వాడు మిత్రుడు. మేధస్సు పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. సమాజాన్ని అర్థం చేసుకునే రచనలు, కథలు, కథానికల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పుస్తకాలు తప్పకుండా ఉండేవి. ఇప్పుడు ఉరుకులు, పరుగుల జీవితంతో పుస్తక పఠనాన్ని తగ్గిస్తున్నారు. పుస్తక పఠనం ఇలా అలవాటు చేయాలి..● పిల్లలకు చిన్న చిన్న కథలు చదివి వినిపిస్తూ ఉండాలి. బాలల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను వారిచే చదివించాలి. అలా చేస్తే పిల్లలు తమకు తెలియకుండానే పుస్తకాలకు ఆకర్షితులవుతారు. ● పిల్లల వయస్సుకు తగ్గ పుస్తకాలనే చదివించాలి. బొమ్మలుండే పుస్తకాలు ఇస్తే వాళ్లు అందులోని సారాంశాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు. ● తల్లిదండ్రులు తరచూ తమ పిల్లలను గ్రంథాలయాలకు తీసుకెళ్తూ ఉండాలి. అలా చేయడం వలన పిల్లల్లో పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది. ● పుట్టినరోజులకు పిల్లలకు మంచి పుస్తకాలను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన వారు పుస్తక పఠనంపై మక్కవ చూపుతారు.ఇంటర్నెట్లోనూ పుస్తకాలు.. ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రులు వాడే స్మార్ట్ఫోన్లను పిల్లలు సైతం ఉపయోగిస్తున్నారు. పిల్లలకు నచ్చే పుస్తకాలను ఇంటర్నెట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసి వారిచే చదివించవచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి సెలవుల్లో గ్రంథలయాలకు తీసుకెళ్లాలి. వారిచే గ్రంథలయాల్లో ఉన్న మంచి పుస్తకాలు, నీతి కథలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదివించడంతో జ్ఞానం పెంపొందించవచ్చు. సమాజంలో జరిగే కొత్త కొత్త సంఘటనలు కూడా పిల్లలకు గ్రంథలయాలకు వెళ్తే తెలుస్తుంటాయి.మేము బొమ్మలు గీశామోచ్ పిల్లలు స్మార్ట్ఫోన్కు బానిస కాకుండా తల్లిదండ్రులు పుస్తకాలు చదవించాలి పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుందంటున్న నిపుణులు -
రెండు పిల్లులు – ఒక కోతి
నీతి కథఒక ఊరిలో రెండు పిల్లులు ఉండేవి. ఒకరోజు వాటికి రొట్టె ముక్క దొరికింది. ‘నేనంటే నేను ముందు చూశాను’ అని ఆ రొట్టె కోసం రెండు పిల్లులు తీవ్రంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడే అటుగా ఒక కోతి వచ్చింది. వాటి సమస్యను విని, ‘నేను ఈ రొట్టెను మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను’ అని చెప్పి ఒక త్రాసు తీసుకువచ్చింది. రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో పెట్టింది. ఒకవైపు బరువుగా ఉందని, అందులో కొంచెం రొట్టెను కోతి తినేసింది. అప్పుడు రెండో వైపు బరువు ఎక్కువైందని అందులో కొంచెం తినేసింది. ఇలా పదే పదే చేస్తూ, చివరికి రొట్టె మొత్తం కోతి తినేసి అక్కడి నుంచి జారుకుంది. ఇక ఏమీ మిగలకపోవడంతో పిల్లులు రెండు నిరాశతో ఉండిపోయాయి. నీతి : ఇద్దరి మధ్య గొడవ మూడో వ్యక్తికి లాభం చేకూరుస్తుంది. కాబట్టి మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. -
నీలగిరిలో కార్డెన్ సెర్చ్
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సతీష్నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, నార్కోటిక్ డాగ్తో కలిపి సుమారు 200 మంది పోలీసు అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. 360 ఇళ్లలో తనిఖీలు.. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నల్లగొండలో సుమారు 360 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి 46 మంది అనుమానితులను గుర్తించామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించామని, వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 10 మంది, బిహార్కు చెందిన నలుగురు, హర్యానాకు చెందిన ఇద్దరు, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు రౌడీషీటర్లు, ఐదుగురు ట్రబుల్ మాంగర్స్ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ పేర్కొన్నారు. ఆరుగురికి గంజాయి టెస్టులు నిర్వహించగా ఇద్దరు గంజాయి సేవించినట్లు తేలిందన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులు, సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు వాహనాలపై కేసులు నమోదు చేశామని వివరించారు. 7గురు సీఐలు, 18 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులతో తనిఖీలు 46 మంది అనుమానితుల గుర్తింపు 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం -
కల్తీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు
సాక్షి, యాదాద్రి: కల్తీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువుల డీలర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా అధికారులు, డీలర్లు కఠిన నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే పత్తి విత్తన రకమైన శ్రీహెచ్టీ కాటన్శ్రీను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని, జిల్లాలో ఎక్కడా ఈ రకం విత్తనాలు విక్రయించకుండా చూడాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారానే డీలర్లందరూ బుకింగ్స్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, విత్తన, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. రైతులపై ప్రేమ ఉంటే బీజేపీ ఢిల్లీలో పోరాడాలిఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి సాక్షి, యాదాద్రి : రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో పోరాడాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హితవుపలికారు.భువనగిరి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా యాత్రను తెలంగాణలో కాకుండా ఢిల్లీలో నిర్వహించి ఎఫ్సీఐ.. సీఎంఆర్ తీసుకునేలా..కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లే మిల్లుల్లో ధాన్యం దించుకోలేని పరిస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి తాము అధికారులు, మిల్లర్లు, రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ భరోసా యాత్రలు నిర్వహిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తి పారదర్శకతతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. గత రెండు పంటల సీజన్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. సమావేశంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తీ, నాయకులు బర్రె జహంగీర్, కూర వెంకట్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సీఎం, మంత్రుల ఇళ్ల ముందు ధాన్యం డంప్ చేస్తాం
సాక్షి, యాదాద్రి/జనగామ/ఆత్మకూరు: రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల్లో ధాన్యం వందశాతం కొనుగోళ్లు, లిఫ్టింగ్ చేయని పక్షంలో ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి మంత్రులు, సీఎం ఇళ్ల ముందు, అలాగే సచివాలయానికి తీసుకెళ్లి అన్లోడ్ చేస్తామని బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్చరించింది. రైతుల పక్షాన మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేయడం కాదు.. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే తమను సస్పెండ్ చేసి ఎన్నికలకు వచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరింది. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి, వెంకట్రామ్రెడ్డిల బృందం మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్ను, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు, భువనగిరి మండలం వడపర్తిలోని ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. ఆయా కేంద్రాల్లో రైతులతో మాట్లాడి వారు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా, ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని మహేశ్వర్రెడ్డి వివరించారు. ఈ లెక్కలు చూస్తే 80 శాతం పూర్తయిందని సీఎం చెప్పే పరిస్థితి ఏమాత్రం లేదని, 30 శాతం కొనుగోలు కూడా జరగలేదన్న వాస్తవం బయటపడుతోందన్నారు. ప్రతి కల్లెం నుంచి పోయే ధాన్యం బస్తాల్లో 10 శాతం ‘కటింగ్’పేరుతో జరుగుతున్న భారీ దోపిడీపై మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఈ 10 శాతం లెక్కిస్తే మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి అదృశ్యమవుతోందని, దాని విలువ సుమారు రూ.2 వేల160 కోట్లకు పైమాట అవుతుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యలపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కల్లాల బాట పట్టడంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. నిన్న గజ్వేల్కు బీజేపీ బృందం వెళ్లడంతో కలెక్టర్ స్వయంగా వచ్చి 30 లారీలను ఏర్పాటు చేశారని, ఇవాళ భువనగిరి కేంద్రానికి వస్తున్నామని తెలియగానే లారీలు వస్తున్నాయని చెప్పారు. ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ రైతుల పక్షాన మాట్లాడినందుకు కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధి బృందంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
బండెనక బండి..స్వామి దర్శనానికి పోదాం పదండి..
