breaking news
Yadadri
-
పంచాయతీ పోరుకు సిద్ధం!
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ల వారీగా విడుదల చేయాలని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు గురువారం గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాను ప్రకటించడానికి జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లాలోని 17 మండలాల్లోని 427 గ్రామ పంచాయతీల్లో 532218 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,64,567 మంది పురుషులు, 2,67,649 మంది సీ్త్రలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 3,704 ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలి విడతలో 10 మండలాలు, 220 గ్రామ పంచాయతీలు, 1876 వార్డులు, రెండో విడతలో ఏడు మండలాలు, 207 గ్రామ పంచాయతీలు, 1828 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటర్ల, పోలింగ్కేంద్రాల ముసాయిదా జాబితా గ్రామ పంచాయతీల్లో ప్రకటించే ముసాయిదాపై అభ్యంతరాలను, సలహాలను అధికారులు స్వీకరిస్తారు. ఇందుకోసం రాజకీయ పార్టీలకు జిల్లా స్థాయి, మండల స్థాయిలో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా వివరిస్తారు. ఓటర్లు, రాజకీయ పార్టీలనుంచి వచ్చిన ఫిర్యాదులు, సలహాలను ఈనెల 31న పరిష్కరిస్తారు. అనంతరం వచ్చేనెల 2న తుది జాబితాను విడుదల చేస్తారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధంఅసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు రూపొందించారు. జనవరి 1న ప్రకటించిన సాధారణ ఎన్నికల జాబితాకు అదనంగా జూలై 7 వరకు వచ్చిన నూతన ఓటర్ల చేరికను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఒకే వార్డు ప్రజలు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. 28న ఓటర్ల, పోలింగ్కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల వచ్చే నెల 2న తుది జాబితా ప్రకటనఓటరు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఇలా.. 28న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురణ 29న రాజకీయ పార్టీలతో సమావేశం 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం 28 నుంచి 30 వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ 31న అభ్యంతరాల పరిష్కారం వచ్చేనెల 2న తుది జాబితా ప్రకటన -
పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
చౌటుప్పల్ రూరల్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షాంశ్ యాదవ్ కోరారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం, పెద్దకొండూర్ చెరువుల వద్ద గణేష్ నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్, తహసీల్దార్ వీరాబాయి, ఎస్సై ఉపేందర్రెడ్డి, ఆర్ఐ బాణాల రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఉన్నారు. -
రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్
మోత్కూరు : మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న బుంగ చరణ్ రాజ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి విచారణ చేసి బాధిత రైతుల నుంచి వాంగ్మూలం సేకరించారు. పూర్తి నివేదికను కలెక్టర్కు సమర్పించారు. ఈమేరకు రికార్డు అసిస్టెంట్ చరణ్రాజ్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. వసూళ్లకు పాల్పడిన రికార్డు అసిస్టెంట్ నుంచి రూ.1800 రికవరీ చేసి బాధిత రైతులు గంట శ్రీనివాస్రెడ్డి, బాసోజు అంజయ్యచారికి అందజేశామని తహసీల్దార్ జ్యోతి విలేకరులకు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్ను రాజాపేటకు డిప్యుటేషన్పై పంపిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజాపేటలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లును మోత్కూరుకు నియమించారు. ముగిసిన పదోన్నతుల ప్రక్రియ భువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలో 1:1 ప్రకారం మొత్తం 100 ఖాళీల పోస్టులకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతుల కోసం ఈ నెల 25న వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు. 96 పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉండగా.. నాలుగు పోస్టులు ఉన్నత పాఠశాలల్లో ఉన్నాయి. పదోన్నతులు పొందిన వారికి మంగళవారం విద్యాశాఖ అధికారులు ఆర్డర్లు జారీ చేశారు. వీరు 15 రోజుల్లో నిర్ణీత పాఠశాలలో చేరాల్సి ఉంటుంది. ముగ్గురి పదోన్నతులు నిలిపివేత ఈ ప్రక్రియలో ముగ్గురికి పదోన్నతులు నిలిపివేశారు. ఇందులో ఒకటి పీఎస్హెచ్ఎం పోస్టు కాగా రెండు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరిలో ఇద్దరు ఉండటంతో ఆ పోస్టును మహిళకు కేటాయించాలని కోరడం, రెండోది అర్హత లేని వారికి పదోన్నతి కల్పించే విషయం, మూడోది సస్పెండ్కు గురైన ఉపాధ్యాయుడికి పదోన్నతి కల్పించడంతో ఈ మూడు పోస్టులను నిలిపివేశారు. పథకాలు ప్రజలకు చేరేలా చూడాలిభువనగిరిటౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈమేరకు కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ డైరెక్టర్ మోతి పాల్గొని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. బాల సదనం సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, సీడీపీఓ విజయలక్ష్మి, అనంతలక్ష్మి ఉన్నారు. -
63 ఏళ్లుగా నవరాత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్కు వెళ్లే దారిలో వైకుంఠద్వారం సమీపంలో ఉన్న హనుమాన్ వీధిలో కాలనీవాసులు 63ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కాలనీలో ఉండే ప్రజలంతా కమిటీ ఏర్పాటు చేసుకొని నవరాత్రులను వైభవంగా జరిపిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నారు. కాలనీ అంతా ఏకమై.. యాదగిరిగుట్ట పట్టణంలోని హనుమాన్ వీధిలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద మొదట్లో ఐదారు కుటుంబాలు మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేవారు. అప్పట్లో సుమారు 3 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు యాదగిరిగుట్ట ఆలయ అర్చకులతో పూజలు నిర్వహించేవారు. ప్రస్తుతం కాలనీ అంతా ఏకమై ఒకే చోట మండపాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం నా చిన్ననాటి నుంచే హనుమాన్ ఆలయం వద్ద వినాయక మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మా కాలనీ ప్రజలంతా కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం. మా పెద్దలు ఏ విధంగానైతే పూజల బాధ్యత మా పై పెట్టారో.. అలాగే మా పిల్లలకు నేర్పిస్తున్నాం. – శ్రీధర్రెడ్డి, నిర్వాహకుడు యాదగిరిగుట్టలోని హనుమాన్ వీధిలో 1962కు ముందు నుంచే గణేష్ ఉత్సవాలు -
డిగ్రీ కాలేజీకి జూనియర్ కళాశాల తరలింపు
ఆలేరు: ఆలేరు జూనియర్ కళాశాల భవనం శిథిలమై గదుల పైకప్పుల పెచ్చులూడుతుండటంతో ‘ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు’ శీర్షికన ఈనెల 4న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఉన్నతాధికారులను కదిలించింది. అదేరోజు కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖఅధికారి(డీఐఈఓ) రమణిని ఆదేశించారు. ఈనెల 5న డీఐఈఓ కళాశాలను సందర్శించి కలెక్టర్తోపాటు ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు నివేదిక అందజేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ దేవసేనకు కళాశాల పరిస్థితిని వివరించారు. ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కళాశాలను తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన దేవసేన డిగ్రీ కళాశాలకు జూనియర్ కళాశాలను తరలించేందుకు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూనియర్ కళాశాలను అధికారులు షిఫ్ట్ చేశారు. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభించారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపిన సాక్షి దినపత్రికకు విద్యార్థులు, అధ్యాపకులు కృజ్ఞతలు తెలిపారు. డిగ్రీ కళాశాలలో మొత్తం ఏడు గదులను తమకు కేటాయించినట్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు చెప్పారు. ఉదయం 8గంటల నుంచి ఒంటి గంట వరకు జూనియర్ కళాశాల తరగతులు, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు డిగ్రీ కళాశాల తరగతులు సాగుతాయని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజారామ్ తెలిపారు. -
వినాయకా.. పదవులెవరికి?
సాక్షి, యాదాద్రి : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఆశావాహులు పదవి దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడు రూపొందించిన జాబితా అధిష్టానం వద్దకు చేరింది. సామాజిక వర్గాల వారీగా పీసీసీకి చేరిన జాబితాఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజికవర్గ సమీకరణకు పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారీగా ఆశావాహుల పేర్లను పీసీసీకి పంపించారు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఈ పేర్లు స్వీకరించారు. అయితే డీసీసీ అధ్యక్షుల ద్వారా పీసీసీకి చేరిన జాబితాపై పార్టీ అధిష్టానం క్రాస్ చెక్ చేసింది. ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ గత నెల భువనగిరికి వచ్చిన సమయంలో జాబితాపై విచారణ చేశారు. అర్హులకు ఇచ్చారా.. పార్టీ విధేయులేనా.. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారా.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చారా అని విచారణ చేశారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా డైరెక్టర్ల పదవుల భర్తీ నామినేటెడ్ పదవుల్లో ముందుగా కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి, డైరెక్టర్ల పదవులను పెండింగ్లో ఉంచింది. అయితే చైర్మన్లు ఉన్న ప్రతి కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పదవులను ముందుగా భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు వారం పదిరోజుల్లో శుభవార్త వింటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. నియోజకవర్గానికి రెండు పదవులుప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండేసి పదవుల చొప్పున ఇవ్వనున్నారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల నామినేటెడ్ పదవుల కోసం పేర్లు అధిష్టానానికి పంపించారు. పార్టీలో అంతర్గత విచారణ కూడా పూర్తయింది. దాదాపు ఆయా అభ్యర్థులకు డైరెక్టర్ల పదవులు వరించబోతున్నాయి.కార్పొరేషన్ చైర్మన్లు సైతం పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు నామినేటెడ్ పదవుల్లో ప్రధానమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ల పదవులు భర్తీ కాగానే ఈ ప్రక్రియ జరగనుందని సమాచారం. ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులు, సీఎం స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ ఎంపికకు ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. పీసీసీ, సీఎం స్థాయిలో ఎంపిక చేసిన వారి వివరాలను ఏఐసీసీకి పంపిస్తారు. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత పదవుల పందేరం జరగనుంది. జిల్లా నుంచి నాలుగైదు పేర్లు కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసేలోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయం ముందుగా కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు భర్తీ సామాజిక వర్గ సమీకరణకు పెద్దపీట నేతల్లో చిగురిస్తున్న ఆశలు ఇప్పటికే జాబితాను పీసీసీకి పంపించిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు -
కిక్కిరిసిన ఎయిమ్స్
బీబీనగర్: బీబీనగర్లోని ఎయిమ్స్లో మంగళవారం రద్దీ ఏర్పడింది. ఓపీ విభాగం వద్ద జనం పెద్దఎత్తున బారులుదీరారు. ఎయిమ్స్లోని వైద్య విభాగాలు రోజు రోజుకు పెరుగుతుండడంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రోజుకు 2000లకు పైగా ఓపీ ద్వారా ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. కానీ ఓపీ కౌంటర్లు 10మాత్రమే ఉన్నాయి. రోగులకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్య లేకపోవడంతో ఓపీ కార్డు పొందేందుకు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
రావయ్యా.. గణపయ్య
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం నిర్వహకులు వినాయక మండపాలను సిద్ధం చేశారు. జిల్లాలో సుమారు 5వేల వినాయక విగ్రహాలు కొలువుదీరనున్నాయి. మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారుతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఏర్పాటు కానున్న సుమారు 5వేల వినాయక విగ్రహాల్లో సుమారు 2వేల వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. కిటకిటలాడిన కొనుగోలు కేంద్రాలుజిల్లాలో ఇప్పటికే భారీ గణనాథుడి విగ్రహాలను హైదరాబాద్లో కొనుగోలు చేసి గత నాలుగురోజుల నుంచి తమ ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరితో పాటు జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, యాదగిరిగట్టు, ఆలేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల కేంద్రాల వద్ద కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాలతో పాటు పూజా సామగ్రి, పండ్ల కొనుగోళ్లతో ఆయా కేంద్రాలు కిటకిటలాడాయి. నేడు కొలువుదీరనున్న గణనాథులు మండపాలను సిద్ధం చేసిన నిర్వాహకులు జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల వినాయక విగ్రహాలు ఏర్పాటుగణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల 7న గ్రహణం ఉన్నందున ఆలోపు నిమజ్జనాలు చేసుకుంటే బాగుంటుందని పండితులు సూచించారు. ఆమేరకు నిర్వహించేలా మండపాల నిర్వాహకులకు సూచనలు చేశాం. – రత్నపురం శ్రీశైలం, భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు -
విహారం కావొద్దు విషాదం
● సాగర్ను సందర్శనకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన ● జలాశయంలోకి దిగొద్దని హెచ్చరిక ● సూచిక బోర్డులు, ట్రంచ్ల ఏర్పాటునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు, యువత భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సాగర్ పరిసర ప్రాంతాల్లో, దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద జలాశయంలోకి దిగడం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి నీటిలో పడితే బయటకు రావడం కష్టమని రక్షణ సిబ్బంది చెబుతున్నారు. గతంలో పలువురు యువకులు నీటిలో ఈత కొడుతూ, ఫొటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, సెల్ఫీలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో యువత జలాశయం నీటిలో దూకుతూ, లోతైన ప్రదేశాల్లో ఈత కొడుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్గా మారింది. అనుకోని ఘటన జరిగితే ప్రాణాలనే ప్రమాదమని గుర్తించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు. అధికారుల ఏర్పాట్లు.. పర్యాటకుల భద్రత కోసం సాగర్ తీరం వెంట అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దయ్యాలగండి వద్ద గల పుష్కర ఘాట్ వద్దకు వెళ్లకుండా రోడ్డు వెంట లోతైన ట్రంచ్ కొట్టారు. కొన్ని చోట్ల పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: రాత్రి వేళ కార్లలో మేకలు అపహరిస్తున్న 16 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నల్ల గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి శాలిగౌరారం సమీపంలోని బైరవోని బండ ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా కారులో వచ్చిన వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో అనుముల మండలం అలీనగర్కు చెందిన సంపంగి వెంకటేష్, సంపంగి శారద, మునుగోడు మండలం గూడపూర్కు చెందిన వేంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగా వారిపై గతంలో మేకలు చోరీ చేసిన కేసు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన నలుగురిని విచారించి.. వారితో పాటు మేకలు చోరీ చేస్తున్న మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన వరికుప్పల రవి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణి, భువనగిరి హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లికి చెందిన మద్యాల సహదేవ్, సూర్యాపేట జిల్లా మోతెకు చెందిన కోడిసె వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్కుమార్, మట్టి సురేష్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి కార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళ మేకలను కార్లలో వేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు నల్లగొండ జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబ్నగర్, నాగర్ర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగలించిన మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఎస్పీ వివరించారు. వారి నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని కోటేష్, కనుకుల బేబీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆద్వర్యంలో నిందితులను పట్టుకున్న నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్రెడ్డి, ఎం. నాగభూషణ్, కె. కొండల్రెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ, నార్కట్పల్లి సీఐ, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు. రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పవిత్ర మేడమ్ స్ఫూర్తితో..
బోధన తీరుతో స్ఫూర్తి పొందా.. సూర్యాపేటలోని ఎంఎస్ఆర్ బీఈడీ కళాశాలలో చదువుతున్నప్పుడు పవిత్ర మేడమ్ ప్రైవేట్ లెక్చరర్గా మాకు పాఠాలు బోధించేది. ఆమె బోధనా తీరు, ప్రేరణతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగం టీచర్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చండూరు మండలం దానుపాముల జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – రాసమళ్ల సికిందర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, దానుపాముల, చండూరు పెన్పహాడ్: పెన్పహాడ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. మారం పవిత్ర స్ఫూర్తితో ఆమె చదువు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆమె కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. తమలోని భయాలను తొలగించించేందుకు కృషిచేసేదని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారిలోని ఇతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేదని విద్యార్థులు చెబుతున్నారు.స్కాలర్షిప్కు ఎంపికయ్యా.. నేను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్నాను. పవిత్ర టీచర్ ఇచ్చిన శిక్షణతోనే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అకౌంట్లో రూ.12వేలు జమవుతున్నాయి. విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. – ఎ. వైష్ణవి, 10వ తరగతి, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ టీచర్లు, లెక్చరర్లుగా పలువురి ఎంపిక జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లలో పాల్గొని సత్తాచాటుతున్న విద్యార్థులుసంతోషంగా ఉంది ఆంధ్ర, తెలంగాణ అగస్త్య జిజ్ఞాస పోటీల్లో మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో పాటు రూ.1500 ప్రైజ్మనీ పొందాను. జీవశాస్త్ర టీచర్ పవిత్ర మేడమ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. – ఎం. మేఘన 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రాక్టికల్ విధానంలో బోధన చూసి.. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్లో ఉన్నప్పుడు పవిత్ర టీచర్ ప్రాక్టికల్ విధానంలో సైన్స్ బోధించడం చూసి.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్లోని కులీ కుతుబ్షా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. విద్యార్థులతో ఎలా ఉండాలనే విషయాన్ని పవిత్ర టీచర్ నుంచే నేర్చుకున్నాను. – ప్రవీణ్కుమార్, పాలిటెక్నికల్ లెక్చరర్జిల్లాస్థాయిలో గుర్తింపు లభించింది పవిత్ర గైడెన్స్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో వీడర్ అండ్ సీడర్ ప్రాజెక్టు ప్రదర్శించడంతో జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. – బి. శ్రీశాంత్, 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా సైన్స్ ఫెయిర్లో అవార్డు దక్కింది నేను తయారు చేసిన క్రాప్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్టుకు జిల్లా సైన్స్ ఫెయిర్లో అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. – శ్వేత 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ -
కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి
కోదాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పకొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు కోరారు. మంగళవారం కోదాడలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చిందని, వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, రాధాకృష్ణ, శ్రీలం శ్రీను, చెరుకు ఏకలక్ష్మి, సోమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు -
ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాం
నల్లగొండ టూటౌన్: ఎన్సీసీ శిక్షణ తరగతుల్లో క్రమశిక్షణ, దేశభక్తి సమ్మిళితమైన ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తామని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడేట్ల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో ప్రవేశానికి 60 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వారిలో ఎత్తు, బరువు, ఆరోగ్యం, రాత పరీక్షల ఆధారంగా ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఎన్సీసీ ద్వారా నేషనల్ డిపెన్స్ అకాడమీ, అగ్నివీర్ లాంటి పథకాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఇన్చార్జి డాక్టర్ మశ్చేందర్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్.సుధారాణి, కొమ్ము మల్లయ్య, చంద్రవీర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణచివ్వెంల(సూర్యాపేట): కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీకాంత్పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడెం గ్రామానికి చెందిన చిర్ర బాలరాజు(55) కొంతకాలంగా హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో ఇద్దరికి గాయాలునాగారం: కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన షేక్ షఫీ స్థానిక మేరి మదర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో తుంగతుర్తికి చెందిన జటంగి సతీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం అటెండర్ షఫీ పాఠశాల వెనుక ఉన్న గదిలోకి వెళ్లగా.. అక్కడ కుక్కలు ఉండడంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కుక్కలు అతడిపై దాడి చేసి తొడ భాగంలో కరిచాయి. అతడు కేకలు వేయగా సమీపంలో ఉన్న ఉపాధ్యాయుడు సతీష్ వచ్చి షఫీని విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుక్కలు సతీష్పై కూడా దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచాయి. గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, అధికారులు స్పందించి వాటిని ఊరికి దూరంగా తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతె: మోతె మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 1.200 కేజీ గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల కేంద్రానికి చెందిన యువకుడు, తన స్నేహితులతో కలిసి భద్రాచలం, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి మోతె మండలానికి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ అజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని రత్నాలకుంట ఇద్దరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 1.200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, రుత్విగ్వరణం , పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కాగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, కంబాల మురళినాయుడు పాల్గొన్నారు. -
బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి
కొండమల్లేపల్లి: బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన కొండమల్ల్లేపల్లి మండలం కొల్ముంతల్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం బాపూజీనగర్కు వచ్చారు. మంగళవారం ఉదయం రాజు కుమార్తె అక్షర(4) తన నానయమ్మ సుగుణమ్మతో కలిసి బాపూజీనగర్లో రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం అక్షరను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్షరను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు
ఫ జీవశాస్త్రం టీచర్ పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఫ రాష్ట్రం నుంచి ఈమె ఒక్కరే ఎంపిక ఫ హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ వర్గాలు సూర్యాపేటటౌన్ : పెన్పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగే కార్యక్రమంలో ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయికి ఆరుగురు దరఖాస్తు చేసుకోగా సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రకు ఒక్కరికే ఈ అవార్డు రావడం పట్ల పలువురు సైన్స్ టీచర్లు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 45 మంది ఆయా రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మారం పవిత్ర ఎంపిక కావడం విశేషం. ఎగ్జిబిట్తో విద్యార్థినులు, టీచర్ పవిత్ర -
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్య సత్రం నుంచి జీయర్ కుటీర్ సమీపం వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఆర్అండ్బీ ఏఈఈ భరత్, ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి ఆయా ప్రాంతాలను పరిశీ లించారు. గుట్ట నుంచి మల్లాపురం, తుర్కపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు, యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఎక్కడి నుంచి మళ్లించే అంశంపై చర్చించారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, రాజు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. గుట్ట శివాలయంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఉదయం శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖమండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. దూర విద్యతోనూ ఉజ్వల భవిష్యత్ భువనగిరి, ఆలేరు : దూర విద్యతోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ అన్నారు. భువనగిరిలోని శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలపై యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. అనంతరం ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, స్టడీ సెంటర్కో ఆర్డినేటర్ రమేష్ సన్మానించారు. అదే విధంగా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను ఆయన సందర్శించారు. ప్రతి కౌన్సిలర్ 50 అడ్మిషన్లు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాలయ్య, అధ్యాపకులు బాల్రెడ్డి, కిష్టయ్య, సత్యనారాయణ, సుదా, పాండురంగం, బాలరాజు, అసిఫ్ అలీ, లింగమూర్తి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అధికంగా భూ సమస్యలపైనే..
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 అర్జీలు వచ్చాయి. అధికంగా రెవెన్యూ సమస్యలపై 44 వినతులు ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప.. తప్పనిసరిగా ప్రజవాణికి హాజరుకావాలని, కిందిస్థాయి ఉద్యోగులను పంపవద్దని సూచించారు. ఉన్నతాధికారులను కలిసి తమ బాధలు తెలియజేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోడ్చి ప్రజలు వస్తుంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. ● బొమ్మలరామారం మండలం జలాల్పురం జెడ్పీహెచ్ఎస్ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను సద్దుబాటుపై ఇతర స్కూళ్లకు పంపారని, వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ● ఇస్కాన్, హరేకృష్ణ సంస్థల అధ్వర్యంలో కలెక్టరేట్లో రూ.5కు భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీశైలం, జేహెచ్ రావు, హర్షవర్ధన్ తదితరులు కలెక్టర్కు విన్నవించారు. కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారిలో ఆర్థిక స్థోమత లేని వ్యక్తులు బయట తినలేకపోతున్నారని, సంస్థ నిర్వాహకులతో మాట్లాడాలని కోరారు. ● నూతన వీఓఏను నియమించాలని యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులు కోరారు. ఆమైపె ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని, మరొకరిని నియమించకపోవడంతో సంఘాల నిర్వహణ, కొత్త సంఘాల ఏర్పాటుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ 104 ఉద్యోగులు కలెక్టర్కు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా 31 మంది విధులు నిర్వహిస్తున్నారని, ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మారయ్య, శ్రీనివాస్, హరి బాబు, స్వామి, సతీష్, శివకుమార్ పాల్గొన్నారు. -
నారసింహ.. నిర్లక్ష్యం వదిలించుమా!
ఇప్పటికైనా జాప్యాన్ని వీడాలిలక్షలాది రూపాయలు వెచ్చించి కృత్రిమంగా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. నాలుగేళ్ల క్రితమే పనులు పూర్తయినా ఉపయోగంలోకి తేకపోవడంపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటర్ఫాల్స్ను ప్రారంభిస్తే క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆహ్లాదాన్ని పొందేందుకు వీ లుంటుంది. ఆలయ అధికారులు ఇప్పటికై నా జాప్యాన్ని వీడి జలపాతాన్ని ప్రారంభించాలి. – గంగసాని నవీన్, భక్తుడు, యాదగిరిగుట్ట రూ.లక్షలు వెచ్చించి వదిలేశారుభక్తులు చాలామంది మొదటి ఘాట్ రోడ్డు గుండా కాలినడకన కొండపైకి వెళ్తుంటారు. ఇదే మార్గంలో తిరుగు ప్రయాణమవుతుంటారు. లక్షలు వెచ్చింది ఏర్పాటు చేసిన వాటర్ఫాల్స్ను నిరుపయోగంగా ఉంచడం తగదు. కొండపైన భక్తుల సౌకర్యాలపై దృష్టిసారించిన విధంగానే ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వాటర్ఫాల్స్ను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. – కర్రె ప్రవీణ్, బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడుయాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేందుకు మొదటి ఘాట్ రోడ్డులో వాటర్ఫాల్స్ ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితమే పనులు పూర్తిచేసినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసి, కొండ పైనుంచి కిందకు నీళ్లు జారేవిధంగా కృతిమ పద్ధతిలో జలపాతాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం వైటీడీఏ లక్షలాది రూ పాయలు ఖర్చు చేసింది. భక్తులు తిరుగు ప్రయాణంలో వాటర్ఫాల్స్ చెంత సేదదీరి, ఆహ్లాదం పొందటానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. పలుమార్లు ట్రయల్ రన్ వాటర్ఫాల్స్ను పలుమార్లు విజయవంతంగా ట్రయల్రన్ నిర్వహించారు. కొండపై నుంచి నీళ్లు జాలువారుతూ అద్భుతంగా కనువిందు చేసింది. అంతేకాకుండా ప్రకృతి సిద్ధంగా కనిపించేలా వాటర్ ఫాల్స్కు ఇరువైపులా చెట్లను పెంచారు. మధ్య రంగురంగుల పూల మొక్కలు నాటారు. ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ సేదదీరడంతో పాటు ఫొటోలు దిగుతూ కనిపించేవారు. ప్రధానాలయం పునఃప్రారంభ సమయంలోనే వాటర్ఫాల్స్ను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. కానీ, వీలు కుదరకపోవడంతో వాయిదా వేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు వాటర్ఫాల్స్ ప్రారంభంపై దృష్టి సారించకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. ఇప్పటికై నా అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. యాదగిరి క్షేత్రంలో భక్తులకు ఆహ్లాదం పంచని వాటర్ఫాల్స్ నాలుగేళ్ల క్రితం మొదటి ఘాట్ రోడ్డులో ఏర్పాటు ప్రారంభానికి కుదరని ముహూర్తం -
ప్రశ్నిస్తే మాపైనే కేసులు పెడతారా?
మోటకొండూర్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం అయ్యారని తేర్యాల గ్రామ రైతులు ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని, ప్రశ్నించిన తమపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పరిధినుంచి వెళ్తున్న వాగును ఏళ్ల కాలంగా కాపాడుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం అధికారులు పర్మిషన్ ఇవ్వగా ఇదే అదనుగా లూటీ చేస్తున్నారని వాపోయారు. పరిమితికి మించి ట్రాక్టర్ల ద్వారా బ్లాక్ మార్కెట్కు ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులపైనే కేసులు పెట్టి, బైండోవర్ చేయటాన్ని వారు ఖండించారు. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని.. ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగదివ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బాలగాని రాజుగౌడ్, మంత్రి ప్రభాకర్, బొంగు కృష్ణమూర్తి, నల్ల భాషా, నల్ల ఎల్లస్వామి, నల్ల నర్సింహ, కడకంటి నాగాచారి, మరాఠి శ్రీను, బూరెడ్డి సుధాకర్రెడ్డి, బిక్షం, బొట్ల రాంచంద్రు తదితరులు పాల్గొన్నారు.ఫ తేర్యాల గ్రామ రైతుల ధర్నా -
ఖిలా పనుల్లో కదలిక..
