Yadadri
-
ఆర్టీసీ సమ్మె ఉధృతం
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె గురువారం రెండవ రోజూ కొనసాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు గురువారం 398 బస్సులు నడిపారు. వీటిలో ఆర్టీసీ 10, ఎలక్ట్రిక్, అద్దె బస్సులు 388 ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కండక్టర్లను నియమించారు. ప్రధాన రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ సర్వీస్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రైవేట్ వాహనదారులు చార్జీలు భారీగా పెంచారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు సుమారు రూ.500 వరకు వసూలు చేశారని.. ప్రయాణికులు పేర్కొన్నారు. అన్ని డిపోల వద్ద ఉద్రిక్తత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. నల్లగొండ డిపో వద్ద డ్రైవర్ వెంకన్న ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేట డిపో లో బస్సులు నడవకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. కాసేపు పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో బస్సులు నడిచాయి. యాదగిరిగుట్టలో కూడా ఉద్యోగులు డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. అద్దె బస్సుల పార్కింగ్ వేరే చోట ఉండడంతో ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచి బస్సులను నడిపించారు. యాదగిరిగుట్ట, కోదాడ డిపోల్లో ఉద్యోగులు ధర్నా వద్ద ఏర్పాటు చేసుకున్న టెంట్లను పోలీసులు తొలగించారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆందోళనలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. నార్కట్పల్లి డిపోలో జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదగిరిగుట్టలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, సీపీఐ రాష్ట్ర నాయకుడు గోదా శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్ సమ్మెకు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో సీపీఎం, సీపీఐతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు సమ్మెకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.ఫ అన్ని డిపోల ఎదుట బైఠాయించిన కార్మికులు ఫ సూర్యాపేటలో ఉద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట ఫ యాదగిరిగుట్ట, కోదాడలో ధర్నా టెంట్ల తొలగింపు ఫ నల్లగొండలో కార్మికుడి ఆత్మహత్యాయత్నంమిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అధికారులు అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను పాక్షికంగా నడిపారు. కండక్టర్లు కొరత ఉండడంతో కొన్ని బస్సుల్లో మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచితంగా ప్రయాణించారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లే అద్దె బస్సు డ్రైవర్కు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన కాగితంపై ప్రయాణికులందరికీ ఫ్రీ అని రాసి ఉంది. కాగా కండక్టర్లు లేకపోవడంతో పురుషులు ఉచితంగా ప్రయాణించారని.. శుక్రవారం నుంచి తప్పనిసరిగా పురుషులు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
కేసీఆర్పై దుష్ప్రచారం మానుకోవాలి
సాక్షి, యాదాద్రి: కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం హైకోర్టు తీర్పుతో నైనా మానుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిలు హితవు పలికారు. గురువారం భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పును వారు ఉదహరించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఆరోపణలు రుజువు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. పీసీ ఘోష్ నివేదిక పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. కే సీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్లోకి వచ్చిన గోదావరి నీళ్లు ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పారుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమే అని అన్నారు. మేడిగడ్డ వద్ద కూలిన రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతుల పొలాలకు నీరివ్వాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి కుట్రలుబెడిసికొట్టాయన్నారు. పీసీసీఅథ్యక్షుడు కోర్టు తీర్పు స్పష్టంగా వచ్చినా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎన్నికలకు సిద్ధంకావాలన్నారు. కాళేశ్వరం వల్లే హైదరబాద్ నగరానికి మంచినీళ్లు ఇవ్వడానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కేసీఆర్పై తప్పుడు ఆరోపణలుచేస్తే గ్రామాల్లో జనం తరమికొడతారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, కేశవపట్నంరమేష్, పెంట నర్సింహ, సుబ్బురు బీరుమల్లయ్య, రాంగోపాల్రెడ్డి, నాగారం సూరజ్, రేకల శ్రీనివాస్, పద్మ పాల్గొన్నారు. ఫ హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి ఫ ఆరోపణలు రుజువు చేయలేని కాంగ్రెస్ ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి -
బడికి బై.. బై
భువనగిరి: ఏడాదంతా పుస్తకాలు, పరీక్షలతో గడిపిన విద్యార్థులకు శుక్రవారం నుంచి ఉపశమనం లభించనుంది. 2025–26 విద్యా సంవత్సరం గురవారంతో ముగిసింది. ముగింపు రోజు విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి అందజేశారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు రెండు మూడు రోజుల నుంచే సొంతగ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కాగా కొన్ని అద్దె బస్సులు నడుస్తున్నా అవి ఎప్పుడు వస్తాయో తెలియక తమ పిల్లలను బైకుల పైఐ తీసుకెళ్లారు. ఈ వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు ఉండనున్నాయి. తిరిగి పాఠశాలలు 2026–27 విద్యాసంవత్సరం జూన్ 12వ తేదీన పునః ప్రారంభంకానున్నాయి.నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఫ పుస్తకాలు పక్కన పెట్టి ఊర్లబాట పట్టిన పిల్లలు ఫ ఇక ఆటాపాటలతో సందడి ఫ జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం -
టీబీ రహిత సమాజమే లక్ష్యం
ఫ సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ కమిషనర్ వీణాధావన్ యాదగిరిగుట్ట: టీబీ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వీణాధావన్ వైద్య ఆరోగ్య సిబ్బందిని కోరారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పీహెచ్సీతో పాటు కాచారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాల వరకు దగ్గు, జ్వరం, తెమడలో రక్తం పడటం, ఛాతీలో నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, బరువు తగ్గడం, గ్రంధుల వాపు తదితర లక్షణాలు ఉంటే తప్పని సరిగా టీబీ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాచారంలో నిర్వహించిన టీబీ పరీక్షల్లో 152 మంది రోగులను పరీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, నేషనల్ టీబీ కన్సల్టెంట్స్ డాక్టర్ రాధారామ్, విఘ్నేశ్వర్, జిల్లా వైద్యాధికారి మనోహర్, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ వంశీకృష్ణ, డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్లు డాక్టర్ మహేష్, శ్రీఘన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావని, కొండం ఉపేందర్రెడ్డి, ఉపసర్పంచ్ బర్మ మౌనిక, సీహెచ్వో వెంకటయ్య, సిబ్బంది ఈశ్వర్ పాల్గొన్నారు. -
యువతను పట్టిపీడిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి
ఫ ఒక్క క్లిక్తో లక్షల ఆశ.. చివరికి అప్పులపాలు ఫ తీర్చేదారిలేక బలవన్మరణాలు ఫ వీధిన పడుతున్న కుటుంబాలుసాక్షి, యాదాద్రి : ఐపీఎల్ బెట్టింగ్ మహమ్మారి కోరలు చాస్తోంది. టాస్ పడకముందే మొదలవుతున్న జూదం.. మ్యాచ్ ముగిసేసరికి ఎందరో యువకుల జీవితాలను రోడ్డున పడేస్తోంది. లక్షల్లో అప్పులు.. తీర్చలేక ఆత్మహత్యలు.. వెరసి కుటుంబాల్లో బెట్టింగ్ సెగ పెను విషాదాన్ని నింపుతోంది. వివిధ మండలాల్లో వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తుంటే.. ఈ ఆన్లైన్ జూదం ఎన్ని కుటుంబాలను బలితీసుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో అప్పులు చేస్తున్న యువత ఐపీఎల్ ప్రారంభంతోనే బెట్టింగ్ దందా పెరిగింది. ఐపీఎల్ 2026 ప్రారంభంతోనే అన్ని మండలాల్లో ఆన్లైన్ యాప్లు, బుకీల ద్వారా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. యువత, విద్యార్థులు వివిధ వర్గాల వారు బెట్టింగ్ కోసం లక్షల అప్పులు చేస్తున్నారు. మ్యాచ్ విన్నర్, టాస్ విన్నర్, సెషన్ బెట్టింగ్, ఏ బ్యాటర్ ఎక్కువ రన్స్, ఏ బౌలర్ ఎక్కువ వికెట్లు తీస్తారు. బాల్బై బాల్, ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, వికెట్ పడే తీరు, ఓవర్కు ఎన్ని రన్స్ కొడతారు ఇలా పలు రకాల బెట్టింగ్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లోని యువత వీటి మోజులో పడి లక్షల రూపాయలు నష్టపోతోంది. మొదట్లో చిన్న మొత్తంతో మొదలై, ఆ తర్వాత పందెం పెంచుకుంటూ పోయి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. కుటుంబాల్లో చీకట్లు బెట్టింగ్ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తోంది. కొడుకు ప్రయోజకుడవుతాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు.. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి నిలదీస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. పచ్చని సంసారాల్లో ఈ బెట్టింగ్ చిచ్చు పెడుతోంది. పోలీసుల నిఘా అవసరం జిల్లాలో జోరుగా సాగుతున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో యువతకు అవగాహన కల్పించడంతో పాటు, రహస్యంగా సాగుతున్న ఈ దందాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.చౌటుప్పల్ పట్టణంలో ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల అయిన అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించినా, వ్యసనం వదలకపోవడంతో చివరకు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. నేడు అతని భార్య, ఇద్దరు పిల్లలు అప్పుల భారంతో సతమతమవుతున్నారు. బొమ్మలరామారం మండలంలో బెట్టింగ్ మోజులో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈసంఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పులు తీర్చలేక తన ప్లాట్ను, అంతకుముందు భూమిని విక్రయించినా ఫలితం లేకపోయింది. మళ్లీ రూ. 25 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య పిల్లలు అనాథలయ్యారు. ఇదే మండలంలో మరో యువకుడు ఏకంగా 30 లక్షల రూపాయలు పోగొట్టుకుని, ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టాడు. -
బియ్యం నాణ్యతపై జాగ్రత్తలు అవసరం
సాక్షి, యాదాద్రి : రైస్ మిల్లర్లు బియ్యం నాణ్యత, డెలివరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఎఫ్సీఐ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భాస్కర్రావు మాట్లాడారు. బియ్యం తిరస్కరణకు గురికావడానికి గల కారణాలను భారత ఆహార సంస్థ అధికారులతో క్షుణ్ణంగా చర్చించామన్నారు. నిబంధనల ప్రకారం ఉన్న బియ్యం సేకరణలో మిల్లర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భారత ఆహార సంస్థ అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ హరికృష్ణ, భారత ఆహార సంస్థ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. డీఐఈవోగా సురేష్రెడ్డి భువనగిరి: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా సురేష్రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిన రమణి డీఐఈవో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె మహబూబ్నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా పదోన్నతి పై వెళ్లారు. ఆమె స్థానంలో భూదాన్పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ను నియమించారు. దీంతో గురువారం బాధ్యతలు స్వీకరించారు. జీవితాన్ని మార్చే ఆయుధం విద్యరాజాపేట : జీవితాన్ని మార్చే ఆయుధం విద్య అని డీఈఓ కందుల సత్యనారాయణ పేర్కొన్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట, రాజాపేట ఉన్నత పాఠశాలల్లో వార్సికోత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కలలు కని వాటి సాకారం కోసం కృషిచేయాలన్నారు. ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశానికి, తల్లిదండ్రులకు, గురువులకు పేరుతేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోయ మధు, రంగ నరేష్ గౌడ్, ఎంఈఓ చందా రమేష్, ప్రధానోపాధ్యాయుడు రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఇంటికే సరుకులు
భువనగిరిటౌన్ : రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరుకోవడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 31 వరకు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో వారి ఇళ్లకే వెళ్లి సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సమయాల్లో మార్పు.. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం ఇప్పటికే సవరించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కేంద్రాల్లో ఫ్యాన్లు లేకపోవడం, వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేందుకు నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారు. సెలవుల కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించే భోజనానికి అంతరాయం కలగకుండా ప్రభుత్వం టేక్ హోమ్ రేషన్ విధానాన్ని అమలు చేస్తోంది. మే నెలకు సరిపడా సరుకులను లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ చేయనున్నారు. ● గర్భిణులు, బాలింతలకు : నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె, పాల ప్యాకెట్లను అందజేస్తారు. ● చిన్నారులకు : 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు బియ్యం, పప్పు, నూనె, కురుకురే ప్యాకెట్లను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. కేంద్రాలకు సెలవులు ఉన్నప్పటికీ, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలి. శారీరక, మానసిక ఎదుగుదల లోపించిన పిల్లలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. అలాగే ప్రభుత్వం సూచించిన బాలల సంరక్షణ వారోత్సవాలు (ఏప్రిల్ 27 – మే 2), మహిళా వారోత్సవాలను (మే 25 – మే 30) విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో మొత్తం 901 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 0–3 సంవత్సరాల చిన్నారులు 26106, 3 నుంచి 6 సంవత్సరాల వారు 18,850, గర్భిణులు 5,024, బాలింతలు4,392 మంది సేవల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఆలేరు, మోత్కూర్, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ ప్రక్రియను సమర్థంగా అమలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఫ వచ్చేనెల 1 నుంచి అంగన్వాడీలకు వేసవి సెలవులు ఫ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకు వెళ్లి సరుకుల పంపిణీ ఫ టీచర్లు, ఆయాలకు బాధ్యతలు -
కత్తితో బెదిరించి బంగారు గొలుసు అపహరణ
కోదాడరూరల్ : మహిళను కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు దుండగుడు అపహరించాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో గురువారం జరిగింది. కోదాడ పట్టణంలోని లాల్బంగ్లా సమీపంలో నివాసముంటున్న ప్రముఖు వైద్యుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు బురఖా ధరించి, హెల్మెట్, చేతులకు గ్లౌజ్లు ధరించి స్కూటీపై వచ్చాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి శ్రీనివాసరెడ్డి భార్య పద్మావతి మెడపై కత్తిపెట్టి బీరువా తాళాలు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో అతడు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కోని స్కూటీపై పరారయ్యాడు. స్థానిక సాయిబాబా థియేటర్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు. బైండోవర్ అతిక్రమించిన వ్యక్తికి జరిమానాతిరుమలగిరి(సాగర్) : బైండోవర్ అతిక్రమించిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా విధించగా గురువారం తహసీల్దార్ కార్యాలయంలో జరిమానా చెల్లించాడు. ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి చెందిన ఈరబోయిన రాజు గతంలో ఓ మహిళను వేధించిన కేసులో నేరస్తుడిగా ఉండగా.. అతడిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. కానీ అతడు బైండోవర్ అతిక్రమించి మరో కేసులో కల్గజేసుకోవడంతో రూ.లక్ష జరిమానా చెల్లించాలని లేదా ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సిందిగా తహసీల్దార్ పేర్కొన్నారు. దీంతో రాజు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమక్షంలో రూ.లక్ష జరిమానా చెల్లించాడు. వడదెబ్బతో మహిళకు తీవ్ర అస్వస్థతనకిరేకల్ : వడదెబ్బ తగిలి మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన నకిరేకల్ మండలం చందంపల్లి ఫ్లైఓవర్ వంతెన వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం 65 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ చందంపల్లి ఫ్లైఓవర్వద్ద వడదెబ్బ తగిలి కళ్లు తిరిగి పడిపోయింది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ గురించి తెలిసిన వారు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ హరిబాబు సూచించారు. -
ఇంటర్న్షిప్తో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది
నల్లగొండ టూటౌన్: ఇంటర్న్షిప్తో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సురేష్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ విద్యార్థులకు ఇంటర్న్షిప్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటర్న్షిప్ల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మార్గం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేఖ, ఎం. జయంతి, జ్యోతి, రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మంటలంటుకుని గడ్డివాములు దగ్ధం
హుజూర్నగర్ : ప్రమాదవశాత్తు మంటలంటుకుని గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటన హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేపల సింగారం గ్రామానికి చెందిన రైతు నర్సింగ్ నారాయణ తన పశువుల మేత కోసం గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ గడ్డివాములకు మంటలు అంటుకోవడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు మంటలు వేగంగా వ్యాపించి చాలా వరకు గడ్డి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ సగానికి పైగా గడ్డి మోపులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.90 వేల విలువైన గడ్డి కాలిబూడిదైందని బాధిత రైతు వాపోయాడు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. -
‘దుశ్చర్ల’పై గొర్రెల కాపరుల దాడి
సూర్యాపేట టౌన్, మోతె : ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. రాఘవపురం గ్రామంలో తనకున్న 70 ఎకరాల భూమిలో దుశ్చర్ల సత్యనారాయణ వివిధ రకాల చెట్లను పెంచి అడవిగా మార్చారు. ఆ అడవి పక్కనే బయ్య లింగయ్య, మేకల కృష్ణయ్య వ్యవసాయ భూములు ఉన్నాయి. వారు తమ గొర్రెలను మేపేందుకు తరచూ దుశ్చర్ల సత్యనారాయణ అడవిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన మాత్రం అందులోకి ఎవరినీ రానివ్వకుండా చూస్తున్నారు. కాగా గురువారం ఆయన లేని సమయంలో బయ్య లింగయ్య, మేకల కృష్ణయ్య మేకలు, గొర్రెలు మేపుతూ దుశ్చర్ల సత్యనారా యణ అడవిలోని చెట్ల కొమ్మలను నరికి వాటిని మేపుతుండగా.. ఇది గమనించిన దుశ్చర్ల తన అడవిలోకి గొర్రెలను ఎందుకు మేపుతున్నారని గొర్రెల కాపరులను ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బయ్య లింగయ్య ముగ్గురు కుమారులతో పాటు మరికొందరు వచ్చి దుశ్చర్ల సత్యనారాయణపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తాను సృష్టించిన అడవిలో మేకలు, గొర్రెలు ఎందుకు మేపుతున్నారని అడిగితే ‘మా ఇష్టం.. ఇలానే మేపుతాం’ అని బెదిరించారని దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. ఈ 70 ఎకరాల అడవిని కొందరు స్వార్ధపరులు ఆక్రమించుకునేందుకే పథకం ప్రకారం తనను హత్య చేయాలనే దాడికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు పోలీసులు రక్షణ కల్పించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫ తలకు తీవ్ర గాయాలు ఫ సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స -
యూరియా యాప్ను రద్దు చేయాలి
మిర్యాలగూడ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు యూరియా యాప్ ద్వారా రైతులు యూరియా సప్లై చేయడాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 70లక్షల మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అధిక శాతం మంది రైతులు నిరక్ష్యరాస్యులు ఉన్నారని, వీరిలో చాలా మంది రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు లేవని, కొద్దిమంది వద్ద ఉన్నా యూరియా యాప్ను డౌన్లోడ్ చేసుకోని యాప్ ద్వారా బుక్ చేసుకునే పరిజ్ఞానం లేదన్నారు. దీంతో వ్యవసాయాధికారులపై, ప్రైవేట్ నెట్ సెంటర్లపై రైతులు ఆధారపడాల్సి వస్తుందన్నారు. రైతులు తమ వ్యవసాయ పనులు వదిలిపెట్టి యూరియా బస్తాల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ యూరియా యాప్ ఇలానే కొనసాగితే రైతులు బ్లాక్ మార్కెట్ బాట పట్టాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట ఆంగోతు హాతీరాంనాయక్, మట్టపల్లి సైదులు, వేణుగోపాల్రావు, పులి జగదీష్, హమీద్షేక్ తదితరులు ఉన్నారు. ఫ రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఫ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు -
డ్రిప్ పరికరాలు శుభ్రం చేసుకుంటేనే మేలు
పెద్దవూర : బిందు సేద్యానికి ఉపయోగించే డ్రిప్ పరికాలను సకాలంలో శుభ్రం చేసుకోవడం వలన వాటి మన్నిక పెరగడంతో పాటు నీటి పారుదల బాగుంటుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ రైతులకు సూచిస్తున్నారు. వంద అడుగులకు పైగా పడిపోయిన భూగర్భజలాలు, చెరువులు, కుంటలు, వాగుల నుంచి వచ్చే సన్నటి మన్ను, నాచు, ఎరువులు బిందు సేద్యం పరికాలను దెబ్బతీస్తాయని అన్నారు. తద్వారా మోటార్లపై భారం పడి అవి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. డ్రిప్ పరికరాలు ఎలా శుభ్రం చేసుకోవాలో ఆయన మాటల్లోనే.. స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత కీలకంబోరు బావుల నుంచి వచ్చే నీటిలో సన్నటి మట్టి అధికంగా వస్తుంది. దీని వలన లేటరల్ పైపుల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లేటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్ను అమర్చుతారు. దీన్ని వారం రోజులకు ఒకసారి నీటితో శుభ్రం చేయాలి. ఫిల్టర్పై సన్నటి రంధ్రాలు పూడిపోకుండా చూసుకోవాలి. కొత్తగా వేసిన బోర్లు అయితే రోజుకు ఒకసారి అయినా ఫిల్టర్ను శుభ్రం చేసుకోవడం మంచిది. బావుల నుంచి నీటిని తీసుకుంటున్నప్పుడు సాండ్ ఫిల్టర్ను అమర్చుకోవాలి. రెండు ఫిల్టర్ల వలన రెండు దఫాలుగా వడపోత జరిగి లేటరల్ పైపుల్లోకి మట్టి చేరకుండా ఉంటుంది. లేటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్మెంట్డ్రిప్ పరికరాల ద్వారా అందించే ఎరువుల వలన లేటరల్ పైపులకు ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. తద్వారా నీరు కిందికి రావడం నిలిచిపోయి మొక్కలకు నీరు అందదు. ఏడాదికి ఒకసారి పైపులను శుభ్రపర్చుకోవాలి. ఇందుకోసం తక్కువ గాఢత గల హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ను వాడతారు. యాసిడ్ను ఉపయోగించి పైపులను శుభ్రపరిచేందుకు రెండు పద్దతులు పాటించవచ్చు. ఎకరా పొలంలో గల లేటరల్ పైపులను శుభ్రపరిచేందుకు ఒకటి నుంచి రెండు లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం అవుతుంది. పది మీటర్ల హూస్ పైపును తీసుకుని రెండువైపులా కట్టెలను పాతి యూ ఆకారంలో అమర్చాలి. హూస్ పైపునకు ఒకవైపు నుంచి నుంచి నాలుగేసి లేటరల్ పైపులను జాగ్రత్తగా బయటకి తీసుకోవాలి. ఆపై పైపులను రెండు రోజుల పాటు వాడకుండా వదిలేయాలి. మూడోరోజు సబ్ లైన్కు బిగించి నీటిని వదిలేయాలి. ఒకరోజు తర్వాత మొక్కలకు నీరందించడానికి పైపులు బిగించాలి. ● రెండో పద్ధతిలో ఎరువులను వదిలే ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చడం. పంట లేని సమయాల్లో మాత్రమే ఈ పద్ధతిని అవలంబించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకును ముందుగా శుభ్రపర్చుకుని, తక్కువ గాఢత గల యాసిడ్ను, తర్వాత నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియ మెల్లగా జరిగే విధంగా చూడాలి. ఆపై గేట్వాల్వ్లను నియంత్రిస్తూ యాసిడ్ ఉన్న నీటిని మెయిన్ లైన్ గుండా సబ్లైన్ ద్వారా లేటరల్ పైపులకు పంపాలి. ఇందుకోసం ఎక్కడ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇనుప ఫెర్టిగేషన్ ట్యాంకు ఉన్నట్లయితే వెంచురీ సాయంతో లేటరల్ పైపులను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. దీనివలన యాసిడ్ ఉన్న నీరు వెళ్తున్న తీరు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అరగంట పాటు యాసిడ్ ప్రక్రియ సాగితే లేటరల్ పైపులకు ఉన్న చిన్న రంధ్రాల్లో మలినాలు తొలగిపోయి పూర్తి స్థాయిలో శుభ్రపడతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంటలు ఉన్న సమయాల్లో యాసిడ్ ద్వారా పైపులను శుభ్రపర్చరాదు. డ్రిప్ కంపెనీలు సూచించిన యాసిడ్ను వారు నిర్ధేశించిన మోతాదు మేరకే వాడాలి. నీటిలో యాసిడ్ కలపాలి. యాసిడ్ ఉన్న ట్యాంకులో నీరు పోయవద్దు. ఫెర్టిగేషన్ లేదా వెంచురీ సాయంతో యాసిడ్ను పంపేటప్పుడు నీటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైపులు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాపులను తీసేసి యాసిడ్ కలిపిన నీటిని వదిలేయాలి. శుభ్రపరిచిన పైపులను సైతం మళ్లీ ఒకసారి నీటితో కడగడం లేదా సబ్లైన్కు బిగించి నీటిని పారనివ్వాలి. శుభ్రపరిచే సమయాల్లో రైతులు ముఖానికి, చేతులకు తొడుగులు విధిగా ధరించాలి. వీలైతే చలువ కళ్లద్దాలు వేసుకోవడం ఉత్తమం. రసాయనిక ప్రక్రియ కాకుండా అయితే లేటరల్ పైపుల చివరన ఉన్న ఎండ్ క్యాపులను వారానికి ఒకసారి తీసి పది నిమిషాల పాటు నీటిని వదలాలి. తద్వారా లేటరల్ పైపులు శుభ్రపడతాయి. మెయిన్ లైన్ చివరన గల ఎండ్ క్యాపులను సైతం తీసి ఉంచడం వలన నీటిలో గల మలినాలు శుభ్రపడతాయి. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డులో గల కల్వర్టు కింద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి పట్టణంలో భిక్షాటన చేసుకునే గుర్తుతెలియని వ్యక్తి ఎండ వేడిమికి తాళలేక, సరైన ఆహారం లేక గురువారం మధ్యాహ్నం కల్వర్టు కింద మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70157, 87126 70226 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
లారీ డ్రైవర్ అదృశ్యం
కోదాడరూరల్ : కోదాడ మండలంలోని చిమిర్యాలకు చెందిన లారీ డ్రైవర్ అదృశ్యమయ్యాడు. రూరల్ ఎస్సై గోపాల్రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. వేముల శ్రీనివాస్ కోదాడ పట్టణంలోని శ్రీవీరాంజనేయ ట్రాన్స్పోర్టులో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన లారీ డ్రైవింగ్కు వెళ్లి తిరిగి రాలేదు. నాటి నుంచి అతని కోసం తెలిసిన వారిని, బంధువుల ఇళ్లలో, పలు ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు మణికుమార్ కోదాడ రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 86043 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
చిత్రం రవికి లైఫ్ సేవియర్ అవార్డు
పెన్పహాడ్ : మండలంలోని మాచారం గ్రామానికి చెందిన చిత్రం రవికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసరలో 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న రవి గురువారం గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్థ డైరెక్టర్ జీవీకే రెడ్డి, చైర్మన్ కృష్ణంరాజు, రాష్ట్ర హెడ్ సుధాకర్ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో లైఫ్ సేవియర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్డ్ మెడల్, నగదు బహుమతి అందుకున్నారు. గేదెలను అపహరించిన దొంగలుమిర్యాలగూడ : ఇంటి ఆవరణలో కట్టేసిన పాడి గేదెలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన దామరచర్ల మండలం కేశవాపురం గ్రామంలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవాపురం గ్రామానికి చెందిన రైతు ఆలకుంట రాములు తన నాలుగు పాడి గేదెలను రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం ఇంటి ఆవరణలో కట్టేశాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గేదెలకు కట్లు విప్పి కొంతదూరం తీసుకెళ్లి అశోక్ లేలాండ్ వాహనంలోకి ఎక్కించారు. అప్పటికే ఆ వాహనంలో మరో మూడు గేదెలు ఉన్నాయి. వాహనం నెమ్మదిగా వెళ్తుండగా గ్రామస్తులు గమనించి ద్విచక్ర వాహనంపై వెంబడించారు. దీంతో అతివేగంగా నార్కట్పల్లి–అద్దంకి రహదారి పైకి చేరుకుని గుంటూరు వైపు పారిపోయారు. బాధిత రైతు సమీపంలో ఉన్న రై్స్ మిల్లు, పెట్రోల్ బంకుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తెలుపు రంగు వాహనంలో గేదెలు తరలిస్తున్నట్లుగా రికార్డయ్యింది. దీంతో వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు గ్యాస్ సిలిండర్లు స్వాధీనంభువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల టిఫిన్ సెంటర్లలో పట్టణ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను టిఫిన్ సెంటర్లలో వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత హోటళ్ల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ సమీపాన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం గ్రామానికి చెందిన ఎస్కే అబ్దుల్ కపూర్(30) ఖమ్మంలోని ఓ మోటార్ సైకిల్ షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. గత నెల ఉద్యోగం మానేయగా.. గతంలోనే రహదారి ప్రమాదంలో గాయపడిన ఆయన మానసిక ప్రవర్తన సరిగా ఉండడం లేదు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోగా మనోవేదనకు గురవుతున్న కపూర్ పాలేరు రిజర్వాయర్ అలుగుల వద్ద గురువారం చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వేసవిలోనూ నిండుగా కృష్ణా నది
నాగార్జునసాగర్ : ఎండలు మండుతున్న వేళ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉండగా.. నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం కృష్ణానది నిండుగా ప్రవహిస్తుండడంతో కృష్ణపట్టె తండాల వాసులకు వరంలా మారింది. కృష్ణపట్టె పైభాగాన నాగార్జునసాగర్ జలాశయం, దిగువన కృష్ణానది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో నీటికొరత అనే మాటే వినిపించడం లేదు. సాగర్ పైభాగాన సుమారు 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో, అలాగే డ్యాం నుంచి 21.5 కిలోమీటర్ల మేర టెయిల్పాండ్ వరకు నదిలో నీరు సమృద్ధిగా నిల్వ ఉంది. టెయిల్పాండ్ దిగువన పులిచింతల ప్రాజెక్టు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో కూడా నీటినిల్వలు నిలకడగా కొనసాగుతున్నాయి. కృష్ణా తీరం వెంట ఉన్న గిరిజన తండాల వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా, పశువుల సంరక్షణలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో నీటి కొరతతో ఇబ్బందులు పడే మైదాన ప్రాంతాలతో పోలిస్తే కృష్ణా తీరం వెంట జీవనం సాఫీగా కొనసాగుతోంది. రైతులు నదిలో సొంతంగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకోని నీటిని ఎత్తి పొలాలకు చేరవేసుకుంటూ కూరగాయలు, పత్తి, మిరప తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో కృష్ణా నది నిండుగా ఉండటం తమకు ప్రకృతి ప్రసాదించిన వరమని ఆయా తండాల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య కృష్ణాతీర ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. నదీ అందాలు, చుట్టూ ఉన్న వాతావరణం సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఫ కృష్ణపట్టె తండాల వాసులకు నీటి ఎద్దడి నుంచి ఉపశమనం ఫ పశువులకు, పంటలు పండించేందుకు ఉపయోగపడుతున్న నీరు -
బస్సుల్లేక ఇబ్బందులు
యాదగిరి క్షేత్ర దర్శనానికి మంగళవారం వచ్చాం. బుధవారం ఉదయం ఇంటికెళ్దామని బస్టాండ్కు వస్తే బస్సుల్లేవు. మధ్యాహ్నం వరకు చూసినా ఒక్క బస్సు రాలేదు. సమ్మె కారణంగా బస్సులు నడిపిస్తలేరని తెలిసింది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. – మాధవి, కామారెడ్డి, ప్రయాణికురాలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి జేఏసీ నాయకులతో చర్చించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. – ప్రభాకర్రెడ్డి, జేఏసీ నాయకుడు, యాదగిరిగుట్ట డిపో -
డిప్లొమా కోర్సులపై 26న అవగాహన సదస్సు
భువనగిరి : నల్లగొండ బీడీఎఫ్, మైత్రి అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా ట్రస్మా సహకారంతో పదోతరగతి విద్యార్థులకు డిప్లొమా కోర్సులపై ఈ నెల 26న భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదిర మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ మాక్ టెస్ట్ నిర్వహించబడుతుందని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యాదగిరిగుట్ట : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యాదగిరిగుట్ట డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదనానరు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న పే స్కేల్, పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనియన్లను పునరుద్ధరించి, ప్రైవేట్ వ్యక్తులకు ఆర్టీసీని ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, కొల్లూరి రాజయ్య, పేరబోయిన మహేందర్, గోరేటి రాములు, కల్లేపల్లి మహేందర్, పేరబోయిన బంగారి, సామల భాస్కర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగ, ప్రభాకర్రెడ్డి, వెంకన్న, జాల నర్సింహ, వెంకటేష్, కిషోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదగిరిగుట్ట : మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ ప్రభు త్వ కుట్రలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టులో వందలాది కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, కేవలం రెండు పిల్లర్లు కుంగితే రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా చేసిన గోబెల్స్ ప్రచారానికి ఈ తీర్పుతో ప్రజలకు నిజాలు తెలిశాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి తెలంగాణకు ప్రాణేశ్వరమని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలిమోత్కూరు : టైలరింగ్లో శిక్షణ తీసుకున్న మహిళలు దాంతో స్వయం ఉపాధి పొందాలని డీఆర్డీఏ ఏపీడీ కె.జంగారెడ్డి అన్నారు. మో త్కూరు మండల కేంద్రంలోని బుధవారం సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పొవర్టీ) వారి సహకారంతో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రగతి టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్లో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాలకు చెందిన 50 మంది స్వయం సహా యక సంఘాల మహిళలకు స్కూల్ యూనిఫామ్ కటింగ్ స్కిల్స్పై నాలుగు రోజుల శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే నెలలోగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టి అందజేయాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం రవీందర్, ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రమణ మేడం, మోత్కూరు ఏపీఎం పక్కీరయ్య, ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నాంచారమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలి
భూదాన్పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో ఈ నెల 29 నుంచి మే 1వ తేదీ వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఎరుకల నాంచారమ్మ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఓ నాగిరెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎరుకల నాంచారమ్మ బోనాల జాతరపై వివిధ శాఖల అధికారులు, సర్పంచ్, ఎరుకలి సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మాజిద్, సర్పంచ్ పెరుమాండ్ల మహాలక్ష్మిదానయ్య, ఏఈలు శ్రీనివాస్, జగపతి, సాయినాథ్రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండమడుగు శ్రీనివాస్, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, నాయకులు కుతాడి మల్లేశ్, కుతాడి మహేశ్, కుతాడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. సాయంత్రం ఆలయ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
సాక్షి, యాదాద్రి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఇందిరమ్మ ఇళ్లడ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్ష సమావేశం, అనంతరం డీఈఓతో బడిబాట సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే స్లాబ్ లెవెల్ పూర్తయిన వాటికి గృహప్రవేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. గత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలల వివరాలు తెలియజేసి, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖధికారి కె.సత్యనారాయణ, మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి
బొమ్మలరామారం : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలం మాచన్పల్లి, మర్యాల, నాయకునితండా, చౌదర్పల్లి, పిల్లిగుండ్ల తండా, రామస్వామి తండా, సోలిపేట్ గ్రామాల్లో హెచ్ఎండీఏ నిధులు రూ.7.36కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్ధాపన చేసి మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్ర స్ధానంలో నిలబెడతానన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోసమే తనపై బురద చల్లుతున్నారన్నారు. రాజాపేట మండలంలోని స్టోన్ క్రషర్తో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం పలు గ్రామాల్లో పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేసి లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు, యాటపోతులను అందజేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్, తహసీల్ధార్ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ శ్యామల, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ మోకు మధుసూదన్రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దాసరి సూర్యప్రకాష్రెడ్డి, ఆయ గ్రామాల సర్పంచ్లు సంగి గణేష్, శ్రీనివాస్ నాయక్, భిక్షపతి, పావని, మంగ్తానాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్, శ్రీరాములు నాయక్, రామిడి జంగారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి తిరుమల కవిత, పడమటి పావని, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు యంజాల కళ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
బడులకు భద్రత కల్పించేలా..
భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల భద్రతపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లో పాఠశాల భవనాలతోపాటు అందులో ఉండే వివిధ పరికరాలు, సామగ్రిని కాపాడుకోవడం విద్యా శాఖకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల భద్రత, పర్యవేక్షణ కోసం రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు చేరవేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. మరలా 2026–27 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని పాఠశాలల భద్రత నిమిత్తం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే జిల్లా వ్యాప్తంగా 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా పరిషత్లతో కలిపి మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదేశాలు ఇలా.. ఫ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రయోగశాల పరికరాలు, క్రీడా సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు, వాయిద్యాలు వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి. ఫ సైన్స్, కంప్యూటర్ల ల్యాబ్లలో ఉన్న వివిధ పరికరాలపై నిఘా పెట్టాలి. ఫ మధ్యాహ్న భోజనం కోసం నిల్వ ఉన్న బియ్యం, ఫ నీటిశుద్ధి యంత్రాలు, మోటార్లు చోరీకి గురికాకుండా జాగ్రత్తగా భద్రపర్చాలి. ఫ తాత్కాలికంగా రాత్రి సమయంలో కాపలదారులను నియమించుకోవాలి. విద్యా శాఖ, పాఠశాల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలి. ఫ విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలపై కవర్లు కప్పాలి. ఫ రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఫ కంప్యూటర్లలో ఉన్న డేటాను బ్యాకప్ చేసుకోవాలి. ఫ ల్యాబ్లోని రసాయనాలకు సరిఝైన లేబుల్ వేసి భద్రంగా ఉండే ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఫ పాఠశాలల ప్రధాన గేట్లకు, గదులకు నాణ్యమైన తాళాలు వేయాలి. ఫ ప్రతి పాఠశాల వద్ద సంబంధిత మండల పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ ప్రదర్శించాలి. ఫ వేసవి సెలవుల్లో పర్యవేక్షణకు విద్యా శాఖ ఆదేశాలు ఫ ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని తొలిసారి ఉత్తర్వులు ఫ జిల్లా వ్యాప్తంగా మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు -
ఎంపీడీఓలకు ‘ఎన్ఎఫ్బీఎస్’ బాధ్యత
భువనగిరిటౌన్ : పేద కుటుంబాల్లో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) నిర్వహణ బాధ్యతల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకం బాధ్యతలను చూస్తున్న రెవెన్యూ శాఖ (తహసీల్దార్లు) నుంచి తొలగించి ఇకపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాప్యానికి చెక్ పెట్టేందుకే.. ఇప్పటివరకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే బాధిత కుటుంబాలు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అయితే, రెవెన్యూ అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయి విచారణలు, నివేదికల తయారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల లబ్ధిదారులకు సకాలంలో సాయం అందడం లేదని భావించి, పాలనను ప్రజలకు మరింత దగ్గర చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తు విధానం ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై లబ్ధిదారులు తమ దరఖాస్తులను నేరుగా గ్రామ పంచాయతీల్లో సమర్పించవచ్చు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఎంపీడీఓలకు నివేదిస్తారు. వీటిఆధారంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు నిధులను మంజూరుకు నివేదిస్తారు. దీనివల్ల బాధితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పనుంది. ఫ రెవెన్యూ నుంచి పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం ఫ పని ఒత్తిడి తగ్గించి, జాప్యాన్ని నివారించేందుకు నిర్ణయం ఫ గ్రామ పంచాయతీల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కుటుంబానికి ఆధారమైన వ్యక్తి 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు ఉండి మరణించి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల వారు మాత్రమే దీనికి అర్హులు. అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20వేల నగదు సాయాన్ని ఒకేసారి అందిస్తుంది. -
విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
రామన్నపేట : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాలను ఎదగాలని డీఈఓ సత్యనారాయణ సర్పంచ్లు కూనూ రు సాయికుమార్, పైళ్ల చందన వెంకట్రెడ్డి అన్నా రు. బుధవారం బోగారం, ఇస్కిళ్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బోగారం సర్పంచ్ సాయికుమార్ వి ద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహ పరి చారు. కార్యక్రమాల్లో సర్పంచ్ పైళ్ల చందన, సుమధుర ఫౌండేషన్ ప్రతినిధి జీవన, ఉపసర్పంచ్ బి. ఉమ, కాంప్లెక్స్ హెచ్ఎం డి.స్వామి హెచ్ఎంలు శ్రీనివాస్, వెంకట్రెడ్డి, ఏఏపీసీ చైర్పర్సన్ పి.జ్యోతి, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, సురేష్, శ్రీల త, శేఖర్, సదానందం, భార్గవి, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధవనాన్ని సందర్శించిన ఏఎస్ఓలు
నాగార్జునసాగర్ : కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓల) బృందం సోమవారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించింది. కేంద్ర సర్వీస్లో నూతనంగా నియమితులైన వీరు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా కోఆర్టినేటర్ కవిత ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు. తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ బుద్ధుడి విగ్రహాలు, చైత్యాలు, సింహళవిహారం తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం బుద్ధవనంలోని బుద్ధచరితవనం, జాతకవనం, స్థూపపార్కు, ధ్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు. మహాస్థూపంలో పంచముఖ బుద్ధుల వద్ద బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర వారితో ధ్యానం చేయించారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ ఇక్కడి విశేషాలను వారికి వివరించారు. వారి వెంట పెద్దవూర ఆర్ఐ దండ శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
కోడలి ఆత్మహత్య కేసులో మామ అరెస్టు
నల్లగొండ: కోడలిని మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో మామను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. సోమవారం నల్లగొండ టూటౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సైదులుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్యకు ఐదు నెలల క్రితం పానగల్కు చెందిన శివశంకర్తో వివాహమైంది. భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రె లింగయ్య తరుచూ కోడలిని వేధించేవాడు. ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టడం, అవమానిస్తూ మానసికంగా హింసించేవాడు. నువ్వు చస్తే నా కొడుక్కు మంచి భార్య వస్తుందని వేధించేశాడు. వేధింపులు భరించలేక ఐశ్వర్య పానగల్లోని ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేశామని సీఐ తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ 95,108 కింద కేసులు నమోదు చేశామని, నిందితుడు లింగయ్యను సోమవారం అరెస్టు చేసి సెల్పోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించామన్నారు. -
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు అరెస్టు
సూర్యాపేట టౌన్ : గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆత్మకూరు(ఎస్) గ్రామ శివారులో క్రషర్ మిల్లు వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రాగా వెంటనే ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి నెమ్మికల్కు చెందిన వీరబోయిన భరత్ జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన ఆరె విజయ్, సూర్యాపేట మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన చెవుల మనోజ్, అలాగే నెమ్మికల్ గ్రామానికి చెందిన కొడిదల శివలుగా గుర్తించారు. వీరిని తనిఖీ చేయగా వారి వద్ద 5 కిలోల గంజాయి, కారు, బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జలసాలకు, విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో గంజాయి వినియోగించే అలవాటు ఉండడంతో గంజాయిని తెచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం భరత్, విజయ్, మనోజ్ ముగ్గురు కలిసి కొడిదల శివకు చెందిన మోటార్ సైకిల్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్లి సీలేరు ఏరియాలో గంజాయిని కొనుగోలు చేసి తెచ్చారు. ఈ గంజాయిని పంచుకోవడం కోసం నలుగురు ఆత్మకూరు(ఎస్) గ్రామ శివారు క్రషర్ మిల్ వద్దకు రాగా సమాచారం అందుకున్న మండల పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు శ్రమించిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. నిందితుల నుంచి ఐదుకిలోల గంజాయి స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ -
గడ్డిమందు తాగి వ్యక్తి బలవన్మరణం
చిట్యాల : భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవలతో మనస్థాపానికి గురైన భర్త గడ్డిమందు తాగి ఆదివారం మృతిచెందగా సోమవారం కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన పనస కృష్ణ(52) తన భార్య నీలమ్మతో కలిసి రెండేళ్లుగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని యర్రమాద రమణారెడ్డికి చెందిన మామిడి తోటలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో కృష్ణ మద్యం ఎక్కువగా సేవిస్తూ వస్తుండడంతో అతని భార్య నీలమ్మతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా ఈనెల 18న భార్యభర్తల మద్య గొడవ జరిగి నీలమ్మ తన అమ్మగారి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ ఆదివారం ఉదయం గడ్డి మందు తాగాడు. గుర్తించిన స్థానికులు అతన్ని వెంటనే నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదేరోజు రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుభూదాన్పోచంపల్లి : భూదాన్పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోడ సత్యనారాయణ అనే వ్యక్తి గాయపడ్డాడు. సోమవారం ఉదయం ఆసుపత్రి సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద బైక్ను యూటర్న్ తీసుకొంటున్న క్రమంలో డివైడర్ మధ్యన ఏపుగా పెరిగిన మొక్కల వల్ల కన్పించక పద్మానగర్ నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై నుంచి సత్యనారాయణ కింద పడడంతో కాళ్లు, కణత భాగంలో గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు హైదారాబాద్కు తరలించారు. మెయిన్ రోడ్డులోని యూటర్న్ల వద్ద ప్రమాదాలకు కారణమవుతున్న డివైడర్ల మధ్యన పెరిగిన మొక్కలను కట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ‘ప్రీమియర్’లో అగ్ని ప్రమాదం.. ఇద్దరికి గాయాలుయాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని ప్రీమియర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద కంకూరు గ్రామానికి చెందిన మిరియాల క్రాంతికుమార్ అనే వ్యక్తి ఉదయం షిఫ్ట్లో సీ 11 ఎల్ 3 బ్లాక్లో రోజువారిగానే తమ విధులు నిర్వహిస్తున్నాడు. ప్రొడక్షన్కు సంబంధించిన రా మెటీరియల్ కెమికల్ను షిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రాంతికుమార్ అనే వ్యక్తి చేతికి, మొహానికి మంటలు అంటుకొని గాయాలయ్యాయి. తనతోపాటు పనిచేస్తున్న తోటి కార్మికుడు ఎల్లయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన ఇతర కార్మికులు, కంపెనీ అధికారులు మంటలను ఆర్పి గాయాలైన వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం ఎలా జరిగిందని పరిశ్రమ అధికారిని వివరణ అడగగా.. ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో ఏమి జరుగుతుందో తెలియదని సమాధానం ఇచ్చారు. -
పురుగుల అన్నం మాకొద్దు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్యాంటిన్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు వచ్చాయని, ఈ పురుగుల అన్నం మాకొద్దని సోమవారం యూనివర్సిటీ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ఆరోగ్యంలో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లేదని, పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అజయ్, సంపత్, సతీష్, విజయ్, వెంకటేష్, సుధీర్, అరవింద్, పృథ్వి, సాయి, గోపి, ప్రణయ్ పాల్గొన్నారు. ఎంజీయూలో విద్యార్థుల ఆందోళన -
ఐర్లాండ్లో శివారెడ్డిగూడెం వాసి మృతి
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మేకల ప్రభోద్రెడ్డి (53) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐర్లాండ్ దేశంలో ఈ నెల 9న అనారోగ్యంతో మృతిచెందగా, 11 రోజుల తరువాత సోమవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మేకల ప్రభోద్రెడ్డి ఉన్నత చదువులు చదివి 20 సంవత్సరాల క్రితం ఐర్లాండ్ దేశానికి వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఇటీవల అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఐర్లాండ్లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 9న మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని అక్కడే ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ప్రభోద్రెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం స్వగ్రామమైన శివారెడ్డిగూడెంకు తరలించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రభోద్రెడ్డి సొంతూరులో ఎనిమిదేళ్లుగా సొంత డబ్బులతో హెల్త్క్యాంపులు నిర్వహించారు. ఆయన చేసిన సామాజిక సేవలను గ్రామస్తులు గుర్తుచేసుకొని విలపించారు. కాగా ప్రభోద్రెడ్డి మృతదేహాన్ని మాజీ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, సర్పంచ్ బొక్క మల్లారెడ్డి, ఉపసర్పంచ్ చిలుకల సంతోష్, మాజీ సర్పంచ్ పీసర్ల మంజుల మహిపాల్రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు మందాడి సుమతి, 1989 స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఎస్సెస్సీ పూర్వ విద్యార్థులు సందర్శించి నివాళులర్పించారు. 11 రోజుల తరువాత స్వగ్రామానికి చేరిన మృతదేహం -
ఆర్టీసీ పరిరక్షణకు సమష్టిగా కృషిచేద్దాం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ పరిరక్షణకు సమష్టిగా కృషిచేద్దామని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నేత తన్నీరు పాండురంగయ్య అన్నారు. ఈనెల 22 నుంచి చేపట్టనున్న ఆర్టీసీ సమ్మె పోస్టర్ను సోమవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆ జేఏసీ చైర్మన్ నర్సింహ, జేఏసీ కన్వీనర్ సోమయ్య, వైస్ చైర్మన్ వెంగల్రెడ్డి, ఇన్చార్జిర్జీ చంద్రశేఖర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మెకు ఎస్డబ్ల్యూఎఫ్, టీఎంయూ, ఎన్ఎంయూ, టీఆర్ఎస్కేవీ, బీఎంఎస్, ఎస్టీఎంయే, టీడబ్ల్యూయూ కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డీవీ రత్నం, జి. శ్రీనివాస్, కోటయ్య, పీఎన్ రావు, రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, జ్యోతి, సుజాత, కొండలు, రమేష్, శ్రీనివాస్, అశోక్, బాలునాయక్, తీవారి తదితరులు పాల్గొన్నారు. -
వేసవి దుక్కులతో ఎన్నో లాభాలు
పెన్పహాడ్ : వేసవి దుక్కులు దున్నడంతో అనేక ప్రయోజనాలుంటాయి. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడపీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కులతో వర్షపు నీరు భూమి లోతుల్లోకి వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు ముందస్తు ప్రణాళికతో సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. వేసవిలో భూములను లోతులతో పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు చనిపోతాయి. వానాకాలం సీజన్ ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే వేసవి దుక్కులు దున్నుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్కుమార్ అంటున్నారు. భూసారం పెంపుకోసం వేసవిలో చేపట్టాల్సిన పనులపై రైతులకు ఆయన ఇచ్చే సూచనలు. లోతు దుక్కులతో ప్రయోజనం ఇలా..● లోతు దుక్కులు దున్నడం చాలా ఉపయోగం. 35–40 సెంటీమీటర్ల లోతుగా దుక్కి చేయడంతో భూమిలో గట్టిపొర పగిలి నేల బాగా గుల్లబారుతుంది. ● వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. ● ఇంకిన నీరు భూమిలో నిలువ ఉండడంతో పంట వేర్లు లోపలి పొరల్లో పెరిగి ఎక్కువ నీటిని, పోషక పదార్థాలను గ్రహించడానికి వీలవుతుంది. ● లోతుగా దున్నిన దుక్కి ప్రభావం 2–3 సంవత్సరాల వరకు ఉండడంతో పంటల దిగుబడులకు భూములు అనుకూలంగా ఉంటాయి. ● వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి నేల అనుకూలంగా ఉంటుంది. ● పంటకోత తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకులు వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్ని లోతు – దుక్కి దున్నిన్నప్పుడు నేలలో కలిసి కుళ్లిపోతాయి. దీంతో నేలసారం పెరుగుతుంది. పశువుల మంద కడితే చాలా మేలు..గతంలో ప్రతి రైతు ఎద్దులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలను రాత్రిళ్లు పొలంలో కట్టేసేవారు. అయితే వాటి మలమూత్రాలు పొలానికి చేరి పంటలకు ఉపయోగపడేవి. దీంతో ఎరువులు ఖర్చు తగ్గేది. ఇప్పుడు పశువుల పెంపకాలు తగ్గిపోయాయి. పశుగణం ఎక్కువగా ఉంటే గ్రామాల్లో ఈ పని ఇప్పటికై నా చేయొచ్చు. పశువుల ఎరువు అందించడంతో ఉత్పత్తులను లాభాసాటిగా సాధించవచ్చు. మొండిజాతి కలుపు నివారణ, తుంగ, గరిక వంటి మొండిజాతి కలుపు మొక్క పొలంలో పెరిగి పంటలకు నష్టం కలుగజేస్తుంటాయి. వీటితో వేర్లు, కాయలు, దుబ్బలు నేలలో బాగా విస్తరించి ఉండడంలో నివారణ కష్టం అవుతుంది. పశువుల ఎరువు ఉపయోగించడం వల్ల పంటలు ఏపుగా పెరిగి కలుపు మొక్కలు అంతగా పెరిగే అవకాశం ఉండదు.ఫ పంటకు హానిచేసే కీటకాల నివారణ ఫ వర్షపు నీరు లోతుకు చేరే అవకాశం ఫ పెన్పహాడ్ వ్యవసాయాధికారి అనిల్కుమార్ -
విచారణకు తీసుకొస్తుండగా మృతి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని జేజేనగర్లో ఈ నెల 18న ఇరుగు పాపమ్మ (80) అనే వృద్ధురాలిని హత్య చేసి బంగారు దోచుకెళ్లిన నిందితుడిని ఏపీలోని ఏలూరులో అరెస్టు చేసి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శివకోటి సైదులాచారి(46) సంవత్సర కాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేజేనగర్లో కుటుంబంతో ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేస్తుంటాడు. సైదులాచారికి ఇద్దరు కుమారులు కాగా.. ఒక కుమారుడు మిర్యాలగూడలో ఉంటుండగా మరో కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు సమీపంలో గాయాలగూడెంలో ఉంటున్నాడు. సైదులాచారి భార్య మూడు నెలల క్రితం అతనితో గొడవపడి వెళ్లిపోయింది. వృద్ధురాలిని హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు.. మద్యానికి బానిసైన సైదులాచారి.. తను ఉండే అద్దె ఇంటి సమీపంలో వృద్ధురాలైన పాపమ్మ వద్ద బంగారం ఉన్న విషయాన్ని కనిపెట్టి ఆమె బంగారాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 18న శనివారం మధ్యాహ్నం సమయంలో పాపమ్మ ఇంట్లో ఒక్కతే ఉన్న విషయాన్ని కనిపెట్టి ఇంట్లోకి ప్రవేశించి పాపమ్మను హత్య చేసి ఆమె వద్ద ఉన్న నల్లపూసల గొలుసు, దిద్దులు, మాటీలు మొత్తం మూడు తులాల బంగారాన్ని దోచుకుని తన సొంతూరైన మిర్యాలగూడకు వెళ్లి అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని కుదవపెట్టాడు. అక్కడి నుంచి తన కుమారుడు ఉంటున్న ఏలూరుకు వెళ్లాడు. వృద్ధురాలి హత్య, బంగారం చోరీపై దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడు ఏలూరులో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం అక్కడికి వెళ్లారు. విచారణ కోసం పోలీస్ ప్రత్యేక బృందం నిందితుడు సైదులాచారిని అరెస్టు చేసి సూర్యాపేటకు తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి కోదాడ సమీపంలోకి రాగా సైదులాచారి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే పోలీసులు కోదాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే నిందితుడు మృతిచెందాడు వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని సూర్యాపేట పోలీసులు ఏలూరు నుంచి తీసుకొస్తుండగా కోదాడ సమీపంలో గుండెపోటుతో మృతి చెందినట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధురాలిని హత్య చేసిన అనంతరం సైదులాచారి మిర్యాలగూడకు వెళ్లి అతని బావమరిది ఆనంద్ సహాయంతో బంగారాన్ని ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో కుదవపెట్టి రూ.1,44,900 తీసుకున్నట్టు తెలిపారు. ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి అక్కడి నుంచి తన చిన్న కుమారుడు ఉంటున్న ఏలూరులోని గాయాలగూడెంకు వెళ్లినట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సూర్యాపేటలో వృద్ధురాలిని హత్య చేసి దొంగతనం చేసినట్టు తెలుసుకున్న ఆనంద్.. వెంటనే సూర్యాపేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం మేరకు సూర్యాపేట పోలీసులు ఆదివారం ఏలూరుకు వెళ్లి అక్కడ నిందితుడిని పట్టుకొని అతడి కుమారుడిలో సమక్షంలో విచారించగా దొంగతనం ఒప్పుకున్నట్టు ఎస్పీ చెప్పారు. దీంతో అక్కడి నుంచి సూర్యాపేటకు విచారణ నిమిత్తం తీసుకొస్తుండగా కోదాడ సమీపంలోకి రాగానే ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సైదులాచారి అస్వస్థతకు గురి కాగా వెంటనే పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు చెప్పారు. నిందితుడికి గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని, మరోసారి గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వృద్ధురాలి హత్య కేసులో ఏలూరులో నిందితుడి అరెస్టు రాత్రి కోదాడ సమీపంలోకి రాగానే సైదులాచారికి అస్వస్థత గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్పీ నరసింహ వెల్లడి -
ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్
కొండమల్లేపల్లి : ద్విచ్ర వాహనాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కొండమల్లేపల్లి సీఐ నవీన్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అజ్మీరా రమేష్తో కలిసి సీఐ వెల్లడించారు. నిడమనూరు గ్రామానికి చెందిన మాదగోని ముఖేష్ 30 సంవత్సరాలుగా లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9న అర్ధరాత్రి కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ముఖేష్ మరో వ్యక్తితో కలిసి రెండు ద్విచక్ర వాహనాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం వాహనాల తనిఖీ సందర్భంగా ద్విచక్ర వాహనంపై హాలియా నుంచి హైదరాబాద్కు వెళ్లే ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా అనుమానం రావడంతో విచారించగా బైక్లను దొంగలించినట్లు ఒప్పుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేయగా ఇద్దరు వ్యక్తులలో ముఖేష్ పట్టుబడి కాగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టీ హేమునాయక్, భాస్కర్లను సీఐ అభినందించారు. -
వంద శాతం పన్ను వసూలుపై దృష్టిపెట్టాలి
ఆలేరు: లక్ష్యం మేరకు పన్నుల వసూలుపై దృష్టిసారించాలని ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజనబాలమణిభాస్కర్కు కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మిస్ట్రేటివ్ (సీడీఎంఏ) శ్రీదేవి సూచించారు. సోమవారం చైర్పర్సన్ బాలమణి సీడీఎంఏను హైదరాబాద్లోని తన కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా మున్సిపాలిటీలో ముఖ్యఅధికారుల కొరత, రూ.15కోట్ల నగరాభివృద్ధి, మరో రూ.15కోట్ల టీయూఎఫ్ఐడీసీ ఇలా మొత్తం రూ.30కోట్ల నిధులతో పట్టణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని సీడీఎంఏను చైర్పర్సన్ కోరారు. ఏఈ, టీపీఓ, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర ముఖ్య అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను చైర్పర్సన్ ఆమెకు వివరించారు. అనంతరం సీడీఎంఏ మాట్లాడుతూ ఆస్తి, కుళాయి తదితర పన్నుల వసూలు వందశాతం వసూలు చేసేలా చూడాలని చైర్పర్సన్కు సూచించారు. ప్రభుత్వ గ్రాంట్లతోపాటు మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి పన్నుల రూపంలో సొంత నిధులను సమకూర్చుకోవాలన్నారు. పరిపాలనపై పూర్తి పట్టుసాధించినప్పుడు పురోగతి సాధ్యమవుతుందని సీడీఎంఏ పేర్కొన్నారు.అనంతరం చైర్పర్సన్ పలు శాఖల అధికారుల నియామకం కోసం ఈఎన్సీ, అడిషనల్ డీటీసీపీలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. -
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు
వలిగొండ : అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి సూచించారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లలో లోపాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ నర్సింహ, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ ప్రశాంత్, పంచాయతీ రాజ్ ఏ ఈ సందీప్ రెడ్డి, ఏఈ రమ్య పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. -
పకడ్బందీగా మ్యాపింగ్
సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఎస్ఐఆర్పై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పాల్గొని మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి ,భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్ , ఎలక్షన్సెల్ సూపరింటెండెంట్ కృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 22 వరకు పాలిసెట్కు దరఖాస్తులుయాదగిరిగుట్ట: ఈ నెల 22వ తేదీ వరకు పాలిసెట్కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. అంతే కాకుండా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్రీ పాలిసెట్ కోచింగ్ సైతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపుభువనగిరి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించినట్లు డీఐఈవో రమణి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 20తో ముగిసిందని దీనిని ఈ నెల 23 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కీటక జనిత వ్యాధులను అరికట్టాలిభువనగిరి: వివిధ శాఖలు సమన్వయంతోపని చేసి కీటక జనిత వ్యాధులను అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నీటి నిల్వలు, మురుగు నీటి కాల్వల్లో నీరు నిల్వ ఉండా చూసుకోవాలని ఆదేశించారు. నీరునిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దీంతో వ్యాధుల బారినపడతారని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో నాగిరెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు వంశీకృష్ణ, రామకృష్ణ, వీణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి: భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులోఉన్నట్లు వివరించారు. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 08685–295500 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఫైళ్లన్నీ పెన్డ్రైవ్లోనే..
