breaking news
Yadadri
-
పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం
ఏ దశలో, ఏ సమయంలో ఎరువులు వాడాలంటే.. పంటలకు నత్రజని అవసరం చివరి దశ వరకు ఉంటుంది. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో రెండు మూడు కీలక దశల్లో వాడుకోవాలి. ఏపుగా పెరిగేందుకు, పూత, మొగ్గ దశ, పంట దిగుబడి పెరిగే దశల్లో ప్రధానంగా వాడుకోవాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో చివరి దుక్కిలో వేసుకోవాలి. దీంతో ఎరువు భూమిలో నిల్వ ఉండి కొద్దికొద్దిగా పంటకు అందుతుంది. పొటాష్ ఎరువులు మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తి వచ్చేలా చేస్తాయి.పెద్దవూర: పంటల సాగులో ఎరువుల వాడకం కీలకమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్ పేర్కొన్నారు. ఏయే దశల్లో ఎంత మోతాదులో ఏయే ఎరువులు వాడాలనే దానిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎరువుల వినయోగానికి సంబంధించి రైతులు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు. రసాయనిక ఎరువులతో నష్టం రసాయనిక ఎరువుల వాడకం శ్రేయస్కరం కాదు. దీనివల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూసారంలో మార్పులు సంభవిస్తాయి. మరోవైపు పంట ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మిగిలి ఉండి మార్కెట్లో దాని ప్రభావంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. విరివిగా, విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడటం తగ్గించాలి. సేంద్రియ ఎరువులతో ఎంతో మేలు సేంద్రియ ఎరువుల వాడకం మూలంగా అధిక ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువుతో అన్ని రకాల పంటలకు పోషకాలు అందుతాయి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సొంతంగా వాటిని తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, పచ్చిరొట్ట ఎరువులు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వాడకం, జీవన ఎరువుల వాడకం ప్రాధాన్యతను గుర్తించాలి. ఎరువుల వాడకంలో పాటించాల్సిన పద్ధతులు ● లోతు దుక్కుల వల్ల భూమి పొరలు గుల్లబారి తేమను బాగా నిల్వ ఉంచుకుంటాయి. వేసిన ఎరువును ఎక్కువ శాతం మొక్కలు తీసుకుంటాయి. ● పంటలో ఉన్న కలుపును పూర్తిగా తొలగించిన అనంతరం తేమ ఉన్న దశలోనే ఎరువులు చల్లుకోవాలి. ● సమస్యాత్మక భూముల్లో ముందుగా ఉన్న సమస్యను సరిచేసుకుని ఆ తర్వాత ఎరువులు వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ● అన్ని పోషకాల్లో నత్రజని పోషకం వృథా ఎక్కువగా ఉంటుంది. యూరియాను వేప పిండితో కలిపిగానీ, యూరియా ఎరువుతో వేప నూనె కలుపుకుని గానీ వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలవుతూ వృథా తగ్గుతుంది. ● కోల్థార్తో 2 లీటర్ల కిరోసిన్తో మిశ్రమం చేసి రెండు బస్తాల యూరియాలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. అర బస్తా యూరియాను ఒక బస్తా తడి, పొడి మట్టితో కలిపి 24గంటలు నీడలో ఉంచి తర్వాత నేలకు అందిస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎరువుల ధరలపై అవగాహన అవసరం ఎరువుల వాడకం ఎంత ముఖ్యమో.. వాటి ధరలపై అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఏయే ఎరువుల్లో ఏ శాతం ఎంత ఉంటుంది. నాణ్యత, ధరలు, నకిలీలు వంటి వాటిని గమనించాలి. దీనికి వ్యవసాయ అధికారులు, అవగాహన ఉన్న రైతుల సలహాలు తీసుకోవాలి. వెదజల్లే పద్ధతి.. ప్రయోజనాలుసాధారణంగా ఎరువులను రెండు పద్ధతుల్లో వేస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే మేలు జరుగుతుంది. వరుస క్రమంలో లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుపోయే పైర్లకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. వరికి కూడా ఈ పద్ధతి మేలు చేస్తుంది. పాదుల్లో ఎరువు వేసే పద్ధతిమొక్కల దగ్గర ఎరువులు వేసే పద్ధతి ద్వారా పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా కూడా తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు పొలాన్ని 2 అంగుళాల మేర లోతు చేసుకుని తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు పడేలా వేయాలి. చిన్నపాటి గుంతలు తీసి ఎరువులు వేసిన సమయంలో దానిని మట్టితో కప్పేలా చేసుకోవాలి. 06 హెచ్ఎల్ఏ 205పెద్దవూరలో పత్తి చేనులో ఎరువులు వేస్తున్న రైతులు -
బైక్కు నిప్పంటించిన దుండుగులు
అడవిదేవులపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పంటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్దండి కోటయ్య తన బైక్ను మంగళవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. బుధవారం ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో బైక్ దగ్ధమవుతుండటం గమనించిన గ్రామస్తులు కోటయ్యకు సమాచారం ఇచ్చారు. కోటయ్య వెళ్లి చూడగా.. బైక్పై గడ్డి వేసి నిప్పంటించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
పెద్దఅడిశర్లపల్లి నుంచి ఫిలింనగర్కు..
ఫ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్తాచాటుతున్న మేడారం కుర్రాడు ఫ ఇటీవల కుబేర సినిమాకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన అరవింద్ ●అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్బాయ్గా, క్యాటరింగ్ బాయ్గా, రైస్మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి.. తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్బాయ్గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు. సాహిత్య ప్రచారం.. కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు. -
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
● నలుగురి అరెస్ట్నేరేడుచర్ల: కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామ శివారులో బుధవారం జరిగింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కందులవారిగూడెం గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. వారి నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై కేసు నమోదుకొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న పలువురు ఆర్ఎంపీలపై పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాము ఫిర్యాదు మేరకు దేవరకొండ పట్టణంలోని సాయిరాం క్లినిక్ నిర్వాహకుడు రాజేశ్వరరావు, అల్ఫా క్లినిక్ నిర్వాహకుడు జహంగీర్, ఆకాశ్ కంటి ఆస్పత్రి నిర్వాహకుడు రమేష్, మారుతీ క్లినిక్ నిర్వాహకుడు సంతోష్పై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు. కౌలు రైతు ఆత్మహత్యకనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన గోనెల చిన్న యాదయ్య(45) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేయటంతో పాటు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటం కుటుంబ ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కాశమ్మతో తరచూ గొడవలు రావడంతో వారం రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన చిన్న యాదయ్య బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన యాదయ్య తల్లి లింగమ్మకు కొడుకు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామయ్య తెలిపారు. -
నేడు బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవం
నాగార్జునసాగర్: సిద్దార్డుడికి జ్ఞానోదయం అయ్యి గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత మొదటి బోధన చేసిన రోజును స్మరించుకుంటూ గురువారం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గౌతమి బుద్ధుని జీవితంలో ముఖ్యమైన ఐదు ఘట్టాలలో ఒకటి మొదటి ఉపన్యాసం. దీనిని ధర్మచక్ర పరివర్తన అనిపిలుస్తారు. బౌద్ధులు, బౌద్ధ అభిమానులు ఈ రోజును ప్రత్యేక దినంగా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఎస్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 11గంటలకు కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమానికి బౌద్ధ సంఘం ప్రతినిధులు, ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు తరలిరానున్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఫ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత తుర్కపల్లి: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత అన్నారు. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన క్పలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చట్ట పరిరక్షణ మద్దతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగరాజు, పారా లీగల్ వలంటీర్లు హిరాలాల్, మౌనిక, సబ్ ఇన్స్పెక్టర్ తక్కూద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో బస్సులు నడపాలని రాస్తారోకో
రాజాపేట : సకాలంలో బస్సులు నడపాలని కోరుతూ రాజాపేటలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం స్థానిక గాంధీ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొండ్రెడ్డిచెరువు, పుట్టగూడెం గ్రామాలకు చెందిన సుమారు 60 మందికిపైగా విద్యార్థులం రాజాపేటలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నామని తెలిపారు. తాము మా గ్రామాల నుంచి పాఠశాలలకు వచ్చేందుకు ఉదయం 7గంటలకు ఒకసారి, సాయంత్రం 5గంటలకు యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు ఉందని, అది ఉదయం వేళలో సమయానికి బస్సు నడుస్తున్నా సాయంత్రం మాత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని వాపోయారు. స్థానిక నాయకులు చొరవ చూపి యాదగిరిగుట్ట డిపో అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
భూ యజమానులకు నోటీసులు జారీ
బీబీనగర్: బీబీనగర్ మండల పరిధిలో రైల్వే డబ్లింగ్ పనుల కోసం భూ యజమానులకు రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. బీబీనగర్ మండల గూడూరు గ్రామం నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు వరకు రైల్వే మార్గంలో జరుగనున్న నడికుడి డబ్లింగ్ పనులకు ఇటీవల భూ సేకరణ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా గూడూరు, పగిడిపల్లి, భువనగిరి, నాగిరెడ్డిపల్లి, నందనం, అనాజిపురం, బొల్లేపల్లి గ్రామాల పరిధిలో రైల్వే ట్రాక్ వెంట గల భూ యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులను జారీ చేయడంతో పాటు సర్వే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో 800 ఎకరాలకుపైగా భూ సేకరణ జరుగనుంది. వయోవృద్ధుల సంక్షేమానికి కృషిభువనగిరిటౌన్ : వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోవృద్ధుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ నాయకులు మందడి ఉపేందర్ పాల్గొన్నారు. ఆటాపాటలతో చదువు నేర్చుకోవాలిభువనగిరి : దివ్యాంగ విద్యార్థులు ఆటాపాటలతో చదువు నేర్చుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని భవిత కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 66 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా బోధనాభ్యాసన పరికరాలను అందజేసి మా ట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విలీన విద్యా జిల్లా సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, విలీన విద్యా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కల్యాణ వేడుకను అర్చకులు నేత్ర పర్వంగా నిర్వహించారు. శ్రీస్వామి వారి ప్రధానాలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం ముఖమండపంలో అష్టోత్తర పూజలు చేపట్టారు. రాత్రి శయనోత్సవం జరి పించి, ద్వార బంధనం చేశారు. -
లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తే కేసులు తప్పవు
సాక్షి, యాదాద్రి : భువనగిరిలో అనుమతిలేని ఆస్పత్రులు నడవడంతోపాటు లింగనిర్ధారణ పరీక్షలు చేసే సెంటర్లపై విచారణ చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. మూడు రోజుల క్రితం భువనగిరిలో లింగనిర్ధారణ పరీక్షలతో పాటు, ఇద్దరు గర్భిణులకు గర్భస్రావం చేసిన సంఘటపై సీరియస్ అయ్యారు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం అనుమతి రద్దు చేసిన ఆస్పత్రికి మరో పేరుతో అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మాదాపూర్, వలిగొండ, ఆలేరు, మోత్కూరు ఇలా పలు చోట్ల ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడస్తుంటే కఠిన చర్యలు ఎందుకు సిఫార్సు చేయడం లేదని వైద్యారోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ప్రఽశ్నించారు. లింగనిర్ధారణ పరీక్షలు, ఆనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నడపడం, అర్హతలేని డాక్టర్లతో వైద్యం చేయడాన్ని అడ్డుకోవడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సమాచారం. ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి వలిగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రభుత్వ ఆర్థికసాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏ ఈ కిరణ్, ఏపీఎం జాని, ఏపీఓ పరుశరాములు, కార్యదర్శి తదతరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
కదంతొక్కిన కార్మికలోకం
సాక్షి, నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రమైన భువనగిరితోపాటు ఆలేరు, యాదగిరిగుట్ట, రామన్నపేట, పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, మోత్కూరు ప్రధాన సెంటర్లతోపాటు మిగతా అన్ని మండల కేంద్రాల్లో కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టాయి. చౌటుప్పల్లో ఆర్డీఓ, ట్రాన్స్కో డీఈ కార్యాలయాల ఎదుట ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాడ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రెండేళ్లుగా పైసా ఖర్చు చేయలే!
ఖజానాలో మూలుగుతున్న రూ.15 కోట్లు త్వరగా అభివృద్ధి పనులు చేపట్టాలి నిధులు ఉన్నందున అవసరమైన వార్డుల్లో డ్రెయినేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలి. ఇందుకు మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ చూపాలి. – సముద్రాల శ్రీనివాస్, బీజేపీ నేత, ఆలేరు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం వార్డుల్లో అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే రూ.15కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే పనులకు త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తాం. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆలేరు ఫ టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరు ఫ పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం ఫ వార్డుల్లో పడకేసిన అభివృద్ధి పనులు ఫ ఇబ్బందుల్లో పట్టణ వాసులు ఆలేరు: తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి మంజూరైన కోట్ల రూపాయల నిధులు రెండేళ్లుగా ఆలేరు మున్సిపల్ ఖజానాలో మూలుగుతున్నా అభివృద్ధి పనులకు పైసా ఖర్చు చేయడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకమండలి పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. అధికారుల ఉదాసీన వైఖరితో ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసింది. అధికారులు కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టిసారిస్తూ అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్ నాలాలతో పరేషాన్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉండగా, 22వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో ఓపెన్ నాలాల పరిస్థితి మెరుగుపడడం లేదు. అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వానాకాలంలో ఓపెన్ నాలాలతో మురుగునీటి సమస్య వల్ల దోమలు, పందులతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో సమస్యలు ఇలా.. వరదనీటి ప్రవాహం సులువుగా వెళ్లేందుకు పాత పంచాయతీ కార్యాలయ సమీపం నుంచి ప్రధాన రోడ్డులోని మసీదు వరకు స్ట్రామ్ నిర్మించాల్సి ఉంది. మున్సిపల్ ఆఫీస్కు కూతవేటు దూరంలో, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ పక్కన డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ మురుగునీరు ఏరులై పారుతూనే ఉంది. క్రాంతి నగర్, రైల్వేస్టేషన్ మార్గంలో డబుల్ బెడ్ ఇళ్ల వద్ద తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలు నిర్మించాలని చాలాకాలం నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సీసీ రోడ్లు కూడా కావాలని పలు వార్డుల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల బీసీ కాలనీ వాసులు కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన అభివృద్ధి పనులను చేపట్టడం లేదని స్థానికులు అంటున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానం పోచమ్మ గుడి సమీపంలోని శాంతినగర్లో అంతర్గత రోడ్డు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక్క శాంతినగర్లోనే కాదు పలు వార్డుల్లోని అంతర్గత రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందనే విమర్శలు ఉన్నాయి. రూ.15 కోట్లతో పనులు ఇలా.. టీయూఎఫ్ఐడీసీ కింద దాదాపు రెండేళ్ల క్రితం ఆలేరు మున్సిపాలిటీకి రూ.15కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో రూ.9కోట్లతో వివిధ వార్డులు, ప్రధాన మార్గాల్లో స్ట్రామ్ల నిర్మాణం చేపట్టాలి. వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. గ్రామ పంచాతీయ కార్యాలయం ఆవరణలో కొత్త మున్సిపల్ భవనం నిర్మాణానికి రూ.3కోట్లను కేటాయించారు. మిగితా రూ.3కోట్లతో ఇతర మౌలిక సదుపాయాలకు వెచ్చించాల్సి ఉంది. కానీ ఇంత వరకు పనుల అతీగతి లేకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలి
భువనగిరి : నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలతోపాటు గర్భిణులకు అబార్షన్లు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్వాహకులను అరెస్టు చేసి వెంటనే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలోని రైతు బజార్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్లు, అబార్షన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారికిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్రావు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీమున్సిపల్ చైర్మన్ అంజనేయులు, పార్టీ పట్టణకమిటి అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, రమేష్, సందెల సుధాకర్, కుశంగుల రాజు, ఇట్టబోయిన గోపాల్, భిక్షపతి, భగత్, చౌదరి, పాండు, ముజీబ్, పద్మ, పావని, మధు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని కాపాడుదాం
భూదాన్పోచంపల్లి: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం భూదాన్పోచంపల్లి రాంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, డీఎఫ్ఓ పద్మజారాణి, పబ్లిక్హెల్త్ డీఈ మనోహర, ఎంపీడీఓ భాస్కర్, ఎంఈఓ ప్రభాకర్, రాజారెడ్డి, మేనేజర్ నిర్మల, రాజేశ్, నాయకులు తడక వెంకటేశం, పాక మల్లేశ్, భారత లవకుమార్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, రమేశ్, సందీప్, వెంకటేశ్, వాసుదేవ్, బాలకృష్ణ, అనిల్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాడలో వన మహోత్సవం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండకు దిగువన ఉన్న ఆధ్యాత్మిక వాడలో బుధవారం ఆలయ ఉద్యోగులు, మినిస్ట్రీరియల్, మతపర, నాలుగోవ తరగతి సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, పరిసరాలు, సంస్కృత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ, ఆలయ ఉద్యోగులు గజివెల్లి రమేష్బాబు, నవీన్కుమార్, రఘు, శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు. -
అభాగ్యులను ఆదుకునేలా..
కుటుంబ పెద్ద చనిపోతే ‘ఎన్ఎఫ్బీఎస్’ కింద రూ.20 వేల ఆర్థికసాయం సాక్షి, యాదాద్రి : పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం–ఎన్ఎఫ్బీఎస్) అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు సరిపడా నిధులుండడంతో ఐదేళ్లుగా మరుగున పడిన ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ గతనెలలో జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రైతులు, చేనేత కార్మికులు, వివిధ వృత్తుల వారి ఇంటి పెద్ద చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థికసాయం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ నేతృత్వంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో అర్హత కలిగిన వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ఆర్థిక సహాయం మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంది. మంజూరైన వారికి త్వరలో ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. అర్హతలు ఇవే.. కుటుంబ యజమాని వయసు 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉండాలి. మరణ, వయసు ద్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్, తెల్ల రేషన్కార్డు జతచేయాలి. అలాగే ఆర్థిక సహాయం పొందగోరె వారి గుర్తింపు పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్తో అనుసంధానం అయిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా నంబర్, పాస్పోర్టు సైజ్ ఫొటోను జతపర్చాలి. మండలాల్లోనైతే తహసీల్దార్, పట్టణాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను విచారణ జరిపి అర్హత ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా సెర్ప్ సీఈఓ కార్యాలయానికి పంపుతారు. అక్కడి పరిశీలన చేసిన అనంతరం లబ్ధిదారులను ఓకే చేసి చనిపోయిన కుటుంబ యజమాని నామినీ ఖాతాల్లో రూ.20వేలు జమ చేస్తారు. దరఖాస్తులు ఇలా.. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో 620 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో బీసీలు 378, ఎస్సీలు 179, ఓసీలు 36, ఎస్టీలు 27 మంది ఉన్నారు. ఈనెలలో భాగంగా బుధవారం నాటికి మరో 225 మంది దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీల నుంచి అతి తక్కువగా ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు నుంచి ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైంది. మండలాల్లో మోటకొండూరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మలరామారం మండలాల నుంచి అధికంగా మంజూరయ్యాయి. అయితే దరఖాస్తులకు చివరి తేది అంటూ గడువు లేకపోవడంతో అర్హులు తమ అర్జీలను అందజేస్తూనే ఉన్నారు. ఫ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పక్కాగా అమలుకు సెర్ప్ సీఈఓ ఆదేశం ఫ అర్జీలు స్వీకరిస్తూ ఆర్థికసాయం మంజూరు చేస్తున్న యంత్రాంగం ఫ నామినీ ఖాతాల్లో జమ అవుతున్న నిధులు ఫ జూన్లో 620 కుటుంబాలకు లబ్ధి జూన్లో ఆర్థికసాయం మంజూరు వివరాలు నారాయణపురం 29 పోచంపల్లి 17 రాజాపేట 59 రామన్నపేట 30 వలిగొండ 36 యాదగిరిగుట్ట 46 మున్సిపాలిటీల్లో మంజూరు ఆలేరు 63 భువనగిరి 02 చౌటుప్పల్ 19 మోత్కూరు 20 పోచంపల్లి 02 యాదగిరిగుట్ట 02 మండలం మంజూరైన లబ్ధిదారలు అడ్డగూడూరు 10 ఆలేరు 36 భువనగిరి 21 ఆత్మకూర్(ఎం) 30 బీబీనగర్ 20 బొమ్మలరామారం 34 చౌటుప్పల్ 10 గుండాల 23 తుర్కపల్లి 14 మోటకొండూరు 68 మోత్కూరు 29 అర్హులంతా అర్జీ పెట్టుకోండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న కుటుంబ యజమాని చనిపోతే రూ.20 వేల ఆర్థిక సాయం కోసం ఎన్ఎఫ్బీఎస్కు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ నెలలో 620 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. బుధవారం నాటికి మరో 225 దరఖాస్తులు వచ్చాయి. – వీరారెడ్డి, అదనపు కలెక్టర్ -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
బీబీనగర్: వ్యవసాయ బావి వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం రావిపహాడ్ తండాలో మంగళవారం జరిగింది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ తండాకు చెందిన రైతు బానోతు నరేష్(25) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి బోరు మోటారు ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంమఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని యాదాద్రి టౌన్షిప్లో ముళ్ల పొదల్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మఠంపల్లి ఎస్ఐ పి. బాబు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి సుమారు 35ఏళ్లు ఉంటాయని, అతడు మఠంపల్లిలో భిక్షాటన చేస్తుండేవాడని స్థానికుల ద్వారా తెలిసిందని ఎస్ఐ పేర్కొన్నారు. అతడు రెండు రోజుల క్రితమే మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మాధవరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణఫ 11మంది బైండోవర్ మునగాల: మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో సోమవారం రాత్రి పీర్ల పండుగ సందర్భంగా ముస్లింలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇరువర్గాలకు చెందిన 11మందిని మంగళవారం మండల తహసీల్దార్ బి. రామకృష్ణారెడ్డి ఎదుట హాజరుపర్చగా వారిని బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి, యాకూబ్ పాషా, షేక్ చాంద్పాషా, షేక్ ఇయ్మాల్, షేక్ నాగుల్జానీ, షేక్ సైదా, షేక్ మన్సూర్, షేక్ జానీపాషా, మహ్మద్ అలీ, షేక్ రహీం, షేక్ షఫీ ఉన్నారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ● ఆలేరు పట్టణంలో ఘటనఆలేరు: రైలు పట్టాలు దాటుతున్న వృద్ధుడు ప్రమాదవశాత్తు పట్టాలపై కింద పడిపోగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలేరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్(70) మంగళవారం సాయంత్రం స్థానిక రైల్వే గేట్ సమీపంలోని మెయిన్రోడ్డు వద్దకు పని మీద వచ్చాడు. కాసేపటికి ఇంటికి తిరిగి వెళ్తూ రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా.. పట్టాల మధ్య పడిపోయాడు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వైపు రైలు వేగంగా వస్తోంది. ఇది గమనించిన వృద్ధుడు కేకలు వేయడంతో స్థానికులు కొందరు గమనించి పట్టాల పైనుంచి వృద్ధుడిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. అప్పటికే రైలు సమీపించడంతో స్థానికులు పక్కకు తప్పుకోవడంతో రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న భువనగిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ఆత్మహత్యా.. లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపారు. -
నెమలి, జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
వేములపల్లి: జాతీయ పక్షి నెమలి, జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని వేములపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ కూలీ పనులతో పాటు చేపలు, కుందేళ్లు, అడవి పందుల వేటకు వెళ్తుంటాడు. అతడు తనకు పరిచయమున్న రాజు అనే వ్యక్తి నుంచి జింక, దుప్పి మాంసాన్ని తీసుకొచ్చి ఇంట్లో అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు మార్చి 23న వేములపల్లి ఎస్ఐ అతడి ఇంటిపై దాడి చేయగా పారిపోయాడు. దీంతో రమేష్పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రెండు ఎయిర్ రైఫిల్స్, 3 కత్తులు, 5 అడవి పందుల వేటకు సంబంధించిన వలలు, 15 కుందేళ్ల వేటకు సంబంధించిన ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
విపత్తు పరిస్థితులపై ఎయిమ్స్లో శిక్షణ
బీబీనగర్: విపత్తు పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేలా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం ద్వారా బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు అందజేసిన భారత్ హెల్త్ ఇనిషియేటివ్, సహయోగ్ హిత మైత్రి క్యూబ్ల వినియోగంపై మంగళవారం 100మందికి శిక్షణ ఇచ్చారు. కేంద్ర విపత్తు నిర్వహణ సెల్ నుంచి రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ డాక్టర్ తన్మోయ్ రాయ్, బృందం క్యూబ్ల వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంగీత సంపత్, అభిషేక్ ఆరోరా, అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు, భీష్మ్ క్యూబ్స్ నోడల్ అధికారి మహేశ్వర్ లక్కిరెడ్డి, అదనపు నోడల్ అధికారి సిద్దార్థరావు పాల్గొన్నారు. -
సాగర్ను సందర్శించిన విదేశీయులు
నాగార్జునసాగర్: భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థలో శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37మంది మంగళవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. పర్యావరణం, అభివృద్ధి, నీటి సంరక్షణ తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్న వీరు సాగర్ జలాశయం, ప్రధాన డ్యాం, జల విద్యుదుత్పాదన కేంద్రాన్ని పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం, జలవనరుల వినియోగం తదితర అంశాల గురించి సాగనీటి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సాగునీటి శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు, డ్యాం ప్రత్యేక రక్షణ దళం((ఎస్పీఎఫ్) ఉన్నారు. -
ఎయిమ్స్లో రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో మంగళవారం ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, నర్సింగ్ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది, విద్యార్థులు 47మంది రక్తదానం చేశారు. అనంతరం వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్, డీన్ నితిన్ అశోక్జాన్, వైద్యులు సంగీత సంపత్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్ల గొండలోని ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ విద్యార్థుల పరిశోధన పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చివరి సెమిస్టర్లో విద్యార్థులు చేసిన పరిశోధనలు తమ ఉద్యోగ అవకాశాలను నిర్ణయిస్తాయని గుర్తించాలన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆహార భద్రత విభాగం బాధ్యులు ఎం. సతీష్కుమార్ మాట్లాడుతూ.. ఆహార పదార్థాల్లో ఫంగస్ ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. తినే ఆహార పదార్థాల్లో నాణ్యత, శుభ్రత పాటించాలన్నారు. అనంతరం 21మంది విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. 13మంది విద్యార్థులు తమ పరిశోధనలకు సంబంధించి పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్, తిరుమల, అన్నపూర్ణ, మాధురి, మద్దిలేటి, రూప పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
భర్త వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య
భువనగిరి: భర్త వేధింపులు భరించలేక ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం భువనగిరి పట్టణంలో జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల కేంద్రానికి చెందిన వంగాల బాబు, నీరటి కవిత(30) 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంఎస్సీ పూర్తిచేసిన కవిత భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించగా.. బాబు ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా ఉండేవాడు. ఈ క్రమంలో కవితకు రెండుసార్లు అబార్షన్ సైతం అయ్యింది. దీంతో ఇద్దరు కలిసి కొంతకాలం హైదరాబాద్కు వెళ్లారు. బాబు ఓ బ్యాంకులో ఉద్యోగంలో చేరగా.. కవిత ఇంటి వద్దనే ఉండేది. ఈ క్రమంలో కవిత మరోసారి గర్భం దాల్చింది. దీంతో నెల రోజు క్రితం భువనగిరికి తిరిగి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాబు భువనగిరికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం కవిత నాలుగు నెలల గర్భవతి. బాబు వరకట్నం తీసుకురావాలని కవితను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బ్యాంకు వెళ్లిన బాబు తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా కవిత తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. అప్పటికే కవిత చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యాదాద్రి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భర్త వేధించడంతో పాటు అతడే కవితకు ఉరి వేసి హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మూసీపై అన్నదాతల ఆశలు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కాలువల కింద ఇప్పటికే వరినార్లు పోసుకున్న రైతులు మరో పది రోజుల్లో నాట్లకు సమాయత్తమవుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మూసీ ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగుకు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు మూసీ ప్రధాన కాల్వల ఆధుణీకరణ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయలేదు. దీంతో మూసీ ఆయకట్టులో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో అయోమయం నెలకొంది. 35వేల ఎకరాల ఆయకట్టు.. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 645 అడుగులు(4.46 టీఎంసీలు). ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 35వేల ఎకరాల్లో పంటలు సాగువుతుంది. ప్రధాన కాల్వలకు మోటార్లు వేయడం ద్వారా అనధికారంగా మరో 15వేల ఎకరాలు సాగవుతుంది. యాసంగి పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీ వరకు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదల ముగిసే నాటికి రిజర్వాయర్లో నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి తగ్గింది. అప్పటి నుంచి వేసవిలో అకాల వర్షాలు, వానాకాలం ప్రారంభంలో తొలకరి వర్షాలతో మూసీ ఎగువ ప్రాంతాలైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వాగుల ద్వారా వరద నీరు మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరింది. అప్పటి నుంచి నిరవధికంగా వస్తున్న ఇన్ఫ్లోతో ప్రస్తుతం నీటిమట్టం 641.65(3.60 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. వానాకాలం ప్రారంభంలోనే మూసీ రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతుల్లో వానాకాలం పంట సాగుపై ఆశలు చిగురించాయి. కొనసాగుతున్న కాల్వ కట్ట మరమ్మతు పనులు.. మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వకు నీటి విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ వద్ద కాల్వకు ఇరువైపులా లైనింగ్ దెబ్బతింది. దీంతో కాల్వకు నీటి విడుదల చేసిన సమయంలో నీటి ప్రవాహం ధాటికి ఇరువైపులా మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. కోతకు గురైన చోట కాల్వకు ఆధుణీకరణ పనులను కాంట్రాక్టర్ ఇరవై రోజుల క్రితమే ప్రారంభించారు. ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం పనులు సాగితే పూర్తికావడానికి మరో వారం రోజుల సమయం పట్టవచ్చు. ఈ పనులు పూర్తయితేనే కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందుగానే మూసీ ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఈసారి సాగుకు ఎలాగైనా నీరు వస్తుందనే ఉద్దేశంతో రైతులు బోర్లు, బావుల కింద వరినార్లు పోసుకున్నారు. రైతులు మెట్ట దుక్కులు దున్ని వరినాట్లకు పొలాలను సిద్ధ చేశారు. మొదటి విడతలో కాల్వలకు విడుదల చేసిన నీటితోనే దమ్ములు చేసి నాటు వేసేందుకు వీలుగా పొలాలను సిద్ధ చేశారు. కానీ నీటి విడుదలపై అధికారులు ఇంత వరకు షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఎప్పుడు ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు నెలలు వర్షాలు కురిసే అవకాశమున్నందున రిజర్వాయర్లో అందుబాటులో ఉన్న నీటిని ముందస్తుగానే సాగుకు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఫ 641.65 అడుగులకు చేరిన ప్రాజెక్టు నీటిమట్టం ఫ గరిష్ఠ నీటి మట్టానికి మరో మూడు అడుగుల దూరంలో.. ఫ ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని రైతుల విన్నపం -
‘భద్రాచలం’ ఈఓపై దాడిని ఖండిస్తున్నాం