భువనగిరి: చారిత్రక భువనగిరి కోట అభివృద్ధికి కీలక అడుగులు పడ్డాయి. తొలిదశ పనులను రెండు ప్యాకేజీల్లో చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. రోప్వే పనులను పశ్చిమ బెంగాల్కు చెందిన ఏజెన్సీ, సివిల్స్ వర్స్ను హైదరాబాద్ కంపెనీ దక్కించుకున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఖిలాపైకి రోప్వే ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా చదును చేశారు. పర్యాటక శాఖ అధికారులు, ఏజెన్సీల నిర్వాహకులు ఇటీవల ఖిలాను సందర్శించి అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలించారు. రూ.100 కోట్లతో నాలుగు దశల్లో.. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఎంపికై న భువనగిరి ఖిలాను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం నాలుగు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.56.81 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ఖిలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ పలుమార్లు భువనగిరి కోటను సందర్శించి అధ్యయనం చేసి డీపీఆర్ రూపొందించి ఫైనల్ చేసింది. దీని ఆధారంగా తొలి విడత పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఇందులో రోప్వే పనులను పశ్చిమ బెంగాల్కు చెందిన ఏజెన్సీ రూ.18 కోట్లకు దక్చించుకోగా.. సివిల్ పనులను హైదరాబాద్ ఏజెన్సీ రూ.30 కోట్లకు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఈనెల 18న పర్యాటక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అగ్రిమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు వచ్చే ఏడాది నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఫ రెండు ప్యాకేజీలుగా పనులు ఫ రోప్వే టెండర్ దక్కించుకున్న పశ్చిమ బెంగాల్ ఏజెన్సీ ఫ సివిల్ వర్క్స్ హైదరాబాద్ కంపెనీకి ఫ రోప్వే బేస్ క్యాంప్ వద్ద పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు రోప్ వే : ఖిలా నుంచి బైపాస్ సమీపంలోని రోవ్వే బేస్ క్యాంప్ వరకు రెండు కేబుల్ కార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రెండు సిమెంట్ పిల్లర్లు నిర్మించి రోప్వే ద్వారా రావడం, వెళ్లండం కోసం తీగ మార్గం ఏర్పాటు చేస్తారు. రోప్వే బేస్ క్యాంప్, చివరి ప్రాంతంతో పర్యాటకుల కోసం గ్రీనరీ, విశ్రాంతి ప్రదేశాలతో పాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. సివిల్ వర్క్స్: కోట ఎంట్రీ వద్ద చారిత్రక కట్టడాల శైలిలో ప్రవేశ ద్వారం నిర్మించనన్నారు. అలాగే క్యాంటీన్, గ్రీనరీ, పార్కింగ్, గోడ, విద్యుత్ దీపాల ఏర్పాటు, భవనాలకు మరమ్మతులు చేయనున్నారు. వీటితో పాటు కోట పైభాగంలో రాణిమహాల్ భవనాన్ని ఆధునీకరించి కొత్త రూపు తీసుకురానున్నారు. అవసరమైన చోట మెట్లు, రెయిలింగ్, తాగునీటి సౌకర్యం, మూత్ర శాలలు ఏర్పాటు చేస్తారు. ఖిలా ప్రవేశ ద్వారం నుంచి రోవ్వే బేస్ క్యాంప్వరకు సీసీ రోడ్డు నిర్మిస్తారు. టెండర్లు పూర్తి కావడంతో ఖిలా అభివృద్ధి పనులను ప్రారంభించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే రోవ్ వే బేస్ క్యాంప్ వద్ద ప్రదేశాలను చదును చేశారు. రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం ఖిలాను సందర్శించి పనులు చేపట్టే ప్రాంతాలను పరిశీలించాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన వాయిదా పడింది. త్వరలో తేదీని ఖరారు చేయనున్నట్లు తెలిసింది. -
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీ భేటీ
సాక్షి, యాదాద్రి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాత్సవతో సికింద్రాబాద్ రైల్వే కార్యాలయంలో సమావేశం అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు ప్రాజెక్టులు, సమస్యలపై ఆయనతో చర్చించారు. ఎంఎంటీఎస్ పనులను వేగవంతం చేసి 2027 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ప్రధానంగా బీబీనగర్ – భువనగిరి మధ్య 52 ఎకరాలు భూ సేకరణ పూర్తి చేస్తేనే మిగతా పనుల్లో వేగం పెరుగుతుందన్నారు. అలాగే భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం వద్ద అండర్పాస్ నిర్మించాలని, రామన్నపేటలో ఫలక్నుమా, శబరి, నారాయణాద్రి, ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉదయనాథ్కోట్ల, ఎంఎంటీఎస్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రాజెక్టులు, సమస్యలపై చర్చ -
మంత్రుల ధ్యాసంతా పైరవీలపైనే ఽ
చౌటుప్పల్ : మంత్రులకు ప్రజా సమస్యలకంటే పైరవీలపైనే ధ్యాస ఎక్కువని, ఎవరికి వారు దుకాణాలు తెరిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి ఎద్దేవా చేశారు. హామీల అమలు, అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. చౌటుప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సోమవారం మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందన్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఎరువులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా సకాలంలో తెప్పించుకోకుండా నిందలు మోపే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతలు పెట్టడం ఖాయమన్నారు. సైనికుల్లా పని చేయాలి స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు కై రంకొండ అశోక్, కడారి కల్పన, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి,ముత్యాల భూపాల్రెడ్డి, చినుకని మల్లేష్, ఊడుగు యాదయ్య, కంచర్ల గోవర్ధన్రెడ్డి, రాధారపు సత్తయ్య, కాయితి రమేష్, కడారి అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి -
100 మందికి పదోన్నతులు
భువనగిరి: ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ కొ లిక్కి వచ్చింది. 100 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పపదోన్నతి లభించనుంది. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు సోమవారం వెబ్ ఆప్షన్ పెట్టుకోనున్నారు. వారికి మంగళవారం డీఈఓ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పోస్టులకు అర్హతఉపాధ్యాయుల్లో చాలామంది గణితం, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. వీరు మూడు పోస్టులకు అర్హత పొందుతున్నారు. 1:3 నిష్పత్తి ప్రకారం సీనియార్టీ జాబితా తయారు చేయడంతో ఇలాంటి సమస్య వచ్చింది. దీంతో అధికారులు ఈనెల 23న వారిని పిలిచి ఒక్కటే ఎంపిక చేసుకోవాలని సూచించి అంగీకార పత్రాలు తీసుకున్నారు.అనంతరం సీనియార్టీ జాబితా ప్రకటించి ఆదివారం అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలు రాకపోవడంతో తుది జాబితా ప్రకటించారు. పాఠశాలల వారీగా పదోన్నతులుజెడ్పీ, ప్రభుత్వ 163, ప్రాధమికోన్నత 68, ప్రాథమిక పాఠశాలలు 484 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2,939 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో 100 మంది ఎస్టీజీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 76, ప్రాథమిక పాఠశాలల్లో 20, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నలుగురు ఉన్నారు. కొలిక్కి వచ్చిన ఉపాధ్యాయ ప్రమోషన్లు నేడు వెబ్ ఆప్షన్లకు అవకాశం రేపు ఆర్డర్ కాపీలు అందజేత -
సుర్వి బాలరాజుకు భారత్ ఐకాన్ అవార్డు
భూదాన్పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన సామాజికవేత్త సుర్వి బాలరాజుగౌడ్ భారత్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఆస్పత్రులు, బస్టాండ్ల వద్ద అన్నార్థులకు ఉచితం భోజనం అందిస్తూ వారి ఆకలి, దప్పిక తీర్చుతూ బాలరాజు చేస్తున్న స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని లోక్కళ మంచ్ ఆడిటోరియంలో ఉజ్వల కల్చరల్ ఫౌండేషన్, శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ సంయుక్తంగా సింధూర్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఎల్టికల్నల్ రామ్శంకర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఘ నంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. ప్రసాద వితరణకు ఆధునిక పరికరాలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాద పంపిణీ వితరణ కోసం ఆధునిక పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. ఆదివారం ఆలయ ప్రసాద విభాగాన్ని తనిఖీ చేశారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్, అమ్మకాలతో పాటు పరిశుభ్రతను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రసాదం పంపిణీ వితరణకు ఆధునిక యాంత్రిక పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అనంతరం క్యూలైన్లలో భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తక్కువ రేట్లతో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భక్తులు ఈ సందర్భంగా ఈఓ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, అధికారులు దయాకర్రెడ్డి, రామావు, శ్రీనివాస్ రెడ్డి, నవీన్కుమార్, ఆర్ఐ శేషగిరిరావు ఉన్నారు. -
విస్తరిస్తున్న ఆయిల్పామ్
జిల్లాలో 6,400 ఎకరాల్లో సాగు.. 700 ఎకరాలకు రిజిస్ట్రేషన్ఆత్మకూరు(ఎం): జిల్లా వ్యాప్తంగా ఆయిల్పామ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం 6,400 ఎకరాల్లో సాగవుతుండగా.. మరో 700 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా మూడేళ్ల కిత్రం మొదటి దశలో నాటిన మొక్కలు నేడు ఫలాలనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గెలలు కోసి మార్కెట్కు తరలించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. శ్రమ, పెట్టుబడి తక్కువ, మంచి లాభాలు, ఒక్కసారి నాటితే మూడేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి, ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలతో ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2022–23లో ఆయిల్పామ్ సాగు ప్రారంభంయాదాద్రి భువనగిరి జిల్లాలో 2022–23లో అయిల్పామ్ సాగు ప్రారంభించారు. మొదటి విడతలో 1,400 ఎకరాలు లక్ష్యం కాగా.. 285 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిస్థాయిలో మొక్కలు నాటారు. 2023–25 ఆర్థిక సంవత్సరంలో 4,500 ఎకరాలకు గాను పూర్తిస్థాయిలో లక్ష్యం చేరారు. 2025–26లో 3 వేల ఎకరాలు ఆయిల్పామ్ సాగు చేయాలన్నది ఆయిల్ఫెడ్ సంస్థ లక్ష్యం కాగా.. అందులో ఇప్పటి వరకు 500 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయ్యింది. మరో 700 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. మార్చి 31 వరకు టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు, ఫీల్డ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వలిగొండ, చౌటుప్పల్, తుర్కపల్లిలో కలెక్షన్ సెంటర్లు మొదటి దశలో నాటిన మొక్కలు నేడు ఫలాలనివ్వబోతున్నాయి. ప్రస్తుతం 170 ఎకరాల్లో తోటలు కోతకు వచ్చాయి. మరో వెయ్యి ఎకరాలు కోతకు రానున్నాయి. జిల్లాలో వలిగొండ, చౌటుప్పల్, తుర్కపల్లిలో కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయిల్పామ్ చేతికొచ్చిన రైతులు కలెక్షన్ సెంటర్లకు లేదా నేరుగా నూనె కర్మాగారాలకు గెలలను తరలించి మార్కెట్ చేసుకోవచ్చు. సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట వద్ద దేశంలోనే అతిపెద్ద నూనె కర్మాగారం నిర్మిస్తున్నారు. దసరా నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జిల్లా రైతులకు మేలు చేకూరుతుంది. ఫలితాలివ్వబోతున్న మొదటి విడత మొక్కలు 170 ఎకరాల్లో కోతకు సిద్ధం మార్కెటింగ్ సౌలభ్యం కోసం మూడు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటుఆయిల్పామ్ సాగు (ఎకరాల్లో) సంవత్సరం లక్ష్యం సాగు2023–24 1,400 1,400 2024–25 4,500 4,500 2025–26 3,400 500ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు వెళ్లి స్వయంగా ఆయిల్పామ్ సాగుపై అధ్యయనం చేశా. కోతుల బెడద, దళారుల సమస్య ఉండదు. ఆదాయం కూడా మంచిగానే ఉందనిపించింది. ఒక ఎకరం నీటితో నాలుగు ఎకరాల అయిల్పామ్ సాగు చేయొచ్చు. అందుకే గ్రామంలో 15 ఎకరాల్లో అయిల్పామ్ సాగు చేస్తున్నా. ఈ సంవత్సరమే మొక్కలు నాటాను. – మందడి శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల, ఆత్మకూరు(ఎం)2022లో పది ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశా. అప్పటి అయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి దగ్గరుండి మొక్కలు నాటించారు. అంతరపంటగా వక్క తోట సాగు చేశా. ఇటీవల పామాయిల్ కోతకు వచ్చింది. మా ఏరియాకు వలిగొండ సెంటర్ కేటాయించారు. గెలలు కోయగానే వలిగొండకు తీసుకెళ్తా. –మల్లెపూల ఉపేందర్, మోదుగుకుంట, ఆత్మకూరు(ఎం) మండలం -
‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు!
మోటకొండూర్ మండల కేంద్రంలో వాగులు లేకపోవడంతో ఇందిరమ్మ ఇంటికి ఇసుక దొరకడం లేదు. దీంతో ట్రాక్టర్కు రూ.3,500 వెచ్చించి ప్రైవేట్గా మూడు ట్రిప్పుల ఇసుక పోయించిన. ఆ తరువాత ఆలేరు వాగు నుంచి ఇసుక రవాణా చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు ట్రిప్పులకు పర్మిషన్ తీసుకున్న. అందులో ట్రాక్టర్ రూ.2,500 చొప్పున రెండు ట్రిప్పులే పోశారు. ఇసుక సరిపోక టన్నుకు రూ.2వేలు చెల్లించి రెండు టన్నులు పోయించుకున్న. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.మోటకొండూర్: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. వాగులు, వంకల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తోడేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఇంటికి దశలవారీగా 10 ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, వ్యాపారులు రెండు,మూడు ట్రాక్టర్లు మాత్రమే లబ్ధిదారులకు పోసి మిగతా ట్రిప్పులను ప్రైవేట్కు అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఇక్కుర్తి, దిలావర్పూర్, మాటూర్, అమ్మనబోలు, తేర్యాల, బేగంపేట, ఆలేరు, బిక్కేరు.. ఇలా అన్ని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. బ్లాక్లో ట్రాక్టర్ రూ.5వేలకు అమ్మకంమోటకొండూర్ మండలానికి 276 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 236 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో 94 మంది లబ్ధిదారులు ఇసుక కోసం తహసీల్దార్ కార్యాలయంలో పర్మిషన్ పొందారు. ఒక్కో ట్రాక్టర్కు గరిష్టంగా రూ.2వేలకు మించి తీసుకోద్దని రెవెన్యూ అధికారులు ఇసుక వ్యాపారులకు నిబంధన విధించారు. కానీ, లబ్ధిదారుల పేరున పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు అనుమతి పొంది అందులో ఎక్కువ మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల అనుమతితో తరలించిన ఇసుకను లబ్ధిదారులకు చెందకుండా రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్న ఇసుకదందా వల్ల గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రైతులపైనే కేసులు!స్థానిక వాగుల్లో ఇసుక నిల్వలు సరిపడా లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వేర్వేరు గ్రామాల పరిధిలో ఉన్న వాగుల నుంచి తీసుకెళ్లడానికి అనుమతి పొందుతున్నారు. ఈ క్రమంలోనే మోటకొండూరు మండలం తేర్యాల వాగులో ఇసుక కోసం వేర్వేరు గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులు మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో పర్మిషన్ తీసుకున్నారు. 22,23 తేదీల్లో ఉదయం తేర్యాల వాగు నుంచి ఏకంగా 30 మంది కూలీలతో ట్రాక్టర్ల ద్వారా లబ్ధిదారులు ఇసుక తరలించారు. సమీప రైతులు, గ్రామస్తులు అడ్డుకుని లేబర్ను పంపించారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి ఇసుక తరలించడం ప్రారంభించగా పక్కనున్న ఓ రైతు ఆక్షేపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ల, రైతుకు ఘర్షణ చోటు చేసుకుంది. సదరు రైతు అన్నదమ్ములు, సమీపంలో ఉన్న కొందరు గ్రామస్తులు గమనించి సంఘటన స్థలానికి వచ్చి డ్రైవర్లతో గొడవకు దిగారు. చివరికి ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. ట్రాక్టర్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఏడుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.వాగులను తోడేస్తున్న వ్యాపారులు అధిక ధరకు బ్లాక్లో ఇసుక విక్రయం తేర్యాల గ్రామంలో అడ్డుకున్న రైతులతో ట్రాక్టర్ డ్రైవర్ల ఘర్షణ ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు -
పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
యాదగిరిగుట్ట: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని.. ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం దక్కుతుందన్నారు. 24 గంటలు వైద్యసేవలు అందించేలా వైద్యసిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పావని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు భిబిక్షపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, పెలిమెల్లి శ్రీధర్గౌడ్, ముక్కెర్ల మల్లేష్, ఆకుల గణేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పథకాలన్నీ చేనేతకూ వర్తింపజేయాలి
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చేనేత కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్ కోరారు. అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్తంగా హైదారాబాద్ నుంచి చేపట్టిన చేనేత నేతన్న యాత్ర సంస్థాన్ నారాయణపురం మీదుగా ఆదివారం పుట్టపాకకు చేరుకుంది. సంస్థాన్ నారాయణపురంలో కొండా లక్ష్మణ్బాపూజీ, పుట్టపాకలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత వస్త్రాలను పరిశిలించారు. పురుషులు, మహిళలు చేనేత వస్త్రాలు ధరించి ప్యాషన్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. జాతీయ చేనేత అవార్డు గ్రహీతలు గూడ పవన్, గజం నర్మదను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఇంచార్జి బొల్ల శివశంకర్ మాట్లాడుతూ రాజకీయ పదవుల్లో పద్మశాలీలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, రాష్ట్రం ప్రకటించినట్లుగా రూ.లక్ష వరకు రుణమాపీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ జియో ట్యాగ్ కల్పించాలని, అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు, చేనేత సంబంధిత కార్పొరేషన్ పదవులు ఇవ్వాలన్నారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు కమర్తపు మురళీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేనేతకు అనేక పథకాలు అమలు చేస్తుందని, రూ.33 కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రూ.680 కోట్ల విలువైన 1.28 కోట్ల చీరల తయారీకి సిరిసిల్ల పద్మశాలి సంఘానికి అర్డర్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళాప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచందర్రావు, మహిళా ఆధ్యక్షురాలు గుంటక రూప, బొమ్మ ప్రవళ్లిక, అవ్వారి భాస్కర్, మాచర్ల రామచందర్, జిల్లా ఆధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సామల విజయలక్ష్మి, గజం పుష్పలత, సామల భాస్కర్, గజం హనుమంతు, సత్యనారా యణ, వెంకటేశ్వర్లు, శంకర్, బాలసుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, సమత, తిరుమల, అశ్విత, సునీత, పద్మ, లక్ష్మి, విశ్వరేఖ తదితరలు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఇంచార్జి బొల్ల శివశంకర్ పుట్టపాకకు చేరిన నేతన్న యాత్ర -
ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది
విజృంభిస్తున్న వ్యాధులు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నీలగిరిలో సందడి చేస్తున్న ఫ్రాన్స్ దేశస్తుడు - 9లోరామగిరి(నల్లగొండ) : నాకు పర్యటనలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్ కార్పొరేట్ ఫైనాన్స్ పూర్తి చేసిన నేను ఫ్రాన్స్ రైల్వేస్లో డేటా మేనేజర్గా పని చేస్తున్నాను. 2011లో మొదటిసారి ఢిల్లీలోని భీంటెక్ కంపెనీకి స్టడీ ఎక్ఛ్సేంజ్ కార్యక్రమానికి ఇండియా వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు ఇండియాలో పర్యటించాను. నేపాల్ దేశాన్ని కూడా సందర్శించాను. ఇండియాలోని 14 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షించాను. ఇక్కడి హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, లడక్, టిబెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఆడ్రిన్ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చాను. రాజస్థాన్లోని జైపూర్, లడక్, కార్గిల్ను సందర్శించాను. అమర్నాథ్ యాత్రకు వెళ్లాను. ఆగస్టులో హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ విపాసన ధ్యాన కేంద్రానికి వెళ్లాను. వారం రోజుల పాటు అక్కడ ధ్యానంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వలంటీర్గా వచ్చిన నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన నితిన్తో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు ఆగస్టు 17న కంచనపల్లికి వచ్చాను. ఇండియా గొప్ప దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. అనేక భాషలు మాట్లాడుతారు. పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల వెళ్లిన అమర్నాథ్ యాత్ర ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇండియాలో నేను ఎక్కువగా నార్త్ ఇండియా సందర్శించాను. ఇప్పుడు మొదటిసారి సౌత్ ఇండియాకు వచ్చాను. ఇండియాలో నేర్చుకున్న ధ్యానం జీవనానికి, ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడుతుంది. హిందూ, బుద్ధిజం అంటే ఇష్టపడతాను. తీరిక సమయాల్లో రామాయణం, భగవద్గీత చదువుతాను. -
పరిష్కారం అరకొరే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో సమస్యలు అరకొరగానే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు.. పరిష్కారానికి పొంతన లేదు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థాయిలో పరిష్కారానికి అనుకూలంగా లేనివే అధికంగా ఉండటంతో వాటి పరిష్కారానికి తహసీల్దార్లు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అధిక దరఖాస్తులు పరిష్కరించిన జిల్లాల్లో నల్ల గొండ ముందు స్థానంలో ఉండటం గమనార్హం. పరిష్కారానికి సిద్ధంగా 8,384 దరఖాస్తులుఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో పావలావంతు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,02,768 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 3,996 దరఖాస్తులను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు పరిష్కరించగలిగారు. పరిష్కారానికి సిద్ధంగా మరో 8,384 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని తహసీల్దార్లు వారి స్థాయిలో పరిశీలించి.. ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ లాగిన్లకు పంపించారు. వారి లాగిన్ నుంచి అప్లోడ్ చేస్తే ఆయా దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలో నల్లగొండ మొదటి స్థానంరాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. భూ భారతిలో వాటిని పరిష్కరించే క్రమంలో అధికంగా నల్లగొండ జిలాల్లోనే 2,633 దరఖాస్తులు పరిష్కరించారు. తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం దరఖాస్తులు 61,145 వచ్చాయి. వాటిల్లో పరిష్కారమైంది 99 మాత్రమే. నల్లగొండ జిల్లాలో 43,545 దరఖాస్తులు వస్తే అందులో 2,633 దరఖాస్తులు పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.దరఖాస్తులు ఇలా.. జిల్లా దరఖాస్తులు పరిష్కారంనల్లగొండ 43,545 2,633 సూర్యాపేట 44,741 551 యాదాద్రి 14,482 812 మొత్తం 1,02,768 3,996భూ భారతి దరఖాస్తులకు కలగని మోక్షం కుస్తీలు పడుతున్న తహసీల్దార్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 1,02,768 వాటిలో 3,996 అప్లికేషన్లకే మోక్షం అయినా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువగా పరిష్కారంఎన్నో అడ్డంకులు భూ సమస్యలు పరిష్కరించే విషయంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లకు తంటాలు తప్పడం లేదు. సాదాబైనామా విషయం కోర్టులో ఉండటంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీఓటీ) పరిధిలో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. మిగిలిన టీఎం 33 భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. ఇందులో పౌతిల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా పరిష్కారం కానివి చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం తహిసీల్దార్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కోర్టు కేసులు, ఇతర భూ సమస్యలకు సంబంధించి మొండి కేసులే అధికంగా ఉండటంతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొందరికి భూమి ఉండి కాగితాలు లేవు. అలాంటి వాటి విషయంలో పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో అగ్ని ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలో శనివారం రాత్రి 9గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శనివారం రాత్రి 9గంటలకు కార్మికులు డ్యూటీ షిఫ్ట్ మారే సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నగా మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో డ్యూటీలో ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలిసింది. మంటలను గమనించిన కార్మికులు భయంతో పరిశ్రమ బయటకు పరుగులు తీశారు. కార్మికులు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. చౌటుప్పల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో రియాక్టర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భయాందోళనలో జైకేసారం గ్రామస్తులు.. గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో జైకేసారం గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి సమీపంలో పరిశ్రమ ఉండడంతో మంటల్లో రియాక్టర్లు పేలి దాని తీవ్రత ఎంతగా ఉంటుందోనని భయాందోళనకు గురయ్యారు. సమాయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కంపెనీలో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు గాయపడిన ఉదంతాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
చివ్వెంల(సూర్యాపేట): భర్తతో పాటు అతడి ఇద్దరి భార్యలపై హత్యాయత్నం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం చివ్వెంల పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మయ్య మొదటి భార్యతో కుడకుడ గ్రామానికి చెందిన దండుగుల శేఖర్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. గతంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగగా.. పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకున్నారు. కేసులు పెట్టుకుని రాజీపడ్డారు. కానీ శేఖర్ మాత్రం లక్ష్మయ్య, అతడి మొదటి భార్యపై పగ పెంచుకున్నాడు. సూర్యాపేటలోని సుందరయ్య నగర్కు చెందిన శేఖర్ స్నేహితుడు పల్లపు గోపి ఇంటి నిర్మాణానికి లక్ష్మయ్య వద్ద రాయి కొనుగోలు చేశాడు. రాయికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని లక్ష్మయ్య గోపిని విసిగిస్తుండడంతో.. శేఖర్, గోపితో పాటు వారి స్నేహితులైన టేకుమట్ల గ్రామానికి చెందిన పల్లపు రాము, రాయినిగూడెం గ్రామానికి చెందిన పసుపుల చంటి కలిసి శుక్రవారం చివ్వెంల పోలీస్ స్టేషన్కు బైక్పై వెళ్తున్న అక్ష్మయ్య, అతడి ఇద్దరి భార్యలను కారులో వెంబడించి వారిపై దాడి చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు లక్ష్మయ్య, అతడి భార్యలు బీబీగూడెం గ్రామ శివారులోని మధుర వైన్స్లో వెళ్లి దాచుకున్నారు. దీంతో శేఖర్, గోపితో పాటు వారి స్నేహితులు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పండ్ల రారాజుకు సెలవు
నూతనకల్: నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన, పండ్ల రారాజుగా పేరుగాంచిన దేశ్ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో పూర్తయ్యాయి. శ్యాంసుందర్రెడ్డి తండ్రి జెన్నారెడ్డి ప్రతాప్రెడ్డి నిజాం కాలంలో దేశ్ముఖ్గా పనిచేశారు. ప్రతాప్రెడ్డికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా.. పెద్ద కుమారుడైన శ్యాంసుందర్రెడ్డి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి తనకు ఉన్న 800 ఎకరాల్లో మామిడి, బత్తాయి, సపోట వంటి పండ్ల తోటలు సాగుచేసి భారతదేశంతో పాటు ఆసియా దేశాలకు సైతం పండ్లు సరఫరా చేసి భారత ప్రభుత్వంచే పండ్ల రారాజుగా అవార్డు అందుకున్నారు. ఓపెన్ చానల్ ద్వారా నీటి సరఫరా చేసి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. రాజకీయంగా ఎంతో మందికి అండదండలు అందించి ఉన్నత పదవుల్లో నిలిచేలా కృషిచేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. విద్యావ్యాప్తిలో భాగంగా హైదరాబాద్లో చైతన్య భారతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సీబీఐటీ, ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపనలో పాలుపుంచుకుని ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించే విధంగా కృషిచేశారు. శ్యాంసుందర్రెడ్డి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి స్వయాన బావ. శ్యాంసుందర్రెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్రెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్సింహారెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొప్పుల వేణారెడ్డి, తీగల గిరిధర్రెడ్డి, గుడిపాటి నర్సయ్య, తిరుమలప్రగడ అనురాధ, పోతు భాస్కర్, నాగం సుధాకర్రెడ్డి, గుంటకండ్ల చంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించారు.ఫ ముగిసిన శ్యాంసుందర్రెడ్డి అంత్యక్రియలు ఫ నివాళులర్పించిన ప్రముఖులు -
వాహనదారులపై వడ్డన
తిరుమలగిరి (తుంగతుర్తి) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ సేవా రుసుములు పెంచింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేస్తూ గత నెల 22న జీఓ నంబర్ 51 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్టీఏ సర్వర్లో మార్పులు చేశారు. జీఓ విడుదలైన వెంటనే సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ కార్యాలయాల్లో పెంచిన రుసుములతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ అధికారులు పెరిగిన రుసుముల వివరాలు కార్యాలయం నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో రవాణా శాఖకు ఆదాయం, వాహనదారులపై ఆర్థిక భారం పెరిగింది. ప్రతిరోజూ 200 దరఖాస్తులు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సరాసరి 200 దరఖాస్తులు వస్తుంటాయి. రవాణా శాఖ సేవా రుసుము పెంపు నిర్ణయంతో జిల్లా రవాణా శాఖకు ఆదాయం పెరిగింది. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సొంతంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వారికి సేవా రుసుము ఆన్లైన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఏజెంట్ల ద్వారా సేవలు పొందితే మరింత భారం తప్పేలా లేదు. దరఖాస్తు చార్జీల పెంపు రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించి నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్స్, పర్మిట్, సామర్థ్య పరీక్షలతోపాటు ఇతర సేవలపై అదనపు చార్జీలతోపాటు పన్నులను సైతం పెంచింది. వాహనం ఇన్వాయిస్ ధర ప్రకారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్ పన్నులు పెంచారు. గతంలో రూ.50 మాత్రమే ఉండగా.. రూ.500 లోపు పన్నుకు రూ.50, రూ.500 కంటే ఎక్కువ ఉంటే రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. పెంచిన చార్జీలు ఇలా.. ఫ లెర్నింగ్ లైసెన్స్ పరిమితి 6 నెలలు కాగా.. గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.200 చేశారు. ఫ డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన పీవీసీ స్మార్ట్ కార్డుల సేవా రుసుము ఐదేళ్ల కాల పరిమితికి లైట్ మోటారు వాహనం రూ.200 నుంచి రూ.300కు, 20ఏళ్ల లోపు నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలకు రూ.300 నుంచి రూ.400కు పెంచారు. ఫ వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి పీవీసీ, స్మార్ట్ కార్డులకు నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలకు 0.5 శాతం, ట్రాన్స్పోర్టు వాహనాలకు 0.1 శాతం పన్ను, 3 చక్రాల వాహనాలకు ఏడాదిలోపు రూ.250 నుంచి రూ.300లకు, ఏడాది కంటే ఎక్కువగా ఉంటే రూ.300 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు. ఫ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు రెండేళ్లలోపు రూ.100 నుంచి రూ.200, రెండేళ్లకుపైన రూ.200 నుంచి రూ.300లకు పెంచారు. ఫ వాహన పర్మిట్ చార్జీలను గతంలో ఉన్న చార్జీల కంటే రూ.100 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. సేవా రుసుములు పెంచిన రవాణా శాఖ ఫ గతంలో కంటే రెట్టింపు చేస్తూ జీఓ జారీ ఫ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఫీజు తక్కువే.. ఫ ఏజెంట్ల ద్వారా వెళ్తే మరింత ఆర్థిక భారం -
లైటింగ్ మెరుగుపర్చాలి
ఫ ఈఓ వెంకట్రావ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రానికి లైటింగ్ మరింత మెరుగుపర్చాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం రాత్రి ఆయన ఆలయ క్యూలైన్లు, లైటింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులను ఆకర్షించే విధంగా లైటింగ్ను మెరుగుపర్చాలన్నారు. అంతేకాకుండా ఆలయ భద్రత, క్యూలైన్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ ఉచిత ప్రసాదం తప్పనిసరిగా అందించాలన్నారు. అంతకుముందు భక్తులతో మాట్లాడి వసతి సదుపాయాలు, సౌకర్యాలు, ప్రసాదం ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయన వెంట ఆలయాధికారి కృష్ణ, ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. -
యూరియా కష్టాలు
తుర్కపల్లి: యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగుపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందే వరి నాట్లేసిన రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదని వాపోతున్నారు. శనివారం ఉదయం నుంచే తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రైతులు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. గంటల తరబడి నిరీక్షించినా ఎకరానికి ఒక్క బస్తా చొప్పున మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య
గుర్రంపోడు: తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. మొసంగి గ్రామానికి చెందిన బొంగరాల శ్రీధర్(21) ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుండడంతో అతడి తల్లి వెంకటమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీధర్ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.రైలు కింద పడి..తిప్పర్తి: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి శుక్రవారం రాత్రి రాయినిగూడెం గ్రామ సమీపంలో చైన్నై ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుడికాలు తొలగించబడి ఉన్నట్లు రైల్వే తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. నల్లగొండ స్టేషన్ మాస్టర్ నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. యువకుడి అదృశ్యం చౌటుప్పల్: ఆఫీస్కి వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. శనివారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. మూడు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో మురారి భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. ఇక్కడే ఉంటూ రోజూ హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. రోజుమాదిరిగానే ఈ నెల 18న ఉదయం మురారి ఆఫీస్కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అతడికి తన అక్క ఫోన్ చేయగా.. ఇంటికి వస్తున్నా అని చెప్పాడు. కానీ వెళ్లలేదు. ఆ తర్వాత రెండు రోజులు అతడి ఫోన్ ఆన్లో ఉన్నప్పటికీ.. ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. తన తమ్ముడు హైదరాబాద్లో ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. దీంతో శనివారం అతడి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పిల్లలపై ఓ కన్నేయండి!