సాక్షి, యాదాద్రి : దుమ్ముపట్టిన ఫైళ్లు.. పేపర్ల కుప్పలు.. పాలనలో జాప్యం.. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని టోకెన్ నంబర్లు, డిజిటల్ సంతకాలతో కూడిన సరికొత్త పాలనా వ్యవస్థకు కలెక్టరేట్లో శ్రీకారం చుట్టునున్నారు. పనుల్లో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి డిజిటల్ ఫైలింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. టోకెన్ నంబర్లే అధికారుల గుర్తింపు ఈ కొత్త విధానం కోసం కలెక్టరేట్లోని ప్రతి విభాగం, ప్రతి అధికారికి ఒక ప్రత్యేకమైన టోకెన్ నంబర్ కేటాయించారు. ఈ నంబర్లతో కూడిన ప్రత్యేక పెన్ డ్రైవ్లను ఇప్పటికే పంపిణీ చేశారు. గతంలో ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కు భౌతికంగా ఫెళ్లు వెళ్లేవి. ఇకపై ఆ అవసరం లేకుండా, సమాచారాన్ని డిజిటల్ రూపంలో పెన్ డ్రైవ్లో నిక్షిప్తం చేసి పంపిస్తారు. ప్రక్రియ సాగుతుందిలా.. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న ఈ ప్రక్రియలో అధికారులు మూడు దశల్లో పని చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చే దరఖాస్తులు లేదా నివేదికలను కంప్యూటరీకరించి పెన్ డ్రైవ్లో భద్రపరుస్తారు. పెన్ డ్రైవ్ అందుకున్న అధికారి తన కంప్యూటర్లో ఫైల్ను తనిఖీ చేస్తారు. పెన్నుతో సంతకం చేసే అవసరం లేకుండా, వారికి కేటాయించిన డిజి టల్ సిగ్నేచర్ ద్వారా ఆమోద ముద్ర వేస్తారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి అదనపు కలెక్టర్, కలెక్టర్ వరకు ఇదే పద్ధతిలో పెన్ డ్రైవ్ల ద్వారా ఫైళ్లు బదిలీ అవుతాయి. శిక్షణ పూర్తి.. ఇక అమలుపై దృష్టి ఈ నూతన విధానంపై ఇప్పటికే కలెక్టరేట్ సిబ్బందికి, వివిధ శాఖల అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫ్ట్వేర్ పకడ్బందీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.కలెక్టరేట్లో డిజిటల్ విధానంలో మరో ముందడుగు ఫ పారదర్శకత, వేగవంతమైన పాలనకు డిజిటల్ఫైలింగ్ సిస్టమ్ ఫ అధికారులకు టోకెన్ నంబర్లు, డిజిటల్ సంతకాల కేటాయింపు ఫ వచ్చేనెల 1 నుంచి అమలు ఈ డిజిటల్ సంస్కరణల వల్ల ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉంటాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్కు వెళ్లడానికి పట్టే సమయం ఆదా అవుతుంది. ఫలితంగా ప్రజలకు అందే సేవలు వేగవంతమవుతాయి. ఏ అధికారి వద్ద ఫైల్ ఎంత సమయం ఆగిందో డిజిటల్ లాగ్స్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల పనిలో జాప్యం తగ్గుతుంది. ఏటా వేల సంఖ్యలో వినియోగించే కాగితాల వినియోగం తగ్గి, కార్యాలయాలు పరిశుభ్రంగా మారుతాయి. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించడంలో అలసత్వం వహించవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి ప్రజల నుంచి 55 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, మున్సిపాలిటీ 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, జిల్లా పంచాయతీ 2, జిల్లా విద్యా శాఖ 2, కో–ఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలవి ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టరు భాస్కర్రావు -
మహిళా బిల్లుపై మోదీకి చిత్తశుద్ధిలేదు
భువనగిరిటౌన్ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య విమర్శించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శవర్గ సభ్యుడు మాటూరు బాలరాజు అధ్యక్షతన భువనగిరిలో నిర్వహించిన మండల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, బాధ్యుల సమావేశంలో మాట్లాడారు.మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ఒకేసారి తీసుకురావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డీ లిమిటేషన్ బిల్లు సాకుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకపోవడం మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ , బోలగాని జయరాములు, బొడ్డుపల్లి వెంకటేష్, గడ్డం వెంకటేష్ , ఎంఏ ఇక్బాల్, మద్దెపురం రాజు, నాయకులు అవ్వరి గోవర్ధన్, ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, గంటపాక శివ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత సంఘాల్లో సభ్యత్వాల లొల్లి
మగ్గం నేసే వారికి మొండిచేయి ఫ అనర్హులకు చోటుఫ సహకార ఎన్నికల వేళ అధికారులకు కార్మికుల ఫిర్యాదులు ఫ జిల్లాలో 58 సంఘాలుసాక్షి, యాదాద్రి: చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వాల లొల్లి ముదురుతోంది. దశాబ్దాలుగా మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నేతన్నలకు సభ్యత్వం దక్కడం లేదు. కానీ, మగ్గం ముట్టని వారికి మాత్రం సభ్యత్వాలు కట్టబెడుతున్నారు. చేనేత సంఘాల ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో తమ అధికారాన్ని కాపాడుకునేందుకు కొందరు పాలకవర్గ నేతలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. జనరల్ బాడీ ఆమోదం లేకుండా, ఏడీ అనుమతి రాకుండానే కొత్త సభ్యత్వాల పేరిట తమ అనుయాయులను చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన తమకు న్యాయం చేయాలంటూ నేతన్నలు కలెక్టరేట్ మెట్లెక్కుతున్నారు. ఫిర్యాదుల పరంపర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈనేపథ్యంలో ఓటరు జాబితాలను ప్రకటించారు. జాబితాలపై ఈనెల 18 నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, భువనగిరి చేనేత సహకార సంఘాల తీరుపై స్థానిక కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సభ్యుల జాబితాలో 18 ఏళ్ల లోపు వారు, అర్హత లేని వారు ఉన్నారని, కొన్ని సంఘాల్లో మరణించిన వారి వారసులకు సభ్యత్వాలు ఇవ్వడం లేదని కార్మికులు అదనపు కలెక్టర్, ఏడీ చేనేత జౌళి శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి సభ్యత్వాలను నిబంధనల ప్రకారం తొలగించపోవడంతో ఇతర ప్రాంతాలకు మార్పులు చేయకపోవడంతో సాధారణ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, శిక్షణా కార్యక్రమాలను కోల్పోతున్నారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన వారిలో నాగరాజు, పున్న వెంకటేశం, రాపోలు ప్రభాకర్, భారత మత్యుంజయ, గంజి శ్రీనివాస్, ముడుదుడ్ల రమేష్, కడవేరు శ్రీనివాస్, సంగిశెట్టి గణేష్, పొట్టబత్తుల వెంకటేష్ తదితరులు ఉన్నారు. 9 సంఘాలకు క్యాష్ క్రెడిట్ జిల్లాలో 58 సహకార సంఘాలుండగా ఇందులో 13,550 మంది వరకు సభ్వత్వం కలిగి ఉన్నారు. ఇందులో 16 సిల్క్, 28 కాటన్, నాలుగు పవర్ లూమ్ సంఘాలు ఉండగా ప్రస్తుతం జిల్లాలో 9 సంఘాలకు మాత్రమే క్యాష్ క్రెడిట్ వచ్చింది. పలు సంఘాల దివాళా తీశాయి. మరికొన్ని సంఘాలకు ఏళ్లుగా ఆడిట్ కూడా చేయించలేదు. అలంకారప్రాయంగా మారిన సంఘాల్లో పదవులపై కన్నేసిన కొందరు హడావుడి చేస్తున్నారు. కాగా జిల్లాలో చేనేత సహకార సంఘాలది ఘనమైనచరిత్ర. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 1950లోనే చౌటుప్పల్ మండలం కొయ్యల గూడెం సహకారం సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ప్రస్తుతం చేనేత సహకార సంఘాల్లో ఉన్న పర్సన్ ఇన్చార్జ్ పాలకవర్గాలు కొత్తగా సభ్యత్వాలు కల్పిస్తున్నారు. తమ పదవీ కాలం ముగుస్తుండగా తమ అనుయాయులకు సభ్వత్వాలు ఇస్తున్నారు. అయితే కొత్తగా సభ్యత్వాలు ఇవ్వాలంటే జనరల్ బాడీలో ఆమోదించిన తర్వాత ఏడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జనరల్ బాడీలో ఆమోదం పొందుతున్న సభ్వత్వాలు ఏడీ వద్ద విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఇస్తున్న కొత్త సభ్వత్వాల్లో చనిపోయిన పాత సభ్యుల వారసులకు ఇస్తున్న సభ్వత్వాలుకూడా వివా దాస్పదం అవుతున్నాయి. పోచంపల్లి, సిరిపురం వెల్లంకిలో వారసులకు ఇచ్చిన సభ్యత్వాలపై జిల్లా జౌళి శాఖ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొత్తగా ఇస్తున్న సభ్యత్వాల పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు నూతనంగా సభ్యత్వం ఇచ్చినా ఓటుహక్కువచ్చే వీలు లేదు. 2026 మార్చి 31 నాటికి 365 రోజుల ముందు, అంటే ఏడాది ముందు సభ్యత్వం కలిగి ఉండాలి. ఇందుకోసం జనరల్ బాడీ సమావేశంలో సభ్యత్వం కోసం వాటా ధనం జమ చేసి ఉండాలి. చేనేతసహకార సంఘాల్లో సభ్వత్వాలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారిస్తున్నాం. – శ్రీనివాసరావు, ఏడీ చేనేత జౌళి శాఖ -
భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలి
భువనగిరిటౌన్ : ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, కర్రె వెంకటయ్య డిమాండ్చేశారు.యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల్లో భూ కబ్జాలు, అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా సోమవారం బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వినతి పత్రం అందజేసేందుకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అధికారుల చాంబర్ వద్ద తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నాయకులు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. అనంతరం అదనపు కలెక్టర్ను నాయకులు కలిశారు. రాజకీయ పలుకుబడితో జరుగుతున్న ఈ భూకబ్జాలపై విచారణ జరిపి భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 726లో గల విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వెంచర్లుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లోని సర్వే నంబర్ 322లో సాగుతున్న అక్రమ మైనింగ్పై ఫిర్యాదు చేశారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్లు నిర్వహిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని, దీనివల్ల స్థానిక గ్రామ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, అక్రమ మైనింగ్పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చామకూర గోపాల్ గౌడ్, నాయకులు గంగుల శ్రీనివాస్ ,బొట్ల యాదయ్య, మధుసూదన్ రెడ్డి ఖలీల్, నరేందర్రెడ్డి, సట్టు తిరుమలేశ్, ఇమ్మడి రాంరెడ్డి,పుట్ట మల్లేష్ గౌడ్ , ఆడెపు బాల స్వామి,పలుగుల నవీన్, సర్పంచులు తదితరులు ఉన్నారు. -
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
ఫ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు గుర్రంపోడు : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గ్రహించిన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలకేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచాయని, మిగిలిన రెండున్నరేళ్లలో చివరి ఏడాది ఎన్నికల ఏడాదిపోగా ఏడాదిన్నర సమయమే ఉందన్నారు. కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టాలని, ఎన్ని వేధింపులకు గురిచేసినా భరించాలని.. బీఆర్ఎస్ అధికారం రాగానే వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ వాళ్లకే అర్థమైందన్నారు. అందుకే వారు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎస్ఎల్బీపీ టన్నెల్ బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన టన్నెల్లో శవాలను కూడా తీయలేకపోయిందని ధ్వజమెత్తారు. ప్రమాద స్థలానికి టూరిస్టు ప్లేస్కు వచ్చినట్లు మంత్రులు విమానంలో చక్కర్లు కొట్టారని విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ఇంకా ఏమీ లేదని అయిపోయిందన్నారని, రుణమాఫీ చేసింది కేవలం 40 శాతమేనని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నారని, మళ్లీ సీఎంగా కేసీఆర్ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు ఆయన తానేదార్పల్లి వద్ద కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్రావుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రబాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, పల్లె రవికుమార్, ఎన్ఆర్ఐ అమెరికా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహారావు, రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
పంచభూతాల కలయికే హిందుత్వం
చౌటుప్పల్ : పంచభూతాల కలయికే హిందుత్వమని త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి తెలిపారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుదేవానంద సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. హిందుత్వం అంటే సమానత్వమన్నారు. కులాలు ఏవైనా అందరూ కలిసిమెలిసి జీవనం సాగించమని చెప్పేదే హిందుత్వమని తెలిపారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్న సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పౌరులు సన్మార్గంలో నడవాలంటే హనుమాన్ చాలిసా చదవాలని, లేదంటే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖలకు వెళ్లాలని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మాట్లాడుతూ.. మనిషికి నైతిక విలువలు ఎంతో అవసరమని తెలిపారు. ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా నైతిక విలువలు, క్రమశిక్షణ లేకుంటే జీవితం వ్యర్ధమన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కేవీబీ.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసునం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు, ప్రతినిధులు బడుగు శ్రీ రాములు, పోలోజు రాజుచారి, బడుగు బాలరాజు, సిలివేరు శ్రీనివాస్, పోలోజు శ్రీనివాస్చారి, కర్నాటి శ్యాంప్రసాద్, వేముల నర్సింహ, గుర్రం నర్సింహ, పోలోజు వెంకటాచారి, జక్కర్తి శేఖర్ పాల్గొన్నారు. ఫ త్రైలింగప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి -
బ్రహ్మోత్సవాల్లో అవకాశం కల్పించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు స్థానిక తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులకు అవకాశం కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం ఆలయ ఈఓ భవాని శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు. అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వంటి వేదికల్లో ప్రదర్శనలకు అవకాశం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఈఓ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ తదితరులున్నారు. యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. రిజర్వేషన్లు కల్పించాలి మోతె : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం అన్నారు. ఆదివారం మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఏబీఆర్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బీసీలకు అందించాలన్నారు. విద్యకు అధిక బడ్జెట్ను కేటాయించి అందరికి ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. నేడు తెలంగాణలో ఎస్సీ మాదిగ కులస్తులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారని, 80 ఏళ్ల నుంచి దళితుల పరిస్థితి హీనంగా ఉందని పేర్కొన్నారు. తళితులు మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు తొలగిస్తామనడం సబబు కాదన్నారు. దళితులు విద్యతోనే చైతన్యవంతులు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న కళా బృందంతో ఆటా, పాటా కార్యక్రమం నిర్వహించారు. ఏబీఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కాంపాటి దిలీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడి లింగయ్య, నాయకులు పొడపంగి యలమంచి, పొడపంగి ముత్తయ్య, బక్కమ్మ కిష్టయ్య, శ్యామలేటి కోటేష్, ఏబీఆర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు తిర్పయ్య, ప్రధాన కార్యదర్శి చాట్ల ప్రభంజన్, కోషాధికారి వీమళ్ల రాము కాశీం, వి.గుర్వయ్య, పి. రమేష్, కాంపాటి వెంకన్న, యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
పన్నుభారం తగ్గించుకోండి
భువనగిరిటౌన్ : పట్టణాల సమగ్ర అభివృద్ధికి కీలకమైన ఆస్తిపన్ను వసూళ్లపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రాయితీ గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. ఆరు మున్సిపాలిటీలు కలుపుకుని ఆస్తిపన్ను డిమాండ్ రూ.16.35కోట్లు ఉండగా.. ఇప్పటివరకు రూ. 2.39 కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి. భువనగిరి మున్సిపాలిటీలో డిమాండ్ రూ.5కోట్ల84లక్షలు ఉండగా ఇప్పటివరకు రూ.64లక్షల 28వేలు వసూలయ్యాయి. ఇక చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.5కోట్ల68లక్షలకు రూ.కోటి 37లక్షలు, ఆలేరులో రూ.38లక్షలకు రూ.12లక్షలు, మోత్కూరులో రూ.36లక్షలకు రూ.10లక్షలు, పోచంపల్లిలో రూ.3కోట్ల39లక్షలకు రూ.10లక్షలు, యాదగిరిగుట్టలో రూ.70లక్షలకు రూ.14లక్షలు వసూలు చేశారు. ముమ్మరంగా క్షేత్రస్థాయి ప్రచారం గడువు సమీపిస్తున్న తరుణంలో మున్సిపల్ కమిషనర్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మైకుల ద్వారా ప్రచారం చేస్తూ, బకాయిలు లేని వారు ఈ నెలలో పన్ను చెల్లిస్తే లభించే ఆర్థిక ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకే మొగ్గు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చాలామంది పౌరులు సీడీఎంఏ పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్ల ద్వారా ఆనన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించారు. డిజిటల్ చెల్లింపుల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, తక్షణమే రశీదు పొందే వీలుండటంతో విద్యావంతులు, వ్యాపారవేత్తలు దీనికే మొగ్గు చూపుతున్నారు. అధికారుల విజ్ఞప్తి పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు ప్రజలు చెల్లించే పన్నులపైనే ఆధారపడి ఉంటాయి. 5 శాతం రాయితీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఒక మంచి అవకాశం. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తిపన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. ఫ మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుదారులకు ఎర్లీబర్డ్ ఊరట ఫ ఈ నెలాఖరుతో ముగియనున్న పథకం ఫ డిమాండ్ రూ.16.35కోట్లు ఫ ఇప్పటివరకు వసూలైంది రూ.2.48కోట్లు ఫ లక్ష్య సాధనలో అధికారులు నిమగ్నం మున్సిపాలిటీల వారీగా పన్నుల వివరాలు డిమాండ్ వసూలైంది (రూ.ల్లో) భువనగిరి 5.84 కోట్లు 64.28 లక్షలు చౌటుప్పల్ 5.68 కోట్లు 1.37 కోట్లు పోచంపల్లి 3.39కోట్లు 10 లక్షలు యాదగిరిగుట్ట 70లక్షలు 14లక్షలు ఆలేరు 38 లక్షలు 12లక్షలు మోత్కూరు 36.21 లక్షలు 10.77 లక్షలు -
వేసవి క్రీడా ఉత్సవం
క్రీడాంశాలు ● ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్, హాకీ ఐదు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ● ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. అర్హులు ఎవరంటే.. ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. పేర్లు నమోదు ఇలా.. ● శిబిరాలకు వచ్చే విద్యార్థులు శిక్షకుల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలి. ● క్రీడా శిక్షణకు వచ్చే విద్యార్థులకు సంబంధించి ప్రతిరోజూ హాజరు తీసుకుంటారు. ప్రయోజనం.. ● పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా, రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ● శిక్షణ శిబిరాలలో పాల్గొన్న క్రీడాకారులందరికీ చివరి రోజు సర్టిఫికెట్లు అందజేస్తారు. భువనగిరి : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకుగాను ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షకుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరించి 10 మందిని ఎంపిక చేసే ప్రక్రియ మొదల పెట్టారు. ఎంపిక పూర్తికాగానే వారికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేయనున్నారు. రూ.50 వేల నిధులు క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ.50 వేల నిధులు విడుదల చేయనుంది. ఈ నిధుల నుంచి ఒక్కో శిక్షకునికి రూ.4 వేల చొప్పున 10 మందికి రూ.40 వేలు ఇవ్వనున్నారు. మిగిలిన రూ.10 వేలను ప్రథమ చికిత్స, సర్టిఫికెట్స్ కోసం ఖర్చు చేయనున్నారు. జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలతోపాటు పర్యవేక్షించనున్నారు. కాగా శిబిరాలకు వచ్చే విద్యార్థులకు దాతల చేయూతతో స్నాక్స్ ఇవ్వనున్నారు. క్రీడా శిబిరాలు, శిక్షకులు ఇలా.. ● ఖోఖో, మర్యాల జెడ్పీహెచ్ఎస్ (బొమ్మలరామారం), గోపాల్ (సెల్ :9492504743) ● అథ్లెటిక్స్, మర్యాల జెడ్పీహెచ్ఎస్ (బొమ్మలరామారం), సునిల్ (86883181199) ● ఖోఖో, అనాజీపురం జెడ్పీహెచ్ఎఎస్ (భువనగిరి) ఆంజనేయులు (9948825255) ● హాకీ, సంగెం జెడ్పీహెచ్ఎస్ (వలిగొండ), సంధ్యారాణి (7732063863) ● ఖోఖో, మాసాయిపేట జెడ్పీహెచ్ఎస్ (యాదగిరిగుట్ట), విజయకుమార్ (9848367366) ఇప్పటికే వేసవి క్రీడా శిబిరాలు నిర్వహణకు పలు స్కూళ్లతోపాటు శిక్షకులను ఎంపిక చేశారు. వాలీబాల్, తైక్వాండో విభాగాలకు సంబంధించి స్కూళ్లతోపాటు శిక్షకులను ఎంపిక చేయాల్సి ఉంది. ఫ మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ ఫ జిల్లావ్యాప్తంగా పది శిబిరాలు ఏర్పాటు ఫ ఐదు క్రీడాంశాల్లో పోటీలు ఫ 14 ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు
యాదగిరిగుట్ట: మహిళా రిజర్వేషన్ బిల్లుకు దక్షిణాది రాష్ట్రాలకు సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించి, కాంగ్రెస్, మిత్రపక్షాలతో 99శాతం మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 130వ రాజ్యాంగ సవరణను దేశమంతా చూసిందన్నారు. రాజ్యాంగ సవరణ ముసుగులో దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయాలని మోదీ, అమిత్ షా కుట్రలు చేశారని, కానీ దానిని రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంకగాంధీలు వీగిపోయే విధంగా చేశారన్నారు. మహిళలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. బీజేపీ చరిత్రలో ఏనాడు మహిళలకు అధ్యక్షత పదవి ఇవ్వలేదని, అలాంటి వారు మహిళలకు పెద్దపీట వేస్తారా అని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలను అణచివేయాలని ప్రధాని నరేంద్రమోదీ చూస్తున్నారని విమర్శించారు. దొంగ దీక్షలతో జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్తాన్తో బీజేపీ ఎంపీ పోలిస్తే ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ఏ విధంగా ఖూనీ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లు పెడితే కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలు మద్దతు ఇచ్చేవని, కానీ మహిళ బిల్లును డిలిమిటేషన్ పేరుతో ముడి పెట్టారన్నారు. చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ స్థాయి లేని వ్యక్తులు కూడా తనను ఆరోపిస్తున్నారని, అంతేకాకుండా కురుమ సంఘ భవనం లీజు విషయంపై తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సమావేశంలో మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య, కౌన్సిలర్లు బూడిద మధు, పెలిమెల్లి లావణ్య, పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి, నాయకులు గుండ్లపల్లి భరత్, ఎరుకల హేమేందర్గౌడ్ తదితరులున్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు
కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి రెండు రోజుల క్రితం మృతిచెందగా.. అప్పు ఇచ్చిన బాధితులు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామానికి చెందిన వరికుప్పల శేఖర్ కొండమల్లేపల్లి మండల కేంద్రం సమీపంలోని దోనియాల గ్రామ శివారులో ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోనే ఇస్తరాకులు తయారుచేసే కంపెనీని ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరేళ్ల నుండి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి సన్నిహితులు, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో అప్పు ఇచ్చిన వారికి వడ్డీలు బాగానే కట్టి నమ్మకం పెంచుకున్నాడు. దీంతో అమాయక ప్రజలు బయట రూ.2 వడ్డీకి బయట అప్పులు తెచ్చి శేఖర్కు అధిక వడ్డీకి ఇచ్చారు. ఈవిధంగా శేఖర్ సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం ఏడాది నుంచి ఇబ్బందులు.. అయితే శేఖర్ గత ఏడాది నుంచి అప్పులు ఇచ్చిన వారికి సక్రమంగా వడ్డీలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా మూడు నెలల క్రితం శేఖర్ గుండెకు స్టంట్ వేసినట్లు అతడి ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా తెలిసింది. అప్పు ఇచ్చిన వారి నుంచి శేఖర్పై ఒత్తిడి పెరగడంతో డబ్బులు తెస్తానని కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు బెంగళూరుకు వెళ్లి శేఖర్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కొండమల్లేపల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శేఖర్కు అప్పులిచ్చిన బాధితులంతా అతడి ఇంటి వద్దకు చేరుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బాధితులు 50 మంది కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇటీవల పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాకు చెందిన బాలాజీనాయక్, మధునాయక్ అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన ఘటన మరువక ముందే కొండమల్లేపల్లిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు. బెంగళూరులో ఎవరున్నారు..?బెంగళూరులో శేఖర్ ఎవరితోనైనా వ్యాపారం చేసి మోసపోయాడా..? అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అనేది శేఖర్ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులకు మాత్రమే తెలియాలి. అప్పులిచ్చిన బాధితులు ఆదివారం ఉదయం మృతుడి ఇంటి ముందు చర్చించుకునే సందర్భంలో ముగ్గురు వ్యక్తుల పేర్లు బలంగా వినిపించాయి. వారిలో బద్రినాథ్, జాఫర్, ప్రకాష్ అనే పేర్లు ప్రత్యేకంగా బాధితులు చర్చించుకోవడం గమనార్హం. ఈ ముగ్గురికి, శేఖర్కి సంబంధం ఏమిటి అనేది తెలిస్తే డబ్బుల వ్యవహారం కూడా వెలుగులోకి రావచ్చని బాధితులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ని సంప్రదించగా అధిక వడ్డీకి సంబంధించి మోసపోయినట్లుగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అప్పు తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి మృతుడి ఇంటి వద్ద ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు -
నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
భువనగిరి : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిసారిగా ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పాఠాలు బోధించడం, రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా పాఠ్యపుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 44 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణ కోసం అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, తాగునీరు, ఫ్యాన్లతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలందించేందుకు పరీక్ష కేంద్రాలలో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్ఫోన్లు అనుమతించబడదు.ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా.. జిల్లా తరగతి హాజరుకానున్న పరీక్ష విద్యార్థులు కేంద్రాలు నల్లగొండ టెన్త్ 1,611 08 ఇంటర్ 2,226 10 సూర్యాపేట టెన్త్ 990 06 ఇంటర్ 2,012 11 యాదాద్రి టెన్త్ 569 04 ఇంటర్ 1,427 05 టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 8,835 మంది విద్యార్థులు -
అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతి
కనగల్ : అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతిచెందాడు. వివరాలు.. కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ పరిధిలోని వేద ఫంక్షన్హాల్–2 లో ఇద్దరు వాచ్మెన్ల మధ్య పాత నూనె డబ్బాల విషయంలో శనివారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ ఘటనలో కనగల్ గ్రామానికి చెందిన వాచ్మెన్ దొమ్మాటి సైదులు(56)పై గుర్రంపోడు మండలం గన్సిరాంతండాకు చెందిన మెగావత్ గోపీనాయక్ చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగి ఎవరి గదిలోకి వారు వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని సైదులు భార్యకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం అతడిని నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గోపినాయక్ దాడి కారణంగానే తన భర్త సైదులు మరణించాడని మృతుడి భార్య అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు సీఐ కే. ఆదిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎస్. రామయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సైదులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మృతుడితో గొడవపడిన గోపినాయక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అన్నదాతలకు తాలు తంటా