యాదగిరిగుట్ట: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈఓపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజివెల్లి రమేష్బాబు అన్నారు. భద్రాచలం ఆలయ ఈఓపై జరిగిన దాడికి నిరసనగా యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని అల్లూరి జిల్లా పురుషోత్తట్నం గ్రామంలో గల భద్రాచలం ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈఓ రమాదేవి, అర్చకులు, సిబ్బందిపై స్థానికులు దాడి చేయడం బాధాకరమన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవలయాల భూములను రక్షించేందుకు ఆలయ ఉద్యోగులు ముందుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు గజివెల్లి రఘు, నవీన్కుమార్, ముద్దసాని నరేష్, దయానంద్, అర్చకులు పాల్గొన్నారు. ఫ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ రమేష్బాబు ఫ యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద ఆలయ ఉద్యోగుల నిరసన -
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న దొంగ
నల్లగొండ: బైక్లు చోరీ చేస్తున్న దొంగను మంగళవారం అరెస్ట్ చేసినట్లు నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. నిడమనూరు మండలం బొక్కముంతలపాడ్ గ్రామానికి చెందిన కొండేటి సంతోష్కుమార్ మద్యానికి బానిసై బైక్లు చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన షేక్ మహబూబ్వలీ తన బైక్ను నల్లగొండ రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేయగా చోరీకి గురైంది. బాధితుడు నల్ల గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు బైపాస్ రోడ్డులో నల్లగొండ టూటౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సంతోష్కుమార్, మరో బాలుడు కలిసి దొంగిలించిన బైక్పై అనుమానాస్పదంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి హాలియాలో చోరీ చేసిన 2 బైక్లు, మిర్యాలగూడ, వాడపల్లి, నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ మరో మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న టూటౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఫ పోలీసుల అదుపులో నిందితుడు -
ప్రసాద వితరణకు ఈవో రూ.లక్ష విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ కోసం దేవస్థానం ఈవో వెంకట్రావ్ తన జీతంలో నుంచి రూ.లక్షను విరాళంగా మంగళవారం అందజేశారు. ప్రతి నెలా తన జీతంలో నుంచి రూ.లక్ష విరాళంగా ఇస్తానని ఇప్పటికే ఈవో ప్రకటించారు. ఆ మేరకు గత నెల రూ.లక్ష తన జీతంలో నుంచి, మరో రూ.2లక్షలు తన పిల్లల పేరుతో ఆలయానికి అందించారు. ఇందులో భాగంగానే ఈ నెల జీతంలో నుంచి రూ.లక్షను విరాళంగా డోనర్ సెల్ వద్ద అందజేశారు. ప్రతి ఆదివారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం, శనివారం లడ్డూ ప్రసాదం అందజేస్తారు. దీనికి ఈ నగదును వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాతలు తమకు నచ్చిన రోజుల్లో, తిఽథులలో, నిత్యం వారి పేరున ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వాలని ఆలయ ఈవో కోరారు. ఫ తన జీతం నుంచి ప్రతి నెలా కేటాయిస్తున్న వెంకట్రావ్ -
ఎంపీటీసీ సా్థనాలు 178
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. గతంలో 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన ఎంపీటీసీ స్థానంతో 178 కి చేరింది. ప్రతి మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా జాబితా ప్రచురించారు. మోత్కూరు మండలంలో గతంలో ఉన్న నాలుగు ఎంపీటీసీ స్థానాలకు అదనంగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. పాటిమట్ల కొత్త ఎంపీటీసీ స్థానం మోత్కూరు మండలంలో గతంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు దాచారం, పొడిచేడు, దత్తప్పగూడెం, ముసిపట్ల ఉండేవి. వీటిలోంచి దాచారం, పాటిమట్ల, సదర్శపురం మూడు గ్రామాలు కలిపి ఉండేవి. ప్రస్తుతం పాటిమట్ల సదర్శపురం రెండు గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలు అయ్యాయి. ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడిపోయిన నూతన గ్రామ పంచాయతీ అయిన సాయిగూడెంను కొల్లూరు ఎంపీటీసీ పరిధిలో విలీనం చేశారు. భూదాన్పోచంపల్లి మండలంలో సాయినగర్ గ్రామ పంచాయతీ దేశ్ముఖి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉండేది. ప్రస్తుతం సాయినగర్ గ్రామ పంచాయతీని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈమేరకు ముసాయిదా తయారు చేశారు. అత్యధికంగా వలిగొండలో 17 ఎంపీటీసీ స్థానాలు 2019 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఒకటి పెరగడంతో అవి 178కి చేరుకున్నాయి. జిల్లాలో అత్యధికంగా వలిగొండలో 17 ఎంపీటీసీ స్థానాలు, రామన్నపేటలో 16, భువనగిరి 13, బీబీనగర్లో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 12 నుంచి 5కు తగ్గకుండా ఉన్నాయి. దాడిని ఖండిస్తున్నాం భద్రాచలం శ్రీసీతారామ ఆలయ ఈఓపై దాడిని ఖండిస్తున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. - 8లోన్యూస్రీల్ఫ జిల్లాలో పెరిగిన మండల ప్రాదేశిక నియోజకవర్గం ఫ పాటిమట్ల, సదర్శపురం రెండు గ్రామాలు కలిపి పాటిమట్ల ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు ఫ ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు విడుదలైన షెడ్యూల్ ఫ నేడు ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ.. 10, 11న పరిష్కారం ఫ 12న తుది జాబితా ప్రకటన5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా.. ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా ఎంపీటీసి నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరించేందుకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లా పరిషత్ అధికారులు మంగళవారం అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ నియోజకవర్గాల ముసాయిదా జాబితా ప్రకటించారు. 8, 9 తేదీల్లో ప్రకటించిన జాబితాలో ఎలాంటి అభ్యంతరాలున్నా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. వచ్చిన అభ్యంతరాలన్నింటిని 10, 11వ తేదీల్లో పరిష్కరించనున్నారు. 12వ తేదీన ఎంపీటీసీ నియోజకవర్గాల తుది జాబితాను ప్రకటించనున్నారు. -
14న అప్రెంటిస్షిప్ మేళా
ఆలేరు: ఆలేరులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఈనెల 14న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండి, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు జీరాక్స్ ప్రతులో మేళాకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 98668 43920ను సంప్రదించాలని పేర్కొన్నారు. స్కీంలను సద్వినియోగం చేసుకోవాలిబీబీనగర్: ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధికి కొత్తగా తీసుకువచ్చిన స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీబీనగర్ పీహెచ్సీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా బ్రహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ చండీరాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రజావాణి, కార్యదర్శి బాలమణి, ఏపీఎం శ్రీనివాస్ ఉన్నారు. ‘ప్రసాద్ 2.0’కు ఎంపికై న సోమేశ్వరాలయంఆలేరురూరల్: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయం ప్రసాద్ 2.0 పథకానికి ఎంపికై ంది. ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంబంధిత శాఖకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారి 163 సమీపంలో ఈ ఆలయం ఉండడంతో పర్యాటక వసతులు, శిల్పాల పరిరక్షణ, సౌందర్యీకరణ, డిజిటల్ మ్యూజియం అభివృద్ధి వంటి అంశాలకు నిధులు లభించనున్నాయి. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలిభువనగిరి : ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మయ్య, రమేష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
భువనగిరి: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీంసింగ్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించారు. ఆయన వెంట కశాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, అధ్యాపకులు ఉన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి యాదగిరిగుట్ట: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. పదో తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో అడ్మిషన్ పొందే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. -
ఆగిరెడ్డి భూమిని సందర్శించిన తహసీల్దార్
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో రైతు ఆగిరెడ్డి తనకు గల రెండెకరాల మూడు గుంటల భూమి ఇతరుల పేరున మారిందని సోమవారం కలెక్టర్ చాంబర్లో పెట్రోల్ పోసుకున్నాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు బాధిత రైతు ఆగిరెడ్డి భూమిని మంగళవారం సందర్శించారు. బాధిత రైతు తన భూమిగా పేర్కొంటున్నా హద్దులు గుర్తించలేకపోతున్నాడని, దీంతో 340, 345, 346 సర్వే నంబర్లలోని భూమిని సర్వే చేయించి తన భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిపారు. బాధిత రైతు విన్నపం మేరకు సదరు సర్వే నంబర్లలోని రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే ప్రక్రియ నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్, రైతులు ఉన్నారు. -
భూ భారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
యాదగిరిగుట్ట రూరల్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్ లాగిన్లో ఉన్న అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎంపీడీఓతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరై, కట్టుకోని పరిస్థితుల్లో ఉన్నవారికి, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి, ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బేస్మెంట్ లెవల్, పిల్లర్ లెవల్, స్లాబ్ లెవల్లో పనులు పూరైన వారి ఖాతాల్లో ప్రతి సోమవారం డబ్బులు జమవుతాయన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ నవీన్ కుమార్, ఆర్ఐ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ రాము తదితరులున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి బీబీనగర్: ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువు లోపు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతురావు తెలిపారు. బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండాలని, నాణ్యత ప్రమాణాలతో కట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఇల్లు ఇప్పించండి సారూ..
ఆలేరురూరల్: అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన గౌరగండ్ల ప్రమీల పెంకుటిల్లులో కిరాయికి ఉంది. రెండేళ్ల క్రితం వర్షాలకు అద్దె ఇళ్లు కూలిపోవడంతో అదే గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనంలో నివాసం ఉంటుంది. 14 ఏళ్ల క్రితం ఈమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని పోషించుకుంటుంది. ఈమెకు చెవిడు, మూగ. సైగలతోనే సమాధానం చెబుతుంది. ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈవిషయమై ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ను సంప్రదించగా ప్రమీల పేరు ఆన్లైన్లో చూపించడం లేదని పేర్కొంటున్నారు. ఫ ఇల్లు లేక ఎస్సీ కమ్యూనిటీ భవనంలో నివాసం ఫ అధికారుల చుట్టూ తిరుగుతున్న శర్బనాపురానికి చెందిన మహిళ -
అర్హత లేకున్నా వైద్యం
ల్యాబ్ను సీజ్ చేయాలని నోటీసులు జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆస్పత్రిలో ఈ నెల 6న ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7న విచారణ అనంతరం ఆస్పత్రికి సంబంధించిన డాక్టర్ శివకుమార్ను రిమాండ్కు తరలించగా డాక్టర్ గాయత్రి, ల్యాబ్ నిర్వాహకుడు పాండు, ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఆస్పత్రితో పాటు ల్యాబ్ను సీజ్చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పట్టణ పోలీసులు నోటీసులు పంపించారు. అదేవిధంగా సంజాయిషీ ఇవ్వాలని ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు. భువనగిరి: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చాలా వరకు ఆస్పత్రులు ఏర్పాటు చేసే సమయంలో అర్హత ఉన్న వైద్యుల సర్టిఫికెట్స్ పెట్టి అనుమతులు పొందుతున్నారు. అనంతరం వారి స్థానంలో అర్హతలేని వైద్యుల ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆస్పత్రిలో మహిళలకు అబార్షన్లు చేసిన ఘటనపై జరిపిన విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 200 ప్రైవేట్ ఆస్పత్రులు జిల్లా వ్యాప్తంగా సుమారు అనుమతులు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు 200 వరకు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరులో ఉన్నాయి. ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుగా ఏడు శాఖల అనుమతులు తీసుకున్న అనంతరం చివరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉండాలి. అనుమతి తీసుకునే సమయంలో ఎవరి సర్టిఫికెట్స్ పెట్టారో వారు మాత్రమే ఆస్పత్రిలో వైద్య సేవలందించాలి. కానీ ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి తీసుకున్న వారు కాకుండా అర్హతలేని వైద్యులు వైద్య సేవలందిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు అబార్షన్లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తుర్కపల్లి, ఆలేరు, మాదాపూర్, బొమ్మలరామారం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గుర్తించి ఆస్పత్రులను సీజ్ చేశారు. కానీ నిర్వాహకులు తిరిగి వక్రమార్గంలో ఆస్పత్రులను తెరిచి సేవలందించడం పరిపాటిగా మారింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్ పీఎన్డీటీ ప్రత్యేక బృందం గల అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలను నామమాత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదేబాటలో స్కానింగ్ సెంటర్లు జిల్లాలో ఆస్పత్రులతో పాటు స్కానింగ్ సెంటర్లలో కూడా అర్హత లేని వారిచే స్కానింగ్ పరీక్షలు చేయిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకునే వారు ల్యాబ్ టెక్నీషియన్ అర్హత కలిగి ఉండాలి. కానీ అర్హత కలిగి ఉన్న వారితో అనుమతి పొందిన తర్వాత అర్హత లేని వారు పరీక్షలు చేస్తున్నారు. అనుమతి లేకున్నా అబార్షన్లు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెసీ (ఎంటీపీ) చట్టం ప్రకారం మహిళలు సురక్షితమైన గర్భస్రావ సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే ఆస్పత్రుల్లో గర్భస్రావం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ సర్టిఫికెట్ 16 ప్రైవేట్ ఆస్పత్రులకు ఉంది. కానీ సర్టిఫికెట్ లేకున్నా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భస్రావాలు చేస్తున్నారు. ఫ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఫ అనుమతులు తీసుకునేది ఒకరు.. వైద్యం చేసేది మరొకరు ఫ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
భూదాన్పోచంపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఇంటర్బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్సింగ్ సూచించారు. సోమవారం భూదాన్పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్రెడ్డి, సీనియర్ అధ్యాపకులు హరిప్రసాద్, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు జ్యోతి, సాయివర్థన్, స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్కుమార్, అధ్యాపకులు చందన, శ్రీదేవి, శివశంకర్, స్వాతి, రేణుకదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కొండమడుగు కార్యదర్శి సస్పెన్షన్
బీబీనగర్: మండలంలోని కొండమడుగు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టడంతో పాటు సుమారు రూ.93,40,377 దుర్వినియోగం తదితర ఆరోపణలపై మూడు నెలల క్రితం డీఎల్పీ విచారణ నిర్వహించారు. నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారించి డీపీఓకు నివేదిక అందజేశారు. అయినా ఇప్పటికే పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ‘నిధులు పక్కదారి – ఏదీ రికవరీ’ శీర్షికతో ఈనెల 6న సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు స్పందించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి అలివేలును సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా గ్రామ ప్రత్యేకాధికారిగా ఉన్న ఏంపీఓ మదీద్కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు. మదీద్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఈఓ విష్ణువర్దన్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో నిధుల ఖర్చుపై విచారణ జరపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావుకు సూచించారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సమగ్ర విచారణ చేయించాలి గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసి కొండమడుగు గ్రామస్తులకు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.ఫ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి మూల్యం ఫ ‘సాక్షి’ కథనంతో స్పందించిన కలెక్టర్ -
అత్యధికంగా భూ సమస్యలపైనే..
సాక్షి, యాదాద్రి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతిపత్రాలు అందజేశారు. వివిధ సమస్యలపై 48 అర్జీలు రాగా.. అందులో భూ సమస్యలకు సంబంధించి 34 ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్కు అందిన దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వండి ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఆయా వర్గాల నుంచి అందిన వినతులకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని, వనమహోత్సవం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి చాలా మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన విద్య అందించాలన్నారు. పాస్ పుస్తకం ఇప్పించాలని వినతి.. పాస్ పుస్తకం ఇప్పించాలని బొమ్మలరామరం మండల కేంద్రానికి చెందిన ముక్కెర్ల బాలయ్య కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పక్కనే ఉన్న పేలుడు పదార్థాల కంపెనీ యజమాని తన భూమి అమ్మాలని వత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ యజమానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, తనకు న్యాయం చేయాలని విన్నవించారు. విచారణ చేయాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. ఫ ప్రజావాణికి 48 అర్జీలు ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్ -
పాఠశాలను సందర్శించిన జడ్జి
బొమ్మలరామారం : మండలంలోని మల్యాల గ్రామ పరిధిలో గల ఆశీర్ మిషన్ స్కూల్ను బుధవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం తుర్కపల్లి మండలం మాధాపూర్లోని ఆదరణ బాల సంరక్షణ భవన్ను జడ్జి సందర్శించారు. బాలలతో ముఖాముఖి మాట్లాడారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అనంతరం మల్కాపూర్లో ఇటుక బట్టీలను సందర్శించారు. బట్టీలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి తుర్కపల్లి ఎస్హెచ్ఓకు సమాచారం అందించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ హెయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగరాజు తుర్కపల్లి ఏఏఎస్ఐ బాల్ నర్సింహ పాల్గొన్నారు. గుట్ట శివాలయంలోసంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతసేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకారమండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అందుబాటులో సరిపడా ఎరువులు భువనగిరి : రైతుల అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను ఎరువుల దుకాణంలో అందజేయాలని, విస్తీర్ణణాన్ని బట్టి ఎరువులు ఇస్తారని పేర్కొన్నారు. వానాకాలం సీజన్కు కావాల్సిన ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామన్నారు. భువనగిరి రూరల్కు ఇద్దరు కొత్త ఎస్ఐలు భువనగిరి : భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్కు కొత్తగా ఇద్దరు ఎస్ఐలు రానున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సెప్టెంబర్ 25 నుంచి 2025 జూన్ 30వ తేదీ వరకు శిక్షణ పొందిన కొత్త ఎస్ఐలను పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఇందులో భాగంగా భువనగిరి రూరల్కు ఓరుగంటి సంధ్య, కట్ట శివశంకర్రెడ్డి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.బియ్యం ఎగుమతుల్లో వేగం పెంచండిరామన్నపేట : గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి బియ్యం ఎగుమతులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో రామన్నపేట, వలిగొండ మండలాల పరిధిలోని మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా సీఎంఆర్ బకాయిలు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, సీనియర్ అసిస్టెంట్ గాలయ్య ఆర్ఐలు శోభ, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
మహిళా శక్తి సంబరాలకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, యాదాద్రి : ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సోమవారం జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళా శక్తి పథకం కింద త్వరలో పెట్రోల్ బంకులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు స్వయం సహాయక సంఘాలు, సీ్త్రనిధి రుణాలు ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సమాఖ్య భవనం నిర్మిస్తామని చెప్పారు. ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, విజిలెన్స్ అధికారి ఉపేందర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. భువనగిరి : నిరుద్యోగ యువతీయువకులు తమ విద్యార్హతల వివరాలను డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్ పోస్టర్ను అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పరిశ్రమల జిల్లా మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈఓ శోభారాణితో కలిసి ఆవిష్కరించారు. నిరుద్యోగులు పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలు తెలుస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
నృసింహుడి సన్నిధిలో రామచంద్రజీయర్ స్వామిజీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జియర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్రజీయర్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. స్వామీజీకి అర్చకులు వేద పారా యణం చేశారు. అంతకుముందు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో భగవంతుడు కొలువై ఉంటాడని, కానీ యాదగిరి క్షేత్రంలో భగవంతుడితో పాటు ఆళ్వార్లు సైతం కొలువై ఉండటం ఆలయ విశిష్టత అని వెల్లడించారు. చాతుర్మాసా దీక్ష ప్రారంభమాసంలో శ్రీస్వామి వారిని దర్శించుకుని ధన్యులమైనట్లుగా స్వామీజీ పేర్కొన్నారు. -
భువనగిరిలోని గాయత్రి హాస్పిట్లో లింగ నిర్ధ్ధారణ పరీక్షలు
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసిన ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో వెలుగుచూసింది. పోలీసులు, వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి భువనగిరిలోని గాయత్రి ఆస్పత్రిలో అబార్షన్ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు గుర్తించారు. ఆస్పత్రి వైద్యుడు హీరేకార్ శివకుమార్ను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, గైనాలజిస్ట్ మాలతి, డెమో అంజయ్య పోలీసుల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి వైద్యులు, సిబ్బంది, బాధిత మహిళలను విచారణ చేశారు. పట్టణంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి డయాగ్నోస్టిక్ సెంటర్లో లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారని తేలడంతో అక్కడా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు దంతూరి పాండును విచారించారు. జూన్ 30న ఒకరు, ఈనెల 3వ తేదీన మరోకరు స్కానింగ్ కోసం వచ్చినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు గాయత్రి ఆస్పత్రి వైద్యులను చికిత్స కోసం వేర్వేరుగా సంప్రదించారు. వారికి చెప్పిన ప్రకారం ఇద్దరు మహిళలకు ఆదివారం అర్ధరాత్రి చికిత్స చేశారు. ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్లో రికార్డులు, కంప్యూటర్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. స్కానింగ్ మిషన్ ల్యాబ్ను సీజ్ చేశారు. గాయత్రి ఆస్పత్రి వైద్యుడు శివకుమార్, డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు దంతూరి పాండుపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు భువనగిరి పట్టణ సీఐ రమేష్ తెలిపారు. అలాగే డాక్టర్ గాయత్రితో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఫోరెనిక్స్ ల్యాబ్కు పిండాలు అబార్షన్ చేయించుకున్న మహిళ పిండాలను డీఎన్ఏ పరీక్షల నిమితం ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద తెలిపారు. డాక్టర్ శివకుమార్ చికిత్స చేయడానికి అర్హత లేదని, సర్టిఫికెట్ ప్రకారం ఆస్పత్రిలో వైద్యులు లేరని వెల్ల డించారు. అబార్షన్ చేయించుకున్న ఇద్దరు మహిళల్లో ఒకరికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మరొకరికి ఇక ఆడ పిల్ల ఉన్నారని పేర్కొన్నారు. -
ఏసీబీకీ చిక్కుతున్నా లంచాలు ఆగట్లే
ఉమ్మడి జిల్లాలో నెలకొకరు చొప్పున పట్టుబడుతున్న అధికారులు అవినీతి ఎక్కువగా ఈ శాఖల్లో.. ఉమ్మడి జిల్లాలో పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఎక్కువగా ఏసీబీకి చిక్కుతున్నారు. కేసులు నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత సదరు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. కోర్టుల్లో కేసుల విచారణకు సుమారు ఏడాది నుంచి రెండేళ్ల కాలం పడుతుండగా.. కొంత మందికి మాత్రమే శిక్షపడుతోంది. మరికొన్ని కేసులు కోర్టుల్లో నిలబడడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతున్నారు. అవినీతికి పాల్పడుతూ ఉమ్మడి జిల్లాలో నెలకొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. నెలవారీ వేతనాలు వస్తున్నా.. పనుల కోసం తమ వద్దకు వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారిని ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేస్తున్నప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. గడిచిన రెండేళ్లలో 18 వరకు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 2024లో 11 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడుగురు ఏసీబీ వలలో చిక్కారు. జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా... ● తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్స్టేషన్లో జనవరి 12వ తేదీన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో లంచం తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు పట్టుబడ్డారు. ఈ కేసులో ఓ వ్యక్తి వద్ద రూ.1.40 లక్షల ముడుపులకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ● చౌటుప్పల్లో మార్చి 6వ తేదీన ట్రాన్స్కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫార్మా పరిశ్రమకు విద్యుత్ బకాయిలు క్లీయరెన్స్ ఇవ్వడంతో పాటు మీటర్ పునరుద్ధరణకు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ● ఏప్రిల్ నెలలో రేషన్బియ్యం అక్రమంగా తరలిస్తున్న కేసులో చింతలపాలెం పోలీస్స్టేషన్లో ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ● సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి రూ.16 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో మే 12వ తేదీన వారిని పట్టుకున్నారు. ● పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో పంచాయతీ కార్యదర్శి సతీష్కుమార్ ఒక వ్యక్తి నుంచి రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడని ఫిర్యాదు రావడంతో జూన్ 26న ఏసీబీ అధికారులు దాడి చేసి సతీష్ను పట్టుకున్నారు. ● గత నెల 28న హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ (అవుట్సోర్సింగ్) విజేతారెడ్డి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా పట్టుబడిన మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డీటీ అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల్లోనే..కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ పట్టుబడి సీజ్ అయిన లారీలను విడిపించేందుకు మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ జావెద్ రూ.70 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జావేద్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ డీఎస్ఓ ఆపీస్ కార్యాలయంలో, జావెద్ ఇంట్లో సోదాలు చేశారు. సోమవారం జావేద్ను కోర్టులో హాజరు పరచనున్నారు. -
కడుపులోనే.. కాటికి!
సాక్షి యాదాద్రి : చట్టరీత్యా నేరమని తెలిసినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్నాయి. పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా అని స్కానింగ్ ద్వారా ముందే చెప్పేస్తున్నాయి. ఆడపిల్లయితే గర్భంలోనే ఊపిరి తీస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేయడం ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో బట్టబయలైంది. జిల్లాలో లింగ నిర్ధారణకు సంబంధించి గతంలోనూ అనేక కేసులు వెలుగుచూశాయి. సీజ్ చేసినా మరో పేరుతో ఓపెన్ జిల్లాలో పలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కనీస వైద్య అర్హత లేకుండా నిర్వహిస్తున్నారు. గతంలో తుర్కపల్లి మండలం మాదాపూర్లో, చౌటుప్పల్ పట్టణంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి అబార్షన్ చేసినట్లు బట్టబయలు కావడంతో ఆస్పత్రులను సీజ్ చేసి ర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే సదరు వ్యక్తులు మరో పేరుతో ఆస్పత్రులు తెరిచి అమానవీయ దందా నిర్వహిస్తున్నారు. భువనగిరితో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో అవసరమైన చోటకు స్కానింగ్ మిషన్లు తీసుకువెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్.. జిల్లాలో మెటర్నిటీ నర్సింగ్ హోంలు, స్కానింగ్ సెంటర్లు 41 ఉన్నాయి. ఇందులో స్కానింగ్ పరీక్షలు చేయడానికి 14 నర్సింగ్హోంలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ, ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు పుట్టుగొడుగల్లా పుట్టుకొస్తున్నాయి. జిల్లా వైద్యాధికారి మారినప్పుడల్లా తనిఖీల పేరిట హడావుడి చేయడం.. ఆ తర్వాత మౌనంగా ఉండటం పరపాటిగా మారుతుంది. మూడు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల్లో తనిఖీలు నిర్వహించగా అక్రమాలు వెలుగుచూశాయి. కానీ, ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చి అబార్షన్లు చేయించుకొని పోతున్నట్లు తెలుస్తోంది. అయినా వైద్యారోగ్య శాఖ అధికారుల్లో చలనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న బ్రూణ హత్యలు ఫ ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే పిండం తొలగింపు ఫ కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు ఫ తనిఖీల్లో వెలుగుచూస్తున్నా కఠిన చర్యలు తీసుకోని వైద్యారోగ్య శాఖ అధికారులులింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు భ్రూణహత్యలు వెలుగుచూడటం బాధాకరం. ఇప్పటికే జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గుతుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యావంతులు, సమాజానికి సేవలందించేవారు కూడా ఆడిపిల్లలపై వివక్ష చూపుతుండటం బాధాకరం. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేయించినా, చేసినా కఠిన చర్యలు తప్పవు. –బండారు జయశ్రీ, మహిళా, శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ -
ఆకట్టుకున్న ‘కూచిపూడి’
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలో ఆదివారం హైదరాబాద్కు చెందిన నృత్య కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యాలతో అలరించారు. రాత్రి ఆలయ ద్వారబంధనం చేసే సమయం వరకు సాంస్కృతి కార్యక్రమాలు కొనసాగాయి.టీకాతో రేబిస్ నియంత్రణ భువనగిరిటౌన్ : శునకాల నుంచి మనుషులకు వ్యాపించే రేబిస్ వ్యాధిని టీకాతో అరికట్టవచ్చని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో రేబిస్ వ్యాధి నివారణకు కుక్కలకు ఉచిత టీకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రేబిస్ ప్రాణంతకమైన వ్యాధి అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కుక్కలకు టీకా వేయించాలని సూచించారు. అంతకు ముందు రాచకొండ పోలీస్ డాగ్ స్క్వాడ్ అదనపు కలెక్టర్కు గౌరవ వందనం సమర్పించాయి. కార్యక్రమంలో పశువైద్య అధికారి మోతిలాల్, పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపిరెడ్డి, సహాయ సంచాలకులు వి.కృష్ణ, శ్రీకాంత్, రాంచంద్రారెడ్డి, సునీత, చైతన్య, ప్రత్యూష, భాస్కర్, గిరి, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీపై సమీక్షయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫుడ్ సేఫ్టీ (ప్రసాదం), గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్పై ఈఓ వెంకట్రావ్ ఆదివారం హైమ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రికల్ వైరింగ్ మేనేజ్మెంట్, ఐఎస్ఓ 14001, 22000 సర్టిఫికెట్ల కోసం దేవస్థానం అర్హత సాధించే విషయాలపై చర్చించారు. గుట్ట గోశాలలో వన మహోత్సవం యాదగిరిగుట్ట: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోశాలలో దేవాదాయ వైధిక సలహాదారులు గోవింద హరి మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోఈఓ వెంకట్రావ్, డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అయిలయ్య మార్నింగ్ వాక్
ఆలేరు: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమానికి శీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలేరులోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటి బిల్లు వచ్చిందా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పునాది వరకు పూర్తయిన లబ్ధిదారులను బిల్లు వచ్చిందా.. అని అడగగా రాలేదని సమాధానం చెప్పారు. కారణాలపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను ప్రశ్నించగా కొందరి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, వారం రోజుల్లో బిల్లులు వస్తాయని వివరించారు. లక్ష రూపాయల బిల్లు వస్తే.. లబ్ధిదారులు మరింత దైర్యంగా మిగితా దశ పనులు పూర్తి చేయడానికి ఉత్సాహం చూపుతారని, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టలేదని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వారికి కొన్ని రోజలు గడువు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అప్పటికీ నిర్మాణాలు ప్రారంభించకపోతే వారితో ఇళ్లు కట్టలేమని లేఖ రాయించుకుని, వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్లు త్వరగా పూర్తి చేస్తే గృహప్రవేశానికి వస్తానని ఎమ్మెల్యే లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. అనంతరం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. శిల్పారామంలో బోటు షికారు భువనగిరి : నిత్యం తీరికలేకుండా ఉండే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఉల్లాసంగా గడిపారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాయగిరి వద్ద ఉన్న మినీ శిల్పారామాన్ని సందర్శించారు. చెరువులో బోటు షికారు చేశారు. కూచిపూడి నృత్యకళాకారులను పలకరించి వారితో ఫొటోలు దిగారు. సందర్శకులతో ఆయనతో సెల్ఫీలు దిగారు. ఫ ఆలేరులోని పలు వార్డుల్లో పర్యటన ఫ ప్రజా సమస్యలపై ఆరా -
నిధులు పక్కదారి.. ఏదీ రికవరీ!