సాక్షి,యాదాద్రి: ఆటాపాటలతో గడపాల్సిన బాల్యం నేరాల ఊబిలో చిక్కుకుంటోంది. చెడుస్నేహం, స్మార్ట్ఫోన్లు, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ చివరికి హత్యల వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను వేధిస్తూ షీటీంలకు చిక్కుతున్న వారిలో మైనర్లు కూడా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహస్ర ఘటనతో పిల్లల నడవడిక తీరు ఆందోళన కలిగిస్తోంది. పిల్లల పెంపకంలో చేసే తప్పులు భవిష్యత్లో వారిని దారి తప్పుదారి పట్టించేలా చేస్తాయని, పర్యవేక్షణ ఉంచి రోజూ కొంతైనా సమయం కేటాయిస్తే వారిని సరిదిద్దుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు ఇలా మారుతున్నారంటే..పాఠశాల స్థాయినుంచే సెల్ఫోన్, డ్రగ్స్, మద్యం వంటివి విద్యార్థుల జీవితాల్లో చేరుతున్నాయి. వీటికి బానిసలుగా మారిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా విద్యారుల జీవితంలో చెడు వ్యవసనాలు భాగం అవుతున్నాయి. అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారికిని నేరాల్లోకి నెడుతుంది. తాజాగా హైదరాబాద్లో ఓ బాలుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేస్తుండగా చూసిందన్న నెపంతో సహస్ర అనే అమ్మాయిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. సెల్ఫోన్లలో నేర, హింసాత్మక ఘటనలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. పోర్న్, క్రైం, హింస వంటి కంటెంట్ సెల్ఫోన్లలో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. వాటిని వీక్షించడం వల్ల కలిగే దుష్ఫలితాలే ఈ నేరాలని మానసికవేత్తలు అంటున్నారు. పాఠశాల దశలోనే చెడు ఆలోచనల వైపు..విద్యార్థులు పాఠశాల దశలోనే మొబైల్ కంటెంట్, మాదకద్రవ్యాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక అంశాలు కౌమార దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారి హార్మోనులను ప్రేరేపించి, మనసును చెడు ఆలోచనల వైపు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ చిన్న వయసులోనే నేరస్తులుగా మారుస్తున్నాయి. ఇటువంటి అంశాలను తీవ్రంగా పరిగణించి అరికట్టాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది.పేద, మధ్య తరగతిలో అధికం.. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది.ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతున్న ఖర్చులు, అదనపు ఆదాయ వనరుల కోసం నిరంతరం తల్లిదండ్రులిద్దరూ శ్రమించాల్సిందే. ఉదయం వెళ్లి సాయంత్రం ఇల్లు చేరే దంపతులు ఒత్తిడితో తమ పిల్లలపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారు. వీటికి తోడు పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కలహాలు, ఆలుమగల మధ్య మనస్పర్థలు తలెత్తినప్పుడు గొడవలు జరగడం.. వాటి ప్రభావం పిల్లలపై మరింతంగా చూపుతుందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడి యా పిల్లలను చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు దగ్గర చేస్తోంది. ఇంటర్నెట్, సెల్ఫోన్లతో చెడు ఆలోచనలు దురలవాట్లతోనూ పక్కదారి కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం చిన్నతనంలోనే పెరిగిపోతున్న నేర ప్రవృత్తి పాఠశాలల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్న మానసిక నిపుణులుపిల్లలు చిన్నతనంలోనే పెడదోరణి పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం మండలస్థాయిలో మానసిక వైద్య నిపుణులను నియమించాలి. మానసిక సమస్యలు, ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.అలాంటప్పుడు వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలి. – పాశం కృష్ణమూర్తి, ఉపాధ్యాయుడు తమ పిల్లల నవవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. ఒంటిరిగా ఉండడం, తలుపులు మూసుకుని టీవీ, సెల్ఫోన్లు చూడడం వంటివి గమనించి అడ్డుకోవాలి. పిల్ల ల మందు తల్లిదండ్రులు ఘర్షణలకు దిగడం, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలను ప్రస్తావించొద్దు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను గమనిస్తుండాలి. చెడుమార్గంలో వెళ్తున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. – కలెక్టర్ హనుమంతరావు -
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కొండ కింద భక్తులు ఎక్కువగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 30నిమిషాలకు పైగా సమయం పట్టింది. స్వామిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.32,50,356 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శాస్త్రోక్తంగా యాదగిరీశుడి నిత్యకల్యాణంయాదగిరిగుట్ట ఆలయంలో గురువారం నిత్యకై ంకర్యాల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి గజవాహన సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం చేపట్టారు. కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విష్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు పూర్తిచేశారు. ముందుగా ప్రభాతవేళ గర్భాలయంలో స్వామి,అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు.. నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తుందని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను శనివారం వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిచందన్నారు. రామన్నపేట ఆస్పత్రి అభివృద్ధికి నిధుల కోసం త్వరలో సీఎం రేవంత్రెడ్డిని, వైద్యారోగ్యశాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అనంతరం కొమ్మాయిగూడెం ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణపనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నూతన కోర్టు భవనాలు నిర్మించే ప్రదేశానికి రోడ్డు, కల్వర్టులు మంజూరు చేయాలని బార్ అసోషియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ చిన్నానాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి, బత్తుల క్రిష్ణగౌడ్, ఎండీ రెహాన్, అక్రం, గోదాసు పృథ్వీరాజ్, జెల్ల వెంకటేశం, గుత్తా నర్సిరెడ్డి, పూస బాలనర్సింహ, తిమ్మాపురం మహేందర్రెడ్డి, పెద్దగోని వెంకటేశం, గంపల రామచంద్రారెడ్డి, మడూరి జ్యోతి, తాటిపాముల శేఖర్, పిట్ట రాంరెడ్డి, ఎర్ర శేఖర్, కూనూరు కృష్ణగౌడ్, బత్తుల నవీన్, నోముల ప్రవీన్, పరమేష్ పాల్గొన్నారు. ఎంపీ చామల, ఎమ్మెల్యే వీరేశం -
ముఖ్య అర్చకుడిగా శ్రీకాంతాచార్యులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖ్య అర్చకుడిగా కలకోట శ్రీకాంతాచార్యులు నియమితులయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు పదవీ విరమణ పొందారు. దీంతో ప్రధానార్చకుడు–2గా ఉన్న ఉప ప్రధానార్చకుడు సురేంద్రచార్యులకు పదోన్నతి వచ్చింది. ఆయన స్థానంలో ముఖ్య అర్చకుడైన మంగళంపల్లి నరసింహమూర్తికి ఉప ప్రధానార్చకులుగా ఈ నెల 15వ తేదీన పదోన్నతి కల్పించారు. ముఖ్య అర్చకుడి పోస్టును అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న కలకోట శ్రీకాంతాచార్యులతో భర్తీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈఓ వెంకట్రావ్, దేవాదాయశాఖ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక భువనగిరి: ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం భువనగిరి పట్టణంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పా శం కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా కె.వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా ఎంఏ సలీం, ఆర్.సవిత, ఎం.ఆనందరావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్.లింగయ్య, సంయుక్త కార్యదర్శులుగా కె.మల్లేష్, వి.శ్యాంసుందర్, ఎన్.సుదర్శన్రెడ్డి, కోశాధికారిగా ఏ.సుధాకర్, మహిళా కార్యదర్శిగా ప్రతిభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదుల్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కాసం ప్రభాకర్, కోశాధికారి శ్రవణ్కుమార్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్లు తొలగింపు భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో కేబుల్ టీవీలు, ఇంటర్నెట్ సంస్థలు విద్యుత్ స్తంభాల ఆధారంగా ఏర్పాటు చేసిన వైర్లు ప్రమాదకరంగా మారాయి. దీ నిపై ‘మృత్యుపాశాలు’ శీర్షికన శనివారం సాక్షి ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. విద్యానగర్, కిసాన్నగర్లో పలుచోట్ల స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించారు. సమాచారం అందుకున్న కేబుల్ అపరేటర్లు అక్కడికి చేరుకుని గడువు ఇవ్వాలని విద్యుత్ అధికారులను వేడుకున్నారు. అయినా ప్రమాదకరంగా ఉన్న వైర్లను తొలగిస్తుండటంతో ఆపరేటర్లు ఎస్ఈ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గడువు ఇస్తే తామే స్వయంగా సరిచేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు విద్యుత్ శాఖ ఏడీఈ ఆనంద్రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో వైర్లను సరి చేయాలని, లేనిపక్షంలో తామే పూర్తిస్థాయిలో తొలగిస్తామని హెచ్చరించారు. -
మహిళా భక్తులకేదీ ‘మహాలక్ష్మి’?
సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సుల్లో యాదగిరిగుట్టపైకి వచ్చే మహిళా భక్తులకు సైతం దేవస్థానమే టికెట్ డబ్బులు చెల్లిస్తోంది. ఆర్టీసీ 2022 మార్చి 23 నుంచి కొండపైకి అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతోంది. ఇందుకుగాను దేవస్థానం అద్దె చెల్లిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. గుట్టపైకి వచ్చే మహిళా భక్తులకు సైతం ఆర్టీసీకి ప్రతి నెలా దేవస్థానం డబ్బులు చెల్లిస్తోంది. కొండపైకి బస్సులను నడిపినందుకు ఇప్పటి వరకు దేవస్థానం ఆర్టీసీకి సుమారు రూ.25 కోట్ల వరకు చెల్లించిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇంత మొత్తం ఖర్చుచేసిన దేవస్థానం సొంత బస్సులను కొనుగోలు చేయలేకపోయిందన్న విమర్శలున్నాయి. బస్సుల కొనుగోలుతో కొందరికి ఉపాధి కల్పించడంతోపాటు, భక్తుల సొమ్ము ఖర్చు కాకుండా మిగిలేదని స్థానికులు అంటున్నారు. ఉద్ఘాటన తర్వాత పెరిగిన భక్తులుయాదగిరిగుట్ట ప్రధానాలయ ఉద్ఘాటన 2022 మార్చి 28న జరిగింది. దేవాలయ పునర్నిర్మాణం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ కొండపైకి వచ్చే భక్తులకు ఉచిత ప్రయాణం ప్రకటించారు. ఇందుకోసం దేవస్థానం డబ్బులు చెల్లిస్తే యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి బస్సులను కొండపైకి నడిపేలా ఒప్పందం కుదుర్చుకుంది. భక్తుల నుంచి ఎలాంటి టికెట్ తీసుకోరు. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యాదగిరికొండపైకి ఉచిత బస్సులను భక్తుల కోసం 35 నుంచి 40 ట్రిప్పులను నడిపించారు. 2023 వరకు నడిపిన మినీ బస్సుల్లో ఒక్కో బస్సులో 40 మంది వరకు ప్రయాణించారు. ఇందుకోసం ప్రతినెలా రూ.60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఆర్టీసీకి దేవస్థానం డబ్బులు చెల్లించింది. 2023 –2024 మధ్య కాలంలో పెద్ద బస్సులు 15 వరకు నడిపారు. గత సంవత్సరం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆరు బస్సులను మాత్రమే ఆర్టీసీ ప్రతిరోజూ నడిపిస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలిప్రభుత్వం యాదగిరిగుట్టకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్రమంతా ఈవీ బస్సులను నడుపుతున్నారు. అద్దె బస్సులకు దేవస్థానం ఆర్టీసీకి చెల్లిస్తున్న డబ్బులతో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయొచ్చు కదా అని భక్తులు అంటున్నారు. -
మూసీకి తగ్గిన ఇన్ఫ్లో
ఫ ఒక గేటు ద్వారా నీటి విడుదల కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గింది. మూసీ రిజర్వాయర్కు శుక్రవారం 3,498 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఒక క్రస్టు గేటును రెండు అడుగుల మేర పైకెత్తి 1230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 527 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం వరకు నీటిమట్టం 643.35 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలుకు గాను ప్రస్తుతం 4.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతికొండమల్లేపల్లి(చింతపల్లి): ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాపురం గ్రామానికి చెందిన గార్లపాటి రాములు(82) ఇంట్లో ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి రాములు ఇంట్లో నిద్రించగా.. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలిపోయింది. చుట్టుపక్కల గమనించి జేసీబీని పిలిపించి ఇంటి శకలాలను తొలగించగా రాములు మృతిచెంది ఉన్నాడు. మృతుడి మనవడు ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. దొంగ అరెస్ట్కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొర్రోనితండాలో సోమవారం రాత్రి కొర్ర పట్టి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సీఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రోనితండాకు చెందిన కేతావత్ బద్య సోమవారం రాత్రి అదే తండాకు చెందిన కొర్ర పట్టి ఇంటి తాళాలు పగులగొట్టి కేజీ వెండి, రూ.1.50లక్షల నగదు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో సీఐ నవీన్కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బద్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకుని, జైలుకు తరలించినట్లు న్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ నవీన్కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్, క్రైమ్ సిబ్బంది హేమునాయక్, భాస్కర్ను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. -
ఘనంగా మరియమాత ఉత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని మరియరాణి చర్చిలో మరియమాత ఉత్సవాలను శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ కరణం ధమన్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దివ్యబలి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు తల్లి మరియరాణి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సాయంత్రం మరియరాణి స్వరూపాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బిషప్ గణ గోవింద్ జోజి, విచారణ ఫాదర్ జి. బాలస్వామి, అర్లారెడ్డి, బాలరాజు, చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
ఫ పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ రవీందర్రావు మునుగోడు: రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఇళ్లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ డి.రవీందర్రావు అన్నారు. ఉపాధిహామీ పథకం పనుల జాతర కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి నిధులు వినియోగించుకోవాలన్నారు. ఇంకుడు గుంత నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ఇళ్లతోపాటు మురుగు కాల్వల ఎండింగ్, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో విధిగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ కార్యాలయయంలో నూతన మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వ్రతాలకు కావల్సిన పూజా సామగ్రిని హుజూర్నగర్కు చెందిన బూర్లె ప్రతాప్ దంపతులు, సీహెచ్ ఆనంద్ దంపతులు, మేళ్లచెరువుకు చెందిన వంగవేటి సాయిబాబా దంపతులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ పాల్గొన్నారు. -
సాగు జలాలు ఇచ్చే వరకు పోరాడాలి
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం ప్రాంతానికి సాగు జలాలు అందించే ఇక్కడి ప్రజలు పోరాడాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాచకొండ ఎత్తిపోతల పథక సాధన సదస్సును శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు పి. ఇంద్రసేనారెడ్డి పాల్గొని రాచకొండ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎలా తీసుకురావచ్చనే డీపీఆర్ను వివరించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాల్లారెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చిన్న చిన్న ప్రాజెక్టులకు రూ.500కోట్ల చొప్పున కేటాయిస్తే పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇరిగేషన్కు రూ.22,304 కోట్లు కేటాయించి, అందులో రూ.10వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెచ్చించారని, మిగిలిన బడ్జెట్లో రూ.800 కోట్లు వేతనాలకు, రూ.11,500 కోట్లతో వడ్డీలు చెల్లిస్తున్నారని అన్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం రూ.15వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పి రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు హైదరాబాద్ నుంచి కాలుష్యంకారక కంపెనీ తరలించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరతకు కారణం వ్యవసాయ శాఖ మందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడమేనని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారో తీసుకురావాలి కాని, అలోచనలు మార్చుతూ కాలయాపన చేయొద్దన్నారు. సాగు జలాలు అందించే వరకు దీర్ఘకాలిక పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అరాచక పాలన కొనసాగిస్తున్నాయని అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు పి. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. రాచకొండ ఎత్తిపోతల పథకానికి కృష్ణా, గోదావరి జలాలు అందించే అవకాశాలను వివరించారు. ఈ పథకం నిర్మాణం పూర్తయితే ఎన్ని మండలాలకు సాగు జలాలు అందుతాయని వివరించారు. అంతకుముందు నారాయణపుంర చౌరస్తా నుంచి సదస్సు నిర్వహించే ప్రదేశం వరకు ర్యాలీ నిర్వంచారు. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, సుర్కంటి శ్రీనివాస్రెడ్డి, గుంటోజు శ్రీనివాస్చారి, దోడ యాదిరెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దొంతగోని పెద్దులు, ఐతరాజు గాలయ్య, మల్లేపల్లి లలిత, చింతకాయల నర్సింహ, రాములు, నరసింహ, యాదవరెడ్డి, శంకరయ్య, భిక్షం, నిర్మాల, అమరేందర్ తదితరులున్నారు. రాచకొండ ఎత్తిపోతల డీపీఆర్ను వివరిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నేత ఇంద్రసేనారెడ్డి ఫ అఖిల భారత రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి -
నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ తిరు, మాడీ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవ, ఆరాధన, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సమష్రనామార్చాన తదితర పూజలు నిర్వహించారు. -
రాయితీపై యంత్రం.. సాగుకు ఊతం
చౌటుప్పల్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు వివిధ యంత్ర పరికరాలు అందించేందకు స్మామ్(సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు సమర్పణ ఇలా.. స్మామ్ పథకం కింద రాయితీ యంత్ర పరికరాల కోసం ఆయా మండలాల్లో రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. చౌటుప్పల్ మండలానికి 103 యంత్ర పరికరాలు మంజూరు కాగా.. ఇప్పటికి 56 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 77 బ్యాటరీ స్ప్రే పంపులు ఉండగా కేవలం 10 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులు సంబంధిత గ్రామ ఏఈఓలకు లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జీరాక్స్, మూడు ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులకు అందించే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది. లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ఎంపిక కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయ అధికారి నోడల్ అధికారిగా, తహసీల్దార్, ఎంపీడీఓలు సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ రూ.లక్ష లోపు యంత్రాలు కొనుగోలు చేసే రైతులను ఎంపిక చేస్తుంది. రూ.లక్ష కంటే ఎక్కువ ధర ఉన్న యంత్రాల కొనుగోలు చేసే రైతులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కన్వీనర్గా, ఆగ్రోస్ రీజనల్ బ్యాంకు ప్రతినిధి సభ్యుడిగా ఉంటారు. వ్యవసాయ సాగులో యాంత్రీకరణ ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ యంత్ర పరికరాలను స్మామ్ పథకంలో భాగంగా అందిస్తోంది. చౌటుప్పల్ మండలానికి 103 యంత్ర పరికరాలు మంజూరయ్యాయి. వీటి కోసం రైతుల నుంచి ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నాం. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో ఆసక్తి ఉన్న రైతులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. – ముత్యాల నాగరాజు, మండల వ్యవసాయాధికారి, చౌటుప్పల్ స్మామ్ పథకంలో భాగంగా రైతులకు అందజేయనున్న కేంద్ర ప్రభుత్వంఫ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు -
డీసీసీబీని సందర్శించిన నాబార్డు సీజీఎం
నల్లగొండ టౌన్: నల్లగొండలోని డీసీసీబీని శుక్రవారం నాబార్డు సీజీఎం ఉదయ్భాస్కర్ సందర్శించారు. ఆయన డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాబార్డు స్కీంలు, డీసీసీబీల అభివృద్ధిలో నాబార్డు పాత్ర వంటి విషయాలపై సీజీఎం మాట్లాడారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాబార్డు అందిస్తున్న అనేక పథకాలు, రీఫైనాన్స్తో డీసీసీబీలు, సొసైటీలు బలోపేతమయ్యాయన్నారు. ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచీల ఏర్పాటు, ప్రాథమిక సహకార సంఘాలకు గోదాంల నిర్మాణానికి కొత్త స్కీమ్లు ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా సీజీఎంను ఆయన కోరారు. సమావేశంలో డీసీసీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, శంకర్రావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): పట్టపగలే భర్త, అతడి ఇద్దరు భార్యలపై కర్రలతో దాడి చేసి హతమార్చేందుకు నలుగురు వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగల లక్ష్మయ్యకు 2002లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పారెపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో వెంకటమ్మ సోదరి పద్మను 2008లో లక్ష్మయ్య రెండో వివాహం చేసుకన్నాడు. రెండో వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మయ్య మొదటి భార్య వెంకటమ్మ గర్భం దాల్చింది. దీంతో ఇద్దరు భార్యలతో కలిసి వడ్డెర పనులు చేసుకుంటూ లక్ష్మయ్య జీవనం కొనసాగిస్తున్నాడు. 2023లో కుడకుడ గ్రామానికి చెందిన శేఖర్తో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. శేఖర్ వెంకటమ్మను ఇబ్బందులకు గురిచేయడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కాగా సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన గోపి ఈ నెల 17న లక్ష్మయ్య వద్ద ఇంటి నిర్మాణానికి రాయి తీసుకెళ్లాడు. రాయికి సంబంధించిన రూ.3 వేలు ఇవ్వాలని లక్ష్మయ్య గోపిని అడగగా ఇవ్వకపోవడంతో శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి గోపిని లక్ష్మయ్య అక్కడకు పిలిచాడు. లక్ష్మయ్య మొదటి భార్య వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకున్న శేఖర్ గోపికి స్నేహితుడు కావడంతో అతడు కూడా వచ్చాడు. అక్కడ డబ్బుల విషయం మాట్లాడుతుండగా.. గోపికి స్నేహితుడైన శేఖర్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. అనంతరం లక్ష్మయ్య తన ఇద్దరు భార్యలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వస్తుండగా.. మార్గమధ్యలో చింతలచెరువు కాలువ వద్ద గోపితో పాటు శేఖర్, రాఘవ, చంటి కారులో మాటువేశారు. చింతలచెరువు కాలువ వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో లక్ష్మయ్య తన బైక్లో పెట్రోల్ కొట్టిస్తుండగా.. అక్కడే మాటువేసిన గోపి, అతడి స్నేహితులను లక్ష్మయ్య భార్యలు చూసి అతడికి చెప్పారు. దీంతో లక్ష్మయ్య బైక్పై తిరిగి అక్కలదేవిగూడెం వైపు వస్తుండగా కారులో నలుగురు వెంబడించారు. లక్ష్మయ్య, అతడి భార్యలు ప్రాణ భయంతో బీబీగూడెం గ్రామ శివారులో గల మధుర వైన్స్లోకి పరిగెత్తారు. అక్కడ ఉన్న వ్యక్తులు వారికి రక్షణ కల్పించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. బాధితులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని లక్ష్మయ్య పోలీసులను వేడుకున్నాడు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫ ప్రాణ రక్షణ కోసం వైన్స్లోకి పరిగెత్తిన బాధితులు -
సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి
రామగిరి(నల్లగొండ): సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఏఎస్పీ జి. రమేష్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఎన్సీసీ, పీస్ ఫోరం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ రమేష్, సైబర్ క్రైం డీఎస్పీ టి.లక్ష్మీనారాయణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. పి.మద్దిలేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల్లో ఎక్కువగా మొబైల్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కార్యక్రమంలో పీస్ ఫోరం ట్రస్ట్ ఫౌండర్ హెచ్. దయానంద, తెలుగుశాఖ అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, పీస్ ఫోరం సభ్యులు అశోక్వర్ధన్, ఎన్సీసీ కేర్టేకర్ సీహెచ్. సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకట్రెడ్డి, డాక్టర్ ఏ. మల్లేశం, డాక్టర్ బొజ్జ అనిల్కుమార్, కె. శివరాణి, ఎం. సావిత్రి, ఎన్ఎస్ఎస్ వలంటీర్స్, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
కట్టంగూర్: రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొని వ్యవసాయంలో అధిక లాభాలు గడించాలని నాబార్డు తెలంగాణ రీజియన్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎఫ్పీఓ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ను, ఆఫ్గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం గంగదేవిగూడెంలోని ఎఫ్పీఓలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సోలార్ ప్యానల్తో విద్యుత్ను స్టోరేజీ చేసి ఆదాయం సంపాదించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్పీఓలు రైతులకు అన్నిరకాల సౌకర్యాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాని తెలిపారు. ఎఫ్పీఓ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించబోయే కృషి వికాస్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం నిరుద్యోగ యువతకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాణధార ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని రైతులకు డైరెక్ట్ సీడ్ రైస్(డీఆర్ఎస్) పద్ధతిపై సూచనలు, సలహాలు అందించారు. రాబోయే రబీ సీజన్లో డీఆర్ఎస్ పద్ధతిలో 100 ఎకరాలు సాగు కోసం అవసరమైన మిషన్లు ఉచితంగా అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు నల్లగొండ డీడీఎం వినయ్కుమార్, సూర్యాపేట డీడీఎం రవీందర్నాయక్, ఎఫ్పీఓ అడ్వైజర్ నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ, ఐఆర్డీఎస్ అధ్యక్షుడు రమేష్, స్వచ్ఛ శక్తి సుధాకర్, శేఖర్ ఉన్నారు. ఫ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ -
అర్ధరాత్రి చోరీకి యత్నం
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రలో నివాసముంటున్న డ్రైవర్ నాగయ్య ఇంట్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. రాత్రి ఒంటి గంట సమయంలో నాగయ్య మూత్రవిసర్జనకు వెళ్లేందుకు తలుపు తీయగా.. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగయ్య మనవరాలి చెవికి ఉన్న బంగారంతో పాటు ఇంట్లోని బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. ఈలోగా నాగయ్య ఇంట్లోకి రావడంతో దొంగ పరారయ్యాడు. అంతకుముందే నాగయ్య ఇంటి సమీపంలోని మరో ఇంట్లో ఆ దొంగ చొరబడి సెల్ఫోన్ చోరీ చేశాడు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగయ్య ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగ ఆటోలో పరారైనట్లు గుర్తించారు. తాళం వేసిన ఇంట్లో చోరీఆలేరురూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శక్రవారం ఆలేరు మండలం మంతపురి గ్రామంలో చోటుచేసుకుంది. ఆలేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంతపురి గ్రామానికి చెందిన సొప్పోజు కృష్ణచారి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలోని రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన కృష్ణచారి, కుటుంబ సభ్యులు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి తెలిపారు. మోటారు కేబుల్ వైర్లు.. తిప్పర్తి: తిప్పర్తి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ సమీపంలో రైతుల పొలాల వద్ద బోరు మోటార్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని అపహరించారు. సుమారు 30మంది రైతులకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు శుక్రవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మునగాలలో క్లినిక్ సీజ్
మునగాల: మండల కేంద్రంలోని ఆర్ఎంపీ చంద్రమౌళి నిర్వహిస్తున్న క్లినిక్ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సీజ్ చేశారు. ఆర్ఎంపీ చంద్రమౌళి చేసిన వైద్యం వికటించడంతోనే ఈనెల 5న మునగాల మండలంలోని బరాఖత్గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోహరి క్లినిక్తో పాటు అనుబంధంగా ఉన్న అమ్మ రక్తపరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరిమితికి మించి వైద్యం చేయొద్దని, అనవసరంగా యాంటిబయాటిక్ మందులు వినియోగించొద్దని హెచ్చరించారు. అయినా చంద్రమౌళి క్లినిక్లో యథావిధిగా వైద్యం చేస్తున్నాడని సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి క్లినిక్ను సీజ్ చేయడంతో పాటు అమ్మ రక్తపరీక్ష కేంద్రం నిర్వాహకుడికి నోటీసు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి వెంట సూర్యాపేట డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, కోదాడ డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోహరి, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
త్రిపురారం : మార్కెట్లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరి యాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఎరువు 20 నుంచి 50 మిల్లీ మైక్రాన్ల పరిమాణంలో నత్రజని కణాలు ఉంటాయి. దీన్ని మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. ద్రవరూపంలోని నానో యూరియా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాదు పంట దిగుబడిని పెంచి, పర్యావరణానికి మేలు చేస్తుంది.ది గుబడి, రైతుకు ఆదాయం పెంచుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నానో యూరి యాను సులభంగా నిల్వ, రవాణా చేయవచ్చు. ధరలు ఇలా.. నానో యూరియాను అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ఒక్క బాటిల్ (500 మి.లీ.) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని అధికారులు చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.220, డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, అర లీటర్ నానో డీఏపీ రూ.600కు లభిస్తుంది. వినియోగించే పద్ధతులు ● 500 ఎంఎల్ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు. ● 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి. ● ఇతర పురుగుమందులు కలిపి పిచికారీ చేయొద్దు. ● నానో యూరియా వాడకం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. ● సాధారణ యూరియతో పోల్చితే నానో యూరియా ప్రభావం మొక్కలపై ఎక్కువ రోజులు ఉంటుంది. ● 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నానో యూ రియాను పిచికారీ చేయాలి. ● యూరియా వేసే ప్రతి పంటలకు నానో యూరియాను వినియోగించుకోవచ్చు.రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు మార్కెట్లోకి ద్రవరూప యూరియా, డీఏపీ ఫ సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా.. ఫ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
యాదగిరిగుట్ట: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నా యుడు, తహసీల్దార్ గణేష్నాయక్ సూచించారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం గణేష్ మండప నిర్వాహకులు, ముస్లింలు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గణేష విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు, శోభాయాత్ర రోజు విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలన్నారు. సోదరభావంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, వైద్యాధికారి పావణి, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ట్రాన్స్కో ఏఈ సురేంద్రనాయుడు, ఎంపీడీఓ నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు బస్టాండ్లో తప్పిన ప్రమాదం ఆలేరు: పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఽశుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఉన్నట్లుండి వేప చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఎగ్జిట్ పాయింట్ సమయంలో ఉన్న వేప చెట్టు కింద అప్పటి వరకు పలువురు మాట్లాడుకుంటున్నారు. చెట్ల కొమ్మలు విరిగిపడుతుండగా గమనించి అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచండిభువనగిరి: ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలు పెంచా లని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. గురువారం తన చాంబర్లో ఓపెన్ స్కూల్ విద్యకు సంబంధించిన పోస్టర్ను విద్యాశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. స్వయం సహాయ సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, ఆశ కార్యకర్తలు మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ సత్తమ్మ, జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి, సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, వయోజన విద్యా ప్రాజెక్టు అధికారి మమత, సహాయ ప్రాజెక్టు అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
భోజనం వడ్డించి.. సమస్యలు తెలుసుకొని
బీబీనగర్: విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి రుచి, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.. కలెక్టర్ హనుమంతురావు. బీబీనగర్ మండలం కొండమడుగు జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు తానే భో జనం వడ్డించారు. సమస్యలపై ఆరా తీశారు. మోనూ ప్రకారం భోజనం అందజేయాలని సిబ్బందికి సూచించారు. అడ్మిషన్లు పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తప్పులు లేకుండా 12వ గుణితం చెప్పిన అవినాష్ అనే విద్యార్థిని కలెక్టర్ అభినందించారు. అనంతరం పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేసి రోగులు పొందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులు, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. -
హైలెవల్ కష్టాలు
లోలెవల్ వంతెనలు.. సాక్షి, యాదాద్రి: భారీ వర్షాలు కురిసినప్పుడలా జిల్లాలోని పలు మార్గాల్లో అవస్థలు తప్పడం లేదు. లోలెవల్ వంతెనలు, కాజ్వేలు విస్తరణకు నోచుకోక రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వరద ఉధృతిలోనే ప్రయాణం సాగిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినా కాజ్వే కష్టాలు తీరడం లేదు. మూసీ, ఆలేరు, బిక్కేరు. చిన్నేరు, శామీర్పేటతో పాటు పలు స్థానిక వాగులపై సుమారు 60 వరకు కల్వర్టులు, కాజ్వేలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇందులో కొన్ని చోట్ల పనులు మొదలై వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని కాజ్వేలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. లో లెవల్ బ్రిడ్జిలున్న మార్గాలు ఇవీ.. మూసీపై రుద్రవెల్లి–జూలూరు, బొల్లెపల్లి–సంగెం వద్ద లో లెవల్ వంతెనలున్నాయి. వీటితో పాటు నలగొండ రోడ్డులో నాగిరెడ్డిపల్లి, పల్లెర్ల, నర్సాపూర్, తుమ్మలగూడెం, లోతుకుంట, నర్సాయిగూడెం. వేములకొండ, మల్లేపల్లి– వేములకొండ, మల్లేపల్లి–వెల్వర్తి, జాలుకాలువ, రెడ్లరేపాక రోడ్లు, బీబీనగర్ మండలం రాఘవాపూర్, జైనంపల్లి రోడ్డు, జైనపల్లి – అనంతారం రోడ్డు, అవుషాపూర్ – రాయరావుపేట, చీకటిమామిడి–మాచన్పల్లి, మర్యాల – వడపర్తి, ఫకీర్గూడెం – తాజ్పూర్, రామలింగంపల్లి–తూముకుంట, గంధమల్ల –రాజాపేట, కోనాపూర్ రోడ్డు, పాముకుంట, రాజాపేట, పారుపల్లి –రాజాపేట, నెమిల – రాజాపేట, దూదివెంకటాపూర్ – రాజాపేట, పొట్టిమర్రి–కాల్వపల్లి, బేగంపేట–రేణికుంట, ఆలేరు – కొలనుపాక, కాలనుపాక జంగాలకాలనీ, కొలనుపాక పీతాంబర్ వాగు, ఆలేరు సిల్క్నగర్ వాగు, మంతపురి–దిలావర్పూర్, శారాజీపేట, గొలనుకొండ – అమ్మనబోలు, శర్బనాపురం, బండకొత్తపల్లి – వస్తాకొండూరు, వస్తాకొండూరు–పెద్దపడిశాల, మరిపడి – సీతారాంపూర్, వెల్మజాల – కొమ్మాయపల్లి, తంగెడిపల్లి, చౌటుప్పల్ –తంగెడిపల్లి, మోత్కూరు–గుండాల మార్గాల్లో లోలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో స్థానిక వాగులు, బిక్కేరు, శామీర్పేట, ఆలేరు వాగులు ఉధృతంగా ప్రవహించినప్పుడు వంతెనల పైనుంచి రాకపోకలు స్తంభించిపోతాయి. కొట్టుకుపోయిన కారు చౌటుప్పల్ మండలం నేలపట్ల–వర్కట్పల్లి మధ్య వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ మార్గంలో వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్థానికులతో సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. నిధులున్నా పనులేవీ? ఆలేరు మండలం కొలనుపాకకు రెండు వైపులా సిద్ధిపేట మార్గంలో ఉన్న కాజ్వేలపై హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కావడంలేదు. గంధమల్ల చెరువు అలుగుపోస్తే కొలనుపాక వాగులోకి చేరుతుంది. ఈ సమయంలో ప్రయాణికులను రోడ్డు దాటనీయదు. దీంతో బచ్చన్నపేట, చేర్యాల, సిద్ధిపేట, రాజాపేట మార్గంలో వెళ్లే వాహనాలు చుట్టూ తిరిగిపోవాలి. ధైర్యం చేసి వాగు దాటడానికి ప్రయత్నించిన సందర్భంలో పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా మరికొందరు స్థానికుల సాయంతో బయటపడ్డారు. భువనగిరి మండలం బొల్లేపల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద, బీబీనగర్ మండలం రుద్రవెల్లి–భూదాన్పోచంపల్లి మండలం జూలురు మధ్య మూసీపై లోలెవల్ వంతెనలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో, హైదరాబాద్లో భారీ వర్షం కురిసిందంటే లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గినన్ని రోజులు రాకపోకలు నిలిచిపోతాయి. రుద్రవెల్లి–జూలూరు లోలెవల్ బ్రిడ్జికి సమీపంలోనే ఏడేళ్ల క్రితం చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలో మూసీ పునరుజ్జీవన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంగెం బిడ్రిని సందర్శించారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రమాదకరంగా లోలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు ఫ భారీ వర్షాలు కురిసిన ప్రతీసారివంతెనల పైనుంచి వరద ఫ స్తంభిస్తున్న రాకపోకలు ఫ అత్యవసర సమయంలో వాగులు దాటే క్రమంలో ప్రమాదాలు గత ఏడాది వానాకాలంలో ఓ ప్రయాణికుడు ఆలేరు రోడ్డుపై కొలనుపాక వాగు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి సదరు వ్యక్తిని కాపాడారు. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా రక్షణ చర్యలు తీసుకోకపోవడం సంబంధిత శాఖల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మోత్కూర్–గుండాల మధ్య బిక్కేరు వాగుపై హైలెల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో వాహనదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. వరదలు వచ్చినప్పుడు రోడ్డు దాటడానికి వీలుండదు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు హామీలిచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ వంతెనను విస్తరిస్తే ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు 50 కిలోమీటర్ల దూరభారం తగ్గడమే కాకుండా వరదలు వచ్చినా ప్రయాణానికి ఆటంకాలు ఉండవు. -
మృత్యుపాశాలు..