నల్లగొండ : జిల్లాలో ధాన్యం దిగుమతుల వ్యవహారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. యాసంగి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతుండటంతో.. లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్దే తూకం వేసి పంపించినా, మిల్లర్లు మాత్రం దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తుండటం రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్ల కొర్రీలు.. పెరిగిన నిరీక్షణ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యాన్ని నాణ్యత పరిశీలించిన తర్వాతే తూకం వేస్తున్నారు. అయితే, ఈ ధాన్యం మిల్లులకు వెళ్లగానే సీన్ మారుతోంది. ‘తాలు ఎక్కువగా ఉంది.. మాకు నష్టం వస్తుంది’ అంటూ మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదు. దీంతో కల్లాల నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి రోడ్లపైనే ఉండిపోతున్నాయి. తూర్పార పట్టిన ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటామని మిల్లర్లు అంటున్నారు. దీంతో లారీ అద్దెలు భారం కావడంతో పాటు, రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది. కొనుగోళ్లలో జాప్యం మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటాలు వేయడం లేదు. అక్కడి నుంచి లారీలు వస్తేనే కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో కల్లాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. బస్తాకు 2 కిలోల తరుగు.. మళ్లీ కోతలు! తూకం సమయంలోనే అధికారులు, సిబ్బంది బస్తాకు 2 కిలోల పైనే తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా తరుగు తీసిన తర్వాత కూడా, మిల్లుల వద్ద మళ్లీ తాలు పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం లేదా అదనపు కోతలు పెట్టాలని చూడటంపై రైతులు మండిపడుతున్నారు. మిల్లర్ల ఇష్టారాజ్యంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ‘మిల్లర్లతో మీరే మాట్లాడుకోండి’ అని సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులు వేగవంతమయ్యేలా చూడాలని కోరుతున్నారు. రైతులు మిల్లులకు వెళ్లే అవసరం లేదు.. ధాన్యం అమ్మిన తర్వాత రైతులు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఒకవేళ రైతులను మిల్లులకు పంపిస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని శనివారం నల్లగొండలో పర్యటించిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. మిల్లులకు వచ్చిన ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. అయినా మిల్లర్లలో మార్పు రావడం లేదు. ధాన్యంలో తాలు ఎక్కువ వస్తుందని దిగుమతి చేసుకోని మిల్లర్లు రోజుల తరబడి మిల్లుల వద్దనే నిలిచిపోతున్న లారీలు కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా కాంటాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
సూర్యాపేటటౌన్ : ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్ రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరాబాద్ గ్రామానికి చెందిన కొల్లు సందీప్(28) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో పనులు ముగించుకొని మరో వ్యక్తితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. కాసరాబాద్ గ్రామ సపమీంలోకి రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్దేవరకొండ : గంజాయి కలిగి ఉన్న ఇద్దరు యువకులను దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ సమీపంలోని పల్లీ మిల్లులో బిహార్కు చెందిన ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. శనివారం వారు దేవరకొండ పట్టణంలోని రహదారి బంగ్లా సమీపంలో గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వారిని తనిఖీ చేయగా సుమారు 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యనల్లగొండ : వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల పరిధిలోని మాందాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య(19)కు నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్కు చెందిన శివతో ఆరునెలల క్రితం వివాహమైంది. కాగా ఐశ్వర్య శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు ఐశ్వర్య తల్లిదండ్రులు ఆదివారం నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బతో వృద్ధుడు మృతిహుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన గడ్డం గురవయ్య(80) వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక గత ఐదు రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గురవయ్య మృతదేహాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. -
ఏనుగు నర్సింహారెడ్డి యువతకు ఆదర్శనీయుడు
చిట్యాల : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఐఏఎస్ హోదా పొందిన చిట్యాల పట్టణ వాసి ఏనుగు నర్సింహారెడ్డి నేటి యువతకు ఆదర్శనీయుడని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణంలో ఏనుగు నర్సింహారెడ్డికి ప్రమోద సాహితి సంస్థ, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జస్టిస్ కుకుడాల లక్ష్మణ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం హాజరయ్యారు. ఈ సందర్భంగా కుకుడాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి పేదరికంలో ఉండి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఐఏఎస్ స్థాయికి ఎదిగారన్నారు. ఆయన ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. సాహిత్య రంగంలోనూ రాణిస్తున్న నర్సింహారెడ్డి భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకుని మంచి గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన 19 పుస్తకాలను రచించడంతో పాటు మరో ఎన్నో సాహిత్య సమీక్షలను, కవిత్వాలను రాసి ఇరవై రెండు వరకు అవార్డులు పొందారని పేర్కొన్నారు. తెలుగు భాషే నిలబెట్టింది.. అనంతరం ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనకు చిన్ననాడు చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయుల ద్వారా తెలుగు భాషపై అభిమానం ఏర్పడిందన్నారు. తెలుగు భాష ద్వారానే సాహిత్య రంగంలో ఎన్నో పుస్తకాలు రాశానన్నారు. అంతేకాకుండా తెలుగు భాష ద్వారా గ్రూప్–2 రాసి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ఇప్పుడు ఐఏఎస్ హోదాను పొందానని గుర్తుచేశారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తనకు పౌర సన్మానం చేసిన ప్రమోద సాహితీ సంస్థతో పాటు తన చిన్ననాటి స్నేహితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీసైదులు, ప్రమోద సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్తో పాటు సాహితీవేత్తలు తండు కృష్ణకౌండిన్య, ఏభూషి నర్సింహ, సాగర్ల సత్తయ్య, సిలివేరు నర్సింహ, పాటి మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ -
వైభవంగా విశ్వశాంతి మహాయాగం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం విశ్వశాంతి మహాయాగం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం యాదగిరిగుట్ట ఆయల రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు సమక్షంలో గణపతి పూజ జరిపించారు. అనంతరం 108 జంటలతో సుదర్శన నారసింహ విశ్వశాంతి మహాయాగం, 1008 మందితో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవం తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు 3వేలకు పైగా భక్తులు ఆయా వేడుకల్లో పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించిన విశేష కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు, ట్రస్టు ప్రతినిధులు పూల రవీందర్, ఆకుల లలిత, డాక్టర్ పుంజాల వినయ్కుమార్, రుద్ర సంతోష్కుమార్, పలుగుల శ్రీనివాస్, పోతంశెట్టి అనిల్కుమార్, పుప్పాల నరసింహులు, సంగాని రజినికాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, ఆవుల సురేందర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. -
బైక్, ఆటోను ఢీకొట్టిన కారు
మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటోను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన ముక్కెర్ల చంద్రయ్య(70) బైక్పై మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. వలిగొండ నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. ఒకరు మృతి మరో ముగ్గురికి గాయాలు -
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణం
భువనగిరి : మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి తీరును ఖండిస్తూ బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంటే.. ఇండియా కూటమి దానిని అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. మహిళా బిల్లు 2008లో రాజ్యసభలో ఆమోదం పొందినా, లోక్సభలో ఎందుకు ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ను నిలదీశారు. మహిళా ఓట్ల కోసం నాటకాలు ఆడేవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వంగేటి సుచరితరెడ్డి, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, బీజేపీ నాయకులు చందా మహేందర్ గుప్తా, పడమటి జగన్ మోహన్రెడ్డి, మేడి కోటేష్, తడిసిన మల్లారెడ్డి, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇంటి యజమానిగా మహిళలు 22.46 శాతమే..
ఫ ఓసీల్లో అత్యధికంగా వృద్ధులు ఫ నిరక్షరాస్యులు ఎస్సీల్లోనే అధికం ఫ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, కుల సర్వేలో వెల్లడి సామాజిక వర్గాల వారీగా ఇళ్లు.. జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు (బీసీల్లో, ఓసీలు అన్నీ కలిపి ఓసీల్లో కలిపి) నల్లగొండ 98,367 67,652 2,53,817 28948 62,854 5,11,638 సూర్యాపేట 75,102 49,525 1,75,323 22582 49,000 3,71,532 యాదాద్రి 48,753 15,494 1,57,310 8803 30,406 2,60,766 -
ముగిసిన భూదాన స్ఫూర్తి పాదయాత్ర
భూదాన్పోచంపల్లి : భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేటి యువతకు భూదా నోద్యమ చరిత్ర గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి నుంచి ప్రారంభించిన 55 కిలోమీటర్ల భూదాన స్ఫూర్తి పాదయాత్ర శనివారం పోచంపల్లికి చేరుకోవడంతో ముగిసింది. పట్టణ శివారులో పాదయాత్ర బృందానికి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఘనస్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వినోబాభావే మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్న వారిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు శాలువాలు కప్పి, గాంధీజీ విగ్రహ మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ప్రతినిధులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్, పాదయాత్రికులు తడక రమేశ్, భారత లవకుమార్, గునిగంటి రమేశ్, రాపోలు జ్ఞానేశ్వర్, పట్నం పారిజాత, చింతకింది రమేశ్, అంకం పాండు, ఆటిపాముల మహేందర్, చక్రాల నర్సింహ, కర్నాటి బాలరాజు, మందుల యాదగిరి పాల్గొన్నారు. -
పరిషత్ పోరుకు కసరత్తు
సాక్షి, యాదాద్రి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర జాబితాలు సిద్ధం చేయాలని శుక్రవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాలో అదనపు ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. అయితే జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 17 మండలాల్లో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త ఓటర్లతో జాబితాలు తయారీ అదనపు ఓట్లను కలుపుకుని పోలింగ్కేంద్రాల వారీగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 23వ తేదీలోగా ఆయా పోలింగ్ బూత్లలో నమోదు చేస్తారు. శాసనసభ ఎన్నికల ఓటరు జాబితాతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. గత జూలై తర్వాత నమోదైన అదనపు ఓటర్లను జత చేస్తారు. జూలై 10, 2025 తర్వాత 2026 ఫిబ్రవరి 5 వరకు నమోదైన అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పోలింగ్కేంద్రాల వారీగా ఉన్న జాబితాల్లో జత చేయనున్నారు. గతేడాది చేపట్టినా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ గత సంవత్సరం సెప్టెంబర్లోనే ప్రాంరంభమైంది. రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకుగత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ ఇవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా 2019 మే,6,10,14 తేదీల్లో గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్లోఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకున్నారు. 2025 జూన్లో పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనల కొనసాగుతోంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన ఆశావహులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రెవెన్యూ భువనగిరి, డివిజన్లు చౌటుప్పల్ మండలాలు 17 జెడ్పీటీసీ స్థానాలు 17 ఎంపీటీసీ స్థానాలు 178 పోలింగ్ కేంద్రాలు 1,001 ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఫ కదిలిన జిల్లా యంత్రాంగం ఫ 23లోగా పూర్తికానున్న ప్రక్రియ -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
ఫ రికార్డులు స్వాధీనం సాక్షి, యాదాద్రి : బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు రాత్రి వరకు జరిగాయి. స్టాంప్ డ్యూటీల్లో అవకతవకలపై, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న దస్త్రాలు, రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల చెల్లింపుల వివరాలు సేకరించారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులు ఉన్న ఉద్యోగులను విచారించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలకు వచ్చిన విషయం తెలిసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిసరాల్లోని డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను మూసి వేసి వెళ్లిపోయారు. కాగా, బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గతంలో ఏసీబీ అధికారులు దాడులు జరిగాయి. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కూడా అయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి డాక్యుమెంట్కు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, రామన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి రోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే.. వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పత్రాలు సరిగా లేకుంటే రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బు వసూలు జరుగుతోంది. -
ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేయొద్దు
సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం దిగుమతుల్లో మిల్లుల యజమానులు జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. 2025–26 ధాన్యం కొనుగోళ్లపై శనివారం కలెక్టరేట్లో మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం యాసంగి 2024–25 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువు పొడిగించినందున గడువులోగా ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా నిర్వాహకులు హరికృష్ణ, మిల్లుల యజమానులు పాల్గొన్నారు. సంక్షేమ వారం పకడ్బందీగా నిర్వహిస్తాం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి 26 వరకు ఏడు రోజుల పాటు సంక్షేమ వారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులు చేయిస్తామన్నారు. విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితీ పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి -
యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలు
యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చనలు జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీపడొద్దుబొమ్మలరామారం : విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గల కేజీవీబీని శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యాలయంలో మాడ్యులర్ కిచెన్ను పరిశీలించారు. పాఠశాలలో ఫ్యాకల్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈఓ సత్యనారయణ, ఈఈ మధు సూదన్ రెడ్డి, జీసీడీఓ రాధ, ప్రత్యేక అధికారి సాయి లక్ష్మి ఉన్నారు. సౌకర్యాలు కల్పించాలితుర్కపల్లి : పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు తాగునీరు, నీడతోపాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీఓ నాగిరెడ్డి అన్నారు. తుర్కపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. కూలీలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం వేళల్లోనే పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ గీతారెడ్డి, గ్రామ కార్యదర్శి శైలజ, ఎప్ఏ చాంద్పాషా పాల్గొన్నారు. -
నిరక్షరాస్యులు ఎస్సీల్లో ఎక్కువ
ఉమ్మడి జిల్లాలో 15 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో నిరక్షరాస్యులు అత్యధికంగా ఎస్సీల్లోనే ఉన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 31.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 46.9 శాతం మంది ఉన్నట్లు తేలింది. సూర్యాపేట జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 30.4 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 26.8 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరక్షరాస్యుల శాతం ఇలా.. జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 31.9 46.9 31.9 31.0 34.5 26.9 10.3 35.5 19.1 18.7 సూర్యాపేట 30.4 40.9 32.6 30.2 34.3 26.4 26.2 33.4 25.7 17.2 యాదాద్రి 26.8 40.9 28.6 26.1 30.2 22.6 9.7 29.7 18.7 20.0 -
‘భూభారతి’తో భూములకు రక్షణ
భూదాన్పోచంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములకు రక్షణ కల్పిస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం వినోబాభావే సేవా సమితి ఆధ్వర్యంలో పోచంపల్లిలో నిర్వహించిన భూదానోద్యమ వజ్రోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట పేదల భూములను భూస్వాములకు అప్పగించే కుట్ర చేసిందన్నారు. భూదాన యజ్ఞబోర్డును పునరుద్ధరించి రాష్ట్రంలో మిగిలిపోయిన భూదాన భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని అన్నారు. అనంతరం భూమి సునీల్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను అధ్యయనం చేశామని తెలిపారు. ఒక వ్యవస్థను రూపొందించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ తడక యాదగిరి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఉప సర్పంచ్ మృతి
బొమ్మలరామారం : మండలంలోని తూంకుంట గ్రామ ఉప సర్పంచ్ మేకల బాలకృష్ణ(36) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ శుక్రవారం రాత్రి స్వగ్రామం నుంచి తన ద్విచక్రవాహనంపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో అంకిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బాలకృష్ణ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణను స్థానికులు 108 వాహనంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్ ఫ గ్రామ పంచాయతీ ఆఫీసర్ మృతి చివ్వెంల(సూర్యాపేట) : బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో గ్రామ పంచాయతీ ఆఫీసర్(జీపీఓ) మృతిచెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని తిలక్నగర్కు చెందిన షేక్ ముస్తఫా(58) తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ పంచాయతీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకుని బైక్పై కోదాడకు వస్తుండగా.. మార్గమధ్యలో చివ్వెంల మండల వల్లభాపురం గ్రామ శివారులో ఎదురుగా రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముస్తఫా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ హఫీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఆత్మహత్యపెన్పహాడ్ : షాపు యాజమానుల వేధింపులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన షేక్ హుస్సేన్(35) హైదరాబాద్లో శ్రీనివాస సిమెంట్, ఐరన్ షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో షాపు యాజమాని సుందరి కోటేశ్వర్రావు, హాజీ పటేల్ వేధింపులకు గురిచేస్తున్నారని షేక్ హుస్సేన్ పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పాడు. కాగా శుక్రవారం ఉదయం షేక్ హుస్సేన్ హైదరాబాద్ వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరి అనంతారం క్రాస్ రోడ్డు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు షేక్ లతీఫ్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దాహార్తి తీర్చుకునేందుకు వెళ్లి..
ఫ పాత బావిలోని బురదలో కూరుకుపోయి ఆవు మృతి శాలిగౌరారం : దాహార్తి తీర్చుకునేందుకు పాత బావిలోకి వెళ్లిన ఆవు బురదలో కూరుకుపోయి మృతిచెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఊట్కూరు గ్రామానికి చెందిన కప్పల యాదయ్య నాలుగు రోజుల క్రితం తన పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లాడు. అందులో ఓ ఆవు దాహార్తి తీర్చుకునేందుకు సమీపంలో పూడికతో నిండిన పాత బావిలోకి వెళ్లింది. బావిలోని ఒండ్రు మట్టిలో ఆవు కూరుకుపోయి బయటకు రాలేక మృతిచెందింది. ఆవును గమనించని యజమాని అదే తిరిగి వస్తుందనుకుని ఇంటికి వెళ్లాడు. నాలుగు రోజులు గడిచినా ఆవు ఇంటికి రాకపోవడంతో గ్రామ సమీపంలో పూడికతో నిండిన బావి వద్దకు వెళ్లి చూడగా అందులో ఆవు మృతిచెంది ఉంది. కాగా.. ఆవు కళేబరం వద్దకు వచ్చిన లేగ దూడ బావి చుట్టూ అరుస్తూ తిరుగడం గ్రామస్తులను కలిచివేసింది. వినూత్నంగా అవగాహనకేతేపల్లి : మండలంలోని బీమారం గ్రామంలో శనివారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కోయ దొర వేషధారణలో కరపత్రాలు పంచుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతిఒక్కరు పాటించాలని ఆయన సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో వావనాలు నడపరాదని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తాజుద్దీన్, నర్సయ్యచారి, నాగరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి
పురుగు మందులు పిచికారీ చేయరాదు నిషేధించిన పురుగు మందులను మామిడి కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రియ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తర్వాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పెద్దవూర : ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడిలో దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్నాయి. కోతలు కూడా మొదలవుతున్నాయి. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోత సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి కొంపెల్లి మురళి పేర్కొన్నారు. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటు ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్, ప్యాకింగ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం వలన ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు. నిల్వ, రవాణా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందవచ్చునని ఆయన సూచిస్తున్నారు. ఎంపికే కీలకం.. తోటల్లో మామిడికాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. శ్వేద గ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చరంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్ మీటర్ ద్వారా బ్రిక్స్ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. లోపల కండ లేతపసుపు రంగులో ఉండాలి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళల్లోనే ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6 నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చగానీ, దెబ్బగానీ తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టినేలపై ఉంచకూడదు. శుభ్రపర్చడం ముఖ్యం మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం, 10 గ్రాముల డిటర్జంట్ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కడగాలి. తర్వాత 52 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడినీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధి చేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాంకిగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటలలోపే ప్యాక్హౌజ్కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇథిలిన్తో మాగించాలి మామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగిస్తున్నారు. దీనివలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్బైడ్తో మాగించడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్తో మామిడి కాయలను మాగించడం అన్నివిధాలా మంచిది. ఇథిలిన్ అనేది గ్రోత్ హార్మోన్.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్ ఇథిలిన్ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14 గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం ఆరోగ్యదాయకం. ఫ అనుముల క్లస్టర్ ఉద్యానవనశాఖ అధికారి కొంపెల్లి మురళి సూచనలు -
నేడు విశ్వశాంతి మహాయజ్ఞం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రంలో ఆదివారం ఉదయం సుదర్శన నారసింహస్వామి విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్, యాదగిరిగుట్ట మున్నూరు కాపు సంఘం చైర్మన్ నేతి విద్యాసాగర్ తెలిపారు. ఈ విశ్వశాంతి యజ్ఞంలో 108 జంటలు పాల్గొంటాయన్నారు. అంతేకాకుండా 1008 మంది దంపతులతో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం సైతం జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సుదర్శన నారసింహ హోమంతో పాటు స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకలో సుమారు 5వేల మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం కొనసాగుతాయన్నారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ట్రస్టు సభ్యులు పలుగుల శ్రీనివాస్, జీఎంఏ కన్వీనర్ రజనీకాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, అవుల సురేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే ధాన్యం సేకరించాలి
నల్లగొండ టౌన్: ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రైతులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యపు రాశులు, తేమ, తాలు, తరుగు వివరాలను తెలుసుకున్న అనంతరం ఆయన ధాన్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రైతులు, హమాలీలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం ఉండరాదని, ధాన్యం అమ్మిన వెంటనే రైతుకు రశీదు ఇవ్వాలని సూచించారు. తాలు, తరుగు, తేమ సమస్యలుంటే రైతులు కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించుకోవాలని, మిల్లర్లకు సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్వింటాల్కు రూ.45 మాత్రమే హమాలీ ఛార్జీ తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరుగు, తాలు, తూకం పేరిట మిల్లుల వద్ద లారీలను ఆపుతున్నారని, లారీకి 10 క్వింటాళ్ల చొప్పున తరుగు తీస్తున్నారని పలువురు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతినాయక్, తహసీల్దార్ పరశురాం, నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆదర్శ రైతు రామిరెడ్డి పాల్గొన్నారు. ఫ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
ప్రకృతిని మైమరిపించే
ఫ తీరొక్క మొక్కలతో ఇల్లే నందనవనం ఫ ఆకట్టుకుంటున్న తామర పూల కొలను, మోట బావి ఫ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వ్యవసాయ పరికరాలు ఫ తన ఆదాయంలో 80 శాతం పచ్చదనానికి వెచ్చిస్తున్న నిడమనూరు వాసి ప్రకృతిపై ప్రేమతో తన ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకున్నారు నిడమనూరు మండల కేంద్రానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు మేరెడ్డి వెంకట్రాహుల్. ఇంటి ఆవరణలో పూలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అంతేకాకుండా తామర పూల కొలను, మోట బావి, ఎడ్ల బండి చక్రాలు, నాగలి, డంగు సున్నపురాళ్లతో అందంగా తీర్చిదిద్దిన బుద్ధుడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిడమనూరు : వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసిన వెంకట్రాహుల్ నిడమనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి 167 పక్కనే రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి చిత్రకూటమి అని పేరు పెట్టుకున్నారు. వ్యవసాయంతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా తన ఇంట్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి వెచ్చిస్తున్నారు. వెంకట్రాహుల్ మూడు దశాబ్దాలుగా ఇంట్లో పెంచుతున్న చెట్లు, వివిధ రకాల మొక్కల కారణంగా వేసవిలో సైతం చల్లగా ఉంటుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతూ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇంటి ఆవరణ మొత్తం తీగజాతి పందిళ్లు, తామరపూల కొలను, రంగురంగుల పూలచెట్లు, చెట్ల మధ్యలో పాత గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దిన అరుగులు కనిపిస్తాయి. మోట బావి, విద్యుత్ దీపాలు, చెట్ల పొదల్లో బుద్ధుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. మరోవైపు ఆవు, ఇతర గ్రామీణ వస్తువులతో బొమ్మల కొలువు ఉంటుంది. కొబ్బరి చెట్లు, టేకు చెట్లకు తమలపాకుల తీగలు అల్లుకుపోయి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్లోని వివిధ నర్సరీల్లో సేకరించిన క్రోటాన్, సుగంధ పరిమళాలు అందించే మొక్కలను పెంచుతున్నారు. వెంకట్రాహుల్ ఇంటిని మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు ప్రశంసించారు. చిత్రకూటమి పేరే ఎందుకంటే.. రామాయణంలో రాముడు సీతతో అరణ్యవాసంలో ఉండగా చిత్రకూట్ పర్వతంపై పదేళ్లకు పైగా నివసిస్తాడు. రాముడు చిత్రకూట్ పర్వతంపై పచ్చని చెట్ల మధ్య ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నట్లు చెబుతాడని అందుకే తన ఇంటికి చిత్రకూటమిగా నామకరణం చేసినట్లుగా మేరెడ్డి వెంకట్రాహుల్ చెబుతున్నారు. ఇంటి పచ్చదనాన్ని తన తండ్రి మేరెడ్డి మట్టారెడ్డి వారసత్వంగా ఇవ్వగా, అదే పచ్చదనాన్ని కొనసాగిస్తూ తన వారసుడు కృష్ణవివేక్కు అందిస్తానని వెంకట్రాహుల్ చెప్పడం విశేషం. ఎడ్ల బండి చక్రాలతో అలంకరించిన ఇంటి ప్రాంగణంకృష్ణుడి విగ్రహం ఇరువైపులా ఏర్పాటుచేసిన పురాతన డంగు సున్నంరాళ్లుఇంటి పరిసరాల్లో ఏపుగా పెరిగిన మొక్కలు పచ్చని చెట్లతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఇంటి ప్రవేశ ద్వారం -
దోస్త్ పిలుస్తోంది!