బీబీనగర్: జిల్లాలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీబీనగర్ మండలం కొండమడుగు పంచాయతీ నిధులు రూ.లక్షల్లో పక్కదారి పట్టాయి. అభివృద్ధి పనులు సాకు చూపి పంచాయతీ కార్యదర్శి, తాజా మాజీ సర్పంచ్ భర్త కుమ్మకై ్క ఏకంగా రూ.95.40 లక్షల దుర్వినియోగానికి పాల్పడినట్లు డీఎల్పీఓ విచారణలో తేలింది. డీపీఓకు మూడు నెలల క్రితమే విచారణ నివేదిక అందజేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీ రికార్డు, ఓచర్లు లేకుండానే.. 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ అభివృద్ధి పనులు చూపి ఎంబీ రికార్డులు, ఓచర్లు లేకుండానే రూ.93 లక్షలకు పైగా చెల్లింపులు జరిగాయి. డంపింగ్ యార్డులో టాయిలెట్ నిర్మాణం కోసం రూ.61,340 ఖర్చు చేసినట్లు గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేశారు. కానీ, ఎంబీ రికార్డులో నమోదు చేయలేదు. అదే విధంగా నర్సరీ నిర్వహణకు రూ.39,120 ఖర్చు చేసి అందులో రూ.12 వేలకు ఓచర్లు లేకుండానే చెల్లింపులు జరిపారు. శానిటేషన్కు రూ.40,800, హారితహారం కోసం రూ.86,600, డంపింగ్యార్డు నిర్వహణకు రూ.36 వేలు ఖర్చు చేసి జీపీ రికార్డుల్లో ఎక్కుగా నమోదు చేశారు. అలాగే ఒకే రోజు ఐదు ఓచర్ల ద్వారా రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు జీపీ రికార్డుల్లో ఉండగా ఎంబీ రికార్డులో ఆ వివరాలే నమోదు చేయలేదు. గ్రామ పంచాయతీ నిర్వహణ, విద్యుత్ లైట్లు, నీటి సరఫరా, శానిటేషన్, ట్రాక్టర్ రిపేర్ ఇతర వాటికి మూడేళ్లలో రూ.90 లక్షలు ఖర్చు చేసి జీపీ రికార్డుల్లో రాశారు. నిధుల వినియోగంపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అప్పటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీరారెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీఎల్పీఓ శ్రీకాంత్రెడ్డి విచారణ చేశారు. 2022 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు 62 పనులకు గాను 133 ఓచర్లు రాసి మొత్తం రూ.93,40,372 ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపారని తేల్చారు. ఇందులో అవసరం లేని పనులు నిర్వహించి బిల్లులు పెట్టడం, చేసిన పనులకు ఎక్కువ బిల్లు డ్రా చేశా రని, కొన్ని పనులు చేయకుండానే బిల్లు తీసుకు న్నారని విచారణలో తేలింది. డీఎల్పీఓ విచారణ నివేదికను 2025 ఏప్రిల్ 11న జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)కు అందజేశారు. కొండమడుగు కార్యదర్శి, మాజీ సర్పంచ్ కుమ్మక్కు! ఫ గ్రామ పంచాయతీ నిధులు రూ.95.40 లక్షలు స్వాహా ఫ డీఎల్పీఓ విచారణలో వెలుగులోకి ఫ డీపీఓకు మూడు నెలల క్రితమే అందిన నివేదిక ఫ ఇప్పటి వరకు చర్యలు శూన్యం నిగ్గు తేలినా చర్యలేవీ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ భర్త కుమ్మకై ్క పంచాయతీ నిధులు పక్కదారి పట్టించినట్లు తెలిసింది. మండల, జిల్లాస్థాయి అధికారులు వారికి మద్దతుగా నిలుస్తూ ఎవరి స్థాయిలో వారు వాటాలు పంచుకున్నారని ఆరోపణలున్నాయి. డీఎల్పీఓ విచారణలో అక్రమాలు నిగ్గు తేలడంతో వివరాలు బయటకు పొక్కకుండా, కార్యదర్శిపై చర్యలు లేకుండా ఉండేందుకు సర్పంచ్ భర్త ఆ శాఖ జిల్లాస్థాయి అధికారికి రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కాగా అవినీతి అక్రమాలు వెలుగుచూడటంతో పంచాయతీ కార్యదర్శి మరో చోటకు బదిలీ చేయించుకునేందుకు ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నూతన అడ్మిషన్లు 5,802
ప్రభుత్వ బడుల్లో గణనీయంగా పెరిగిన ప్రవేశాలుఫ ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,119 మంది రాక ఫ యూడైస్లో నమోదు ముగిసే నాటికి మరింత పెరిగే చాన్స్భువనగిరి: సర్కారు బడులు కళకళాడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో ఈసారి రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 5,802 మంది కొత్తగా చేరారు. తెరుచుకున్న మూతబడిన స్కూళ్లు 2024–25 విద్యా సంవత్సరం ముగిసే నాటికి జిల్లాలో విద్యార్థులు లేక 60 పాఠశాలలు మూతబడి ఉన్నాయి. అందులో మూడు స్కూ ళ్లు తెరుచుకున్నాయి. ఇందులో బొమ్మలరామారం మండలం యావాపూర్, బీబీనగర్ మండలం పెద్ద పలుగుతండా, గుండాల మండలం నూనెగూడెం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ నుంచి యూటర్న్.. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, నాణ్యమైన బోధన.. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భారంతో తల్లిదండ్రులు సర్కారు స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,119 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను సర్కారు బడుల్లో చేరుస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది చేరారు. గత ఏడాదికంటే ఎక్కువ జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలున్నాయి. గత ఏడాది 4,040 మంది చేరగా.. ఈసారి ఇప్పటి వరకు 5,802 మంది అడ్మిషన్ పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే 1,762 మంది ఎక్కువ. 1వ తరగతిలో 2,681, 2 నుంచి 10వ తరగతిలో 3,121 మంది అడ్మిషన్ పొందారు. అత్యధికంగా మోత్కూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 149 మంది చేరారు. య్యూడైస్లో నమోదు ముగిసే నాటికి మరో 1,500 వరకు ప్రవేశాలు పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు సంవత్సరం ప్రవేశాలు 2023–24 4,4192024–25 4,0402025–26 5,802ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్లో చేర్పించా మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివించాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అర్హులైన, అనుభజ్ఞలైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్కు దీటుగా బోధన అందుతుంది. రఘునాథపురం పాఠశాల గత కొన్నేళ్లుగా టెన్త్లో మంచి ఫలితాలు సాధిస్తుంది. అందుకే తమ ఇద్దరు పిల్లలను 9వ తరగతిలో రఘునాథపురం స్కూల్లో చేర్పించాం. –సుప్రియ, ఉపాధ్యాయురాలు, రాజాపేట హైస్కూల్ -
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులను కొలుస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందారు. అంతకుముందు ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా అర్చకులు సుప్రభాత సేవ చేపట్టి.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలోఅష్టోత్తర పూజలు నిర్వహించారు. -
పైప్లైన్ పనులు మొదలే కాలేదు
ఆలేరు: మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, సుమారు 20వేల జనాభా ఉంంది. రూ.12 కోట్లు మంజూరు కాగా గత సెప్టెంబర్లో పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో 10 లక్షల లీటర్లు, పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 7 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇందులో జూనియర్ కళాశాల ఆవరణలోని ట్యాంకు నిర్మాణం 30 శాతం మేరకు జరిగింది. పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ట్యాంక్ నిర్మాణం పిల్లర్ల వరకే పూర్తయ్యింది. 14 కిలో మీటర్ల మేర పైప్లైన్ నిర్మించాల్సి ఉండగా నేటికీ పనులు మొదలే కాలేదు. -
ఆరు నెలలుగా నిలిచిన పనులు
మోత్కూరు : రూ.12 కోట్లు మంజూరు కాగా.. ఈ నిధులతో రెండు ట్యాంకులు, 12 కిలో మీటర్ల మేర పైప్లైన్ పనులు ప్రారంభించారు. 1000 నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేశారు. కె.ఎన్.ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులు చేపట్టింది. ఏడాదిన్నర గడిచినా ట్యాంకుల నిర్మాణం.. పిల్లర్లు, బేస్మెంట్ దశలోనే ఉన్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాల్లో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఆరు నెలల క్రితం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. -
ట్రిపుల్ ఐటీ కల సాకారమయ్యేనా..?
రామన్నపేట: ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి జిల్లా ఉన్నత విద్యాసంస్థల పరంగా కొంత వెనుకబడే ఉందని చెప్పవచ్చు. విద్యాసంస్థల ఏర్పాటు పరంగా వెనుకబడిన నల్లగొండ జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) బాసరలో, కోస్తా ఆంధ్రా ప్రాంతంలో అప్పటి కృష్ణా జిల్లాలోని(ప్రస్తుతం ఏలూరు జిల్లా) నూజివీడులో, రాయలసీమలో కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లను ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపిక సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్దులకు 24 మార్కులను లేదా 0.4 జీపీఏ కలిపి మెరిట్ తీస్తారు. తెలంగాణలో బాసరలో ఏర్పాటు చేసిన రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో ప్రతి సంవత్సరం 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్సును(ఇంటర్ సమానం)అభ్యసిస్తారు. పీయూసీ కోర్సులో సాధించిన మెరిట్ ఆధారంగా బీటెక్ కోర్సులో ప్రవేశం కల్పిసారు. మరో రెండుచోట్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లుబాసరలోని ఆర్జీయూకేటీకి అనుబంధంగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్రాధాన్యతగా మహబూబ్నగర్లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ను కూడా జారీ చేసింది. మొదటి విద్యాసంవత్సరంలో 181మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూ ఈ నెల 4న ఎంపిక జాబితాను ప్రకటించారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఎంపికై న విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను క్యాంపస్ ఏర్పాటు కోసం పరిశీలించినట్లు తెలుస్తోంది. బాసర ఆర్జీయూకేటీకి అనుబంధంగా రాష్ట్రంలో క్యాంపస్ల విస్తరణ ఈ ఏడాది మహబూబ్నగర్లో క్యాంపస్ ప్రారంభం అందులో కొనసాగుతున్న అడ్మిషన్లు వచ్చే ఏడాది హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో మరో క్యాంపస్ ప్రారంభించే అవకాశం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని డిమాండ్నల్లగొండకు అవకాశం దక్కేనా..?ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహత్మాగాంధీ విశ్వవిద్యాలయం మినహా పేరొందిన ప్రభుత్వ విద్యాసంస్థలు పెద్దగా ఏమీ లేవు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా అంతంతమాత్రమే. సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఇతర జిల్లాల విద్యార్థులు వచ్చిపోవడానికి అనువైన జాతీయ రహదారులు, రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. తాత్కాలిక క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లో గల ఎంజీ యూనివర్సిటీ తాత్కాలిక భవనాలను ఉపయోగించవచ్చు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేల్లో 11మంది అధికారపక్షానికి చెందిన వారే కాగా.. అందరూ సమష్టిగా కృషి చేసి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను ఉమ్మడి జిల్లాకు సాధించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. -
చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల అరెస్ట్
● 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 2కిలోల గంజాయి, బైక్ స్వాధీనం ● పరారీలో మరో ఇద్దరు ● వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్నల్లగొండ: గంజాయి సేవిస్తూ జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఆదివారం నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతానికి చెందిన గాజుపల్లి జోసఫ్, బోస్, ఎరిక్ విల్సన్ మెరినా, ఒరిస్సాకు చెందిన మాలిక్తో పాటు మరో ఇద్దరు బాలురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు జల్సాలకు అలవాటు పడి రాత్రివేళ తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 30న నార్కట్పల్లిలోని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అఽధికారి గాలి యాదయ్య ఇంట్లో చోరీకి పాల్పడి 22 తులాల బంగారం, 80 తులాల వెండి అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి నార్కట్పల్లి శివారులోని ఓ వెంచర్లో ఇద్దరు బాలురతో పాటు ఎరిక్ విల్సన్ మెరినా, గాజుపల్లి జోసఫ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 2 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు బోస్, మాలిక్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించిన నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ట్రాక్టర్పై నుంచి జారిపడి మహిళ మృతి
మఠంపల్లి: ట్రాక్టర్పై నుంచి జారిపడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రం సమీపంలోని రామస్వామి కుంట వద్ద రఘునాథపాలెం రోడ్డుపై ఆదివారం జరిగింది. మఠంపల్లి ఎస్ఐ పి. బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల నవనీత(30) ఆదివారం మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో ఇంటి స్లాబు వేసేందుకు కూలీలతో కలిసి ట్రాక్టర్పై వచ్చింది. తిరుగు ప్రయాణంలో మఠంపల్లి మండల కేంద్రం సమీపంలో రామస్వామి కుంట మూలమలుపు వద్దకు రాగానే ఆమె ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి జారి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వర్ణగిరీశుడికి నవ కలశ పంచామృతాభిషేకం భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి ఆలయ అర్చకులు నవ కలశ పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, మేల్ చాట్వస్త్ర సేవ, లక్ష తులసీ సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 5వేల మంది భక్తులకు అన్నదానంచేశారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవ సేవ, మహా మంగళహారతులు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేల్ చాట్ వస్త్ర సేవ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
చిన్నారి హర్షిత మృతదేహం లభ్యం
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆదివారం చిన్నారి మృతదేహం లభ్యమైంది. వివరాలు.. వంగమర్తి గ్రామానికి చెందిన వాణి(23)కి రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సింగారపు మహేశ్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. నెల రోజుల క్రితం చిన్న కుమార్తె హర్షిత(8 నెలలు)తో కలిసి వాణి వంగమర్తిలోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. మానసికస్థితి సరిగా లేని వాణి శనివారం చిన్నారి కుమార్తె హర్షితతో కలిసి గ్రామ సమీపంలోని నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం వాణి మృతదేహం లభ్యం కాగా.. ఆదివారం చిన్నారి హర్షిత మృతదేహం బావిలో తేలియాడుతూ కనిపించింది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో ఆదివారం సాయంత్రం వాణి, చిన్నారి హర్షిత అంత్యక్రియలు జరిగాయి. తల్లి, కుమార్తె అంత్యక్రియలు పూర్తి -
సాగర్ వెనుక జలాల్లో మునిగి యువకుడి మృతి
చందంపేట: నేరెడుగొమ్ము మండలంలోని వైజాక్ కాలనీలో సాగర్ వెనుక జలాల్లో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. హైదరాబాద్లోని లింగంపల్లికి చెందిన మచ్కూరి అనిల్కుమార్(26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నలుగురితో కలిసి అనిల్కుమార్ శనివారం వైజాక్ కాలనీని సందర్శించేందుకు వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున స్నానం చేసేందుకు సాగర్ వెనుక జలాల్లోకి దిగి నీట మునిగి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అనిల్కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం ఢీకొని.. చివ్వెంల(సూర్యాపేట): విజయవాడ–హైదరాబాద్ హైవే పై చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(35) హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712686031 నంబర్ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. బైక్లు చోరీ చేస్తున్న మైనర్● జువైనల్ హోంకు తరలింపు మోత్కూరు: బైక్లు చోరీ చేస్తున్న బాలుడిని మోత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణానికి చెందిన మత్స్యగిరి, వేమల్రెడ్డి తమ బైక్లు చోరీకి గురైనట్లు జూన్ 29న మోత్కూరు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తన దగ్గర సెంట్రింగ్ పని చేసేందుకు వచ్చిన బాలుడు తన బైక్ దొంగిలించాడని మత్స్యగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మత్స్యగిరి ఫిర్యాదులో పేర్కొన్న బాలుడు మోత్కూరు కొత్త బస్టాండ్ వద్ద శనివారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండు బైక్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు మైనర్ అయినందున జువైనల్ హోంకు తరలించారు. ఎర్ర జెండాలు పాతి స్థలం స్వాధీనంభువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని సర్వే నంబర్ 700లో 2005లో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన స్థలంలో ఆదివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎర్ర జెండాలు పాతి గుడిసెలు వేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. 2005లో పేదలకు కాగితాలు ఇచ్చి 20 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా ఇంటి స్థలాన్ని కేటాయించలేదని ఆరోపించారు. లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించకపోవడంతో గుడిసెలు వేసినట్లు తెలిపారు. భువనగిరి పట్టణంలో ఎంతోమంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని.. అర్హులకు ఇంటి స్థలం చూపించి ఇళ్ల నిర్మాణం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, బర్లవెంకటేశం, వల్దాస్ అంజయ్య, రాహుల్, రియాజ్, సాజిత్, నరాల నరసింహ, కొత్త లలిత, కొత్త లక్ష్మయ్య, అరుణ, మంజుల, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు
పొగాకు లద్దె పురుగుఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, పూలను, పిందెలను తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలో చేరుతాయి. దీని నివారణకు గుడ్ల సముదాయం ఏరివేయాలి. ఎకరానికి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టి తల్లిపురుగుల ఉధృతిని గమనించాలి. ఈ పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ 1.5 మందు లీటరు నీటికి కలిపి మొక్కలు తడిచేలా పిచికారీ చేయాలి. పురుగులు పెద్దవై ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సాయంత్రం వేళ విషపు ఎరలను 5కిలోల తవుడు, అరకిలో బెల్లం, 1.5 లీటరు మోనోక్రోటోఫాస్ మందు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచి పురుగులను నివారించుకోవాలి.గుర్రంపోడు: వానాకాలం సీజన్లో వరి సాగుకు ముందు చాలామంది రైతులు మినుము, పెసర సాగుచేస్తుంటారు. అంతేకాకుండా పండ్ల తోటల్లో అంతరపంటగా సాగు చేసే పెసర, మినుము పంటల్లో చీడపీడల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ పంటల విషయంలో ఎరువుల యాజమాన్యం, మినుము, పెసర పంటలకు సోకే పురుగులు, తెగుళ్లు.. వాటి నివారణపై గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి అందిస్తున్న సలహాలు, సూచనలు.. ● చిత్త పురుగు ఈ పురుగు రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించడం వల్ల మొక్కల్లో పెరుగుదల లేక లేత మొక్కలు చనిపోతాయి. చిత్త పురుగులు సాయంత్రం, రాత్రి వేళ ఆకులను తిని నష్టపరుస్తాయి. ఆకులపై గుండ్రని రంధ్రాలు గమనించడం వల్ల చిత్తపురుగుల ఉనికిని గుర్తించవచ్చు. చిత్త పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి రెండు గ్రాముల మోనోక్రోటోఫాస్ను కలిపి పిచికారీ చేయాలి. ● కాండపు ఈగ ఈ పురుగు తొలిదశలో సుమారు 30 రోజుల వరకు మాత్రమే నష్టం కల్గిస్తుంది. కాండపు ఈగ ఆశించిన మొక్కల్లో తల చివరి ఆకులు వడలిపోతాయి. లేత మొక్కలు పసుపురంగుకు మారి మొక్క ఎండిపోతుంది. భూమికి దగ్గరగా మొక్క మొదలు దగ్గర కాండం ఉబ్బి మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● తామర పురుగులుతామర పురగులు ఆశించిన మొక్కల్లో పెరుగుదల తగ్గి గిడసబారిపోతాయి. తామర పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడమేగాకుండా ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కలుగజేస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లీటరు నీటికి లేదా పిప్రోనిల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● తెల్లదోమతెల్లదోమ రెక్కల పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకుల ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కలు అడుగుభాగంలో గల ఆకులపై నల్లటి బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీల్చడమేగాకుండా కాక పల్లాకు తెగులును, వైరస్ తెగులును వ్యాపింపజేస్తాయి. దీని నివారణకు 1.5 మిల్లీలీటరు ట్రైజోఫాస్ మందును లేదా ఒక గ్రాము ఎసిఫేట్ మందును లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● మారాకు మచ్చల పురుగుతల్లి పురుగు పూ మొగ్గలపై, ఆకులపై , పిందెలపై 2–16 గుడ్ల సముదాయంగా పెడుతుంది. గుడ్ల నుంచి 4–5 రోజుల్లో పిల్ల పురగులు వెలుపలికి వస్తాయి. లార్వాలు పురుగు మొగ్గ, పూత పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగుజేస్తాయి. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్ధాలను తింటాయి. కాయలకు రంధ్రం చేసి లోపలికి గింజలనపు తినడం వల్ల పంటలకు ఎక్కువ నష్టం కల్గిస్తుంది. మారాకు మచ్చల పురుగు నివారణకు పూతకు ముందే 5 శాతం వేపగింజల కషాయం లేదా లీటరు నీటికి 2.5 మి.లీ క్లోరోఫైరిఫాస్ లీటరునీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఆకుమచ్చ తెగులుఈ తెగులు సోకిన ఆకులపై చిన్నచిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి పెద్ద మచ్చలుగా మారి ఆకులు ఎండి రాలిపోతాయి. ● బూడిద తెగులు విత్తిన 30–35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదరు ఆకులపై బూడిద రూపంలో చిన్నచిన్న మచ్చలు పడి అవి క్రమేణా ఆకులపైనా క్రింది భాగాలకు కొమ్మలకు కాయలకు వ్యాపిస్తాయి. ● నివారణ చర్యలుపెసర, మినుము పంటలో ఆశించే ఆకుమచ్చ, బూడిద తెగుళ్ల నివారణకు 30 నుంచి 35 రోజల దశల్లో కాపర్ఆక్సీక్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టవచ్చు. -
వేదాలకు నిలయంగా యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట: వేదాలకు నిలయంగా ఉండాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత వేద పాఠశాలను సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం యాదగిరి కొండకు సమీపంలో ఉన్న టెంపుల్ సిటీపై నిర్మించనున్న వేద పాఠశాల చుట్టూ ప్రాకారం(ప్రహరీ) ఏర్పాటు చేసేందుకు ఈఓ వెంకట్రావ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో రూ.46కోట్లతో వేద పాఠశాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వేద పాఠశాల ప్రాకారం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యాదగిరి క్షేత్రం అభివృద్ధితో పాటు భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్రెడ్డి దృఢంగా సంకల్పిస్తున్నారన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వేద పాఠశాల నిర్మాణం చేసే స్థలంలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ వెంకట్రావ్, ఆలయాధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
మనసున్న మారాజులు ఆదుకోరూ..
నార్కట్పల్లి: కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాలు.. నార్కట్పల్లి మండలం తొండల్వాయి గ్రామానికి చెందిన మేడిపల్లి నర్సింహకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వారిలో ఒక కుమారుడు మృతిచెందగా.. మరో కుమారుడు లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు మేడిపల్లి శంకర్ 20ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడే కుల వృత్తిలో భాగంగా సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్లోనే లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో..మేడిపల్లి శంకర్ రెండేళ్ల క్రితం మెడ నరాల నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్లగా.. మెడ నరాలకు కండ పెరిగిందని వైద్యులు తెలిపారు. దీంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని, సొంతూరు తొండల్వాయికి వచ్చారు. స్వగ్రామంలో ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో దిగారు. కొన్నిరోజుల తర్వాత శంకర్ నడుచుకుంటూ వెళ్తుండగా.. కిందపడడంతో తుంటి ఎముక పక్కకు తొలగింది. ఫిజియోథెరపీ చేయించుకున్నా అది సరికాకపోవడంతో డాక్టర్లను సంప్రదించాడు. డాక్టర్లు పరిశీలించి ఆపరేషన్ చేస్తే ఎముక సరైన స్థానానికి వస్తుందని, ఆపరేషన్కు రూ.4లక్షలు అవుతాయని చెప్పగా.. డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోకుండా ఆగిపోయాడు. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతడి కుమార్తె ఇంటర్, కుమారుడు పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. శంకర్ భార్య కూలీ పనికి వెళ్లగా వచ్చే డబ్బులతో కుటుంబం గడుస్తోంది. తమకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని, ఇతర ప్రభుత్వ పథకాలు అందడంలేదని, మనసున్న మారాజులు ఆపన్న హస్తం అందిస్తే శంకర్కు ఆపరేషన్ చేయిస్తామని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద భారంగా మారిన కుటుంబ పోషణ -
ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం
కేతేపల్లి: రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేతేపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తెచ్చుకునే రోజులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు. రైతులకు సరిపోను ఎరువులు సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించండంలో విఫలమైందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పంటల సాగుకు ముందే మూసీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, నాయకులు బంటు మహేందర్, కొండ సైదులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేచిరుమర్తి లింగయ్య -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఫ 11 కిలోల గంజాయి స్వాధీనంసూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన అడప రాకేష్ పదిరోజుల క్రితం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో అతడిపై నమోదైన గంజాయి కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చాడు. అక్కడ అతడికి గంజాయి కేసులోనే వాయిదా గురించి వచ్చిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా గంజాయి కేసు వాయిదా గురించి వచ్చాడని తెలుసుకున్న రాకేష్ తనకు గంజాయి కావాలని అడిగగా.. జూన్ 29న ఒరిస్సా రాష్ట్రంలోని కల్మెల్లలోని శివమందిర్ గుడి వద్దకు రావాలని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే జూన్ 28న రాకేష్ ఒరిస్సాకు వెళ్లి అతడిని కలిసి 11కిలోల గంజాయి రూ.11వేలకు కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని దొరకుంట గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారులో గల ఖాళీ స్థలంలో పొదల మధ్యన దాచిపెట్టాడు. ఆ గంజాయిని మరో వ్యక్తికి విక్రయించేందుకు గాను ఈ నెల 2న కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురానికి చెందిన వనపర్తి సాయి అలియాస్ సాయికుమార్ ఫోన్ చేశాడు. ఈ నెల 4న సాయికుమార్ గంజాయి కొనుగోలు చేసేందుకు రాకేష్ వద్దకు రాగా నమ్మదగిన సమాచారం మేరకు కోదాడ రూరల్ పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.80 లక్షలు ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. అయితే రాకేష్పై 2023 సంవత్సరంలో గంజాయి కేసు నమోదయ్యిందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ రజితారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ హరిక్రిష్ణతో పాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి వృద్ధుడు మృతి
బీబీనగర్: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం జరిగింది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్కు చెందిన బొంకేంపల్లి సాయిలు(70) భిక్షాటన చేస్తూ సంచార జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం అతడు బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఒడ్డున బట్టలు ఉతుక్కొని, స్నానం చేసేందుకు చెరువులోకి దిగగా.. ప్రమాదవశాత్తు జారి చెరువులో మునిగి మృతి చెందాడు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గడ్డిమందు తాగి..పెన్పహాడ్: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో శనివారం జరిగిది. ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. చీదెళ్ల గ్రామానికి చెందిన వెన్న వెంకటరెడ్డి(58) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆయన తన ఇంట్లో గడ్డి మందు తాగాడు. అనంతరం గడ్డి మందు తాగినట్లు బయట ఉన్న భార్య పద్మకు చెప్పడంతో చుట్టుపక్కల వారి సహాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు నవీన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. ఇంట్లో నగదు చోరీ పెన్పహాడ్: గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి నగదు అపహరించారు. ఈ ఘటన శనివారం పెన్పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ ఆంగోతు యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. దూపపహాడ్ గ్రామానికి చెందిన పత్తిపాక సైదులు శనివారం మధ్యాహ్నం తన ఇంటికి తలుపులు పెట్టి గాలిమిషన్ వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళం పగులగొట్టి రూ.2వేలు ఎత్తుకెళ్లారు. సైదులు ఇంటికి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. గ్రామస్తులు దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. సమష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థనల్లగొండ టూటౌన్: విద్యార్థుల సమష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూటీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోపరేటివ్ మేనేన్మెంట్ శనివారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జూలై మొదటి శనివారాన్ని సహకార దినోత్సవంగా పాటించాలన్నారు. సహకార వ్యవస్థ ద్వారా గ్రామాలు విజయపథంలో దూసుకెళ్లాని వివరించారు. విద్యార్థులకు సైతం సహకార సంఘాలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్. గణేషన్, శార్దూల్ జాదవ్, పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కూలి పనికి వెళ్తూ మృత్యుఒడికి..