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం.. వేసవి సెలవులు కలిసి రావడంతో శ్రీనృసింహుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50 వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చాలా మంది భక్తులు సెంట్రల్ పార్కింగ్ వద్ద వాహనాలను పార్క్ చేసి, ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. -
సీఎంకు కలెక్టర్ ఆహ్వానం
యాదగిరిగుట్ట : జూన్ 5,6,7 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించనున్న పోచంపల్లి ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆహ్వానించారు. శనివారం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన సీఎంకు ఆలయ ముఖ మండపంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డితో కలిసి కలెక్టర్ ఆహ్వాన పత్రికను ఇచ్చారు. 147 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు నిర్వహించారు. మొత్తం 375 మంది కార్యదర్శులలో 147 మందికి స్థానచలనం కలిగిస్తూ ఉన్నతాధికారులు శనివారం తుది నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సాగింది. ఒకే స్థానంలో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 144 మంది కార్యదర్శులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీ చేయగా, మూడేళ్ల సేవా కాలం పూర్తి చేసుకొని వ్యక్తిగత కారణాల వల్ల బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకున్న ముగ్గురు కార్యదర్శుల అభ్యర్థనలను అధికారులు పరిశీలించి ఆమోదించారు. ఈ ప్రక్రియలో జిల్లా పంచాయతీ అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. బదిలీల ఉత్తర్వులను ఈ నెల 25వ తేదీ వరకు సెక్రటరీలకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్వులు అందుకున్న పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించి, ఈ నెలాఖరు నాటికి తమకు కేటాయించిన కొత్త గ్రామాలలో కచ్చితంగా బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. భారీ బందోబస్తుయాదగిరిగుట్ట రూరల్: సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం హెలీపాడ్ ప్రాంతంతో పాటు, కొండ కింద పాదాలు, ఘాట్ రోడ్లు, టెంపుల్ సిటీ, స్వామి వారి ఆలయం వద్ద ఇలా అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించాయి. దీనిలో భాగంగా ఐజీ, డీఐజీ, ఎస్పీలతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు ఆరుగురు, ఇన్స్పెక్టర్లు 21మంది, ఎస్ఐలు 38మంది, కానిస్టేబుళ్లు 300 మంది బందోబస్తులో పాల్గొన్నారు. లక్ష్యసాధనకు నైపుణ్యాలు అవసరం భువనగిరిటౌన్ : యువత లక్ష్యసాధనకు నైపుణ్యాలు అవసరమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు పేర్కొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో జిల్లా యువజన, క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల ఆరో రోజు ఉద్యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మే 2న నల్లగొండలో నిర్వహించిన జాబ్మేళాలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అనంతరం 2వ ఎడిషన్ సీఎం కప్–2025 విజేతల తో పాటు టూరిజం, పోలీస్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఐసీ జీఎం రవీందర్, ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణ, ఏటీసీ ఆఫీసర్ రఘునాథ్, మై భారత్ ప్రెసిడెంట్ అంబేద్కర్, కరుణ్, క్రీడాకారులు, ఏటీసీ విద్యార్థులు సుమారు 500 మంది పాల్గొన్నారు. -
రోడ్డు పనులు పూర్తి చేయాలని రాస్తారోకో
మోత్కూరు : మోత్కూరు నుంచి రాజన్నగూడెం వరకు అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ రహదారి పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకొని రోడ్డు పనులు పూర్తి చేయించి మోత్కూరు నుంచి భువనగిరి రూట్లో నడిచే బస్సులను రాజన్నగూడెం స్టేజీ వద్ద ఆపాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ కార్యక్రమంలో జిల్లా నాయకుడు జిట్టా గౌతమ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చిప్పలపల్లి నవీన్, సువ్వి, కరుణాకర్, రవి మహవీర్, కొంగరి నవదీప్ పాల్గొన్నారు. -
వీఐపీలను అడ్డుకున్న పోలీసులు
యాదగిరిగుట్ట : సీఎం రేవంత్రెడ్డి శనివారం యాదగిరిగుట్టకు రాగా.. ఆయనతో పాటు పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన వీఐపీలకు చేదు అనుభవం ఎదురైంది. సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారికి వేద పాఠశాల శంకుస్థాపన పూజ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ‘మీరు ఎవరైతే మాకేంటి’ అంటూ వీఐపీలను అడ్డుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి హెలిపాడ్ నుంచి వచ్చి సంప్రదాయ దుస్తులు మార్చుకునే సమయంలో శంకుస్థాపన చేసే స్థలానికి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి చేరుకున్నారు. పూజ చేసే స్థలానికి వీరిని వెళ్లకుండా పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాకు ప్రొటోకాల్ ఉంటుందంటూ వాదించారు. అనంతరం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు జోక్యం చేసుకొని వారిని పూజ వద్దకు పంపించారు. మర్యాద పాటించు.. సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజును కూడా పోలీసులు అడ్డుకున్నారు. తన కారును అడ్డుకోవడంతో నడుచుకుంటూ సీఎం వచ్చే ప్రాంతానికి ఆయన వెళ్లారు. సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ వచ్చే ముందు శ్రీనివాస్రాజు తన సిబ్బందిని రమ్మని పిలవగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్రాజు ‘మర్యాద మెయిన్టెన్చేయ్.. మేము కూడా డ్యూటీలు చేశాం.. అతిగా చేస్తున్నావ్’ అంటూ మాట్లాడారు. ఇతర పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని శ్రీనివాస్ రాజు వద్దకు తన సిబ్బందిని పంపించారు. -