ఇంటర్నెట్, కేబుల్ టీవీల తీగలు వేయడానికి స్తంభాలను ఉపయోగించినప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్తంభం చొప్పున నిర్దేశిత రుసుము చెల్లించాలి. కానీ, చాలా చోట్ల అమలు కావడం లేదు. కొందరు యజమానులు విద్యుత్ సిబ్బందితో కుమ్మకై ఇష్టారాజ్యంగా వైర్లు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భువనగిరి టౌన్: ప్రైవేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి. విద్యుత్ సరఫరా కోసం రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్తంభాల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు ఇష్టారాజ్యంగా కేబుళ్లను అనుసంధానిస్తున్నాయి. ఫలితంగా ఈ వైర్లు తెగి కరెంటు లైన్లు, స్తంభాలపై పడినప్పుడు విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా స్తంభాలపై ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు చేయలేకపోతున్నారు. ఇటీవల హైదరాబాద్లో టీవీ, ఇంటర్నెట్ కేబుల్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేబుల్స్ తొలగించాలని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఏ స్తంభానికి చూసినా గుట్టలుగా కేబుల్స్ ప్రైవేటు సంస్థల కేబుల్ విస్తరణ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. భువనగిరి పట్టణంలో త్రీ ఫేజ్, టూఫేజ్, చివరికి హైటెన్షన్ స్తంభాలను కూడా అనధికారికంగా వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఉండాలి. కానీ, తక్కువ ఎత్తులో లాగడంతో కిందకు వేలాడుతున్నాయి. అంతేకాకుండా వైర్లను కుప్పలుగా స్తంభాలకు చుట్టేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇష్టారాజ్యంగా స్తంభాలను కేబుళ్ల కోసం వాడుకుంటున్నారు. వాహనాలు వెళ్లిన సమయంలో ప్రమాదాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని కాలనీల్లో చిన్నచిన్న రోడ్లపై ఒకవైపు ఇళ్ల నుంచి మరోవైపున ఉన్న నివాసాలకు కేబుళ్లను రోడ్డుకు అడ్డంగా లాగుతున్నారు. ఇవి తక్కువ ఎత్తులో ఉంటే వాహనాలు వెళ్లిన సమయంలో వాటికి తగిలి తెగిపోతున్నాయి. విద్యుత్లైన్లు, స్తంభాలపై పడి వేలాడుతున్నాయి. నోటీసులతోనే సరిపెట్టారు.. టీవీలు, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలని ఆయా సంస్థల యజమానులకు ఏడాది క్రితం విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత వాటి గురించే మరిచిపోయింది. ఈనెల 27నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఆ తరువాత దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వరుసగా రానున్నాయి. నిర్వాహకులు భారీ విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఈ తరుణంలో కిందకు వేలాడుతున్న తీగల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. తక్షణమే కేబుల్ టీవీలు, ఇంటర్నెట్ సంస్థల కేబుల్స్ను తొలగించాలని ప్రజలు, ఉత్సవ మండపాల నిర్వాహ కులు కోరుతున్నారు. విద్యుత్ స్తంభాల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు వైర్లు లాగాలంటే అనుమతి తప్పనిసరి. ఒక్కో స్తంభానికి రూ.50 నుంచి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి. సపోర్టింగ్ వైర్, కేబుల్ బరువు మీటరుకు గరిష్టంగా 200 గ్రాములు మించవద్దు. తీగ పొడవు స్తంభానికి, స్తంభానికి మధ్య 50 మీటర్లు మించకుండా ఉండాలి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసినవి, తక్కువ ఎత్తులో ఉన్నవి, ప్రమాదకరంగా ఉన్న తీగలను అధికారులు ఎప్పటికప్పుడు తొలగించాలి. కరెంట్ పోల్స్కు ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్లు ఫ తక్కువ ఎత్తులో అడ్డదిడ్డంగాఏర్పాటు చేస్తున్న ఆపరేటర్లు ఫ పొంచి ఉన్న ప్రమాదాలు.. స్తంభాలపై సమస్య తలెత్తినా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఫ తొలగించాలని గతంలోనే ఉన్నతస్థాయి ఆదేశాలు ఫ హైదరాబాద్ ఘటనతోనూ మేల్కోని యంత్రాంగం -
అస్తమించిన ఎర్ర సూరీడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా సీపీఐ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సురవరం సుధాకర్రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్యాస విడిచారు. సురవరం పుట్టిపెరిగింది నాగర్కర్నూల్ జిల్లా అయినా.. ఆయన ఉద్యమ ప్రస్తానం నల్లగొండ జిల్లాతో ముడిపడి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ విస్తరణకు ఆయన కృషిచేశారు. నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. రైతు, కూలీల సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వం అంశాలపై సీపీఐ తరఫున ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఆయన నల్లగొండ లోక్సభ స్థానం నుంచి 1998, 2004లో గెలుపొందారు. ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా సమస్యలు, ముఖ్యంగా సాగునీటి సమస్యలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించారు. కాగా, సురవరం సుధాకర్రెడ్డి మృతికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఫ అనారోగ్యంతో సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత ఫ రెండుసార్లు నల్లగొండ ఎంపీగా సేవలు ఫ కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి -
విద్యార్థికి అండగా ఉంటా
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని శేరిగూడేనికి చెందిన విద్యార్థి భరత్చంద్రచారికి ఇచ్చిన హామీ మేరకు కలెక్టర్ హనుమంతరావు గురువారం అతడి ఇంటిని సందర్శించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5వేలు నగదు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంటర్ ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏ అవసరం వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చదువు విషయంలో ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్లో స్థిరపడే వరకు అండగా ఉంటానని పేర్కొన్నారు. విద్యార్థి బలహీనంగా ఉండటంతో మండల వైద్యాధికారికి ఫోన్ చేసి అతడికి రక్త పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యం అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి, నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. గ్రామస్తులు బస్సు లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, నల్లగొండ డీఎంతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు చిమిర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఎంపీఓ నర్సింహరావు తదితరులున్నారు. -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
బొమ్మలరామారం: ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి జానీ అఫ్గాన్ అన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం నిర్వహించిన మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్య సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీఎంవో లింగారెడ్డి, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, ఎంఈఓ రోజారాణి, పీఈటీ నర్సింహ పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం
ఆలేరు: గ్రామీణ యువతలో శిక్షణ నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు, భువనగిరిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ల నిర్మాణాలు చేపట్టింది. ఆలేరులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ఆవరణలో, భువనగిరిలో మిషన్ భగీరథ కార్యాలయం సమీపంలో ఒక్కొక్కటి 13వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గతేడాది ఈ పనులు మొదలుపెట్టారు. ఒక్కో ఏటీసీ నిర్మాణానికి రూ.35కోట్ల చొప్పున మొత్తం రూ.70కోట్ల నిధులతో నిర్మించారు. ఇందులో 85శాతం నిధులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్)సమకూర్చగా, ఏటీసీల నిర్మాణం, విద్యుద్దీకరణ తదితర పనులకు మిగతా 15శాతం నిధులను ప్రభుత్వం వ్యయం చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావడంతో వచ్చే నెలలో వీటిని ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సెంటర్లలో 344 సీట్లు ఏడాది, రెండేళ్ల కాలపరిమితికిగాను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ఒక్కో సెంటర్లో 172 సీట్ల చొప్పున 344 సీట్లు ఉన్నాయి. ఏటీసీల్లో లక్ష్యం మేరకు ప్రవేశాల పూర్తికి కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ విషయమై దృష్టిసారించాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆలేరులో 64, భువనగిరిలో 72 అడ్మిషన్లు జరిగాయి. ప్రవేశాల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 28తో గడువు ముగియనుంది. ఏటీసీల్లో సంవత్సరం, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాటా, టాటా నెల్కో, టెక్ ఎక్స్పర్ట్, డెల్, ఇన్ఫోసిస్ తదితర నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో అధికారులు చర్చలు చేస్తున్నారు. అదేవిధంగా ‘టీగేట్’ (తెలంగాణ గేట్వే అడాప్ట్ ట్రైనింగ్ ఎంప్లాయిమెంట్) వివిధ పారిశ్రామికవేత్తలతో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయమై చర్యలు జరుపుతోంది. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా టీగేట్ చర్యలు తీసుకుంటుంది. ఆలేరు, భువనగిరిలోని ఏటీసీల్లో శిక్షణ కోసం అన్ని ఆధునాతన సాఫ్ట్వేర్ పరికరాలు వచ్చాయి. విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ, సిలబస్ బోఽధించేందుకు ఎనిమిది మంది ప్రత్యేక నిపుణులను టీటీఎల్ నియమించింది. ఆయా యంత్రాలను ఏటీసీల్లో సాంకేతిక బృందం బిగిస్తోంది. – హరికృష్ణ, ఐటీఐ జిల్లా కన్వీనర్ ఫ ఆలేరు, భువనగిరిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు సిద్ధం ఫ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ల ఏర్పాటు ఫ శిక్షణ తర్వాత ఉద్యోగాలకు మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందం ఫ వచ్చే నెలలో ప్రారంభానికి ఏర్పాట్లుపదో తరగతి పాసై, 22ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు హెచ్టీటీపీఎస్//ఐటీఐ.తెలంగాణ. జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత పదో తరగతి మెమో, కుల ధ్రవీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్, టీసీతోపాటు ఆధార్కార్డు ఒరిజినల్ ధ్రువపత్రాలతో స్థానిక ఐటీఐ కళాశాలల్లో సంప్రదించాలి. కోర్సులు, సీట్ల వివరాలు (కాలపరిమితి ఏడాది) కోర్సు సీట్లు మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ 40ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 40ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ 20 బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్(మెకానికల్) 24అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్ 24మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 24 -
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు అర్చకులు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. గురువారం ఉదయాన్నే క్షేత్రాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలు చేసి హారతినిస్తున్న అర్చకుడు -
ఇంకుడు గుంతలు మరిచారు!
ఆలేరురూరల్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం చొరవ చూపుతున్నా క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. వర్షాకాలానికి ముందే ఇంకుడు గుంతల తవ్వకాలు పూర్తి చేయాలని ఆదేశాలున్నా ఆచరణలో పెట్టడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 12 ఇంకుడు గుంతల నిర్మాణాలే పూర్తవడం అందుకు నిదర్శనం. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1,764 ఇంకుడు గుంతలు మంజూరు ఉపాధిహామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 1,764 ఇంకుడు గుంతలు మంజూరయ్యాయి. ఇందులో కేవలం 12 గుంతలు మాత్రమే పూర్తి కాగా.. 87 ఇంకుడు గుంతలు పురోగతిలో ఉన్నాయి. మిగతావి పనులు మొదలుకాలేదు. ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.1.05 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటి వరకు రూ.74,400 ఖర్చు చేశారు. ఒక్కో ఇంకుడు గంతకు ప్రభుత్వం రూ.6,200 చెల్లిస్తుంది. వృథా అవుతున్న వర్షపు నీరు వర్షపు నీటిని భూమిలోనికి ఇంకించేందుకు అవసరమైన రీచార్జి ఫిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్బ జలనిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,80,677 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో 3,082 చదరపు కిలో మీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా ఏటా 2,31,150 కోట్ల లీటర్ల వర్షం కురుస్తుంది. ఈ నీళ్లన్నీ భూమిలో దాచుకుంటే ఒక్కొక్కరికి రోజుకు 4000 లీటర్లు అందుబాటులో ఉంటాయి. ఇళ్ల పైకప్పులపై, ఆవరణలో కురిసే వర్షాన్ని నేలలోకి ఇంకింపజేస్తే నీటి కరువే ఉండదని నిపుణుల అభిప్రాయం. ఇంకుడు గుంతల నిర్మాణం ఇలా.. ఇంకుడు గుంత 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు 1.8 మీటర్ల లోతు ఉండాలి. అడుగు భాగంలో ఫీటున్నర మందం రాళ్లు, దానిపై ఫీటున్నర 40 ఎంఎం కంకర, వాటిపైన 3ీఫీట్ల రింగ్ అమర్చాలి. దానిపై మూత ఏర్పాటు చేసి ఐదు మీటర్ల పైపును బిగించాలి. ఇరుపక్కల 20ఎంఎం కంకర నింపాలి. వర్షం కురిసినప్పుడు ఇతర సమయంలో వృథాగా పోయే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జల సంరక్షణ ఏవిధంగా సాధ్యమవుతుందో ప్రజలకు వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తామని కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలి. గతంలో నిర్మించిన ఇంకుడు గుంతలు శుభ్రం చేయడంతో పాటు లేని ఇళ్లలో కొత్తవి నిర్మించి వాన నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధిహామీ పథకంలో జలసంరక్షణ పనులు చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఇళ్లలో ఇంకుడు గుంతలు, గొట్టపు బావుల చుట్టూ నీటిని రిచార్జి చేసే కందకాల నిర్మాణం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనవారు పంచాయతీ కార్యదర్శులను సంప్రదించవచ్చు. – నాగిరెడ్డి. డీఆర్డీఓ ఇంకుడు గుంతల వివరాలు మంజూరైనవి : 1764పురోగతిలో ఉన్నవి : 287పూర్తయినవి : 12ఒక్కో ఇంకుడు గుంతకు చెల్లిస్తుంది : రూ.6,200జిల్లాలో గృహాలు : 1,59,745 -
ఉత్సవం.. సన్నద్ధం
శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఉపాధ్యాయుల పదోన్నతుల రీషెడ్యూల్ విడుదలభువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన రీ షెడ్యూల్ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ మొదటగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం ఈనెల 11న పూర్తికావాల్సి ఉంది. 2002 నవంబర్లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు సీనియార్టీ విషయంలో కోర్టులో పిటిషన్ వేసిన కారణంగా పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన కారణంగా తిరిగి ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి రీ షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో పాటు వెంటనే మల్టీజోన్–2 పరిధిలో జరిగే జీహెచ్ఎంల పదోన్నతుల జాబితాను ప్రకటించింది. ఈమేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న 34 జీహెచ్ఎం పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ కానున్నాయి. అనంతరం జిల్లాలో సుమారు 100 వరకు స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎంలకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే తయారు చేసిన సుమారు 300 మది సీనియార్టీలకు సంబంధించిన సర్టిఫికెట్స్ పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు జరగనుంది. ఈ నెల 25న వెబ్ ఆప్షన్, పదోన్నతులు పొందిన వారికి 26న ఆర్డర్లు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంల పదోన్నతులకు సంబంధించి కూడా ఆర్డర్లు జారీ చేశారు. యూరియా కోసం ఆందోళన చెందొద్దు ఆలేరురూరల్: యారియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఇప్పటివరకు జిల్లాకు 17వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. దుకాణ యాజమానులు రైతులకు అవసరం ఉన్న ఎరువులు ఇవ్వాలని, వేరే వాటిని అంటకట్టొద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మందనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీఓ అనురాధ, ఏఓ శ్రీనివాస్, ఏఈఓ మండల అధికారులు తదితరులున్నారు. బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలి చౌటుప్పల్ : విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యదర్శి రమణకుమార్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, హాస్టల్ భవనం, గురుకుల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్లో ఉన్నత స్థాయిలో ఉండొచ్చన్నారు. ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ స్మిత, ఉపాధ్యాయులు ఉన్నారు. సాక్షి, యాదాద్రి : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరగడానికి పలు జాగ్రత్తలు రూపొందించారు. ఈనెల 27న వినాయక చవితి పండుగ రోజు నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ సబ్ డివిజన్ పరిధిలో గల ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాల్లో ఈసారి సుమారు నాలుగు వేల వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 3,600కు పైగా మండపాలు ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో.. విద్యుత్ శాఖ, నీటిపారుదల, ఆర్అండ్బీ పంచాయతీ రాజ్, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులందరినీ సమన్వయం చేస్తున్నారు. శోభాయాత్రకు అడ్డంకిగా రహదారుల వెంట ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లకు మరమ్మతులు వంటి పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ప్రతి మండపం నిర్వాహకులు డీడీ చెల్లిస్తే విద్యుత్ శాఖ సిబ్బంది కరెంట్ పోల్ నుంచి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ నుంచి పరిహారం అందుతుంది. ఇందుకోసం 250 కిలో వాట్స్కు రూ.500, 500కిలో వాట్స్కు రూ.1000, 1000 కిలో వాట్స్ వరకు రూ.1500తోపాటు ప్రతి కిలోవాట్స్కు రూ.750 చెల్లించాలి. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు ఉంటే తొలగించనున్నారు. అయితే విగ్రహాల ఎత్తు సమాచారం ముందుగానే తీసుకుంటారు. అందుబాటులో గజ ఈతగాళ్లు వినాయక నిమజ్జనోత్సవం కోసం చెరువుల వద్ద గజఈత గాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడ్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ఆయా శాఖలు చేపట్టనున్నాయి. ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువుల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షణ కొనసాగనుంది. చెరువుల వద్ద భద్రత ఏర్పాట్లు ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి. ఇందుకోసం poiceportal.tspoice.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనిపించే విధంగా ప్రదర్శించాలి. ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేయనున్నారు. డీజేలకు అనుమతి లేదు. అనుమతి ఇచ్చిన మేరకు రాత్రి పది గంటల లోపు మైక్లు కట్టేయాలి. ప్రతిరోజు ప్రతి మండపాన్ని బ్లూకోట్స్ పోలీస్లు, పెట్రో మొబైల్ కానిస్టేబుళ్లు విజిట్ చేస్తారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని పరిష్కరిస్తారు. మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. నిమజ్జనానికి అవసరమైన రూట్మ్యాప్ను ముందుగానే పోలీస్ శాఖకు అందివ్వాలి. నిమజ్జనం కోసం భువనగిరి పెద్ద చెరువు, బీబీనగర్ చెరువు, యాదగిరిగుట్ట, గోధుమకుంట, చౌటుప్పల్ చెరువులతో పాటు స్థానిక చెరువుల వద్ద భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఫ మంజూరైనవి 1,764.. నిర్మాణం పూర్తయినవి12 ఫ వానాకాలానికి ముందే పూర్తిచేయాల్సి ఉండగా నీరుగారుతున్న లక్ష్యం ఫ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళిక ఫ ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి ఫ రాత్రి పది గంటల లోపు మైక్లు కట్టేయాలి ఫ మండపాలను విజిట్ చేయనున్న పోలీసులు, పెట్రో మొబైల్ కానిస్టేబుళ్లు ఫ డీడీ చెల్లిస్తే మండపాలకు విద్యుత్పోల్ నుంచి కనెక్షన్ గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ప్రజలు సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. నిమజ్జనం చేసే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే ఏర్పాట్లు చేస్తారు. – అక్షాంశ్ యాదవ్, డీసీపీ ప్రతి మండపానికి ఒక లైన్ ఇన్స్పెక్టర్, ఒక లైన్మన్తోపాటు ఇద్దరు ఆర్టిజన్ సిబ్బందిని బాధ్యులను చేశాం. ప్రతిరోజు విద్యుత్ అధికారులు మండపాన్ని సందర్శించాలి. డీడీ చెల్లిస్తే విద్యుత్పోల్ నుంచి కనెక్షన్ ఇస్తాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ట్రిప్ అయి ప్రమాదం జరగకుండా ఎంసీపీ ఏర్పాటు చేస్తాం. – సుధీర్కుమార్, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి గణేష్ ఉత్సవాలు, మిలాద్– ఉన్– నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మతపెద్దలు, మండపాల నిర్వాహకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఏఎస్పీ రాహుల్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, రెవెన్యూ డివిజనల్ అధికారి మాలి కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఏసీపీలు పటోళ్ల మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వరిలో కొత్త రకం కలుపు మొక్కలు
చిలుకూరు: ఈ ఏడాది వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేసిన రైతులకు కలుపు మొక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో వివిధ రకాల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఏ మందులు పిచికారీ చేసినా కలుపు మొక్కలు చనిపోయే పరిస్థితి లేదు. వరి విత్తనాలు వెదజల్లిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రైతులు ఒకసారి కలుపు మందులు పిచికారీ చేశారు. అయినా కలుపు మొక్కలు చనిపోలేదు. మరోసారి పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని రైతులు చెబుతున్నారు. గతంలో లేని విధంగా ఈసారి కొత్త రకం కలుపు మొక్కలు పుట్టుకొస్తున్నాయని రైతులు అంటున్నారు. కొత్త రకం కలుపుతో తంటాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలను ప్రారంభంలో ఆరబెట్టడం, నీళ్లు పెట్టడం చేయడం వలన సాధారణంగానే కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. గతంలో తుంగ, వంజ, నక్కలతోకల గడ్డి, దారక లాంటి కలుపు మొక్కలు కనిపించగా.. మొదటి 20 రోజుల్లో మందులు పిచికారీ చేయడం వల్లన వాటిని నివారించేవారు. ఈ ఏడాది కొత్తగా నకిలి వరి, గోధుమ రంగులో వంజ, ఎర్ర, తెల్ల వంజలు మొలకెత్తాయని రైతులు వాపోతున్నారు. ఇవి ఏ మందులు కొట్టినా చనిపోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వంజ రకం కలుపు విపరీతంగా పెరిగి అసలు వరి పైరు కనబడటం లేదని రైతులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక చిలుకూరులో కొంతమంది రైతులు 30 నుంచి 35 రోజుల క్రితం వెదల్లే పద్ధతిలో సాగు చేసిన పొలాలను ట్రాక్టర్తో దున్ని మళ్లీ నాట్లు వేస్తున్నారు. దీని వల్లన రైతులు ఒక్కో ఎకరానికి రూ. 20వేలకు పైగా నష్ట్రపోతున్నారు. చిలుకూరు నుండి దూదియాతండా రోడ్డులో చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. చిలుకూరు మండల వ్యాప్తంగా 70 శాతం మంది రైతులు ఈ ఏడాడి వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేశారు. ఇప్పటికై నా వ్యవసాయాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మొదటి 20 రోజులకు కలుపు మందులు పిచికారీ చేశా. అయినా అవి చనిపోలేదు. మళ్లీ వెంటనే రెండోసారి కూడా కలుపు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. పొలంలో విపరీతంగా కొత్త రకం వంజ పుట్టింది. పొలం మొత్తం కమ్మేసింది. ఏమి చేయాలో అర్ధంకాక పొలం మొత్తం మళ్లీ దమ్ము చేసి నాట్లు వేస్తున్నా. – గుండు శ్రీను, కౌలు రైతు, చిలుకూరు ఫ పొలం చెడగొట్టి మళ్లీ దమ్ము చేస్తున్న రైతులు ఫ వ్యవసాయాధికారులు సూచనలు ఇవ్వాలని కోరుతున్న అన్నదాతలు -
అడ్డంకులు వచ్చినా ఆగేది లేదు..