భువనగిరిటౌన్: కూలి పని చేసే మహిళను ఆమె భర్త ద్విచక్ర వాహనంపై పని ప్రదేశంలో దించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం మగ్ధూంపల్లికి చెందిన సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ(45) భార్యాభర్తలు. సత్యనారాయణ బీబీనగర్లోనే ఓ కంపెనీలో పనిచేస్తుండగా.. మల్లమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం ఉదయం సత్యనారాయణ తన భార్య మల్లమ్మను భువనగిరిలో కూలీ పనికి వదిలేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. భువనగిరి పట్టణంలోని జంఖన్నగూడెం చౌరస్తా వద్ద మల్లమ్మ, సత్యనారాయణ ఆగగా.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. సత్యనారాయణకు గాయాలయ్యాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా.. ఒక కుమార్తె వివాహం చేశారు. మిగతా ఇద్దరు కుమార్తెలు పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి ఫ ఆమె భర్తకు గాయాలు -
కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్
నకిరేకల్: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు కారులో వెళ్లొస్తుండగా.. కట్టంగూర్ మండలం పామునగుండ్ల శివారులో లారీ ఢీకొట్టడంతో మఠంపల్లి మండలం కిందితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుర్రి శ్రీను మృతిచెందగా. అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో ఉంచిన కుర్రి శ్రీను భౌతికకాయానికి శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ పరంగా శ్రీను కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం, అతడి పిల్లలకు విద్య అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుడు ఽశ్రీను అంత్యక్రియలను దగ్గరుండి చూసుకోవాలని ఆయన హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులకు సూచించారు. మంత్రి వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న తదితరులు ఉన్నారు. కిందితండాలో విషాదఛాయలు.. మఠంపల్లి: కుర్రి శ్రీను మృతితో కిందితండా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి శ్రీను అంత్యక్రియలను అశ్రునయనాల మధ్యన పూర్తిచేశారు. కాగా అదే గ్రామానికి చెందిన వీరన్ననాయక్, మాలోతు శ్రీనునాయక్, బాబునాయక్, మేఘానాయక్, నాగేశ్వరరావునాయక్కు గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు.. కట్టంగూర్: ఈ ప్రమాదానికి కారణమైన గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ జుగ్రాజ్సింగ్పై మృతుడి భార్య కుర్రి శ్రీదేవి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కట్టంగూర్ ఎస్ఐ రవీదర్ తెలిపారు. ఫ మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటన ఫ తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేత ఫ హైదరాబాద్లో కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి -
బైక్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు
హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మోరం నాగేశ్వరరావు అతడి భార్య లక్ష్మీపార్వతి, 18 నెలల కుమారుడు అభిరామ్తో కలిసి శనివారం బైక్పై తిరుమలగిరి(సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, అతడి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయిప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను మాచర్లకు తరలించారు. క్షతగాత్రుల బంధువు లక్ష్మీకాంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిపెన్పహాడ్: ఇంట్లో నీటి మోటారుకు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం చెట్లముకుందాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లముకుందాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాస్(54) తన ఇంట్లోని నీటి ట్యాంకు వద్ద మోటారు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య
శాలిగౌరారం: మానసికస్థితి సరిగా లేని మహిళ తన ఎనిమిది నెలల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగమర్తి గ్రామానికి చెందిన సాయిని శంకరయ్య, వీరమ్మ దంపతుల కుమార్తె వాణి(23)ని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సింగారపు మహేశ్కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. మహేశ్, వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె పుట్టిన సమయంలోనే వాణి మానసిక స్థితి దెబ్బతినడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో వాణిని ఆమె తల్లిదండ్రులు వైద్యం కోసం ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలో వాణి తరచూ తన తల్లిగారింటికి వచ్చి వెళ్తుండేది. నెల రోజుల క్రితం పెద్ద కుమార్తెను భర్త వద్ద ఉంచి చిన్న కుమార్తె హర్షిత(8 నెలలు)తో కలిసి వాణి వంగమర్తిలోని తల్లిగారింటికి వచ్చి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రానికి బయల్దేరి.. శనివారం వాణి తన చిన్న కుమార్తె హర్షితతో కలిసి ఇంటి వద్ద ఉండగా ఆమె తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. వాణి తన కుమార్తెను తీసుకొని మధ్యాహ్నం సమయంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని చుట్టుపక్కల వారికి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కానీ వాణి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లకుండా వంగమర్తి గ్రామ సమీపంలోని 365వ నంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లి హైవే పక్కన ఉన్న నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో కుమార్తెతో పాటు దూకింది. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన వాణి తల్లిదండ్రులు కుమార్తె ఇంట్లో కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వారిని అడిగారు. దీంతో వారు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నానని చెప్పిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అడుగగా అక్కడకు రాలేదని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. ఆందోళనకు గురైన వాణి తల్లిదండ్రులు ఎన్నారం గ్రామానికి ఫోన్ చేసి వాణి వచ్చిందేమోనని ఆరా తీశారు. కానీ అక్కడకు కూడా వాణి రాలేదని చెప్పడంతో గ్రామంలో ఆరా తీయగా.. రెండు గంటల ముందు కుమార్తెతో కలిసి వాణి జాతీయ రహదారి వెంట మాధారంకలాన్ వైపు నడుచుకుంటూ వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. వాణి తల్లిదండ్రులతో పాటు స్థానికులు జాతీయ రహదారి వెంట గాలిస్తూ.. నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో చూడగా అప్పటికే వాణి మృతిచెంది నీటిలో తేలియాడుతూ కనిపించింది. వాణి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని నకిరేకల్లోని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి హర్షిత మృతదేహం కోసం తీవ్రంగా గాలించారు. అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాకపోవడంతో నిలిపివేశారు. రాత్రి వరకు చిన్నారి హర్షిత మృతదేహం లభ్యంకాలేదు. మృతురాలి తండ్రి సాయిని శంకరయ్య ఇచ్చిన ఫిపిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు వివరించారు. ఫ మతిస్థిమితం సరిగా లేక వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం ఫ తల్లి మృతదేహం లభ్యం ఫ నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ఘటన -
అందరు ఉన్నా అనాథ శవంగా..
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అందరు ఉన్నా అనాథయ్యాడు. వివరాలు.. భువనగిరి పట్టణంలోని రెడ్డివాడకు చెందిన పట్నం పవన్ (40) గత నెల 21న భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ గ్రామంలోని తన అత్తగారింటికి బస్సులో బయల్దేరాడు. మార్గమధ్యలో జనగామలో పవన్ బస్సు దిగి.. తనకు పని ఉంది, చూసుకొని వస్తాను అని భార్యకు చెప్పాడు. కల్పన ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. రెండు రోజులు గడిచినా భర్త ఇంటికి రాకపోవడంతో కల్పన భువనగిరిలోని పవన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఎంత వెతికినా పవన్ ఆచూకీ లభించకపోవడంతో ఐదు రోజుల అనంతరం జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ అప్పటికే జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద పవన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో నాలుగు రోజులపాటు గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు భద్రపరిచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో కల్పన భర్త ఆచూకీ కోసం శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. గుర్తుతెలియని మృతదేహంగా పేర్కొని అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలు చూపించగా.. తన భర్త పవన్ మృతదేహామే అని ఆమె నిర్ధారించింది. అయితే కల్పన ఫిర్యాదు వెంట పవన్ ఫొటోను జతచేయకపోవడంతో మృతదేహం గుర్తింపులో ఆలస్యం జరిగిందని జనగామ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు శనివారం జనగామలో పవన్ మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఫ జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భువనగిరి వాసి ఫ 13రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు అందిన సమాచారం ఫ అప్పటికే గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన జనగామ పోలీసులు -
శ్మశానంలోనే ఆమె బతుకు బండి
మిర్యాలగూడ టౌన్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రకాశం, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారికి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఊళ్లో కూలీ పనులు దొరక్కపోవడంతో 26 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మిర్యాలగూడ పట్టణానికి వలస వచ్చారు. తమకు తెలిసిన వారి ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో కూలీ పనికి కుదిరారు. ఇక్కడే కాటికాపరిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఐదేళ్లకు అనారోగ్యంతో ప్రకాశం మృతిచెందాడు. అప్పటి నుంచి మణెమ్మనే కాటికాపరిగా పనిచేస్తోంది. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిల్లంచర్ల అనంతరాములే తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, తన భర్త బతికి ఉన్నప్పి నుంచి కూడా అనంతరాములే తమకు జీతం ఇస్తున్నారని మణెమ్మ పేర్కొంది. మొదట్లో ప్రతినెల రూ.600 వరకు జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.1000 ఇస్తున్నారని తెలిపింది. తనకు కిడ్నీలో రాళ్లు వస్తే ఆపరేషన్ ఖర్చు కూడా ఆయనే భరించారని పేర్కొంది. వితంతు పింఛనే ఆధారం.. కరోనా సమయంలో ఎవరు కూడా మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రాకపోవడంతో మణెమ్మనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించింది. ఇప్పటికీ ఆమెకు సొంతిళ్లు కూడా లేదు. వితంతు పింఛన్ డబ్బులే కొంత మేరకు ఆమెకు ఆధారం. ఇంటి స్థలం మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను మణెమ్మ కోరుతోంది. శ్మశానవాటికలో పనిచేస్తూనే తన ఇద్దరు కుమారులు, కుమర్తెకు వివాహాలు చేసింది. మణెమ్మకు ఔట్సోర్సింగ్ కింద పారిశుద్ధ్య కార్మికులకు ఏవిధంగా వేతనాలు ఇస్తున్నారో అదే రీతిలో వేతనం ఇస్తే బాగుండేదని స్థానికులు అంటున్నారు. చీకటి పడిందంటే సాధారణంగా బయటకు వెళ్లేందుకు మహిళలు భయపడతారు. కానీ ఈ మహిళ రాత్రి, పగలు అనే తేడాలేకుండా శ్మశానంలోనే చితిమంటల మధ్య జీవనం సాగిస్తోంది. భర్త మృతి అనంతరం అతడి దారిలోనే కాటికాపరిగా పనిచేస్తూ బతుకు బండిని లాగుతోంది. మొదట్లో చాలా భయమేసింది మొదట్లో శవాన్ని దహనం చేస్తుంటే చాలా భయమేసేది. కానీ తర్వాత అలవాటుగా మారిపోయింది. నేను శవాలను దహనం చేయడం ఒక సేవగా భావిస్తున్నాను. నా పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కుమారుడు తాపీ మేసీ్త్రగా, చిన్న కుమారుడు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కోడళ్లు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రభుత్వం కనీసం ఇంంటి స్థలం అయినా ఇచ్చి ఆదుకోవాలి. మున్సిపాలిటీ కార్మికులకు వచ్చే విధంగా వేతనమైనా ఇస్తే బాగుంటుంది. – పత్తిపాటి మణెమ్మ ఫ భర్త మృతి అనంతరం కాటికాపరిగా పనిచేస్తున్న మహిళ -
బంధువుల దశదిన కర్మకు వెళ్లొస్తుండగా..
కట్టంగూర్: బంధువుల దశదిన కర్మకు ద్విచక్ర వాహనంపై వెళ్లొస్తున్న తల్లీకుమారుడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కేంద్రం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మన్సూరాబాద్కు చెందిన పిట్టల శంకరమ్మ(41), ఆమె కుమారుడు పిట్టల రజనీకాంత్(25) తమ బంధువుల దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి వచ్చారు. సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వెళ్తుండగా.. బయలుదేరారు. మార్గమధ్యలో కట్టంగూర్ మండల కేంద్రం శివారులోకి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన శంకరమ్మను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల స్వగ్రామం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం కాగా.. వీరు బతుకుదెరువు నిమిత్తం 30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కు వలస వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. నిర్లక్ష్యంగా లారీని నిలిపిన డ్రైవర్.. లారీ డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ లైట్లు వేయకుండా కట్టంగూర్ మండల కేంద్రం శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని ఆపి సుమారు రెండు గంటల పాటు నిద్రించాడు. లారీని పూర్తిగా హైవే కిందకు దించకుండా సగ భాగం హైవే పైనే నిలుపడంతో.. రజనీకాంత్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి మరో వాహనం రావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల్లీకుమారుడు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఫ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి ఫ కట్టంగూర్ మండల కేంద్రం శివారులో ఘటన -
తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్
సూర్యాపేటటౌన్: ఆస్తి వివాదంలో కన్న తండ్రిని హత్య చేసిన నిందితుడిని శుక్రవారం మోతె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ విలేకరులకు వెల్లడించారు. మోతె మండలం నాగయ్యగూడేనికి చెందిన నిమ్మరబోయిన వెంకన్నకు 4.29 ఎకరాల భూమి ఉంది. ఐదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో తీర్మానం చేసి వెంకన్న తన పేరిట ఎకరం, ఇద్దరు కుమారులకు చెరొక ఎకరంన్నర, కుమార్తెకు 29 గుంటల భూమి వాటాలు వేసి పంచుకున్నారు. అయితే ఈ భూమిని పట్టా చేయలేదు. వెంకన్న తన వాటాకు వచ్చిన ఎకరం భూమిని తనకు అప్పులు అయ్యాయని అమ్ముకున్నాడు. దీంతో వెంకన్నపై అతడి పెద్ద కుమారుడు గంగయ్య కోపం పెంచుకొని ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం గంగయ్య తన బైక్పై ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో తన తండ్రి వెంకన్న సూర్యాపేట నుంచి నాగయ్యగూడేనికి టీవీఎస్ మోపెడ్పై వెళ్తుండటం గమనించాడు. అదే సమయంలో గంగయ్య తన తలకు హెల్మెట్ ధరించి తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో తండ్రి వెంకన్నపై దాడి చేసి పారిపోయాడు. వెంకన్నను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంకన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మోతె పోలీసులు శుక్రవారం గంగయ్యను మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి గొడ్డలి, హెల్మెట్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు
దేవరకొండ: ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంతో పాటు 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు గుర్తింపు కార్డులు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతను చైతన్యపర్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్పులు చేర్పులు సైతం.. అంతేకాకుండా ఇదివరకే ఓటరుగా నమోదై ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం 15రోజుల్లోనే ఇంటికే ఓటరు కార్డు పంపించనున్నారు. ఇప్పుడు ఉన్న సిస్టం ప్రకారం ఓటర్లకు ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు చేయడానికి నెలకు పైగా సమయం పడుతుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తు ఇలా.. 18ఏళ్లు నిండి ప్రతిఒక్కరూ ఈసీఐ.గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి తమ ఫోన్ నంబర్, ఈమొయిల్ ఐడీతో సైన్అప్ కావాలి. ఫ క్రియేట్ చేసిన అకౌంట్పై క్లిక్ చేసి తన పేరు, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత పాస్వర్డ్ను నిర్ధారించాలి. ఫ సైన్ అప్ అయిన ఈమొయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంట్రీ చేసి అందులో ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలి. ఫ తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఫ కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు ఫారం–6తో వ్యక్తిగత వివరాలు, అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి అందులో పేర్కొన్న ధృవపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అనంతరం మరోసారి వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. ఫ మార్పులు, చేర్పుల కోసం ఫారం–8, ఓటరు పేరు తొలగించుకునేందుకు ఫారం–7 నింపాలి. ఫ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేస్తే దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్గా వచ్చిన రెఫరెన్స్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును పొందాలి. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అర్హులకు 15రోజుల్లోనే గుర్తింపు కార్డు రానుంది. – రమణారెడ్డి, ఆర్డీఓ, దేవరకొండ ఫ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఫ ఓటరు నమోదును ప్రోత్సహించడానికి సరికొత్త మార్గం -
మొక్కల పెంపకంతోనే సమృద్ధిగా వర్షాలు
నల్లగొండ టూటౌన్: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని, మొక్కల పెంపకంతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంజీయూ ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ వంతు బాధ్యతగా యూనివర్సిటీతో పాటు తమ ఇళ్ల వద్ద కూడా మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి, ఆకుల రవి, స్పోర్ట్స్ సెక్రటరీ కె. హరీష్కుమార్, వీరస్వామి, సుధాకర్, శ్రీనివాస్, షరీఫ్, మురళి, శ్రీనివాస్రెడ్డి, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
గరిడేపల్లిలో మరో నలుగురు..
హుజూర్నగర్: గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 2.350 కేజీల గంజాయి, 2 సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. శుక్రవారం హుజూర్నగర్ సీఐ కార్యాలయ ఆవరణలో ఈ కేసు వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి విలేకరులకు వెల్లడించారు. హుజూర్నగర్కు చెందిన బొట్ల బాలకృష్ణ, షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్ శుక్రవారం గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులోని కాల్వపల్లి రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి క్రయవిక్రయాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడ మాటువేశారు. ఈ క్రమంలో పల్సర్ బైక్పై వారు ముగ్గురు వచ్చి గంజాయి ప్యాకెట్లను పంచుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 330 గ్రాముల గంజాయి, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వారిని గంజాయి అమ్మిన చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్త్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా నెల రోజుల క్రితం ఏపీలోని సీలేరు వెళ్లి కార్తీక్ అనే వ్యక్తి నుంచి రూ.8వేలు ఇచ్చి 4కేజీల గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో తాను సేవించి మిగిలిన దానిని బొట్ల బాలకృష్ణ, షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్కు గత నెల 29న ఒకసారి, శుక్రవారం మరోసారి విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి సెల్ఫోన్, 2.30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసిట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ చరమందరాజు, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల రిమాండ్
సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన పది మంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారిలో పిట్టల నాగరాజు, ఆది వంశీ జూన్ 30న సూర్యాపేట నుంచి బస్సులో ఖమ్మంకు వెళ్లి.. అక్కడి నుంచి రైలులో ఏపీలోని విశాఖపట్నం సమీపంలోని అరకు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ 12కిలోల గంజాయిని ఒక్కో కిలో రూ.2వేలు చొప్పున కొనుగోలు చేశారు. ఈ గంజాయి కొనుగోలు చేయడానికి పది మంది యువకులు కలిసి ఒక్కొక్కరు రూ.3వేల చొప్పున వేసుకున్నారు. నాగరాజు, వంశీ కలిసి ఆ గంజాయిని తీసుకొని ఈ నెల 3న సూర్యాపేటకు వచ్చి నాగరాజు ఇంట్లో దాచిపెట్టారు. ఆ గంజాయిని అందరికీ పంచేందుకు నల్లచెరువుకట్ట వద్దకు రమ్మనగా వారందరూ గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. నాగరాజు నల్లచెర్వుకట్ట వద్దకు బైక్పై గంజాయితో రాగా.. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా సీసీఎస్, పట్టణ సీఐ వెంకటయ్య తన సిబ్బందితో దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో పిట్టల నాగరాజు, అంగోతు వంశీ, రెడ్డిపల్లి మధుసూదన్, కూతురు ఆకాశ్, శూర శ్రవణ్కుమార్, గుండారపు శివ ఉండగా వారిని రిమాండ్కు తరలించారు. మరో నలుగురు ఆది వంశీ, విశ్వనాథుల సాయికుమార్, దోసపాటి వంశీ, సారగండ్ల శివకార్తీక్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. నిందిధితుల నుంచి 11.780కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దోరకుంటలో గంజాయి పట్టివేత..? కోదాడరూరల్: కోదాడ మండలం దోరకుంటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు 10 కేజీల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా ఓ వ్యక్తి వద్ద కొంత మేర గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. సదురు వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తి వద్ద 9 కేజీల గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఫ 11.780 కిలోల గంజాయి స్వాధీనం ఫ పరారీలో మరో నలుగురు -
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): మామ అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి.. తన బావమర్దితో కలిసి టీవీఎస్ మోపెడ్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన మోరపాక భిక్షం అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. భిక్షం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అతడి అల్లుడు మోనంది ఐలయ్య(55) గురువారం సూర్యాపేట నుంచి గట్టికల్లుకు వచ్చాడు. కొన్ని కారణాల వల్ల గురువారం భిక్షం అంత్యక్రియలు పూర్తికాలేదు. కాగా గురువారం రాత్రి 8గంటల సమయంలో మోనంది ఐలయ్య తన బావమరిది(మృతుడి కుమారుడు) మోరపాక రాములు(45)తో కలిసి పని నిమిత్తం టీవీఎస్ మోపెడ్పై గట్టికల్లు నుంచి నెమ్మికల్లుకు వెళ్తున్నారు. అదే సమయంలో గట్టికల్లు గ్రామానికే చెందిన కోన వినోద్ తన తల్లి, కుమారుడితో కలిసి సూర్యాపేట నుంచి బైక్పై గట్టికల్లుకు వస్తున్నాడు. ఈ క్రమంలో నెమ్మికల్లు–గట్టికల్లు గ్రామాల మధ్య వినోద్ తన బైక్తో ఎదురుగా వస్తున్న ఐలయ్య టీవీఎస్ మోపెడ్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐలయ్య, రాములుకు తీవ్ర గాయాలు కాగా.. వినోద్ తల్లి లక్ష్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐలయ్య, రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఐలయ్య, సాయంత్రం రాములు మృతిచెందారు. మృతుడు మోనంది ఐలయ్య స్వగ్రామం గట్టికల్లు కాగా.. 15 ఏళ్లుగా సూర్యాపేటలో నివాసముంటున్నాడు. ఐలయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మోరపాక రాములు భార్య గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. రాములుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బైక్తో ఢీకొట్టి ఐలయ్య, రాములు మృతికి కారణమైన వినోద్పై కఠిన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు శుక్రవారం వినోద్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గట్టికల్లు గ్రామానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒక్కరోజు వ్యవధిలో మృతిచెందడంతో గట్టికల్లు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫ రోడ్డు ప్రమాదంలో బావ, బావమర్ది మృతి -
బాలికపై అత్యాచారం కేసులో 22 ఏళ్లు జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసి మోసం చేసిన కేసులో నిందితుడికి 22 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు రెండవ అదనపు జడ్జి రోజారమణి శుక్రవారం తీర్పు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అల్లం మహేష్ 2014 సంవత్సరంలో బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో.. బాధితురాలు తండ్రి వాడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ వాదనలతో ఏకీభవించిన జడ్జి రోజారమణి నిందితునికి 22 సంవత్సరాలు జైలు రూ.35000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం త్వరితగతిన చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశిస్తూ తీర్పులో పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ఏడు పాడి గేదెలు మృతినడిగూడెం: నడిగూడెం మండలం రామాపురం గ్రామ పరిధిలోని ఊర చెరువులో విద్యుత్ తీగలు తగిలి ఏడు పాడి గేదెలు మృతిచెందాయి. వివరాలు.. రామాపురం గ్రామంలోని పలువురు రైతులకు చెందిన ఏడు పాడి గేదెలు శుక్రవారం మేత మేసేందుకు గ్రామ పరిధిలోని ఊర చెరువు వద్దకు వెళ్లాయి. చెరువులో విద్యుత్ తీగలు తెగిపడడంతో ఆ తీగలకు ఏడు గేదెలు తగలడంతో మృతిచెందాయి. బూతుకూరి రామిరెడ్డికి చెందిన 3, నేలమర్రి శ్రీనుకు చెందిన 2, తొడేటి శ్రీను, బంక శంకర్కు చెందిన ఒక్కో గేదె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే గేదెలు మృతిచెందాయని గ్రామస్తులు ఆరోపించారు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు గురుకుల విద్యార్థి
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలో కొనసాగుతున్న హైదరాబాద్లోని మలక్పేట, కార్వాన్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి జి. రామకృష్ణారెడ్డి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నాడు. గత నెల మన రాష్ట్రం నుంచి 20మంది విద్యార్థుల బృందం అడ్వెంచర్ క్యాంప్లో భాగంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించడానికి వెళ్లారు. అందులో రామకృష్ణారెడ్డి కూడా బేస్ క్యాంపునకు చేరుకుని జాతీయ పతాకంతో పాటు మహాత్మాబా పూలే గురుకుల పాఠశాలల జెండాను ఎగురవేశారు. రామకృష్ణారెడ్డి స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామం. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని శుక్రవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకట్రావ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ హరికుమార్, డిప్యూటీ వార్డెన్ అజార్, ఫిజికల్ డైరెక్టర్ పి. హేమంత్కుమార్, సతీష్, హౌజ్ మాస్టర్ రాజ్కుమార్, రవి, శేఖర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రానికి ఆషాఢం ఎఫెక్ట్
ఫ గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఆషాఢ మాసం ప్రారంభంకావడంతో పాటు అటు గ్రామాల్లో వ్యవసాయం పనుల్లో రైతులు బిజిబిజీగా ఉండటం.. ఇటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్తుండటం, జంట నగరాల్లో బోనాల పండుగ ప్రారంభం కావడంతో భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు వెలవెలబోయాయి. స్వామివారి దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. శుక్రవారం స్వామివారిని సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.12,15,624 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. కడుపునొప్పి భరించలేక యువకుడి బలవన్మరణం చిట్యాల: కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో శుక్రవారం జరిగింది. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలికట్టె గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) చిట్యాల మండలంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తమ వ్యవసాయ పొలం వద్ద బర్రెలను కట్టేసి రావటానికి వెళ్లి పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మహేశ్వరీ, ఒక కుమారుడు ఉన్నారు. తన భర్త కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు మత్స్యగిరి భార్య మహేశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాంగ్రెస్ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదంఫ కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి ఫ కట్టంగూరు మండలం పామనగుండ్ల వద్ద ఘటన ఫ మృతుడు మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం వాసి హుజూర్నగర్: హైదరాబాద్లో కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభకు కారులో వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో పామనగుండ్ల శివారులోకి రాగానే కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. కారును ఢీకొట్టిన లారీ వెళ్లిపోయింది. వెనుక వస్తున్న వారు గమనించి గాయపడిన వారిని పరిశీలించగా అప్పటికే కుర్రి శ్రీను(40) మృతిచెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. -
నూతన ఆలోచనా దృక్పథం అవసరం
నల్లగొండ టూటౌన్: నూతన ఆలోచనా దృక్పథం ప్రతి విద్యార్థికి అవసరమని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూలో శుక్రవారం విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల వినూత్న ఆలోచనకు క్రమశిక్షణ తోడైతే శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చన్నారు. సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు నివేద, శ్రీచరణ్ తేజ మేధో సంపత్తి హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐపీఆర్ సెల్ డైరెక్టర్ దోమల రమేష్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. ప్రేమ్సాగర్, రామచందర్ గౌడ్, మద్దిలేటి, తిరుమల, శాంతకుమారి, మచ్ఛేందర్ పాల్గొన్నారు. సాగర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ను శుక్రవారం కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం, పర్యవేక్షణ నిర్వహణ బృందం సభ్యులు సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన డ్యాంను సందర్శించిన అనంతరం బుద్ధవనంలోని బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధ చరిత వనం, ధ్యానవనం, జాతకవనం, స్థూపవనాలను సందర్శించారు. మహాస్థూపం రెండో అంతస్తులో ధ్యాన మందిరంలో బుద్ధ భగవానుడి వద్ద బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన ఈ బృందంచే బుద్ధజ్యోతిని వెలిగించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివరాలను, బుద్ధవనం విశేషాలను వివరించారు. ఈ బృందంలో నావెల్ ప్రకాష్, అభిషేక్ విశ్వాస్, బీపీ యాదవ్, సందీప్కుమార్, బీఆర్ సలేమాన్, బీపీఎం మోహన్రెడ్డి, రెవెన్యూ ప్రొటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
లక్కీ డ్రా స్కీం కేసులో ముగ్గురి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: లక్కీ డ్రా స్కీం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ముగ్గురు నిందితులను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ విలేకరులకు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణంలో నివాసముంటున్న అడవిదేవులపల్లి మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, కొమ్ము కోటేశ్వర్రావు, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన బచ్చలకూరి శ్రీను కలిసి ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను స్థాపించారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని నెలకు రూ.1000 చొప్పున 15నెలలు కడితే ప్రతి నెల డ్రా తీసి డ్రాలో వచ్చిన పది మందికి రూ.15వేల విలువైన వస్తువులు ఇస్తామని ఆశ చూపారు. 15నెలల్లో డ్రా లో పేరు రాకున్నా.. చివరకు కట్టిన మొత్తానికి అంత విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. వారు కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారికి కమీషన్ ఆశచూపి వారి ద్వారా 2143 మందిని లక్కీ డ్రా స్కీంలో చేర్పించుకున్నారు. వారి నుంచిరూ.1.85 కోట్లు వసూలు చేసి అందులోంచి రూ.50 లక్షల వరకు డ్రాలో గెలిచిన సభ్యులకు గిఫ్టుల రూపంలో అందజేశారు. స్కీం పూర్తయిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ.1.36 కోట్లతో నిందితులు ప్లాట్లు, విలువైన ఇంటి సామగ్రి కొనుగోలు చేసి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.6,55,500 నగదు, రెండు ఓపెన్ ప్లాట్ల, ఇంటి దస్తావేజులు, ముదిమానిక్యం గ్రామంలో లీజుకు తీసుకుని నిర్మిస్తున్న ఫంక్షన్హాల్ దస్తావేజు, ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆఫీస్లో ఫర్నీచర్, రెండు ద్విచక్ర వాహనాలు, వాషింగ్ మెషిన్, వాటర్ ఫ్యూరీఫయర్, లాప్ట్యాప్, కంప్యూటర్, బాధితులకు ఇవ్వడానికి తయారు చేసిన బ్రోచర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె. రాజశేఖర రాజు, సీఐ మోతీరాం, ఎస్ఐ సైదిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నియోజకవర్గానికి 2వేల మంది
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనే బహిరంగ సభకు భారీ జన సమీకరణకు జిల్లా నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు వేలకు తగ్గకుండా కార్యకర్తలను సమీకరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్కు శివారులో ఉన్నందున ఇక్కడి నుంచి వీలైనంత ఎక్కువ మంది తరలించాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఈ మేరకు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశంతో పాటు జిల్లా నాయకులు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల తరలింపుపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సొంత వాహనాలతో పాటు, ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేశారు. సభను విజయవంతం చేయాలి : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తుర్కపల్లి: ఖర్గే బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు.గురువారం తుర్కపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుతున్నామని చెప్పారు. జైబాపు.. జైబీమ్.. జైసంవిదాన్ అనే నినాదంతో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మహాసభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఐనాల చైతన్య, నాయకులు దనావత్ శంకర్నాయక్, చాడ భాస్కర్రెడ్డి, మోహన్బాబు, ఐలయ్య, రాజారాంనాయక్, వెంకటేష్, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ నేడు హైదరాబాద్లో ఖర్గే బహిరంగ సభ ఫ జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తి -
బాల కార్మికులను గుర్తించాలి
భువనగిరిటౌన్ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా బాల కార్మికులను గుర్తించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మహిళా శిశు సంక్షేమ, పోలీస్, కార్మిక, వైద్య, విద్యా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ ముస్కాన్పై సమీక్షించారు. బాలల హక్కులను పరిరక్షించి వారికి మంచి భవిష్యత్ అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. బడిబయట, బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించాలని కోరారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయా లన్నారు. బాల్యవివాహాలను నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ లోగోను ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలపై 1098, 112 నంబర్లను సంప్రదించాలని కోరారు. అదే విధంగా భవిత కేంద్రాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో సౌకర్యాలు, మరమ్మతులపై సూచనలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నరసింహరావు, సత్యనారాయణ, డాక్టర్ యశోద, అరుణ, సీఐ చంద్రబాబు, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
నాట్లు వేసి నిరసన
రామన్నపేట : మండలంలోని దుబ్బాకలో వర్షానికి బురదమయమైన ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు గురువారం మహిళలతో కలిసి వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రామన్నపేట–అమ్మనబోలు రోడ్డు గుంతలమయమై వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, గ్రామ శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్, నాయకులు గట్టు నర్సింహ, పైళ్ల పాపయ్య, గుండాల నరేష్, అనిల్, పుట్టల ఉదయ్, గాదె రాజ్కుమార్, సుందర్, లింగస్వామి, అక్షిత, రమణ, సాయి పాల్గొన్నారు. -
9న మత్స్యగిరి క్షేత్రంలో వేలం పాటలు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వాయిదాపడిన వేలం పాటలను తిరిగి ఈనెల 9న నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజల సామగ్రి, దుకాణాల నిర్వహణ కోసం జూన్ 5,18,28తేదీల్లో వేలం నిర్వహించగా వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయన్నారు. హైదరాబాద్లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కార్యాలయంలో టెండర్,బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ వెల్లడించారు. నేడు కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి భువనగిరిటౌన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు దొడ్డి కొమ్మురయ్య వర్ధంతిని శుక్రవారం కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ, ఇతర కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొనాలని కోరారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు కూడా కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అదే విధంగా ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కైంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. కోర్టు భవనాల నిర్మాణానికి రూ.34.50 కోట్లు మంజూరు రామన్నపేట : రామన్నపేట కోర్టు నూతన భవనాలు, రెసిడెన్సియల్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.34.50 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.29 కోట్లతో నాలుగు కోర్టులకు సంబంధించిన భవనాలు, రూ.5.50 కోట్లతో న్యాయమూర్తులు, సిబ్బంది ఉండటానికి నివాస గృహాలు నిర్మించనున్నారు. ఇటీవలే రామన్నపేటకు సివిల్జడ్జి కోర్టు మంజూరైంది. నూతన భవనాలు, క్వార్టర్స్ నిర్మాణానికి కొమ్మాయిగూడెం రోడ్డులో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్టు భవన సముదాయం ఇరుకుగా ఉంది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి కోర్టు భవనం శిథిల దశలో ఉండటంతో మరమ్మతులతో కాలం వెళ్లదీస్తున్నారు. నిధులు మంజూరు చేయడంతో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎంఏ మజీద్ హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మోత్కూరు పాఠశాలలో 150 అడ్మిషన్లు
మోత్కూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు గణనీయంగా నమోదవుతున్నాయి. మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 151 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. గురువారం నార్కట్పల్లిలోని ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్రెడ్డి అడ్మిషన్లు ఇచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను, విద్యార్థులను కలిసి అవగాహన కల్పించారని, ఫలితంగా పాఠశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు పెరిగినట్లు ఎంఈఓ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి పాఠశాలకు మంచి పేరు తెస్తామన్నారు. -
ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసే
చౌటుప్పల్ : ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ అని, నేరాల నియంత్రణకు సహకరించాలని డీసీపీ అక్షాంశ్యాదవ్ కోరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని రెండు ఆటోలు, ఒక కారు, 60 ద్విచక్ర వాహనాలతో పాటు బెల్టు దుకాణాల్లో మద్యం స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి సూచనలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమన్నారు. బెల్టు దుకాణాలు నడిపినా, డ్రగ్స్, గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్లు, దుకాణాలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. శాంతిభ్రదతల పరిరక్షణలో భాగంగానే కార్డన్సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐలు మన్మదకుమార్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ డీసీపీ అక్షాంశ్ యాదవ్ -
డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!