వడదెబ్బతో ఆరుగురు మృతి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడదెబ్బకు గురై శనివారం ఆరుగురు మృతిచెందారు. తిరుమలగిరి(సాగర్) : వడదెబ్బకు గురై రైతు మృతిచెందాడు. తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32) రెండు రోజుల క్రితం పత్తి కట్టె పీకేందుకు కూలీకి వెళ్లాడు. తీవ్రమైన ఎండలకు అతడికి వడదెబ్బ తగిలింది. కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిద్రలోనే మృతి.. తిరుమలగిరి ( తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన చౌగోని ప్రసాద్(31) స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో శుక్రవారం అతడు తీవ్ర అస్వస్థకు గురై రాత్రి నిద్రలోనే మృతిచెందాడు. కార్పెంటర్ చౌటుప్పల్ : మండలంలోని మందోళ్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్యచారి(65) కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా తన మనవడు మణికంఠను తీసుకొని ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్కు వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. లింగారెడ్డిగూడెం శివారులోకి వెళ్లగానే కళ్లు తిరుగుతున్నాయని మనవడికి చెప్పి బైక్ను రోడ్డు పక్కన ఆపి స్పృహతప్పి పడిపోయాడు. అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుకుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వృద్ధుడు.. మోత్కూరు : మండలంలోని పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65) ఎండలకు తాళలేక అస్వస్థతకు గురైన శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య గతంలోనే చనిపోగా.. అతడికి ఒక కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతూ.. ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్కు చెందిన చెన్న హరికిషన్(50) ఎండలకు తాళలేక మూడు రోజులు క్రితం అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. మృతుడికి భార్య ఉంది. వంట మాస్టర్..మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సీతారంపురానికి చెందిన వంట మాస్టర్ షేక్ ఇస్మాయిల్ (38) వారం రోజులుగా వంట పనిలో బిజీగా ఉండి శనివారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
పాలిసెట్లో సత్తాచాటిన విద్యార్థులు
ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు శనివారం వెలువడిన పాలిసెట్ ఫలితాల్లో స్టేట్ మొదటి ర్యాంకులతో పాటు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ‘జయ’ విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సూర్యాపేటటౌన్ : పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. పాఠశాలకు చెందిన బాణోతు హేమంత్, చిలక నందవర్ధన్రెడ్డి ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. నల్లగొండ విద్యార్థికి మొదటి ర్యాంకు రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణానికి చెందిన జంగాల అవినాష్ అంగద్ శనివారం వెలువడిన పాలిసెట్ – 2026 ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. నల్లగొండ పట్టణంలోని గోకుల్ కాలనీకి చెందిన జంగాల లింగస్వామి, అనూష దంపతుల కుమారుడు అవినాష్ నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో పదో తరగతి చదివి 585 మార్కులు పొందాడు. పాలిసెట్ ఎంపీసీ స్ట్రీమ్లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఎంబైపీపీ స్ట్రీమ్లో 120 మార్కులకు 118 మార్కులతో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు. స్టేట్ 3వ ర్యాంకు సూర్యాపేటటౌన్ : పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేట పట్టణంలోని సృజన పాఠశాలకు చెందిన హేమంత్రెడ్డి 120 మార్కులకు 119.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా హేమంత్రెడ్డిని శనివారం పాఠశాల యాజమాన్యం అభినందించారు. పాలెం విద్యార్థినికి 13వ ర్యాంకు.. నకిరేకల్ : మండలంలోని పాలెం గ్రామానికి చెందిన మోదాల ఆరాధ్య పాలిసెట్ ఫలితాల్లో ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు గాను 117.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించింది. ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు గాను 118 మార్కులతో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంకు సాధించింది. ఆరాధ్య సూర్యాపేటలోని జయ హైస్కుల్లో పదో తరగతి చదివి 585 మార్కులు సాధించింది. 17వ ర్యాంకు సాధించిన కౌశిక్ సాయి చిలుకూరు : పాలిసెట్ ఫలితాల్లో చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం–రాధిక దంపతుల కుమారుడు కౌశిక్ సాయి ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు గాను 119 సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంకు సాధించాడు. ఎంబైపీసీలో 120 మార్కులకు 115 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 91 ర్యాంకు సాధించాడు. చిలక నందవర్ధన్రెడ్డి బానోత్ హేమంత్ -
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
వలిగొండ : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ విమర్శించారు. వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం, ఆర్రూరు, వేములకొండ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఆయన తన బృందంతో కలిసిపరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల యజమానులు తరుగు, తాలు పేరుతో క్వింటాకు 4 ,5 కిలోలు కటింగ్ రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, సనత్ జయసూర్య, ఇన్జమూరి రాము, జక్కల మత్స్యగిరి, కొత్త నరసింహ, దుర్గం శంకర్, మనోహర్, కూకుట్ల లింగస్వామి, వెంకట్ రెడ్డి, గజ్జి ఐలయ్య, ప్రశాంత్, పోలేబోయిన మమత, లింగస్వామి, శ్రీనాథ్, చెగురి వంశీరాజ్ పాల్గొన్నారు. -
ఇండస్ట్రీయల్ టూర్కు విద్యార్థులు
సూర్యాపేట : అక్షర ఫౌండేషన్–సూర్యాపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థుల ఇండస్ట్రీయల్ టూర్ను శనివారం సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రాంకుమార్రెడ్డి ప్రారంభించారు. ఈ టూర్లో భాగంగా ఒక పరిశ్రమకు ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుంది, వస్తువు ఎలా తయారవుతుంది అని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పు నాగయ్య, రుద్రంగి కాళిదాసు, సీనియర్ అకౌంటెంట్ శర్మ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మూర్తి, మర్రి ప్రియాంక, యాస శృతి, సొల్లేటి ఉపేంద్రాచారి, తుంగతుర్తి జనార్దనాచారి, కె. హరిత, ఉప్పు సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు. మేము బొమ్మలు గీశామోచ్.. -
టిప్పర్ను ఢీకొని దుర్మరణం
బొమ్మలరామారం : బైక్పై వెళ్తున్న యువకుడు టిప్పర్ను ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన బొమ్మలరామారం మండలం రంగాపూర్ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన బూడిద నవీన్(33) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా రాంపల్లిలోని మారుతీ షోరూంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై స్వగ్రామానికి వస్తుండగా రంగాపూర్ చెక్పోస్ట్ వద్ద మెయిన్రోడ్డు మధ్యలో నిలిపి ఉన్న టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన నవీన్ను పోలీసులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. టిప్పర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. -
యాదగిరీశుడి సన్నిధిలో 2.15గంటలు