చిట్యాల: వినాయకచవితికి హైదరాబాద్ నుంచి భారీ గణపతి విగ్రహాలను పెద్దఎత్తున వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులోని రైల్వే అండర్పాస్ ఎత్తు తక్కువగా ఉండడంతో వాహనాల్లో భారీ విగ్రహాలను తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అండర్పాస్ అవతలివైపే వాహనాల్లో నుంచి విగ్రహాలను క్రేన్ సహాయంతో కిందకు దించి చక్రాలతో ట్రాలీలో విగ్రహాలను ఉంచి తాళ్ల సహాయంతో అండర్పాస్ కింద నుంచి ఇవతలి వైపు లాక్కొస్తున్నారు. అనంతరం క్రేన్ సహాయంతో మరలా విగ్రహాన్ని వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పలు విగ్రహాలు అండర్పాస్ బ్రిడ్జికి తగిలి ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా విగ్రహాలను అండర్పాస్ కింద నుంచి తరలించే సమయంలో హైవేపై వచ్చే వాహనాలు ఆగిపోతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అండర్పాస్ కింది నుంచి విగ్రహాన్ని లాగుతున్న యువకులు అండర్పాస్ నుంచి బయటకు వచ్చిన భారీ గణనాథుడు క్రేన్తో విగ్రహాన్ని వాహనంలోకి ఎక్కిస్తున్న యువకులు -
వచ్చే నెలలో చేనేత రుణమాఫీ
భూదాన్పోచంపల్లి: లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే వచ్చే నెలలో చేనేత కార్మికుల ఖాతాల్లో చేనేత రుణమాఫీ డబ్బులు జమవుతాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. భూదాన్పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాస్టర్ వీవర్, నేషనల్ మెరిట్ అవార్డు గ్రహీత తడక రమేశ్ ఏర్పాటుచేసిన పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ షోరూంను వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చేనేత రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, కొన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల తీర్మానాలు పూర్తి కాలేదన్నారు. జిల్లాల వారీగా వచ్చిన బ్యాంకర్ల తీర్మానాలు రాష్ట్రస్థాయిలో పూర్తిచేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు. త్రిఫ్ట్ పథకంలో కొత్త పేర్లు మార్పులు, చేర్పులతో కాస్త ఆలస్యమైందని, జూన్ నెలకు సంబంధించి రూ.7 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెస్కో కొనుగోలు చేసిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కులో నెల రోజుల్లో నేచురల్ డై యూనిట్ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. పర్యావరణహితమైన నేచురల్ డై విధానం అందుబాటులోకి వస్తే పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపువస్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఐఐహెచ్టీని పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారని, శిథిలావస్థకు చేరిన హ్యాండ్లూమ్ పార్కును పునర్నిర్మించి వచ్చే రెండేళ్లలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఐఐహెచ్టీని హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ తెలంగాణలోనే మొదటి పైలెట్ ప్రాజెక్ట్ అని అన్నారు. చేనేత వస్త్రోత్పత్తులు, ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడ్యూసర్ కంపెనీలను ప్రోత్సహిస్తోందని అన్నారు. షోరూమ్లో తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, గద్వాల, సిద్దిపేట గొల్లభామ వస్త్రాలతో పాటు దేశంలో పేరెన్నికగన్న అనేక వస్త్రాల వైరెటీలను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డూప్లికేట్ చేనేత వస్త్రాలను అరికట్టేందుకు తెలంగాణ అథెంటిక్ లోగోలను అందజేస్తుందని, ఈ లోగోలను అతికించడం ద్వారా చేనేత వస్త్రాల నాణ్యత, వినియోగదారులకు నమ్మకం పెరిగి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. 62 మంది అవార్డు గ్రహీతలకు పింఛన్లు మంజూరు.. 65 సంవత్సరాలు దాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.8వేలు పింఛన్ ఇస్తున్నామని, ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 62 మందికి పింఛన్ మంజూరైందని వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్ అన్నారు. అవార్డు గ్రహీతల పిల్లలు హ్యాండ్లూమ్కు సంబంధించి కోర్సులు అభ్యసిస్తే వారికి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నెలకు రూ.5వేల స్కాలర్షిప్ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అంతేకాక 90శాతం సబ్సిడీతో ఎలక్ట్రానిక్ జకాట్ మిషన్లు, మగ్గాలు, ఆసు యంత్రాలు, హ్యాండ్లూమ్ ఎక్విప్మెంట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రంలో మరో 42 షోరూలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖతతో ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా 12మంది చేనేత కళాకారులను విదేశాలకు పంపించి అక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. కొత్తగా బున్కర్ దీదీ పథకం కింద మహిళా చేనేత కార్మికులకు ముద్ర రుణాలు ఇప్పించడంతో పాటు వారికి నూలు అందించడం, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల వార్షిక ఆదాయం రూ.10లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణను ఎంపిక చేయగా.. అందులో ఉమ్మడి జిల్లాను ఎంపిక చేశామని త్వరలో ఆ పథకాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. యునెస్కో చేత అంతర్జాతీయ అవార్డు పొందిన పోచంపల్లిలో ఉత్సవాలను నిర్వహించాలని, పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటు చేసి కేంద్రం ఇచ్చే సబ్సిడీని అమలు చేయాలని పోచంపల్లికి చెందిన చేనేత నాయకులు తడక వెంకటేశం తదితరులు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఉత్సవాల డీపీఆర్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్రావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, డీఓ రాజేశ్వర్రెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మరిపెడ రూరల్: అత్తింటి వేధింపులతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఎల్లంపేట గ్రామానికి చెందిన పాక వెంకన్న, ఉమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె ప్రత్యూషను(24) ఐదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మోతె మండలం జగ్గుగూడెం గ్రామానికి చెందిన పెరుగు పరశురాములుకు ఇచ్చి వివాహం చేశారు. కట్నకానుకల కింద ఇద్దరు కుమార్తెలకు చెరో ఒకరం వ్యవసాయ భూమి రాసి ఇచ్చారు. ప్రత్యూష, పరశురాములు దంపతుల దాంపత్య జీవితం కొంతకాలం సజావుగా కొనసాగింది. ఈ క్రమంలో ప్రత్యూష అత్తగారి ఇంటి వద్ద మరిది పెత్తనంతో ఆ ఉమ్మడి కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ గొడవలు పెద్దగా మారి ప్రత్యూషను కట్నం కింద ఇచ్చిన భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఇటీవల అత్తమామ, మరిది, భర్త కలిసి ప్రత్యూషపై దాడి చేశారు. అనంతరం ప్రత్యూషను భర్త పరశురాములు పది రోజుల క్రితం తల్లిగారి ఊరైన ఎల్లంపేటలో బలవంతంగా వదిలి వెళ్లాడు. ఎంతకూ తీసుకెళ్లకపోవడంతో ప్రత్యూష ఫోన్లో భర్తను నిలదీసింది. దీంతో శ్రీనాకు, నీకు సంబంధం లేదు.. నీ చావు నువ్వు చావుశ్రీ అని భర్త తెగేసి చెప్పాడు. మనస్తాపానికి గురైన ప్రత్యూష ఈ నెల 19న ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నంచగా పక్కంటి వారు చూసి రక్షించే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతిచెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతురాలికి 11 నెలల కుమార్తె ఉంది. -
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మోతె: బంధువు సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన యువకుడు గడ్డిమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. వివరాలు.. మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన నిమ్మల పెదలచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అందరికీ వివాహాలు చేశారు. నలుగురు కుమారులకు ఒక్కొక్కరికి ఆరెకరాల వ్యవసాయ భూమి, 3 గుంటల ఇంటి స్థలం పంచి ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కుమారులు పట్టించుకోవడం లేదని పెదలచ్చయ్య, లచ్చమ్మ దంపతులు పలుమార్లు తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సోమవారం ఆ వృద్ధ దంపతులు తమ మనమడు నిమ్మల రాము(22)తో కలిసి సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వారి బంధువు నిమ్మల రాజశేఖర్ సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైన రాము మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు నిమ్మల రాజశేఖర్, వృద్ధ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు. -
రిజర్వేషన్లకు మించి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు, వారు గెలుపొందిన స్థానాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. వారికి కేటాయించిన స్థానాలతోపాటు, జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసి సర్పంచ్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు పలు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా అమలు చేసే యోచనతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అన్ని పార్టీలు అమలు చేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో 23 శాతం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019 ఎన్నికల్లో బీసీలు తమకు ఉన్న రిజర్వేషన్లకు మించి స్థానాలను దక్కించుకున్నారు. రిజర్వు అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో అధిక సీట్లను కై వసం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే 23 శాతం రిజర్వేషన్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 40 శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందినట్లు రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లోనూ 35 శాతం వరకు, జెడ్పీటీసీ స్థానాల్లోనూ 25 శాతం వరకు స్థానాలను సాధించారు. జనరల్ స్థానాల్లో గెలుపు ఇలా.. ● నల్లగొండ జిల్లాలో 844 సర్పంచ్ స్థానాలు ఉండగా.. బీసీ రిజర్వేషన్ కింద 209 స్థానాలతోపాటు 79 జనరల్ స్థానాల్లోనూ బీసీలే పోటీ చేసి విజయం సాధించారు. మొత్తంగా 288 స్థానాలను (35 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 346 ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 93తోపాటు 23 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. మొత్తంగా 121 స్థానాలను బీసీలు దక్కించుకున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ రిజర్వుడ్ స్థానాలు 4తో పాటు మరో 4 జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి.. 8 స్థానాల్లో గెలుపొందారు. ● సూర్యాపేట జిల్లాలోనూ 475 సర్పంచ్ స్థానాలకు గాను బీసీ రిజర్వుడ్ స్థానాలు 171తోపాటు మరో 52 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. 233 స్థానాలను (47 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 255 ఎంపీటీసీ స్థానాల్లో 29 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 50 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 79 స్థానాలను కై వసం చేసుకున్నారు. 23 జెడ్పీటీసీ స్థానాల్లో 3 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 2 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 5 జెడ్పీటీసీ స్థానాలను సాధించారు. ● యాదాద్రి జిల్లాలోని 420 సర్పంచ్ స్థానాల్లో బీసీ రిజర్వుడ్ 117 స్థానాలతోపాటు 59 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి.. 176 స్థానాలను (42 శాతం) కై వసం చేసుకున్నారు. 117 ఎంపీటీసీ స్థానాల్లో 39 రిజర్వుడ్ స్థానాలతోపాటు 12 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తం 51 స్థానాలను బీసీలు సాధించారు. 17 జెడ్పీటీసీ స్థానాల్లో 4 బీసీ రిజర్వుడ్ స్థానాలతోపాటు మరొక జనరల్ స్థానంలో పోటీ ఐదింటిని దక్కించుకున్నారు. ఫ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ గెలిచిన బీసీలుఫ ఈసారి బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేలా కసరత్తు ఫ ప్రభుత్వ పరంగా కుదరకపోతే పార్టీ తరఫున అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ఫ మిగతా పార్టీలూ బీసీలకు ప్రాతినిధ్యం పెంచక తప్పని పరిస్థితి ఫ రిజర్వేషన్ల అమలుపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పరంగా చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఒకపార్టీ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు సీటు కేటాయించినా, అక్కడ మరో పార్టీ జనరల్ అభ్యర్థిని నిలబెడితే ప్రయోజనం ఉండదని పే ర్కొంటున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేసేందుకు తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. జాతీయస్థాయిలో కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
యూరియా కొరత వదంతులను నమ్మొద్దు
ఆత్మకూరు(ఎం): అవసరం మేరకు యూరియా ఉందని, రైతులు కొరత వదంతులను నమ్మొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో నరేష్ అగ్రిమాల్ ఎరువుల షాప్ను తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రికార్డులను, ఎరువుల ధరలకు సంబంధించిన పట్టిను పరిశీలించారు. నాలుగైదు రోజుల్లో జిల్లాకు వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు చెప్పారు. అనంతరం పీహెచ్సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కాన్పులు పెంచాలని, నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములునాయక్, వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, ఏఈఓ సరిత ఉన్నారు. -
ఉత్సవాలు ముగిసేవరకు ప్రత్యేక నిఘా
ఆలేరు: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ అక్షాంశ్యాదవ్ పేర్కొన్నారు. ఆలేరు పరిధిలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ఆలేరులోని గోధుమకుంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండపాల వద్ద ఉత్సవాలు ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగలతో ప్రమాదాలు చోటుచేసుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించినట్టు డీసీపీ చెప్పారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్దకు చిన్నపిల్లలను తీసుకువెళ్లొద్దని కోరారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లు, క్రేన్లు అందుబాటులో ఉంటాయన్నారు. చెరువుల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు అధికారుల సూచనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులు వస్తే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వాలన కోరారు. అంతకుముందు ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ యాలాద్రితో చెరువు వద్ద తీసుకోవాల్సిన జాగత్త్రలపై డీసీపీ చర్చించారు.ఫ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఫ డీసీపీ అక్షాంశ్యాదవ్ -
వాళ్ల అడ్డదారులు.. వీళ్లకు సిరులు!
సాక్షి యాదాద్రి: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు కొందరు అడ్డదారులు నిర్మిస్తున్నారు. సర్వీసు రోడ్లు, లింకు రోడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా నేషనల్ హైవే అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు న్నాయి. పైగా వారికి హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు సిరులు కురిపిస్తున్నాయి. ఇందుకు టోల్ప్లాజాల సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా పీడీ దుర్గాప్రసాద్ను ఒక హోట్ల నిర్వాహకుడి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) అధికారులకు నేరుగా చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి. లక్ష రూపాయలు డిమాండ్జాతీయ రహదారిని తవ్వి లింకు, సర్వీస్ రోడ్లు నిర్మించిన వారిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ, పలుకుబడి కలిగిన వారిని, ముడుపులు ఇచ్చిన వారిని వదిలేస్తున్నారు. వీరికి టోల్గేట్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారని సీబీఐ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి–163 వెంట హోటల్ యజమాని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీకి బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా సిబ్బంది మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఇందుకోసం పీడీ లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. బుధవారం రూ.60 వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పీడీతోపాటు టోల్గేట్ సిబ్బందిని విచారిస్తున్నారు. అన్నీ రూల్స్కు విరుద్ధంగానే.. జాతీయ రహదారుల వెంట హోటళ్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు, టీ హౌజ్లతో పాటు ఇతర వ్యాపార సంస్థలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి వెంబడి ఘట్కేసర్ నుంచి మొదలుకొని బీబీనగర్, గూడూరు, భువనగిరి బైపాస్, రాయగిరి, వంగపల్లి, ఆలేరు బైపాస్ జనగామ జిల్లా శివారు వరకు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు అనుమతి తీసుకోకుండానే ఏర్పాటు చేశారు. బాటకోసం జాతీయ రహదారి, సర్వీస్ రోడ్ల వరకు తవ్వకాలు చేపట్టి లింకు చేస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. బీబీనగర్ టోల్గేట్ సమీపంలో అక్రమ ఏర్పాటు చేసిన పార్కింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు సిగ్నల్ కూడా లేకపోవడం, వాహనాలు వ్యాపార కూడలి వెపు వెళ్లేందుకు ఒక్కసారిగా సర్వీస్ రోడ్డుకు మళ్లుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.ఏకంగా సర్వీస్ రోడ్డే వేశారుభువనగిరి శివారులో ఇటీవల ఓ పేరు మోసిన సంస్థ హోటల్ను ప్రారంభించింది. హోటల్ వద్దకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు. ఇందుకోసం అనుమతి లేకుండా జాతీయ రహదారి నుంచి ఏకంగా సర్వీస్ రోడ్డు నిర్మించారు. హోటల్పై ఓ ప్రజాప్రతినిఽధి ఫిర్యాదు చేయగా.. సర్వీస్ రోడ్డు తొలగించాలని సరదు యజమానికి జాతీయ రహదారి అధికారులు నోటీసు జారీ చేశారు. కాగా హోటల్ యజమాని తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్హెచ్ఏఐ అధికారులను తనవైపు కన్నెత్తి చూడకుండా చేశాడు.హైవేల వెంట పెద్ద ఎత్తున హోటళ్లు, దాబాలు, ఇతర వ్యాపార సంస్థలు లింకురోడ్ల కోసం జాతీయ రహదారులను తవ్వుతున్న నిర్వాహకులు ముడుపులు తీసుకుంటూ వదిలేస్తున్న సంబంధిత అధికారులు ఓ రెస్టారెంట్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్.. సీబీఐకి పట్టుబడిన హైవే పీడీ -
ముందుగానే మద్యం టెండర్లు
రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీ ఖరారుసాక్షి, యాదాద్రి: స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన మద్యం దుకా ణాలకు ముందుగానే టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట ఎకై ్సజ్ సరిళ్ల ఉండగా, వాటి పరిధిలో 82 మద్యం షాపులు ఉన్నాయి. మద్యం వ్యాపారులు, ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. నవంబర్తో ముగియనున్న ప్రస్తుత లైసెన్స్ కాలంమద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఆ సమయంలో మద్యం షాపుల టెండర్లకు వీలుండదనే ఆలోచనతో ముందుగానే నోటిపికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్ని ఈసారి కూడా అమలుపరచనుంది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 20 వరకు రెండేళ్ల కాలానికి దుకాణాలను కేటాయిస్తారు.నాన్ రిఫండబుల్ ఫీజు గతంలో రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా వేయొచ్చు. రిజర్వేషన్ ప్రకారం.. రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాలను కేటా యించనున్నారు. ఎస్సీలకుు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేష కల్పిస్తారు. రిజర్వేషన్ల వెసులుబాటుతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సిద్ధమవుతున్న ఆశావహులుమద్యం వ్యాపారులు, ఆశావహులు టెండర్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నాన్ రిఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు నిర్ణయించినందున నలుగురైదుగురు కలిసి ఒకరిపై దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. పబ్లిక్ డిమాండ్ ఉన్న చోట పోటీ ఎక్కువనే ఉండనుంది. క్రితంసారి 3,969 దరఖా స్తులు రాగా.. ప్రభుత్వానికి రూ.79.38 కోట్ల ఆదా యం సమకూరింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి కూడా పోటీ తీవ్రంగా ఉండనుందని ఎక్జైజ్ శాఖ భావిస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం సెప్టెంబర్ రెండో వారంలోపు షెడ్యూల్, అదే రోజునుంచి దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు అక్టోబర్లో లక్కీ డ్రా డిసెంబరు నుంచి కొత్త వైన్స్ల నిర్వహణకు అవకాశం జిల్లాలో 82 మద్యం దుకాణాలు లాటరీ పద్ధతిలో కేటాయింపు నూతన మద్యం టెండర్లకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబరు 2వ వారంలోపు షెడ్యూల్ విడుదల చేసి ఆనెల మొత్తం దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించే అవకాశం ఉంది. అక్టోబర్లో డ్రా పద్ధతిలో షాపుల కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ డ్రా తీయనున్నారు.ఆరు స్లాబ్లలో ఫీజు.. జిల్లాలో 82 మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన షాపులకు పీజు ఉంటుంది. రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్లలో లైసెన్స్దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు 5 వేల నుంచి 50వేల జనాభాకు రూ.55 లక్షలు 50వేల నుంచి లక్ష జనాభాకు రూ.60లక్షలు లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65లక్షలు 5లక్షల నుంచి 20లక్షల జనాభాకు రూ.85 లక్షలు 20లక్షల పైచిలుకు జనాభా ఉంటే రూ. కోటి 10లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రీ ప్రైమరీ స్కూళ్లలో అడ్మిషన్లు
భువనగిరి : జిల్లాకు మంజూరైన 36 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు డీఈఓ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు సంవత్సాలు నిండిన చిన్నారులు అర్హులన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రీ ప్రైమరి స్కూళ్లలో చేర్పించేందుకు నేరుగా సంబంధిత ప్రధానోపాధ్యాయులను, లేదా 9948979973 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఎంపికై న పాఠశాలలు ఇవీ..అడ్డగూడూరు మండలంలో కంచనపల్లి, లక్ష్మీదేవికాల్వ, జానకీపురం, అడ్డగూడూరు, ఆలేరు మండలంలో పటేల్గూడెం, మంతపురి, తూర్పుగూడెం, ఆత్మకూర్(ఎం) మండలంలో తుక్కాపూర్, భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడం, సూరేపల్లి, కూనూరు, ముస్త్యాలపల్లి, బొమ్మలరామారం మండలంలో ప్యారారం,సోలిపేట,పెద్దపర్వతాపూర్, నాగినేనిపల్లి, చౌటుప్పల్ మండలంలో పెద్దకొండూరు, గుండాల మండలంలో బ్రాహ్మణపల్లి, తుర్కపల్లి మండలంలో నాగాయపల్లితండా, మాదా పురం, పెద్దతండా, దిలావర్పూర్ ఉన్నాయి. వీటితో పాటు భూదాన్పోచంపల్లి మండలం జూలూరు, జలాల్పూర్, రాజాపేట మండలంలోని పారుపల్లి, బూరుగుపల్లి,రామన్నపేట మండలంలో ఎన్నారం, మునిపంపుల, శోభనాద్రిపురం, వలిగొండ మండలం లింగరాజుపల్లి, వలిగొండ, ఏదుల్లాగూడెం, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు, కొత్తగుండ్లపల్లి, ధర్మారెడ్డిగూడెం గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి.ఆకట్టుకున్న టీఎల్ఎం మేళా యాదగిరిగుట్ట: పట్టణంలోని పాత గోశాల ఎస్ఎల్ఎన్ఎస్ కల్యాణవేదికలో బుధవారం ఏర్పాటు చేసిన బోధన అభ్యసన సామగ్రి (టీఎల్ఎం) మేళా అకట్టుకుంది. వివిధ పాఠశాలలు తయారు చేసిన బోధన అభ్యసన సమాగ్రిని మేళాలో ప్రదర్శించారు. వాటిని మండల విధ్యాధికారి శరత్ యామినితో కలిసి డీఈఓ సత్యనారాయణ పరిశీలించారు. విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10 ఉత్తమ ఎగ్జిబిట్లను జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో కోర్టు భవనం పనులు ప్రారంభం భువనగిరిటౌన్ : జిల్లా కోర్టు భవనాల పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు తెలిపారు. భువనగిరి పట్టణ శివారులో కోర్టు నూతన భవనిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని బుధవారం పరిశీలించారు. స్థలాన్ని చదునుచేయడం తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. రూ.81 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఆయన వెంట జిల్లా న్యాయసేవా అధికారి సంస్థ కార్యదర్శి మాధవి లత, భువనగిరి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్లందాస్ వెంకటయ్య ఉన్నారు. నేత్రపర్వంగా గజవాహన సేవయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్యారాధనలో భాగంగా గజవాహన సేవ నేత్రపర్వంగా చేపట్టారు. స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ తంతు సందర్భంగా తొలుత గజవాహన సేవను ఊరేగించడం సంప్రదాయం. అంతకుముందు వేకువజామున స్వామివారి మేల్కొలుపులో సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ఉత్తర దిశలోని మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ముఖ మండపంలో సువర్ణపుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు. -
వాహనాల పార్కింగ్కు..
బీబీనగర్ మండలం గూడూరు టోల్గేట్ ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సర్వీస్ రోడ్డు నుంచి దారి ఏర్పాటు చేసుకోగా ఇటీవల హైవే అధికారులు జేసీబీతో తవ్వారు. దీంతో పార్కింగ్ స్థలం లేక కస్టమర్లు రావడం లేదు. ఆర్థికంగా నష్టపోతున్నానని హోటల్ యజమాని ఎన్హెచ్ఏఐ పీడీ దుర్గాప్రసాద్ను వేడుకోగా రూ.లక్ష ఇవ్వాలని పీడీ డిమాండ్ చేశాడు. దీంతో సదరు రెస్టారెంట్ ఓనర్ సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు తొలుత రెస్టారెంట్ ఓనర్ రూ.60 వేలు ఇస్తుండగా సీబీఐ అధికారులు పీడీని పట్టుకున్నారు. -
వ్యవసాయ పనుల్లో ఉత్తరాది కూలీలు
చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో రైతులు కూలీలు కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీల ఆగమనం ప్రారంభమైంది. దీంతో వలస కూలీలు రైతులకు వ్యవసాయ పనుల్లో బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి నాట్లతో పాటు పత్తి, ఇతర పంటల సాగులో పనిచేయడానికి ఉత్తరాది రాష్ట్రాల కూలీలు పెద్ద సంఖ్యలో గ్రామాలకు చేరుకున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహర్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్తో పాటు ఛత్తీస్గడ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కుటుంబాలతో కలసి కూలీలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వలస వస్తున్నారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ఆయా గ్రామాల్లోని రైతుల వద్ద ఉంటున్నారు. చౌటుప్పల్, వలిగొండ, భూదాన్పోచంపల్లి మండలాల్లో రైతులు వలస కూలీలపై ఆధాపడి వ్యవసాయ పనులు చేస్తున్నారు. గతంలో మగ కూలీలు మాత్రమే వచ్చేవారు. ఈ ఏడాది మహిళలతో పాటు కుటుంబాలను తీసుకొని వచ్చారు. ప్రతి గ్రామంలో వరి నాట్లు సగం వరకు వలస కూలీలే పూర్తిచేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లోనే నివాసం, వంటావార్పు..వలస కూలీలకు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్దనే నివాస ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే వారు వంట చేసుకుంటున్నారు. వరి నాట్లకు వెళ్లే కూలీలు ఉదయమే పంట పొలాలకు వెళ్లి నాట్లు వేస్తున్నారు. పత్తి చేలలో కలుపు తీసే పనులకు వెళ్లే వారు వంట చేసుకొని మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తున్నారు. స్థానిక కూలీలు ఎకరాకు పది నుంచి పన్నెండు మంది నాట్లు వేస్తే వీరు మాత్రం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే పూర్తి చేస్తున్నారు. దీంతో ఖర్చు తగ్గుతుండడంతో రైతులు వలస కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని పనుల్లో ఆరితేరి..వలస కూలీలు పత్తి చేనులో కలుపు తీయడం నుంచి గుంటుక కొట్టడం, అడుగు మందు వేయడం, పురుగు మందులు కొట్టడం వంటి పనులు చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, పంతంగి, రెడ్డిబాయి గ్రామాల్లో రైతుల వద్దకు పది కుటుంబాలు వలస వచ్చారు. ఇలా సుమారు ఆయా గ్రామాల్లోనే రెండు వందల మందికి పైగా వలస కూలీలు ఉన్నారు. వీరు ట్రాక్టర్ పనులు కూడా చేస్తున్నారు. కూలి తక్కువ.. పని త్వరగా..వలస కూలీలకు ఇచ్చే కూలి స్థానిక కూలీలతో పోల్చితే తక్కువగా ఉంది. వరి నాట్ల కోసం ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నారు. స్థానిక కూలీలకు ఎకరాకు రూ.6వేలు ఇస్తున్నారు. పత్తి చేనులో పనికి వెళ్తే వలస కూలీలకు రూ.400 ఇస్తే, స్థానిక కూలీలకు రూ.500 ఇస్తున్నారు. ఇలా కూలీ తక్కువ ఉంటుంది. వీరు పని కూడా త్వరగా పూర్తిచేసుకుని వెళ్తున్నారు. గ్రామాల్లో కూలీల కొరత తీరిందంటున్న స్థానిక రైతులు వలస కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేస్తున్న అన్నదాతలు -
బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్ల గొండ పోక్సో కోర్టు జడ్జి ఎన్. రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నాంపల్లి మండలం చమలపల్లి గ్రామానికి చెందిన మంగళపల్లి యాలాద్రి అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి 2014 మే 15న కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అప్పటి సీఐ వెంకట్రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితుడు యాలాద్రిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలతో ఏకీభవించిన జడ్జి రోజారమణి నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రస్తుత సీఐ రాజు, కోర్టు కానిస్టేబుల్ సైదులు, లైజన్ ఆఫీసర్ నరేందర్ సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంలో సహకరించారు. కుంటలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంబొమ్మలరామారం: స్నేహితులతో కలిసి కుంటలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ శివారులో గల బ్లూ అగ్రిగేట్స్ స్టోన్ క్రషర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నందిలాల్ భారతి(25) పని చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టోన్ క్రషర్ సమీపంలోని కుమ్మరి కుంటలో నీరు చేరింది. నందిలాల్ భారతితో పాటు మరో నలుగురు కార్మికులు మంగళవారం ఉదయం కుమ్మరి కుంటలో ఈత కొడుతుండగా.. లోతు అంచనా వేయకలేక నందిలాల్ భారతి కుంటలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలరుల సహాయంతో నందిలాల్ భారతి కోసం గాలించారు. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం రంగంలో దిగి మంగళవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా.. సాయంత్రం నందిలాల్ భారతి మృతదేహాన్ని కుంటో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు. కానిస్టేబుల్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు ● కానిస్టేబుల్తో పాటు వాహనదారుడికి గాయాలు ● పంతంగి టోల్ప్లాజా వద్ద ఘటనచౌటుప్పల్ రూరల్: మద్యం మత్తుతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్కానిస్టేబుల్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్తో పాటు వాహనదారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటప్పల్ ట్రాఫిక్ పోలీస్ సేష్టన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్కే ఆసిఫ్ మంగళవారం రాత్రి పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు స్కూటీపై వెళ్తున్న హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన విశాల్ను ఆపబోయాడు. కానీ మద్యం మత్తులో ఉన్న విశాల్ స్కూటీతో హెడ్కానిస్టేబుల్ ఆసిఫ్ను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విశాల్ స్కూటీ పైనుంచి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ఆసిఫ్ కాలు విరగడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాల్కు స్వల్ప గాయాలు కావడంతో కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
గర్భిణి మృతి కేసులో ఏడుగురి అరెస్ట్
సూర్యాపేట టౌన్: గర్భిణికి ఆమె భర్త ఆర్ఎంపీ వైద్యులతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ఆమె మృతిచెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అబార్షన్ చేసేందుకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బయగల శ్రీను, విజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భవతి అయిన విజిత(ఐదు నెలలు)కు ఈ నెల 15న అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయిబాలాజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి వైద్యం చేయగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఖమ్మంకు తీసుకెళ్లారు. అప్పటికే విజిత పరిస్థితి విషమించి మృతి చెందింది. తన భార్య మృతికి ఆర్ఎంపీ బండి శ్రీనివాస్ కారణమని తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆర్ఎంపీని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అబార్షన్ చేయించడంతో..విజితకు ఆమె భర్త శ్రీను ఖమ్మం పట్టణంలో స్కానింగ్ చేయించగా.. కడుపులో మళ్లీ ఆడపిల్లే ఉందని తేలడంతో అబార్షన్ చేయించాలని అనుకున్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ బండి శ్రీనివాస్ను సంప్రదించగా.. అతడు మరో ఆర్ఎంపీ పానుగంటి సతీష్తో కలిసి విజితకు ఈ నెల 15న తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయిబాలాజీ హాస్పిటల్లో అబార్షన్ చేశాడని డీఎస్పీ తెలిపారు. ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. అయితే శ్రీను తన భార్య విజితను ఖమ్మం తీసుకెళ్లి అక్కడ తుమ్మచర్ల అరుణ అనే నర్సును సంప్రదించి లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడని, ఖమ్మం పట్టణంలో కల్పన క్లినిక్ నిర్వహిస్తున్న పోలంపల్లి కల్పన లింగ నిర్ధారణ పరీక్ష చేసినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఖమ్మం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సంపేట అశోక్ స్కానింగ్ పరికరంతో లింగ నిర్ధారణ పరీక్ష చేశాడని, అతడికి లింగ నిర్ధారణ పరీక్ష చేసే స్కానర్ను పులి వీరభద్రరావు సమకూర్చినట్లు గుర్తించామని డీఎస్పీ వివరించారు. ఏడుగురి అరెస్ట్, రిమాండ్..ఈ కేసులో ఏ–1 తుంగతుర్తికి చెందిన ఆర్ఎంపీ బండి శ్రీనివాస్, ఏ–2 విజిత భర్త బోయగల శ్రీను, ఏ–3 ఖమ్మంలో స్కానింగ్ చేసే సంపెట అశోక్, ఏ–4 స్కానింగ్ చేసే పరికరం సమకూర్చిన పులి వీరభద్రరావు, ఏ–5 లింగ నిర్ధారణ పరీక్ష చేయడానికి ఏర్పాటు చేసిన నర్సు తుమ్మచర్ల అరుణ, ఏ–6 కల్పన క్లినిక్ నిర్వాహకురాలు పోలంపల్లి కల్పన, ఏ–7 నాగారం మండలం పసునూరు గ్రామానికి చెందిర ఆర్ఎంపీ పానుగంటి సతీష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అబార్షన్ వికటించి మృతిచెందినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ ఆమె భర్తతో పాటు ఆరుగురి రిమాండ్ -
ఉత్తమ ఉపాధ్యాయులుగా నాజ్నీన్, శంషున్నిసా
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలకు చెందిన బయాలజికల్ సైన్స్ టీచర్(స్కూల్ అసిస్టెంట్) నాజ్నీన్ ఖుర్షీద్, ఉర్దూ టీచర్(స్కూల్ అసిస్టెంట్) శంషున్నిసా బేగం రాష్ట్రస్థాయి ఉర్దూ మీడియం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. బుధవారం వారిని హైదరాబాద్లోని తెలంగాణ ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందన్, తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఫ్ అన్సారి, తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ శాలువాలు, పూలమాలతో, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. తమ పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు రాష్ట్ర స్థాయి ఉర్దూ మీడియం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వంగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు ఏడబ్ల్యూఎస్ రాబియా అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయూబ్ఖాన్, షేక్ బాబా, అతియా, ఆర్. ప్రవీణ, ఇర్షత్ ఫర్హీన్, పీఈటీ అష్రఫ్ అహ్మద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త కొండకింది చినవెంకట్రెడ్డి(99) మంగళవారం రాత్రి మృతిచెందారు. చినవెంకట్రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కొండకింది పూర్ణచందర్రెడ్డి హైదరాబాద్లో ప్రముఖ వైద్యుడు. చినవెంకట్రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులందరికీ సుపరిచితుడే. ఈయన స్వస్థలం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామం. రైతు కుటుంబంలో జన్మించిన చినవెంకట్రెడ్డి పుట్టిన తేదీ 1929 సెప్టెంబర్18 అని సర్టిఫికెట్లలో ఉండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన వయస్సు 99 సంవత్సరాలు అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చినవెంకట్రెడ్డి 1947లో ఎస్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు సేవలందించారు. ఆ తర్వాత హెచ్ఎంగా, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్గా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారు. సాహితీ మేఖల సంస్థకు జిల్లా గౌరవాధ్యక్షుడిగా చాలాకాలం కొనసాగి సంస్థ అభివృద్ధికి, సాహిత్యాభివద్ధికి కృషి చేశారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలుచినవెంకట్రెడ్డి సతీమణి తారకమ్మ చాలా సంవత్సరాల క్రితమే మృతిచెందింది. ఆమె పేరు మీద కొండకింది తారకమ్మ చినవెంకట్రెడ్డి ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి ప్రతిభా స్కాలర్షిప్లను అందజేసి తోడ్పాటునందించారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషిచేస్తూనే బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లాస్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. పద్యాల పట్ల విద్యార్థుల్లో సన్నగిల్లుతున్న ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా 100 పద్యాలను కంఠస్థం చేసిన వారికి రూ.1,116, 200 పద్యాలు కంఠస్థం చేసిన వారికి రూ.2,116 నగదు బహుమతిని అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అదేవిధంగా గతంలో వరద బాధితుల సహాయార్ధం సుమారు రూ.10 లక్షల విలువైన దుస్తులు, బ్లాంకెట్లు, లుంగీలు, దోవతులు, చీరలు, షర్ట్స్, ప్యాంట్లు, టవల్స్, బనియన్లు, దుప్పట్లు అందజేశారు. ప్రముఖుల నివాళి.. చినవెంకట్రెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రముఖులు నల్లగొండ పట్టణంలోని ఆయన నివాసానికి వచ్చి పార్ధివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, డీఐజీ మహేష్ భగవత్, ఏసీబీ డీజీ విజయ్కుమార్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆకుల రవి, అడిషనల్ ఎస్పీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్లు పురుషోత్తంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చొల్లేటి ప్రభాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మున్సిపల్ చైర్మన్లు పుల్లెంల వెంకట్నారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బండారు ప్రసాద్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, హాశం, పలువురు డాక్టర్లు, న్యాయవాదులు, లయన్స్క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. కలిసిరాని రాజకీయాలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు గడించిన కొండకింది చినవెంకట్రెడ్డికి రాజకీయాలు కలిసి రాలేదు. 1984లో చినవెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఆయనకు నల్లగొండ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ద్వారా లభించగా.. చకిలం శ్రీనివాసరావు బీ ఫారం క్యాన్సిల్ చేయించడంతో అవకాశం చేజారిపోయింది. 1994లో అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డితో సన్నిహితంగా ఉండటం వలన ఆయన కోరిక మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి ఆర్గనైజింగ్ సెక్షన్లో పాలుపంచుకున్నారు. రాజకీయంగా ఏ పదవులను ఆశించలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నివాళులర్పించిన ప్రముఖులు -
శిశుగృహకు నవజాత శిశువు అప్పగింత
పెద్దఅడిశర్లపల్లి: మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడంతో సాకలేక బంధువులకు అప్పగించిన నవజాత శిశువును బుధవారం ఐసీడీఎస్ అధికారులు నల్లగొండ శిశుగృహ సిబ్బందికి అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం మునావత్తండాకు చెందిన మునావత్ శంకర్, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. మూడో కాన్పులోనూ రాణి ఆడబిడ్డకు జన్మించింది. దీంతో ముగ్గురిని సాకలేక నవజాత శిశువును బంధువులకు అప్పగించారు. రాణి కాన్పుకు అమ్మగారి ఇంటికి వెళ్లి రెండు నెలల తర్వాత ఈ నెల 4న మునావత్తండాకు శిశువు లేకుండా రావడంతో ఐసీడీఎస్ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. శంకర్, రాణి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో మంగళవారం గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శిశువు తల్లిదండ్రులు, బంధువులను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. ముగ్గురు ఆడపిల్లలను సాకలేక బంధువులకు అప్పగించారని తేలడంతో శిశుగృహకు అప్పగించారు. -
ఇళ్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ: రోడ్డు వెడల్పు పేరుతో తమ ఇళ్లను అక్రమంగా జేసీబీతో కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పులిగిల్ల గ్రామస్తులు బుధవారం వలిగొండ పోలీసులను ఆశ్రయించారు. వలిగొండ నుండి కాటిపల్లి వరకు నూతనంగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా గ్రామానికి చెందిన కొంతమంది ఇంటి యజమానులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారు. దీంతో పలువురు బాధితులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ యుగంధర్ తెలిపారు. పోలీసులను ఆశ్రయించిన పులిగిల్ల వాసులు -
ప్రజా పోరాటాలకు పాటే ప్రాణం
రామన్నపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి ప్రజా పోరాటాల వరకు పాటే ప్రాణంగా నిలిచిందని, భూమి ఉన్నంత వరకు పాటకు మరణం ఉండదని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేటలో నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శనను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాటకు, ఆటకు ప్రజలను చైతన్యపరిచే గొప్ప శక్తి ఉందని తెలిపారు. పాశ్చాత్య విష సంస్కృతి వల్ల అంతరించిపోతున్న జానపద కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వందలాది మంది కళాకారులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి ప్రదర్శనలు ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. ప్రజా నాట్యమండలి ప్రజాపాటకు బహువచనమని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రపంచీకరణ ముసుగులో ప్రజాకళలు పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అవుతున్నాయని, సినిమాలు ఇతర రూపాల్లో వికృతరూపం దా లుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానాట్య మండలి ప్రజల కళారూపాలను భుజానికి ఎత్తుకొని ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిందు, యక్షగానం, భాగవతం, కోలాటం, బుర్రకథ, డప్పు కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కోఆర్డినేటర్ వేముల పుష్ప, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, కూరెళ్ల నర్సింహాచారి, వేల్పుల వెంకన్న, మేడి పృథ్వీ, గంటెపాక శ్రీకృష్ణ, కందుల హన్మంత్, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం పాల్గొన్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ -
పది రోజుల్లో ఇంటింటికి తాగునీరు అందించాలి
పెద్దవూర: పది రోజుల్లో ఇంటింటికి తాగునీటిని అందించాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదన్న ఫిర్యాదుతో బుధవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డితో కలిసి పెద్దవూర మండల కేంద్రంతో పాటు గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఎలా ఉందని ఇళ్లలోకి వెళ్లి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని మహిళలు ఆయనకు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించగా.. రోజుకు 400 లీటర్ల నీటిని వాడుకోవాల్సి ఉండగా 1200 లీటర్ల నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఫ్లో కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేస్తే ఎక్కువ తక్కువలు కాకుండా ఇంటింటికి ఒకే పరిమాణంలో తాగునీటిని అందించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. చౌరస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న నల్లాను తొలగిస్తే ఇంటింటికి నీళ్లు అందుతాయని తెలుపగా.. వెంటనే తొలగించాలని సూచించారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించి మండలంలో గర్నెకుంట చివరి గ్రామం అని కరెంట్ పోయినా, పైపులు పగిలినా మొదటగా సమస్య ఇక్కడే ఉత్పన్నమవుతుందని భవిష్యత్లో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. వెల్మగూడెంలో గతంలో నిర్మించిన పాత సంపులోకి నీటిని ఎక్కిస్తే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, పబ్బు యాదగిరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు నాగేశ్వర్రావు, కృష్ణయ్య, ఈఈలు శాంతికుమారి, లక్ష్మీనారాయణ, డీఈలు మధు, నిరంజన్సిన్హా, ఏఈలు దీక్షిత్, ప్రవీణ్, నడ్డి గోపాలకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి -
హలో నేను కలెక్టర్ను మాట్లాడుతున్నా..