పాత కమిషనర్ వెళ్లలేదు.. ఆలేరులో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కమిషనర్ బదిలీ అయినా రిలీవ్ కావడం లేదు. కొత్త కమిషనర్ వస్తలేరు. గుట్టలకొద్దీ పేరుకుపోయిన చెత్త -5లో- 4లోమొక్కుబడిగా రీసైక్లింగ్ భువనగిరిటౌన్ : పట్టణ పరిధిలోని తుక్కాపురం రోడ్డులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు లక్ష జనాభా ఉంది. రోజూ 22 మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుంది. సేకరించిన చెత్తను ఏరోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రీసైక్లింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ చెత్త శుద్ధి జరగడం లేదు. చెత్త పేరుకుపోతుండటంతో శుద్ధి చేయకుండానే కాల్చేస్తున్నారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడే తప్ప.. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. మోడల్ స్కూల్ చెంతనే.. భూదాన్పోచంపల్లి: పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్ పక్కన డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ నుంచి రోజూ 6 టన్నుల మేర చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. యార్డులో కంపోస్ట్ ఎరువుల తయారీ షెడ్డు లేదు. దాంతో తడి, పొడి చెత్తనంతా ఒకేదగ్గర పారబోస్తున్నారు. చెత్తను తలబెడుతుండటంతో పొగ, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని మోడల్స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు గాలికి పంట పొలాల్లోకి కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగే డంపింగ్ యార్డు ఆలేరు: మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల నుంచి రోజూ 3వేల టన్నుల వరకు చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. సేకరించిన వ్యర్థాలను ఆలేరు పెద్దవాగుకు తరలిస్తున్నారు. తాగు, సాగునీటికి ప్రధాన వనరైన ఈ వాగులో వ్యర్థాలను డంప్ చేయడం వల్ల జలాలు కలుషితం అవతున్నాయని స్థానికులు, రైతులు అంటున్నారు. దుర్గమ్మ ఆలయం నుంచి కొలనుపాకకు వెళ్లే రోడ్డు పక్కన, వాగులో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం భరించలేక పోతున్నామని సవాపోతున్నారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి సాయిగూడెం శివారులో రెండు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. అయితే స్థానికులు, అక్కడి రైతుల నుంచి అభ్యంతరం రావడంతో డంపింగ్ యార్డు ఏర్పాటు పెండింగ్లో పడింది. అప్పటి నుంచి ఎవరూ ఈ దిశగా చొరవ చూపకపోవడంతో యార్డు ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. నీరు, పరిసరాలు కలుషితం అవుతున్నాయి పట్టణంలో సేకరించి చెత్త, ఇతర వ్యర్థాలను పెద్దవాగులోకి తరలిస్తున్నారు. దీంతో వాగునిండా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. నీళ్లు, పరిసరాలు కలుషితం అవుతున్నాయి. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు. త్వరగా అనువైన చోట భూమి సేకరించాలి. –కై సర్, ఆలేరుకాళేశ్వరం కాలువ పక్కనే చెత్త డంప్ యాదగిరిగుట్ట: మున్సిపాలిటీలో 12 వార్డులు, 5,003 నివాస గృహాలు, 50కి పైగా హోటళ్లు, 100 వరకు దుకాణాలు, 21వేల జనాభా ఉంది. దీనికి తోడు రోజూ సగటున 25వేల మంది భక్తులు వస్తుంటారు. ఇందులో 5 వేల భక్తులు ఆలయ సన్నిధిలో బస చేస్తుంటారు. రోజూ ఏడు టన్నుల చెత్త, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సేకరిస్తారు. శని, ఆదివారం, సెలవు రోజుల్లో అదనంగా మరో టన్నుకు పైగా చెత్త ఉత్పన్నం అవుతుంది. సేకరించిన చెత్తను యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వెళ్లే మార్గంలో కాళేశ్వరం చాలువ వెంట డంప్ చేసి కాల్చివేస్తున్నారు. మల్లాపురం శివారులో రెండు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త రీసైక్లింగ్ కోసం యంత్రాలు కూడా అమర్చారు. కానీ, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన స్థలం వివాదాస్పదం కావడం, ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో డంపింగ్ యార్డు ప్రారంభానికి నోచడం లేదు. పందులు, కుక్కలతో పరేషాన్ చౌటుప్పల్ : పట్టణ సమీపంలోని గోల్డెన్ ఫారెస్ట్ స్థలంలో చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల నుంచి రోజూ పది టన్నుల వరకు చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని 10 ఆటోలు, రెండు ట్రాక్టర్ల ద్వారా సేకరించి ఏరోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను రీసైక్లింగ్ చేయటానికి ఇటీవల సాగర్ కంపెనీ అనే సంస్థ మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. యంత్రాలను బిగించి ట్రయల్ రన్ నిర్వహించారు. త్వరలోనే రీసైక్లింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చెత్త రీసైక్లింగ్కు అవకాశం లేకపోవడంతో తగలబెడుతున్నారు. డంపింగ్ యార్డు సమీపంలో నివాసం ఉంటున్న కొందరు పందులు పెంచుతున్నారు. వీటితో పాటు కుక్కలు పెద్ద ఎత్తున డంపింగ్ యార్డులో తిరుగుతుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాల్లోకి కూడా వెళ్లుండటంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయి మా వ్యవసాయ భూముల వద్ద మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డు ఉంది. ఎప్పుడు చూసినా డంపింగ్ యార్డు నిండా కుక్కలు, పందులు కనిపిస్తున్నాయి. మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయి. డంపింగ్ యార్డు సమీపంనుంచి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. యార్డులో చెత్త నిల్వ ఉండకుండా చూడాలి. –మార్గం ఇందిరమ్మ, రైతు -
పాత కమిషనర్ వెళ్లలేదు.. కొత్త కమిషనర్ చేరలేదు..!
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. సీడీఎంఏ కార్యాలయంలో సూపరింటెండెంట్లుగా ఉన్న కొందరికి కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తూ సర్కారు పోస్టింగ్లు ఇచ్చింది. కమిషనర్లుగా కొనసాగుతున్న వారిని ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేసింది. ఈ మేరకు గత నెల 23వ తేదీన ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను భూపాలపల్లి(ద్వితీయ శ్రేణి) మున్సిపాలిటీకి బదిలీ చేసింది. శ్రీనివాస్ స్థానంలో ఆలేరు మున్సిపల్ కమిషనర్గా సీడీఎంఏ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రాములును నియమించింది. సాధారణంగా బదిలీ ఉత్తర్వులు వెలువడిన వారం, పది రోజుల్లో పాత అధికారులు రిలీవ్ కావడం.. కొత్త వారు బాధ్యతలు స్వీకరణ ప్రక్రియ పూర్తి కావాలి. కొత్త కమిషనర్కు చుక్కెదురు..భూపాలపల్లి మున్సిపాలిటీకి బదిలీ అయిన కమిషనర్ శ్రీనివాస్ రిలీవ్ కాకపోవడంతో ఈ నెల 26వ తేదీన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వెంకట్రాములకు చుక్కెదురైంది. దీంతో ఆయన జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి వీలుకాలేదని తెలిసింది. అయితే ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసి పది రోజులవుతున్నా కొత్త కమిషనర్ వెంకట్రాములు బాధ్యతలు స్వీకరించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయ వర్గాల్లో చర్చ..ఒక వేళ శ్రీనివాసే కమిషనర్గా కొనసాగించాలని ఉన్నతాధికారులు భావిస్తే పది రోజుల క్రితం ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు రద్దు చేసి, రివైజ్డ్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పడు వెంకట్రాములుకు మరో మున్సిపాలిటీకి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆస్కారం కలుగుతుంది. కానీ ఇప్పటివరకు రివైజ్డ్ ఆదేశాలు అధికారులు జారీచేయని నేపథ్యంలో ఆలేరు మున్సిపాలిటీకి శ్రీనివాస్, వెంకట్రాములు ఇద్దరు కమిషనర్లు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం విధుల్లో ఉన్న కమిషనర్ శ్రీనివాసే ఇక్కడ కొనసాగుతారా లేదా కొత్త కమిషనర్ వెంకట్రాములు బాధ్యతలు స్వీకరించనున్నారా అనేది ఇప్పుడు కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆలేరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి చర్చనీయాంశంగా మారిన మున్సిపల్ కమిషనర్ల బదిలీరాజకీయ జోక్యమే కారణమా? ప్రభుత్వ ఉత్వర్వులు వెలువడినా రాజకీయ జోక్యం కారణంగానే వెంకట్రాములు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి ఐదు నెలలే అయినందున ఆయన బదిలీని పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి కూడా శ్రీనివాస్ బదిలీకి బ్రేక్ పడటానికి మరో కారణమనే తెలుస్తోంది. -
బ్లాక్మెయిల్ చేస్తున్నందుకే వివాహిత హత్య
గుర్రంపోడు: తన వద్ద ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. అవి బయటపెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అని బ్లాక్మెయిల్ చేసినందుకే గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను గురువారం కొండమల్లేపల్లిలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ నవీన్కుమార్, గుర్రంపోడు ఎస్ఐ మధు విలేకరులకు వెల్లడించారు. గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన మంకెన జ్యోతి భర్త, పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసముంటోంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి గొడితల మహేష్.. గత ఏడేళ్లుగా జూనూతల గ్రామంలో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో ఉంటూ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. గతేడాది జూనూతల గ్రామానికి చెందిన జ్యోతి బంధువు కడుపునొప్పితో అదే గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న గొడితల మహేష్ వద్దకు వెళ్లింది. ఆర్ఎంపీ మహేష్ జ్యోతి బంధువును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. బంధువును చూసేందుకు నల్లగొండ ఆస్పత్రికి వచ్చిన జ్యోతికి, ఆర్ఎంపీ మహేష్తో సన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్లో, వాట్సప్ వీడియో కాల్స్లో సన్నిహితంగా మాట్లాడుకునేవారు. మిర్యాలగూడలో ఉంటున్న జ్యోతి తరచూ మహేష్కు ఫోన్ చేసి తన వద్దకు రమ్మని సతాయిస్తూ అతడితో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా తన వద్దకు రాకుంటే వీడియోలు, ఫొటోలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బెదిరించింది. పథకం ప్రకారమే.. జ్యోతి ఎప్పటికై నా తనపై కేసు పెట్టి తనకు భవిష్యత్తు లేకుండా చేస్తుందని భావించిన ఆర్ఎంపీ మహేష్ ఎలాగైనా ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న రాత్రి మిర్యాలగూడ నుంచి మల్లేపల్లికి బస్సులో వచ్చిన జ్యోతిని తన కారులో ఎక్కించుకున్న మహేష్ నల్లగొండ వరకు వెళ్లి తిరిగి జూనూతుల గ్రామానికి వస్తున్నారు. రాత్రి 11గంటల సమయంలో కొప్పోలు గ్రామ సమీపంలో కారును రోడ్డు పక్కకు ఆపి జ్యోతిపై మహేష్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె చేత బీపీ తగ్గి స్పృహ కోల్పోయేలా 8 మాత్రలు మిగించాడు. ఆ తర్వాత జ్యోతి స్పృహ కోల్పోతున్న క్రమంలో పది రోజుల క్రితమే గుర్రంపోడులో కొనుగోలు చేసి కారులో సిద్ధంగా ఉంచుకున్న గడ్డి మందును రెండు ఇంజెక్షన్ల ద్వారా ఆమె రెండు చేతులకు ఎక్కించాడు. అప్పటికీ ఆమె పూర్తిగా స్పృహ కోల్పేలేదని గ్రహించిన మహేష్ ఆమె చేత గడ్డి మందు నీళ్లలో కలిపి బలవంతంగా తాగించాడు. అదే రోజు రాత్రి దేవరకొండ ఆస్పత్రికి తీసుకెళ్లి గడ్డి మందు తాగిందని చెప్పి జ్యోతిని ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుర్రంపోడు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం మల్లేపల్లి సీఐ నవీన్కుమార్, గుర్రంపోడు ఎస్ఐ పి. మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణగౌడ్, వీక్షిత్రెడ్డి, నాగరాజు, సైదులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జూనూతుల గ్రామ బస్ స్టేజీ వద్ద నిందితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద సిరంజీలు, టాబ్లెట్లు, గడ్డిమందు డబ్బా, కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని దేవరకొండ కోర్టుకు రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ నవీన్కుమార్, ఎస్ఐ పసుపులేటి మధు, కానిస్టేబుళ్లను దేవరకొండ ఏఎస్పీ మౌనిక అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కొండమల్లేపల్ల్లి సీఐ నవీన్కుమార్ -
పురుగుల మందు తాగి..
మోత్కూరు: వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల పరిధిలోని పర్రెపాడు గ్రామానికి చెందిన ఏగూరి స్వరూప కుటుంబం 20ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మోత్కూరు పట్టణానికి వచ్చి స్థానిక కొత్త బస్టాండ్ కాలనీలో నివాసముంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త గతంలోనే మృతిచెందాడు. స్వరూప ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. స్వరూప చిన్న కుమారుడు సుధాకర్(30) జూన్ 27న వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. అతడిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. మృతుడు గ్రామంలో బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగించేవాడు. మృతుడి అన్న హైదరాబాద్లో కూలీ పనులు చేస్తూ జీవనంసాగిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
● రెండు బైక్లు స్వాధీనంనాగార్జునసాగర్: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగను సాగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాగర్ ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్లోని రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బైక్పై వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా.. అతడిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి చందంపేట మండలం జగ్నతండాకు చెందిన రమావత్ రాముగా పోలీసులు గుర్తించారు. అతడి విచారించగా.. గత నెల 3వ తేదీన విజయపురి టౌన్ పైలాన్ కాలనీలో పల్సర్ బైక్ చోరీ చేశానని, ఆ బైక్ను మాచర్లలో విక్రయించడానికి వెళ్తున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మాచర్ల పట్టణంలో మరో బైక్ను అపహరించి జగ్నతండాలోని తన ఇంట్లో దాచినట్లు చెప్పాడు. పోలీసులు అతడితో పాటు జగ్నాతండాకు వెళ్లి ఆ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి అతడికి 14 రోజుల జ్యూడీషియల్ రింమాండ్ విధించినట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. -
బీమాతో మహిళలకు దీమా
ఆత్మకూరు(ఎం): సమభావన సంఘాల సభ్యులకు అమలవుతున్న కొత్త పథకాలతో మహిళలు దీమాగా ఉండవచ్చు. రాష్ట్రం ప్రభుత్వం సమభావన సంఘాల సభ్యులకు 2024 మార్చిలో లోన్ బీమా, ప్రమాద బీమా అనే పథకాలకు రూపకల్పన చేయగా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే అవి అమలవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 673 గ్రామ సంఘాలు ఉన్నాయి. 18,112 సమభావన సంఘాలు ఉండగా.. అందులో 2,02,393 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. లోన్ బీమా..లోన్ బీమా కింద 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలు సమభావన సంఘంలో సభ్యురాలిగా ఉండి బ్యాంక్ లింకేజీ కింద రుణం తీసుకుని ప్రమాదవశాత్తు మరణిస్తే తిరిగి రుణం చెల్లించనవసరం లేదు. ఈ రుణం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో 72 మంది మహిళలు(సమభావన సంఘాల్లో సభ్యులు) రిజిస్ట్రేషన్ చేసుకోగా.. అందులో ఇప్పటివరకు మృతిచెందిన 21 మంది సభ్యులకు బీమా వర్తించింది. ప్రమాద బీమా..సమభావన సంఘంలో సభ్యురాలై ఉండి సీ్త్రనిధి రుణం తీసుకుని 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణిస్తే రూ.10లక్షలు సభ్యురాలు సూచించిన నామినీకి అందజేస్తారు. వీఓ తీర్మానం, ఓబీ తీర్మానం, సెర్ప్ ఏపీఎం, సీసీల తీర్మానం మేరకు బాధితురాలికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద భువనగిరి జిల్లాలో ముగ్గురు సభ్యుల కుటుంబాలు లబ్ధి పొందగా.. వారికి త్వరలో రూ.10లక్షల చొప్పున జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సభ్యులు అందజేయనున్నారు.అవగాహన కల్పించాలి లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలపై అధికారులు అవగాహన కల్పించాలి. ఈ రెండు పథకాలను సమభావన సంఘాల్లో సభ్యులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి అవగాహన కల్గించేలా చర్యలు తీసుకోవాలి. – రచ్చ పల్లవి, జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సమభావన సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు అవగాహన లేక సద్వినియోగం చేసుకోలేకపోతున్న మహిళలుఆర్థికంగా బలోపేతం కావాలి ఈ రెండు బీమా పథకాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నాం. స్వయం ఉపాధి కోసం సమభావన సంఘాల్లోని మహిళలు సీ్త్రనిధి రుణాలు తీసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి. ఒకవేళ వారికి ఏమైనా అయితే బీమా వర్తిస్తుంది. – టి. నాగిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి -
బిందు సేద్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత అత్యంత కీలకం బోర్లు, బావుల నుంచి వచ్చే నీటితో సన్నటి మన్ను, ఇసుక వస్తుంది. దీనివల్ల లెటరల్ పైపుల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లెటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్ అమర్చుతారు. దీనిని వారం రోజులకు ఒకసారి శుభ్రపర్చుకోవాలి. ఫిల్టర్పై సన్నని రంధ్రాలు పూడిపోకుండా జాగ్రత్తపడాలి. కొత్తగా వేసిన బోరు నీరు ఉపయోగిస్తున్నట్లయితే కొన్నిరోజుల వరకు రోజుకు ఒక్కసారి ఫిల్టర్ను శుభ్రం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. బావుల నుంచి నీటిని తీసుకునేటప్పుడు సాండ్ ఫిల్టర్ను అమర్చకోవాలి. రెండు ఫిల్టర్లతో రెండు దఫాలుగా వడపోత జరిగి లెటరల్ పైపుల్లోకి మట్టి, ఇసుక రాకుండా ఉంటుంది.త్రిపురారం: వ్యవసాయంలో బిందు సేద్యం వల్ల తక్కువ నీరు ఉన్నా వివిధ రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే భూగర్భ జలాల నుంచి వచ్చే సన్నటి ఇసుక, మట్టి రేణువులతో పాటు పైపుల ద్వారా రసాయన ఎరువులు అందిండచం వల్ల బిందు సేద్యంలో ఉపయోగించే పరికరాలు త్వరగా దెబ్బతిని మోటార్లు మోరాయించే అవకాశం ఉంది. బిందు సేద్యం పరికరాలను భద్రపుర్చుకోవడంతో పాటు సరైన జాగ్రత్తలు పాటించి శుభ్రం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచిస్తున్నారు. బిందు సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. లెటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్మెంట్ బిందు సేద్యం పరికరాల ద్వారా అందించే ఎరువులు వల్ల లిబరల్ పైపులకు ఉన్న రంద్రాలు పూడుకపోయి నీరు కిందకు రావడం పలు సందర్భాల్లో నీరు నిలిచి మొక్కలకు అందవు. ప్రతి ఏటా పైపులను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం తక్కువ గాడత గల హైడ్రోక్లోరిన్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ను వాడొచ్చు. యాసిడ్ను ఉపయోగించి పైపులను శుభ్రపరిచేందుకు రెండు పద్ధతులను పాటించవచ్చు. పంట లేని సమయంలో లెబరల్ పైపులను శుభ్రం చేసుకోవాలి. 1. ఎకరం పొలంలో గల లెబరల్ పైపులను శుభ్రం చేసుకునేందుకు 30 నుంచి 40 లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. 10మీ హూస్పైప్ను యూ ఆకారంలో ఉండేలా అమర్చుకోవాలి. ఇందుకోసం రెండు వైపుల కట్టెలను పాతి వాటికి హూస్పైపును కట్టి పైపును యాసిడ్లో ఉంచాలి. గాడత తక్కువ గల యాసిడ్ను మాత్రమే ఉపయోగించాలి. 2. ఎరువులను వదిలే ప్లాస్టిక్ పెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చాలి. పంట లేని సమయంలో మాత్రమే ఈ పద్ధతి అవలంబించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకును ముందుగా శుభ్రపర్చుకోవాలి. ఆ తర్వాత తక్కువ గాఢత గల యాసిడ్ను నింపి నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియను నెమ్మదిగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇనుప పెర్టిగేషన్ ట్యాంకు ఉన్నట్లయితే వెంచూరి సహాయంతో లెటరల్ పైపులను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. డ్రిప్ పరికరాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు1. పంట కాలం సమయంలో యాసిడ్ ద్వారా డ్రిప్ పైపులను శుభ్రం చేయకూడదు. 2. డ్రిప్ కంపెనీలు సూచించిన యాసిడ్ను వారు నిర్ధేశించిన మోతాదులోనే వాడాలి. 3. నీటిలో యాసిడ్ కలపాలి. యాసిడ్ ఉన్న ట్యాంక్లో నీటినిపై నుంచి ధారగా పోయరాదు. 4. ఫెర్టిగేషన్ లేదా వెంచూరి సహాయంతో యాసిడ్ను పంపేటప్పుడు నీటిని వాడకుండా చర్యలు తీసుకోవాలి. 5. డ్రిప్ పైపులు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాప్లను తీసివేసి యాసిడ్ కలిపిన నీటిని వదిలివేయాలి. 6. శుభ్రపరిచిన పైపులను మరోసారి నీటితో కడగడం లేదా సబ్లైన్కు బిగించి నీటిని పారనివ్వాలి. 7. శుభ్రపరిచే సమయంలో రైతులు ముఖానికి చేతులకు తొడుగులు ధరించాలి. చలువ కళ్లద్దాలు వినియోగించడం ఉత్తమం.ఫ కేవీకే కంపాసాగర్ సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మిర్యాలగూడ అర్బన్: గుండె నొప్పితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండలం కొంతనందికొండ గ్రామానికి చెందిన సుంకిశాల ముత్తయ్య(60)కు రెండు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలోని గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేరొక ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ముత్తయ్య మృతికి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు గురువారం ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ వన్టౌన్ సీఐ మోతీరాం, ఎస్ఐ సైదిరెడ్డితో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆస్పత్రి యాజమాన్యం, మృతుడి బంధువులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా.. రోగి మృతి పట్ల తమ నిర్లక్ష్యం ఏమీలేదని, గుండెపోటు తీవ్రం కావడంతోనే మృతిచెందాడని పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని మృతుడి బంధువుల ఆరోపణ ఆస్పత్రి ఎదుట ఆందోళన -
మూర్ఛతో పొలంలో పడి వ్యవసాయ కూలీ మృతి
చిట్యాల: వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న కూ లీకి మూర్ఛ(ఫిట్స్) రావడంతో బురదలో కూరుకుపోయి ఊపిరిడాక మృతి చెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం నేరడ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరడ గ్రామానికి చెందిన వడ్డెపల్లి సైదులు(40) గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో కూలీ పనికి వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా అతడికి మూర్ఛ రావడంతో పొలంలోని బురదలో పడిపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో బురదలో ఊపిరిడాడక అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు కూలీలు గుర్తించి పొలంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చెల్లని చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్షకోదాడరూరల్ : తీసుకున్న అప్పుకింద చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి కోదాడ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కె. భవ్య ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కోదాడ పట్టణా నికి చెందిన కొదుమూరి ప్రవీణ్ వద్ద రంగాపురపు ఉమామహేశ్వర్ రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు కింద 2014లో ఉమామహేశ్వర్ ప్రవీణ్కు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బ్యాంకులో చెల్లకపోవడంతో ప్రవీణ్ కోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘకాల విచారణ అనంతరం కేసు తుది విచారణలో భాగంగా గురువారం ఉమామహేశ్వర్కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5లక్షల నగదు చెల్లించాలని జడ్జి తీర్పు వెలువరించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిపాలకవీడు: ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం మిగడంపహాడ్తండాలో గురువారం జరిగింది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిగడంపహాడ్తండాకు చెందిన సపావత్ బిచ్చా(45) ఎలక్ట్రీ షియన్గా పనిచేస్తున్నాడు. అదే తండాకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారుకు కరెంట్ సరఫరా కాకపోవడంతో గురువారం బిచ్చాను పిలిచాడు. బిచ్చా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా.. 11కేవీ విద్యుత్ తీగ తెగిపడి ఉండటం గమనించి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య కస్తూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి● ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ శివారులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం దాడి చేసినట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. గూడూరు గ్రామ శివారులో గల ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో తనిఖీలు చేసి ఇద్దరు విటులతో పాటు మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
జాబ్ క్యాలెండర్ ద్వారా లైబ్రేరియన్ పోస్టుల భర్తీ
భూదాన్పోచంపల్లి: రాబోయే జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లైబ్రరియన్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. బుధవారం పోచంపల్లిలోని శాఖా గ్రంథాలయాన్ని ఆయన సందర్శించి అక్కడ వసతులు, పుస్తకాలను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో 600 గ్రంథాలయాలు ఉన్నాయని, వన్మ్యాన్ కమిషన్ వేసి రాష్ట్రంలో 750 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 80వేల పుస్తకాలు చదివానన్న కేసీఆర్ గత పదేళ్లలో గ్రంథాలయాలకు 8 పుస్తకాలు కూడా కొనివ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రాజారామ్మోహన్రాయ్ ఫౌండేషన్ ద్వారా వచ్చే నిధులన్నింటినీ గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు వినియోగిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో గ్రంథాలయాలను పటిష్టం చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సెస్ వసూల్ చేస్తున్నా, గ్రంఽథాలయాలకు చెల్లించడంలేదని అన్నారు. దీనిపై త్వరలో సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. భూదాన్పోచంపల్లి గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పోచంపల్లికి వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారని.. వారికి ఈ ప్రాంతం గొప్పతనం తెలియజెప్పేందుకు గ్రంథాలయం ఒక వేదిక కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సుధీర్, నాయకులు తడక వెంకటేశం, కొట్టం కరుణాకర్రెడ్డి, తడక యాదగిరి, రాపోలు జ్ఞానేశ్వర్, మక్తాల నర్సింహ, చింతకుంట్ల కృష్ణారెడ్డి, జయసూర్య, ఆకుల శోభ, సుచిత్ర పాల్గొన్నారు. ఫ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ -
పాలు పొంగించి.. పట్టువస్త్రాలు అందజేసి..