ఫ సీఎం పర్యటన సాగిందిలా..యాదగిరిగుట్ట : టెంపుల్ సిటీపై వేద పాఠశాల నిర్మాణానికి, మరికొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సీఎం సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు యాదగిరిగుట్టలో గడిపారు. సీఎం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లు ఉదయం 8.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుట్టకు చేరుకున్నారు. ● 8.53 గంటలకు ప్రత్యేక కార్వన్ బస్సులోకి వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చారు. ● 9.26 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు, పారాయణీకులు, వేద పండితులు, పూజారుల సమక్షంలో వేద పాఠశాల భూమి పూజకు శ్రీకారం చుట్టారు. ● 9.40 గంటలకు వేద పాఠశాలకు శంకుస్థాపన భూమి పూజను పూర్తి చేశారు. ● 9.42 గంటలకు వేద పాఠశాల నిర్మాణం చేసే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపం, గోశాల, దీక్షాపరుల సన్నిధానం, వేద పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన వాటితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ● 10.03 గంటలకు యాదగిరీశుడి ఆలయంలోకి వెళ్లారు. త్రితల ద్వారం వద్ద ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ● 10.10 గంటల నుంచి 10:21 గంటల వరకు గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వచ్చారు. ● 10.22 గంటలకు ముఖ మండపంలో సీఎంతో పాటు మంత్రులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తిలు శ్రీస్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ● 10.32 గంటలకు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చారు. ● 10.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తిరిగి హైదరాబాద్కు వెళ్లారు. -
యర్కారంలో మళ్లీ రక్తపాతం
ఫ కలకలం సృష్టించిన బీఆర్ఎస్ నాయకుడి హత్య ఫ గతంలోనూ పలు ప్రతీకార హత్యలుసూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలంలోని యర్కారం గ్రామం రక్తచరిత్రగా మారింది. గ్రామంలో దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ కక్షలు మరోసారి రగిలాయి. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు (44) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయిన మధు శనివారం ఉదయం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద శవమై తేలారు. హంతకులు మధును అతికిరాతంగా చంపి మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి కాలువలో పడేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 2007లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ దారుణ హత్యకు ప్రతికారంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మిద్దె రవీందర్ హత్యలో మధు ప్రధాన నింధితుడిగా ఉన్నారు. మిద్దె రవీందర్ కుమారుడు తన అనుచరులతో కలిసి పక్కా ప్రణాళికతో మధును హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు 2020లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న హత్యలో ప్రధాన సాక్షిగా ఉన్న చింతలపాటి మధును హత్య చేస్తే సాక్షం ఉండదనే వెంకన్నను హత్య చేసిన ముఠా మధును కూడా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లీడర్లుగా ఎదగాల్సిన వయసులో శవాలుగా.. యార్కారం గ్రామంలో ఫ్యాక్షన్ బీజాలు నిన్న మొన్నటివి కావు. 1985 ప్రాంతంలో స్థానిక రాజకీయాలు, వర్గ ఆధిపత్యంతో మొదలైన ఈ వివాదం క్రమంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆ తర్వాత వచ్చిన ప్రాంతీయ పార్టీల అండతో ఇరువర్గాలు పంతాలకు పోయాయి. గత నలభై ఏళ్లలో ఈ గ్రామానికి చెందిన దాదాపు తొమ్మిది మంది ముఖ్య నేతలు లీడర్లుగా ఎదగాల్సిన వయసులో శవాలుగా మారారు. గ్రామాల్లో ఎన్నికలు వస్తే చాలు, ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందోనని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. మిద్దె రవీందర్ హత్య.. మలుపు తిరిగిన రాజకీయం ఈ రక్తచరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మిద్దె రవీందర్ హత్య. 2004లో గ్రామంలో తనకంటూ ప్రత్యేక అనుచరవర్గాన్ని సంపాదించుకుని, ఎదురులేకుండా ఎదుగుతున్న రవీందర్ను ప్రత్యర్థి వర్గం టార్గెట్ చేసింది. పక్కా స్కెచ్తో 2007లో ఆయన్ను వేటాడి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో యార్కారంలో ఒక వర్గం పూర్తిగా బలహీనపడినట్లు కనిపించినా, లోపల మాత్రం ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతలపాటి మధు వర్గానికి, రవీందర్ వర్గానికి మధ్య అప్పటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం సాగింది. మిద్దె రవీందర్ హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా రాజకీయ వైరం పరంపరగా కొనసాగుతూ వచ్చింది. 2020 ఫిబ్రవరిలో సహకార సంఘం ఎన్నికల వేళ ఈ కక్షలు మళ్లీ మొదలయ్యాయి. యార్కారం మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను కాంగ్రెస్ నాయకుడు వడ్డె యల్లయ్యతో పాటు మరికొంత మంది గొడ్డళ్లతో వెంబడించి గ్రామంలో దారుణంగా హత్య చేశారు. నాడు మిద్దె రవీందర్ ఎలాగైతే హత్యకు గురయ్యారో, అదే తరహాలో వెంకన్నను కూడా హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో చింతలపాటి మధు ప్రధాన సాక్షిగా నిలబడ్డారు. అలాగే 2024లో కాంగ్రెస్ నాయకుడు వడ్డె యల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో హత్య చేశారు. -
బ్యాంకుల వద్దకు వచ్చేవారే టార్గెట్
నల్లగొండ : బ్యాంకుల వద్దకు వచ్చే వారి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని క్లాక్టవర్ సెంటర్లో గల యూనియన్ బ్యాంకు వద్దకు ఈ నెల 19న తిప్పర్తికి చెందిన రైతు గాదె లింగయ్య వచ్చాడు. ధాన్యం అమ్మడంతో తన ఖాతాలో జమ అయిన రూ.1.50 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టుకుని వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి అతడి దృష్టి మరల్చి నగదుతో పరారయ్యారు. బాధితుడు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరు ఈ నెల 21న నకిరేకల్లో మరో రైతు వద్ద నుంచి కూడా రూ.1.40 లక్షలు దొంగతనం చేసి పారిపోతుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా వారిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు మహారాష్టకు చెందిన కేశవ తేజదోక్వల కాగా.. మరొకరు మైనర్ అని పేర్కొన్నారు. మరో నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.2.50 లక్షల నగదు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు మక్తల్, నల్లగొండ, ఖమ్మం నకిరేకల్ ప్రాంతాల్లో ఇదే తరహాలో చోరీలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, పోలీస్ సిబ్బందిని అభినందించారు. అప్రమత్తంగా ఉండాలి.. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసేవారిని ఎంచుకుని దొంగతనాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. బైక్ ఆయిల్ కారుతుందని, కింద నోట్లు పడేసినట్లు నటించడం, బట్టలపై పౌడర్ చల్లడం వంటి ట్రిక్స్తో నగదు ఎత్తుకెళ్తున్నారన్నారు. ఎవరి మీదనైనా అనుమానం వస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫ చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్టు ఫ రూ.2.50 లక్షల నగదు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం -
వేద పాఠశాలకు భూమిపూజ
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులన్నింటికీ ఒకేచోట పెద్దగుట్టపై శిలాఫలకం వేశారు. అందులో ప్రధానమైనది వేద పాఠశాల. వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతిస్వామి వేద ఆశీర్వచనం అనంతరం అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు.సీఎంతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నృసింహుని దర్శించుకున్న సీఎం రేవంత్ అభివృద్ధి పనులకు భూమిపూజ అనంతరం సీఎం రేవంత్రెడ్డి కొండపైకి కాన్వాయ్లో చేరుకున్నారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం నుంచి, త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అర్చక బృందం, వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలకగా మొ¬దట ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ప్రధానాలయంలోని స్వయంభూలను, ఉత్సవ మూర్తులను దర్శించుకుని రేవంత్ పూజలు నిర్వహించారు. వేదపండితులు ప్రధానాలయం ముఖమండపంలో సీఎంకు వేదాశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఆలయ ఈవో భవాని శంకర్ స్వామివారి జ్ఞాపికను సీఎంకు అందజేశారు. వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం సీఎం పశ్చిమ రాజగోపురం గుండా ఆలయం నుంచి బయటకు వచ్చారు. గోశాల స్థలంలో బదులు పెద్దగుట్టపై దిగిన సీఎం హెలికాప్టర్ సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యం చోటుచేసుకుంది. సీఎం, మంత్రులు ఉన్న హెలికాప్టర్ ప్రొటోకాల్ ప్రకారం నిర్దేశిత యాదగిరిగుట్ట గోశాల స్థలంలో ల్యాండ్ కావాల్సి ఉండగా దానికి బదులు పెద్దగుట్టపై దిగింది. అక్కడ స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, భద్రతా అధికారులు ఎవరూ లేకపోవడంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు 10 నిమిషాలపాటు హెలికాప్టర్లోనే వేచి చూశారు. అనంతరం హెలికాప్టర్ దిగిన సీఎం.. కాన్వాయ్ లేకుండా అక్కడున్న సాధారణ పోలీసులతోనే కాలినడకన సుమారు 300 మీటర్లు నడుచుకుంటూ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. మరోవైపు హెలికాప్టర్ మరోచోట దిగడంతో సీఎం షెడ్యూల్ మారిపోయింది. వాస్తవ షెడ్యూల్ ప్రకారం కొండ కింద హెలికాప్టర్ ల్యాండ్ కాగానే కాన్వాయ్తో సీఎం రేవంత్ కొండపైకి చేరుకోవాలి. అక్కడ దైవదర్శనం అనంతరం పెద్దగుట్ట (టెంపుల్ సిటీ)లో వేద పాఠశాలకు భూమిపూజ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలి. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో అల్పాహారం చేసి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్లాలి. కానీ హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ కావడంతో సీఎం ముందుగా శంకుస్థాపన నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు.ఆపై అల్పాహారం చేయకుండానే హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. గత సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటనల సందర్భంగా హెలికాప్టర్లో పలుమార్లు పెద్దగుట్టపై ఏర్పాటు చేసిన ఈ హెలిపాడ్ వద్దే దిగారు. ఆ హెలికాప్టర్ నడిపిన పైలట్.. ఇప్పుడు హెలికాప్టర్ను నడిపిన పైలట్ ఒకరే కావొచ్చని.. అందుకే యాదగిరిగుట్టలో ల్యాండింగ్ అనగానే పెద్దగుట్ట వద్ద హెలిపాడ్ను సూచిస్తూ ఏర్పాటు చేసే విండ్ ఫ్లాగ్ లేనప్పటికీ నేరుగా దించాడని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఉదంతంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. అలాగే ఆర్ అండ్ బీ ఈఈకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులు ఇవీ.. ⇒ రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో పెద్దగుట్ట (టెంపుల్ సిటీ)లో 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల నిర్మాణం. అక్కడే యాగశాలలతోపాటు ఒక గోశాల ఏర్పాటు. ⇒ యాదగిరికొండపై రూ. 43.12 కోట్లతో డారి్మటరీ, దీక్షాపరుల సదనం నిర్మాణం. ⇒ కొండపై గతంలో బాలాలయం ఉన్న చోట స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో కల్యాణ మండపం. ⇒ భక్తుల కోసం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ.1.41 కోట్లతో రక్షణ పైకప్పు నిర్మాణం. ⇒ రథశాల వైపు ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణం. -
యువకుడి హత్యకు కారణమైన ‘గే యాప్’
కోదాడ : సోషల్ మీడియాలో ఓ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన బల్గూరి గణేష్(20) ఈ నెల 15న హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సామాజిక మాధ్యమంలో ఉన్న ‘పోలో’ గే యాప్ కారణమని, హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గణపవరానికి చెందిన బల్గూరి గణేష్కు, హుజూర్నగర్కు చెందిన బర్రెంకుల సోమేష్కు పోలో అనే గే యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఏకాంతంలో తీసుకున్న ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గణేష్ను చంపాలని సోమేష్ నిర్ణయించుకున్నాడు. దీనికి గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు పగిల్ల ఉదయ్కిరణ్ సాయం తీసుకున్నాడు. గణేష్ హత్యకు సోమేష్ పథకం వేస్తున్న విషయం తెలిసినప్పటికీ సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతి మిన్నకుండిపోయారు. ఈ నెల 15న రాత్రి పథకం ప్రకారం సోమేష్.. గణేష్ను గణపవరానికి సమీపంలో ఉన్న మామిడి తోట వద్దకు పిలిచాడు. ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అక్కడే ఉన్న సోమేష్ స్నేహితుడు ఉదయ్కిరణ్ సాయంతో గణేష్పై రాయితో దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. సంఘటన స్థలం నుంచి కత్తి, మొబైల్ ఫోన్లు ఇతర ఆధారాలను సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, మొబైల్ లొకేషన్లు పరిశీలించి నిందితులైన పగిళ్ల ఉదయ్కిరణ్, ప్రధాన నిందితుడైన సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతిలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్క పంపినట్లు ఆయన వెల్లడించారు. సోమేష్ పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్ ఇన్చార్జీ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్, చింతలపాలెం ఎస్ఐ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పరారీలో ప్రధాన నిందితుడు గణపవరంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు -
విజ్ఞానం.. వినోదం