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఈనెల 13న దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు అడ్మిషన్ల వేటలో పడ్డాయి. ప్రభుత్వ కళాశాలలు సైతం ప్రైవేట్కు దీటుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి. మొత్తం 59 డిగ్రీ కళాశాలలు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 59 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 11 ప్రభుత్వ కళాశాలలు, రెండు ఎయిడెడ్, 46 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. యూనివర్శిటీ ఆయా కళాశాలల ద్వారా సుమారు 45కి పైగా కోర్సులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. వాటిలో ప్రధానంగా బీఏలో హెచ్ఈఎంజే, హెచ్ఈపీఎ, హెచ్పీపీ, హెచ్ఈపీ, ఈపీపీ, హెచ్పీజీ, టీహెచ్పీ, ఈహెచ్పీ కోర్సులు, బీకాంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు, బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీ, బీజెడ్సీ, డీజెడ్సీ, బీజెడ్సీఎస్ వంటి కోర్సులు ఉన్నాయి. ఫ 13న విడుదలైన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ ఫ జూన్ 1 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఫ జూలై 1 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు దోస్త్ షెడ్యూల్ ఇలా.. మొదటి దశ రెండవ దశ మూడో దశ రిజిస్ట్రేషన్లు (ఏప్రిల్ 15 – మే 7) మే 15 – 25 వరకు మే 31– జూన్ 15 రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 రూ.400 రూ.400 వెబ్ ఆప్షన్ల నమోదు ఏప్రిల్ 30 – మే 8 మే 15– 26 వరకు మే 31 – జూన్ 16 సీట్ల కేటాయింపు మే 14 మే 30 జూన్ 20 కళాశాలల్లో చేరాల్సింది మే 15 – 25 లోపు మే 31 – జూన్ 5లోపు జూన్ 20 – జూన్ 25లోపు -
రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పాటించాలి
చౌటుప్పల్ : రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు– నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు, సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, ప్రాణ, ఆస్తినష్టం లేకుండా వ్యవహరించాల్సిన తీరును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు అధికంగా ఉన్నందున ఆయా పరిశ్రల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీతోపాటు ప్రమాద సమయంలో స్పందించాల్సిన అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో దివీస్ పరిశ్రమ జనరల్ మేనేజర్లు బాలకిషోర్, పెండ్యాల సుధాకర్, ఏజీఎం సాంబశివరావు, మండల ఫైర్ అధికారి శివాజీ, దివీస్ ప్రతినిధులు ఉమామహేష్, రంగారావు, ఎన్వీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
లబ్ధిదారుల కల.. నెరవేరే వేళ
సాక్షి, యాదాద్రి: భువనగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కనున్నాయి. ప్రధానంగా భువనగిరిలోని సింగన్న గూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతులు పూర్తి చేసి, జూన్ మొదటి వారంలో సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి శుక్రవారం అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనర్హుల తొలగింపు గడిచిన రెండు నెలలుగా నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడానికి ప్రణాళిక ఖరారు చేశారు. ఈ నెల చివరి నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో డ్రెయినేజీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి పైప్లైన్ల వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా.. లబ్ధిదారుల ఎంపికపై మరోసారి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. మిగతా మండలాల్లో.. బీబీనగర్ మండలం కొండమడుగులో 24 డబుల్ బెడ్ రూం ఇళ్లు, బీబీనగర్ 10, పోచంపల్లిలో 120, జిబ్లక్ పల్లిలో 24 ఇళ్ల పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కొండమడుగులో విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు. బీబీనగర్ లెప్రసీ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిఽధిలోని రేవణపల్లిలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. అదేవిధంగా జిబ్లక్పల్లిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. సాక్షి, యాదాద్రి : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం జనగణనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ముందుగా ఇళ్ల లెక్కింపు, ఆ తర్వాత జనాభాను లెక్కించనున్నారు. ఈనెల 26 నుంచి ప్రజలకు స్వీయ గణన నమోదుకు అవకాశం ఇచ్చారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు క్షేత్రస్థాయి గృహాల సమాచారాన్ని సేకరించనున్నారు. 2027 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జనగణన చేపట్టనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ ఇవ్వగా.. శనివారం ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రతి 600 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ప్రస్తుతం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 జనాభా ఉండగా, అందులో మహిళలు 3,80,341 కాగా, పురుషులు 3,90,482 మంది ఉన్నారు. 1,88,520 ఇళ్లు ఉండగా ఎఫెక్ సర్వే లెక్కల ప్రకారం 2.14లక్షలు ఉన్నట్లు తేలింది. సర్వే చేసేందుకు ప్రతి 600 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ఉంటారు. ప్రతి ఆరుగురు ఎన్యుమరేటర్లను ఒక సూపర్వైజర్ పర్యవేక్షిస్తారు. మే 11నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు సర్వే చేయనున్నారు. తొలిదశలో క్షేత్రస్థాయి గృహాల సమాచారాన్ని సేకరిస్తారు. ఈమేరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 104 వార్డులు, 427 గ్రామపంచాయతీలలో ఇళ్ల జాబితాలను రూపొందిస్తారు. ఆయా ఇళ్లలోని కుటుంబాల జీవన స్థితిగతులను గుర్తిస్తారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎన్ని గృహాలు ఉన్నాయో గుర్తించి, ప్రాంతాలవారీగా మ్యాప్లను రూపొందిస్తారు. 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్న జనగణన సర్వేలో కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను నమోదు చేస్తారు. తొలి దశ సర్వేలో నివాస గృహం స్థితి, వాహనాలు, ఆహారపు అలవాట్లతోపాటు 33 రకాల ప్రశ్నలు ఉంటాయి. పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే ఈ సర్వే కొనసాగుతుంది. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలతోపాటు జిల్లా ప్లానింగ్ అధికారి, డీపీఓ, డీఎఫ్ఓ, జెడ్పీ సీఈఓ, డీఐసీ, ఎస్ఓ, డీఈఓతో కలిపి 10 మంది అధికారులు ఇళ్ల జాబితా, ఆ కుటుంబాల జీవనస్థితిగతుల నమోదును పరిశీలిస్తారు. జనాభా గణన ప్రధాన అధికారిగా కలెక్టర్ వ్యవహరించనున్నారు. ఆయనకు సహాయ ముఖ్య జిల్లా జనగణన అధికారిగా అదనపు కలెక్టర్ ఉంటారు. 26 నుంచి మే 5 వరకు స్వీయగణన జనగణనలో తాజాగా స్వీయ గణన నమోదు ప్రక్రియ తీసుకువచ్చారు. ఈనెల 26 నుంచి మే 5వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజలు తమ కుటుంబ వివరాలు, నివాసం వంటి పలు అంశాలు ప్రభుత్వం ఇచ్చిన ఆన్లైన్ పోర్టల్ se.census. gov.in లో స్వయంగా నమోదు చేయాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి అధికారిక వెబ్సైట్ లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక ఐడీ ఇస్తారు. ఫీల్డ్ ఎన్యుమరేటర్ ఈ డేటా ఐడీని ధ్రువీకరిస్తారు. నేటి తరానికి స్ఫూర్తిగా భూదాన పాదయాత్ర17బిఎన్జి209–ఫ జూన్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు ఫ ఈనెలాఖరులోగా మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని సూచన ఫ సింగన్నగూడెం వద్ద ఇళ్ల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష ఫ జనగణనలో భాగంగా ముందుగా ఇళ్ల సర్వే, ఆ తర్వాత జనాభా లెక్కింపు ఫ 26 నుంచి స్వీయగణన నమోదుకు అవకాశం ఫ వచ్చే నెల 11 నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయిలో ఇళ్ల సమాచార సేకరణ ఫ 2027 ఫిబ్రవరి 10 నుంచి మొదలుకానున్న జనగణన ఫ నేటి నుంచి మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మిస్తున్న 444 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు కోసం తక్షణమే రూ. 2.5 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు, మధ్యతరగతి వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, హౌసింగ్ పీడీ, డీఈ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2011 జనాభా లెక్కలు ఇలా.. జనాభా : 7,70,833 మహిళలు : 3,80,341 పురుషులు : 3,90,482 కుటుంబాలు : 1,88,520 జిల్లాలో జనగణనకు సంబంధించి మొదటి దశ శిక్షణ తరగతులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ప్రధాన జనగణన అధికారి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 18, 20, 21 తేదీల్లో మొత్తం మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాల్లో ఈ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమకు కేటాయించిన కేంద్రాలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. జనగణనలో సాంకేతికత వినియోగం పెరిగిన నేపథ్యంలో, మొబైల్ యాప్ల నిర్వహణ, డాటా ఎంట్రీ మరియు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై సిబ్బందికి నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనగణన సమయంలో పాటించాల్సిన విధివిధానాలు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టత కలిగి ఉండాలని పేర్కొన్నారు. జనగణన దేశ భవిష్యత్ ప్రణాళికలకు కీలకమైనదని, ఇందులో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. -
కులగణనలో మాదిగలకు తీవ్ర అన్యాయం
ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాదిగల జనాభాను తగ్గించి చూపించారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం ఆలేరు మండలంలోని కొలనుపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వే బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగలను తక్కువ చూపించి అసెంబ్లీ, పార్టమెంట్ సీట్లు రాకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. కుల గణన సమాచారాన్ని తారుమారు చేస్తే సామాజిక న్యాయానికి ఆటంకం కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుల రామన్, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకుడు మోత్కూరి ఐలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సైదాపురం సురేష్, గందమల్ల స్వామి పాల్గొన్నారు. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులు నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలు విశేషంగా జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చెరువుకట్ట పరిశీలన మోత్కూరు : మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు ఇటీవల వర్షా కాలంలో 20 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతుతో పెద్దఎత్తున కుంగిపోయింది. శుక్రవారం నీటి పారుదల శాఖ సూర్యాపేట చీఫ్ ఇంజనీర్ టీఎన్ భూషణ్రావు, తిరుమలగిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ సందర్శించి పరిశీలించారు. చెరువు కట్ట రోడ్డు ప్రాధాన్యతను పరిశీలించి అన్ని రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరుకాగానే మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట ఏఈలు చంద్రశేఖర్, అఖిల్ ఉన్నారు. వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి ఆత్మకూరు(ఎం) : ఉచిత వైద్యశిబిరాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. చేనేత జౌళి శాఖ, జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో చేనేత కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైధ్యాధికారి సుమన్ కల్యాణ్, చేనేత మరియు జౌళి శాఖ ప్రాంతీయ అధికారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, వైద్యాధికారి అమరావతి, చేనేత సంఘం మేనేజర్ వేముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలి గుండాల : ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదరరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశాన్ని గుర్రం మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్న తూకాలు ప్రారంభించడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మంచి నీరు, నీడ, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమని హరిశ్చంద్ర, దయాకర్రెడ్డి, కొమురయ్య, జోసఫ్, యాదయ్య, స్వామి, భిక్షం పాల్గొన్నారు. -
ద్వార పాలకుడి పురాతన విగ్రహం గుర్తింపు
వేములపల్లి, రామగిరి(నల్లగొండ): వేములపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో 13వ శతాబ్దం నాటి ద్వార పాలకుడి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర అన్వేషణ బృదం సభ్యుడు రాగి మురళి గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న విగ్రహాన్ని ఆయన పరిశీలించి విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివానాగిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఈ విగ్రహం శివాలయాల ముందు ఉండే ద్వార పాలకుడిదని, విగ్రహం అంసంపూర్తిగా ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయని.. మనకు వాటి గురించి తెలియక ధ్వంసం చేస్తుండడంతో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. -
భూ సంస్కరణలకు నాంది
భూదాన్పోచంపల్లి : 50వ దశకంలో పోచంపల్లిలో 500 కుటుంబాలు నివసించేవి. వీరిలో చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అప్పటి మద్రాస్, ఆంధ్రా, తెలంగాణలో కమ్యూనిస్టుల మద్దతుతో భూమిలేని ప్రజలంతా భూస్వాములపై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఆ సమయంలోనే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కారం కనుగొనడానికి గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే 1951 ఏప్రిల్ 17న పాదయాత్రగా పోచంపల్లికి వచ్చారు. మరుసటి రోజు ఏప్రిల్ 18న స్థానిక చెరువు సమీపంలో ఉన్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు తలా రెండెకరాల భూమి ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని 40 దళిత కుటుంబాలు తమ గోడు వెల్లబోసుకున్నారు. గ్రామంలోని భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డికి వేల ఎకరాల భూమి ఉందని, మీరు అడిగితే కాదనరని దళితులు వినోబాభావేకు చెప్పారు. దీంతో వెదిరె రామచంద్రారెడ్డిని అడిగిందే తడవుగా తన తండ్రి వెదిరె నర్సింహారెడ్డి జ్ఞాపకార్ధం 100 ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించారు. అక్కడికక్కడే వెదిరె రామచంద్రారెడ్డి దాన పత్రాన్ని రాసి వినోబాభావేకు అందించారు. ఆ భూమిని దళితులకు పంచి వినోబాభావే భూదానోద్యామానికి శ్రీకారం చుట్టారు. 100 ఎకరాలతో మొదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి ఐదేళ్లలో 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టారు. ఈ భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్థిక అసమానతలు తొలగడానికి దోహదపడింది. ఇలా పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆచార్య వినోబాభావే పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా పేర్కొనడం విశేషం. కాగా వెదిరె రామచంద్రారెడ్డిని అప్పటి పోచంపల్లి ప్రజలంతా భాయ్సాబ్ అని పిలిచేవారు. అతడు మొదట దళితులకు 100 ఎకరాల వ్యవసాయ భూమిని దానం చేయగా.. అనంతరం విడతల వారీగా మొత్తం 800 ఎకరాల వరకు భూమిని దానం చేశారు. ఆయన దానం చేసిన 14 ఎకరాలలోనే ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాఖ గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. అంతేకాక 24 ఎకరాలలో లక్ష్మణ్నగర్ కాలనీ, మరో రెండెకరాలలో ఇందిరానగర్ కాలనీలు ఏర్పాటయ్యాయి. వినోబాభావే దేశవ్యాప్తంగా తిరిగి సేకరించిన భూదాన్ భూములకు చట్టబద్ధత కల్పించాలని 1958లో అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ అధ్యక్షతన దేశంలోని మేధావులతో సమావేశం నిర్వహించి ‘భూదాన్–గ్రామదాన్’ చట్టాన్ని రూపొందించడానికి కమిటీని వేశారు. అనంతరం 1965లో అధికారికంగా భూదాన్–గ్రామదాన్ చట్టానికి చట్టబద్దత లభించింది. అనంతరం మిగిలిన భూదాన్ భూములను నిరుపేదలకు పారదర్శకంగా పంపిణీ చేయడానికి ఆయా రాష్ట్రాలలో భూదాన యజ్ఞబోర్డులను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూదానోద్యమం మొదలైంది ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి నుంచే. అందుకే దీనిని భూదాన్పోచంపల్లి అని పిలుస్తుంటారు. ఈ భూదానోద్యమంతో పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు లభించాయి. భూదానోద్యమం మొదలై నేటికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం. ఫ 75 ఏళ్ల క్రితం పోచంపల్లిలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన ఆచార్య వినోబాభావే ఫ 100 ఎకరాలు దానం చేసిన స్థానిక భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి ఫ నేడు పోచంపల్లిలో భూదానోద్యమ వజ్రోత్సవాలు నాడు భాయ్సాబ్(వెదిరె రామ చంద్రారెడ్డి) పోచంపల్లిలో ఉన్న మా దళితులకు 80 ఎకరాల భూమి దానం చేసిండు. 2 ఎకరాల చొప్పున 40 కుటుంబాలు వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. భాయ్సాబ్ మాపాలిట దేవుడు. ఆయనను ఊపిరి ఉన్నంత వరకు మరువం. – కరగళ్ల నర్సింహ, ప్రథమ భూగ్రహీత కుమారుడు -
వెట్టిచాకిరి నుంచి చిన్నారికి విముక్తి
అనంతగిరి(కోదాడ) : వెట్టిచాకిరి నుంచి ఏడేళ్ల బాలికకు విముక్తి కల్పించారు ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది. అనంతగిరి మండలం పాలవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో ఏడేళ్ల వయసున్న సుబ్బులు అనే బాలిక ఎండలో బాతులు మేపుతుండగా అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గమనించి చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది చిన్నారి వద్దకు చేరుకుని అనంతగిరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా.. తన తల్లిదండ్రుల పేర్లు సుబ్బయ్య, లక్ష్మి అని తెలిపింది. నాలుగేళ్ల క్రితం కోదాడ పట్టణంలోని చందానగర్కు చెందిన పాలకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద తనను వదిలి వెళ్లిపోయారని చెప్పింది. అప్పటి నుంచి శ్రీకాంత్ తనతో ఇంటి పనులు చేయించడం, బాతులు మేపించడం, తరచూ కొట్టడం, తిట్టడం చేస్తున్నాడని బాలిక ఏడుస్తూ పోలీసులకు వివరించింది. ఈ మేరకు పాలకుర్తి శ్రీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. అనంతరం చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు బాలికను సూర్యాపేట పట్టణంలోని బాల రక్షక భవన్కు తరలించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్... యజమాని కొట్టిన గాయాలను పోలీసులకు చూపిస్తూ చిన్నారి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాకుండా తనను చదివిస్తే చదువుకుంటానని ఆ చిన్నారి పోలీసులకు చెప్పింది. ఫ బాల రక్షక భవన్కు తరలించిన అధికారులు ఫ యజమానిపై కేసు నమోదు -
భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడంలేదని..
ఫ మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య రామగిరి(నల్లగొండ) : భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకుల కొండారం గ్రామానికి చెందిన చెనగోని రాకేష్కు(25) మూడేళ్ల క్రితం నల్లగొండ పట్టణానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప సంతానం. గత నెల పుట్టింటికి వెళ్లిన మమత తిరిగి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్ శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి మదార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నల్లగొండ రూరల్ ఏఎస్ఐ లాజర్ తెలిపారు. ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకోదాడరూరల్ : పరీక్షలో ఫెయిలైన ఇంటర్ విద్యార్థిని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో శుక్రవారం జరిగింది. వివరాలు.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన బొగ్గారపు లేక్ష్యా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్ట్లు ఫెయిల్ కాగా.. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి కళాశాలకు వచ్చింది. వచ్చిన గంట సేపటికే మొదటి అంతస్తులోని క్లాస్రూంకు వెళ్లి ఉరేసుకుంది. కళాశాల పక్క ఇంటి వారు గమనించి సిబ్బందికి చెప్పడంతో వారు వెళ్లి విద్యార్థినిని కిందకు దించి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ సీఐ కె. శివశంకర్ తెలిపారు. కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతిఫ మరొకరికి తీవ్ర గాయాలు మర్రిగూడ(చింతపల్లి) : లారీ కారును ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ శివారులో శుక్రవారం జరిగింది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ టౌన్కు చెందిన సూర్య గిరిధర్గౌడ్(28) బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన స్నేహితుడు అవినాష్తో కలిసి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గిరిధర్గౌడ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి స్నేహితుడు అవినాష్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి సోదరుడు సూర్య అరవింద్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతి త్రిపురారం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన బైరం పెదభిక్షం, లక్ష్మమ్మ భార్యాభర్తలు. వీరి వద్దే పెదభిక్షం చెల్లెలి కుమారుడు పగడాల ప్రకాష్ ఉంటున్నాడు. పెదభిక్షంకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ముగ్గురు కలిసి గురువారం మిర్యాలగూడలో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బైక్పై తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయడ్డారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పెదభిక్షం శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేడు వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ
భూదాన్పోచంపల్లి : భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వెదిరె రామచంద్రారెడ్డి సేవాసమితి, సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆవిష్కరించనున్నట్లు ఆలిండియా సర్వోదయ మండలి అధ్యక్షుడు వెదిరె అరవిందారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. భూదాన వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలిండియా సర్వసేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్ట్ మహాదేవ్ విద్రోహి, సర్వోదయ మండలి అధ్యక్షుడు తురుపునూరి కృష్ణ, వెదిరె రాంచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య, కొమ్ము లక్ష్మణ్, కరగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బంగారు పుస్తెలు తిరిగి అందజేత
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు పోగొట్టుకున్న బంగారు నల్లపూసల పుస్తెలను ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు. ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గొర్లనోనిబావికి చెందిన కావలి మంగమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు శుక్రవారం వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో ఆమె బంగారు నల్లపూసల పుస్తెలు పోగొట్టుకుంది. వెంటనే మంగమ్మ సమీపంలోని ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల సాయంతో పుస్తెలు దొరికిన వ్యక్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఓ నవీన్కుమార్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె. శేషగిరిరావు, ఎస్ఐ సీహెచ్. రవి సమక్షంలో మంగమ్మకు బంగారు పుస్తెలు అందజేశారు. -
సొంతిళ్లు ఉన్న వారిలో బీసీ–ఈ వారే తక్కువ
జిల్లాలోని మొత్తం నివాస సముదాయాల్లో సొంతిళ్లు కలిగిన వారిలో బీసీ–ఈ వారే తక్కువగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో బీసీ–సీ వారు ఉన్నారు. సొంతిళ్లు కలిగిన వారిలో మూడు జిల్లాల్లోనూ ఎస్సీలు, ఓసీలే ఎక్కువ ఇళ్లు కలిగి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సొంతిళ్లు లేని వారిలో ఎస్టీలే అత్యధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9.2 శాతం ఎస్టీలకు సొంతిళ్లు లేవు. అదే జిల్లాలో 7.5 శాతం ఎస్సీలకు సొంతిళ్లు లేవు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోనూ ఎస్టీలకు సొంతిళ్లు లేవు. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరుద్యోగులుగా ఉన్న వారు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 6.5 9.5 10.2 10.0 11.2 7.7 9.8 9.5 13.4 సూర్యాపేట 7.3 10.0 10.7 10.3 11.3 6.6 10.6 10.2 14.1 యాదాద్రి 9.0 12.2 12.3 11.7 12.8 10.5 12.2 10.6 14.7 -
చరిత్రాత్మక నిర్ణయం
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయం ఎంతో చరిత్రాత్మకమైనది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది పండుగ రోజు. ఎవరో ఇస్తే కాకుండా హక్కుగా మహిళలు చట్టసభల్లోకి వెళ్తారు. ఇప్పటికే అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్టసభల్లో హక్కు అందని ద్రాక్షగా మిగిలింది. అలాంటి తరుణంలో మహిళా సమాజానికి హక్కు కల్పిస్తూ చట్టం రావడం శుభ పరిణామం. రానున్న రోజుల్లో మహిళలు చట్టసభల్లో గొప్పగా రాణిస్తారు. – డాక్టర్ ఉజ్జిని మంజుల, ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, చౌటుప్పల్. -
భూదానంతో దేశానికి ఘన కీర్తి
భూదాన్పోచంపల్లి: వెదిరె రాంచంద్రారెడ్డి భూదానంతో పోచంపల్లికి, దేశానికి ఘన కీర్తి వచ్చిందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని కస్తూర్బా ప్రకృతి చికిత్సాలయం నుంచి పోచంపల్లి వరకు సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల భూదానోద్యమ స్ఫూర్తి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ ససందర్భంగా మాట్లాడుతూ.. పోచంపల్లిలో ఈనెల 18న భూదానోద్యమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచంపల్లిలో నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, సంఘమిత్ర సంస్థ ప్రతినిధులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్, తడక రమేశ్, భారత లవకుమార్, తడక లావణ్య, కొయ్యడ నర్సింహ, గుజ్జ సత్యం, పారిజాత, చక్రాల నర్సింహ, పిల్లలమర్రి దేవేందర్, రాపోలు జ్ఞానేశ్వర్, చింతకింది రమేశ్ పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏడీఈ
కొండమల్లేపల్లి : విద్యుత్ శాఖకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లు క్లియరెన్స్ ఇచ్చేందుకు ఏడీఈ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా గురువారం నల్లగొండ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ విద్యుత్ శాఖలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న సిరికొండ సైదులు ఓ కాంట్రాక్టర్ చేసిన పనులకుగాను రూ.10లక్షల బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్ నల్లగొండ ఏసీబీ పోలీసులను వారం క్రితం ఆశ్రయించాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గురువారం దేవరకొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ నుంచి ఏడీఈ రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పర్చి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కాగా.. హైదరాబాద్లోని ఏడీఈ సైదులు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు ఫ వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ -
అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదు
నకిరేకల్ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న చోట స్థానికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని ఆహ్వానించకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, కానీ గడిచిన 40 రోజుల ప్రణాళికలో ఏం సాధించారని ప్రశ్నించారు. చిన్నచిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో తూకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అదనపు తూకాలను నిలిపివేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొండ శ్రీనివాస్గౌడ్, నకిరేకల్, కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, సర్పంచ్ గోర్ల వీరయ్య, కౌన్సిలర్ పల్లె విజయ్, నాయకులు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, రావిరాల మల్లయ్య, గుండగోని జంగయ్య, దైద పరమేషం పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
లారీ ఢీకొని మహిళ దుర్మరణం
చౌటుప్పల్ : పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళను లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. చౌటుప్పల్లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబీకురాలైన కడారి యాదమ్మ (50) రోజువారీ కూలి పనికి వెళ్తుంది. భర్త మల్లయ్య ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉండే ఈడెం మల్లేష్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన ఫంక్షన్లో వంట వండేందుకు వెళ్లారు. సాయంత్రం పని ముగిసిన తర్వాత ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో వలిగొండ రోడ్డు నుంచి జాతీయ రహదారి క్రాస్ చేస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెనుక కూర్చున్న యాదమ్మ ఎగిరి కింద పడింది. లారీ టైర్లు ఆమైపె నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న మల్లేష్కు స్వల్ప గాయాలయ్యాయి. యాదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
ధాన్యం నిల్వలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: యాసంగి వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటి అవసరాలు, విత్తనాల కోసం ధాన్యాన్ని ఎలా భద్రపర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుంచి 20 శాతం నష్టపోయే ప్రమాదం ఉంటుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ పేర్కొంటున్నారు. ధాన్యం నిల్వ చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి ధాన్యం నూర్పిడి తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగచేస్తాయి. అంతే కాక ఎలుకలు ధాన్యాన్ని తినడమేకాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా వరికోతల సమయంలో ధాన్యంలో 20శాతం తేమ ఉంటుంది. గతంలో కూలీలతో వరి కోతలు కోపించేవారు. వరి పంటను కోసిన తర్వాత వరి పసలను ఆరబెడితే 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. కానీ ప్రస్తుతం రైతులు కూలీలపై ఆధార పడకుండా యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. పంట పచ్చగా ఉన్నప్పుడే వరి కోస్తున్నారు. దీంతో ధాన్యంలో మరింత తేమ ఉండే అవకాశాలు ఉంటాయి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి. నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాలు ముక్క పురుగు : పంట కోయడానికి ముందు నుంచి ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుంచి వెలువడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. వడ్ల చిలుక : ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే ధాన్యం చెడువాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌడ దశకు చేరిన తరువాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది. నుసి పురుగు : నుసి పురుగును పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో 3 మి.మీ పొడవు ఉంటుంది. ప్రౌడ కీడకం ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజ పైపొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది. ధాన్యం నిల్వ చేసే పద్ధతి రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల ద్వారా నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంటు కాంక్రీటుతో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షం నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచుల పైన, లోపల మలాథియాన్ లేదా ఎండో సల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో ఆరబెట్టాలి. ఎలుకల నివారణకు చర్యలు ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండా రోజూ శుభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్ మెస్ మూతలు అమర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. -