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్గిడి స్వప్న, బాలమల్లేష్ దంపతుల ఇంట్లోకి మంత్రి, విప్ కలిసి రిబ్బన్ కట్ చేసి గృహాప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంట్లో పాలు పొంగించి, ప్రత్యేక పూజలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు స్వప్న, బాలమల్లేష్ దంపతులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సమక్షంలో గొర్రె పొట్టేలు, పట్టువస్త్రాలు కానుకగా అందజేశారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లను పూర్తిచేసుకుని బహుమతులు పొందాలని ఐలయ్య చెప్పారు. గృహప్రవేశాలకు రావడం ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోపే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మింస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్యరెడ్డి, దుంబాల వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, బీర్ల శంకర్, శిఖ ఉపేందర్, గుండ్లపల్లి భరత్గౌడ్, ముఖ్యర్ల మల్లేష్, ఎరుకల హేమేందర్, బందారపు భిక్షపతి, కాల్నె భాస్కర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుకి గొర్రె పొట్టేలు అందజేసిన ప్రభుత్వ విప్ ఐలయ్య -
వాకింగ్కు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు
కోదాడరూరల్: వాకింగ్కు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని ఉత్తమ్పద్మావతినగర్ కాలనీలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల వెనుక నివాసముంటున్న షేక్ సల్మాన్(23) స్థానికంగా బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి వెంట వాకింగ్ చేసుకుంటూ కట్టకమ్ముగూడెం క్రాస్రోడ్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తమ్పద్మావతినగర్ కాలనీ వద్దకు రాగానే అతడు కాలు జారి హైవే సర్వీస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్పై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జానిమియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు.కల్మలచెరువులో..గరిడేపల్లి: గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మలచెరువు గ్రామానికి చెందిన గుండెబోయిన అచ్చమ్మ(60) తన కుమారుడు వీరయ్య వద్ద ఉంటోంది. కుమారుడు, కోడలు పనికి వెళ్తే వారి పిల్లల ఆలనాపాలన చూసుకుంటుంది. అచ్చమ్మ కుమారుడి ఇంటికి వచ్చే సర్వీస్ వైరు ఇంటి ముందు ఉన్న ఇనుప కడ్డీలను తాకుతుండగా.. బుధవారం ఆమె అది గమనించకుండా ఇనుప కడ్డీలను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కారు ఢీకొని వ్యక్తి దుర్మరణంచిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జరిగింది. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన జింటు దత్తు(31) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని హిండస్ పరిశ్రమలో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడు వెలిమినేడు గ్రామ శివారులోని మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాపు వద్ద నుంచి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి వెంట నడుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో నార్కట్పల్లి వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి దత్తును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. నిజాం కాలేజ్ ప్రొఫెసర్ తడక యాదగిరి రూపొందించిన అనువాద రాజ్యాంగ సంకలన పుస్తకాన్ని బుధవారం పోచంపల్లిలోని అర్బన్ బ్యాంకు ఆడిటోరియంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగం పట్ల ప్రజల్లో మరింత చైతన్యం కల్పించడానికి తడక యాదగిరి సరళమైన భాషలో సంకలం చేసి రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అనంతరం బ్యాంకు పాలకవర్గం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, చేనేత నాయకులు తడక వెంకటేశం, సీఈఓ సీత శ్రీనివాస్, తడక యాదగిరి, రాపోలు జ్ఞానేశ్వర్, బ్యాంకు డైరెక్టర్లు ఏలే హరిశంకర్, రాపోలు వేణు, కె. ఎల్లస్వామి, మక్తాల నర్సింహ, గునిగంటి రమేశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, సీత సత్యనారాయణ పాల్గొన్నారు. -
యాదగిరీశుడి సేవలో అడ్లూరి..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తుల చెంత అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. మంత్రికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. మంగళవారం రాత్రే మంత్రి యాదగిరిగుట్టకు చేరుకుని కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు. మంత్రికి ఘన స్వాగతం.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో కొండ పైన ఘన స్వాగతం పలికారు. వారి వెంట వెంట డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ చైతన్యరెడ్డి, నాయకులు బాలరాజుగౌడ్, గుండ్లపల్లి భరత్గౌడ్, ముక్కెర్ల మల్లేశం, బందారపు భిక్షపతి తదితరులున్నారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
నడిగూడెం: కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు నడిగూడెం మండలం చాకిరాల వద్ద బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం నుంచి అనంతగిరి మండలం శాంతినగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రతిరోజు ఆకుపాముల మీదుగా నడిగూడెం మండలం తెల్లబల్లి, ఎకలాస్ఖాన్పేట, రామాపురం, చాకిరాల గ్రామాలకు చెందిన విద్యార్థులను కరివిరాల మోడల్ స్కూల్కు తీసుకెళ్తుంది. చాకిరాల వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టిన వంతెనపై సంబంధిత కాంట్రాక్టర్ సరిగ్గా మట్టి పూడ్చకపోవడంతో బస్సు రహదారి దిగి వెళ్తుండగా.. వంతెన వద్ద దిగబడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ రోడ్డు పక్కన దిగబడిన బస్సు -
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
మోత్కూరు: మతిస్థిమితం లేని గుర్తుతెలియని వృద్ధుడిని చేరదీసి వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్. వివరాలు.. గుర్తుతెలియని వృద్ధుడు కొద్దిరోజులుగా మోత్కూరు పట్టణంలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఒంటిపై బట్టలు సరిగ్గా లేకపోవడంతో పాటు ఆకలితో అలమటించేవాడు. ఇది గమనించిన మోత్కూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామనర్సయ్య వృద్ధుడిని చేరదీసి కొత్త దుస్తులు ఇప్పించాడు. అతడికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చాడు. అనంతరం అతడిని జనగామ జిల్లా కడవెండి సీతారాంపురంలో గల వృద్ధాశ్రమంలో చేర్పించాడు. కానిస్టేబుల్ మానవతా స్ఫూర్తిని స్థానికులు కొనియాడారు. మతిస్థిమితం లేని వృద్ధుడిని చేరదీత -
మిరప సాగుకు అనువైన సమయం ఇదే..
అంతర పంటలు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ, మిరప చేను చుట్టూ రక్షణ పంటలుగా హైబ్రిడ్ జొన్న లేదా మొక్కజొన్నను రెండు లేదా మూడు సాళ్లలో వేయాలి. కీటక ఆకర్షణ(ఎర) పంటలుగా బంతి, ఆముదాన్ని పొలంలో అక్కడక్కడా వేయాలి.పెద్దవూర: తొలకరి వర్షాలు పడుతుండగా మిరప పంట సాగు చేసుకునేందుకు అనువైన సమయమని ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు. మిరప పంటలో యాజమాన్య పద్ధతుల గురించి ఆయన మాటల్లోనే.. అనువైన నేలలు మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అనుకూలం. వర్షాధారపు పంటకు నల్ల రేగడి నేలలు, నీటి ఆధారపు పంటకు నల్ల, ఎర్ర, చల్క నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, అనుకూలం. వాతావరణం, విత్తే సమయం మిరప పంట అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. అయితే మిరపకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరపను వానాకాలం సీజన్లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరపను సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా మిరప పంటను ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లోనూ, యాసంగిలో అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు చేసుకోవచ్చు. నేల తయారీ పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేప పిండి, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేయాలి. అలాగే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మావిరిడి శిలీంధ్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంధ్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేస్తే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియ దున్నాలి. దీని వలన భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10–15 రోజుల తర్వాత కల్టివేటర్తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి. విత్తనశుద్ధి విత్తనశుద్ధి ద్వారా విత్తనం నుంచి వ్యాపించే చీడపీడల నుంచి పంటను రక్షించవచ్చు. మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 150గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్ను ఒక లీటరు నీటిలో కరిగించి 15 నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు గాను కిలో విత్తనానికి 8గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను విత్తనాలకు పట్టించాలి. దీని వలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి నివారణ జరుగుతుంది. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు గాను కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి. విత్తన మోతాదు మిరపను రెండు పద్ధతుల్లో సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంచుటకు విత్తన మోతాదు సూటి రకాలకు 650గ్రా., హైబ్రిడ్ రకాలైతే 75 నుంచి 100గ్రా. విత్తనం సరిపోతుంది. నారు పెంచే విధానం మిరప నారును రెండు పద్ధతుల్లో పెంచవచ్చు. మిరప నారు పెంచేందుకు సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తారు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అనుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్య దూరం, 1.5 సెం.మీ. లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్ నీటిలో 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి. ప్రోట్రేలలో నారును పెంచే విధానం ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా పెరిగి పంట ఒకేసారి కాపునకు వస్తుంది. నారు ధృడంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎకరా పొలంలో నాటుటకు 98 సెల్స్ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేను నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపిట్ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపిట్తో కప్పుకోవాలి. 6రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి. మొక్కలను నాటుకునే విధానం మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24శ్రీ24 లేదా 26శ్రీ26 లేదా 28శ్రీ28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాల్లో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు ఉండాలి. ఫ ఉద్యానవన శాఖ అధికారి మురళి సూచనలు కలుపు యాజమాన్యం కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తర్వాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఇలా మొక్క నేల మోత్తాన్ని కప్పివేసే వరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్ ఇథైల్ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. -
వర్షంతో పత్తిచేలకు ప్రాణం
సాక్షి,యాదాద్రి : రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షంతో రైతులు సాగుబాట పట్టారు. ఈ వానాకాలం ప్రారంభంలో వర్షాలు సరిగా కురవలేదు. జూన్ నెల మొత్తం కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి 30 వరకు 99.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 57.4 మి.మీ వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్ట, భువనగిరి, అడ్డగూడూరు, బీబీనగర్, మోత్కూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ, ఆలేరు, రాజాపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అడపాదడపా కురిసిన వర్షాలకు అధిక శాతం మంది రైతులు పత్తిసాగు చేశారు. తాగాగా కురుస్తున్న వర్షంతో పత్తి మొలకలకు ప్రాణం పోసినట్టయింది. ఇప్పటికే పత్తిసాగు చేసి మొలకలు రాని రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నష్టమైనా సరే మరోసారి విత్తనాలు నాటుకుంటున్నారు. మొలకలు రాని స్థానంలో కొత్తగా విత్తనాలు విత్తుతున్నారు. మరికొందరు పత్తిచేలల్లో కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇంకొందరు వరినాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి వ్యవసాయ శాఖ జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేసింది. అయితే అకాల వర్షాలతోపాటు రోహిణి కార్తెలోనే సుమారు 70 వేల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. వర్షం రాకపోవడంతో మొలకలు ఎండిపోయాయి. వానాకాలంలో కురవాల్సిన వర్షాలు మొఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ మొలకెత్తని చోట రెండోసారి విత్తనాలు విత్తుకుంటున్న రైతాంగం ఫ జూన్లో వర్షాల్లేక వెనుకబడిన సాగు పనులు జూన్ 30 వరకు వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..) సీజన్ కురవాల్సింది కురిసింది2024 99 116 (16 శాతం అధికం) 2025 99 57.4 (42 శాతం లోటు) -
రామన్నపేట.. పోరుబాట!
అసెంబ్లీ సెగ్మెంట్ను పునరుద్ధరించాలని అఖిలపక్షం డిమాండ్ ఫ నియోజకవర్గ సాధనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న నాయకులు ఫ పాత రామన్నపేట కావాలని తీర్మానం ఫ ఎన్నికల హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి నియోజకవర్గ సాధనకు సమష్టిగా పోరాడుతాం నియోజకవర్గ సాధనకు సమష్టిగా పోరాడుతాం. అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్య నాయకుల మద్దతు కూడగడతాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తాం. – రెబ్బస్ రాములు, అఖిలపక్ష నాయకుడుపూర్వ వైభవం తీసుకురండి రామన్నపేట నియోజకవర్గం రద్దయినప్పటి నుంచి యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. వ్యాపార లావాదేవీలు కూడా స్తంభించాయి. రామన్నపేటకు పూర్వ వైభవం తీసుకురావాలని రాజకీయ నాయకులు, యువకులు, ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. – తిరుమలేష్, పండ్ల వ్యాపారి, రామన్నపేట సాక్షి, యాదాద్రి : పాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2008లో జరిగిన పునర్విభజనలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకునేందుకు ఈ ప్రాంతవాసులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. నియోజవకర్గ సాధనకు సోమవారం రామన్నపేటలో అఖిలపక్ష కమిటీ సమావేశమై చర్చించింది. గతంలో ఉన్నట్టుగానే రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలని కమిటీ నేతలు తీర్మానించారు. గత పునర్విభజనతో రామన్నపేట నియోజకవర్గం కనుమరుగై ఇందులోని నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కలిసిపోయాయి. దీంతో రామన్నపేట ముఖచిత్రం మారిపోయింది. ఉద్ధండ నేతల రాజకీయ భవితవ్యం తారమారైంది. మళ్లీ నియోజకవర్గం కావాలి రామన్నపేట నియోజకవర్గం మళ్లీ ఏర్పాటు కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు రామన్నపేటను నియోజకవర్గంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మరలా నియోజకవర్గం ఏర్పాటు చేస్తే రామన్నపేట మండలంతోపాటు చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, చిట్యాల, వలిగొండ లేదా పోచంపల్లి మండలాలు పరిశీలనలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పునర్విభజనకు ముందు.. 2008 పునర్విభజనకు ముందు రామన్నపేట నియోజకవర్గంగా ఉండేది. వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, ఆత్మకూర్(ఎం), గుండాల మండలాలు, నార్కట్పల్లిలోని మూడు గ్రామాలు నకిరేకల్లోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గం కింద ఉండేవి. రామన్నపేటలోని మండలాలను పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో కలిపారు. మోత్కూరును తుంగతుర్తిలో, గుండాల, ఆత్మకూర్(ఎం)ను, ఆలేరు, వలిగొండ మండలాలను భువనగిరిలో, రామన్నపేటను నకిరేకల్ నియోజకవర్గాల్లో కలిపారు. పాత తాలుకా కేంద్రం నుంచి.. రామన్నపేట మొదట తాలుకా కేంద్రంగా ఉంది. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా మారింది. దీంతో ఎప్పటినుంచో ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, సబ్కోర్టుతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ‘ఉప్పునూతల’ మార్క్ రాజకీయం రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటై 2009లో రద్దయ్యింది. 13 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ, ఏడు సార్లు గెలుపొందింది. పీడీఎఫ్ రెండుసార్లు, సీపీఐ నాలుగు సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఉప్పునూతల పురుషోత్తమ్రెడ్డి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నేతగా మారి చక్రం తిప్పారు. ఈయన 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1973లో జలగం వెంకట్రావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి 1981లో కొమ్ము పాపయ్య గెలుపొంది అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య మంత్రి వర్గంలో పనిచేశారు. కార్యాలయాలకు భవనాలు సిద్ధంగా ఉన్నాయి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు సిద్ధంగా ఉన్నాయి. నైసర్గికంగా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాలకు మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పెద్దల ద్వారా నియోజకవర్గ ఏర్పాటుకు కృషిచేస్తా. – సిరిగిరి మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, రామన్నపేట -
వైభవంగా సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం వైభవంగా శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంపై గల ఉత్తరం దిశలోని మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను వేద మంత్రోత్సరణలతో జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వార బంధనం చేశారు. ధరల నియంత్రణకు మండలస్థాయి కమిటీలురామన్నపేట : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇబ్బంది కలుగకుండా మెటీరియల్ ధరలు, మేసీ్త్రల కూలిరేట్ల నియంత్రణకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం రామన్నపేట మండలం ఉత్తటూరు, రామన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐలతో కూడిన కమిటీ ఇసుక, స్టీల్, సిమెంట్ను మార్కెట్ధర కంటే తక్కువకు ఇప్పిస్తుందన్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామన్నపేటలో కళ్లెం భిక్షమమ్మ అనే లఽబ్ధిదారురాలుకు రూ.10వేల ఆర్థికసాయం అందించారు. ఆయనవెంట తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, ఎంపీడీఓ యాకుబ్నాయక్ ఏఈలు గాలయ్య, సురేష్, కార్యదర్శి ఉపేందర్ ఉన్నారు. దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి వలిగొండ : భూభారతి సదస్సుల్లో వచ్చిన దరకాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం వలిగొండ తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ జితేందర్రెడ్డి, తహసీల్దార్ దశరథ, డీటీ పల్లవి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. మొక్కలు ధ్వంసం.. రూ.10 వేల జరిమానాభువనగిరిటౌన్ : భువనగిరి పెద్ద చెరువు కట్టపై మొక్కలు ధ్వంసం చేసిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించారు. వివరాల ప్రకారం భువనగిరికి చెందిన సాయికుమార్ బుధవా రం తన బైక్పై పెద్దచెరువు కట్టపైకి వచ్చాడు. ఈ క్రమంలో కట్టపైన మొక్కలను విరగ్గొట్టి ధ్వంసం చేశారు. స్థానికులు గమనించి ఫారెక్ట్ అధికారికి సమాచారం ఇవ్వడంతో పాటు, అతడి బైక్ నంబర్ను పంపించారు. సదరు వ్యక్తి వివరాలు ఆరాదీసి అతనికి రూ.10 వేల జరిమానా విధించినట్టు ఫారెస్ట్ భువనగిరి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. -
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చామని.. భవిష్యత్లో మరిన్ని నిధులు తెస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎస్డీఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేకు వెంటనే రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాక్ నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రగతిపై కలెక్టర్ల వివరణ సమావేశంలో ముందుగా నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు.. ఆయా జిల్లాలో నీటిపారుదల, విద్యా, వ్యవసాయం, వైద్యం, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాల్లో ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. -
ఎంజీయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈఓ డాక్టర్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ మొదటి సెమిస్టర్లో 21.76 శాతం, రెండవ సెమిస్టర్ 23.56 శాతం, మూడో సెమిస్టర్లో 31.08 శాతం, నాలుగో సెమిస్టర్లో 36.05 శాతం, ఐదవ సెమిస్టర్లో 37.03 శాతం, ఆరవ సెమిస్టర్లో 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, కోఆర్డినేటర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, భిక్షమయ్య పాల్గొన్నారు. -
నేతన్నకు రుణ విముక్తి
భూదాన్పోచంపల్లి : బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న చేనేత కార్మికులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకొంది. చేనేత కార్మికులను రుణ విముక్తులను చేస్తూ మంగళవారం రుణమాఫీ పథకం కింద 2025–26 బడ్జెట్ నుంచి రూ.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అపెరల్ ఎక్స్పోర్ట్ పార్ుక్స కమిషనర్కు ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులైన నేతన్నలకు చెల్లించేందుకు పూర్తి అధికారం ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2017 నుంచి 31 మార్చి 2024 వరకు చేనేత కార్మికులు తీసుకొన్న రుణాలకే మాఫీ వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చింది. ముఖ్యంగా వృత్తిపై తీసుకొన్న రుణాలు, చేనేత వస్త్రాల ఉత్పత్తికి, వృత్తి సంబంధ కార్యకలాపాలు, వ్యక్తిగత, ముద్ర రుణాలన్నింటి మాఫీ కానున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయా బ్యాంకులలో రూ.లక్షలోపు రుణాలు తీసుకొన్న 1,162 మంది చేనేత కార్మికులకు రూ.8 కోట్ల 4 లక్షలు రుణమాఫీ జరుగనుంది. అంతేకాక మరో 1,560 మంది లక్షకుపైగా రుణాలు తీసుకొన్నారు. వీరు రూ.లక్షపైన ఉన్న రుణ మొత్తాన్ని వెంటనే చెల్లిస్తే వారికి సైతం రూ.15.60 కోట్ల రుణమాఫీ వర్తించనుంది. యాదాద్రి జిల్లాలో మొత్తం 2,722 మందికి రూ.23.64 కోట్ల రుణవిముక్తి లభించనుంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 604 మంది కార్మికులకు రూ.3.04 కోట్ల రుణమాఫీ కానుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 3,326 మందికి రూ.26.68 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఫ రుణమాఫీ పథకానికి రూ.33 కోట్ల నిధులు మంజూరు ఫ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫ చేనేత కార్మికుల్లో ఆనందం -
ప్రజా ప్రభుత్వం.. సంక్షేమమే ధ్యేయం
పథకాల అమలు తీరును అధికారులు పర్యవేక్షించాలిఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఫ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై నల్లగొండ కలెక్టరేట్లో సమీక్ష ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ ఆయా రంగాల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్లు నల్లగొండ : అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలిసి సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అర్హులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను మండలస్థాయి అధికారులతో జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షించాలన్నారు. రైతు భరోసా, బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా అభివృద్ధికి 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కిరణ్కుమార్రెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, నల్లగొండ ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. -
అవినీతికి ఆస్కారం ఉండొద్దు
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్కుమార్.. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తమదే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పదేళ్లు నిర్లక్ష్యానికి గురైందని.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో త్వరలోనే పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ పనులను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని.. మేము వచ్చాకే నీటికేటాయింపులుచేసి నిధులు కూడా మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలతో పాటు లిప్టులు, హైలెవల్ కెనాల్ లైనింగ్కు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. అయిటిపాముల, గంధమల్ల రిజర్వాయర్లకు రూ.500 కోట్లు మంజూరు చేసి సీఎంతో పనులు ప్రారంభించామన్నారు. రాచకాల్వ మరమ్మతు పనులు చేయాలని ఎంపీ కిరణ్కుమార్రెడ్డి కోరారని వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. -
సిబ్బంది కొరతతో ఇబ్బంది
ఆలేరు మున్సిపాలిటీలో 12వార్డులు..20 వేల జనాభా ఉంది. మొత్తం పారిశుద్ధ్య సిబ్బంది 44మంది ఉండగా ఇందులో ఇద్దరు రెగ్యులర్ సిబ్బంది కాగా ఆరుగురు డ్రైవర్లు, మిగతా 38మంది చెత్త సేకరణ, మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. వీరిపై పర్యవేక్షణకు ఇద్దరు జవాన్లు ఉన్నారు. 10వేల జనాభాకు సుమారు 28మంది సిబ్బంది ఉండాలనేది నిబంధన. ఆలేరులో ఉన్న 20వేల జనాభాకు 56మంది పారిశుద్ధ్య సిబ్బంది కావాల్సి ఉన్నా 44మందే ఉన్నారు. సిబ్బంది కొరతపై రెండేళ్ల క్రితమే సీడీఎంఏకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపినా నియమించలేదు. ఫలితంగా అన్ని కాలనీల్లో చెత్త సేకరణకు ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బంది కొరత విషయాన్ని మరలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ శ్రీనివాస్ అంటున్నారు. దోమలతో వేగలేకపోతున్నాం.. చాలా కాలనీల్లో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన చెత్త వేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు కాలనీల్లో ఫాంగింగ్ కొట్టాలి. చెత్త వేయకుండా ప్రజలకు సూచనలు చేయాలి. పందుల సమస్యను పరిష్కరించాలి. – మార్గం వెంకటేశ్, ఆలేరు -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
చౌటుప్పల్ : ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అన్నారు. చౌటుప్పల్లోని ప్రభుత్వాసుపత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. అన్ని రకాల బ్లాకులను కలియదిరిగారు. వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న వసతులు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్తో మాట్లాడి ఆసుపత్రి పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంద పడకల అసుపత్రి ప్రారంభం అయితే ఎన్నో ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సాధారణ పర్యటనలో భాగంగానే తాను ఇక్కడికి విచ్చేశానని పేర్కొన్నారు. ఇక్కడ చూసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, ఆర్డీఓ వెల్మ శేఖర్రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ చిన్నూనాయక్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ యశోద, ఏసీపీ పటోళ్ల మదుసూధన్రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అలివేలు, మండల వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటంరాజు, సీఐ మన్మథకుమార్, ఆర్ఐ సుధాకర్ ఉన్నారు. ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఫ చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన -
నేడు యాదగిరిగుట్టకు మంత్రి ‘అడ్లూరి’ రాక
యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట రూరల్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రానున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. శ్రీస్వామి వారిని దర్శించుకుని అనంతరం మంత్రి యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి భువనగిరి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు పేద ప్రజలకు ఇసుక, సిమెంట్, స్టీల్, గ్రానైట్ వ్యాపారులతోపాటు, తాపీ మేసీ్త్రలు సహకరించాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. జూన్ 30 సాక్షి దినపత్రికలో ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించారు. ఇందులో భాగంగా మంగళవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో సిమెంట్, స్టీలు యాజమానులు, ఇసుక, గ్రానైట్, తాపీ మేసీ్త్రలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. భువనగిరి మండలంలో 743, పట్టణంలో 580 ఇళ్లు మంజూరు చేశామన్నారు. గృహనిర్మాణ మెటీరియల్ ధరలను పెంచడం వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. పాత ధరల ప్రకారమే అమ్మాలన్నారు. సమావేశంలో డీఏఓ మందడి ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ దినాకర్, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, అనిల్కుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, ప్రదీప్, నర్సింహ, నానం కృష్ణ,, ఇసుక, స్టీలు, సిమెంట్, గ్రానైట్ యాజమాన్యాలు, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్ : దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలోని వివిధ వర్గాల దివ్యాంగులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఉపకరణాల కో సం ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ 49, బ్యాటరీ వీల్ చైర్స్ 15, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్ 20, బ్యాటరీ మినీ ట్రెండింగ్ ఆటోవెహికల్ 1, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ వీల్ 5, లాప్టాప్ డిగ్రీ స్టూడెంట్స్ 16, లాప్టాప్ హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ 7, టాబ్స్ 12, 5జీ స్మార్ట్ఫోన్ 2, ట్రై సైకిల్స్ 6, వీల్ చైర్స్ 6, క్రచ్చెస్ 25, ఇయరింగ్ ఎయిడ్ 2, వాకింగ్ స్టిక్స్ 25 స్మార్ట్ కేనన్స్ 12, ఎంసీఆర్ చాఫల్ 12, సహాయ ఉపకరణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కావాల్సిన ఉపకారణాల కోసం https-://tgobmms.cgg.gov.in ఆన్లైన్ వెబ్సైట్లో ఈనెల 5తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సగటు వర్షపాతం 83 మిల్లీమీటర్లు భువనగిరిటౌన్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం సగటున 83 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదూంది. రాజాపేట మండలంలో అత్యధికంగా 44.5 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. అలాగే ఆలేరులో 44, మోత్కూరు 41, ఆత్మకూర్(ఎం) 41, అడ్డగూడూరు 39 మి.మీ. వర్షం కురిసింది. బొమ్మలరామారం మండలంలో 39, యాదగిరిగుట్ట 38, భువనగిరి 28, గుండాల 25, బీబీనగర్ 24, తుర్కపల్లి మండలంలో 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈఏపీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆలస్యంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఈఏపీ సెట్ విద్యార్థుల సర్టిఫికేషన్ ప్రక్రియ సర్వర్ బిజీతో ఆలస్యంగా కొనసాగింది. సర్వర్ బిజీగా ఉండడంతో మధ్యాహ్నం వరకు కూడా 10 నుంచి 15మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మాత్రమే అధికారులు వెరిఫికేషన్ చేశారు. దీంతో విద్యార్థులు, వారితో వచ్చిన తల్లిదండ్రులకు నిరీక్షణ తప్పలేదు. మధ్యాహ్నం తరువాత సర్వర్ మంచిగా పనిచేయడంతో వెరిఫికేషన్ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. సాయంత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసే వరకు 165 మంది పాల్గొన్నారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
వీధుల్లో చెత్త కుంపటి
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! ఫ ఎక్కడ చూసినా చెత్తకుప్పలే.. ఫ రహదారుల వెంట దుర్గంధం ఫ ప్రతిరోజూ శుభ్రం చేయని సిబ్బంది ఫ అంతటా ప్రబలుతున్న దోమలు ఫ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని ప్రజల్లో భయాందోళన మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రజల్లో అవగాహన లోపంతో ఎక్కడబడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీనికితోడు మున్సిపల్ సిబ్బంది ప్రధాన రోడ్లను శుభ్రం చేస్తున్నారే తప్పితే కాలనీల్లోని వీధులు, ఖాళీ స్థలాల్లో వేస్తున్న చెత్తను పట్టించుకోవడం లేదు. దీంతో సందు రోడ్ల పక్కన, కాలనీల్లోని ఇళ్ల మధ్యన చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని.. ఫలితంగా దోమల బెడద పెరుగుతోందని మున్సిపాలిటీల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక కొనసాగుతున్నప్పటికీ అది ప్రధాన రోడ్ల శుభ్రతకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున మున్సిపల్ అధికారులు స్పందించి ప్రతిరోజూ చెత్తను తొలగింపజేస్తూ వీధులు, రోడ్లను శుభ్రంంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. మున్సిపల్ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. మొత్తం 225 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించాల్సి ఉండగా 179 మాత్రమే పని చేస్తున్నారు. సిబ్బంది కొరతతో అన్ని కాలనీల్లో గల్లీలు, రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న వారికి నామమాత్రంగా జరిమానా విధిస్తున్నారు. సకాలంలో చెత్త ట్రాక్టర్లు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక, మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించక పోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. తద్వారా మలేరియా, టైపాయిడ్, డెంగీ తదితర వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. 13 వార్డులకు మూడు వాహనాలు భూదాన్పోచంపల్లి : భూదాన్పోచంపల్లి మున్సి పాలిటీలో 22వేల జనాభా ఉంది. జనాభా ప్రతిపాదికన కనీసం 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. కానీ, 34 మందే ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల మెయిన్ రోడ్డు మినహా మున్సిపాలిటీలో గల 13 వార్డుల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలేదు. అన్ని వార్డులకు మూడు చెత్త ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. పాత బస్టాండ్, సాయినగర్ నుంచి నారాయణగిరికి వెళ్లే ప్రధాన దారి పక్కనే చెత్తను పారబోస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. లక్ష్మణ్నగర్ కాలనీలో ఇళ్ల మధ్యనే మురుగునీరు చేరి ఉంది. మోడల్స్కూల్ సమీపంలో చెత్తడంపింగ్ యార్డు వల్ల దుర్వాసన వస్తోంది. పట్టణంలో అమృత్ పైప్లైన్ పనులు జరుగుతుండడంతో చాలా చోట్ల పైపులు పగిలి తాగునీరు కలుషితమవుతుంది. ఇప్పటి వరకు నీళ్లట్యాంకులను శుభ్రం పరిచి బ్లీచింగ్ చేసింది లేదు. -
ప్రతిరోజూ చెత్త సేకరించట్లే..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీలో 40 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్ల ద్వారా రోజూ 5.50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఖాళీ స్థలాలతోపాటు కొన్ని వార్డుల్లో పాడుబడిన బావిబొందల్లో చెత్తను పోస్తున్నారు. కొన్ని వార్డుల్లో డైలీగా శుభ్రం చేయడంలేదు. హనుమాన్ వాడ, గడి బజార్కు చెత్త వాహనం రావడంలేదని, రెండు మూడు రోజులకు ఒకసారి చెత్తను తాము తగబెడుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. ఇందిరానగర్ కాలనీలో ప్రధాన రోడ్డు వెంట మురుగునీరు నిలుస్తుండడంతో దోమలు ప్రబలుతున్నాయి. నూతనంగా మురుగు కాల్వను నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
రోజు విడిచి రోజు చెత్త సేకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో చెత్త నిర్వహణ అంతంతగానే ఉంది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 31,303మంది జనాభా, 8500 ఇళ్లు ఉన్నాయి. చెత్త నిర్వహణకు రెండు ట్రాక్టర్లు, 10 ఆటోలు ఉండగా ట్రాక్టర్లు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా ఆటోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఒక్కో ఆటో వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తున్నాయి. చాలా మంది చెత్తను ఆటోల్లో వేయకుండా వీధుల్లో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు వ్యాప్తిచెందాయి. చెత్త ఎక్కడబడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
పరిశ్రమల్లో భద్రత ఎంత?