దొంగతనం మహాపాపం● నిడమనూరు మోడల్ స్కూల్లో కొనసాగుతున్న వేసవి శిబిరం ● డ్యాన్స్, చేతిరాత, డ్రాయింగ్పై విద్యార్థులకు శిక్షణ ● క్విజ్ పోటీలు, మాక్ పార్లమెంట్ నిర్వహించి విజ్ఞానం పంచుతున్న నిర్వాహకులునిడమనూరు : నిడమనూరులోని మోడల్ స్కూల్లో వేసవి శిబిరం చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుతోంది. ఈ శిబిరంలో 60 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ క్రీడలతో పాటు వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ వేసవి శిబిరం 25వ తేదీ వరకు కొనసాగనుంది. పలువురు విద్యార్థులకు డ్యాన్స్, డ్రాయింగ్, చేతి రాత మెరుగుపరచడం(పాలిగ్రఫీ), చెస్, క్యారమ్స్, గణితం, టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్), అటల్ టింకరింగ్ ల్యాబ్లో వివిధ ప్రయోగాలు చేసేందుకు విద్యార్థులకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. అదేవిధంగా క్విజ్ పోటీలు, మాక్ పార్లమెంట్ నిర్వహించి అనేక అంశాలను బోధిస్తున్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయుల్లో ఒకరు విధులకు హాజరవుతూ విద్యార్థులకు వేసవి శిబిరం చార్ట్ అనుగుణంగా తరగతులు నిర్వహిస్తున్నారు.కొత్త విషయాలు నేర్చుకుంటున్నా వీడియోల ద్వారా పలు కథాంశాలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. నీతి చంద్రిక, చందమామ కథలు, పంచతంత్ర కథలను అర్థమయ్యేరీతిలో చెబుతున్నారు. ఇంట్లో టీవీ చూసే కంటే స్నేహితులతో కలవడం ఆనందంగా ఉంది. – ఎస్కే నిషూ, 6వ తరగతి, నిడమనూరుభవిష్యత్తులో చెస్లో రాణిస్తా స్నేహితులతో కలిసి చెస్ ఆడటం, కొత్త కొత్త ఎత్తులు నేర్చుకోవడం బాగుంది. ఈ నైపుణ్యాలతో మండల, జిల్లా స్థాయి టోర్నమెంట్లలో రాణించే అవకాశం ఉంటుంది. స్నేహితులతో ఆటపాటలు బాగున్నాయి. – ఆర్. నాగచైతన్య, 8వ తరగతి, మోడల్ స్కూల్, నిడమనూరు డ్యాన్స్పై ఆసక్తి పెరిగింది చేతిరాత మెరుగుపరుచుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం వలన భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. డ్యాన్స్ మాస్టర్ కూడా మాకు ఆసక్తి కలిగేలా ఎంతో ఓర్పుతో నేర్పిస్తున్నారు. – కె. అక్షర, 6వ తరగతి, మోడల్ స్కూల్ఇండోర్ గేమ్స్ బాగున్నాయి వేసవి శిబిరంలో స్నేహితులతో కలిసి చెస్, క్యారమ్స్ ఆడటం బాగుంది. ఉదయం ఆటలు ఆడటంతో పాటు స్నేహితులను నిత్యం కలిసి కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. – ఈ. ప్రవీణ్కుమార్, 8వ తరగతి, నిడమనూరు అమ్మమ్మ చెప్పిన నీతి కథఅనగనగా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు వెంకట్ సాయి, శివ. వీళ్లిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. శివ వాళ్ల నాన్న వ్యవసాయం చేసేవాడు. అమ్మ కూలీ పనికి వెళ్లేది. వెంకట్ సాయి వాళ్ల తల్లిదండ్రులు బేకరీ నడిపేవారు. ఒకరోజు శివ దొంగతనం చేశాడు. అది చూసిన వెంకట్ సాయి దొంగతన చేయడం తప్పని శివకు చెప్పాడు. కానీ శివ పట్టించుకోలేదు. ఆ తర్వాత మరోసారి శివ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అప్పుడు శివకు అర్ధమైంది వెంకట్ సాయి తన మంచికే చెప్పాడని అర్ధం చేసుకున్నాడు.స్టాలిన్, దామరచర్ల -
చేపలు పడుతూ విద్యుదాఘాతంతో మృతి
నిడమనూరు : కరెంట్ తీగలతో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరులో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరుకు చెందిన పిడుగు రాజు(40) డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నిడమనూరు చెరువు దిగువన చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కరెంట్ తీగల సహాయంతో చేపలు పడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి కుమారుడు తేజ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నిడమనూరు ఎస్ఐ తెలిపారు.మంటలు అంటుకుని బత్తాయి తోటలు దగ్ధంపెద్దవూర : మండలంలోని కోమటికుంటతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బాసోనిబావితండాలో శుక్రవారం మంటలు అంటుకొని బత్తాయి తోటలు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసోనిబావితండాకు చెందిన ముడావత్ ధనకోటి ఎకరం భూమిలో, ముడావత్ లక్ష్మణ్, ముడావత్ రవీందర్ ఎకరంన్నర చొప్పున భూమిలో ఎనిమిదేళ్లుగా బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు బత్తాయి తోట సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకుని నిప్పు రవ్వలు వరి కొయ్యలకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న బత్తాయి తోటలకు మంటలు వ్యాపించి చెట్లు, డ్రిప్పు పరికరాలు, పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముగ్గురి రైతుల బత్తాయి తోటల్లో పది టన్నులకు పైగా బత్తాయిలు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మోత్కూరులో గడ్డివాములు.. మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంగీసమ్మ కుంట సమీపంలోని పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టగా.. గాలి ఉధృతికి ఆ మంటలు సమీపంలోని గడ్డివాములు, పశువుల కొట్టాల వరకు చేరుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నించారు. రైతులు కొట్టాల్లో ఉన్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో నిలిగొండ రమేష్, నిలిగొండ సోమయ్యకు చెందిన సుమారు వెయ్యి మోపుల గడ్డి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు వేసిన నిప్పు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేశారు. -
వర్షపు నీరు.. భవిష్యత్తుకు ఆధారం
గుర్రంపోడు : వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, కందకాలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భజలాలు వృద్ధి చెంది కరువు నుంచి విముక్తి పొందవచ్చు. ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో భాగంగా కందకాలు, నీటి కొలనుల తవ్వకం వంటి పనులు జరుగుతున్నాయి. వీటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో కరువు ప్రాంతాల్లో సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా రైతులు కందకాలు, బోర్ల వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని ఉపాధి హామీ అధికారులు సూచిస్తున్నారు. కరువు ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణపై గుర్రంపోడు మండల ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రాం అధికారి కంచర్ల గోపాల్రెడ్డి అందిస్తున్న సూచనలు, సలహాలు.. కందకాల తవ్వకం ఇలా.. రైతులు తమ వ్యవసాయ భూముల్లో కందకాలు తవ్వుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది. చేనులోని వాలుకు అడ్డంగా ప్రతి వంద మీటర్లకు ఒక మీటరు లోతు, అరమీటరు వెడల్పు గల సమతల(ఒకే లెవల్లో) కందకాలను తవ్వుకోవాలి. దీని వల్ల చేనులో కురిసిన వాన నీరంతా భూమిలో ఇంకి భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. దీంతో