నేడు ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
భువనగిరిటౌన్ : తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేయాలని కోరారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలనిడిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీఓ అధ్యక్షుడు భగత్, పీఆర్టీయూ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
సంత కాంట్రాక్ట్లో నకిలీ చలానాల బాగోతం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత కాంట్రాక్ట్కు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల కోసం కాంట్రాక్టర్ సమర్పించిన చలానాలు నకిలీగా తేలాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంత కాంట్రాక్ట్ను దక్కించుకున్న నార్కట్పల్లి వాసి దూదిమెట్ల శ్రీనివాస్ రూ.1.22కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అలాగే 2024–25 సంవత్సరానికి గాను రూ.20లక్షలు, 2025–2026 సంవత్సరానికి గాను రూ.40 లక్షలు చెల్లించలేదు. ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలని సదరు కాంట్రాక్టర్పై పాలకవర్గం ఒత్తిడి తెచ్చింది. దీంతో సదరు గుత్తేదారు మొత్తం రూ.60లక్షలకు మార్చిలో పలుమార్లు దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్కి చెందిన ఆరు చలాన్లు సమర్పించాడు. అయితే ఈ ఆరు చలానాలు నకిలీగా అనుమానం రావడంతో పాలకవర్గం కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ చాలానా అంశంపై విచారణ చేయాలని డీపీఓ ద్వారా ఇన్చార్జ్ ఎంపీడీఓ సుధీర్కుమార్ను ఆదేశించారు. అయితే సదరు ఇన్చార్జ్ ఎంపీడీఓ విచారణ లేకుండానే నివేదిక పంపించడం గమనార్హం. ఇటీవల పాలకవర్గం బ్యాంకును సంప్రదించగా ఇవి నకిలీ చలానాలుగా అధికారులు తేల్చారు. ఈ విషయమై ఇన్చార్జ్ డీపీఓ శంకర్నాయక్ను వివరణ కోరగా నకిలీ చలానాల విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ రూ.60లక్షల బకాయిలకు నకిలీ చలానాలు సమర్పించిన కాంట్రాక్టర్ -
ఆరునెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం : ఎస్పీ
భువనగిరిటౌన్ : డ్రైవర్లు ప్రతి ఆరునెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఎస్పీ అక్షాంశ్యాదవ్ సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భువనగిరి బస్టాండ్ ఆవరణలో ఆటో, స్కూల్ బస్సులు, భారీ వాహన డ్రైవర్లకు చావా ఫౌండేషన్, పర్ఫెక్ట్ ఐ విజన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులతో కలిసి ఎస్పీ హాజరై మాట్లాడారు. కంటి చూపు సరిగ్గా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి సాయికృష్ణ, డీఎస్పీలు బి. రవీందర్, ప్రభాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు ఎం. రమేష్, మధు సూదన్ పాల్గొన్నారు. చౌటుప్పల్ @ 43 డిగ్రీలుచౌటుప్పల్ : ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం చౌటుప్పల్లో ఏకంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 7గంటల నుంచే ఎండ తీవ్రత మొదలయ్యింది. అలా గంట గంటకు పెరుగుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక్కసారిగా 41డిగ్రీలకు చేరింది. 3.30గంటలకు ఏకంగా 43డిగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అల్లాడిపోయారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే చిన్నకొండూర్రోడ్డు, తంగడపల్లిరోడ్డు, వలిగొండరోడ్డు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వేసవి తాపాన్ని తాళలేక జనం మంచినీళ్లు, శీతల పానీయాలు సేవించడానికి ఎగబడ్డారు. -
మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యం
భూదాన్పోచంపల్లి: మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భూదాన్పోచంపల్లి మండలంలోని ఏడుగురు మహిళా రైతులకు పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా సబ్సిడీపై మంజూరైన ప్యాడీ క్లీనర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి పథకం మహిళల పేరిటే అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఇంద్రియాల వీఓఏ లక్ష్మితో పాటు ఆయా బ్యాంకు మేనేజర్లను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ కోట జంగారెడ్డి, తహసీల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఏఓ శైలజ, డీపీఎం రవీందర్, ఏపీఎం తవుర్యానాయక్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పారిజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్ పాల్గొన్నారు. -
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది.- 8లోప్రతిభ ఉన్నా అవకాశాలు లేక వెనుకబడిపోయిన వనితలకు ఇప్పుడు ఒక వేదిక లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడం ఒక చట్టపరమైన నిర్ణయమే కాదు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న అతివల ఆశలకు వెలుగునిచ్చిన చరిత్రాత్మక క్షణం. ఈ బిల్లు నారీమణులకు గౌరవం.. స్వరం.. రాజకీయంగా సమాన హక్కులు కల్పిస్తుంది. ఒకఅమ్మ.. ఒక అక్క.. ఒక కూతురు.. దేశం కోసం చట్టాలను రూపొందించే స్థాయికి చేరిన శుభతరుణం. దేశ ప్రజాస్వామ్యాన్ని సమానత్వంతో నింపడమే కాకుండా సగభాగమైన వారికి చట్టపరమైన హక్కు ఇచ్చిన అపూర్వ సందర్భం ఇది. నారీ.. చట్ట సభల్లో సవారీ -
లింగ వివక్షలో తేడాలు
సామాజిక వర్గాల పరంగా చూస్తే లింగ నిష్పత్తిలో చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాల్లో ప్రతి వేయి మంది పురుషులకు మహిళల సంఖ్య తక్కువగా ఉండగా.. కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం జనాభా పరంగా చూస్తే మాత్ర లింగ నిష్పత్తి తక్కువే ఉన్నట్లు తేలింది. ప్రతి వేయి మందికి నల్లగొండలో 969 మంది మహిళలు, సూర్యాపేటలో 989 మంది, యాదాద్రిలో 974 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అదే ఓసీల్లో చూస్తే మాత్రం మూడు జిల్లాల్లో మహిళ నిష్పత్తి ఎక్కువగా ఉంది. సామాజికవర్గాల వారీగా.. సొంతిళ్లు కలిగిన వారి శాతం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 84.4 80.0 81.2 79.8 81.9 74.3 84.9 65.1 83.2 సూర్యాపేట 79.5 70.2 73.7 70.4 76.0 57.0 76.2 61.2 76.8 యాదాద్రి 73.8 72.2 72.7 69.7 73.4 62.1 75.2 55.9 76.9 ఇళ్లు లేని వారి శాతం నల్లగొండ 6.1 6.3 3.5 4.5 3.3 2.1 3.6 2.2 2.1 సూర్యాపేట 7.5 9.2 5.8 6.9 5.6 5.7 5.8 5 3.4 యాదాద్రి 6.1 6.2 4.0 5.1 3.7 2.3 3.8 3.9 3.3 -
ఉమ్మడి జిల్లాలో తేలిన బీసీల లెక్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కులాల వారీ జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే (ఎస్ఈఈఈపీఎస్–2024) ప్రకారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఎంత మంది బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారనే లెక్కలు ఉపకులాల వారీగా వెల్లడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెనుకబడిన వర్గాలు (బీసీ) 56 శాతం ఉండగా, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 12.45 శాతం, ఓసీలు 11.70 శాతం ఉన్నారు. ఇక, అటు బీసీల్లోనూ, ఓసీల్లోనూ ఉన్న ముస్లిం మైనార్టీలు 5.50 శాతం ఉన్నారు. అయితే, గతంలో ఎప్పుడు జనాభా లెక్కలు జరిగినా కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే వెల్లడించేవారు కానీ, ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే అనంతరం తొలిసారి ఉపకులాల వారీగా బీసీ, ఓసీల లెక్కలు కూడా స్పష్టంగా తేలడం గమనార్హం. సామాజికవర్గాల వారీగా జనాభా జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఓసీ అన్నీ కలిపి (బీసీలో ఓసీలో కలిపి) నల్లగొండ 3,14,670 2,29,625 7,86,788 94,613 1,78,043 16,03,739 సూర్యాపేట 2,21,989 1,50,665 5,01,982 66,277 1,31,376 10,72,289 యాదాద్రి 1,54,021 52,686 4,80,978 30,444 85,900 8,04,029 సామాజికవర్గాల వారీగా గ్రామీణ జనాభా నల్లగొండ 259196 216296 615509 36296 120982 1248279 సూర్యాపేట 176461 134204 380959 36817 88875 817316 యాదాద్రి 129245 50575 386267 15,641 71303 653031 సామాజిక వర్గాల వారీగా పట్టణ జనాభా నల్లగొండ 55474 13329 171279 58317 57061 355460 సూర్యాపేట 45528 16461 121023 29460 42501 254973 యాదాద్రి 24776 2111 94711 14803 14597 150998 -
బీసీల తరువాత ఎస్సీలే అత్యధికం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా 34,80,057 కాగా, అందులో బీసీలు 19,48,993 మంది ఉన్నట్లు తేలింది. ఎస్సీలు 6,90,680 మంది ఉండగా, ఎస్టీలు 4,32,976 మంది ఉన్నారు. ఓసీలు 4,07,408 మంది ఉన్నారు. ఇక బీసీ, ఓసీల్లోని ముస్లింలు 1,91,334 మంది ఉన్నట్లు తేలింది. అందులో బీసీ ముస్లింలే అత్యధికంగా ఉండగా, ఓసీల్లో ముస్లింలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ ముస్లింలు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. -
యాదాద్రిలో బీసీలు అధికం
జిల్లాల వారీగా జనాభాతో పోల్చితే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బీసీల శాతం ఎక్కువగా ఉన్నారు. సంఖ్యా పరంగా మాత్రం నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో సంఖ్యా పరంగా ఎక్కువే అయినా మొత్తం జనాభాలో బీసీలు 54 శాతం ఉండగా, సూర్యాపేటలో 52 శాతం ఉన్నారు. ఇక యాదాద్రిలో అత్యధికంగా 63 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా జనాభా ఉంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా అన్ని సామాజిక వర్గాల్లోనూ తక్కువే. టాయిలెట్ సదుపాయం ఉన్న కుటుంబాల శాతం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 69.8 79.7 88.5 86 91 94.3 86.6 92.6 93.8 సూర్యాపేట 68.7 73 84.6 81.9 85.7 87 83.7 88.7 92.8 యాదాద్రి 86.4 88.4 93.8 90.7 95.2 98.5 93.4 92.1 95.9 -
భయం వీడండి.. ప్రాణం నిలపండి
భువనగిరిటౌన్ : రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఓడుతున్న బాధితులను చూసి అయ్యో అనుకుంటూ వెళ్లిపోతుంటారు. పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతుంది. ఈ భయాలను పో గొట్టి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘రహ– వీర్’ అనే పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 18 వరకు జరుగుతున్న ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. గోల్డెన్ అవర్.. ప్రాణం నిలిపే సమయం ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడవచ్చు. ఈ కీలక సమయంలో బాధితులను ఆస్పత్రికి చేర్చే సామాన్య పౌరులే నిజమైన హీరోలు. వారినే ప్రభుత్వం రహ– వీర్గా గౌరవిస్తోంది. ఇందులో భాగంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి చేర్చి కాపాడిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం రూ. 25వేల నగదు బహుమతిని అందజేస్తోంది. అంతేకాకుండా సామాజిక బాధ్యతను గుర్తిస్తూ రవాణా శాఖ అధికారికంగా ప్రశంసా పత్రాన్ని ఇస్తుంది. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం సాయం చేసే వారికి పూర్తి రక్షణ ఉంటుంది. అనుమతి లేకుండా పోలీసులు వ్యక్తిగత వివరాలు అడగరు. సాక్ష్యం కోసం బలవంతం చేయరు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు బాధితులను ఆస్పత్రులకు తీసుకువచ్చినప్పుడు వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించాలి. డబ్బుల కోసం జాప్యం చేసినా లేదా సాయం చేసిన వారిని ఇబ్బంది పెట్టినా ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా వైద్య అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఇవే.. ఫ ప్రమాద సమయంలో సాయం చేసిన వ్యక్తి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి, ఆస్పత్రి యాజమాన్యం నమోదు చేస్తుంది. ఫ కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ ఈ వివరాలను పరిశీలించి, అర్హులను రహ–వీర్గా ఎంపిక చేస్తుంది. ఫ ఎంపికై న వారి ఖాతాలో నేరుగా నగదు జమ చేయబడుతుంది. ఫ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రిలో చేర్పిస్తే రూ. 25వేల నగదు బహుమతి ఫ రహ– వీర్ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ రోడ్డు ప్రమాద బాధితులకు సరైన వైద్యసేవలు అందకపోవడంతో 50 శాతం మరణాలు సంభవిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి బాధితులకు వైద్య ఖర్చులు అందించేందుకు ఫిబ్రవరిలో పీఎం రాహత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.50లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మొదటి 7 రోజుల వరకు అయ్యే అత్యవసర చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం బాధితులు ముందస్తుగా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు లేదా సహాయం చేసే వ్యక్తులు 112 నంబర్కు ఫోన్ చేయాలి. ఈ నంబర్ను ఎమర్జెన్సీ రెస్పాన్న్స్ సపోర్ట్ సిస్టమ్కు లింక్ చేయడం వల్ల, బాధితులకు తక్షణమే అంబులెన్స్ సాయంతోపాటు, సమీపంలోని ఆస్పత్రి వివరాలు అందుబాటులోకి వస్తాయి. -
ఇందిరమ్మ ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం
మునగాల: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన గురువారం మునగాల మండలంలోని తాడువాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోట సునీతకు 2008లో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉంది. కానీ వాస్తవానికి తన మంజూరు కాలేదని, ఇందిరమ్మ ఇళ్ల ఇల్లు మంజూరు చేయాలని గత కొంత కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. పలుమార్లు కలెక్టర్కు ప్రజావాణిలో మొర పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ తేజస్నందలాల్, ఎస్పీ నరసింహ, తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. దీంతో సునీత తన పేరు కల్గిన మరో మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తనకు కాలేదని చెప్పినప్పటీకీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని కలెక్టర్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుమందు డబ్బాను తీసి తాగేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న కొందరు అడ్డుకున్నారు. మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి సిబ్బందిసాయంతో సదరు మహిళ చేతిలో నుంచి పురుగుమందు డబ్బాను తీసేసి హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం సునీత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. తనకు న్యాయం చేయాలని, తన పేరు మీద వేరే వ్యక్తులకు ఇల్లు మంజూరు చేసిన అఽధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సునీత కోరడంతో కలెక్టర్ స్పందించి ఈ విషయమై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. -
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి
నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణ.. భద్రతా చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్ సూచించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ వారోత్సవాల సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుౖలపై నిత్యం ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని గుర్తించి అక్కడ అండర్ పాస్ల నిర్మాణానికి ప్రణాళిలకు రూపొందిస్తే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఎవరైన మోటార్ సైకిల్పై వస్తే హెల్మెట్ లేకుండా రావొద్దని ఈ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గ్రామ సభ తీర్మానాలు చేసి డీజీపీకి సమర్చించడం గొప్ప నిర్ణయమన్నారు. నకిరేకల్లో స్థలం చూస్తే ఇక్కడి ఎమ్మెల్యే వీరేశం కోరిన విధంగా మహనీయుల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల సమస్య పరిష్కారం కోసం చేపట్టే కార్యక్రమాల్లో వార్డు మెంబర్ నుంచి పైస్థాయి వరకు అందరిని, అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలని పోలీస్ శాఖ పక్షాన సీఎంతో చర్చించామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలందరు చైతన్యం కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. జిల్లా జాతీయ రహదారిపై ఈ సంవత్సరం జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ చౌహాన్, ఎమ్మెల్యేలు మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పాడిపరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అమిత్రెడ్డి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ యానాల అశోక్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, రోడ్డు భద్రత ప్రత్యేక అధికారి పోలిశెట్టి అంజయ్య, డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్నేత, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల,చౌగోని రజితా, స్దానిక సీఐలు హరిబాబు, కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రమాదాలు జరిగే చోట అండర్ పాస్లు నిర్మిస్తాం ఫ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్ రిజిస్టర్లను చెక్ చేసి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. అనంతరం ఓపీ రిజిస్టర్ను పరిశీలించి ప్రతిరోజూ వచ్చే రోగుల సంఖ్యపై వివరాలు సేకరించారు. ఆస్పత్రి పరిసరాలను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని, పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులున్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ప్రారంభం ఆర్భాటం.. కాంటాలో జాప్యం!
సాక్షి, యాదాద్రి: అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా క్షేత్రస్థాయిలో మాత్రం కాంటాలు మొదలవ్వలేదు. పలు మండలాల్లో కేంద్రాలు తెరిచి వారం గడుస్తున్నా ఒక్క క్వింటా ధాన్యం కూడా సేకరించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద వడ్ల కుప్పలు పోసి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధాన్యం ఎండిపోయి తూకంలో నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటు ఎండకు ఎండలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిల్లుల కేటాయింపులో ఆలస్యం గత వారం రోజులుగా అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, ఆలేరు, రాజాపేట, ఆత్మకూరు.ఎం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వలిగొండ, భువనగిరి, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేటతోపాటు పలు మండలాల్లో ఇంకా ప్రారంభించలేదు. అయితే ప్రారంభమైన కేంద్రాలకు రైస్ మిల్లులను ట్యాగింగ్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రైతులకు మాత్రం తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. నిల్వ చేయడానికి ఖాళీ స్థలం లేదని తాము కొత్తగా వచ్చే ధాన్యం ఎలా దించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు మిల్లర్ల నుంచి ఇచ్చే పూచీకత్తు విషయంలో సివిల్ సప్లై అధికారులకు పేచి పడింది. ప్రభుత్వం తాజా నిబంధనలపై మిల్లర్లు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో 3,14,621 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో అత్యధికంగా దొడ్డురకం సాగు చేశారు. అధికారులు 6,92,166 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేట్గా మిల్లర్ల కొనుగోలు, స్థానిక ప్రజల అవసరాలు, రైతుల విత్తనాలకు పోను సుమారు 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో దొడ్డు రకం 6,84,226 మెట్రిక్ టన్నులు, సన్నరకం 8 వేల మెట్రిక్ టన్నులు దిగుమతి అంచనా వేశారు. మొత్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు 179 ఐకేపీ కేంద్రాలు 154, ఎఫ్పీఓలు 15, మెప్మా 3 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాలు ప్రారంభించగా ఎక్కడ కూడా ధాన్యం కాంటా ప్రారంభం కాలేదు. రాశులు పోసి ఎదురుచూస్తున్న రైతులు మోత్కూరు మార్కెట్ యార్డులో పీఏసీఎస్, పాటిమట్ల, ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 9న ప్రారంభించారు. సుమారు 20 మంది రైతులు ధాన్యాన్ని తెచ్చి ఆరబోశారు. మాయిశ్చర్ రాలేదని కాంటా వేయడం లేదు. ఆత్మకూర్ (ఎం)లో ఈనెల 11న ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. 77 మంది రైతులు ధాన్యం రాశులు పోసి ఎదురుచూస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం, ఆలేరు మండలం గొలనుకొండ, కొల్లూరు, మందనపల్లి ఈనెల 12న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రాజాపేట మండలంలో ఈనెల 13న ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గుండాల మండల కేంద్రంలో ఈనెల 14న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా.. అన్ని చోట్ల రైతులు వడ్ల రాశులు పోసి కాంటా వేయడం కోసం ఎదురు చూస్తున్నారు. దిగుబడి, కొనుగోలు అంచనా వివరాలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో) దొడ్డు రకం : 6,84116 సన్న రకం : 8000 మొత్తం దిగుబడి అంచనా : 6,92,166 కొనుగోలు అంచనా : 4,50,000 వరి సాగు విస్తీర్ణం : 3,14,621 ఎకరాలు ఫ ధాన్యం కేంద్రాలు తెరిచినా మొదలు కాని కొనుగోళ్లు ఫ వారం రోజులుగా కల్లాల్లోనే రైతుల నిరీక్షణ ఫ తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చెప్పి తప్పించుకుంటున్న అధికారులు -
అండర్పాస్ నిర్మించాలని బీజేపీ రాస్తారోకో
చౌటుప్పల్ : నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్టాండ్ ప్రాంతంలో అండర్పాస్ లేకుండా పనులు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల భిక్షంగౌడ్ అన్నారు. అండర్పాస్ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని, ప్రధాన కూడలి ప్రాంతాల్లో అండర్పాస్లు ఇవ్వకుండా పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్లో ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దూడల భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. అండర్పాస్ ప్రారంభించే ప్రాంతాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ముందుకు జరిపి పనులు చేయడం వల్ల బస్టాండ్ వద్ద అండర్పాస్ లేకుండా పోతుందన్నారు. ఈమేరకు ఆర్డీఓ శేఖర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనయాదవ్, కౌన్సిలర్లు ఆలె శ్రీలతచిరంజీవి, బుడ్డ సురేష్, పోలేపల్లి లక్ష్మిముత్తయ్య, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి, శాగ చంద్రశేఖర్రెడ్డి, కంచర్ల గోవర్ధన్రెడ్డి, దిండు భాస్కర్, అమృతం దశరథ, గోశిక పురుషోత్తం, బత్తుల జనార్దన్, ఊదరి రంగయ్య, గుర్రం రవీందర్, జి.వేణు, భాను, శేఖర్ పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సందడి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల కాగా.. మోత్కూరు, చౌటుప్పల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన ఏడు రోజుల్లో అభ్యర్థులు కో ఆప్షన్ పదవి కోసం మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే కౌన్సిలర్ పదవితో దాదాపు సమానమైన కో ఆప్షన్ పదవికి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలను అధికార పార్టీ చేతుల్లో ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు పొత్తు ఉన్న సీపీఐతో కలిసి కో ఆప్షన్ సభ్యుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నారు. ఏడు రోజుల గడువు మున్సిపాలిటీలు కో ఆప్షన్ సభ్యుల దరఖాస్తుల స్వీకరణకు ఏడు రోజుల గడువు ఉంది. సెలవు రోజుల్లో కాకుండా ప్రభుత్వ పనిదినాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో రెండు మైనార్టీ, రెండు జనరల్ కేటగిరిలో కో ఆప్షన్ సభ్యులకు అవకాశం ఉంది. జనరల్ కేటగిరి, మైనార్టీ కేటగిరిలో ఒక్కో మహిళా కో ఆప్షన్ సభ్యులు తప్పకుండా ఉండాలి.ఫ మున్సిపాలిటీల వారీగా నోటిఫికేషన్లు విడుదల ఫ మైనార్టీలో ఇద్దరు, జనరల్ కేటగిరీలో ఇద్దరు సభ్యులకు అవకాశం ఫ ఆశావహుల్లో పెరిగిన ఆసక్తి -
కారులోనే ప్రాణం పోయింది
నార్కట్పల్లి : ఆడుకోవటానికి కారులోకి వెళ్లిన చిన్నారి వాహనం డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం నార్కట్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లికి చెందిన పేర్ని సతీష్, గాయత్రిల కుమార్తె పేర్ని శరణ్య (5) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద ఉన్న చిన్నారులతో కలిసి ఆడుకుంటుంది. ఈక్రమంలో శరణ్య తన ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులోకి వెళ్లింది. ఎవరూ గమనించకపోవడం, వాహనం డోర్లు, విండోస్ లాక్ కావడంతో అందులోనే ఉండిపోయింది. ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శరణ్య తల్లి గాయత్రి, కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో చివరకు వారి ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులో చూడగా వాహనం వెనుక సీటులో అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే కారు డోర్లు తీసి చిన్నారిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శరణ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.● ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారి ● డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి -
చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
భూదాన్పోచంపల్లి: మండలంలోని గౌస్కొండ గ్రామంలో చెరువులో మునిగి గల్లంతైన పాండాల శివ (24) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. రెస్క్యూ టీమ్, పోలీసులు సంయుక్తగా గల్లంతైన శివ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా.. చెరువు మధ్యలో శివ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని చెరువు నుంచి బయటికి తీసి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమ్తితం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుతన కుమారుడు శివను తోటి స్నేహితులే కొట్టి చంపి చెరువులో పడేశారని మృతుడి తల్లి మనోహర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మద్యం మత్తులో ఉన్న స్నేహితులు, శివతో ఘర్షణ పడ్డారని. ఘటన జరిగిన మధ్యాహ్న సమయంలో సమీపంలో ఉన్న రైతులు వీరి కొట్లాడిన మాటలు విన్నారని చెప్పింది. అంతేకాక శివ ముఖం వద్ద గాయాలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. మృతుడి తల్లి మనోహర ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. పాండాల శివ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
నడిచొచ్చిన రాజ్యాంగ నిర్మాత
● అంబేద్కర్ వేషధారణలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం సూర్యాపేట టౌన్ : డ్రగ్స్, గంజాయి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం అంబేద్కర్ వేషధారణతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. -
డివైడర్ను ఢీకొట్టిన బైక్
● చికిత్స పొందుతూ యువకుడు మృతి పెద్దఅడిశర్లపల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణానికి చెందిన జహంగీర్ (23)అంగడిపేట ఎక్స్రోడ్ వద్ద తన తండ్రితో కలిసి బ్యాటరీ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన బ్యాటరీ షాపును మూసివేసి తిరుగుపయనంలో ఇంటికి వెళ్తుండగా చిల్కమర్రి స్టేజి సమీపంలో అతడి బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డుప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు మర్రిగూడ: ఆటో, బైక్ ఢొకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మర్రిగూడ మండలంలోని బట్లపల్లి గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతితిప్పర్తి: కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్ద చోటు చేసుకుంది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతానికి చెందిన దిట్టకవి శ్రీనివాస్(58) ఈనెల 10న హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ఫ్రయాణంలో భాగంగా మంగళవారం తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొంది. దీంతో శ్రీనివాస్కు బలమైన గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య దిట్టకవి సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ అప్జల్ అలీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలు ● రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్నల్లగొండ టౌన్ : భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతాంగ ఉద్యమాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్లో రైతు సంఘం నల్లగొండ జిల్లా 24వ మహాసభలో వారు మాట్లాడారు. పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్, యూరియా అమ్మకం యాప్లు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వి.వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లయ్య, కత్తి శ్రీనివాస్రెడ్డి, అయితరాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
బత్తాయి రైతుకు మంగు ముప్పు
గుర్రంపోడు : బత్తాయికి వచ్చే మంగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో సాగవుతున్న బత్తాయి తోటల్లో ఎంతో కొంత మంగు ఆశించని తోట అంటూ లేదంటే సమస్య తీవ్రత ఏస్థాయిలో ఉందో చెప్పవచ్చు. కాయలపై వక్క లేదా ఊదా రంగు లేదా ముదురు గోధుమరంగు ఏర్పడటాన్ని మంగు అంటారు. ప్రస్తుతం కత్తెర బత్తాయి కాయలు మంచి సైజును సంతరించుకునే దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఎండలు ముదిరే మార్చి, ఏప్రిల్లో మంగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో బత్తాయిలో మంగును నివారించి విలువైన కత్తెర బత్తాయి పంటను కాపాడుకోవడానికి అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి మురళి పలు సూచనలు చేశారు. నల్లి పురుగులతో మంగుబత్తాయి కాయలపై మంగు ఏర్పడటానికి ప్రధాన కారణం మంగునల్లి. ఈ నల్లులు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వీటి పిల్లలు పసుపు రంగులోనూ, పెద్ద నల్లులు ఆరంజి రంగులోనూ ఉంటాయి. పిల్ల, పెద్ద మంగు నల్లులు పిందెలపైన, కాయలపైన పారాడుతూ బత్తాయి కాయల తొక్కల నుంచి రసం పీల్చుతాయి. రసాన్ని పీల్చే పక్రియలో నల్లి నోటి నుంచి రసాయనాన్ని వదులుతుంది. ఈ రసాయనం కాయతోలు నుంచి స్రవించిన ద్రవం, సూర్యరశ్మి మార్పు చెంది తుప్పురంగుగా మారుతుంది. బత్తాయి పిందెలకు నల్లి ఆశిస్తే కాయ సైజు తగ్గదు కానీ మంగు వచ్చి తోలు గట్టిపడి పెలుసుగా మారుతుంది. కాయ రుచిలో తేడా రాదు. ఐనా మంగు కాయలకు తోలు గట్టిపడి పెలుసుగా మారి చూడటానికి నల్లగా కనిపిస్తున్నందున మార్కెట్లో ధర పలకదు. మంగు నల్లి నివారణ ● రైతులు భూతద్దం సహాయంతో నల్లి ఉనికిపై నిఘా ఉంచాలి. ఒకటి, రెండు నల్లులు తోటలో ఎక్కడైనా పిందెలు, కాయలపై కనిపించగానే స్ప్రేయింగ్ మొదలు పెట్టాలి. సెల్ఫోన్పై కూడా కొమ్మను ఊపితే స్క్రీపై సన్నగా పాకుతూ కనిపించే మంగు నల్లి పురుగులు గమనించవచ్చు. రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టాలి. ● చెట్లలో కొమ్మల కత్తిరింపులు సకాలంలో సక్రమంగా చేసి చెట్టు లోపల గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి. ● తోటల్లో ఎండు పుల్ల కత్తిరించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలి. ఈ రాగి ధాతువు శిలీంద్రనాశిని కత్తిరించిన కొమ్మలకు రక్షణ ఇవ్వడమేగాక నల్లికి ప్రతి కూలంగా ఉంటుంది. ● మంగునల్లి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల ప్రాపర్గైట్ లేదా ఒక గ్రాము డైపెంధిరాన్ లేదా రెండు మిల్లీ లీటర్ల ఇధియాన్ వంతున కలిపి మందు మార్చుతూ అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి చొప్పున రెండు, మూడు సార్లు పిందెలన్నీ తడిసేలా పిచికారీ చేయాలి. ● మంగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే స్పైరో మిసిఫిన్ ఒక మిల్లీ లీటరు వేప నూనె మూడు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● పిందెలు గోళీకాయ సైజు నుంచి నిమ్మ కాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల సల్పేట్ ఆఫ్ పోటాష్ మరియు 5 గ్రాముల మల్టీకే ఒక మారు పిచికారీ చేస్తే నల్లిని అణిచివేయడంతోపాటు కాయసైజు నాణ్యత పెరగుతుంది. ● నీటి తడులు ఎక్కువ కాకుండా అవసరం మేరకు డ్రిప్ పద్ధతిలో అందించాలి. సిఫారసు మేరకు సమతుల సమగ్ర ఎరువులు సకాలంలో అందించాలి. మంగు సోకిన కాయలను తోటలో ఉంచకూడదు. తోటలో అంతరకృషి బాగా చేసి పరిశుభ్రత పాటించాలి.వాతావరణంలో మార్పులతో.. వేడి వాతావరణానికి మారుతున్న సమయం, వర్షాభావ పరిస్ధితులు మంగు ఉధృతికి ఎక్కువగా దోహదం చేస్తాయి. ఇటీవలి వరకు రాత్రి వేళల్లో మంచు కురవడం, ఉదయం బాగా ఎండ తీవ్రంగా ఉండటం మంగు ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. పంటను కాపాడుకునేందుకు ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి సూచనలు -
పాన్ మసాలా ట్రక్కు చోరీ కేసులో ఒకరి అరెస్ట్
ఆలేరురూరల్ : సుమారు రూ.కోటి విలువ చేసే పాన్ మసాలాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురైన కేసులో ఒకరిని మంగళవారం ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ యాలాద్రి వెల్లడించారు. హర్యానా నుంచి హైదరాబాద్కు పాన్ మసాలా లోడ్తో వస్తున్న కంటైనర్ ఏప్రిల్ మొదటి వారంలో ఆలేరు సమీపంలో అదృశ్యమైందని న్యూఢిల్లీకి చెందిన కంటైనర్ యజమాని వినోద్ ఉపాధ్యాయ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన కంటైనర్ డ్రైవర్ సద్దాం, అతడి స్నేహితుడు హైదరాబాద్కు చెందిన సిరాజ్తో కలిసి ఈచోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. ఆలేరు బైపాస్లో క్రషర్ వద్ద కంటైనర్ని నిలిపి అందులోని 296 కాటన్ల పాన్ మసాలా ప్యాకెట్లను వేరే వాహనంలోకి మార్చారు. తిరిగి కంటైనర్ వాహనాన్ని జనగాం జిల్లా రఘునాథ్పురం మండలం కోమలి హైవే పక్కను నిలిపేశాడు. అనంతరం ఆ సరుకును హైదరాబాద్లోని చంచల్గూడ ప్రాంతంలోని ఒక గోదాముకు తరలించారు. సద్దాం, సీరజ్ కలిసి అక్కడ దాచిపెట్టి విక్రయించాలని పథకం వేశారు. పోలీసులు డ్రైవర్ సద్దాం ఫోన్ నంబర్ సాయంతో ట్రాక్ చేశారు. చంచల్గూడలోని అతడి స్నేహితుడు సీరాజ్ ఇంట్లో ఉన్న సద్దాంను పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గోదాంలో నిలిపి ఉంచిన పాన్ మసాలా కాటన్లను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందులో దాదాపు రూ.79 లక్షల విలువ గల 236 కాటన్ల పాన్ మసాలను రికవరీ చేసినట్లు చెప్పారు. మిగతా 60 కాట్లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సద్దాంను రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న మరో నిందితుడు సీరాజ్ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సీజ్ చేసిన పాన్ మసాలా కాటన్లను ఆలేరు పోలీస్స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు -
రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం
తిప్పర్తి : అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహాలను మంగళవారం ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓ వ్యక్తి అభివృద్ధి చెందాలంటే చదువు తప్పనిసరి అని చెప్పారని పేర్కొన్నారు. అందరికీ ఓటు హక్కు, చదువు కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. అంబేడ్కర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, రూ.పది కోట్లతో మండల కేంద్రంలో సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఏఎమ్మార్పీ క్వాలకు రూ.450 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టామని, ఆ పనులు పూర్తయితే చివరి భూములకు నీరు అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సభకు తిప్పర్తి సర్పంచ్ బద్దం రజితసుదీర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీదర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఆర్అండ్బీ డీఈ గణేష్, ఏఈ గౌస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు పాశం సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తిప్పర్తి సర్కిల్లో అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ -
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో వలిగొండ–తొర్రూరు ప్రధాన రహదారిపై వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం హయత్నగర్కు చెందిన ఐదుగురు తెల్లవారు జామున తొర్రూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలడుగు శివారులో కారు అదుపుతప్పింది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్న బైక్ను మరో బైక్ ఢీ కొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. -
వన్యప్రాణులకు జలరక్షణ
నాగార్జునసాగర్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమైన నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్ టైగర్ రిజర్వ్ కోర్జోన్ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఓ పక్క అడవుల విస్తీర్ణం పెంచుతూ మరోపక్క వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సున్నిపెంట వరకు 2,166 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవి విస్తరించి ఉంది. సాగర్ ఫారెస్ట్ డివిజన్లో మూడు రేంజ్లు, 40 మేరకు బీట్లు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఫారెస్ట్ రేంజ్లో 76,350 ఎకరాలు, దేవరకొండ ఫారెస్ట్ రేంజ్లో 9,945 ఎకరాలు, కంబాలపల్లి రేంజ్లో 28,000 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. వేసవి సమీపించడంతో వాగులు, వంపులు, నీటి జాలు గుంతల్లో నిల్వగా ఉన్న వర్షపు నీటి నిల్వలు ఇంకిపోవడంతో వన్యప్రాణులకు నీరు దొరకక మైదానం ప్రాంతంలోకి వస్తూ రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో జంతువుల దాహార్తి తీర్చేందుకుగాను అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సుమారుగా 120 వరకు ఏర్పాటు చేసిన సాసర్పిట్లను శుభ్రం చేసి అందులో నీటిని పోస్తున్నారు. కొన్ని చోట్ల బోర్లు ఉండగా విద్యుత్ సౌకర్యం ఉన్న చోట పైపులైన్లు వేశారు. మరికొన్ని చోట్ల సోలార్ విద్యుత్ సౌకర్యంతో బోర్లకు మోటార్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా సాసర్పిట్స్లో నీటిని నింపుతున్నారు. బోర్లకు సమీపంలో ఉన్న నీటికయ్యలు, వంపులు, చెక్డ్యాంలను నింపుతున్నారు. క్షేత్ర స్థాయిలో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు సాసర్ఫిట్స్ వద్ద, మరికొన్ని దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జంతువుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జంతుగణనకు కూడా ఇది తోడ్పడే అవకాశం ఉంది. జంతువుల దాహార్తి తీర్చేందుకు ట్యాంకర్ల సాయంతో సాసర్పిట్లను నింపుతున్న అధికారులు విద్యుత్ సౌకర్యం ఉన్న చోట పైపులైన్ల ద్వారా సరఫరా వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటువేసవిలో అడవి జంతువుల సంరక్షణకు నీటికయ్యలు, చెక్డ్యాంలు, వంపుల్లోకి నీటి ని పారిస్తున్నాం. ట్యాంకర్ల సాయంతో సాసర్ పిట్లను నింపుతున్నాం. అగ్నిప్రమాదాలు జరగకుండా చెట్లను నరకకుండా, జంతువులను వధించకుండా అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. స్వచ్ఛంద సంస్థలు సైతం అడవుల రక్షణ బాధ్యత తీసుకోవాలి. – రమేష్, సెక్షన్ ఆఫీసర్ నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్–హాలియా, నల్లగొండకు వెళ్లే రహదారి వెంట మూడు రోడ్ల కూడలి (సమ్మక్క సారక్కల) సమీపంలో రూ.1.5 కోట్ల వ్యయంతో 250 ఎకరాల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో దారులు ఏర్పాటు చేసి పట్టణాల నుంచి వచ్చే పర్యాటకులను ఫారెస్ట్ శాఖ వాహనాల్లో అడవిలోకి తీసుకువెళ్లి చూపించి తిరిగి తీసుకువస్తారు. -
సెన్సార్ బోర్డులో భువనగిరి వాసికి కీలక బాధ్యతలు
భువనగిరిటౌన్ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడిగా భువనగిరికి చెందిన మెరుగు మధు నియామకమయ్యారు. ఈ మేరకు సీబీఎఫ్సీ హైదరాబాద్ ప్రాంతీయ అధికారి రాహుల్ గోవిల్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో మెరుగు మధు మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. సినిమా రంగానికి సంబంధించిన కీలక బాధ్యతల్లో నియామకం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ మెరుగు మధుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సేంద్రియ పంటల సాగుపై అవగాహనచౌటుప్పల్ : మండల పరిధిలోని తమ్మలోనిబావి గ్రామంలో వాకిటి రజితారెడ్డి–రాజేందర్రెడ్డిలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను మంగళవారం హైదరాబాద్లోని ఫనినీయ మహావిద్యాలయానికి చెందిన విద్యార్థులు పరిశీలించారు. రసాయన, పురుగు మందులు వాడకుండా పంటల సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషారాణి, డీన్ నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మొక్కు వస్త్రాల టెండర్ నోటిఫికేషన్ వేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో భక్తుల నుంచి సేకరించి, తిరిగి భక్తులకు మొక్కు వస్త్రాలను విక్రయించే టెండర్ నోటిఫికేషన్ వేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అన్నల్దాస్ వెంకటేష్ మంగళవారం ఆలయాధికారులకు వినతి పత్రం అందజేశారు. కొండపైన శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించే వస్త్రాలను సేకరించి, భక్తులకు మొక్కు వస్త్రాలను విక్రయించే టెండర్ల గడువు పూర్తి అయినా ఆలయాధికారులు మాత్రం టెండర్ల ప్రకటన జారీ చేయడం లేదన్నారు. దీంతో దేవస్థానానికి ఆర్థిక నష్టం కలుగుతుందని పేర్కోన్నారు. దేవస్థానం ఆదాయానికి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక సమానత్వంతోనే కులనిర్మూలన సాధ్యం భువనగిరిటౌన్ : ఆర్థిక సమానత్వంతోనే కులనిర్మూలన సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత రాజ్యాంగం – సామాజిక న్యాయం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, హక్కులు, అవకాశాలను కల్పించిందన్నారు. మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షత వహించిన సదస్సులో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, మండల నాయకులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కష్ణ, కొండమడుగు నాగమణి, మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, రజక వత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సురుపంగ ప్రకాష్, అనాజిపురం సర్పంచ్ రాయపురం సురేష్, నాయకులు ఏదునూరి వెంకటేష్, మచ్చ భాస్కర్, కొల్లూరి సిద్ధిరాజు, నరాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. బెల్టుషాపులు నిషేధించాలని తీర్మానంరాజాపేట : రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం గ్రామంలో బెల్టుషాపులు నిషేధించాలని మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మే 1 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించొద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నిడింటి నరేష్, ఉప సర్పంచ్ వెంకటేశం, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆవుదూడకు ఆర్థోపెడిక్ సర్జరీ కోదాడరూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి తుంటిఎముక విరిగిన ఆవుదూడకు ఆరు గంటలు శ్రమించి ఆర్థోపెడిక్ సర్జరీ చేశారు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు. నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన పశు పోషకుడు హైదరాబాద్ నుంచి గిర్ రకానికి చెందిన ఆవుదూడను ఆటోలో తీసుకొస్తుండగా చౌటుప్పల్ వద్ద ఆటోలోంచి కిందికి దూకింది. ఈ ప్రమాదంలో దూడ తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. దానిని చికిత్స కోసం సోమవారం కోదాడ పశువైద్యశాలకు తీసుకొచ్చారు. ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు భూక్యా మధు, డాక్టర్ సిరిపురపు సురేంద్ర సాయంత్ర 4 గంటల నుంచి రాత్రి 10 వరకు శ్రమించి విరిగిన ఎముకకు రాడ్లు వేసి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. అదే సమయంలో కోదాడకు వచ్చిన జిల్లా పశువైద్యాధికారి బి. శ్రీనివాసరావు డాక్టర్ పెంటయ్యను అభినందించారు. -
నేతన్నలకు ఆరోగ్య మస్తు
భూదాన్పోచంపల్లి, భువనగిరి టౌన్ : వస్త్ర సృష్టిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న చేనేత కార్మికుల చెంతకే వైద్య సేవలను తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నిరంతరం కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే వెన్నునొప్పి, కంటి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు ఈ శిబిరాల్లో చికిత్స అందించనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా హెల్త్ క్యాంప్లను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మే 13వరకు కొనసాగింపు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 10,323 మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా చేనేత, జౌళిశాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. మే 13 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ శిబిరాలలో జనరల్ ఫిజీషియన్, కంటి, ఎముకల వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నారు. అదేవిధంగా కార్మికులకు సాధారణ బీపీ, షుగర్ పరీక్షలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా మండల కేంద్రాల్లో గుర్తించిన ప్రదేశాలు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన టెక్నీషియన్స్తో పాటు వైద్యనిపుణులు శిబిరాల్లో అందుబాటులో ఉంటారు. శిబిరాలు ఇలా... ఈనెల 16న ఆలేరులోని గౌడ సంఘం భవనంలో వైద్య శిబిరం నిర్వహిస్తారు. 17న ఆత్మకూర్(ఎం) పీహెచ్సీ, 18న భువనగిరి యూపీహెచ్సీ, 20 నుంచి 23 వరకు చౌటుప్పల్ మార్కండేయ దేవాలయం దగ్గర కొయ్యలగూడెం వీవర్ బిల్డింగ్, కుంట్లగూడెంలో, 24న మోటకొండూర్ పీహెచ్సీ, 25న మోత్కూర్ పీహెచ్సీ, 27 నుంచి మే 2 తేదీ వరకు పోచంపల్లి చేనేత డైహౌజ్, మే 4న రాజాపేట పీహెచ్సీ, 5, 6 తేదీలలో రామన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 7న వలిగొండ పీహెచ్సీ, 8న యాదగిరిగుట్ట పీహెచ్సీ, 11న గుండాల పీహెచ్సీ, 12న నారాయణపురం పీహెచ్సీ, 13న పుట్టపాక క్లస్టర్ భవనంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు ఫ రేపటి నుంచి వైద్య శిబిరాలు -
హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
భూదాన్పోచంపల్లి: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని త్రిలింగ ప్రాంత సామాజిక సేవాప్రతి వాసుదేవానంద సరస్వతీ స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ సమాజంలో గౌరవం, ఐక్యమత్యం, అంకితభావం, సేవా గుణం, దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో కులాలు వేరైనా మనమంతా హిందువులమనే ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. తద్వారా దేశ నిర్మాణం పటిష్టమవుతుందన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ్ ఉప్పలంచ మల్లికార్జున్, రాష్ట్ర సేవికా సమితి కార్యవాహిక కటకం పావని, డాక్టర్ దేవరాయ స్వామి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, సీత శ్రీరాములు, కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివ, చిక్క కృష్ణ, హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి, ప్రధానకార్యదర్శి కొమ్ము లక్ష్మణ్, కోశాధికారి సాయిని భాస్కర్, ఉపాధ్యక్షులు సీత సత్యనారాయణ, చక్రాల నర్సింహ, ఎస్. సత్యనారాయణ, వంగూరి స్వామి, గునిగంటి మల్లేశం, శ్రీనివాసశర్మ, రుద్ర వెంకటేశం, బాలనర్సింహ, గునిగంటి రమేశ్, వెంకటేశ్, బల్ల దుర్వాసులు, చిట్టిమల్ల లక్ష్మినారాయణ, జల్ది నర్సింహ పాల్గొన్నారు. -
తొలిరోజే పాఠ్య పుస్తకాలు
రామన్నపేట: పాఠశాలల పునఃప్రారంభమయ్యే తొలి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో పాఠశాల ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు వివిధ దశల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగేది. కొన్ని పుస్తకాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆయా సబ్జక్టులో వెనుక బడేవారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా పాఠ్యపుస్తకాలు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుస్తకాలు నిల్వ ఉంచడానికి విద్యాశాఖ గోదాము ఖాళీ లేదు. దీంతో ఇతర శాఖల గోదాములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 46,107 మంది విద్యార్థులు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, పదిహేడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 46,107 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. వీరికి 3,92,250 పుస్తకాలు అవసరమని అధికారులు గుర్తించారు. కొన్ని జిల్లాలకు సంబంధించి మొదటిదశ పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలలోని గోదాములకు చేరుకున్నాయి. యాదాద్రి జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన గోదాము ఖాళీగా లేకపోవడంతో ఇతర శాఖల పరిధిలోని గోదాముల కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలను ఒకే విడతలో తెప్పించే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి పాఠ్యపుస్తకాలు చేరిన వెంటనే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధి పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ప్రవేశాలు పెంచడం ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం ద్వారా వాటి బలోపేతానికి అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలతో చాలా చోట్ల ఇప్పటికే ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడి ఈడు పిల్లలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులను కలుస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు పునాదులు వేయాలి. –సత్యనారాయణ, డీఈఓ భువనగిరి పాఠశాలలు, విద్యార్థులు ఇలాప్రభుత్వ 1,941 కేజీబీవీ 1,606 ఎంజేపీటీబీ 1,557 మండల/జెడ్పీ 34,221 మైనార్టీ గురుకులాలు 638 సాంఘిక సంక్షేమ గురుకులాలు 2,538 గిరిజన సంక్షేమ గురుకులాలు 290 మోడల్ స్కూళ్లు 1,865 తెలంగాణ గురుకులాలు 1,402 అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్ 49 మొత్తం విద్యార్థులు 46,107 మొత్తం టైటిల్స్ 221 కావాల్సిన పుస్తకాలు 3,92,250 ఫ పాఠశాలల పునః ప్రారంభం రోజే ఇచ్చేందుకు కసరత్తు ఫ 3,92,250 పుస్తకాలు అవసరమని అంచనా ఫ విద్యాశాఖ గోదాము ఖాళీలేక ఇతర శాఖలవి తీసుకోవడానికి యత్నం -
ఉత్తీర్ణత సాధించేలా..
భువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు తప్పిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా బుధవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. కొన్ని కళాశాలల్లో ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించే అవకాశం ఉండగా మరికొన్ని కళాశాలల్లో ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ద్వారా పాఠాలు బోధించనున్నారు. కొన్ని కళాశాలల్లో ఆశించిన స్థాయిలో రాని ఫలితాలు జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. తల్లిదండ్రుల సమావేశం వంటి వాటిని ఏర్పాటు చేసినా కొన్ని కళాశాలల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ సారి ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,346 మంది పరీక్షకు హాజరు కాగా 720 మంది ఉత్తీర్ణత సాధించి 53.49 శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 1,166 మంది హాజరు కాగా 815 మంది ఉత్తీర్ణత సాధించగా 69.90 శాతం నమోదైంది. బొమ్మలరామారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో మొత్తం 24 మందికి నలుగురు, ప్రథమ సంవత్సరంలో 41 మందికి ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు మంచిగా రాసేలా.. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో కొన్ని కళాశాలల్లో ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించే అవకాశం ఉండగా మరికొన్నింటిలో అధ్యాపకులు ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. పరీక్షలు సక్రమంగా రాసేలా సన్నద్ధం చేయనున్నారు. వారంలో రెండు నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తరగతులు ఈ నెల 15 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.గతంలో కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ర్యాంకులో తేడా ఉత్తీర్ణత శాతం పెరగడంతో గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణులుకాని విద్యార్థులకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇచ్చాం. – రమణి, డీఐఈవో ఫ ఇంటర్ తప్పిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఫ నేటి నుంచి ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ నిర్వహణ ఫ వారంలో రెండు నమూనా పరీక్షలు -
బుద్ధవనంలో కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ బృందం
నాగార్జునసాగర్: కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్ ధర్మేంద్రకుమార్శర్మ, సభ్యులు గౌతం, గుల్షన్రాజు సోమావారం సాయంత్రం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. స్థానిక ఇంజనీర్లతో కలిసి బుద్ధవనంలోని జాతక వనం, స్థూపపార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన వారిని సత్కరించారు. వారి వెంట ఎస్ఈ మల్లికార్జున్రావు, ఈఈ సీతారాం, డీఈ అశోక్, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ, నర్సింహ, విజయ్ తదితరులు ఉన్నారు. -
చెరువులో మునిగి యువకుడి గల్లంతు
భూదాన్పోచంపల్లి : చెరువులో నాటుపడవపై షికారుకు వెళ్లగా.. పడవ మునగడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్కొండ గ్రామానికి చెందిన పాండాల శివ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. శివ సోమవారం ఉదయం బైక్పై డ్యూటీకి బయల్దేరుతుండగా.. అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితులు దుర్గాప్రసాద్, సాయి, తరుణ్, మల్లేశ్, రాము ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని శివకు చెప్పారు. దీంతో శివ తన తల్లికి ఫోన్ చేసి ఈరోజు డ్యూటీకి వెళ్లడంలేదని చెప్పాడు. అనంతరం స్నేహితులంతా కలిసి గ్రామ శివారులోని చెరువు సమీపంలో మద్యం సేవించారు. అనంతరం చెరువు ఒడ్డున మత్స్యకార్మికులు చేపలు పట్టే నాటుపడవ కనిపించడంతో సరాదాగా చెరువులో షికారు కొడదామని అందరూ కలిసి పడవ ఎక్కి చెరువు లోపలికి వెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక పడవలోకి నీళ్లు రావడంతో వారంతా భయపడి చెరువులోకి దూకారు. ఐదుగురిని రక్షించిన చెక్క వెంకటేశ్..చెరువులోకి దూకిన వారంతా కొద్దిదూరం ఈత కొడుతూ వచ్చారు. మద్యం మత్తులో ఉండడంతో ఒడ్డు వరకు ఈదలేక కేకలు వేయగా.. అటుగా వెళ్తున్న మత్స్యకార్మికుడు చెక్క వెంకటేశ్ గమనించి థర్మాకోల్తో చేసిన తెప్ప సహాయంతో ఐదుగురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. శివకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఒడ్డుకు చేరిన యువకులు భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోచంపల్లి ఎస్ఐ భాస్కర్రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని శివ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఐదు నెలలుగా అందని వేతనాలు
పెద్దవూర: ప్రభుత్వ ఎస్టీ వసతి గృహాల్లో పనిచేసే వర్కర్లకు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేసే హాస్టల్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో వారి రోజువారీ జీవితం కుదేలవుతుంది. అప్పులు చేసి మరీ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 312 మంది వర్కర్లునల్లగొండ జిల్లాలో 43 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో విద్యార్థులకు వంట చేయడం, హాస్టల్ గదులను, పరిసరాలను, బాత్రూంలు, మూత్రశాలలు శుభ్రపరచడం వంటి పనులు చేసేందుకు గాను 312 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు హాస్టల్లోనే ఉంటూ పనులు చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వర్కర్లతో సమానంగా ... ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పనిచేసే రోజువారి వర్కర్లు రెగ్యులర్ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా.. వారికి ఇస్తున్న వేతనం రూ.13,328 మాత్రమే. పని మాత్రం ప్రతిరోజూ చేస్తున్నా. జీతం మాత్రం రావడం లేదని, ఇలా అయితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో తమ పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నారు. నవంబర్ నుంచి పెండింగ్..గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదని, దీంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నామని వర్కర్లు వాపోతున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేపు మాపు అంటున్నారు గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదు. పది రోజులైతే ఈ విద్యాసంవత్సరం కూడా అయిపోతుంది. జీతాల గురించి అడిగితే రేపొస్తాయి.. మాపొస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు హాస్టళ్లలోనే పనిచేస్తుండటంతో వేరే పనులకు వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి తక్షణమే వేతనాలు ఇప్పించాలి. – నాగేందర్, వర్కర్, ఎస్టీ హాస్టల్, పెద్దవూర కుటుంబ పోషణ కష్టంగా ఉంది ఐదు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. మాకు వేరే పనులకు వెళ్లడానికి వీలు ఉండదు. కిరాణ దుకాణాలు, పాలు పోసే వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చకపోవడంతో సరుకులు ఇవ్వడం లేదు. పాలు పోయడం లేదు. చేసిన అప్పులు తీర్చాలని అప్పులోల్లు ఒత్తిడి చేస్తున్నారు. – బొడ్డు రాములమ్మ, ఎస్టీ హాస్టల్ వర్కర్ పెద్దవూర కుటుంబ పోషణ భారంగా మారిందంటున్న ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే వర్కర్లు అధికారులు స్పందించి జీతాలు ఇవ్వాలని వేడుకోలు -
బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లు కల్పించాలి
దేవరకొండ : పార్లమెంట్లో మహిళా బిల్లుతో పాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో చేరిపల్లి జయలక్ష్మి, ముత్తమ్మ, వనం చంద్రకళ, శారద, శివ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి
పెన్పహాడ్ : విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. ఈ ఘటన పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దూపహాడ్ గ్రామానికి చెందిన రైతు దొంగరి మురళయ్య తన పాడి గేదెలను మేతకు తీసుకెళ్లగా.. పంట పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగ తగిలి గేదెలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ శాఖ నుంచి రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. తెగిన తీగను సరిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాటరీలు చోరీ చేసిన దొంగల అరెస్ట్ నేరేడుచర్ల : డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన టిప్పర్లలోని బ్యాటరీలు చోరీ చేసిన ముగ్గురు దొంగలను నేరేడుచర్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న రాత్రి నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద గల డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన మూడు టిప్పర్లలోని బ్యాటరీలతో పాటు జనరేటర్ రూంలోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. డాంబర్ మిల్లు వాచ్మన్ మాతంగి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి శివయ్య, కంచుగంటి కార్తీక్, పంటమూల జానయ్య చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు వారి ముగ్గురిని అరెస్ట్ చేసి హుజూర్నగర్ కోర్టులో హాజరుపర్చి జడ్జి తీర్పు మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చేపల వేటకు వెళ్లి మృతి నడిగూడెం : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి వల కాళ్లకు చిక్కుకొని చెరువులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. నడిగూడెం ఎస్ఐ గందమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన వట్టికూటి వెంకటేశ్వర్లు(45) సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వలను చెరువులోకి విసిరిన సమయంలో నీటి కాకి వలలో చిక్కుకోగా.. దానిని తీయడానికి వెంకటేశ్వర్లు నీటిలో ఈదుతూ వెళ్లగా కాళ్లకు వల చిక్కుకుని చెరువులో మునిగి మృతిచెందాడు. మృతుని భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. కాల్వలో బోల్తా పడిన కారు● ముగ్గురికి స్వల్ప గాయాలు సూర్యాపేటటౌన్ : కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం తెల్ల వారుజామున సూర్యాపేట పట్టణంలో జరిగింది. హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో సూర్యాపేటలోని అంజనాపురి కాలనీ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి కాల్వలో బోల్తా పడింది. కారు డ్రైవర్కు, ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. -
యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. సోమవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన పూజ చేపట్టారు. వివిధ పుష్పాలు, తులసీ దళాలతో స్వామివారిని లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే హత్య
చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ మణిభార్గవ్, రత్నావత్ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్ చేసే తాడును మణిభార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యాభర్తల అరెస్ట్ రిమాండ్కు తరలింపు -
రైతులను ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కట్టంగూర్ : ఐకేపీ కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకుల హవా నడుస్తుందని, రైతులను పట్టించుకునేవారు కరువయ్యారని ఆరోపించారు. రైతులు మరలా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి మార్కెట్లో పోసి రాత్రికి రాత్రే కాంటా వేసి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులు రోజుల తరబడి ఇబ్బందులకు గురువుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు ఇవ్వకుండా రైతుల సంఘాల పేరిట వేరే వారికి ఇవ్వటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 3 కిలోలు అధికంగా కాంటా వేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు పెరగటంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ అధికారుల నిఘా కొనుగోలు కేంద్రాలపై ఉండాలన్నారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సింహ, పెద్ది మల్లేష్ ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఎఫ్సీఐ ఉద్యోగినంటూ మోసం
మాడుగులపల్లి : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. యువతితో పెళ్లి కుదుర్చుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు పోలీసుల అదుపులో నిందితుడు..? -
భూదాన వజ్రోత్సవాలకు ఆహ్వానం
భూదాన్పోచంపల్లి : పోచంపల్లిలో 18న నిర్వహిస్తున్న భూదాన వజ్రోత్సవాలకు హాజరుకావాలని సోమవారం హైదరాబాద్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు ఆహ్వానపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య మాట్లాడుతూ.. వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత లవకుమార్, కొట్టం కరుణాకర్రెడ్డి, తడక యాదగిరి, కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, తొలుపునూరి కృష్ణ, పోతగల్ల నర్సింహ పాల్గొన్నారు. -
బైక్పై నుంచి కిందపడి..