సాక్షి, యాదాద్రి, చౌటుప్పల్ రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించి పంద మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటన వల్ల గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని రసాయన పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 50కి.మీ. దూరానికి తరలించాలనే నిర్ణయించింది. దీంతో వందల సంఖ్యలో పరిశ్రమలు జిల్లాలోని పలు మండలాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో భద్రత చర్యలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. జిల్లాలోని ఉన్న పేలుడు, ఫార్మా కంపెనీల్లో తరుచూ ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సోమవారం పాశమైలారంలో జరిగిన ప్రమాదంతో అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు భయం భయంగా విధులకు వెళ్తున్నారు. ఫార్మా కంపెనీలకు అడ్డాగా.. జిల్లాలోని భువనగిరి పారిశ్రామిక వాడ, రాయిగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లోని నెమరగోముల, కొండమడుగు, బీబీనగర్, యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, దండుమల్కాపురం, దేవలమ్మ నాగారం, ఎల్లంభావి, తంగడపల్లి, చౌటుప్పల్, ధర్మోజిగూడెం, లింగోజిగూడెం, ఆరెగూడెం, పంతంగి, ఎస్,లింగోటం మందోళ్లగూడెం, చిన్న కొండూరు, జైకేసారం, పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, ఆలేరు మండలం టంగుటూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పేలుడు పదార్థాల తయారీ, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు గాలికి.. పరిశ్రమలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రియాక్టర్లు, బ్రాయిలర్లు పేలి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్లు పేలినప్పుడు రసాయనాలు శరీరంపై పడి కాలిపోయి, పొగతో ఊపిరాడక చనిపోతారు. రియాక్టర్ల వద్ద పనిచేసే కార్మికులు ఆక్సిజన్ ఫైర్ కోట్లు ధరించాలి. ఫోం అందుబాటులో ఉండాలి. కాలం చెల్లిన రియాక్టర్లతో కంపెనీల యాజమాన్యాలు, నైపుణ్యంలేని కార్మికులతో పనులు చేయిస్తున్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఫ ఫార్మా, పేలుడు పదార్థాల తయారీ కంపెనీల్లో తరచూ ప్రమాదాలు ఫ గాల్లో దీపంలా కార్మికు ప్రాణాలు ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ఫ పాశమైలారం ఘటనతో జిల్లాలోని కార్మికుల్లో తీవ్ర భయాందోళన తనిఖీల ఊసేలేదు ! వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశ్రమల ఇన్స్పెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్,భూగర్భ గనుల శాఖ,కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. కానీ ఈ అధికారులు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. కనీసం కార్యాలయాల చిరునామా సైతం తెలియని దుస్థితి నెలకొంది. దీంతో పరిశ్రమల నిర్వహణలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శించడం, భద్రతా చర్యలు పాటించకపోవడం, కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం వంటి వాటితో కార్మికులు ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు
భువనగిరి : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం భవనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా అప్రొఫ్రియేట్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. లింగ నిర్థారణకు పాల్పడితే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 8074261809 ఫిర్యాదు చేయవచ్చన్నారు. ముందుగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేట్ కట్ చేసి వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో జిల్లా సెషన్స్ జడ్జి జయరాజు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఏడీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ మనోహార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్ సాయి శోభ, ప్రమీల, డెమో అంజయ్య, వసంతకుమారి పాల్గొన్నారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
కోదాడరూరల్: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ గ్రామానికి చెందిన శ్రీపాది గోపి, నాగేశ్వరి దంపతులకు కుమారుడు మహదేవ్(20 నెలలు) ఉన్నాడు. గోపి మంగళవారం మిర్యాలగూడలో కార్పెంటర్ పనికి వెళ్లగా.. నాగేశ్వరి కుమారుడితో కలిసి ఇంటి వద్దే ఉంది. మధ్యాహ్నం సమయంలో నాగేశ్వరి కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రించింది. ఈ క్రమంలో మహదేవ్ నిద్రలేచి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడ్డాడు. అరగంట తర్వాత నాగేశ్వరికి మెళుకువ వచ్చి చూడగా పక్కన కుమారుడు లేకపోవడంతో సంపులో చూడగా అందులో మహదేవ్ మృతిచెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రి గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. అనిల్రెడ్డి తెలిపారు. -
కల్వర్టు గోడను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కట్టంగూర్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ హైవేపై కల్వర్టు గోడను ఢీకొట్టడంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీఆర్ ట్రావెల్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి 30మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యలో కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల కల్వర్టు గోడను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ కావడంతో బయటకు వెళ్లలేకపోయారు. సమాచారం తెలుసుకున్న కట్టంగూర్ 108 సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సు అత్యవసర డోర్ను ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సత్యవతి, లక్ష్మి, గణపతిరెడ్డితో పాటు మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు ఓనర్ ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. రవీందర్ తెలిపారు.ఫ 10 మంది ప్రయాణికులకు గాయాలు -
మోసంచేసి పారిపోయిన చిట్టీల వ్యాపారి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: ఎంతో నమ్మకంగా ఉంటూ 46 మందితో చిట్టీలు కట్టించుకుని మోసంచేసి పారిపోయిన చిట్టీల వ్యాపారిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను టూటౌన్ సీఐ సోమనర్సయ్య మంగళవారం విలేకరులకు వెల్లడించారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన కటకం సైదిరెడ్డి గత కొన్నేళ్లుగా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో నివాసముంటూ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కాలనీవాసులతో పరిచయం పెంచుకుని చిట్టీలు వేయడం ప్రారంభించాడు. 46మంది కాలనీవాసులు అతడి వద్ద చిట్టీలు వేశారు. మొదట్లో బాగానే చిట్టీ డబ్బులు చెల్లించిన సైదిరెడ్డి కొంతకాలంగా చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేస్తున్నాడు. అంతేకాకుండా అధిక వడ్డీ ఆశ చూపి 42 మంది నుంచి రూ.1.50కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల చిట్టీ పాడినవారు డబ్బుల కోసం సైదులు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖరరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్హాల్ వద్ద సైదిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సైదిరెడ్డి పారిపోయేందుకు సహకరించిన శాంతినగర్కు చెందిన కటకం వెంకట్రెడ్డి, ముత్తిరెడ్డికాలనీకి చెందిన మామిళ్ల వెంకన్న, రామ్నగర్కు చెందిన గుణగంటి జానయ్యను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. చిట్టీలు కట్టిన బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐలు బి. రాంబాబు, డి. హరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ అతడికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు -
పథకం ప్రకారమే వివాహిత హత్య..?
గుర్రంపోడు: గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ సోమవారం అదే గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం చేసి ఇంజెక్షన్ ద్వారా ఆమెకు గడ్డి మందు ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నప్పటికీ.. తనను వివాహిత బ్లాక్మెయిల్ చేస్తున్నందునే ఆమెను పాశవికంగా హత్య చేశానని నిందితుడు చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ బలమైన కారణంతోనే నిందితుడు ఆమెను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి, నిందితుడి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాట్సాప్, ఫోన్కాల్ డేటాను సేకరిస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో మృతురాలు డాక్టర్కు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు గడ్డి మందు(ట్రైకాట్) డబ్బాను గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం నుంచి పది రోజుల ముందే కొనుగోలు చేసి కారులో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడ్డి మందు డబ్బాపై గల బ్యాచ్ నంబర్ను బట్టి గుర్రంపోడు మండల కేంద్రంలోనే గడ్డి మందు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి స్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామం కాగా.. అతడు ఎనిమిదేళ్లు అక్కడే ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేశాడు. నిందితుడి తోడల్లుడు గుర్రంపోడు మండలం వట్టికోడు గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా స్థిరపడడంతో అతడి ద్వారా జూనూతల గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు లేడని తెలుసుకుని ఇక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాపిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది. అంతుచిక్కని నిందితుడి నైజం.. నిందితుడు మహేష్ జూనూతల గ్రామంలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నా అతడు ముభావంగా ఉంటూ కనీసం ఇంటి పక్కన వాళ్లతోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, అతడికి గ్రామంలో ఏ ఒక్కరితోనూ మిత్రుత్వం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నిందితుడు గతంలోనూ తన బంధువుకు ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపగా.. ఈ విషయంపై వారు రాజీపడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఫ నిందితుడి తీరుపై పలు అనుమానాలు ఫ కొనసాగుతున్న విచారణ ఫ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు
భూదాన్పోచంపల్లి: కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పదో వార్డులో జింకల వెంకటమ్మ ఒంటరి నివాసముంటోంది. మంగళవారం సాయంత్రం కోతుల గుంపు వెంకటమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమైపె దాడి చేశాయి. భయంతో ఆమె బయటకు వచ్చే క్రమంలో కిందపడిపోయింది. దీంతో తుంటి ఎముక విరిగింది. ఇరుగుపొరుగు వారు వచ్చి కర్రలతో కోతులను తరిమేశారు. గాయపడిన వెంకటమ్మను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. తేలు కాటుతో నాలుగేళ్ల బాలుడు మృతినకిరేకల్: తేలు కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నకిరేకల్ మండలం పాలెం గ్రామ శివారులోని టేకులగూడెంలో నివాసముంటున్న పక్కీరు పురుషోత్తంరెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె 3వ తరగతి చదువుతుండగా.. కుమారుడు రుత్విక్రెడ్డి(4) పాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. గత నెల 29న రుత్విక్రెడ్డికి ఇంట్లో తల్లి స్నానం చేయించి అతడికి నిక్కర్ తొడిగింది. అప్పటికే నిక్కర్లో ఉన్న తేలు రుత్విక్రెడ్డిని కుట్టడంతో అతడు కేకలు వేశాడు. వెంటనే బాలుడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి తండ్రి పురుషోత్తంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలోకి రైతుఫ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది వేములపల్లి: విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన రైతు ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటన వేములపలల్లి మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. మాడుగులపల్లి మండలం ఇసుకబాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వల్లపుదాసు చంద్రయ్య మంగళవారం వేములపల్లి గ్రామ శివారులోని తన పొలం వద్ద బోరుకు మోటారు బిగించేందుకు వెళ్లాడు. బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమీపంలోని రైతు మంచికంటి వెంకట్రెడ్డి గమనించి ఫోన్ ద్వారా 108 సిబ్బందికి, చంద్రయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది వెలిజాల సైదులు, పగిళ్ల జానకిరాములు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న చంద్రయ్యకు సీపీఆర్ చేయగా అతడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంకొండమల్లేపల్లి: బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డు పక్కన ఐరన్ గ్రిల్స్ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఐతరాజు అజయ్(22) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఐతరాజు అంజి కొండమల్లేపల్లిలోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వీరిద్దరు బైక్పై కొండమల్లేపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో శక్రునాయక్తండా సమీపంలో గల పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ఐరన్ గ్రిల్స్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెనుక కూర్చున్న అంజికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
బండరాయి మీద పడి యువకుడి మృతి
మోత్కూరు: బండరాయి కొడుతుండగా.. ప్రమాదవశాత్తు మీద పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడేనికి చెందిన షేక్ నాగుల్మీరా (31), మరో ఆరుగురు కలిసి మంగళవారం బుజిలాపురం గ్రామ ప్రధాన రహదారి వెంట బీరప్ప గుడి వద్ద గల గుట్ట దగ్గర బండ కొట్టే పనికి వెళ్లారు. పెద్ద బండరాయిని కొడుతుండగా.. అందులో నుంచి ఒక బండ ఊడి షేక్ నాగుల్మీరా మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడితో ఉన్న ఇమామ్ (మామ), షేక్ హోలి, షేక్ జాన్బాషా, షేక్ మౌలానా, షేక్ పక్కీర్లు బండ పైనుంచి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. నాగుల్మీరాను వెంటనే అంబులెన్స్లో మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇమామ్బీ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని మోత్కూరు ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నీళ్లొస్తాయా.. బీళ్లుగానే ఉంటాయా..!
సూర్యాపేట: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ ఆయకట్టు రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గత మూడు సీజన్ల నుంచి ఈ ఆయకట్టు పొలాలు ఎండుతూనే ఉన్నాయి. ప్రధాన కాల్వ మినహా ఎక్కడా నీరు పారని పరిస్థితి. ఈ నేపథ్యంలో సూర్యాపేటతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 2.20 లక్షలకు పైగా ఆయకట్టు భూములున్నా.. కనీసం 60 నుంచి 70వేల ఎకరాల్లో కూడా పంటలు పండిన దాఖలు లేవు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఈసారైనా తమ భూములకు నీళ్లు వస్తాయా..? బీడు భూములుగానే ఉంటాయా..? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. నాన్ ఆయకట్టు నుంచి.. 2018కు ముందు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు పూర్తిగా నాన్ ఆయకట్టు ప్రాంతాలు. కేవలం వర్షాధార పంటలే పండేవి. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాలు కలిపి 2,29,961 ఎకరాలు నాగార్జునసాగర్, 15,230 ఎకరాలు మూసీ ఆయకట్టు కింద ఉండేది. 2018 వానాకాలం నుంచి 2023 వానాకాలం వరకు రెండు పంటలకూ నీళ్లు అందాయి. ఈ సమయంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో మెట్ట పంటలను సాగు చేసిన రైతులంతా వరి వైపు మళ్లారు. వేలాది రూపాయలు వెచ్చించి మెట్ట భూములను తరి భూములుగా మార్చారు. దీంతో సూర్యాపేట జిల్లాలో ఓ వైపు కృష్ణమ్మ, మరోవైపు మూసీనది, ఇంకోవైపు గోదావరి జలాలు పారడంతో త్రివేణి సంగమ జిల్లాగా మారిపోయి దాదాపు 5,85,464 ఎకరాల ఆయకట్టులో వరి పండింది. గత మూడు సీజన్ల నుంచి ఇబ్బందులు.. 2023 యాసంగి నుంచి సూర్యాపేట జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు వచ్చాయి. వర్షాభావ పరిస్థితులతో ఈ సీజన్లో ఆరు తడి పంటలకు మాత్రమే నీటిని వదిలారు. అయినా కొందరు వరినాట్లు, మరికొందరు ఆరుతడి పంటలు వేసి తీవ్రంగా నష్టపోయారు. 2024 –25 వానాకాలంలో చాలా ఆలస్యంగా సెప్టెంబర్ మాసంలో నీటిని విడుదల చేశారు. అప్పటికే పంటల కాలం చివరి దశకు రాగా.. జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములన్నీ పడావు పడి ఉన్నాయి. 2024–25 యాసంగిలో ఎస్సారెస్పీ మొదలుకొని ఎల్ఎండీ వరకు సమృద్ధిగా జలాలు ఉన్నప్పటికీ అరకొర నీటినే విడుదల చేశారు. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని భూములకు మాత్రమే నీళ్లు అందాయి. ఇక సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మొయిన్ కాలువ వెంట అందగా, కోదాడ నియోజకవర్గంలోని మోతె, కోదాడ మండలాల వరకు నీళ్లు రానేలేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన క్రమంలో నీటిపారుదల శాఖ యాక్షన్ ప్లాన్లో జిల్లాలోని ఎస్సారెస్సీ రెండోదశకు పూర్తిస్ధాయిలో నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఆయకట్టు రైతాంగం కోరుకుంటుంది. ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు రైతన్నల ఆందోళన ఫ ఇప్పటికే మూడు సీజన్ల నుంచి ఎండుతున్న ఆయకట్టు పొలాలు ఫ 70వేల ఎకరాలకు మించి అందని నీళ్లు ఫ సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 2.20లక్షల ఎకరాల ఆయకట్టు -
లోతు దుక్కులతో బహుళ ప్రయోజనాలు
త్రిపురారం: వానాకాలం సాగులో భాగంగా తొలకరి వర్షాలు కురిసిన తర్వాత రైతులు దుక్కులు దున్నుకోవడం మొదలుపెడతారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో మాత్రం తొలకరి తర్వాత కాస్త ఆలస్యంగా దుక్కులు దున్ని విత్తనాలు పెడతారు. అయితే లోతు దుక్కులు దున్నుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఫ తొలకరి వర్షాలు కురిసిన తర్వాత ట్రాక్టర్ ఫ్లవ్, రోటావేటర్ల ద్వారా పొలాన్ని దున్నుకోవచ్చు. ఫ లోతు దుక్కులు దున్నడం వలన పొలంలో కలుపు మొక్కలు పెకలించబడతాయి. దీంతో పంటల సాగులో కలుపు సమస్య తగ్గుతుంది. ఫ భూమి లోపలి గట్టి పొరలు పగలడం వల్ల మొక్కల వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని వెళ్తాయి. వేరు వ్యవస్థ నేలలోకి బాగా విస్తరించడం వల్ల మొక్కల ఎదుగుదలకు కావాల్సిన తేమ, పోషకాలు అందుతాయి. ఫ పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను అభివృద్ధి పరుచుటకు లోతు దుక్కులు తోడ్పడతాయి. ఫ పంటలకు ఆశించే శిలీంధ్రాలు సైతం లోతు దుక్కులతో ఎండ తాకిడికి చనిపోతాయి. ఫ వివిధ పంటల్లో వచ్చే ఎండు తెగులు అదుపులో ఉంటుంది. ఫ సరైన సమయంలో దుక్కులు దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకి తేమ శాతం వృద్ధి చెందుతుంది. ఫ దీంతో నేల గుల్లబారి విత్తనం నాటేందుకు అనుకూలంగా మారుతుంది. తద్వారా మొలక శాతం పెరుగుతుంది. ఫ అంతేకాకుండా పంట మొదళ్లు, ఆకులు, చెత్త నేలలో కలిసిపోయి సేంద్రియ పదార్థంగా మారి నేల సారవంతంగా మారుతుంది. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు -
విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరు
సాక్షి, యాదాద్రి: జిల్లాకు విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరైంది. ఇప్పటి వరకు నల్లగొండలోని స్టోర్ నుంచి మెటీరియల్ను డ్రా చేస్తున్నారు. యాదాద్రి జిల్లాకు స్టోర్ మంజూరుతో రైతులు, వినియోగదారులు, విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు తొలగనున్నాయి. నల్లగొండకు వెళ్లి మెటీరియల్ డ్రా చేయడం తప్పుతుంది. కాగా స్టోర్ ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం కావాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కలెక్టర్ హనుమంతరావును కోరారు. బీబీనగర్ మండలం గూడూరు రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 69లో ఐదు ఎకరాల భూమి ఖరారైందని, అప్పగించడానికి రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముగిసిన బేస్లైన్ పరీక్షలు భువనగిరి: గత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ విద్యార్థులు సాధించిన కనీస అభ్యసన లక్ష్యాలను అంచనా వేసేందుకు జిల్లా విద్యాశాఖ జూన్ 25నుంచి నిర్వహిస్తున్న బేస్లైన్(ప్రాథమిక) పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 715 ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు బేస్లైన్ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 15లోగా ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నారు. తిరిగి నవంబర్ మిడ్లైన్, మార్చిలో ఎండ్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. అన్నప్రసాద వితరణకు రూ.25 లక్షల విరాళం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వితరణ చేసే నిత్యాన్నదాన ప్రసాద పథకానికి హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణరాజు రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. సోమవారం యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం తన మనుమడు అనంత్ ఇషాన్ పేరున ఈఓ వెంకట్రావ్కు చెక్కు అందజేశారు. . వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా శ్రీనివాస్గౌడ్ ఆలేరు: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్గౌడ్ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియమించారు. సోమవారం ఆయన వరంగల్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్గౌడ్ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, పలువురు నాయకులు సన్మానించారు. దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025 సంవత్సరానికి గాను అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు nationalawardstoteachers.ed ucation.gov.in లో ల వెబ్సైట్ ద్వారా నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. అనధికార ప్లాట్ల పరిశీలన ఆలేరురూరల్: ఆలేరు మండలం శారాజీపేట రెవెన్యూ పరిధిలో అనధికారిక ప్లాట్లను సోమవారం లోకాయుక్త బృందం పరిశీలించింది. సర్వే నంబర్ 76లోని రెండు ఎకరాల భూమిని ఓ రైతు వద్ద వజ్జె రజినీ అనే వ్యక్తి 2008 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. అనుమతి పొందకుండా లేఅవుట్ చేసి అందులో 270కి పైగా ప్లాట్లను విక్రయించాడు. ఈ విషయంపై బా ధితులు పలుమార్లు ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. లోకాయుక్తను ఆశ్రయించడంతో ప్రతినిధుల బృందం ప్లాట్లను పరిశీలించింది. కార్యక్రమంలో లోకాయుక్త విచారణ అధికారి మత్తువ్కుషి, వెంకట్రావు, సుధాకర్, శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, సీఐ కొండల్రావు, డీటీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల డాక్టర్ రంగారెడ్డి
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత 5 రూపాయలకే వైద్యసేవలు ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునేడు డాక్టర్స్డే రైతు కుటుంబం నుంచి వచ్చి.. మా సొంతూరు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రం. మాది రైతు కుటుంబం. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. పేదలందరికీ వైద్యం అందుబాటులో తేవాలన్న తపనతో సూర్యాపేట పట్టణంలో ఆస్పత్రి నెలకొల్పాను. మొదట రూ.5కే ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓపీ ఫీజు రూ.7, కొన్ని రోజులకు రూ.10, కొన్నాళ్లకు రూ.15చేశాను. ప్రస్తుతం రూ.20లకు ఓపీ చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చే రోగులు అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉండడం చేత మందులు కూడా తక్కువ ధరకు దొరికేవి, నాణ్యతగా ఉండేవి రాస్తాను. సూర్యాపేట అర్బన్: పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి వైద్య శిబిరాలతో పాటు అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే.. -
చాడ చెరువునూ కొల్లగొట్టారు
మోటకొండూరు మండలం చాడ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలించారు. సదరు వ్యక్తి మూడు దఫాలు 52,500 టన్నుల మట్టికి అనుమతులు పొందాడు. కానీ, అందుకు విరుద్ధంగా ఏప్రిల్, మే మాసాల్లో వెయ్యి టిప్పర్లకు పైనే మట్టి తరలించాడని తెలుస్తోంది. తరించిన మట్టిని కాటేపల్లి– ముస్త్యాలపల్లి మధ్య 40 ఎకరాల భూమి లీజుకు తీసుకుని అక్కడ నిల్వచేశాడు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. తుర్కపల్లి, బీబీనగర్, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, అడ్డగూడూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గుట్టలు, చెరువుల నుంచి నిత్యం వందల టిప్పర్ల మట్టి తరలిపోతోంది. -
డీసీసీబీ టర్నోవర్ రూ.598.16 కోట్లు
నల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లుకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీబీలో కేక్ కట్చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు. ఫ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
అధునాతన సేవలపై ప్రజలకు తెలియజేయాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందజేస్తున్న అధునాతన వైద్యసేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మెడికల్ కళాశాల మానిటరింగ్ కమిటీ సభ్యులు డీఎంఈ నరేందర్, మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర, భువనగిరి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్రెడ్డి, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీసీఎహెచ్ఎస్ చిన్ననాయక్తో కలిసి సోమవారం ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు. వివిధ విభాగాలు, బ్లడ్ బ్యాంకు, నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోగులకు అందజేస్తున్న వైద్య సేవలు, ఇతర అంశాలపై సమీక్షించారు. మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మెడికల్ కళాశాలలో అవసరమైన వసతులు ఉండాలని, భోదన, భోదనేతర సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఖాళీల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
వినతులు స్వీకరించి.. మొర ఆలకించి
భువనగిరిటౌన్ : సమస్యల పరిష్కార వేదిక ప్రజా వాణికి సోమవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. మొత్తం 86 అర్జీలు రాగా అత్యధికంగా భూసమస్యలకు సంబంధించి 54 మంది దరఖాస్తులు ఇచ్చారు. పంచాయతీరాజ్ 8, వ్యవసాయ 4, ఇరిగేషన్ 3, సంక్షేమం 3, హౌసింగ్ 2, కో పరేటివ్ 2, విద్య 2, గ్రామీణాభివద్ధి 2, ఎస్సీ కార్పొరేషన్ 2, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, పోలీసు శాఖకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినతులు స్వీకరించిన వారిలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. వినతుల్లో కొన్ని.. ● తనకు 2.01 ఎకరాల భూమి ఉండగా 39 గుంటలు కాళేశ్వరం కాలువలో పోయిందని, ఇంకా 42 గుంటలకు రికార్డుల్లో రెండు గుంటలే చూపుతుందని రామన్నపేట మండలం పాశబోయిన జయలక్ష్మి ఫిర్యాదు చేశారు. మిగతా 39 గంటుల భూమిని కూడా ఆన్లైన్ ద్వారా తన పేరున నమోదు చేయాలని విన్నవించారు. ● ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీ కార్యదర్శిపై బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన చెందిన కందుల శ్రీనివాస్రావు ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణ సమయంలో నంబర్లు కేటాయించాల్సి ఉండగా ఖాళీ స్థలాకు ఇస్తున్నారని , ఇందుకోసం చేతి వాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● నాతాళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249లో పల్లెప్రకృతి వనానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.విచారణ చేయించాలి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వార్డు కమిటీ సభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కమిటీల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇళ్లు మంజూరు చేయిస్తామని రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిందన్నారు. అర్హులను కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు, తమ అనుయాయులకు ఇళ్లు మంజూరు చేస్తున్నారని, విచారణ చేపట్టాలని కోరారు. ఫ ప్రజావాణిలో అర్జీలు వెల్లువ ఫ అధికంగా భూ సమస్యలపైనే.. ఫ వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు -
ఖర్గే సభకు జనసమీకరణ
సాక్షి, యాదాద్రి: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే పాల్గొనే బహిరంగ సభకు జన సమీకరణపై జిల్లా నాయకత్వం దృష్టి సారించింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 1,500 చొప్పున సభకు తరలించాలని అధిష్టానం జిల్లా నేతలకు సూచించింది. ఈ మేరకు సోమవారం భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన టీపీసీపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభను విజయవంతంపై చర్చించారు. రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక ఇంచార్జిని నియమించారు. మరోసారి మంగళవారం ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి, జనగామ కాంగ్రెస్ నియోజవకర్గ ఇంచార్జిలతో డీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీ సెగ్మెంట్ల ఇంచార్జిలు సమావేశం కానున్నారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు సభకు కార్యకర్తలను ఆర్టీసీ బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మండల, గ్రామ శాఖలు, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల సభ్యులను తరలించనున్నారు. సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలు కోటంరెడ్డి వినయ్రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నూతి సత్యనారా యణగౌడ్, ఈవీ శ్రీనివాసరావు, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, రాచమల్ల రమేష్, సత్యనారాయణ, పడిగెల ప్రదీప్, అతహర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఫ 10,500 మందిని తరలించాలని నిర్ణయం ఫ ఇంచార్జ్లతో డీసీసీ అధ్యక్షుడి సమావేశం ఫ నేడు ఎంపీ, ఎమ్మెల్యేలతో.. -
తవ్వింది చెరువంతా!
అనుమతి కొంత.. ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తున్న యంత్రాంగం గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు, రైతుల పట్టాభూముల నుంచి మట్టి అక్రమ దందా నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే అయినా సంబంధిత శాఖలు చోద్యం చూస్తున్నాయి. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణమని తెలుస్తోంది. చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి మూడు రోజుల పాటు రేయింభవళ్లు 60 టిప్పర్ల ద్వారా మట్టి తరలించినా చోద్యం చూడటం అధికారుల తీరును ప్రశ్నిస్తోంది. 100 కాల్ ద్వారా సమాచారం అందితే తప్ప.. స్పందించలేదు. సాక్షి,యాదాద్రి: మట్టి మాఫియాకు అడ్డులేకుండాపోతుంది. ప్రకృతి సంపదను విచ్చలవిడిగా కొల్ల గొడుతూ కోట్ల రూపాయలు వెనుకేసుకుంటోంది. చెరువులు, వాగులు, వంకలు, గుట్టలు.. ఇలా దేన్నీ వదలడం లేదు. అడ్డుకోవాల్సిన యంత్రాంగం నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల రా జాపేట మండలం చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని తరలించడం అక్రమదందాకు నిదర్శనం. రూ.6 లక్షలకు ఒప్పందం మల్పవోని చెరువు శిఖం భూముల పట్టా దళితుల పేరున ఉంది. గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత దళితులకు, మట్టి వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించాడని, మట్టి తరలించేందుకు రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గత నెల 21,22,23 తేదీల్లో మూడు రోజుల పాటు చెరువులో హిటాచీలు పెట్టి సుమారు 60 టిప్పర్ల ద్వారా నిరంతరాయం మట్టిని తరలించారు. బొమ్మలరామారం, చీకటి మామిడి తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు మట్టిని చేరవేశారు. మట్టి అక్రమ రవాణా విషయాన్ని 24వ తేదీ రాత్రి 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మల్ప వోని చెరువు వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు. మట్టి తరలిస్తున్న 23 టిప్పర్లు, హిటాచీలను పట్టుకున్నారు. అయితే హిటాచీలను అదే రాత్రి వదిలేశారని పోలీసులపై ఆరోపణలున్నాయి. టిప్పర్లకు మాత్రం జరిమానా విధించడంతో పాటు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. చర్చనీయాంశంగా నేతల ఫోన్ సంభాషణ చల్లూరులోని మల్పవోని చెరువు మట్టి తరలింపునకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య సుధీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిధి దాటి తవ్వకాలు.. వ్యవసాయ భూములు సారవంతం చేయాలని రైతుల పేరున అనుమతి పొందుతున్నారు. కొంత విస్తీర్ణం మేరకు అనుమతి పొంది చెరువుంతా తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని పొలాలకు కాకుండా ఇటుక బట్టీలు, వెంచర్లు, ఇతర వాణిజ్య అవసరాల నిమిత్తం తరలిస్తున్నారు. ఒక టిప్పర్ మట్టిని రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతున్నారు. ఇటుక బట్టీల్లో ఇటుకల తయారీకి నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతులు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఆయా శాఖలు నిర్దేశించిన ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు జరపాలి. ఇందుకు గాను క్యూబిక్ మీటర్కు రూ.20 చొప్పున రాయల్టీ, ఇతర పన్నులను ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములు ధ్వంసం చేస్తున్నారు.చల్లూరులోని మల్పవోని చెరువులో విచ్చలవిడి తవ్వకాలుఫ మూడు రోజుల్లోనే రూ.కోట్లు విలువ చేసే మట్టి తరలింపు ఫ సాగుభూముల సారవంతం పేరున అనుమతి ఫ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు ఫ ఇటుక బట్టీలకు ట్రిప్పు రూ.6 వేల నుంచి రూ.10వేలకు అమ్మకం ఫ మిగతా మండలాల్లోనూ తరలిపోతున్న ప్రకృతి సంపద ఫ కళ్లెదుటే జరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగంఅనుమతి తప్పనిసరి మట్టి తరలించాలంటే సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి. పర్మిషన్ తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయి. చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి మట్టి తరలించిన వారిపై కేసులు నమోదు చేశాం. 24 టిప్పర్లకు జరిమానా విధించాం. టిప్పర్లలో మట్టి తవ్విపోసిన హిటాచీలతో పాటు వాటి డ్రైవర్లను గుర్తించి కేసులు నమోదుచేస్తాం. –కృష్ణారెడ్డి, ఆర్డీఓ -
దేశ సేవలో భాగస్వాములు కావాలి
బొమ్మలరామారం : యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్లో గల హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడంతో పాటు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అధిరోహించాలన్నారు. ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు ఆర్మీ వెటరన్ ప్రశాంత్ హల్గేరి, హైదరాబాద్ ఎన్సీసీ గ్రూప్ మాజీ కమాండర్లు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కొరె రాజ్కుమార్, డైరెక్టర్ నవ్యశ్రీ, చీఫ్ మెంటార్ ఆర్.కె.రావు, ప్రిన్సిపాల్ అంజయ్య, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.ఫ సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ -
బంగారంపై లోన్ ఇచ్చారు.. నకిలీదంటున్నారు!