బోర్లు లోతుగా వేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా చేనులోని పాత బావుల్లో పూడిక తీసినా సరిపోను నీరు లభిస్తుంది. భూగర్భజలాలు పైకి రావడం వల్ల కరెంట్ వినియోగం తక్కువై పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. సమతల మడులు చేను మొత్తం సమతలంగా ఉంటే అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పరుచుకోవాలి. మడుల కట్టలు కనీసం అరమీటరు ఎత్తుగా ఉండేటట్లు పక్కనే కందకం తవ్వి వర్షం నీరంతా ఇంకింప చేయడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. గుట్టల చుట్టూ.. గుట్టల చుట్టూ భూములు ఉంటే గుట్టల చుట్టూ ఒక మీటరు వెడల్పు, మీటరున్నర లోతు కందకాలు తవ్వుకోవాలి. గుట్టలపై పడిన వర్షపు నీరు ఈ కందకాల ద్వారా భూమిలో చేరుతాయి. ఊర చెరువు కందకాలు ప్రతి ఊరి చెరువులో మధ్యలో 3 మీ. వెడల్పు 20 మీ. పొడవు, 3 మీ. లోతు కందకాలు తవ్వుకుంటే ఎండాకాలం పశువులకు సరిపడా నీరు దొరుకుతుంది. ఊట చెరువు కందకాలు ఊట చెరువుల్లో ఒక మీటరు వెడల్పు, 1.5 మీటరు లోతు, 20 మీటర్ల పొడవుగల కందకం తవ్వుకుంటే భూగర్భజలాలు పదిరెట్లు వృద్ధి చెందుతాయి. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి ఆవరణలోనూ రెండు నుంచి నాలుగు ఇంకుడు గుంతలు ఏర్పరుచుకుంటే ఇంట్లోని బోరుకు పుష్కలంగా నీరు అందుతుంది. ఇంకుడు గుంతల్లో అరమీటరు దొడ్డు కంకర, పైన పావు మీటరు సన్న కంకర, ఆపై పావు మీటరులో ఇసుక నింపాలి. పై పద్ధతులను రైతులు అవలంబిస్తే భూగర్భజలాలు సరిపడా అందుబాటులోకి వచ్చి పంటలు పండించుకోవచ్చు. ఫ ఇంకుడు గుంతలు, కందకాల ఏర్పాటుతో వాన నీటి సంరక్షణ ఫ గుర్రంపోడు ఉపాధి హామీ పథకం అదనపు ప్రోగ్రాం అధికారి గోపాల్రెడ్డి సూచనలు -
నీకు పెళ్లి చేయాల్సిన చేతులతో తలకొరివి పెడుతున్నా బిడ్డా..
నార్కట్పల్లి : మండలంలోని చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య(24) అమెరికాలో ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. ఆమె మృతదేహం శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంది. నవ్య బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చేసేందుకు రెండున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగో రాష్ట్రంలోని రోజ్వెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. ఈ నెల 16న రాత్రి కారులో వెళ్తుండగా.. వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతిచెందింది. కాగా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్రెడ్డి, శోభ, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నవ్య మృతదేహానికి ఆమె తల్లి శోభ బొట్టు పెట్టి సొమ్మసిల్లి పడిపోయింది. ‘నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపియ్యాలనుకున్న బిడ్డా.. కానీ నీకు తలకొరివి పెట్టే కర్మ పట్టింది.. ఏ తండ్రికి నాలాంటి బాధ రావొద్దు బిడ్డా..’ అంటూ నవ్య తండ్రి శ్రీనివాస్రెడ్డి రోదించిన తీరు గ్రామస్తులు, బంధువులను కంటతడి పెట్టించింది. అనంతరం మధ్యాహ్నం నవ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. నవ్య భౌతికకాయానికి ఆమె తండ్రి తలకొరివి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, చెరువుగట్టు ఆలయ చైర్మన్ వరాల రమేష్, మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, నవీన్రెడ్డి, పున్నం రాజు యాదగిరి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో ఆరు రోజుల్లోనే నవ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో ఆయనకు నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బోరున విలపించిన నవ్య తండ్రి స్వగ్రామానికి చేరుకున్న నవ్య మృతదేహం అంత్యక్రియలు పూర్తి.. పలువురి సంతాపం -
వ్యక్తి అదృశ్యం
భువనగిరి(బీబీనగర్) : ఏపీని నుంచి వలస వచ్చి బీబీనగర్ మండలం నెమురగోముల గ్రామంలో ఉంటున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల శౌరిబాబు తన భార్య మౌనికతో కలిసి నెమురగోముల గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా శౌరిబాబు పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తుంటాడు. గత రెండు నెలలుగా పింఛన్ కోసం స్వగ్రామానికి వెళ్లకపోవడంతో అతడి సోదరుడు మల్లేశ్వర్రావు శుక్రవారం నెమురగోముల గ్రామానికి వచ్చాడు. ఇక్కడ శౌరిబాబు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. సాగర్లో చిరుతపులి సంచారం..?నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని హిల్కాలనీలోని కెనాల్స్లో చిరుతపులిని పోలిన జంతువు సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. గురువారం రాత్రి కెనాల్స్లోని వీధిలో సీసీ రోడ్డు దాటుతున్నట్లు, చిరుతపులి లాగే అరిచిన అరుపులు రికార్డయ్యాయి. ఈ వీడియోను అటవీశాఖ అధికారులకు చూయించగా చిరుతపులిలాగే ఉందని, వీడియోను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. వడగాల్పులు తీవ్రంగా ఉండటంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి చిరుతపులి జనసంచారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదని రిటైర్డ్ సీనియర్ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తూఫాన్ వాహనం బోల్తా● పలువురికి గాయాలుఅర్వపల్లి : సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై అర్వపల్లి శివారులో శుక్రవారం తూఫాన్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన కొంతమంది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చెందిన భార్యాభర్తల పంచాయితీ విషయమై మాట్లాడటానికి తూఫాన్ వాహనంలో వెళ్తుండగా.. అర్వపల్లి శివారులోకి రాగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నందిపాటి జానయ్య, ప్రశాంత్, వాడపల్లి నగేష్, డ్రైవర్ ప్రశాంత్ వాహనంలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్ఐ సైదులు, కానిస్టేబుల్ ఆదిరమణ, స్థానికులు కలిసి క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. బోల్తా పడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతిమేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. స్థానిక ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన వడ్డేపల్లి వీరబాబు(25) చింతలపాలెం మండలం దొండపాడు గ్రామానికి చెందిన వరసకు తన మేనత్త అయ్యే మహిళతో సహజీవనం చేస్తూ ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. శుక్రవారం తనకు ఆరోగ్యం బాగోలేదని వీరబాబు చెప్పడంతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించారు. అనంతరం కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. వీరబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
హామీలతోనే సరిపెడతారా..!