భువనగిరి టౌన్: ‘హలో నేను కలెక్టర్ను మాట్లాడుతున్నా.. గతంలో మీ స్కూల్లో చదువుకున్న అక్షయ అనే విద్యార్థికి గంటలోపు సర్టిఫికెట్స్ ఇవ్వాలి’ అని కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సాధన హైసూ్కల్ ప్రిన్సిపాల్కు ఫోన్ చేసి ఆదేశించారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడేనికి చెందిన రావుల అక్షయ సాధన ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకుంది. 9వ తరగతి బస్వాపురం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో చేరింది. ప్రస్తుతం అక్షయ పదో తరగతి చదువుతోంది. అక్షయ రెండేళ్లుగా ప్రైవేట్ స్కూల్ చుట్టూ తిరుగుతోంది. మొత్తం ఫీజు చెల్లిస్తే తప్ప సరి్టఫికెట్లు ఇవ్వబోమని ప్రిన్సిపాల్ చెప్పడంతో విద్యార్థిని తల్లి రూ.10 వేలు చెల్లించింది. ఈ మొత్తాన్ని యాజమాన్యం బుక్స్, యూనిఫామ్ కింద జమ చేసుకుని, ఫీజు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో గత్యంతరం లేక కలెక్టర్ను కలిసేందుకు మంగళవారం అక్షయ తన తల్లితోపాటు కలెక్టరేట్కు వచ్చి తన గోడును వెల్లబోసుకుంది. కలెక్టర్ వెంటనే స్పందించి ప్రిన్సిపాల్కు ఫోన్ చేశారు. -
ఈ నెలలో మూడు సార్లు వాగు వచ్చింది
నేను కొరటికల్లో ఉంటాను. ఆత్మకూరు(ఎం)లో మీ సేవా నిర్వహిస్తాను. మా గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఆత్మకూరు(ఎం) ఉంటుంది. ఈ నెలలో మూడు సార్లు వాగు వచ్చింది. వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు మీ సేవ కేంద్రాన్ని తెరవలేకపోయాను. తప్పని పరిస్థితుల్లో పక్క గ్రామం నుంచి 13 కిలోమీటర్ల దూరం తిరిగిపోయాను. – నాగుల ఆంజనేయులు, మీసేవా కేంద్రం నిర్వాహకుడు, కొరటికల్ మాది రహీంఖాన్పేట. నేను గీత కార్మికుడిని. కల్లు గీస్తేనే మాకు జీవనాధారం. వాగు అవతల తాటిచెట్లు ఉన్నాయి. కల్లు గీసేందుకు తాటి చెట్లు ఎక్కుదామని వెళ్తే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెనక్కి వచ్చేశా. – ముత్యాల మల్లయ్య, గీత కార్మికుడు, రహీంఖాన్పేట -
రాగి జావ.. మళ్లీ ఇస్తారా?
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. రాగి జావ తయారీకి సంబంధించి రాగి పిండి, బెల్లం సామగ్రి రాలేదు. దీంతో విద్యార్థులకు రాగి జావ అందించడం లేదు. ప్రభుత్వం సరఫరా చేస్తే విద్యార్థులకు అందజేస్తాం. – సత్యనారాయణ, డీఈఓ భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఽవిద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు మరింత పోషకాహారాన్ని అందించేందుకు గతేడాది ప్రభుత్వం రాగి జావ పంపిణీకి శ్రీకారం చుట్టింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పీఎం పోషణ్ కింద రాగి జావ పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరం ముగింపు వరకు విద్యార్థులకు రాగి జావ అందజేశారు. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడస్తున్నా ఇప్పటివరకు ప్రారంభించలేదు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రాగి, పిండి, బెల్లం ప్యాకెట్లు ఇంకా సర్కారు బడులకు సరఫరా కాలేదని తెలుస్తోంది. జిల్లాలో 43,488 మంది విద్యార్థులు జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 715 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 43,488 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన మాదిరిగా ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు రాగి జావ పంపిణీ చేయలేదు. మధ్యాహ్నం భోజనంలో భాగంగా వారంలో గుడ్డు అందించని మిగతా మూడు రోజుల్లో ప్రతి విద్యార్థికి రాగిజావ అందించడంతో విద్యార్థులకు పోషకాహారం లభించడంతో పాటు చురుకుగా ఉంటారని ప్రభుత్వం భావించి గతేడాది పంపిణీకి చర్యలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది రాగి జావ పంపిణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫ ఈ ఏడాది అమలుకు నోచుకోని పంపిణీ ప్రక్రియ ఫ పాఠశాలలకు చేరని రాగి పిండి, బెల్లం ప్యాకెట్లు -
యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులను పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సిఽంధూరంతో అలంకరించిన ఆంజనేయస్వామిని అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఇక ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు జరిపించారు. -
వాగొస్తే దిగ్బంధమే
ఆత్మకూరు(ఎం): జిల్లాలో బిక్కేరు వాగు గుండాల, మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు మండలాల పరిధిలో ప్రవహిస్తుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినా, స్థానికంగా వర్షం కురిసినా వాగుకు వరద ఉధృతి పెరుగుతుంది. ఈ సమయంలో వాగుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గేదాకా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయితే బిక్కేరు వాగు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కువగా ఆత్మకూరు(ఎం) మండల పరిధి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాడ– చందెపల్లి, కొరటికల్– ఆత్మకూరు(ఎం), మొరిపిరాల– ఆత్మకూరు(ఎం), పోతిరెడ్డిపల్లి– రహీంఖాన్పేట గ్రామాల మధ్య లోలేవల్ కాజ్వేలు నిర్మించారు. సుమారు వాటిని నిర్మించి 35 సంవత్సరాలు కావస్తుండటంతో ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారాయి. వాటి ఎత్తు పెంచి నూతన కాజ్వేలను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఇవీ..బిక్కేరు వాగు ప్రవహించినప్పుడల్లా ఎక్కువగా ఉమ్మడి ఆత్మకూరు(ఎం) మండలంలోని చందెపల్లి, చాడ, కొండాపురం, ఆత్మకూరు(ఎం)మండలంలోని మొరిపిరాల, కాల్వపల్లి, సింగారం, చిన్నగూడెం, కొరటికల్, ఇప్పల్ల, పల్లెపహాడ్, పోతిరెడ్డిపల్లి, రహీంఖాన్పేట, మోదుబావిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాగు అవతల, ఇవతల వ్యవసాయ భూములు, మండల కేంద్రంలో వ్యాపారాలు నిర్వహించే వారు ఉండటంతో వారికి తిప్పలు తప్పడం లేదు. మాది పోతిరెడ్డిపల్లి, మా ఊరుకు పక్కనే బిక్కేరు వాగు ఉంటుంది. వాగు పక్కనే వ్యవసాయ భూమి, పౌల్ట్రీ ఫారం ఉంటుంది. అంతా అరకిలో మీటరు దూరంలోనే ఉంటాయి. బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పారుపల్లి మీదుగా సుమారు 18కిలో మీటర్ల దూరం తిరిగి రావాల్సి వచ్చింది. లోలేవల్ కాజ్వే స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తే ఈ సమస్య ఉండదు. – జక్క స్కైలాబ్రెడ్డి, రైతు, పోతిరెడ్డిపల్లి ఫ ఆత్మకూరు మండలంలో లోలెవల్ కాజ్వేలు నిర్మించి 35ఏళ్లు ఫ బిక్కేరు వాగు ఉప్పొంగిన ప్రతిసారి రాకపోకలు బంద్ ఫ కాజ్వేల ఎత్తు పెంచితే తీరనున్న సమస్య -
బీఆర్ఏఓయూలోఅనేక కోర్సులు
రామన్నపేట : దేశంలో ఎక్కడాలేని విధంగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మానాయక్ తెలిపారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను సందర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వివిధ కారణాల వల్ల ఉన్నత విద్యకు దూరమైన వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఓపెన్ యూనివర్సిటీలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఓపెన్ డిగ్రీ పట్టా రెగ్యూలర్ డిగ్రీతో సమానమన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ఖానం, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ చిన్నబాబులు ఆయనను శాలువాతో సన్మానించి పూలమొక్కను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్రావు, కౌన్సిలర్లు అమర్, ప్రశాంత్, నరేష్, ఆంజనేయులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
చౌటుప్పల్ : జీవితాలను చిత్తుచేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ పరిశ్రమలో మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు వంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల విక్రయాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని సూచించారు. విక్రయాలకు సంబందించిన సమాచారం తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలన్నారు. అవగాహన సదస్సు నిర్వహించిన దివీస్ పరిశ్రమ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, ఎకై ్సజ్ సీఐ బాలాజీనాయక్, ఎస్ఐ శంకర్ పాల్గొన్నారు. ఫ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి -
భద్రతా ప్రమాణాలు పాటించాలి
సాక్షి,యాదాద్రి : జిల్లాలోని ప్రమాదకర కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ప్రభుత్వ అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన ఔషధ పరిశ్రమల్లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు ప్రాణనష్టం కలిగించాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీల్లో రియాక్టర్లు, పేలుడు ఉపశమన పానళ్లు, భద్రత వంటివి కచ్చితంగా ఉండాలని సూచించారు. కార్మికులకు నిరంతరం భద్రతా శిక్షణా కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు, పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి
భువనగిరిటౌన్ : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మంగళవారం జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజర్లతో కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం, గర్భిణులు, బాలింతల హాజరుశాతం పెంచే విధంగా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యలక్ష్మీ భోజనం మెనూ ప్రకారం పెట్టాలన్నారు. ఆధార్ అప్డేషన్ లేని లబ్ధిదారుల వివరాలు సేకరించి, ఆధార్ క్యాంపులు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో సీడీపీఓలు, సూపర్వైజర్లు ప్రతి రోజు అంగన్వాడీ సెంటర్ను సందర్శించి టూర్ డైరీలు సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, సీడీపీఓ జ్యోత్స్న, స్వరాజ్యం, శైలజ, సమీరా, యామిని, జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి భువనగిరిటౌన్ : భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో పాడి రైతులు, గొర్రెల మేకల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి జానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలను లోతట్టు ప్రాంతాల్లో మేపేందుకు వెళ్లొద్దని సూచించారు. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి బీబీనగర్: ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బీబీనగర్ మండల స్థాయి టీఎల్ఎమ్(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) కార్యక్రమాన్ని నెమురగొముల పరిధిలోని వీఎల్ఎన్ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచింగ్కు సంబంధించిన మెటిరీయల్ ప్రదర్శనల్లో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్, ఎంఈఓ సురేష్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చంద్రారెడ్డి, దివాకర్యాదవ్, ఉమాదేవి, ఇందిరప్రేమజ్యోతి తదితరులు పాల్గొన్నారు. గంధమల్ల చెరువుకు ప్రభుత్వ విప్ పూజలు తుర్కపల్లి: మండలంలోని గంధమల్ల చెరువుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు చీర, కుంకుమ, పసుపు సమర్పించి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి, అలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, చాడ భాస్కర్ రెడ్డి, ఐలయ్య, రాములు, మోహన్ బాబు, తహసీల్దార్, దేశ్యానాయక్, ఎస్ఐ తక్యూద్దీన్ పాల్గొన్నారు. పత్తిలో గులాబీరంగు పురుగును నివారించాలిసంస్థాన్ నారాయణపురం : పత్తిలో గులాబీరంగు పురుగును నివారించాలని కేవీకే ప్రొగ్రాం కో–ఆర్డ్డినేటర్ అనిల్కుమార్, శాస్త్రవేతలు అఖిలేష్, కల్పిష్ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎల్డీసీ, కేవైఏర్డీ సంయుక్తంగా పత్తి పంటలో పాటించాల్సి సస్యరక్షణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో భువనగిరి ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏఓ వర్షిత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, ఏఈవోలు రవితేజ, బీ.శివకుమార్, నవ్య పాల్గొన్నారు. -
ఎరువు.. ధరల బరువు
సాక్షి, యాదాద్రి : జిల్లాకు కేటాయించిన యూరియా 60శాతం పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవా కేంద్రాలు, 40 శాతం రిటైల్ డీలర్ల ద్వారా రైతులకు అందిస్తున్నారు. అయితే బస్తా యూరియా ఎమ్మార్పీ రూ.266 ఉండగా రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నప్పటికీ సరఫరాలో కొన్ని చోట్ల జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల లింక్లు వద్దన్న వారికి స్టాక్ లేదని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయం జిల్లాలో పీఏసీఎస్, ఎరువుల డీలర్లు ఎమ్మార్పీ రూ.266కే అమ్మినట్లు రశీదు ఇస్తున్నారు. కానీ హమాలీ ఖర్చుల పేరుతో పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవా కేంద్రాలు, డీలర్లు సుమారు రూ. 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు మూడు యూరియా బస్తాలకు ఒక దుబ్బ గుళికలు, లేదా పది కిలోల గుళికల బకెట్ అంటగడుతున్నారు. కొన్ని చోట్ల నానో డీఏపీ డబ్బాలు లింక్ పెట్టగా, మరికొందరు డీలర్లు పురుగు మందులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని లింక్ పెట్టి రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అక్రమ తరలింపుపై నిఘా హోల్సేల్ డీలర్ల నుంచి యూరియా పరిశ్రమలకు తరలిపోతుందన్న సమాచారం పై ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమైంది. వ్యవసాయ శాఖ, పోలీస్, పరిశ్రమ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రధానంగా ప్లాస్టిక్, ఫార్మా, ఎక్స్ప్లోజివ్స్ ఇలా జిల్లాలో ఉన్న 30 వరకు పరిశ్రమల్లో తనిఖీలకు ఆదేశించారు. పంటల వివరాలు (ఎకరాల్లో)జిల్లాలో హోల్సేల్ డీలర్లు మాయాజాలం కొనసాగుతోంది. కంపెనీల సేల్స్ ఆఫీసర్లు తమ లింక్ అమ్మకాలను పెంచుకోవడానికి యూరియాను రిటేల్ డీలర్లకు అడిగినంత ఇవ్వడం లేదు. భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, నేరడుచర్లలో గల హోల్సేల్ డీలర్లకు కంపెనీల నుంచి నేరుగా టన్నుల కొద్ది లారీల యూరియా వస్తోంది. దీంతో హోల్సేల్ డీలర్లు నిర్ణయించిన ధర ఫైనల్ అవుతోంది. ఫ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యూరియా అమ్మకం ఫ లింక్ మందులు వద్దంటే నోస్టాక్ అంటున్న డీలర్లు ఫ యూరియా నిల్వలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సరఫరాలో జాప్యం జిల్లాలో సాగు అంచనా : 4,40,500 ఇప్పటివరకు సాగైన పంటలు : 3,42,659 పంటలు సాగు అంచనా సాగైంది వరి 2,95,000 2,06,523 పత్తి 1,15,000 1,07,710 కంది 6,000 3,037 ఇతర పంటలు : 2,53,000 నేను ఆరు ఎకరాల్లో వరి పొలం సాగు చేశాను. పీఏసీఎస్లో మూడు బస్తాలు మాత్రమే ఇచ్చారు. మిగతా మూడు బస్తాల కోసం మరో మూడు రోజుల తర్వాత రమ్మని అధికారులు చెబుతున్నారు. వర్షం పడడంతో యూరియా అవసరం ఏర్పడింది. అందుబాటులో లేకపోవడంతో తిరగాల్సి వస్తోంది. – ఎడవల్లి కనకయ్య, తుర్కపల్లి, రైతు యూరియా అవసరం : 21,000 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చిన యూరియా : 17,202 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు వాడింది : 14,808 మెట్రిక్టన్నులు అందుబాటులో ఉన్నది : 2,514 మెట్రిక్ టన్నులు -
కేబుల్ వైర్లు కట్ చేయాల్సిందే
కోదాడ: విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేస్తున్న కేబుల్ వైర్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రభుత్వం, విద్యుత్శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. కేబుల్ వైర్లను విద్యుత్ స్తంభాలకు క్రమపద్ధతిలో అమర్చుకోవాలని విద్యుత్శాఖ చెబుతున్నా ఇప్పటివరకు పెడచెవిన పెట్టిన కేబుల్ ఆపరేటర్లకు ఆ శాఖ షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని రామాంతపూర్లో రెండు రోజుల క్రితం కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు చనిపోవడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో స్తంభాలకు వేలాడదీసిన కేబుల్ వైర్లను ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక సిబ్బంది రెండు మూడు రోజుల్లో కత్తిరించి వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అవగాహన లోపంతోనే తిప్పలు మున్సిపాలిటీల్లో కేబుల్ కనెక్షన్లతో పాటు ఇంటర్నెట్ కేబుల్స్ను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తుంటారు. పదుల సంఖ్యలో ఉన్న ఆపరేటర్లు ఇష్టారీతిన వీటిని స్తంభాలకు వేలాడదీస్తుండడంతో సమస్య వచ్చినపుడు స్తంభం ఎక్కడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నా ఆపరేటర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు తక్కువ ఎత్తులో తీగలను వేలాడదీస్తుండడంతో భారీ వాహనాలకు తగిలి తరచూ ఇవి తెగిపడడం, కిందకు జారడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కట్టలుగా కేబుల్ వైర్లను స్తంభాలకు కడుతుండడంతో షార్ట్ సర్క్యూట్స్ సర్వసాధారణంగా మారాయి. కట్ చేస్తే ఇబ్బందే.. విద్యుత్శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కేబుల్ వైర్లను కట్ చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు అంటున్నారు. సాధారణ టీవీ కేబుల్స్తో పాటు ఇంటర్నెట్ కేబుల్స్ కూడా విద్యుత్ స్తంభాలకు ఉన్నాయి. వీటిని కట్ చేస్తే పలువురికి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా పోతుంది. వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేసే ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్ధులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్శాఖ అధికారులు ముందస్తుగా ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఫ విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లు తొలగించాలని ప్రభుత్వం ఆదేశం ఫ క్రమపద్ధతిలో అమర్చుకోవడంలో ఆపరేటర్లు విఫలం -
తాళం వేసిన ఇంట్లో చోరీ
కొండమల్లేపల్లి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం కొర్రతండాలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రతండాకు చెందిన కొర్ర పట్టి గ్రామంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆమె భర్త ధన్య గతంలోనే మృతిచెందాడు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే జహిందర్ ఇంట్లో పట్టి అద్దెకు ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి తాళం వేసి కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లోకి వెళ్లి నిద్రించింది. మంగళవారం ఉదయం అద్దె ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని కేజీ వెండి, రూ.1.50లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.35కోట్లుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, కానుకలను మంగళవారం కొండకు దిగువన ఉన్న శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది లెక్కించారు. మొత్తం రూ.2,35, 32,627 నగదు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. మిశ్రమ బంగారం 76 గ్రాములు, మిశ్రమ వెండి 9కిలోల 475గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ దేశాల కరెన్సీలు సైతం హుండీల్లో వచ్చాయని ఈఓ తెలిపారు. హుండీ ఆదాయం 27 రోజులదని వెల్లడించారు. -
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీల్లో మూడో స్థానం
నల్లగొండ: నల్లగొండలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న పి .కీర్తన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీల్లో సత్తాచాటింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బేస్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 3వ స్థానం సాధించింది. కీర్తనను మంగళవారం ప్రిన్సిపాల్ కుతేజుల్ కుబ్ర, అధ్యాపకులు అభినందించారు. శ్వాస మీద ధ్యాసతోనే సంపూర్ణ ఆరోగ్యం సూర్యాపేట: శ్వాస మీద ధ్యాసతోనే ఆరోగ్యంగా ఉంటామని సంత్సదానంద గిరి మహారాజ్ స్వామీజీ అన్నారు. మంగళవారం గుంటూరు నుంచి వరంగల్ వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల పిరమిడ్ ట్రస్ట్ ధ్యాన మందిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తూ ఆరోగ్యముక్తిని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షురాలు తోట నాగమణి, ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా విశ్వనాథం, ఉపాధ్యక్షులు కోటగిరి రాధాకృష్ణ, కక్కిరేణి రవిచంద్ర, హరిప్రసాద్, దయాసాగర్, శ్రీనివాస్, విజయ్, సువర్ణ, కేదారేశ్వరి, సంధ్య, మహేందర్రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు. అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య భువనగిరి: అప్పుల బాధతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి మాధవి(35), నర్సింహ భార్యాభర్తలు. అప్పులు ఎక్కువ కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం అప్పుల విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మాధవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సమయం తర్వాత ఇంట్లోకి వచ్చిన వారి కుమారుడు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికులు వచ్చి చూడగా.. అప్పటికే మాధవి మృతిచెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. మృతిరాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వాహనం ఢీకొని రెండు ఆవులు మృతిత్రిపురారం: వాహనం ఢీకొని రెండు ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన త్రిపురారం మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి నుంచి కొబ్బరికాయల లోడుతో జడ్చర్లకు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం త్రిపురారం మండల కేంద్రంలో రెండు ఆవులకు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని బాధిత రైతు వలసాని సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కోదాడరూరల్: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ శివారులో గల మిడ్వెస్ట్ గ్రానైట్ క్వారీ కంపెనీ చేపట్టనున్న 9.87 హెక్టార్ల పనుల విస్తరణపై అదనపు కలెక్టర్ రాంబాబు సమక్షంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్వారీ సమీపంలోని నల్లబండగూడెం, మంగళితండా, చిమిర్యాల గ్రామాల ప్రజలు, నాయకులు మాట్లాడుతూ.. క్వారీ విస్తరించుకుంటే తమకు అభ్యంతరం లేదని.. కానీ స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా క్వారీ నుంచి నల్లబండగూడెం వెళ్తున్న రోడ్డు ధ్వంసమైందని.. ఈ మార్గంలో వాగుపై ఉన్న బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలన్నారు. మూడు గ్రామాలల్లో నెలకోసారి హెల్త్ క్యాంపులు నిర్వహిచి దీర్ఘకాలిక వ్యాధులున్న ప్రజలకు మందులు అందజేయాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి, చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేయాలన్నారు. పలు ఎన్జీఓలు, పర్యావరణ, సామాజిక ఉద్యమకారులు మాట్లాడుతూ.. క్వారీ నుంచి దుమ్ముధూళి రాకుండా చూడాలని సూచించారు. క్వారీ చుట్టూ ఉన్న రైతుల పొలాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణం కాలుష్యం జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. కంపెనీ సీఓఓ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. క్వారీలో 80శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తున్నామని, విద్యార్హతను బట్టి టెక్నీషియన్స్, ఎలక్ట్రానిక్స్, ఆపరేటర్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. ఇప్పటికే క్వారీ చుట్టూ ఉన్న మూడు గ్రామాల కోసం ఓ అంబులెన్స్ ఏర్పాటును చేశామని, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలలో మందులు ఇస్తున్నామని, పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు కూడా నాటుతామని సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురి వద్ద నుంచి లిఖితపూర్వకంగా, 40మంది నుంచి తీసుకున్న అభిప్రాయాలను రాష్ట్ర పర్యావరణ ఉన్నతాధికారులకు పంపిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. ఎలాంటి అవాఛంనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ వెంకన్న, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్అలీ, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ మిడ్వెస్ట్ గ్రానైట్ క్వారీ పనుల విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ -
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఫ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రపుల్ రాంరెడ్డిసూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి లింగయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రహ్మాండ్లపల్లి కల్యాణ మండపంలో మంగళవారం టీయూ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కోడి సైదులుయాదవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసులకు, పోలీసు తూటాలకు భయపడకుండా పాల్గొన్నామని గుర్తు చేశారు. ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, నాలుగు గదుల ఇళ్ల నిర్మాణం, రూ.30వేల పెన్షన్ సౌకర్యం కల్పించి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యమకారులకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్య, వైద్యం, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రన్న ప్రసాద్, క్రిస్టోఫర్, బి. లావణ్య, వైస్ ప్రెసిడెంట్లు అంజలికుమారి, హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ తుల్జారెడ్డి, సలహాదారులు శంకర్రావు, తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లారా, కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూసుఫ్, రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కపాక కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జటంగి సౌనయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడబోయిన గంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిగుజ్జు రామచంద్రయ్య, టీయూ జేఏసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గోనే విజయ, కమ్మంపాటి లక్ష్మమ్మ, తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక జిల్లా అధ్యక్షురాలు తండు దేవిక, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల ఉమా, పట్టణ అధ్యక్షురాలు బంటు ఎల్లమ్మ, ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలి
రామన్నపేట: విద్యార్థులు ఎన్సీసీలో చేరి దేశభక్తితో పాటు సత్ప్రవర్తన, సేవాభావం పెంపొందించుకోవాలని 31(టీ) బెటాలియన్ కల్నల్ టి. లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్సీసీలో ప్రవేశం కొరకు దేహధారుడ్య, రాత పరీక్ష నిర్వహించారు. ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు ఉన్నత చదువులు, ఆర్మీ, పోలీసు ఉద్యోగాలు పొందడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ఖానం, ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ రాచమల్ల శ్రీను, బెటాలియన్ సుబేదార్ మేజర్ మాధవరావు, సుబేదార్ కొమ్ము మల్లయ్య, హవల్దార్లు సురేష్, అజయ్కుమార్ పాల్గొన్నారు. -
బుద్ధవనం సందర్శించిన ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో 10 ఎకరాల్లో బుద్ధవనం తరహాలో థీమ్ పార్కు నిర్మించునున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలేంద్రసింగ్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బుద్ధవనం సందర్శించారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర స్వాగతం పలికారు. యమునా నది తీరంలో ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి ప్రాంతంలో జ్ఞానసిద్ధికై సిద్దార్ధుడు మూడేళ్ల పాటు తపస్సు చేశాడని.. అంతటి ప్రసిద్ధమైన ప్రదేశంలో రూ.80కోట్ల వ్యయంతో బుద్ధిష్ట్ థీమ్ పార్కు నిర్మించనున్నట్లు శైలేంద్రసింగ్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు దీనిని పూర్తిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వెంట ఆర్కిటెక్ట్ రాహుల్, ఇంజనీర్ కళ్యాణ్చంద్ర, స్తపతి గిరీష్తివారి ఉన్నారు. వీరికి గైడ్ సత్యనారాయణ బుద్ధవనం గురించి వివరించారు. -
డ్రమ్ సీడర్ పద్ధతితో ఉపాధి
నడిగూడెం: వ్యవసాయంలో కూలీలు కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పెట్టుబడులు కూడా బాగా పెరిగాయి. పంటల సాగులో కొత్త పద్ధతులు వస్తుండడంతో రైతులకు ఉపయోగకరంగా మారాయి. పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు ఒక బృందంగా ఏర్పడి జిల్లాలోని పలు గ్రామాల్లో తిరుగుతూ డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రోజుకు 7 నుంచి 8 ఎకరాల్లో.. చీదెళ్ల గ్రామానికి చెందిన తండు ప్రవీణ్, వేర్పుల వీరబాబు, వేల్పుల మధు, వరికల్లు శ్రీను ఒక బృందంగా ఏర్పడి స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నాలుగు డ్రమ్ సీడర్లు కొనుగోలు చేశారు. వీరు గత ఐదేళ్ల నుంచి సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధఙలోని గ్రామాల్లో డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా రైతుల భూముల్లో నేరుగా వరి విత్తనాలు విత్తుతున్నారు. దీనికి గాను ఎకరానికి రూ.1000 చొప్పున రోజుకు నాలుగు డ్రమ్ సీడర్లతో 7 నుంచి 8 ఎకరాల్లో వరి విత్తనాలు విత్తుతున్నారు. దీంతో ఆ నలుగురు కలిసి ఒక్కొక్కరు రోజుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో నాలుగు నెలల వరకు పని ఉంటుందని వారు చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 8 ఎకరాల్లో డ్రమ్ సీడర్ల ద్వారా వరి విత్తనాలు వేస్తున్నాం. రోజుకు మాకు రూ.1500 నుంచి రూ.2000 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. – వేర్పుల వీరబాబు, చీదెళ్ల ఐదేళ్ల క్రితం స్నేహితులతో కలిసి నాలుగు డ్రమ్సీడర్లు కొనుగోలు చేశాం. మా మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాలు వేశాక, రైతుల ద్వారా పక్క మండలాల్లో కూడా విత్తనాలు వేస్తున్నాం. ఒక ఎకరంలో విత్తనాలు వేస్తే ఎకరానికి రూ.1000 చెల్లిస్తున్నారు. దీంతో గత ఐదు సంవత్సరాలుగా ఉపాధి పొందుతున్నాం. – తండు ప్రవీణ్, చీదెళ్ల ఫ ఆదర్శంగా నిలుస్తున్న చీదెళ్ల గ్రామ యువకులు -
సాగర్కు పోటెత్తిన వరద.. ఆగిన లాంచీలు
నాగార్జునసాగర్: ఎగువన గల శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే వరద భారీస్థాయిలో పెరగడంతో పాటు గాలి వీస్తుండటంతో మంగళవారం నాగార్జునకొండకు లాంచీలు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయం నుంచి 10గేట్లు ద్వారా 3,44,750 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 65436 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు గాలి వీస్తోంది. దీంతో సాగర్ జలాశయంలో అలజడి మొదలై అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆంధ్రా పరిధిలోని రైట్బ్యాంక్ నుంచి నాగార్జుకొండ మ్యూజియంలో పనిచేసే ఉద్యోగులను నిత్యం లాంచీలలో తీసుకొస్తుంటారు. అయితే గాలి వీస్తుందని అక్కడి లాంచీలు సరైన ఫిట్నెస్ లేకపోవడంతో నడపలేదు. మ్యూజియం తెరవకపోవడంతో తెలంగాణ నుంచి కూడా లాంచీలను నాగార్జునకొండకు నడపలేదని సిబ్బంది తెలిపారు. జాలీ ట్రిప్పులు వేసేందుకు కొంతమేరకు అవకాశమున్నప్పటికీ పర్యాటకులు లేకపోవడంతో లాంచీలను నడపలేదని సమాచారం. -
ఎవరే నీకు అత్త.. కొడుకుని చితక్కొట్టిన తల్లిదండ్రులు
భువనగిరిటౌన్ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కుమార్తెల పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కూతుర్ల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్గా మారింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరి రిమాండ్
భూదాన్పోచంపల్లి: సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరిని సోమవారం పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఎస్. లింగోటం గ్రామానికి చెందిన కందగట్ల కిరణ్, చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన పస్తం మల్లికార్జున్ స్నేహితులు. వారిద్దరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. భూదాన్పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలోని హెజిలో కంపెనీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు పనిచేస్తూ గ్రామ శివారులో అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 15న రాత్రి తలుపులు పెట్టుకోకుండా నిద్రించడాన్ని గమనించిన కిరణ్, మల్లికార్జున్ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి 6 సెల్ఫోన్లు అపహరించి పరారయ్యారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం అంతమ్మగూడెం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నంబర్ప్లేట్ లేని స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తున్న కిరణ్, మల్లికార్జున్ పట్టుకొని విచారించారు. వారు సెల్ఫోన్లు చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్కూటీని సీజ్ చేశారు. అనంతరం చౌటుప్పల్ కోర్టులో రిమాండ్ చేయగా, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. కిరణ్, మల్లికార్జున్పై గతంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో 20కి పైగా చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల చౌటుప్పల్లో ఓ వాహనాన్ని కూడా దొంగిలించారని ఎస్ఐ తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్భువనగిరిటౌన్ : రైలులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సోమవారం భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బృందం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన సర్వేష్ అనేమియా సర్కార్ భువనగిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బృందం సుమారు రెండు గంటల పాటు అతడిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాధాకృష్ణ తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. -
భార్యను హత్య చేసిన భర్త
రాజాపేట: కుటుంబ కలహాలతో భార్య గొంతు నులిమి భర్త హత్య చేశాడు. ఈ ఘటన రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలో జరిగింది. సోమవారం ఎస్ఐ అనిల్కుమార్ తెలిపన వివరాల ప్రకారం.. పుట్టగూడెం గ్రామానికి చెందిన ముడావత్ అమృకు అదే గ్రామానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. వీరు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు గ్రామస్తుల మధ్య పంచాయితీ పెట్టి మాట్లాడుకున్నారు. కాగా ఆదివారం రాత్రి సుజాత(35) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామస్తులు గమనించి సుజాత తల్లి పింప్లికి సమాచారం ఇచ్చారు. సుజాత తల్లి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకర్గౌడ్ క్లూస్టీంను పిలిపించి వివరాలు సేకరించారు. భర్త అమృనే సుజాత గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలకు..
భూదాన్పోచంపల్లి: నిరంతర సాధనతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. 75శాతం మంది విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వందశాతం ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో సామాజిక దృక్పథం, మనో వికాసం, సేవా కార్యక్రమాలు, టీమ్ స్పిరిట్ పెంచడానికి తరచూ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారిణి, యూనివర్సిటీ అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టనష్టాలు, ఒడిదొడుకులు అన్నింటిని ఎదుర్కొన్నప్పుడే వారు మానసిక పరిపూర్ణత సాధిస్తారని అన్నారు. అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వీఎంవీ రావు మాట్లాడుతూ.. పట్టుదలను పెట్టుబడిగా పెడితే లక్ష్యసాధన సులభతరం అవుతుందని అన్నారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉపాధి రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య -
గాజాపై దాడులు విరమించుకోవాలి
రామగిరి(నల్లగొండ): పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను విరమించుకోవాలని ముస్లిం సంఘాల నేతలు కోరారు. గాజాపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ ముస్లిం మతపెద్దలు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్, మౌలానా యాసర్ హుస్సేన్, మౌలానా ముఫ్తీ సిద్దీఖ్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి క్లాక్టవర్ సెంటర్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. సేవ్ గాజా అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా క్లాక్టవర్ సెంటర్లో పలువురు మాట్లాడుతూ.. గాజా ప్రజలపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. యుద్ధం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్ఖాన్, అహ్మద్ కలీం, సామాజిక కార్యకర్త పి. దేవి, నాగార్జున, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన ముస్లింలు -
సైన్స్ కాంగ్రెస్కు ఎంజీయూ విద్యార్థుల ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనిర్సిటీలో పీజీ(బోటనీ) చదువుతున్న విద్యార్థులు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్–2025లో ‘ఎవల్యూషన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ పొటెన్షియల్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ రైసోమ్ ఎక్స్ట్రాక్ట్’ అనే అంశంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నట్లు అధ్యాపకురాలు శ్రావ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టు లో భాగంగా ఎన్నుకున్న పరిశోధన పత్రాన్ని సైన్స్ కాంగ్రెస్లో సమర్పణకు ఎంపిక కావడం గర్వకారణమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పరిశోధనలో భాగస్వాములైన విద్యార్థులు సాంబశివరావు, మౌనిక, గీత, నవనీత, త్రివేణి, స్వప్న, రవళికను అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాల్ కె. ప్రేమ్సాగర్ అభినందించారు. గ్రానైట్ తరలిస్తున్న లారీల పట్టివేత నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న 18 లారీలను నాగార్జునసాగర్లో సోమవారం తెల్లవారుజామున స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీల్లో కొన్నింటిని హిల్కాలనీలోని బుద్ధవనం ముందు గల సిద్దార్ధ హోటల్ వద్ద, మరికొన్నింటిని మరో చోట ఉంచారు. నల్లగొండ జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు పోలీసులు సమాచారమివ్వడంతో వారు సాయంత్రానికి సాగర్ చేరుకుని, లారీల డ్రైవర్ల వద్ద గల అనుమతి పత్రాలను చూసి విచారణ చేపట్టారు. ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారి జాకోబ్ను వివరణ కోరగా.. తమ కార్యాలయ సిబ్బందిని నాగార్జునసాగర్కు పంపించామని, వారు విచారణ చేస్తున్నారని తెలిపారు. మంగళవారం ఉదయానికి వాటి లెక్కలు తేలుతాయని వివరించారు. వ్యక్తి అదృశ్యం నేరేడుచర్ల: నేరేడుచర్ల పట్టణానికి చెందిన సట్టు శ్రీను ఈ నెల 11న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు సోమవారం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. శ్రీనుకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు శ్రీను తెల్ల రంగా చొక్కా, నీలి రంగు లుంగి ధరించాడని, ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీను ఆచూకీ తెలిసినవారు 87126 86054, 87126 86012 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి యాదగిరిగుట్ట రూరల్: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకందుకూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు నల్లమాస శంకరయ్య(58) రోజుమాదిరిగానే సోమవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు జారడంతో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరారు. -
మానవత్వం చాటుకున్న పోలీసులు
ఆలేరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు ఆలేరు పోలీసులు. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఇక్కుర్తి గ్రామానికి చెందిన వంగాల మధుసూదన్రెడ్డి ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తూ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బహదూర్పేటలో ఎమ్మెల్యే కార్యక్రమానికి బందోబస్తులో పాల్గొని తిరిగి ఆలేరు పోలీస్ స్టేషన్కు వస్తున్న కానిస్టేబుళ్లు సైదులు, ప్రసాద్, నవీన్, అశోక్ రోడ్డు పక్కన గాయాలతో ఉన్న మధుసూదన్రెడ్డిని చూశారు. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనానికి ఫోన్ చేసి, ఆస్పత్రికి సకాలంలో తరలించారు. క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స సకాలంలో ఆస్పత్రికి తరలింపు -
బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైరు చోరీ చేస్తున్న ఇద్దరి అరెస్ట్
సూర్యాపేటటౌన్: బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల వద్ద ఫ్రీక్వెన్సీ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. జూన్లో నడిగూడెం, మునగాల పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లకు సంబంధించి ఫ్రీక్వెన్సీ కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం మునగాల పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఆకుపాముల గ్రామం వెళ్లగా.. అక్కడ బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కారులో ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం రాజాపూరం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనాథ్, బుడుపుల వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన ఇద్దరు నిందితులతో పాటు కోదాడ పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన చలిగంటి శ్రావణ్కుమార్ కలిసి సుమారు నాలుగు నెలల కాలంలో తొమ్మిది బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లలో కట్టర్, హ్యాక్సా బ్లేడ్ ఉపయోగించి కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. దొంగతనం చేసిన కేబుల్ వైర్లను కాల్చి దాని నుంచి కాపర్ వైరును తీసి బస్తాల్లో వేసుకుని హైదరాబాద్కు తీసుకెళ్లి జీడిమెట్ల, పటాన్చెరు ఏరియాల్లో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుని జల్సాలు చేసేవారని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.2.75లక్షల నగదు, 270 మీటర్ల కేబుల్ వైరు, కారు, కట్టర్, హ్యాక్సా బ్లేడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రావణ్కుమార్కు గతంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లలో పనిచేసిన అనుభవం ఉందని, అతడిపై 4 దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. శ్రీనాథ్, వంశీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. శ్రావణ్కుమార్ పరా రీలో ఉన్నాడు. ఈ విలేకరుల సమావేశంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రూ.2.75 లక్షల నగదు, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
శ్రమించే విద్యార్థులకే ఉపాధి అవకాశాలు
నల్లగొండ టూటౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శ్రమించే విద్యార్థులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ కోర్సుల విధి విధానాలు, ప్లేస్మెంట్ సెల్, స్కిల్ డెవలప్మెంట్ సెల్, ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్ట్, స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు 75 శాతం హాజరు పాటిస్తూ విశ్వవిద్యాలయం అందించే కరిక్యులం, నైపుణ్యాల పెంపునకు ఏర్పాటు చేసిన సదుపాయాలు ఉపయోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని లక్ష్యసాధనకు వినియోగించి వ్యసనాల బారిన పడకుండా యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, అధ్యాపకులు రేఖ, ఎం. జయంతి, టి. మౌనిక, అవినాష్, హరీష్ కుమార్, విజయ్కుమార్, రామచంద్రుడు, డైరెక్టర్లు వై. ప్రశాంతి, శ్రీదేవి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
నాకు పదవి లేకున్నా.. ఉన్నట్లే
పెద్దవూర: తనకు పదవి లేకున్నా.. ఉన్నట్లేనని, వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తన కుమారులతో కలిసి అభివృద్ధిలో భాగస్వాముడిని అవుతానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దవూర మండలం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో మాజీ సర్పంచ్ దాచిరెడ్డి మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి(దాచిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి) సోదరులు రూ.12లక్షల సొంత ఖర్చులతో నిర్మించిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లను సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మాధవరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని, ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడవద్దని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధచూపుతూ నాకంటే ఎక్కువ మన్ననలు పొందాలని ఎమ్మెల్యే జైవీర్రెడ్డికి సూచించారు. వారంలో రెండు రోజులు మద్యం తాగడం బంద్ చేసి ఆ డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని తనతో పాటు డీవీఎన్రెడ్డి కూడా కొంత సహాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, ధర్మారెడ్డి, బోయ నరేందర్రెడ్డి, వెంకటయ్య, రామలింగయ్య, నాగరాజు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి -
ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకు కృషి
హుజూర్నగర్: ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్నగర్లో రూ.7.99 కోట్లతో నిర్మించనున్న నీటిపారుదల శాఖ సమీకృత డివిజన్ కార్యాలయం–3 భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అతి తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి ఎక్కువ ఆయకట్టుకి సాగు నీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖలో సంస్కరణలు తెచ్చామని, ఇందులో భాగంగా 1,100మంది ఏఈలు, 1,800 మంది లష్కర్లను నియమించినట్లు చెప్పారు. నీటిపారుదల డివిజన్ పునర్వ్యవ స్థీకరణ సమయంలో డివిజన్ నంబర్– 3 పరిధిలో ఉన్న ఇరిగేషన్ సబ్ డివిజన్ నంబర్ 2, 3, 4 కార్యాలయాలు కలిపి హుజూర్నగర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని 2,29,961 ఎకరాలు, హుజూర్నగర్ నియోజకవర్గంలోని 1,50,181 ఎకరాల ఆయకట్టుతో కూడిన నాగార్జునసాగర్ గ్రావిటీ కాలువలు, ఎత్తిపోతల పథకాల నీటిపారుదల సౌకర్యాలను ఈ కార్యాలయం చూసుకుంటుందని తెలిపారు. ఆరు నెలల్లో ఈ కార్యాలయం నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణ్రావు, ఈఈలు రామకిషోర్, సత్యనారాయణ, తహసీల్దార్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, అధికారులతో కలిపి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సాధ్యం కానివి ఉంటే వెంటనే దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివిధ సమస్యలపై 36 అర్జీలు రాగా అందులో 23 వినతులు రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి ఉన్నట్లు వెల్లడించారు. ● చీమలకొండూరు పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామానికి చెందిన నల్లమాస బాలరాజు కోరారు. ● చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో మసీదు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లింలు విన్నవించారు. ● బీబీనగర్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ● సమగ్ర సర్వేలో పాల్గొన్న డేట ఎంట్రీ ఆపరేటర్ల రెమ్యునరేషన్ ఇప్పించాలని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ప్రతినిధులు కోట నగేష్, విజయ్కుమార్ కలెక్టర్కు విన్నవించారు. డేటా ఎంట్రీ ముగిసి 8 నెలలు కావస్తుందన్నారు. కాగా వారంలోగా ఆపరేటర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
వానజోరు.. వరద హోరు
జిల్లాను ముంచెత్తిన వర్షం.. గుండాలలో 16 సెం.మీ వర్షపాతం నమోదు జిల్లాలోనే అతి పెద్దదైన గంధమల్ల చెరువు మత్తడి దుంకుతోంది. యాసంగి సీజన్కు సాగునీటికి స మస్య ఉండదని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువన ఉన్న జగ్దేవ్పూర్లో కురిసిన భారీ వర్షానికి ధర్మారం మీదుగా గంధమల్ల చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. 0.5 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం గల ఈ చెరువు అలుగుపోస్తుండడంతో రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు వాగు పారుతోంది. మొన్నటి వరకు చుక్క నీరు లేని శామీర్పేట వాగు పరవళ్లు తొక్కుతోంది. ఈ వాగునుంచి భువనగిరి, బీబీనగర్ పెద్ద చెరువుల్లోకి నీరు చేరే కత్వ వద్ద షెట్టర్ల గేట్లు ఎత్తారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి గంగమ్మకు పూజలు చేసిన కత్వ షెట్టర్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉద్దెమర్రి, మూడుచింతలపల్లి గ్రామాల నుంచి వస్తున్న వరద ఉధృతితో బొమ్మలరామారం మండలం తిమ్మప్ప చెరువు, ప్యారారం, సోలిపేట చెరువులు అలుగుపోస్తున్నాయి. కంచల్తండాకు వెళ్లే లింకు రోడ్డు తెగిపోయింది.బండకాడిపెల్లి చెక్డ్యాం వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. భువనగిరి, బీబీనగర్ మండలాల్లో చిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.లో లెవల్ కాజ్వేల వద్ద రాకపోకలు నిలిపివేశారు. ఫ పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఫ పలుచోట్ల కోతకు గురైన రోడ్లు, చెరువులు, కుంటలకు గండ్లు ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం ఫ లో లెవల్ వంతెనల పైనుంచి వరద నీరు.. రాకపోకలకు ఇక్కట్లు ఫ వెల్వర్తి వద్ద యువకుడు గల్లంతు ఫ అప్రమత్తమైన యంత్రాంగం సాక్షి, యాదాద్రి : వారం రోజులుగా కురుస్తున్న ముసురు వానలకు తోడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. మొన్నటి వరకు చుక్కనీరు లేని శామీర్పేట, చిన్నేరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. బిక్కేరుకు వరద పోటెత్తింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐదు మండలాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 80 మి.మీ కాగా.. 18వ తేదీ నాటికి 326 మీ.మీ వర్షపాతం నమోదైంది.అదనంగా 246 మీ.మీ వర్షం కురిసింది. ఐదు మండలాల్లో ఈ సీజన్లోనే అధికం ● వర్షానికి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బృందావన్ కాలువ వరదతో మోత్కూరు పెద్ద చెరువు నిండి అలుగుపోస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నార్కట్పల్లి రోడ్డులో ఉన్న ఓ భవనం అండర్గ్రౌండ్లోకి మోకాలు లోతు నీరు చేరింది. ఇందిరానగర్లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారీగా వరద నీరు చేరడంతో సెలవు ప్రకటించారు. ● గుండాల మండలంలో 16 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో అతిపెద్ద వర్షం కావడంతో మండలంలో చెరవులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. మండల పరిధిలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుర్కలషాపురం, గుండాల, రామారం,గంగాపురం, మాసాన్పల్లి ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. గుండాల కొత్తకుంటకు గండి పడింది. ● అడ్డగూడూరు మండలం కోటమర్తి, ధర్మారం చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. నక్కలవాగు లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కోటమర్తి శివారులో బిక్కేరు వాగు ఉధృతంగా పారుతోంది. ● ఆత్మకూర్ (ఎం) మండలంలోని రాపాక, ఆత్మకూర్, కప్రాయపల్లి, రహీంఖాన్పేట, రాయిపల్లి చెరువుల్లోకి నీరు భారీగా చేరుతోంది. చాడ నుంచి మోదుగుబాయిగూడెం వరకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవల్ కాజ్వేల పైనుంచి నీరు పారుతోంది. ● యాదగిరిగుట్ట మండలం చొల్లేరు –మర్రిగూడెం మధ్యన గల వాగుపై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. చొ ల్లేరు గ్రామ ప్రజలు లోలెవల్ వంతెన దాటలేక ఏ డు కిలో మీటర్లు చుట్టూతిరిగి ప్రయాణిస్తున్నారు. అలుగుపోస్తున్న 119 చెరువులు జిల్లాలో 1,155 చెరువులు ఉన్నాయి. సోమవారం సాయంత్రానికి 119 చెరువులు అలుగులు పోస్తున్నాయి. 153 చెరువులు అలుగు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. 179 చెరువులు 75 శాతం, 234 చెరువులు 50 శాతం, 470 చెరువులు 25 శాతం వరకు నిండాయి. ఇందులో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు 159 ఉండగా అందులో అలుగులు పోస్తున్నచెరువులు 40 వరకు ఉన్నాయి. గుండాల 160.8ఆత్మకూర్ 14.0 తుర్కపల్లి 121.4అడ్డగూడూరు 120.4మోత్కూరు 118.6బి.రామారం 116.4యాదగిరిగుట్ట 91.2భువనగిరి 87.8బీబీనగర్ 60.8ఆలేరు 33.2వలిగొండ 74.6రామన్నపేట 29.2నారాయణపురం 20.8పోచంపల్లి 24.8చౌటుప్పల్ 30.6రాజాపేట 42.0మోటకొండూరు 60.8సగటున 78.4యువకుడు గల్లంతు మోత్కూరు: వలిగొండ మండలం వెల్వర్తి శివారులో చెరువు అలుగు వరద నీటిలో ఓ యవకుడు గల్లంతయ్యాడు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీర్ సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. చెరువు అలుగునీటిలో చేపలు పడుతున్న సమయంలో వరద ఉధృతి పెరిగడంతో నవీన్ గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. వలిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు (మి.మీ)జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 78.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా గుండాల మండలంలో 16 సెం.మీ, మోత్కూరు 118.6 సెం.మీ, అడ్డగూడూరులో 120.4 సెం.మీ, బొమ్మలరా మారంలో 116.4 సెం.మీ, తుర్కపల్లిలో 121.4 సెం.మీ రికార్డు స్థాయి వర్షం కురిసింది. అత్యల్పంగా సంస్థాన్నారాయణపురం మండలంలో 20.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తంగా జూలై 1నుంచి ఆగస్టు నెల వరకు సాధారణ వర్షపాతం 312.2 మి.మీ కాగా.. 18వ తేదీ నాటికి 553.1 మి.మీ వర్షం కురిసింది. సాధారణం కంటే 240.9 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది. -
భద్రత లేదు.. భరోసా కరువు!
ఆలేరు: జనవరిలో ఆలేరులోని బీసీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి తాళం పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.20వేల నగదు తస్కరించారు. ● ఫిబ్రవరిలో శారాజీపేటలో ఇంటి తాళం పగులకొట్టి మూడు తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. ● ఏప్రిల్ 25న ఆలేరులోని నగల షాపులో చోరీ జరిగింది. కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారు వస్తువులు అపహరించుకెళ్లారు. మహారాష్ట్రంలోని పూణేకు చెందిన దొంగల ముఠా బైక్లపై వచ్చి చోరీకి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నాలుగు నెలలు కావొస్తున్నా కేసు పురోగతి లేదు. ● జూన్లో ఆలేరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి 7.5 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదు గుర్తు తెలియని ఎత్తుకెళ్లారు. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చోరీల నియంత్రణ, వివిధ కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని, దీంతో సొమ్ము రికవరీలో జాప్యం ఏర్పడి బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదన్న విమర్శలున్నాయి. దర్యాప్తులో జాప్యం ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి కేసులు నమోదు చేస్తున్నా.. దర్యాప్తులో జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో రాచకొండ పోలీసులకు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా ఆలేరు పరిధిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యంతో సొమ్ము రికవరీ కాక బాధితులు నష్టపోతున్నారు. గస్తీకి సుస్తీ..? ఆలేరు పట్టణం మీదుగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి, రైలుమార్గం ఉంది. ఆలేరులో పలు రైళ్లకు హాల్టింగ్ ఉంది. రాత్రి వేళ గస్తీ సక్రమంగా లేకపోవడం వల్ల చోరీలకు పాల్పడిన దుండగులు బైపాస్ నుంచి, రైళ్ల ద్వారా సులువుగా పారిపోతున్నట్టు వాదనలున్నాయి. అదే విధంగా ఠాణాకు సమీపంలోనే పలు కేసుల్లో సెటిల్మెంట్ వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. దొంగతనాలు 17 సైబర్ నేరాలు 05చీటింగ్ కేసులు 02హత్యాయత్నాలు 02ఘర్షణలు 15భూవివాదాలు 06రియల్ ఎస్టేట్ 08మిస్సింగ్ 14గుట్కా 03బెల్టుషాపులు 12ఆత్మహత్య 06హత్యలు 01కల్తీ ఆహారం 03జనవరి నుంచి ఆగస్టు వరకు నమోదైన కేసులు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సైతం వదలడం లేదు. వ్యవసాయ బోరు మోటార్లు, పంపు సెట్లకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్కో శాఖ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, లక్షల రూపాయలు విలువ చేసే రాగి తీగ ఎత్తుకెళ్తున్నారు. ఆలేరు విద్యుత్ డివిజన్ పరిధిలో గొలనుకొండ, ఆలేరు, కొలనుపాక, మందన్పల్లి, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట, మోటకొండూర్, రాజాపేట గ్రామాల పరిధిలో పొలాల వద్ద నుంచి 16, 25 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 20 వరకు చోరీకి గురయ్యాయి. వాటి విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉంటుంది. పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. మిస్టరీగా దొంగతనం కేసులు ఫ నెలలు గడిచినా దర్యాప్తులో కనిపించని పురోగతి ఫ బాధితులకు జరగని న్యాయం ఫ ఆలేరు స్టేషన్ పరిధిలో జనవరి నుంచి 70 ఘటనలు దొంగతనాల నియంత్రణకు నిఘా పెంచుతాం. ముఖ్యంగా బైపాస్ మార్గంలో పెట్రోలింగ్ను మరింత పకడ్బందీగా చేస్తాం. చోరీలతోపాటు వివిధ కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. నేర పరిఽశోధనలో కీలకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు, వ్యాపారులకు సూచిస్తున్నాం. –వినయ్, ఎస్ఐ ఆలేరు -
సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులకు బియ్యం
సాక్షి యాదాద్రి : సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో కొత్తగా 24,431 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి 621 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. కొత్తవాటితో కలిపి రేషన్కార్డులు 91,262కి పెరిగాయి.ఇందులో 7,62,572 యూనిట్లు ఉన్నాయి. పాత, కొత్త కార్డుల యూనిట్లకు 4,836 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. బియ్యాన్ని గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యం జూన్ ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. సర్వాయి పాపన్నకు నివాళి భువనగిరిటౌన్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి, దళిత,బహుజన,మైనార్టీలతో కలిసి ప్రజరా జ్యాన్ని నిర్మించిన ఘనత సర్వాయి పాపన్నదని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సాహితీ, అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంఎల్హెచ్పీకిషోకాజ్ నోటీస్ యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని వంగపల్లి పల్లె దవాఖాన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) డాక్టర్ అనూషకు అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో దవాఖానను తనిఖీ చేయడానికి కలెక్టర్ వచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి ఉంది. పైగా సిబ్బంది కూడా ఎవ్వరూ అందుబాటులో లేరు. ఎంఎల్హెచ్పీ సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైనట్లు తెలియడంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లుభువనగిరి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు భువనగిరి స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ద్వి తీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూ షన్ ఫీజు చెల్లించేందుకు ఈనెల 30వరకు అవకా శం ఉందన్నారు. వివరాల కోసం సెల్నంబర్ 9000590545ను సంప్రదించాలని కోరారు. -
ప్రాణాలతో చలగాటం
జిల్లాలో చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, బీబీనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా వ్యర్థాలను నిర్వీర్యం చేయాలన్న నిబంధనలు ఉండగా ఏ ఒక్క కంపెనీ పాటించడం లేదు. వ్యర్థ రసాయనాలను రాత్రి సమయంలో డీసీఎంలలో తీసుకువచ్చి జాతీయ రహదారులు, సాగునీటి కాలువలు, సాగు భూముల్లో పడేస్తున్నారు. అయితే ఇటీవల కెమికల్ మాఫియా అడ్డా మార్చాయి. చౌటుప్పల్ ప్రాంతంలోని పరిశ్రమలు గతంలో హై దరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వెంట రసాయన వ్యర్థాలను పారబోసేవి. కానీ, అక్కడ పోలీస్ పెట్రోలింగ్, హైవే అధికారుల నిఘా పెరగడంతో అడ్డా మార్చినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న గౌరెల్లి – భద్రాద్రి కొత్తగూడెం హైవేను ఎంచుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ వెలుగుచూడలేదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. -
పాల వెల్లువే..!
ఒప్పందం కుదిరితేసాక్షి, యాదాద్రి: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన మదర్ డెయిరీని గట్టెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. సంస్థ పాలకవర్గం ఈనెల 12న గుజరాత్కు వెళ్లి ఎన్డీడీబీని (జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ)ను ఆశ్రయించింది. ఎన్డీడీబీ చైర్మన్తో ప్రత్యేకంగా సమావేశమైంది. సంస్థను తీసుకుని లాభాల పట్టించాలని కోరగా అందుకు సానుకూల స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎన్డీడీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక సంక్షోభంలో సంస్థఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న మదర్ డెయిరీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రకరకాల కారణాలతో డెయిరీ అప్పులు పెరిగిపోయాయి. సంస్థను గట్టెక్కించేందుకు పాలకవర్గం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, పాఠశాలలు, హాస్టళ్లకు మదర్ డెయిరీ నుంచి నెయ్యి, పాలు సరఫరా చేసేవారు. దీని ద్వారా మదర్ డెయిరీకి భారీ ఆదాయం సమకూరేది. కానీ, ఆ బాధ్యతలను ప్రభుత్వం విజయ డెయిరీకి అప్పగించింది. దీనికి తోడు మార్కెటింగ్ లోపాల వల్ల ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు బ్యాంకుల నుంచి రూ.35 కోట్ల రుణాలు తీసుకోగా, తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా 50 వేల మంది పాడి రైతులకు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. నెలకు రూ.1.20 కోట్ల భారం పడుతుండటంతో వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో మదర్ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థిరాస్తులు అమ్మితే కానీ బయటపడే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యా వద్ద సంస్థకు చెందిన సుమారు 30 ఎకరాల భూమి విక్రయించాలని నిర్ణయించగా.. వాటిపై కోర్టు స్టే విధించింది.చివరి ప్రయత్నంగా..చివరి ప్రయత్నంగా మదర్ డెయిరీ పాలకవర్గం ఈనెల 12వ తేదీన గుజరాత్లోని ఆనందనగర్లో గల ఎన్డీడీబీని ఆశ్రయించింది. నాలుగు రోజుల పాటు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. 14న సంస్థ చైర్మన్తో ప్రత్యేకంగా సమావేశమై సంస్థను తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. డెయిరీ ఆస్తులు, అప్పులు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రస్తుతం వస్తున్న పాలు, విక్రయిస్తున్న ఉత్పత్తులు, రవాణా చార్జీలు తదితర అంశాలపై ఆయనతో చర్చించారు.మదర్ డెయిరీతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎన్డీడీబీ అంగీకారం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్వోసీ ఇస్తేనే ఒప్పందం కుదురుతుంది. త్వరలోనే పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి విన్నవించనుంది. అంతా సవ్యంగా సాగితే మదర్ డెయిరీ లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.మదర్ డెయిరీని నష్టాల నుంచి గట్టెక్కించే యత్నం ఎన్డీడీబీకి ఆశ్రయించిన పాలకవర్గం డెయిరీ ఆస్తులు, అప్పులు, ఇతర అంశాలపై చర్చలు సంస్థను అభివృద్ధి చేయడానికి ఎన్డీడీబీ సానుకూలం ప్రభుత్వం అంగీకరిస్తే కొలిక్కి వచ్చే అవకాశం త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలవనున్న నార్ముల్ డైరెక్టర్లుమదర్ డెయిరీ అభివృద్ధికి ఎన్డీడీబీ సహకారం తీసుకోవాలని నిర్ణయించాం. నాతో పాటు 14మంది మదర్ డైయిరీ డైరక్టర్ల తీర్మానం మేరకు అందరం కలిసి గజరాత్ వెళ్లాం.ఎన్డీడీబీ చైర్మన్ను కలిసి చర్చించగా మదర్ డైయిరీని అభివృద్ధి చేయడానికి ఆయన అంగీకరించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలసి త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ ఇప్పించాలని కోరుతాం. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్డీడీబీతో ఎంఓయూ కుదుర్చుకుని డెయిరీని కాపాడుకుంటాం. – గుడిపాటి మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ -
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా ని ర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొ లుపులో భాగంగా అర్చకులు సుప్రఽభాత సేవ, ఆరా ధన చేశారు. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతి ష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనా మార్చనతో కొలిశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఇక ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
12వేల మంది దరఖాస్తు
భువనగిరిటౌన్ : అన్నదాత కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న రైతుబీమా పథకానికి జిల్లాలో కొత్తగా 12వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో గతంలో ఒక లక్ష 36 వేల మంది నమోదై ఉండగా.. 588 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున బాధిత కుటుంబాల ఖాతాల్లో రూ.29.40 కోట్లు జమ అయ్యాయి. గతంలో నమోదైన రైతులందరికీ బీమా రెన్యువల్ చేశారు. కొత్తగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా ఈనెల 13న దరఖాస్తు గడువు ముగిసింది. 10 రోజుల్లోనే బీమా డబ్బులురైతు కుటుంబాలకు ఆర్థికభద్రత కల్పించడం రైతుబీమా ప్రధాన ఉద్దేశం. రైతు ఏకారణంతో చనిపోయినా నామినీ ఖాతాలో ఎల్ఐసీ నుంచి 10 రోజుల్లో బీమా డబ్బు జమ చేస్తారు. నమోదైన రైతులకు ప్రభుత్వమే రూ.2,271 ప్రీమి యంగా చెల్లించి రూ.5 లక్షల బీమా అందిస్తుంది. జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. హైవేపై వాహనాల రద్దీచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వర్షాల నేపథ్యంలో బుధ, గురువారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శని వారం శ్రీకృష్ణాష్టమికి తోడుగా పెళ్లిళ్లు, బోనాల పండుగలు ఉండటం, ఆదివారం రావడంతో హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజానీకం స్వస్థలాలకు వెళ్లారు. వారంతా తిరుగుపయనం కావడంతో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వాహనాల రద్దీతో చౌటుప్పల్ పట్టణంలో, జంక్షన్ల వద్ద పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల భారీ వర్షం సాక్షి యాదాద్రి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి 11.30 వరకు కురిసిన వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఆర్ఎంపీపై సుమోటోగా కేసు నమోదు
తుంగతుర్తి : ఆర్ఎంపీ చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సదరు డాక్టర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వైద్యం వికటించి మహిళ మృతి అనే వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆదివారం తుంగతుర్తిలోని సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తిలో ఆర్ఎంపీ శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆస్పత్రి నిర్వహించడంతోపాటు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారన్నారు. ఆయన వెంట డాక్టర్ విష్ణు తదితరులు ఉన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి కేసుపై కలెక్టర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ వెంటనే తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ కొరివిల్ల శ్రీనివాస్ అబార్షన్ చేయడం వల్లే విజేత అనే గర్భిణి మృతిచెందిందని డీఎంహెచ్ఓ తెలిపారు. -
కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ
నల్లగొండ: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్ అందుకోగలుగుతారని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నల్లగొండలో వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ కౌన్సిలింగ్ నిపుణులు హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏ ఖాన్, షరీఫ్, మొయిజ్, మహమూద్, ఏంఏ పర్వేజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేతి ఉత్పత్తులపై పన్ను మినహాయించాలిసంస్థాన్ నారాయణపురం: చేతివృత్తుల ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను మినహాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. చేనేత జాతీయ యువత విభాగంలో అవార్డు గ్రహీత గూడ పవన్ను ఆదివారం సంస్థాన్ నారాయణపురంలో శ్రీనివాస్గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలుతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం ఆధ్యక్షుడు వీరమళ్ల కార్తిక్, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, దూసరి వెంకటేశం, కొత్త భాను, ఉప్పరగోని రాజు, జోకు స్వామి, లక్ష్మణ్, చిరంజీవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతి మోటకొండూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనికునూరి పవన్ కుమార్(22) బోడుప్పల్లోని అభయ ఆస్పత్రిలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న డ్యూటీకి వెళ్తున్నాని తేర్యాలలో తన ఇంటి నుంచి బయలుదేరి మండలంలోని ఆరెగూడెం శివారులోని వెంచర్లో పురుగు మందు తాగాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులకు పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పవన్ వద్దకు వెళ్లిన బంధువులు అతడిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతి గల కారణాలు తెలియరాలేదు. బైక్ అపహరణఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో మజ్జిగ రాంబాబుకు చెందిన టూవీలర్ బైక్( టీఎస్ 30–హెచ్8353)ను శ్రీకనకదుర్గ దేవాలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. రాంబాబు కుమారుడు వ్యవసాయ భావి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్టు అడగడంతో బైక్ను ఆపాడు. దీంతో అతని చేతిలో నుంచి బైక్ను లాక్కెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా శ్రీకాంత్గౌడ్
నాగారం : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నాగారం మండలం మామిడిపల్లికి చెందిన గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్గౌడ్ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కన్వీనర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు నార్కట్పల్లి: మండల కేంద్రంలో ఓ హోటల్పై దాడి చేసిన ఘర్షణలో ఐదుగురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి ప్రసాద్ హోటల్కు శనివారం రాత్రి కొందరు యువకులు వచ్చి క్యాషియర్తో గొడవ పడి హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. హోటల్ యజమాని శెట్టి ప్రవీణ్కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణ పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజ మాని ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోడ నవీన్, మేడి స్వామితో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచిపేరు తేవాలి
హుజూర్నగర్ : కబడ్డీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హుజూర్నగర్లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఎంపికై న జిల్లా క్రీడాకారుల జట్టును మంత్రి క్యాంప్ కార్యాయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అధ్యక్ష కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నరసింహరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
మిస్టరీగా మారిన ఈశ్వర్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఈశ్వర్ మృతి మిస్టరీగా మారింది. శనివారం రాత్రి కాలనీ శివారులో అనుమానాస్పదంగా మృతిచెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో హతమర్చారా..? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు మాదగోని ఈశ్వర్(19) ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే మృతుడు నడుపుతున్న బైక్ మృతదేహానికి వంద అడుగుల దూరంలోని పొలంలో పడి ఉండడం.. గొంతుపై కత్తితో కోసినట్లుగా గాయం ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే.. మృతదేహం తల, ఇతర భాగాలపై గయాలు కనిపించాలి కానీ అలాంటి ఆనవాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వర్ మృతిచెందిన విషయం అతడు ప్రేమించిన యువతికి తెలియడంతోపాటు మృతదేహం ఫొటోలు ఆమె ఫోన్కు వీడియోలు పంపడం వెనుక హత్యకుట్ర దాగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కులాంతర ప్రేమను విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలిమిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద కాలనీ వాసులు, బంధువులు చేరుకుని తమకు న్యాయం చేయలని ఆందోళన వ్యక్తం చేశారు. వన్టౌన్ పోలీస స్టేషన్కు వెళ్లి ఈశ్వర్ మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో వన్టౌన్ సీఐ మోతీరాం మాట్లాడుతూ ఈశ్వర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని..త్వరలోనే నింధితులను గుర్తించి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్ తిరిగిన ప్రాంతాలను సీసీ ఫుటేజిల ద్వారా పరిశీలిస్తున్నామని, మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అతడి కాల్ డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. సీఐ హామీతో మృతుడి బంధువులు ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వర్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి చివ్వెంల : బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నత్త భానుప్రకాశ్ (22), అతని స్నేహితులు మణిదీప్, పవన్ ముగ్గురు బైక్పై విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. గుంజలూరు స్టేజీ వద్దకు రాగానే వారి బైక్ అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాక్టర్ ఢీకొనడంతో మరొకరు..గుండాల : మద్యం మత్తులో అతివేగంతో ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామానికి చెందిన సంగు శ్రీను ట్రాక్టర్ను గ్రామ దేవతల చుట్టూ అతివేగంతో తిప్పుతుండడంతో అదుపు తప్పి గ్రామానికి చెందిన రామగిరి శ్రీరాములు (55) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. పోతుగంటి లింగన్న, బుర్ర శేఖర్కు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో లింగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇంకొకరు..డిండి: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం డిండి మండలం పెద్దతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముడి రాములు(58), ముడి శ్రీను తమ అవసరాల నిమిత్తం మండలంలోని బొల్లనపల్లి గ్రామానికి వెళ్లి బైక్పై స్వగ్రామానికి తిరుగి వస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డిండి నుంచి చెర్కుపల్లి స్టేజీ మీదుగా దేవరకొండకు వెళ్తోంది. ఈ సమయంలో పెద్దతండా సమీపంలోకి రాగానే ముడి శ్రీను నడుపుతున్న బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్ వెనుక కూర్చున్న ముడి రాములు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన శ్రీనును దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాములు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.లారీని ఢీకొన్న కోళ్ల వ్యాన్ ఒకరి మృత్యువాతచందంపేట: ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాను వెనుకనుంచి ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చందంపేట మండలంపోలేపల్లి గేటు సమీ పంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి నుంచి వడ్ల లోడ్తో దేవరకొండకు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. కోళ్ల వ్యానులో ఉన్న గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన భూతం లింగయ్య(45)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్ కుంటిగొర్ల సైదులు, మరో వ్యక్తి వడ్లమల్ల రాఘవేందర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూతం లింగయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఏడుగురు వ్యక్తులకు గాయాలు చివ్వెంల, గుండాల, చందంపేట, డిండి మండలాల పరిధిలో ఘటనలుఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద ఒకరు, గుండాల మండలం బండ కొత్తపల్లి వద్ద, డిండి మండలం పెద్దతండాలో, చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 45 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,05,696 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పూజలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. సంప్రదాయ దుస్తుల్లో విదేశీయులు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రాన్స్ దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీస్వామి వారి ఆలయ నిర్మాణ శైలిని ప్రాన్స్ దేశస్తులకు వివరించారు. హైదరాబాద్కు వచ్చిన క్రమంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు. -
పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు
నల్లగొండ: పన్నెండేళ్ల పాటు విశేష సేవలంందించిన పోలీస్ జాగిలం పింకీ (ట్రాకర్) అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచింది. అనేక కేసుల్లో నేరస్తులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు పట్టించిన పింకీ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. పింకీ అంత్యక్రియలను ఆదివారం పోలీసులు అధికార లాంఛనాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పలు కేసుల దర్యాప్తులో కీలకంగా..ఉమ్మడి జిల్లాలో విధినిర్వహణలో భాగంగా పింకీ పలు కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించింది. నల్లగొండ వన్టౌన్ పరిధిలోని బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి కాళ్లు, చేతులు, మొండేన్ని వేర్వేరు చోట్ల పెట్టిన కేసు పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. నల్లగొండలో జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరి గిన రూ.1.40 కోట్ల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితు ల జాడను తె లిపింది. గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం తర్వాత నిందితుల ఇళ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పింకీ మృతిపట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ సంతాపం తెలిపారు. -
గొప్ప నేత వాజ్పేయి
పేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప నేత అటల్ బియారీ వాజ్పేయ్ అని బీజేపీ నాయకులు కొనియాడారు.7యాదాద్రి భువనగిరిఅర్హులందరికీ రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నారు.చౌటుప్పల్లోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఉట్టి కొడుతున్న యువకుడుఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025- 9లో -
ప్రమాదాలు జరుగుతున్నాయి
జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులలో పాటు గల్లీ రోడ్లన్నీ పాడయ్యాయి. మరమ్మతులు చేయిస్తామని అసెంబ్లీ ఎన్నికల కు ముందు నాయకులు హామీలు ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. వర్షాలు కురిసినప్పుడు గుంతలు నీటితో నిండి వాహనదారులకు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాల కు గురవుతున్నారు. వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. రాత్రి సమయంలో రోడ్లపై వెళ్లలేం. ఇ ప్పటికైనా చొరవ చూపి శాశ్వత మరమ్మతులు చేయాలి. –ఆమెర్, భువనగిరి -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: పంచ నారసింహుడు కొలువైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యానం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను మాడవీధుల్లో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. అలరించిన నృత్య ప్రదర్శనభువనగిరి: భువనగిరి పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు అకట్టుకున్నాయి. రమేష్రాజ్ డాన్స్ అకాడమీ కళాకారులు కూచిపూడి నృత్యం చేసి అలరించారు. వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మినీ శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు. చెరువులో బోటు పై షికారు చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బాలికలు సింధుప్రియ, భావనరెడ్డి, వందనరెడ్డి, పావని, సింధు, బింధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ మౌనం వీడాలిరామన్నపేట: భారత్పై అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించడంతో ప్రధామంత్రి మోదీ విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి జయంతిని పురస్కరించుకుని శనివారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై అనేక ఆంక్షలు, వాణిజ్య సుంకాలు విధిస్తున్నా మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్న అమెరికా వైఖరిపై భారత్ మౌనం వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, నాయకులు జెల్లెల పెటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, అవ్వారి గోవర్దన్, కూరెళ్ల నర్సింహాచారి, కందుల హన్మంత్, గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, గన్నెబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, గొరిగె సోములు, లెనిన్ శ్రీకృష్ణ, సత్యం, నరేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఆలేరు అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే
యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని, కేసీఆర్ దీవెనలతో అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించానని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గొంగిడి యూత్ ఐకాన్ ర్యాలీలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ క్యామ మల్లేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని యువ జన, విద్యార్థి విభాగం, బీఆర్ ఎస్ కార్యకర్తలను కోరారు. ఆలేరు ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని, తుది శ్వాసవరకు వారికి అండగా నిలుస్తానన్నారు. ప్రజలు దీవిస్తే మరోసారి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలి పారు. రాష్ట్ర ప్రజలంతా మరో మారు కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ కార్యదర్శి జనరల్ పాపట్ల నరహరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నాయకులు బీసు కృష్ణంరాజు, బైరోజు వెంకటచారి, మారెడ్డి కొండల్రెడ్డి, వస్పరి శంకరయ్య, పల్లా వెంకట్రెడ్డి, తోటకూరి బీరయ్య, జి.బాబురావు, శిఖ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఫ ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
బాలికలు, వృద్ధులకు ప్రత్యేక సంఘాలు
నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 14,8450 మహిళా సంఘాలు ఉండగా, వాటిలో 1,65,258 మంది సభ్యులున్నారు. భువనగిరి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) మరింత విస్త్రతం కానున్నాయి. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల నెట్వర్క్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ –2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటానికి సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన 15–18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే డబ్బు పొదుపు చేయడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేదింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం కిశోర బాలికలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో బాలికలను చేర్పించేందుకు సెర్ప్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 సంవత్సరాలు నిండిని వారిని తొలగిస్తున్నారు. వీరితో మళ్లీ సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలు ఉంటే వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగులంతా ఒకే గొడుకు కిందికి.. దివ్యాంగులందరినీ ఒకే గొడుకు కిందికి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు. ఫ 15–18 ఏళ్ల వయసున్న బాలికలు, 60 ఏళ్లు నిండిన మహిళలతోప్రత్యేక గ్రూప్లు ఫ దివ్యాంగులతో సైతం.. ఫ స్వయం సహాయక సంఘాల మాదిరిగా బ్యాంక్ లింకేజీ రుణాలు ఫ కొనసాగుతున్న అర్హుల గుర్తింపు ఫ నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంక్ ఖాతాలుఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. . –నాగిరెడ్డి, డీఆర్డీఓమండలాలు 17మొత్తం సంఘాలు 14,850సభ్యులు 1,65,258మండల సమాఖ్యలు 17జిల్లా సమాఖ్య 01 -
కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పెండింగ్లో ఉన్న కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా అడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చాడని ఆరోపించారు. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూసుకుంట్ల మాట్లాడారు. ‘ప్రభుత్వం సహకరిస్త లేదని అంటున్నావు.. మీ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఒక్కసారైనా మునుగోడు నియోజకవర్గానికి తీసుకొచ్చావా’ అన్ని ప్రశ్నించారు. మునుగోడుకు నేనే మంత్రి.. నేనే రాజుగా రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదన్నారు. ‘ఎల్బీనగర్ నుంచి పోటీచేస్తే మంత్రి పదవి వచ్చేదని అంటున్నావు.. మునుగోడుపై ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు. మంత్రి పదవి స్టేజీల మీద మాట్లాడితే రాదు.. అధిష్టానంతో మాట్లాడితే వస్తుంది’ అని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి వల్ల మునుగోడు నాశనం అవుతుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తావో.. ఇంకేం చేస్తావో కానీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. సుశీలమ్మ ఫౌండేషన్కు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, తాను ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు. నిఝెజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలే కనిపిస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన వెంట నారాయణపురం మండల బీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు నర్రి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఫ రాజగోపాల్రెడ్డికి మంత్రిపై ఉన్న ధ్యాస.. అభివృద్ధిపై లేదు ఫ మునుగోడుకు మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదు ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి -
మూసీకి పెరిగిన వరద ఉధృతి
భూదాన్పోచంపల్లి, వలిగొండ : మూసీకి వరద ఉధృతి పెరిగింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఉస్మాన్సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా మూసీలోకి చేరుతోంది. దాంతో భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద లో లెవల్ వంతెనల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇరు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి – చౌటుప్పల్ మధ్య సుమారు 15 కిలో మీటర్లు, బీబీనగర్ – పోచంపల్లి మధ్య 30 కిలో మీటర్ల మేరకు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఈ మార్గాల్లో వారం రోజుల్లో ఐదు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫ జూలూరు, సంగెం వద్ద వంతెనలపై నుంచి వరద ప్రవాహం ఫ రాకపోకలు నిలిపివేసిన అధికారులు -
రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
ఫ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహరాజ్ సంస్థాన్ నారాయణపురం: రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలు గొప్పవిని, వాటిని యువత ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి యాదయ్య, నర్రి నర్సింహ, బైరి శేఖర్, రవీందర్, రమేష్, గాలయ్య, కిరణ్, స్వామి, యాదగిరి, శంకర్, రాజేష్, మధు, భరత్, అర్జున్ తదితరలు పాల్గొన్నారు. -
అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు నీరు అందించడమే లక్ష్యం. గంధమల్ల రిజర్వాయర్ భూ సేకరణ దాదాపు పూర్తయ్యింది. మూసీ కాలువల ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. –గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనమండలి చైర్మన్ సాక్షి, యాదాద్రి: ‘ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. సమన్వయంతో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం. అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం’ అని శాసనమండలి గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రగతి కార్యక్రమాలను వివరించారు. ప్రసంగంలోని ప్రధానాంశాలు ● జిల్లాకు 9,398 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,542 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.47 కోట్లు జమ చేశాం. ● కొత్తగా 23,367 రేషన్కార్డులు మంజూరు చేశాం. వీటి ద్వారా 71,530 మందికి లబ్ధి చేకూరుతుంది. ● రుణమాఫీ పథకం కింద 2,33,418 మంది రైతులకు రూ.306.47 కోట్లు మాఫీ జరిగింది. 2024–25 యాసంగి సీజన్లో 375 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,128 మంది రైతుల నుంచి 3,74, 728 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.865 కోట్లు చెల్లించాం. ● 23,921 ఎకరాల్లో ఉద్యాన, మల్బరీ తోటలు సాగవుతున్నాయి. గత మూడేళ్లలో 4,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు సాగైంది. ఈ ఏడాది 3,500 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించాం. ● రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 1,200 సమస్యలను పరిష్కరించాలి. ● ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను మంజూరు చేసింది. ● జాతీయ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా 1,084 మందికి రూ.2.16 కోట్ల ఆర్థిక సాయం అందించాం ● 2025–26 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహా యక సంఘాలకు రూ.611.17 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించాం. ఇప్పటి వరకు రూ.189.52 కోట్లు మంజూరు చేశాం. ● 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు గాను ‘నేతన్నకు పొదుపు’ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 10,790 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు నమో దు కాగా రూ. 2.17 కోట్లు విడుదల చేశాం. ● తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన ఇద్దరు, వైకల్యం పొందిన నలుగురు గీత కార్మికులకు రూ.10.40 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశాం. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అనంతారం జెడ్పీహెచ్ఎస్, భువనగిరిలోని కృష్ణవేణి హైస్కూల్, బాలికల హైస్కూల్, విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అదే విధంగా ఉత్తమ సేవలందించి 162 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. 2,379 స్వయం సహాయక సంఘాలకు రూ.210 కోట్ల బ్యాంకు రుణాలకు సంబంధించి చెక్కులు అందజేశారు. స్టాళ్ల ప్రదర్శన ఉద్యానవన, రోడ్లు భవనాలు, మహిళాశిశు సంక్షేమం, ఎస్సీ, మైనార్టీ సంక్షేమం, నీటిపారుదల, సహకార, మత్స్యశాఖ, పశుసంవర్ధక, వైద్యారోగ్య, గ్రామీణా భివృద్ధి, మెప్మా, విద్య తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి శాసనమండలి చైర్మన్కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, భువనగిరి ఏఎస్పీ రాహుల్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు . నృత్యం చేస్తున్న విద్యార్థినులురాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. అందులో భాగంగా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ పనులను సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన చేశారు. 1.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించను న్నారు.ఇందుకోసం ప్రభుత్వం రూ.358.16 కోట్ల మంజూరు చేసింది. ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. దీంతో పాటు బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాం. పనులు పురోగతిలో ఉన్నాయి. నేరాల నియంత్రణ, కేసుల చేదనలో రాచకొండ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచారు. నేరాల నియంత్రణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సాంఘిక దురాచారాలపై కళాకారులతో సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫ అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఫ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఫ స్వాతంత్య్ర వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గత విద్యా సంవత్సరం మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 159 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 97.8 ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 7వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 5,800 మంది పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గొప్ప విషయం. -
సమన్వయంతోనే ప్రగతిపథం : కలెక్టర్
సాక్షి యాదాద్రి : కలెక్టరేట్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పథకాల అమలులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వాలు ఏ స్ఫూర్తితో పథకాలు తెస్తున్నాయో, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలుచేసి, ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందేలా కృషి చేయాలని కోరారు. సమన్వయంతో జిల్లాను ప్రగతిపథంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో.. యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈఓ వెంకట్రావ్ జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ, దేవస్థానం అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఎన్ఎం, అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు
భువనగిరి : జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం సంబంధిత కోర్సులో శిక్షణ పూర్తి చేయడంతో పాటు ఇంటర్ విద్యార్హత, అకౌంటెంట్ పోస్టుకు బీకాం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండలన్నారు. దరఖాస్తులను ఈ నెల 22లోపు అందజేయాలన్నారు. వివరాలకు 9441189894ను సంప్రదించాలని కోరారు. అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్లో.. చందేపల్లి పరిధిలోని అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి తెలిపారు. అటెండర్, డే, నైట్ వాచ్మన్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 22వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9441189894 నంబర్ను సంప్రదించాలన్నారు. బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికభువనగిరి: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి నియామక పత్రాలు అందజేసి సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా వేముల నరేష్, జైనపల్లి శ్యాంసుందర్రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తంరెడ్డి, పన్నాల చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, కాదూరి అచ్చయ్య, కార్యదర్శులుగా వైజయంతి, కృష్ణ, మల్లారెడ్డి, మేడి కోటేష్, లక్ష్మీనారాయణ, కోశాధికారులుగా సోమ నరసయ్య, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా మంగు నర్సింగ్రావు, జిల్లా ఐటీ ఇన్చార్జి వెంకటేష్, మీడియా ఇన్చార్జి రామకృష్ణ,సోషల్ మీడియా కో కన్వీనర్గా సుధ, ఉదయ్కిరణ్ నియమితులయ్యారు. నూతన కార్యవార్గన్ని జిల్లా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు జగన్మోహన్రెడ్డి తదితరులు అభినందించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు భువనగిరిటౌన్ : ప్రజా సమస్యలపై వారం రోజుల పాటు సీసీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. శుక్రవారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగిన సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచడం లేదన్నారు. మూసీ పునరుజ్జీవం, బస్వాపురం గంధమల్ల, దేవాదుల ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈనెల 22 23 24 25 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసనలు, 28 29 30 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరు బాలరాజు, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. పల్లెకవిత–విద్యాభవిత పుస్తకావిష్కరణ ఆలేరు: పట్టణంలోని సిల్క్నగర్కు చెందిన కవి ఎస్కే జానిమియా రచించిన ‘పల్లె కవిత–విద్యా భవిత’ పుస్తకాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో టీసీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి తదితరులు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హాజరుశాతం ఎక్కువ ఉన్న విద్యార్థులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఎన్సీసీ కేడెట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మంజుల, ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, సైదులు,మల్లేష్, మేఘరాజు పాల్గొన్నారు. -
అడిగితే.. అదిగో ఇదిగో!
బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులందరికీ అందని పరిహారం బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితుల్లో కొందరికి పరిహారం పెండింగ్ ఉంది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి పెండింగ్ పరిహారం విడుదల చేయాలని కోరడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే చెల్లిస్తాం. ఆ తరువాత రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపుతాం. –అనిల్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే బస్వాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తమకు ఏళ్లు గడిచినా పరిహారం అందలేదు. ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. మేము ఎక్కడికి పోవాలి. పరిహారం చెల్లిస్తే పునరావాస గ్రామంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లిపోతాం. పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాలి. –నందు, బీఎన్ తిమ్మాపూర్ బీఎన్తిమ్మాపురంలో నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించలేదు. 200 మంది వరకు ఇచ్చారు. ఇంకా 350 మందికి పెండింగ్ ఉంది. అందరికీ పరి హారం డబ్బులు ఇస్తే పునరావాస గ్రామంలో ఇళ్లు నిర్మించుకుంటారు. పనులు మొదలై ఏళ్లు గడుస్తుంది. డబ్బుల కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. –ఎడ్ల సత్తిరెడ్డి, బీఎన్ తిమ్మాపురంసాక్షి, యాదాద్రి: నృసింహసాగర్ రిజర్వాయర్ పనులు మొదలై ఏడేళ్లు పూర్తి కావస్తోంది. కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు మాత్రం పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులను అడిగితే అదిగో,ఇదిగో అంటున్నారే తప్ప.. స్పష్టత ఇవ్వడంలేదని నిర్వాసితులు వాపో తున్నారు. రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాలంటే బీఎన్ తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయించాలి. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తే తప్ప ఊరిని ఖాళీ చేయించే పరిస్థితి లేదు. రూ.79 కోట్లు పెండింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపురం వద్ద నృసింహసాగర్ సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు.11.39 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు గ్రామకంఠం కింద రూ.109 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. అందులో పది నెలల క్రితం కేవలం రూ.30 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.79 కోట్లు పెండింగ్లో ఉంది. గ్రామంలో 550 మంది వరకు నిర్వాసితులు ఉండగా 200 మందికి పరిహారం వచ్చింది. మరో 350 మందికి పెండింగ్ ఉంది. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తే ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటిని రిజర్వాయర్లో నిల్వ చేయవచ్చు. కానీ, పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల రిజర్వాయర్లోకి నీటి విడుదలపై స్పష్టత ఉండటం లేదు. ఫ 350 మందికి రూ.79 కోట్లు పెండింగ్ ఫ అందరికీ చెల్లిస్తేనే గ్రామాన్ని ఖాళీచేయించడానికి అవకాశం ఫ నృసింహసాగర్ రిజర్వాయర్లోకి నీటి విడుదలకు మరికొంత సమయం -
గంజాయి నిందితుల అరెస్టు
హాలియా : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. శుక్రవారం హాలియా పోలీస్ స్టేషనల్లో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామానికి చెందిన వజ్రాల రాజశేఖర్, నల్లగొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంటతండాకు చెందిన కుందాల వేణు, తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన గురజాల మహేందర్ గంజాయికి అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రాకు చెందిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అనుముల మండలంలోని పంగవానికుంటతండా శివారులోని అల్వాల ఎక్స్రోడ్డు వద్ద శుక్రవారం గంజాయిని విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. హాలియా పోలీసులు అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా 1.650 కేజీల గంజాయి లభ్యమైంది. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోగా, వారిని అరెస్టు చేశారు. గంజాయి సరఫరాకు సంబంధించిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద 1.650 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్లను డీఎస్పీ అభినందించారు. 1.650 కేజీల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖరరాజు -
అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
తిప్పర్తి: అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిప్పర్తి మండలంలోని తిప్పర్తి– రాయినిగూడం రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బండారు మహేష్ (37) ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. అప్పులు ఎక్కువ కావడం, వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ రైల్వేస్టేషన్ మాస్టర్ అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారునేరేడుచర్ల : కారు అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలో పడింది. పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నారాయణ నరేష్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యాపేటలో నూతన ఇంటి నిర్మాణం కోసం సామగ్రిని కారులో తీసుకువచ్చాడు. ఇంటి వద్ద సామగ్రిని పెట్టి తన అత్తగారి ఊరైన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు బయలుదేరాడు. సూర్యాపేట మీదుగా మిర్యాలగూడకు వెళ్లేందుకు నేరేడుచర్ల మండలం కల్లూరు అడ్డ రోడ్డు వద్దకు వచ్చాడు. మిర్యాగూడ రోడ్డు వైపు వెళ్లకుండా పొరపాటున సాగర్ ఎడమ కాలువ వైపు తిప్పాడు. దీంతో కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. నరేష్రెడ్డి కారు నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సహకారంతో కారు బయటకు తీశారు.