మోతె: తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు నుంచి విడిపించుకున్న తర్వాత అది నకిలీదని బ్యాంకు వారు చెప్పడంతో బాధితుడు (ఖాతాదారుడు) ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ ఘటన సోమవారం మోతె ఎస్బీఐలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మోతె మండల కేంద్రానికి చెందిన జిల్లపెల్లి పరశురాములు 2023 మార్చిలో తన అవసరం నిమిత్తం 18 గ్రాముల బంగారు గొలుసును స్థానిక ఎస్బీఐలో కుదువపెట్టి లోన్ తీసుకున్నాడు. రెండేళ్లపాటు తాను తీసుకున్న లోను బాపతు ఏటా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఖాతాదారుడిని బ్యాంకు వారు పిలిచి అసలు, వడ్డీ చెల్లించి బంగారం విడిపించుకోవాలని సూచించారు. బాధితుడు సోమవారం బ్యాంకులో అసలు వడ్డీతో సహా చెల్లించాడు. బ్యాంకు మేనేజర్ బాధితుడికి బంగారం ఇస్తూ ఇది నకిలీ బంగారమని తెలిపారు. మీరు బ్యాంకులో తాకట్టుపెట్టిన కొన్ని నెలల తర్వాత ఆడిట్ వారు మీ బంగారాన్ని చెక్ చేయగా నకిలీ బంగారమని నిర్ధారించారని మేనేజర్ తెలిపారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన సమయంలో చెక్ చేసి లోన్ ఇచ్చారని, ఇప్పుడు నకిలీ బంగారం ఎలా అవుతుందని బాధితుడు ప్రశ్నించాడు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. నాకు ఈ బంగారం వద్దు నా ఒరిజనల్ బంగారం నాకు ఇవ్వండి అని బ్యాంకు వారి వద్దనే వదిలి వచ్చానని సదరు బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన బంగారం తనకు ఇవ్వాలంటున్న బాధితుడు బ్యాంకు అధికారులతో వాగ్వాదం మోతె ఎస్బీఐలో ఘటన -
చెర్వుగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
నార్కట్పల్లి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లుగానే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో గల పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కల్యాణ మండపం, కోనేరు, మెట్ల దారి, కాలభైరవ, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ఈఓ చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని.. ఆలయ అభివృద్ధికి ఇదివరకే మంజూరు చేసిన రూ.12 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెర్వుగట్టు పైనుంచి కిందకు ప్రత్యేక రహదారి, మెట్ల దారి విస్తరణ, కాటేజీల నిర్మాణం చేపట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమెను కోరారు. చెర్వుగట్టు ఆలయానికి సంబంధించి గట్టు పైన 44 ఎకరాల స్థలం, కొండ కింద 90 ఎకరాల స్థలం ఉందని, ప్రస్తుతం ఆలయ నిధులు రూ.24 కోట్లు ఉన్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావ్ ఆమెకు వివరించారు. సంవత్సర ఆదాయం రూ.14కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తుందని, రెండు కిలోల 640 గ్రాముల బంగారం, 241 కిలోల వెండి ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం చెర్వుగట్టు సమీపంలో హరిత హోటల్ మంజూరు చేసిందని, అయితే హోటల్ నిర్మించే స్థలానికి సంబంధించి ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక పరిషత్ ప్రత్యేక సలహాదారు గోవింద హళ్లి, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, దేవాదాయ శాఖ ఎస్ఈ ఓం ప్రకాష్, ఈఈ శ్రీనివాస శర్మ, దేవాలయ ఈఓ నవీన్కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉశషయ్య, వడ్డె భూపాల్రెడ్డి, బండ సాగర్రెడ్డి, పాశం శ్రీనివాస్రెడ్డి, పున్నంరాజు యాదగిరి, నేతకాని కృష్ణ, రేగట్టే నవీన్రెడ్డి, రేగట్టే నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ఛాయా సోమేశ్వర ఆలయ చరిత్రను కాపాడాలిరామగిరి(నల్లగొండ): నల్లగొండ మున్సి పాలిటీ పరిధిలోని పానగల్లులో గల ఛాయా సోమేశ్వర ఆలయ చరిత్రను కాపాడాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. సోమవారం ఆమె ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి విశేష పూజల అనంతరం వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను తెలుసుకున్న ఆమె ఆలయ ప్రాముఖ్యత, శిల్ప కళ, చరిత్రను అందరికీ తెలిసేలా చూడాలని ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ధార్మిక పరిషత్ సలహాదారు గోవింద హళ్లితో చెప్పారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న కొనేరును సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బైక్ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నాగార్జునసాగర్: బైక్ను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగార్జునసాగర్కు సమీపంలోని పాత కంకరమిల్లు మూలమలుపు వద్ద సోమవారం జరిగింది. విజయపురి టౌన్ ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కరాటే నేర్పడానికి హాలియా నుంచి కరాటే మాస్టర్ కందుల రమేశ్(36), అతడి సమీప బంధువు పెదమాము మనోజ్కుమార్ బైక్పై వస్తున్నారు. నాగార్జునసాగర్కు మూడు కిలోమీటర్ల దూరంలో పాత కంకరమిల్లు మూలమలుపు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో రమేష్, మనోజ్కుమార్ ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. రమేశ్ తలకు బలమైన దెబ్బ తలగడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. మనోజ్కుమార్ కాలు, చేయి విరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన మనోజ్ను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్ల గొండకు తీసుకెళ్లారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు రమేష్ స్వస్థలం త్రిపురారం మండలం దుగ్గపల్లి కాగా, అతడికి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. క్షతగాత్రుడు మనోజ్కుమార్ స్వస్థలం నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామం. మరొకరికి గాయాలు -
వివాహిత మృతదేహంతో ఆందోళన
నేరేడుచర్ల: ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన.. అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆమె మృతికి ప్రియుడే కారణమని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ -
ఉరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
నార్కట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలోని బృందావన్ వెంచర్ వద్ద రోడ్డు పక్కన చెట్టుకు సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45ఏళ్లు ఉండవచ్చని, అతడి చేతికి కంకణం, ఒంటిపై జంజం, మెడలో తాయత్తు ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 6309680086, 8712670186 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.మనస్తాపంతో బలవన్మరణంఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన బిర్రు శ్రీనివాస్(67) సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ భార్య పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పక్షవాతానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో చేరిన వారం రోజుల్లోనే.. ● పవర్ప్లాంట్ నీటిలో మునిగి వ్యక్తి మృతిమఠంపల్లి: తాత్కాలిక ఉద్యోగిగా పవర్ ప్లాంట్లో విధుల్లో చేరిన వారం రోజుల్లోనే నీటిలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. మఠంపల్లి మండలం యాతవాకిల్ల వద్ద గల వేములూరు రిజర్వాయర్పై నిర్మించిన పవర్ ప్లాంట్లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం పీర్లగూడేనికి చెందిన షేక్ ఉస్మాన్ (35) సోమవారం పవర్ ప్లాంట్ గేట్లకు మర్మతులు చేస్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న హుజూర్నగర్ సీఐ గజ్జె చరమందరాజు, ఎస్ఐ పి. బాబు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నలుగురు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
● మరో ఇద్దరికి చార్జీ మెమోలు జారీ●● చింతపండు చోరీ ఘటనలో అధికారుల చర్యలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయ ప్రసాద విక్రయశాల గోదాంలో సరుకులు, చింతపండు చోరీ చేసిన ఘటనకు సంబంధించి నలుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరికి చార్జీ మెమోలు జారీ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈఓ వెంకట్రావ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చోరీకి ఘటనపై విచారణ చేసేందుకు నియమించిన కమిటీ ప్రసాద విక్రయశాల, గోదాంలను పరిశీలించి, ఉద్యోగులు, సిబ్బందిని విచారించి.. ఆ రిపోర్ట్ను ఈఓ వెంకట్రావ్కు అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన ఈఓ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ గుమాస్తా పి. నవీన్ (సీనియర్ అసిస్టెంట్)తో పాటు సహాయ పాచకులు టి. వాసు, ఎస్బీ. సంతోష్, ఎస్. కృష్ణమాచార్యులను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ప్రసాద తయారీ స్టాక్, రిజిస్టర్లను పరిశీలించడంలో విఫలమైన పర్యవేక్షకులు ఎ. సత్యనారాయణశర్మ, వి. వెంకటేశంకు చార్జీ మెమోలు ఇచ్చారు. పెట్రోల్ బంక్ మిషన్లు పోలీస్ స్టేషన్కు తరలింపుమోత్కూర్: రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లోని మిషన్లను సోమవారం మోత్కూరు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాలు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో 2020 డిసెంబర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) సహకారంతో మోత్కూరు రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం సంఘానికి నూతన పాలకవర్గం ఏర్పడగా.. వారు బంక్ వ్యవహారాలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా బంక్ మూతబడింది. ఈ నేపథ్యంలో సోమవారం ఐఓసీ సిబ్బంది బంక్లో పెట్రోల్, డీజిల్ కొట్టే మిషన్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ వాహనంలో తరలిస్తుండగా.. సంఘం సీఈఓ కొనతం వరలక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బంక్ వద్దకు చేరుకొని మిషన్లను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై సంఘం సీఈఓ వరలక్ష్మిని వివరణ కోరగా.. గతంలో వినియోగదారుల సేవా కేంద్రంగా ఉన్న బంక్ను మూడు నెలల క్రితం కమర్షియల్గా మార్చినట్లు తెలిపారు. కలెక్టరేట్ నుంచి బీఫాం రావాల్సి ఉండడంతో వినియోగంలోకి తీసుకురాలేదని, ఐఓసీ సిబ్బంది తమకు సమాచారం ఇవ్వకుండానే మిషన్లు తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఐఓసీ మేనేజర్తో మాట్లాడితే కొత్త మిషన్లు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ఐదు గేదెలు మృతిమునగాల: విద్యుత్ స్తంభం కూలడంతో భూమిపై పడిన కరెంట్ తీగలకు తగిలి ఐదు గేదెలు మృతిచెందాయి. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామ శివారులో సోమవారం జరిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన గడ్డం రామానుజంకు చెందిన రెండు గేదెలు, ఎల్లావులు వెంకన్న, ఎల్లావుల సంతోష్, తెలిబోయిన నాగరాజుకు చెందిన మూడు గేదెలను సోమవారం ఉదయం మేత కోసం వదిలారు. గేదెలు మేత మేసుకుంటూ వెళ్లి తిమ్మారెడ్డిగూడెం శివారులో విద్యుత్ స్తంభం కూలడంతో భూమి మీద పడిన కరెంట్ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. గేదెల విలువ రూ.2.50లక్షలు ఉంటాయని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. బస్సు టైరు కిందపడి వృద్ధురాలికి గాయాలు కొండమల్లేపల్లి: వృద్ధురాలు ఆర్టీసీ బస్సు టైరు కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం జరిగింది. పెద్దవూర మండలం కల్వకుర్తికి చెందిన ముదిరెడ్డి ప్రమీల హైదరాబాద్లో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లి సోమవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి కొండమల్లేపల్లి బస్టాండ్లో దిగింది. అనంతరం స్వగ్రామానికి వెళ్లడానికి మిర్యాలగూడ బస్సు ఎక్కాల్సిన ఆమె పొరపాటున నల్లగొండ బస్సు ఎక్కింది. అది మిర్యాలగూడ బస్సు కాదని తెలిసి బస్సు దిగుతుండగా జారి టైరు కిందపడింది. ఆమె ఎడమ కాలు పైనుంచి బస్సు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్కు తీసుకెళ్లారు. బాధితురాలి బంధువుల ఫిర్యా దు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుజనులతో ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో కోలాహలం నెలకొంది. వేకువజామున స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు. -
ఆలయం, భక్తుల భద్రతకు ప్రాధాన్యం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందుకోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో వెంకట్రావ్ ఆదేశించారు. ఆలయ భ్రదతపై ఆదివారం యాదగిరికొండపైన ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఎస్పీఎఫ్, హోంగార్డులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సీసీ కెమెరాల పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జూలైలో దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నట్లు వెల్ల డించారు. అందుకు అవసరమైన మొక్కలు సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా వాహన పూజల స్థలాన్ని ఘాట్ రోడ్డు–2 సర్కిల్ పక్కన ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్శర్మ, ఆలయ అధికారులు దయాకర్రెడ్డి, నవీన్కుమార్, జే.కృష్ణ, గజివెల్లి రమేష్బాబు, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ -
నిజామాబాద్కు బస్సు సౌకర్యం
రాజాపేట: యాదగిరిగుట్ట డిపో నుంచి రాజాపేట మండలంలోని రఘునాథపురం మీదుగా నిజామాబాద్కు ఆదివారం బస్సు సర్వీస్ను ప్రారంభించారు. బస్సుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. నిజామాబాద్కు బస్సు సౌకర్యం కల్పించినందుకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, గుట్ట డిపో మేనేజర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా రజనీభువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్గా సీనియర్ అడ్వకేట్ రజనీని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను ఆమె వాదించనున్నారు. మూడేళ్ల పాటు అసిస్టెంట్ ప్లీడర్గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ధరల భారం!
ఇందిరమ్మ ఇళ్లకుపెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలుసాక్షి,యాదాద్రి : పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, కూలి రేట్లు సైతం పెంచారు. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై రూ.3 నుంచి రూ.4లక్షల వరకు అదనపు భారం పడేలా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. రెండు విడతల్లో మంజూరైన ఇళ్లు..తొలి విడతలో జిల్లాలోని 17 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 761 ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో నియోజకవర్గాల వారీగా 8,191 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో మొదటి, రెండో పేజ్ కలిపి సుమారు 4వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారుకు రూ.5లక్షల సాయం అందజేస్తుంది. మండుతున్న సిమెంట్..ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ కావాలి. నెల రోజుల క్రితం బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్ను బట్టి ఒక్కో బస్తాపై రూ.50నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1,47,000 సిమెంట్ ఖర్చు వచ్చేది. ప్రస్తుత రేటును బట్టి కట్టకు రూ.50 అదనంగా వేసుకున్నా రూ.1,73,250 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్ రూపేణా రూ.26,250 వరకు అదనపు భారం పడుతోంది. కట్టకు రూ.80 అయితే రూ.1,89,000 అవుతుంది. ట్రాక్టర్ ఇసుక రూ.3,500కుపైనే..ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ట్రాక్టర్ల యజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుకకు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.4వేల వరకు తీసుకుంటున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రాక్టర్ ఇసుక ఏరియాను బట్టి రూ.1,500 నుంచి రూ.రెండు వేల వరకు సరఫరా చేసేవారు. స్టీల్ ధరలకు రెక్కలుస్టీల్ ధర కంపెనీని బట్టి గతంలో క్వింటా కనిష్టంగా రూ.5,500 ఉండగా ఇప్పుడు గరిష్టంగా రూ.7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.50 టన్నుల స్టీల్ పడుతుందని లబ్ధిదా రులు చెబుతున్నారు. రూ.5,500 చొప్పున రూ.82,500 అవుతుండగా.. సగటున క్వింటాకు రూ.7,500 చొప్పున రూ.1,12,500 ఖర్చవుతుంది. ఈ లెక్కన రూ.30,000 వరకు అదనపు భారం పడుతుంది. రాయి, దొడ్డు కంకరకు రూ.1,800 పెంపుబేస్మెంట్ నిర్మాణానికి రాయి తప్పనిసరి. గతంలో ట్రాక్టర్ రాయి, దొడ్డు కంకర రూ.3,200 ఉండగా ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు పలుకుతోంది. ఇక స్లాబ్లో ప్రత్యేకంగా సన్న కంకర వాడాల్సి ఉంటుంది. దాని ఖర్చు అదనం. ఇకనుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో ఇసుక సరఫరాఇసుక సమస్యను అధిగమించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.కొరత ఉన్న ప్రాంతాలకు ఇసుక నిల్వలున్న వాగులు, మూసీ నుంచి అవసరం మేరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ఇసుక సరఫరా జరుగుతుంది. అలాగే గోదావరి రీచ్లనుంచి ఇసుక తీసుకువచ్చి నిల్వ చేయడానికి డిపోలు ఏర్పాటు చేయనున్నారు. ఇంటి నిర్మాణ సామగ్రి రేట్లు (రూ.ల్లో) మెటీరియల్ గతంలో ప్రస్తుతంసిమెంట్ (బస్తా) 280 330 - 360స్టీల్ (క్వింటా) 5,500 6,000 - 7,800ఇసుక (ట్రాక్టర్) 1500 3,500 - 4,000రాయి (ట్రాక్టర్) 3,200 3,000 - 4,000 ఇసుక (ట్రాక్టర్) 1,500 3,500 - 4,000కూలి (పురుషులు) 800 1,300మహిళలకు 500 1,000 అడ్డా కూలీలకు ఫుల్ డిమాండ్ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.5 లక్షలు అదనంగా రూ.4 లక్షల వరకు ఖర్చు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటున్న లబ్ధిదారులుఅడ్డా కూలీలకూ ఫుల్ డిమాండ్ గతంలో అడ్డా కూలీకి పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ.1,300 అడుగుతున్నారు. మహిళలకు రూ.500 ఉండగా రూ.1000 డిమాండ్ చేస్తున్నారని, కూలి ఎక్కువ ఇచ్చినా కూలీలు దొరికే పరిస్థితి లేదని హమాలీలు చెబుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి నిర్మాణ వ్యయం పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక, రాయి, కంకర, కూలీల రేట్ల కారణంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలకు అదనంగా మరో రూ.4లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు అంటున్నారు. నేల స్వభావాన్ని బట్టి కూడా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. చౌడు నేలలో తప్పనిసరిగా పిల్లర్లు పోయాల్సి వస్తుండటంతో మరింత భారం పడుతుంది. -
పెండింగ్ కేసులకు పరిష్కారం చూపండి
భువనగిరిటౌన్ : రాజీ పడదగిన కేసులతో పాటు ఇతర కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారంట్లు తదితర అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. చిన్నచిన్న కేసులను త్వరగా పరిష్కరించడం వల్ల రాజీకి ఆమోదయోగ్యంకాని కేసులపై దృష్టి సారించవచ్చన్నారు. అనంతరం భువనగిరిలోని సబ్ జైల్ను ఆయన సందర్శించి ఖైదీలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. న్యాయ సహకారం అవసరమైన ఖైదీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు -
ఏసీపీగా విజయ్కుమార్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఏసీపీగా జి.విజయ్కుమార్ను నియమిస్తూ డీజీపీ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తు న్న ఏసీపీ సైదులు గతంలోనే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ సీసీఆర్బీలో ఏసీపీగా పనిచేస్తున్న విజయ్కుమార్ను నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో విజయ్కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : మండలంలోని అనంతారం పరిధిలో గల పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ స్వప్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్లు 9948984800, 7396121244ను సంప్రదించాలని కోరారు. హెల్మెట్తో రక్షణ భువనగిరి : విధి నిర్వహణలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సుధీర్కుమార్ సిబ్బందికి సూచించారు. సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా ప్రమాదకరమైన పనులు చేసే అవకాశం ఉంటుందని, అలాంటప్పుడు హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్లు తది తర రక్షణ కవచాలను ధరించాలని సూచించారు. అనంతరం సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు. టిప్పర్లకు జరిమానా రాజాపేట : మండలంలోని చల్లూరు మల్వ వాని చెరువునుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లకు లక్ష 22 వేల 866 రూపా యలు జరిమానా విధించారు. వారం రోజులు గా అనుమతి లేకుండా మల్వవాని చెరువునుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. 100 కాల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 23 టిప్పర్లను పట్టుకున్నారు. వాటిని మైనింగ్ అధికారులకు అప్పగించగా జరిమానా విధించారు. చెరువునుంచి ఎంత మట్టి తరలించారన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఏడీ తెలిపారు. ప్రతి దరఖాస్తునూ పరిశీలించాలి భువనగిరి, చౌటుప్పల్ : భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాలను సందర్శించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలతో సమావేశమై దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. పాత రికార్డుల ఆధారంగానే దరఖాస్తులను పరిష్కరించాలని, తప్పులకు తావుండరాదన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, తహసీల్దార్లు శ్రీ నివాస్రెడ్డి, వీరాభాయి, దశరథనాయక్, లాల్బహదూర్సింగ్, శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం రామగిరి(నల్లగొండ): ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీఈఏపీ సెట్ –2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపాల్ నరసింహారావు తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్లో అర్హత సాధించిన విద్యార్థులకు మూడు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, సెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, ఒరిజినల్ టీసీ, కుల ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోని రావాలన్నారు. -
జనగణనకు సనా్నహాలు
సిబ్బంది జాబితా, గ్రామాల వారీగా మ్యాప్లు రెడీసాక్షి, యాదాద్రి: 16వ జనాభా లెక్కల సర్వేకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జనగణనకు సంబంధించి ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకం, సమకూర్చుకోవాల్సిన సామగ్రి తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇప్పటికే సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్లు కొలిక్కి వచ్చాయి. చివరి సారిగా 2011లో జనాభా లెక్కింపు సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు వెల్లడిస్తారు. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. నాటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఉన్నారు. ఆ తరువాత 2021లో లెక్కించాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేంద్రం జనగణన గెజిట్ విడుదల చేయడంలో జిల్లాలోనూ జనాభాను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పేపర్ ద్వారా జనగణన చేపట్టగా.. ఈసారి జిటల్ మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. జిల్లా, మండల స్థాయిలో కమిటీలు జనాభా లెక్కల సేకరణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్ఓ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మరికొందరు అధికారులతో జిల్లా కమిటీ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, ఏఎస్ఓ(అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి)తో కమిటీ ఉంటుంది. తహసీల్దార్ జనాభా లెక్కల సేకరణ అధికారిగా, ఏఎస్ఓ సహాయ అధికారిగా వ్యవహరిస్తారు. డిజిటల్ మొబైల్ యాప్తో సర్వేఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించనున్నారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటాడు. వీరికి జిల్లా పరిధిలోనే వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నతస్థాయి కమిటీలకు హైదరాబాద్లో శిక్షణ ఉంటుంది.ఈసారి డిజిటల్ మొబైల్ యాప్ను జనాభా లెక్కల సేకరణకు వినియోగించనున్నారు. పట్టణ జనాభాపై దృష్టిపెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీల శివారు ప్రాంతాలను గుర్తించి వాటిని విస్తరించేందుకు అనువైన పరిస్థితులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటి అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదపడనున్నాయి.రెండు విడతల్లో లెక్కింపురెండు విడతల్లో జనాభా లెక్కించనున్నారు. మొదటి విడత 2025 అక్టోబర్ 1, రెండో దశ 2027 మార్చి1 నాటికి జనాభా లెక్కలు సేకరించనున్నారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి రెండుదఫాలు వెళ్తారు. మొదటి సారి ఇళ్లను లెక్కించడంతో పాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటి అంశాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికి వెళ్తారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు. ముఖ్య ప్రణాళిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు, ఎన్యూమరేటర్లు సేకరించి రూపొందించిన జాబితాల ఆధారంగా ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయికి వెళ్లి నిర్ధారిస్తాయి. ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులు పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు త్వరలో హైదరాబాద్లో, జిల్లా పరిధిలోనూ శిక్షణ బ్లాక్లుగా ఇళ్ల విభజన 2027 మార్చి 1వ తేదీ నాటికి జనాభా లెక్కల సేకరణజిల్లా స్వరూపం భౌగోళిక విస్తీర్ణం 3,795 కి.మీ రెవెన్యూ గ్రామాలు 321మండలాలు 17మున్సిపాలిటీలు 06పంచాయతీలు 428మొత్తం జనాభా (2011 లెక్కల ప్రకారం) 7,70,833పురుషులు 3,90,492మహిళలు 3,80,341గ్రామీణ జనాభా 6,47,668పట్టణ జనాభా 1,23,165నివాస గృహాలు 1,88,520 -
ఉపాధ్యాయురాలిపై ఐలయ్య ఆగ్రహం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తనిఖీకి వెళ్లిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు చేదు అనుభవం ఎదరైంది. శనివారం మధ్యాహ్న సమయంలో పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల వండిన భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యతగా ఉండటంలేదని, మెనూ అమలు చేస్తలేరని విద్యార్థులు ఐలయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్న భోజన ఇంచార్జిగా ఉన్న ఉపాధ్యాయురాలు రాధికను పిలిపించారు. మెనూ ప్రకారం శనివారం మిక్స్డ్ కూరగాయలు ఉండాలని.. కానీ, ఎక్కువగా దోసకాయలు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అందుకు ఆమె ప్రభుత్వ విప్పైకి వేలు చూపుతూ.. భోజనం ఇట్లానే ఉంటదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అవాకై ్కన ఐలయ్య.. ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మధ్యాహ్న భోజన ఇంచార్జి టీచర్ రాధికను వివరణ కోరగా.. తనను మహిళ అని చూడకుండా అగౌరవపరిచేలా మాట్లాడారని చెప్పారు. -
సాగు చట్టాలపై అవగాహన అవసరం
భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం : సాగు చట్టాల గురించి రైతులకు తెలిసి ఉండాలని, వాటిపై అవగాహన కల్పించడమే సాగు న్యాయయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. శనివారం భూదాన్పోచంపల్లిలోని వినోబాభావే మందిరం నుంచి లీఫ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి సునీల్ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్రకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి జిల్లా పరిధిలో పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో భూమి సునీల్తో కలిసి ఆయన మాట్లాడారు. పెరిగిన సాగు పెట్టుబడికి అనుగుణంగా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, ఎరువుల వాడకం వల్ల నష్టపోయినప్పుడు, పంటల బీమా వర్తించనప్పుడు చట్టాల ద్వారానే లబ్ధిపొందడం సాధ్యమవుతుందన్నారు. అందుకే సాగు చట్టాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుండాలని రైతులకు సూచించారు. రైతు కుటుంబంలో జన్మించిన రేవంత్రెడ్డి.. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం ఏదైనాపోచంపల్లి నుంచే : సునీల్తాను ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని భూదాన్పోచంపల్లి నుంచే ప్రారంభించానని లీఫ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి సునీల్ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో కలిపి భూమి, వ్యవసాయానికి సంబంధించి 174 చట్టాలు ఉన్నాయని, వీటిపై రైతులకు అవగాహన ఉండాలన్నారు.హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద అక్టోబర్ 2న యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం ముందుంచుతామని చె ప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు నివేదిస్తామన్నారు. భూదానస్థూపం వద్ద నివాళిభూదాన్పోచంపల్లిలో ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలతో పాటు భూదానస్థూ పం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాగు న్యాయయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జలాల్పురం గ్రామానికి చెందిన రైతు గోరంటి శ్రీనివాస్రెడ్డి లీఫ్స్సంస్థకు రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, భూదానయజ్ఞబోర్డు మాజీ అధ్యక్షుడు గున్నా రాజేందర్రెడ్డి, లీఫ్స్ సంస్థ ప్రతినిధులు జీవన్రెడ్డి, మల్లేశ్, అభిలాష్, రవి, ప్రవీణ్, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధి యానాల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేశ్, డీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ వైస్చైర్మన్ సామ మోహన్రెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఓ నాగరాజు, పీఏ సీఎస్ చైర్మన్ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నారాయణపురంలో సమస్యల ఏకరువు నారాయణపురంలోని సర్వే నంబర్ 255లోని అసైన్డ్ భూముల్లో తరాతరాలుగా సాగు చేసుకుంటున్నామని, పట్టాలు కూడా ఇచ్చారని, బ్యాంకు రుణాలు తీసుకున్నామని, అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. రాచకొండలోని రెవెన్యూ భూముల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులు సుమారు 3వేల మంది తరతరాలుగా సేద్యం చేసుకుంటున్నామని, అన్ని ఆధారాలున్నా ఆటవీ శాఖ ఆధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని, సాగు జాలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని.. ఇలా వివిధ సమస్యలపై రైతులు, సీపీఐ నాయకులు విన్నవించినారు. ఈ కార్యక్రమంలో నీటి పోరాట నాయకుడు కేవీఎన్ రెడ్డి, గోవింద్, హరి, మల్లేష్, సీపీఐ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, చిలుదేరు అంజయ్య, మందుగుల భాలకృష్ణ, ఏపూరి సతీష్, ధన్వంత్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్ర -
అరచేతిలో అందం.. ఆరోగ్యం..!
సూర్యాపేట అర్బన్, రామగిరి(నల్లగొండ): ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటాకు సందడి జిల్లాలో మొదలైంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. గోరింటాకు మహిళల చేతులు, కాళ్లకు కొత్త అందాన్నిస్తుంది. యువతుల చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంత మంచి భర్త దొరుకుతాడని విశ్వసిస్తారు. గోరింటాకు శుభానికి చిహ్నంగా భావిస్తారు. అనేక ఔషధ గుణాలు వేసవిలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవా లని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు గోరింటాకు పెట్టుకోవడంతో అంటురోగాలు దరికి చేరవు. గోరింటాకు శరీరాన్ని చల్ల పరచడానికి సహాయపడుతుంది. జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది. జుట్టును రాలకుండా సంరక్షిస్తుంది. కేశాల పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రును తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రుతువు మారడంతో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. – డాక్టర్ పాల ఆనంద్, జనరల్ మెడిసిన్, సూర్యాపేట రవీంద్రనగర్లో గోరింటాకు పెట్టుకుంటున్న మహిళలుప్రయోజనాలు ఇలా.. ఫ చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఫ ఒంట్లోని వేడిని తగ్గించడం ఫ రోగనిరోధక శక్తిని పెంచడం ఫ రక్త ప్రసరణను మెరుగుపర్చడం ఫ గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంగోరింటాకును శుభకార్యాలు, పండుగలప్పుడు పెట్టుకోవడం ఆనవాయితీ. కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, సీ్త్ర ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఆయుర్వేధంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, పూలు, విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సీ్త్రలకు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సీ్త్ర తత్వానికి, అందానికి ప్రతీక అని నమ్ముతారు. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. పట్టణాల్లో సామూహికంగా..పట్టణాల్లో పలు కాలనీలలో మహిళలు ఒక చోట చేరి గోరంటాకు సేకరిస్తారు. సంప్రదాయ పద్ధతిలో రోలులో గోరంటాకును నూరుతారు. అంతా ఒకచోట సమూహంగా కూర్చొని పాటలు పాడుతూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటారు. ●దోషాలను నివారిస్తుందిఆషాఢ మాసంలో అతివల గోరింటాకు సందడి ఫ సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తున్న మహిళలు ఫ పట్టణాల్లోని కాలనీల్లో సామూహికంగా వేడుకలు ఫ గోరింటాకు పెట్టుకుని మురిసిపోతున్న అతివలు -
నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యం
నల్లగొండ టూటౌన్: నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు అవాంతరాలను అధిగమిస్తూ విజయపథంలో ముందుకుసాగాలని సూచించారు. మానవీయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ సాధనలో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి, మెంటారింగ్ ద్వారా సివిల్స్పై అవగాహన పెంచేందుకు 12 అంశాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ శిక్షణ 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రదీప్, భవానీ శంకర్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, కె. అరుణప్రియ, ప్రేమ్సాగర్, డాక్టర్ మద్దిలేటి, లక్ష్మీప్రభ, అనితా కుమారి, ఇందిర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి