Yadadri
-
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మనోహర్ సూచించారు. అసంక్రమిత వ్యాధులు, రెబీస్ నివారణ, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ ఆపీసర్లు, ఎంఎల్హెచ్పీలకు కలెక్టరేట్లో గురువారం శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ఎండకు బయటకు వెళ్లిన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పు, చక్కెర స్థాయికి మించి తీసుకోవడం వల్లే మధుమేహం వస్తుందని, వ్యాధిగ్రస్తులు జొన్న, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు సంబంధించిన రెబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అదే విధంగా హిమోఫిలియో దినోత్సవం సందర్భంగా హిమోఫిలియోపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ యధోద, డాక్టర్లు సత్యేంద్రనాథ్, అనిల్, అశ్విన్కుమార్, హేమంత్కుమార్, సుమన్కళ్యాణ్, శిల్పిని, రామకృష్ణ, సాయిశోభ, వీణ, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
అధికారుల అండదండలతోనే..
ఆలేరు మండలం కొలనుపాక, రాజనగరం, ధర్మారెడ్డిగుడెం, మంతపురి, సాయిగుడెం, తూర్పుగుడెం, గొలనుకొండ వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల సాకుతో అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు. రెండుమూడు డీడీలు తీసి పది ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. రహస్యప్రాంతాల్లో డంప్ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు లారీల్లో చేరవేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.5వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతోనే అక్రమ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. అక్రమార్కులు తమ సంపాదనంలో నెలనెలా వారికి కొంత ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. -
వాగులను తోడేస్తున్నారు!
జోరుగా ఇసుక అక్రమ రవాణా ధర్మారెడ్డిగూడెం టు కాచారం, హైదరాబాద్ యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం పరిధిలోని వాగు నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమార్కులు జేసీబీల ద్వారా ఇసుక తోడి కాచారం ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు అమ్ముతున్నారు. రోజూ సుమారు 30 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. వాగు వెంట ఉన్న రైతులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా సైదాపురం–మాసాయి పేట, మైలార్గూడెంను కలుపుతూ వలిగొండ చెరువు వరకు ఉన్న వాగు రూపురేఖలు లేకుండాపోయింది. వాగులో ఇసుక తరలించడంతో పాటు పరీవాహకంలో అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక కూడా తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫ ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పేరిట దందా ఫ ట్రాక్టర్ రూ.3000 వరకు విక్రయం ఫ లారీల్లో హైదరాబాద్కు తరలింపు ఫ మొక్కుబడిగా తనిఖీలు ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండాపోతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లను అవకాశంగా మలుచుకుని అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా రహస్య ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రధానంగా ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), అడ్డగూడూరు, రాజాపేట మండలాల్లో విస్తరించిన వాగులను అక్రమార్కులు టార్గెట్ చేస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. –యాదగిరిగుట్ట రూరల్, ఆలేరు రూరల్, రాజాపేట -
ముగిసిన ఎస్ఏ–2 పరీక్షలు
భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఎస్ఏ–2 వార్షిక పరీక్షలు గురువారం ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 715 పాఠశాలల్లోని 35వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి, 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. అందజేయనున్నారు. తాగునీటి సమస్య రావొద్దు యాదగిరిగుట్ట రూరల్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జెడ్పీ సీఈఓ శోభారాణి ఆదేశించారు. యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై తాగునీటి సరఫరాపై సమీక్షించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లోన్లు ఇచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్కుమార్, ఏపీఎం సుధాకర్, ఉద్యోగులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరింపజేయాలినల్లగొండ టౌన్: బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరింపజేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికం బోర్డు సలహా సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆ దిశగా ఽఅధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అయినప్పుడే టెలికం రంగం అభివృద్ధిపదంలో పయనిస్తుందన్నారు. అంతకు ముందు ఎంపీ రవిచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవిప్రసాద్, మురళికుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్కు ఎంపిక సంస్థాన్ నారాయణపురం : మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన కర్నాటి అక్షిత జాతీయ అర్చరీ స్పోర్ట్స్ మీట్కు ఎంపికై ంది. హైదరాబాద్లో ఈనెల 15నుంచి 17వ తేదీ వరకు జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్–2025 ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో 70, 60, 50, 30 మీటర్ల విభాగాల్లో అక్షిత విజేతగా నిలవడంతో నేషనల్ స్పోర్ట్స్ మీట్కు ఎంపిక చేశారు. అక్షిత హైదరాబాద్లోని కంచన్బాగ్ కేంద్రీయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి పూర్తి చేసింది. గత ఏడాది కూడా జాతీయస్థాయిలో మెడల్ సాధించింది. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ సాధించడం తన లక్ష్యమన్నారు. జాతీయ స్థాయి పోటీల కోసం తన తండ్రి అప్పు చేసి 20 రోజుల పాటు శిక్షణ ఇప్పించారని, ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. -
వరి గడ్డి ధర రెట్టింపు
భువనగిరి, రామన్నపేట : వరి గడ్డి బంగారంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. దీంతో వానాకాలం సీజన్ పూర్తయ్యే దాకా ఎండుగడ్డిని భద్రపరుచుకునే అవసరం పాడి రైతులకు ఏర్పడింది. ముందు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. 2,91,000 ఎకరాల్లో వరి సాగు యాసంగిలో 2,91,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. మూసీ పరీవాహకంలో వరి నాట్లు కొంత ఆలస్యం కాగా.. మూసీ పరివాహకేతర ప్రాంతాల్లో ముందుగానే నాట్లు వేశారు. దీంతో మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో 15 రోజుల క్రితం నుంచే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బావులు, బోర్లు వట్టిపోయి సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. ఎండిన పంటను రైతులు పశువులు, జీవాలకు వదిలారు. దీంతో ఎండుగడ్డికి డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది, ఈసారి ధర ఇలా.. వర్షాలు సమృద్ధిగా కురిసిన సంవత్సరం ఎండుగడ్డికి అంతగా డిమాండ్ ఉండదు. చాలామంది రైతులు అమ అవసరాలకు కొంత నిల్వ చేసుకుని, మిగతా గడ్డిని పొలంలోనే కలియదున్నేవారు. కానీ, ఈ యాసంగి సీజన్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఎండుగడ్డికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది యాసంగిలో ఎకరం గడ్డి రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయించారు. ప్రస్తుతం ఎకరం గడ్డి రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. కట్టలెక్కన గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. ప్రధానంగా మూసీ పరివాహకేత ప్రాంతాల్లో బోరు బావుల కింద పండే వరి గడ్డిని పశువులు ఎక్కువగా మేస్తాయి. దీంతో ఈ గడ్డికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంగా మారిన గడ్డి ఎండుగడ్డి వ్యాపారంగా మారింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారుల అవతారం ఎత్తారు. వరి కోతలు ప్రారంభించకముందే వ్యాపారులు ముందుగానే గడ్డి బుక్ చేసుకుంటున్నారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇది వ్యాపారులకు ఉపాధిగా మారింది. ధర పెరిగింది బోరు అడుగంటడంతో యాసంగిలో సాగు చేసిన వరి చేను పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులకు గడ్డి కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలం గడ్డి వచ్చే వరకు సుమారు 3 ఎకరాల గడ్డి అవసరం అవుతుంది. కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎకరానికి రూ.వెయ్యికి పైనే చెబుతున్నారు. గతంలో ఎకరం గడ్డి రూ.500లకే వచ్చేది. –వనగంటి రవీందర్, రైతు పహిల్వాన్పురం ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. వేలాది ఎకరాల్లో ఎండిన చేలు ఫ ముందస్తు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేస్తున్న పాడి రైతులు ఫ ఎకరం విస్తీర్ణంలోని గ్రాసానికి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు డిమాండ్ఇతర జిల్లాల నుంచి.. ఆత్మకూర్(ఎం), మోత్కూరు, ఆలేరు, రాజాపేట, అడ్డగూడూరు, గుండాల, భువనగిరి, వలిగొండ, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడి గడ్డి నాణ్యవంతంగా ఉంటుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న సిద్ధిపేట, మెదక్, మేడ్చల్ జిల్లాల రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, ఆటోల్లో తరలిస్తున్నారు. -