సాక్షి, యాదాద్రి : సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చిన పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. యాదగిరిగుట్టకు సీఎం హోదాలో ఆయన ఇప్పటికే నాలుగు సార్లు వచ్చారు. గత పర్యటనల్లో సీఎం ఇచ్చిన హామీలు, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలోనైనా పెండింగ్ బిల్లులు విడుదల చేసి, యాదగిరిగుట్టను పూర్తిస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్వత్రా కోరుతున్నారు. విష్ణు పుష్కరిణి పునరుద్ధరించా లని డిమాండ్కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడం నిర్వహించినప్పటికీ, కొంతకాలానికే నిలిచిపోయింది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్కరిణి చుట్టూ వర్తక సంఘం ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య కారణంగానే పుష్కరిణిని మూసివేసినట్లు తెలుస్తోంది. కొండపైకి వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు గతంలో కొండపైకి 40 ఆర్టీసీ బస్సులు నడిపేవారు. ప్రస్తుతం బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. బస్టాండ్ ఆవరణలో బస్సులనే కాకుండా ప్రైవేట్ వాహనాలు నిలపడం, షాపుల నిర్వహణ వల్ల బస్సులు తిరగడానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. శని, ఆదివారాల్లో ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదు. కొండపై భక్తులకు సరిపడా టాయిలెట్ల సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా కొండపై భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన చింతపండు, నెయ్యి దొంగతనాలే ఇందుకు నిదర్శనం. ప్రకటించని వైటీడీ పాలక మండలి గత ముఖ్యమంత్రి ప్రకటించిన యాదాద్రి పేరును సీఎం రేవంత్రెడ్డి తిరిగి యాదగిరిగుట్టగా మార్చారు. టీటీడీ తరహాలో, వైటీడీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది. కానీ ఇంత వరకు పాలక మండలి ప్రకటించలేదు. పెండింగ్ పనుల నిధుల కోసం అధికారులు రూ. 200 కోట్ల అంచనాలతో నివేదికలు పంపారు. ఇందులో రూ. 100 కోట్లు పెండింగ్ పనులకు, మరో రూ. 100 కోట్లు పాత బిల్లుల చెల్లింపుల కోసం ప్రతిపాదించారు. కానీ ఈ నిధులు ఇంకా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. అంతేకాకుండా మొదటి ఘాట్ రోడ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వాటర్ ఫాల్స్ (జలపాతం)ను ప్రారంభంలో రెండు సార్లు ట్రయల్ రన్ వేసి చూశారు. ఆ తర్వాత దాని నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. కొండ కింద గండి చెరువు అభివృద్ధి, దుకాణాల సముదాయం, దేవస్థానం బస్టాండ్, ఎంట్రీ ఫ్లైఓవర్ వంటి మరో 15 శాతం పనులు బిల్లులు రాక నిలిచిపోయాయి. గుట్టకు నాల్గవసారి రాక.. ● సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు శనివారం నాల్గవ సారి వస్తున్నారు. ఈ పర్యటనలో దాదాపు రూ. 100 కోట్ల వ్యయంతో చేపట్టే వేద పాఠశాల, ఇతర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ● మొదటి సారి 2024 మార్చి 11న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా వచ్చి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ● రెండవ సారి 2024 నవంబర్ 8న ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే యాదాద్రి పేరును ‘యాదగిరిగుట్ట’గా మారుస్తూ, టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ● మూడో సారి 2025 ఫిబ్రవరి 23న ఆలయంలో ఏర్పాటు చేసిన బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు యాదగిరిగుట్టకు విచ్చేశారు. అభివృద్ధి పనులకు నిధుల విడుదలలో జాప్యం జిల్లాలో కాళేశ్వరం, మూసీ కాలువల ఆధునీకరణకు నిధులు విడుదల కావడం లేదు. మూసీ కాలువలైన బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారే కానీ ఆర్థిక శాఖ నుంచి విడుదల కావడం లేదు. నృసింహసాగర్ సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పరిహారం నిధులు సైతం విడుదల చేయడం లేదు. సంగెం వద్ద మూసి బ్రిడ్జి, భీమలింగం వద్ద అభివృద్ధి పనులు, గంధమల్ల రిజర్వాయర్ ముందుకు సాగడంలేదు. సీఎం హోదాలో ఇప్పటికే నాలుగు సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన రేవంత్రెడ్డి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చని గతంలో ఇచ్చిన హామీలు విష్ణు పుష్కరిణి మూసివేయడంపై భక్తుల అసంతృప్తి పెండింగ్లోనే వైటీడీ పాలక మండలి ఏర్పాటు సాగునీటి ప్రాజెక్టులకు విడుదల కాని నిధులు