త్రిపురారం : ౖబెక్పై నుంచి కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. సోమవారం త్రిపురారం ఎస్ఐ గైకూరి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి భద్రయ్య(50) ఆదివారం పని నిమిత్తం అడవిదేవులపల్లికి వెళ్లి రాత్రి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు వెంట ఉన్న రాయి తగిలి బైక్పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె ఉంది. -
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చనలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం విశేషంగా నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. మూసీ ప్రక్షాళనపై శ్రద్ధలేని ప్రభుత్వంభూదాన్పోచంపల్లి : ప్రభుత్వానికి మూసీనది సుందరీకరణపై ఉన్న శ్రద్ధ, దాని ప్రక్షాళనపై లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి విమర్శించారు. ఆదివారం భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీని పూర్తిగా ప్రక్షాళన చేసి పరీవాహక ప్రాంత గ్రామాలకు కాలుష్యరహిత సాగునీటిని అందించాలని కోరారు. మదర్డైరీ రైతులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెద్దరావులపల్లి నుంచి పోచంపల్లి వరకు పూర్తిగా ధ్వంసమై, అధ్వానంగా మారిన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గోడళ్ల నాగభూషణంగౌడ్, గీత పనివారల సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు యాదయ్య, మాజీ మండల కార్యదర్శి భీమగాని నర్సింహ, పార్టీ నాయకులు సంగెం గణేశ్, కొమ్ము బాలనర్సింహ, కంటె శ్రీశైలం, పర్వతం రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
చౌటుప్పల్లో ట్రాఫిక్ తిప్పలు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారితోపాటు సర్వీస్ రోడ్లపై ఆదివారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. వివాహాలు, ఇతర శుభకార్యాలు అత్యధికంగా ఉండడం..వీకెండ్ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు సాగించారు. దీనికి తోడుగా పట్టణంలో అండర్పాస్ నిర్మాణ పనులు సాగుతుండడంతో విజయవాడ మార్గంలో నవో దయ టాకీస్ నుంచి, హైదరాబాద్ మార్గంలో తంగడపల్లి చౌరస్తా నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో హైవేపై వచ్చే వాహనాలకు తోడుగా స్థానిక వాహనాలు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ మార్గంలో లింగోజిగూడెం శివారు వరకు, విజయవాడ మార్గంలో లక్కారం శివారు వరకు వాహనాలు బారులుదీరాయి. సాయంత్రం వరకు కొంత మేరకు రద్దీ తక్కువగానే ఉన్నా రాత్రి మాత్రం హైదరాబాద్ మార్గంలోనే భారీగా పెరిగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. సర్వీసు రోడ్ల వెంట ఉన్న దుకాణాలు, ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. -
చెరువులు నింపాలని రైతుల రాస్తారోకో
తుర్కపల్లి : మండలంలోని తిరుమలపూర్, వీరారెడ్డిపల్లి గ్రామాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తిరుమలపూర్లో భువనగిరి–గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు ఎండిపోయి, సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పంటలకే కాకుండా, పశువులకు కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, కాల్వల ద్వారా ఈ చెరువులకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నూకల శ్రీనివాస్ యాదవ్, రామకృష్ణరెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, సందీప్, శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. 14న భీమ్ యాత్రభువనగిరిటౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ కోరారు. ఆదివారం వారు భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 14న ఉదయం 8 గంటలకు హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కర్తల శ్రీనివాస్, సజావుద్దీన్, కూతాడి సురేష్, ఇటుకల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య ఆశయాలు సాధిద్దాం
వలిగొండ : దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. వలిగొండ మండలం కేర్చుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు కొమురయ్య అని గుర్తు చేశారు. కొమురయ్య నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అని కొనియాడారు. అనంతరం కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యామ మల్లేశం, మాజీ ఎంపీపీ నూతి రమేష్, సర్పంచ్ మద్దెల మంజుల, కొనపురి కవిత, వెంకటేశం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ధరల మంట!
ఆలేరు రూరల్ : పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు మండుతుంటే.. తాజాగా స్టీల్, సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఒక్కో ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.27వేల పైచిలుకు భారం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగాయి ఇలా.. అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండున్నర టన్నుల స్టీల్, 200 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. ఇరవై రోజుల క్రితం వరకు టన్ను స్టీల్ ధర రూ.63 వేలుకు ఉండగా ప్రస్తుతం రూ.70 వేలకు చేరింది. ఈ లెక్కన టన్నుకు రూ.7వేలు పెరిగింది. రెండున్నర టన్నులకు రూ.17,500 అదనపు భారం పడుతోంది. అలాగే సిమెంట్ బస్తా ధర ఇరవై రోజుల క్రితం రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.330కి చేరుకుంది. బస్తాకు రూ.50 పెరిగింది. పెరిగిన ధరతో సిమెంట్ రూ.10వేలు అదనపు భారం పడుతుంది. రూ.23.14 కోట్ల అదనపు భారం ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తుండగా లబ్ధిదారులు మరికొంత డబ్బులు కలిపి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కానీ పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఒక్కో ఇంటిపై రూ.27,500 అదనపు భారం పడుతుంది. ఈ ప్రకారంగా జిల్లాకు మంజూరైన 8,418 ఇళ్లకు సంబంధించి ఏకంగా రూ.23.14కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో పెరిగిన ధరలతో ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొందరు లబ్ధిదారులు వ్యాపారుల వద్ద, బంధువుల వద్ద వడ్డీలకు అప్పుతెచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నామని చెబుతున్నారు. ఆవేదనలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఇప్పటికే ప్రభుత్వ నిర్మాణ పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు చేసే బిల్డర్లు సైతం స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో తాము నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలు కావడం ఖాయమని బిల్డర్లు ఆవేదన చెందుతున్నారు. ఫ భారీగా పెరిగిన స్టీల్, సిమెంట్ రేట్లు ఫ టన్ను స్టీల్పై రూ.7వేలు, బస్తా సిమెంట్కు రూ.50 పెరుగుదల ఫ ఒక్కో ఇంటిపై రూ.27 వేల అదనపు భారం ఫ లబోదిబోమంటున్న లబ్ధిదారులు జిల్లాకు మంజూరైనవి 9,618 నిర్మాణాలు ప్రాంభించినవి 8,418 పూర్తయినవి 1,264 వివిధ దశలో ఉన్నవి 7,154 -
యాదగిరీశుడి ఆలయంలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూకాంప్లెక్స్ ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.40,34,619 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.యాదగిరీశుడి సేవలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీయాదగిరీశుడిని సీఎం రేవంత్రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ లడ్డూ ప్రసాదం అందజేశారు. -
‘జయ’కేతనం ఎగురవేసిన విద్యార్థులు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో టి. భూమిక, జి. శివమణి 468 మార్కులు, బి. సాయి, ఎల్. సంజన, ఎం. అనన్య, పి. సాయిలిక్షిత, ఎస్. మాధురి, ఎ. సాయిచర్విత, టి. సాయిహర్షిత 467, జి. సాయిప్రణవి, వై. భావన, ఎన్. దీక్షిత, ఎస్. మాన్విత, కె. సంజన 466, బి. విశ్వసేనాగౌడ్, కె. సాయిరెడ్డి, వి. హాసిని, కె.చరణ్య 465 మార్కులు సాధించారు. 460పైగా 43 మంది, 450పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. బైపీసీ విభాగంలో ఎం. ప్రగతి ఇవాంజలిన్ 438 మార్కులు సాధించింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో డి. సిరి 994, జి. శ్రీనిక, ఎం. భవ్యశ్రీ 992, ఎస్. అశువర్ధన్, జి. మనోవర్షిత 991, ఎండీ ముస్కాన్ 990, సీహెచ్. జయశ్రీ 989, ఎస్కే సాధియా ఇర్ఫానా, జి. శ్రీజ, ఎం. తీర్థశ్రీ, డి. వెన్నెల 988, టి. తేజస్వి, ఎన్. శ్రీలక్ష్మి, కె. స్లేష్మ 987, ఎన్. హారిణి 985 మార్కులు సాధించినట్లు చెప్పారు. 980 మార్కులకు పైగా 32 మంది, 950 పైగా 107 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. బైపీసీలో కె. శృతి 985, జె. మానస 981, జె. శ్రీనిత్య 980 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినంధించారు. -
ఎండల నుంచి పండ్ల తోటల రక్షణ ఇలా..
గుర్రంపోడు : అధిక ఉప్ణోగ్రతలు పండ్ల తోటలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వేసవిలో పండ్ల తోటల్లో సరైన నీటి యాజమాన్యం పాటించకపోతే తెగుళ్ల బారిన పడతాయి. ప్రధానంగా బత్తాయి తోటల్లో ఏటా కొన్ని చెట్లు వేరుకుళ్లు బారిన పడటం జరుగుతుంది. వేసవిలో పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన నీటి యాజమాన్య పద్ధతుల గురించి హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు ఇలా.. సరైన నీటి యాజమాన్యం కీలకంనీటి ఎద్దడి పరిస్థితులు ఉన్న చోట్ల వేసవిలో చెట్ల పాదుల్లో తడారిపోకుండా ఆకులు లేదా ఊకతో కప్పి ఉంచాలి. ఇలా మల్చింగ్ వల్ల నీటి అవసరం 20 నుంచి 30 శాతం తగ్గుతుంది. ఉదయం, సాయంత్ర వేళ నీరు అందించాలి. చెట్టు పాదులోని మట్టి ఎప్పుడూ చేతితో పట్టుకుంటే ముద్దకానంతగా పదునుతో ఉండాలి. తడి ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో ప్రతిరోజు కనీసం మూడు గంటలు నీరు అందించాలి. చెట్టుకు కనీసం 4 నుంచి 8 డ్రిప్పర్లు చెట్టు వయస్సును బట్టి ఏర్పాటు చేసుకోవాలి. మధ్యాహ్నం సూర్యకాంతి నుంచి రక్షణ కల్గించేలా చిన్న పండ్ల మొక్కలకు షేడ్ నెట్ లేదా తాటి ఆకులతో నీడనివ్వాలి. ముందుగా తోటలో ఆరోగ్యంగా లేని మొక్కలను గుర్తించి ఎండ నుంచి తట్టుకునేలా చేయాలి. మార్కెట్లో లభించే ఒత్తిడిని తట్టుకునే యాంటీ స్ట్రెస్ ద్రావణాలు వాడవచ్చు. ఇవి ఆకులపై తెల్లటి పొరలా ఏర్పడి సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. సేంద్రియ పదార్ధాల వినియోగం తప్పనిసరినేలలో తగినంత సేంద్రియ ఎరువులు పశువుల పేడ, వర్మీ కంపోస్టు లాంటివి నీటి ఎద్దడిని, ఎండ తీవ్రతను కొంతవరకు తట్టుకుంటాయి. పండ్ల తోటల్లో సేంద్రియ ఎరువులతో పాటు వర్షాకాలంలో జనుము, మినుము, జీలుగ లాంటి పంటలు వేసి దుక్కిలో దున్నుకుంటే నేల సారవంతమై నీటి ఎద్దడి తట్టుకుంటుంది.నీటి ఎద్దడితో వేరుకుళ్లు తెగులుప్రధానంగా పండ్ల తోటల్లో నీటి ఎద్దడి వల్ల వేరుకుళ్లు తెగులు సోకుతుంది. నీరు పెట్టినా వాడి పట్టినట్లు కనిపించడం ఈ తెగులు ప్రధాన లక్షణం. నీటి ఎద్దడి వల్ల అనేక శిలీంధ్రాలు విజభించి వేరకుళ్లు తెగులుకు దోహదం చేస్తాయి. నేలలో తడి ఎక్కువైనా, నీటి ఎద్దడికి గురైనా వేరుకుళ్లు తెగులు వ్యాపిస్తుంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చెట్లను బతికించుకునే అవకాశం ఉంటుంది. చెట్టుకు పది కిలోల చొప్పున వద్ది చేసిన ట్రై కోడర్మాను పది కిలోల వంతున పాదులో వేయాలి. నీరు కట్టిన మరుసటి రోజు 40 గ్రాములు కార్బండిజం, 50 గ్రాములు మాంకోజెబ్లు 20 లీటర్ల నీటిలో కలిపి పాదంతా తడిచేలా చేయాలి. మల్టీకే లాంటి నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేయాలి. హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు -
సత్తా చాటిన ‘గౌతమి’ కళాశాల
నల్లగొండ : ఇంటర్ ఫలితాల్లో నల్ల గొండలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో కె. సుదీక్ష, కె. హాసిని, బుర్రి కావేరి 468 మార్కులు, జుహనూరిన్, నలహిదా తన్వీర్, కె. హరిని, ఎన్. ప్రసన్న, పి. రమ్య, డి. ప్రవళిక, ఎ. వర్ష, ఎం. శివాని, యశ్వంత్రెడ్డి 467 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్. జ్యోతిక 438, డి. రేశ్మాదేవి, పి. ప్రసన్న, ఎం.గాయత్రి, కె. హనీషా, ఎ. స్పందన 437 మార్కులు పొందారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో జె. అనూష, పి.శ్రీచరణ్ 992 మార్కులు, ఎన్. తేజస్విని, కె.అనుష్క, డి.స్పందన, ఎం.అర్జున్, పవన్కుమార్రెడ్డి 991 మార్కులు సాధించారు. బైపీసీలో వి. ప్రణవిక 993 మార్కులు, సమమా సీరెన్, కె. సాత్విక, కె. దీక్షిత, ఎస్. నిఖిత 992 మార్కులు, ఎన్. సతీష్కుమార్ 991 మార్కులు పొందారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డులో ప్రమాదం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆలయ మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కర్మన్ఘాట్కు చెందిన తరుణ్, అతడి కుటుంబ సభ్యులు నలుగురు కలిసి కారులో ఆదివారం ఉదయం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం పూర్తయిన తర్వాత కారులో మొదటి ఘాట్ రోడ్డు నుంచి కిందకు దిగుతుండగా.. జీయర్ కుటీర్ వద్దకు రాగానే టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి ఘాట్ రోడ్డు ప్రహరీని ఢీకొట్టింది. కారులోని భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ట్రాఫిక్ పోలీసులు మరో వాహనం సహాయంతో కొండ కిందకు తీసుకెళ్లారు. ప్రహరీని ఢీకొట్టిన కారు -
ముగిసిన జాతీయ డయాబెటీస్ సదస్సు
నాగార్జునసాగర్ : రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్లోని విజయ విహార్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డయాబెటీస్ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి వెయ్యికి పైగా వైద్యులు పాల్గొని మధుమేహంపై తాజా అధ్యయనాలపై చర్చించారు. ఈ రెండు రోజుల్లో 30కి పైగా శాసీ్త్రయ ఉపన్యాసాలు, 15 పేపర్ ప్రజెంటేషన్లు, 10 పోస్టర్ ప్రజెంటేషన్లు, 5 వర్క్షాపులు విజయవంతంగా నిర్వహించారు. యువ వైద్యులు, పీజీ విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించి నిపుణుల సలహాలు, సూచనలు పొందారు. సదస్సు ముగింపు సందర్భంగా ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. సదస్సులో పాల్గొన్న వైద్యులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. వలంటీర్లు, స్పాన్సర్లను ప్రత్యేకంగా సన్మానించారు. గ్రామానికి కీడు సోకిందని.. ● వనవాసం వెళ్లిన కట్టంగూర్ వాసులు కట్టంగూర్ : గ్రామానికి కీడు సోకిందని ప్రజలంతా వనభోజనానికి వెళ్లారు. ఈ సంఘటన కట్టంగూరు మండల కేంద్రంలో ఆదివారం చోటచేసుకుంది. ఏడాది కాలంగా కట్టంగూర్లో వరుస మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వృద్ధులతో పాటు యువకులు మరణిస్తుండటంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన స్థానికులు, పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు పురోహితుడిని సంప్రదించారు. దీంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులంతా ఒక రోజు ఊరు విడిచి వనవాసం వెళ్లాలని పురోహితుడు సూచించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్తులంతా ఇల్లు వాకిలి ఊడ్చకుండానే ఇళ్లకు తాళం వేసి సకుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లారు. సంప్రదాయంగా వ్యవసాయ బావుల వద్ద వంటలు చేసుకొని అక్కడే భోజనం చేసి సాయంత్రం ఇళ్లకు తిరిగివచ్చారు. -
విప్స్ కంపెనీ ఏజెంట్ల అరెస్టు
రామగిరి(నల్లగొండ): అధిక లాభాలు, క్యాష్బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్న విప్స్ కంపెనీ ఏజెంట్లను నల్లగొండ రూరల్ అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఏఎస్పీ రమేష్ ఆదివారం వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన వినోద్ తుకారాం ఖుటే విప్స్ వ్యాలెట్ యాప్ను ప్రారంభించాడు. 2018లో దానిని విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా మార్చి వివిధ రకాల సేవల పేర్లతో అధిక లాభాలు, క్యాష్బ్యాక్ ఆఫర్లు అంటూ ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏజెంట్లను నియమించుకుని అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించారు. కమిషన్ వ్యవస్థ, ట్రేడింగ్, ప్రాపర్టీస్, మర్చంట్, క్యూఆర్ కోడ్ పేరుతో దుకాణాలు, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా నమ్మించి మోసం చేశారు. కొత్త యాప్తో మరోసారి మోసం.. విప్స్ కంపెనీకి చెందిన ఏజెంట్లు శనివారం నల్లగొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో పాత కస్టమర్లతో సమావేశం ఏర్పాటు చేసి వేవ్ అనే కొత్త యాప్లో రూ.లక్ష పెట్టుబడి పెడితే పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని ప్రచారం చేశారు. సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన కానాల లక్ష్మీనారాయణరావు, నకిరేకల్ మండలం మర్రూర్కు చెందిన పున్నం బాలకృష్ణ, చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన ఉయ్యాల శ్రీనివాస్, నల్లగొండ పట్టణానికి చెందిన కురాకుల రమేష్, మాదగోని సైదులు, కనగల్ మండలం దోరెపల్లికి చెందిన గాజుల మహేష్, నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన కోల కుశలయ్య, అప్పాజీపేటకు చెందిన ఓరుగంటి శంకర్, కట్టంగూర్ మండలం మునుకుంట్లకు చెందిన ముడుసు ఉమాశంకర్, కట్టంగూర్ మండలానికి చెందిన గుడపూరి లింగస్వామి ఉన్నారు. విప్స్ గ్రూప్ సీఈఓ వినోద్ తుకారాం ఖుటే, డైరెక్టర్లు సుమిత్ పురాంక్, సౌతిండియా డెవలప్మెంట్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డైరెక్టర్లు గుమ్మల సత్యనారాయణ, గుమ్ముల అభినాష్ పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలిసులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ఏఎస్పీ రమేష్ సూచించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్త యాప్ పేరుతో పాత కస్టమర్లను మోసం చేసేందుకు యత్నం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఏఎస్పీ రమేష్ -
వ్యాపారంగా మారుతున్న విద్యారంగం
నార్కట్పల్లి : దేశంలో విద్యారంగం వ్యాపారంగా మారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ, సీపీఎం మండల కమిటీ సభ్యుడు కల్లూరి యాదగిరి స్మారక స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అందరికీ విద్య ఉచితంగా అందించాలని సీపీఎం పోరాటం చేస్తోందన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని అన్నారు. నేటి యువత డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు రాక కూలీలుగా మారుతున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలే నేటి ప్రభుత్వాలకు ఎజెండాలుగా మారుతున్నాయని, పేదలకు గుండె బలం కమ్యూనిస్టులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, దండు నాగరాజు, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, జిట్ట సరోజ, జిట్ట నగేష్, చింతపల్లి బయ్యన్న, ఎస్సార్ వెంకటేశ్వర్లు, ఇల్లందుల లింగస్వామి, బత్తుల అనంతరెడ్డి, చెరుకు పెద్దులు, కుమ్మరి శంకర్, దండు రవి, కొప్పు శ్రవణ్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం
భూదాన్పోచంపల్లి : కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీకళాకృతీయ ఆర్ట్ ఫెస్టివల్శ్రీ నిర్వహించారు. ఈ ఫెస్టివల్కు యూనివర్సిటీ అడ్వైజర్ అయిన పూనం మాలకొండయ్య హాజరై విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కళల పట్ల ఆసక్తి పెంచుకోవడం ద్వారా సృజనాత్మక ఆలోచనలతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. కళా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. మార్కులు, ర్యాంకులే కాకుండా కళలలో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే కళాకృతియ ఆర్ట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసి కళలలో కూడా విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు రూపొందించిన పెయింటింగ్స్, హ్యాండ్మేడ్ వస్తువులు, మట్టి పాత్రలు, గృహాలంకరణ వస్తువులు, లైవ్ మ్యూజిక్తో పాటు ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య -
రూ.2కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ కాంట్రాక్ట్ ఉద్యోగి..?
దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని ఓ బ్యాంక్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.2కోట్లకు పైగా నగదును డిజిటల్ పద్ధతిన స్వాహా చేసి పరారైనట్లు ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దేవరకొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఓ బ్యాంకులో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దీర్ఘకాలికంగా డబ్బులు డ్రా చేయని ఖాతాలను ఎంచుకొని డిజిటల్ పద్ధతిన ఖాతాదారులకు తెలియకుండా దాదాపు రూ.2కోట్ల మేర లావాదేవీలు జరిపి పరారైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా బ్యాంక్కు సెలవులు ఉండడంతో ఎవరి ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ అయ్యిందో తెలియడంలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవరకొండ పోలీసులు తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి మద్దిరాల : వడదెబ్బతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మద్దిరాల మండలం చౌళ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజానాయక్తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానాయక్తండాకు చెందిన బానోత్ సైదులు(45) వ్యవసాయ పనులను చేసుకొని మధ్యాహ్నం చేను వద్ద నుంచి ఇంటికి వస్తుండగా వడదెబ్బ కారణంగా మార్గమధ్యలో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరు వర్గాల మధ్య చేపల పంచాయితీ మోతె : తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం రెండు వర్గాల మధ్య చెరువులో చేపలు పట్టే విషయమై పంచాయితీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి గ్రామంలోని కన్నె చెరువులో సంవత్సర కాలం నుంచి ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు సొంత ఖర్చులతో చేప పిల్లలు పెంచుతున్నారు. గత వారం నుంచి చేపలు పట్టేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ముదిరాజు కులస్తులు చేపలు పట్టేందుకు ఆదివారం చెరువు వద్దకు వెళ్లారు. దీంతో వారిని ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు అడ్డుకున్నారు. కన్నె చెరువు తమ పట్టా భూముల్లో కొంత మేరకు ఉన్నందున చేపలు పెంచుతున్నామని ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు బదులిచ్చారు. సమాచారం తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని ఇరు వర్గాల సభ్యులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి నిడమనూరు : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలంలోని వడ్డెరిగూడెం – కుంటిగోర్లగూడెం గ్రామాల మధ్యన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేష్(35) వరికోత మిషన్ డ్రైవర్గా పనిచేసేందుకు సాగర్ ఆయకట్టుకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం వరికోత యంత్రాన్ని నిడమనూరు మండలంలోని వడ్డెరిగూడెం శివారు నుంచి కుంటిగొర్లగూడెం తరలించేందుకు ట్రాక్టర్ను తీసుకెళ్తుండగా రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. -
ఇంటర్ ఫలితాల్లో ‘గీతాంజలి’ ప్రభంజనం
నల్లగొండ : పట్టణంలోని గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో బి. అర్చిత 994 మార్కులు, వి. శ్వేత, ఆర్. ప్రజ్ఞిత 993, బి. శ్రీవిద్య, కె. ఉమారాణి 992, ఎస్. సాయిమాధురి, కె. నిఖిల్కుమార్ 991, ఎస్. జగదీష్ 990 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్. ప్రవల్లిక, కె. వెరోనిక రాణి 988 మార్కులు, డి. చరణ్తేజ 987, టి. సింధు 981, ఎం. మంజుల 981, ఎల్. మీనా 980 మార్కులు సాధించారు. అదేవిధంగా ఫస్టియర్ ఎంపీసీలో సీహెచ్. సందీప్రెడ్డి, షేక్ సానియా, ఎస్. తులసి 466 మార్కులు, ఎన్. వంశీ, శైలజ 465 మార్కులు పొందారు. బైపీసీలో బి. నవ్య 437, కె. అంజలి, సీహెచ్. వరలక్ష్మి, ఎన్. అనూష 436, జి. హని వర్షిత 435 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ టి. నరేందర్రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్.మల్లారెడ్డి, ఎ.విమోచన్రెడ్డి, కె.రాజేందర్రెడ్డి, ఎ.జనార్దన్రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.