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలు నేత్రపర్వంగా చేపట్టారు. గురువారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చాన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు స్వామి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణం, జోడు సేవత్సంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
‘భూ భారతితో’ భూ సమస్యలకు చెక్
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గురువారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. రైతుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఇకపై భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందన్నారు. ప్రతి రైతుకూ భూధార్ కార్డు : కలెక్టర్ హనుమంతరావు ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు భూధార్ కార్డు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భూభారతి చట్టం 36 ఆప్షన్లతో రైతులకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో కూరెళ్ల అనిల్ ఇంట్లో సన్నబియ్యంతో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములునాయక్, మార్కెట్ డైరెక్టర్ పాశం వినోద, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం
మునుగోడు: ఆరేళ్ల చిన్నారి ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతుండగా.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని తహసీల్దార్ నరేందర్ భరోసా ఇచ్చారు. మునుగోడు మండలంలోని కల్వ లపల్లి గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్– అనిత దంపతుల పెద్ద కుమారై ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతోంది. ఆ కుటుంబ ధీనగాధని గురువారం సాక్షి దినపత్రికలో ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్ శీర్షికన కథనం ప్రచురించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి కుటుంబ పరిస్థితి పరిశీలించి నివేదిక అందించాలని మునుగోడు తహసీల్దార్ను ఆదేశించారు. ఈమేరకు ప్రసన్న ఇంటికి వెళ్లి ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితులపై తహసీల్దార్ ఆరా తీశారు. అయితే కుటుంబానికి రేషన్ కార్డు లేకపోవడంతో ఎక్కడా ఉచిత వైద్యసేవలు అందడంలేదని కథనంలో ప్రచురించగా ఆ కుటుంబానికి నూతన రేషన్ కార్డు మంజూరుచేస్తామని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కలెక్టర్కు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తాము రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నామని, మంజూరైతే తమ కుమారైకు ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల ద్వారా ఉచిత వైద్యసేవలు అందుతాయని పేర్కొంటున్నారు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న ప్రసన్నను పరామర్శించిన తహసీల్దార్ -
కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేలేని అసమర్థులు వారే..
నకిరేకల్: పదేళ్ల పాటు అధికారంలో ఉండి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలేని అసమర్థులు బీఆర్ఎస్ పార్టీ వాళ్లేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నకిరేకల్లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల విషయంలో మాజీ మంత్రి జగదీష్రెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వీరేశం ఖండించారు. 2014లో తాత్కాలికంగా 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయిస్తే అవే అసంపూర్తిగా వస్తున్నాయన్నారు. గడిచిన పదేళ్లలో ఉమ్మడి జిల్లాకు కృష్ణానది నుంచి చుక్కనీరు తేలేకపోయారన్నారు. వారు నిజంగా రైతుల పక్షపాతి అయితే బ్రాహ్మణ వెల్లంల, డిండి, నక్కలగండి ప్రాజెక్టులతోపాటు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం కష్టపడుతుంటే మాజీ మంత్రి జగదీష్రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో నకిరేకల్ పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నాయకులు లింగాల వెంకన్న, కంపాసాటి శ్రీనివాస్, నకిరేకంటి నరేందర్, పన్నాల శ్రీనివాస్రెడ్డి, యాసారపు వెంకన్న, గడ్డం స్వామి పాల్గొన్నారు. మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకోం నకిరేకల్ ఎమ్మేల్యే వేముల వీరేశం -
విద్యుదాఘాతంతో ప్లంబర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన సంస్థాన్నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన కొల్లూరి పవన్(19) ప్లంబర్గా పనిచేస్తున్నాడు. కొత్తగూడెం గ్రామంలో నూతన ఇంటిలో జరుగుతున్న ప్లంబర్ పనికి వెళ్లాడు. ప్లంబింగ్ మిషన్కు ఎర్తు రావడంతో పవన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పవన్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్ తెలిపారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన గుంటి ఆదినారాయణ(65) తన స్కూటీపై పట్టణానికి వస్తున్న క్రమంలో అదే రోడ్డులో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆదినారయణ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఆదినారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డైమండ్ నేత్ర నిధి ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను సంప్రదించగా మృతుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ● మృతుడి నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు -
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
కేతేపల్లి: కేతేపల్లిలో గురువారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా మోటకొండూరు గ్రామానికి చెందిన బందనాదం అరుణ(33)ఇటీవల తన తల్లిగారి ఊరైన కేతేపల్లి మండలంలోని రాయపురం గ్రామానికి వచ్చింది. ఈక్రమంలో తన ఇద్దరు పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు గురువారం కేతేపల్లికి వచ్చిన అరుణ స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలో కాలి నడకన రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో అరుణ తలకు తీవ్రంగా గాయమైంది. సమాచారం అందుకున్న కేతేపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అరుణ ఆరోగ్యం విషమించి గురువారం సాయంత్రం మృతి చెందింది. కాగా.. మృతురాలి భర్త ప్రసాద్ ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి పదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. పెట్రోల్ పోసుకొని బాలిక ఆత్మహత్యబీబీనగర్: మానసిక స్థితి సరిగా లేక మనోవేదనకు గురవుతున్న బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రవెళ్లి గ్రామానికి చెందిన గుండు దీపిక(17) మానసిక స్థితి బాగోలేక గత కొంత కాలంగా ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మనోవేదనకు గురై గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అరుపులు బయటకు వినిపించడంతో స్థానికులు దీపికను 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉరేసుకుని యువకుడి బలవన్మరణం తిరుమలగిరి(నాగార్జునసాగర్): కొన్ని నెలల క్రితం తల్లి మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుమలగిరి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపెల్లి గ్రామానికి చెందిన చిత్రం కొండల్(35) భువనగిరి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తన తల్లి మృతి చెందటంతో అవివాహితుడైన కొండల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. -
భూదానం.. వజ్రోత్సవం
భూదానోద్యమం పురుడుపోసుకుని 74 ఏళ్లు పూర్తిభూదాన్పోచంపల్లి : భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగి నేటికి (శుక్రవారం) సరిగ్గా 74 ఏళ్లు పూర్తయ్యాయి. అడిగిందే తడవుగా వెదిరె రాంచంద్రారెడ్డి ఒకటి, కాదు రెండు కాదు.. ఏకంగా 100 ఎకరాల భూమి 1951 ఏప్రిల్ 18న దానంగా ఇచ్చి పోచంపల్లిలో భూదానోద్యమానికి నాందిపలికారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దాంతో పోచంపల్లికి భూదాన గంగోత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. భూదానోద్యమానికి బీజం పడి 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా భూదాన వజ్రోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించి ప్రజలలో భూదాన స్ఫూర్తిని కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. స్ఫూర్తినిచ్చిన భూదానం..మహాత్మాగాంధీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయంలో సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్ ఆహ్వానం మేరకు 1951 ఏప్రిల్15న హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి వెంటనే పాదయాత్రగా బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం హరిజనవాడలో తిరిగి ఆ రోజు రాత్రి పీర్లకొట్టం (ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు అనగా ఏప్రిల్ 18న చెరువు సమీపంలో నున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో వినోబాభావే స్పందిస్తూ, మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా అని అడగటంతో అక్కడే ఉన్న పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి తన తండ్రి జ్ఞాపకార్ధం 100ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి నిండుసభలో వినోబాభావేకు అందించారు. దాన రూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. దీనికి గుర్తుగా పోచంపల్లిలో భూదానస్తూపాన్ని నిర్మించారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి విశ్వవ్యాప్తమై పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇలా 100 ఎకరాలలో మెదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టబడింది. మహోన్నతమైన భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగడానికి దోహదపడింది. పోచంపల్లితో విడదీయని అనుబంధంఆచార్య వినోబాభావేకు పోచంపల్లితో విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 గాంధీ వర్ధంతి జనవరి 30న రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబాభావే పేర్కొనడం విశేషం. వినోబాభావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.టూరిజం పార్కులో నేడు ప్రత్యేక కార్యక్రమాలు భూదానోద్యమం ఆవిర్భవించి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా పోచంపల్లిలో శుక్రవారం భూదాన వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినోబాబావే మందిరంలో ఉదయం శాంతి యజ్ఞం, ఆచార్య వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేయనున్నట్లు తెలిపారు. సర్వోదయ మండలి ఆధ్వర్యంలో..భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో స్థానిక టూరిజం పార్కులో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ గురువారం తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగించిన భూదానం భూదానోద్యమం ద్వారానే దేశంలో భూసంస్కరణలు నేడు పోచంపల్లిలో భూదాన వజ్రోత్సవాలుప్రారంభానికి నోచుకోని వినోబాభావే మందిరం2012లో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి పోచంపల్లిని సందర్శించిన సందర్భంగా.. శిథిలావస్థకు చేరిన వినోబాభావే మందిరాన్ని పునఃనిర్మించాలని భూదానయజ్ఞబోర్డు చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి వినతి మేరకు రూ.50లక్షలు మంజూరు చేశారు. దాంతో వినోబాభావే మందిరాన్ని 2014లో పునఃనిర్మించి నాటి భూదానోద్యమ ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. కానీ, గత పదకొండు ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. వినోబాభావే మందిరానికి తాళం వేసి ఉండటంతో పోచంపల్లికి వచ్చిపోయే పర్యాటకులు వినోబాభావే మందిరాన్ని సందర్శించకుండానే నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. భూదా నోద్యమం ద్వారా మన జిల్లా, రాష్ట్రం, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిపెట్టిన వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని వారి వారసులు గత ప్రభుత్వానికి విన్నవించినా నేటికి ఆ కల కూడా నెరవేరలేదు. అలాగే వెదిరె రాంచంద్రారెడ్డి పేరిట తపాల బిళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా అదీ కార్యరూపం దాల్చలేదు. -
పశువుల ఎరువుతో భూసారం పెంపు
ఇలా దుక్కి దున్నాలి దుక్కిని ఎలా పడితే అలా దున్నడం వల్ల సాగు చేసే పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు వేసవిలో మెట్ట భూములను వానాకాలం సీజన్ కోసం సన్నద్ధం చేస్తుంటారు. వేసవిలో వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి నీటి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది. దీంతో మెట్ట ప్రాంతాల్లో భూమి వాలుకు అడ్డంగా దుక్కి చేయాలి. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.పెద్దవూర: ప్రస్తుతం రైతులు అధిక శాతం రసాయన ఎరువుల ద్వారానే పంటలు సాగు చేస్తున్నారు. దీంతో నేలలోని పోషకాల నిల్వల్లో సమతుల్యం లోపించి ఉత్పాదక శక్తి తగ్గుతుంది. చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాల లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే సేంద్రియ పద్ధతులు పాటించాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో..పశువులు, మేకలు, గొర్రెల పేడ పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పశువుల పేడ నేల సారవంతం చేయడంలో సహాయ పడుతుంది. ఇది నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉంటుంది. ఇవి మొక్కల పెరుగుదలకు అవసరం. ఇది సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట భూముల్లో వేసి దున్నితే చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతోంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువుల పేడ ఉపయోగపడుతుంది. ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల పెంటను వినియోగించాలి. భూసారం పదిలంసాధారణంగా రైతులు వేసవిలో పశుశుల ఎరువును వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఎండల కారణంగా పొలంలో వెదజల్లితే వాటిలోని పోషకాలు ఆవిరవుతాయి. పశువుల పెంటను పొలంలో కుప్పలుగా పోసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమి గుల్ల బారడానికి తోడ్పడుతుంది. సహజ సిద్ధమైన లవణాలు అందుతాయి. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపు చేసి మొక్కలకు అందేవిధంగా సహాయపడతాయి. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చు. -
భూ హక్కులకు రక్ష.. భూ భారతి
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి : ధరణి లోపాల కారణంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు నేటి (గురువారం) నుంచి ఈనెల 30వ తేదీ వరకు మండల స్థాయిలో అవగాహన సదస్సులు చేపట్టాలని నిర్ణయించారు. తొలిరోజున ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారంలో కలెక్టర్ అధ్యక్షతన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భూభారతిలోని కీలక అంశాలు ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణ కోసం నియమం లేదు. తప్పుల సవరణకు కోర్టులను ఆశ్రయించాల్సిందే. శ్రీభూభారత్ఙిలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉంది. ధరణిలో ఏర్పడిన సమస్యలకు సంబంధించి సుమారు 3,200 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో పేరు లేని వారు, హక్కుల రికార్డులో నమోదు చేసుకోవడానికి కొత్తగా చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సాదాబైనామాలకు పరిష్కారం పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో సుమారు 9వేల వరకు సాదాబైనామాలు పెండింగ్లో ఉన్నాయి. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు, వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 2020, అక్టోబర్ 12వ తేదీ నుంచి 2020 నవంబర్ 10వ తేదీ మధ్య క్రమబద్ధీకరణ కోసం సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిపై ఆర్డీఓలు విచారణ చేసి, అర్హత ఉన్నవారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. టైటిల్ డీడ్ పునరుద్ధరణ గతంలో మాదిరిగా పట్టాదారు పాస్పుస్తకం, టైటిల్ డీడ్ జారీచేస్తారు, భూభారతి హక్కుల రికార్డుల్లో నమోదైన అందరికీ, తనంతతాను గాని, భూ యజమాని గాని దరఖాస్తు చేస్తే రికార్డులు పరిశీలించి తహసీల్దార్ పాస్ పుస్తకం జారీ చేస్తారు. నిర్ణీత రుసుము రూ.300 చెల్లించాలి. అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆపైన కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చు. న్యూస్రీల్ఫ భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం ఫ అవగాహన కల్పించేందుకు నేటి నుంచి 30వ తేదీ వరకు సదస్సులు ఫ తొలిరోజు ఆత్మకూర్ (ఎం), బొమ్మలరామారంలో సభలుబాధ్యతల వికేంద్రీకరణ భూమి కొనుగోలు, దానం, బాగ పంపిణీ తనఖా రిజిస్ట్రేషన్ – పట్టామార్పు (మ్యుటేషన్) ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్, పట్టామార్పు ఒకేరోజు జరిగిపోతుంది. స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడీ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. నిర్ణీత తేదీన రిజస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేస్తారు. సొంతంగా రాసుకున్న దస్తావేజులను కూడా సమర్పించవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి దస్తావేజుతో పాటు భూమి పటం సమర్పించాల్సి ఉంటుంది. నిషేధిత జాబితాలో లేని లేదా ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉన్న భూములను తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్టర్డ్ దస్తావేజుకు సవరించిన భూభారతి రికార్డును జతపరిచి కొనుగోలుదారు, అమ్మకందారుకు అందజేస్తారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డుల్లో నమోదు చేస్తారు. నిర్ణీత తేదీలోపుగా తహసీల్దార్ పట్టామార్పు చేయకపోతే, దానంతటదే పట్టా మార్పు జరుగుతుంది. భూభారతి పోర్టల్లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు చేయాలి, నిర్ణీత ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీని సమర్పించాలి. -
51కిలోల గంజాయి పట్టివేత
భువనగిరిటౌన్: ఏపీలోని చిత్తూరు నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన 51.13 కిలోల గంజాయిని బుధవారం భువనగిరిలో పట్టుకున్నట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్కుమార్ తెలిపారు. ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ శివారులోని వైల్ట్ స్టోన్ వెంచర్ వద్ద జగదేవ్పూర్ రోడ్డులో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 51.13 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న సంగారెడ్డి జిల్లా ఈశన్నపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్, సికింద్రాబాద్లోని ముషీరాబాద్కు చెందిన డ్రైవర్ మొహమ్మద్ ఇస్మాయిల్, అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ ఇస్మాయిల్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుర్చినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మరో నిందితుడు హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన బాషా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్
మా పాపకు ప్రాణదానం చేయండిమాది నిరుపేద కుటుంబం. మా పెద్ద పాపకి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించాం. అయినా నయం కాలేదు. మా దగ్గర ఖర్చు చేయడానికి పైసలు లేవు. ఎవరైనా దాతలు మాకు సహాయం అందించి మా పాప ప్రాణం కాపాడండి. మాకు రేషన్కార్డు లేకపోవడంతో ఎక్కడా ఉచిత వైద్యం పొందలేకపోతున్నాం. మాపై దయతలచి అధికారులు రేషన్కార్డు మంజూరు చేయాలని వేడుకుంటున్నా. – అనిత, ప్రసన్న తల్లి మునుగోడు: తోటి పిల్లలతో కలిసి బడికి పోవాల్సిన ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడింది. ఎలాగైనా తమ కుమార్తెను కాపాడుకోవడానికి ఆమె తల్లిదండ్రులు ఇల్లు అమ్మి, అప్పులు చేసి కీమోథెరపీ చేయిస్తున్నారు. ప్రస్త్తుతం వారి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్, అనిత దంపతులకు 2016లో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారైలు సంతానం. పెద్ద కుమారై ప్రసన్న 2019లో జన్మించింది. 2023లో ప్రసన్న అనారోగ్యానికి గురికావడంతో అప్పటి నుంచి ఆ చిన్నారిని అనేక ఆస్పత్రుల్లో వైద్యులకు చూపించినా ఆమెకు వచ్చిన జబ్బు ఏమిటో ఏ డాక్టర్ గుర్తించలేకపోయారు. ఆరు నెలల క్రితం ఆ చిన్నారి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని వైద్యులు తేల్చారు. దీనికి తోడు బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఉందని చెప్పారు. ఆస్తులు అమ్మి వైద్యం చేయిస్తున్న తల్లిదండ్రులు.. మహేష్ వండ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి స్వగ్రామంలో ఎలాంటి వ్యవసాయ భూమి, ఆస్తులు లేవు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వలస వెళ్లి తన అన్నదమ్ములతో కలసి ఉంటూ అక్కడే పనిచేసి ఓ ఇల్లు కొనుక్కున్నాడు. కుమారై అనారోగ్యానికి గురికావడంతో ఆ ఇంటిని రూ.23 లక్షలకు విక్రయించి ఆమెకు హైదరాబాద్లో కీమోథెరపీ చేయిస్తున్నాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న వస్తువులు రవాణా చేసే రెండు వాహనాలను కూడా విక్రయించినా తన కుమార్తె వైద్యానికి డబ్బులు సరిపోకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేశాడు. ఇప్పటి వరకు రూ.40లక్షల వరకు ప్రసన్న వైద్యం కోసం ఖర్చు చేశాడు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆర్థిక భారం.. మహేష్, అనిత దంపతులు 2018లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో వారికి నేటికీ రేషన్ కార్డు మంజూరు కాలేదు. దీంతో వారి కుమార్తెకు ఏ ఆస్పత్రిలో కూడా ఉచిత వైద్యం అందడం లేదు. కనీసం తమ చిన్నారికి అవసరమైన రక్తం కూడా వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. తమకు రేషన్ కార్డు ఉంటే వైద్య ఖర్చుల భారం సగానికి పైగా తగ్గేదంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమపై దయతలచి తమ చిన్నారిని కాపాడుకునేందుకు నూతన రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులకు దాతలు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. ఫ సొంత ఇల్లు అమ్మి, అప్పులు చేసి కీమోథెరపీ చేయిస్తున్న తల్లిదండ్రులు ఫ ఇప్పటివరకు రూ.40లక్షలకు పైగా అయిన వైద్యం ఖర్చు ఫ దాతల సాయం కోసం ఎదురుచూపులు -
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో రోగి మృతి
మిర్యాలగూడ అర్బన్: మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చేరిన రోగి బుధవారం మృతిచెందాడు. అయితే ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందాడని ఆరోపిస్తూ బుధవారం ఆస్పత్రి ఎదుట మృతుడి బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల పరిధిలోని బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన మొండికత్తి క్రిష్ణయ్య(70) గత కొంతకాలంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు బాధపడుతున్నాడు. దీంతో ఈ నెల 14వ తేదీన అతడిని కుటుంబ సభ్యులు మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. క్రిష్ణయ్యను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం క్రిష్ణయ్యకు ఆస్పత్రి సిబ్బంది సైలెన్ బాటిల్ పెట్టి ఓ ఇంజక్షన్ ఇవ్వగా.. అతడి నోటి వెంట నురగ రావడంతో పాటు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది సీపీఆర్ చేసి పరీక్షించగా అప్పటికే అతడు మృతిచెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే క్రిష్ణయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడారు. ఈ ఘటనపై మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస సమరధ్ను వివరణ కోరగా.. ఇంజక్షన్ వికటించి క్రిష్ణయ్య మృతిచెందలేదని, ఇందులో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. క్రిష్ణయ్య గుండెపోటు వచ్చి మృతిచెంది ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫ వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ఫ గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చన్న సూపరింటెండెంట్ -
యూనిఫాం వస్త్రం వచ్చేసింది
జూన్ మొదటి వారంలో అందజేస్తాం జిల్లాకు చేరుకుంటున్న యూనిఫాం వస్త్రాల బాధ్యతలను ఎంఈఓలు చూసుకుంటున్నారు. వారి పర్యవేక్షణలోనే ఎమ్మార్సీ భవనంలో వస్త్రాలను భద్రపరుస్తున్నారు. వస్త్రం పూర్తిగా వచ్చిన తర్వాత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించనున్నారు. జూన్ మొదటి వారంలోనే విద్యార్థులకు యూనిఫాం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – సత్యనారాయణ, డీఈఓ భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిఏటా యూనిఫాం అందజేస్తోంది. వాటికి సంబంధించిన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా చేస్తోంది. ఈమేరకు జిల్లాకు అవసరమైన వస్త్రాన్ని పంపించారు. వీటిని ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో భద్రపర్చారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అందించే దుస్తుల్లో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్ ట్రాక్లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటివి లేకుండా సాధారణ డిజైన్ చేశారు. ఈసారి 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లను అందించనున్నారు. ప్రస్తుతం నెక్కర్లకు సంబంధించిన వస్త్రం మాత్రమే జిల్లాకు చేరుకుంది. మొత్తం 2.30లక్షల మీటర్ల వస్త్రం అవసరం కానుండగా ప్రస్తుతం 60,167 మీటర్ల వస్త్రం జిల్లాకు వచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి ఒక జత యూనిఫాంను జూన్ మొదటి వారంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. జాప్యం లేకుండా.. జిల్లాలో 730 పాఠశాలలున్నాయి. వీటిలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలతోపాటు టీయూడబ్ల్యూఎస్, కేఈబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ, టీజీఆర్ఈఎస్ పాఠశాలల్లో సుమారు 55 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతిఏటా రెండు జతల యూనిఫాం అందజేస్తోంది. గతంలో కుట్టే బాధ్యతను ఏజెన్సీలకు ఇవ్వడంతో జాప్యం చేసేవారు. దీంతో గత ఏడాది మహిళా సంఘాలకు అప్పగించగా సమర్థవంతంగా నిర్వహించారు. తర్వాత రెండో జత ఎస్ఎస్జీ గ్రూపులకు ఇచ్చారు. దుస్తులను త్వరగా కుట్టి ఇవ్వడంతో పాటు వారికి ఆర్థికంగా దోహదపడింది. ఇదివరకు జతకు రూ.50లు ఇచ్చారు. గతేడాది నుంచి ఒక్కో జతకు రూ.75లు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 40వేల మంది విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకుగాను ఇంకా రూ.20లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు డీఆర్డీఏ ఖాతాల్లో ఉండగా.. మహిళలకు చేరాల్సి ఉంది. విద్యార్థుల కొలతల ప్రకారం గతంలో విద్యార్థులకు కొలతలు లేకుండా యూనిఫాం కుట్టేవారు. దీనివల్ల కొందరికి వదులుగా మరికొందరికి బిగుసుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి పాఠశాలల వారీగా కొలతలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విద్యార్థుల కొలతలు తీసుకునే ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఫ ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాకు వచ్చిన 60,167 మీటర్ల వస్త్రం ఫ విద్యార్థులకు జూన్ మొదటి వారంలో యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు ఫ ఈసారి 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లు -
తమ్ముడి మామే సూత్రధారి
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన నలుగురికి బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్కు చెందిన గద్దపాటి సురేష్ నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. సురేష్ తమ్ముడు నరేష్కు 2017లో హైదరాబాద్కు చెందిన మాతరి వెంకటయ్య కుమార్తె ఉమామహేశ్వరితో వివాహమైంది. కొన్నాళ్ల వరకు నరేష్ సంసారం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భార్యను దూరంగా ఉంచడంతో పాటు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే తన కుమార్తె సంసారం నాశనం కావడానికి తన అల్లుడైన నరేష్ అన్న సురేషే కారణమని మాతరి వెంకటయ్య భావించాడు. సురేష్ కూడా వేరే మహిళతో చాలాకాలంగా సాన్నిహిత్యంగా ఉంటూ తన భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలియడంతో పాటు నరేష్ వివాహేతర సంబంధాన్ని సురేష్ ప్రోత్సహిస్తున్నాడని నమ్మిన మాతరి వెంకటయ్య ఎలాగైనా సురేష్ను అంతమొందిస్తే తన అల్లుడు నరేష్కు బుద్ధి వచ్చి తన కుమార్తెతో మంచిగా ఉంటాడని భావించాడు. సుపారీ గ్యాంగ్తో ఒప్పందం.. ఈ మేరకు మాతరి వెంకటయ్య హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్కుమార్ అలియాస్ సీకే కిరణ్కుమార్ను సంప్రదించి అతడి ద్వారా తన అల్లుడు నరేష్పై నిఘా పెట్టించాడు. ఆరు నెలల నుంచి నిఘా పెట్టగా.. తన అల్లుడు నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కూడా కన్నాడని తెలిసింది. సురేష్ ప్రోత్సాహంతోనే నరేష్ ఇదంతా చేశాడని నమ్మిన వెంకటయ్య, అతడి కుమార్తె ఉమామహేశ్వరి సురేష్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన కిరణ్కుమార్కు చెప్పగా.. తాను గతంలో నేవీలో కమ్యూనికేషన్ వింగ్లో పనిచేశానని, ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయాలో తనకు బాగా తెలుసని, రూ.15 లక్షలు ఇస్తే హత్య చేస్తానని కిరణ్కుమార్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.2 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఈ క్రమంలో కిరణ్కుమార్ నెల క్రితం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన తన బంధువు ముశం జగదీశ్కు విషయం చెప్పి, రూ.3 లక్షలు పారితోషికం ఇస్తానని ఆశచూపి ఈ హత్యలో భాగస్వామి కావాలని కోరాడు. దీంతో జగదీశ్ ఒప్పుకున్నాడు. వీరిద్దరు కలిసి నెల రోజుల నుంచి నల్లగొండ పట్టణంలో రెక్కీ నిర్వహిస్తూ గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ కదలికలను కనిపెడుతూ వచ్చారు. హత్య జరిగింది ఇలా.. నెల రోజులు రెక్కీఅనంతరం ఈ నెల 11న చిక్కు కిరణ్కుమార్ హైదరాబాద్ నుంచి జెన్ కారులో చెర్వుగట్టు వరకు వచ్చాడు. హత్య చేయడానికి కావల్సిన కత్తులు, మాస్కులు, టోపీలు, గ్లౌజ్లను వెంట తెచ్చుకున్నాడు. కారు చెర్వుగట్టు వద్ద పెట్టిన కిరణ్కుమార్ అప్పటికే అక్కడ వేచి ఉన్న ముశం జగదీశ్తో కలిసి బైక్పై చర్లపల్లి వరకు వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో రాత్రి 10 గంటలకు రామగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి గీతాంజలి అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని పథకం ప్రకారం మృతుడి షాపు వెనకాల అప్పటికే ఉంచిన బైక్ తీసుకుని 10.45గంటలకు కలర్ ల్యాబ్ వద్దకు వచ్చారు. తమకు ఫొటోలు, ప్రింట్లు కావాలని సురేష్ను అడగ్గా.. రాత్రయింది రేపు ఉదయం రమ్మని సురేష్ వారికి చెప్పాడు. అర్జెంటుగా కావాలని అడగడంతో ఫొటోలు ప్రింట్ ఇచ్చే పనిలో సురేష్ నిమగ్నమవ్వగా.. అదే అదునుగా భావించిన కిరణ్కుమార్, జగదీశ్ కత్తులతో సురేష్ గొంతు కోసి వీపు, పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం బైక్పై చర్లపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి మరో బైక్పై చెర్వుగట్టుకు వెళ్లి అక్కడ రక్తం అంటిన దుస్తులు, కత్తులు అన్నీ కారులో పెట్టుకుని అమ్మనబోలు వైపు వెళ్లిపోయారు. మార్గమధ్యలో మూసీ వాగులో రక్తం అంటిన దుస్తులు, కత్తులను పడేసి హైదరాబాద్ పారిపోయారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. బుధవారం హత్యకు పథకం వేసిన నరేష్ మామ మాతరి వెంకటయ్య(ఏ1 ), అతడి కూతురు, నరేష్ భార్య గద్దపాటి ఉమామహేశ్వరి(ఏ4)ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. చిక్కు కిరణ్కుమార్(ఏ2 ), ముశం జగదీశ్(ఏ3 )ను నార్కట్పల్లిలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి మారుతీ జెన్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు ఛేదించిన డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులును ఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుని తదుపరి విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఫ తన కుమార్తె సంసారం నాశనం చేశాడనే కక్షతో గద్దపాటి సురేష్ను హత్య చేయించిన అతడి తమ్ముడి మామ ఫ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
28 నుంచి పాలిసెట్ ఉచిత శిక్షణ
యాదగిరిగుట్ట: టీజీ పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 8వ వరకు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని, మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 80998 99793, 90106 29270ను సంప్రదించాలని కోరారు. 75శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాల సరఫరాభువనగిరిటౌన్ : నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, మినీ కిట్ పథకం కింద 75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు సరఫరా చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 కేజీల కిట్ ధర రూ.492.50 ఉంటుందని పేర్కొన్నారు. 25శాతం రైతు వాటా కింద రూ.123.50 చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల వారు ఏఈఓలను సంప్రదించాలని కోరారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు విశేషంగా జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదానల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఈనెల 17 నుంచి మే 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ) డాక్టర్ ఉపేందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని, తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అసమానతల నిర్మూలనలో అంబేడ్కర్ కృషి మరువలేం రామగిరి(నల్లగొండ): దేశంలో సామాజిక అసమానతల నిర్మూలనతోపాటు రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి మరువలేమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ.వెంకటేసు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో సామాజిక న్యాయం ఔచిత్యం అనే అంశంపై బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక కీలక అంశాల్లో అంబేడ్కర్ పాత్ర ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత సమాజ ఉన్నతికి కారకులు కావాలని కోరారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, ఐక్యూసి కోఆర్డినేటర్ వైవీఆర్.ప్రసన్నకుమార్, పరీక్ష నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నిధులు సక్రమంగా వినియోగించాలి
సాక్షి, యాదాద్రి : కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఒక్క రూపాయి కూడా వదలకుండా ఖర్చు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన దిశ (జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ) సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలపై ఎంపీ అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నాయి.. అవి ప్రజలకు గ్రౌండింగ్ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని సూచించారు. బ్రిడ్జిల పనులు పూర్తి చేయాలి: కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే భువనగిరి మూసీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. ఏళ్లుగా పనులు పెండింగ్లో ఉండటాన్ని ఆయన తప్పు పట్టారు. అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భువనగిరి మున్సిపాలిటీలో మంచి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుడా చూడాలని మిషనర్ భగీరథ అధికారులకు సూచించారు. అనంతరం దిశా సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, మందడి ఉపేందర్రెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి నిధులిచ్చినా పనులు పూర్తి చేయరా: బీర్ల ఐలయ్య తాగు నీటి సమస్యల పరిష్కారానికి నిధులు ఇచ్చి ఏడాది దాటినా పనులు పూర్తి కావా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధికారులను ప్రశ్నించారు. ఆలేరు మండలం కొలనుపాక, రాఘవాపురం, శ్రీనివాసపురం, పటేల్ గూడెం గ్రామాల్లో మూడు రోజులకోసారి మంచినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. -
చేనేత వారసత్వాన్ని చాటి చెప్పాలి
భూదాన్పోచంపల్లి: హైదరాబాద్లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు పోచంపల్లిని సందర్శించి తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆమె భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కులో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. మ్యూజియం, ఆడిటోరియం, హాంప్లి థియేటర్ను సందర్శించారు. అనంతరం టూరిజం, హ్యాండ్లూమ్ అధికారులు, ఈవెంట్ ఆర్గనైజర్లతో సమావేశమయ్యారు. పోచంపల్లి ఇక్కత్తో పాటు గొల్లభామ, గద్వాల, నారాయణపేట తదితర హ్యాండ్లూమ్ వస్త్రాలతో గదులను డెకరేట్ చేయాలని సూచించారు. అదేవిధంగా టూరిజం ప్రాంగణంలో స్థానిక చేనేత కళాకారులచే మగ్గాలు, తదితర స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. టూరిజం అభివృద్ధికి విదేశీయుల పర్యటన దోహదం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 40 దేశాలకు చెందిన అందాల భామలు మే 15న పోచంపల్లికి వస్తున్నారని స్మితా సబర్వాల్ తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల్లో 140 దేశాలకు చెందిన వారు పాల్గొంటున్నారని, వారిని బృందాలుగా విభజించి తెలంగాణ సంప్రదాయాలను పరిచయం చేయడానికి ప్రముఖ ప్రదేశాలు, దేవాలయాలను సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఎండలు బాగా ఉన్నందున విదేశీయులకు ఇబ్బందులు కలగకుండా పోచంపల్లిలో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8గంటల లోపు కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశామని చెప్పారు. చేనేత పరిశ్రమతో పాటు టూరిజం అభివృద్ధికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. హ్యాండ్లూమ్ థీమ్ను అంతర్జాతీయ ఆడియన్స్, ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్నామని ఇందుకు పర్యాటకశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ స్వయం మగ్గం నేశారు. అదేవిధంగా మగ్గం నేసే వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్, టూరిజం శాఖ ఈడీ విజయ్, సీఈ శ్రీనివాస్, డీఈఈ హనుమంతరావు, ఏఈ రాంప్రసాద్, ఆర్ఐ వెంకట్రెడ్డి, స్థానిక టూరిజం మేనేజర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు. బుధవారం ఎంజీయూలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్స్ కంపెనీ సహకారంతో ఐటీ, నాన్ఐటీ, హెల్త్కేర్, బ్యాంకింగ్ సెక్టార్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 250మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయంతి, సుధారాణి, నాగరాజు, సత్యనారాయణరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా
ఆత్మకూర్(ఎస్): మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో కుక్కను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక కూలీ మృతిచెందగా.. పలువురికి తీవ్ర తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కోటపహడ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన కేశరాజుపల్లి శంకర్ ఆటోలో ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెంలో మిరప తోట ఏరడానికి బుదవారం తెల్లవారుజామున బయల్దేరారు. ఉదయం 4:30 సమయంలో కోటపహాడ్ గ్రామ పంచాయతీ సమీపంలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో డ్రైవర్ కుక్కను తప్పించబోగా.. అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మాదరబోయిన యాదమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. యాదమ్మ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుమారుడు లింగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపారు. ఫ మహిళా కూలీ మృతి ఫ పలువురికి గాయాలు -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది
చిట్యాల: ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాలలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, పనిచేసే నాయకులకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణ యుగమని, కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, రాచకొండ క్రిష్టయ్య, సుంకరి యాదగిరిగౌడ్, కూరెళ్ల లింగస్వామి, కొలను వెంకటేష్గౌడ్, మెండె సైదులు, కందాటి రమేష్రెడ్డి, జిట్ట బోందయ్య, కోనేటి ఎల్లయ్య, పోల్లేపల్లి సత్యనారాయణ, మర్రి జలంధర్రెడ్డి, పోకల రాములు, ఆవుల ఆనంద్, కునూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
భూదాన వజ్రోత్సవాలను జయప్రదం చేయాలి
భూదాన్పోచంపల్లి: భూదానోద్యమానికి అంకురార్పణ జరిగి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పోచంపల్లిలో ఈ నెల 18న నిర్వహించే భూదాన వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి కోరారు. బుధవారం పోచంపల్లిలోని వినోబాభావే మందిరాన్ని ఆయన సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న పోచంపల్లిలో భూదాన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డితో పాటు స్థానిక ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్, భూ భారతిసభ్యులు సునీల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గాంధీ జ్ఞాన్ప్రతిష్టాన్ సెక్రటరీ సుబ్రమణ్యం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వినోబాభావే సేవాసమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, భాస్కర్ పాల్గొన్నారు. ఫ గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్నగర్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన పందేటి చలపతిరావు(38) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ ఫార్మా కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రి చలపతిరావు భార్య భవిత ప్రార్ధన నిమిత్తం స్థానికంగా చర్చికి వెళ్లింది. కుమార్తె ఇంట్లోనే ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో చలపతిరావు రాత్రి 8గంటల సమయంలో ఇంట్లోని మరో గదికి వెళ్లి సీలింగ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రార్ధన ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన భవిత తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి తండ్రి వీరరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
యువ వికాసానికి 31,902 అర్జీలు
భువనగిరిటౌన్ : రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ముగిసింది. సోమవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 31,902 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ 9,874, ఎస్టీ 2,579, బీసీ 16,990, ఈబీసీ 814, మైనార్టీ 1,590, క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్కు 55 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడంతో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతుందని, ఇందులో వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి గడువు పెంచాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని, దీనిపై మంగళవారం ఏదైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రత్యేక కౌంటర్లుదరఖాస్తుదారుల నుంచి హార్డ్ కాపీలు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సోమవారం సెలవు రోజు అయినప్పటికీ సిబ్బంది అందుబాటులో ఉండి హార్డుకాపీలు స్వీకరించారు. ముగిసిన దరఖాస్తు గడువు సెలవు రోజూ హార్డు కాపీల స్వీకరణ -
ౖరెతులకు తిప్పలు!
వారి తప్పులు..సాక్షి, యాదాద్రి : రేషన్ కార్డ్ ఎడిట్, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పిదాల వంటి సాంకేతిక సమస్యలు వేలాది మంది రైతులను రుణమాఫీకి దూరం చేసింది. ఇంకా 30 శాతం మంది రైతులు అర్హతలున్నా రుణమాఫీ పొందలేదు. డిసెంబర్లో జరిగిన నాలుగో విడతలోనూ ఉపశమనం లభించకపోవడంతో.. వీరంతా తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పిస్తున్నారు. నాలుగు విడతల్లో 80,962 మందికి మాఫీరాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు విడతల్లో 80,962 మంది రైతులకు రూ.669.73 కోట్లు హాపీ అయ్యాయి. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలు 36,483 మందికి 199.46, రెండో విడతలో రూ.లక్షన్నర లోపు 19,798 మందికి రూ.193.96 కోట్లు, మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు 13,011 మందికి రూ.164.66 కోట్లు మాఫీ జరిగింది. నాలుగో విడతలో 11,690 మంది రైతులు రూ.111.65 కోట్లు లబ్ధి పొందారు. ఇంకా 30 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. మాఫీ వర్తించకపోవడానికి కారణాలివీ..సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరం చేసింది. రేషన్ కార్డ్ ఎడిట్, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లలో తప్పులు దొర్లడం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం, ఖాతాలు క్లోజ్ చేయడం వంటి కారణాలతో చాలా మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో రాలేదు. వీరంతా కలెక్టరేట్, రైతువేదికలు, వ్యవసాయ కార్యాలయాలు, పీఏసీఏసీల్లో ఏర్పాటు చేసిన హెల్స్డెస్క్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లలో ప్రభుత్వ సూచన మేరకు దరఖాస్తు చేసుకున్నారు. 4,300కు పైగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు వీటిని పరిశీలించి ఉన్నతస్థాయికి పంపారు. ఇటువంటి వారికి నాలుగో విడతలో రుణమాఫీ చేశారు. కానీ, చాలా మంది పేర్లు జా బితాలో రాలేదు. ప్రధానంగా ఏపీజీవీబీ, పీఏసీఎస్, డీసీసీబీ, వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. వానాకాలం వరకై నా సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.పేరువచ్చినా డబ్బులు జమ కాలేదు నాలుగో విడతలో రుణమాఫీ అయిందని జాబితాలో పేరు వచ్చింది. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రా మీణ వికాస్ బ్యాంకు పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చడంతో టెక్నికల్గా సమస్య ఏర్పడినట్లు చెబుతున్నారు. నాతో పాటు చాలా మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి. –చిలువేరు రాజమల్లారెడ్డి, బొమ్మలరామరాంసాంకేతిక సమస్యలను సరిచేయని అధికారులు అర్హతలున్నా వర్తించని రుణమాఫీ జిల్లాలో ఇంకా 30 శాతం మంది ఎదురుచూపులు కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న బ్యాంకులు ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేస్తున్న రైతులుఅధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆలేరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.70 వేలు పంట రుణం తీసుకున్నా. మొదటి విడుతలోనే రుణమాఫీ జాబితాలో నా పేరు వచ్చింది. ఖాతాలో డబ్బు కూడా జమ అయింది. అయినా బ్యాంకు అధికారులు కొత్త రుణం ఇవ్వడం లేదు. కారణం అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. రుణం కోసం బ్యాంకు చుట్టు తిరుగుతున్నా. – ఎన్. చంద్రారెడ్డి, బహుద్దూర్పేట -
అంబేడ్కర్కు ప్రముఖుల నివాళి
సాక్షి, యాదాద్రి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం భువనగిరిలోని వినాయక చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకుల శ్యాంసుందర్ తదితర ప్రముఖులు హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం గర్హించదగిన మేధావి అంబేడ్కర్ : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ప్రపంచం గర్హించదగిన మేధావి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కొనియాడారు. తాను రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాలు సమాన విద్య, సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు పొందగలుగుతున్నాయంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనన్నారు. అంబేడ్కర్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ : మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
భూ భారతికి శ్రీకారం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి భూభారతి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. పరిష్కారం కానున్న సమస్యలివే.. రెవెన్యూ రికార్డుల్లో గతంలో పట్టాదారు కాలమ్తో పాటు కబ్జాదారు కాలమ్ కూడా ఉండేది. అయితే ధరణి తీసుకువచ్చినప్పుడు కబ్జా కాలమ్ను తొలగించి పట్టాదారు కాలమ్ను మాత్రమే రికార్డుల్లో ఉంచింది. దీంతో గతంలో భూములు కొని పట్టాలు చేసుకోని వారు, సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వారు కబ్జాలో ఉన్నప్పటికీ వారికి ఆ భూమిపై హక్కులు లేకుండా పోయాయి. గతంలో అమ్ముకున్న వారికే ధరణిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు అనే కం ఉత్పన్నం అయ్యాయి. అదేవిధంగా ధరణి అమలులో భాగంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములన్నింటినీ ఆన్లైన్ చేసే సందర్భంలో ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుతో పట్టాలు ఎక్కడం, కొందరికి భూమి ఉన్నంతగా కాకుండా తక్కువగా, ఎక్కువగా పాస్బుక్కుల్లో ఎక్కడం, మరికొందరు తమ భూములను అమ్ముకున్నప్పటికీ వారే దొడ్డిదారిన ఆ భూమిని పాస్బుకుల్లో తమ పేరున ఎక్కించుకోవడం, మరికొందరు కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు ఉన్నా ఒక్కరే పట్టా చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ధరణిలో పరిష్కారం కాలేదు. దాంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూ భారతి ద్వారా ఇలాంటి సమస్యలకు కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండానే క్షేత్ర స్థాయిలో పరిష్కరించుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం, అక్కడా పరిష్కారం కాకపోతే కలెక్టర్కు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ధరణిలో పాస్బుక్ పొందిన పట్టాదారుడే తిరిగి వారేవారికి పట్టా చేస్తేనే పేరు మారేది. కలెక్టర్కు కూడా దాన్ని మార్చే అధికారం లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వాటికి భూ భారతిలో మోక్షం లభించనుంది. ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఆ డబ్బులు రైతులకు వచ్చేవి కావు. అలాంటివి ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పట్టా భూమి పొరపాటున ప్రభుత్వ భూమి అని పడితే దాన్ని మార్పు చేయాలంటే సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా 2023 నుంచి అలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటితోపాటు పెద్ద మొత్తంలో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది.మొదటగా నాలుగు మండలాల్లో.. మొదట రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతిని అమలు చేయనున్నారు. జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేస్తారు.ఈ చట్టంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు అధికారాలు లభించనున్నాయి.భూ సమస్యలు ఇక వేగంగా పరిష్కారం భూ భారతి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు -
రైతన్నను ముంచిన వడగండ్ల వాన
మోటకొండూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం), ఆలేరు రూరల్ : జిల్లాలో ఆదివారం సాయంత్రం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కోత దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేశారు. నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : బీర్ల ఐలయ్యఈదురుగాలులు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. రైతలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టం నివేదిక పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, యెల్లంల సంజీవరెడ్డి, గంగపురం మల్లేష్, కొంతం మోహన్రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, అధికారులు ఉన్నారు. వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన అధికారులు -
సన్నాహక సమావేశాలు.. పాదయాత్రలు
సాక్షి, యాదాద్రి : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే బహిరంగ సభపై పార్టీ నేతలు దృష్టి సారించారు. అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్లో ఇటీవల జిల్లా నేతలతో సమావేశమై సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు వారు సభ విజయవంతంపై తలమునకలయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముగిసిన సన్నాహక సమావేశాలురజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు ముగి శాయి. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి,నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, క్యామమల్లేష్ తదితర నాయకులు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తుంగుతుర్తి నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉంది. పాదయాత్రలుసభ విజయవంతం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం బీఆర్ఎస్ విద్యార్థి సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో రాయగిరి నుంచి యాదగిరిగుట్టలోని వైకంఠద్వారం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ మాజీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా వలిగొండ మండలం వేములకొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయనుంచి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల వరకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్రను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. అదే విధంగా పోటాపోటీగా వాల్రైటింగ్ చేస్తున్నారు. వరంగల్వైపు జాతీయ రహదారి, ప్రధాన రోడ్ల వెంట చలో వరంగల్, రజతోత్సవ సభను జయప్రదం చేయాలంటూ వాల్రైటింగ్ చేయడం ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. రాయగిరి నుంచి గుట్టకు పాదయాత్రభువనగిరి, యాదగిరిగుట్ట : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి మండలం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, షిఫ్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు రాయగిరిలో పాద యాత్రను పైళ్ల శేఖర్రెడ్డి ప్రారంభించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ గుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, ప్రవీణ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేష్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మిట్ట అరుణ్గౌడ్, ఆయా మండలాల యూత్, విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఎండీ అజ్జు, పల్లె సంతోష్ గౌడ్, భగత్సింగ్, రాసాల ఐలేష్ యాదవ్, బాల్సింగ్, భానుచందర్, బండ జహంగీర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జన సమీకరణకు నేతల సన్నాహాలు ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మంది తరలించాలని లక్ష్యం -
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి అలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశ్వీరచనం, నిత్యకల్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. పాడి రైతుల సదస్సును జయప్రదం చేయాలి రాజాపేట : ఆలేరులో ఈనెల 24న జరిగే పాడి రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పాడిరైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్గౌడ్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాజాపేటలో సోమవారం పాడి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం, ప్రోత్సాహకం చెల్లించకపోవడం, పాల ధర పెంచకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దాణ ధర కూడా పెరగడంతో పాడి పశువులను పోషించలేని స్థితిలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోతుందన్నారు. సదస్సులో పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బబ్బూరి పోశెట్టి, పాలసంఘం చైర్మన్ సందిల భాస్కర్ రమేష్, నాయకులు పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : భారత్ సైన్యంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. దరఖాస్తుకు విద్యార్హతల సర్టిఫికెట్లు తప్పనిసరిగా జతపర్చాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఒక లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బుర్రా వెంకటేశం అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదివిన ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. నూతనంగా 5వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్లో కలెక్టర్ అవుతానని సదరు విద్యార్థి చెప్పడంతో అభినందించారు. తాను ఈ పాఠశాలలో అడిష్మన్ కోసం తన అమ్మతో కలిసి వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకముందు పాఠశాలలో బీఆర్ అంబేడ్కర్తో పాటు ఇతర మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజిని, రామ్మోహన్రావు, గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణకుమార్, డిప్యూటీ కార్యదర్శి ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్కుమార్ తదితరులున్నారు. అంతకుముందు మల్లారెడ్డిగూడెం గ్రామంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నర్రి యాదయ్య ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం -
పడిపోతున్న నిమ్మ ధర
నకిరేకల్: వేసవిలో నిమ్మకాయలకు మంచి ధర వస్తుందనుకున్న రైతులు సరైన ధర లేక దిగాలు చెందుతున్నారు. పది రోజుల క్రితం పండు నిమ్మకాయలు బస్తాకు రూ.1800, పెద్ద సైజు కాయలు బస్తాకు రూ.2200, చిన్న సైజు కాయలు బస్తాకు రూ.1200 ధర లభించింది. గత రెండు, మూడు రోజుల నుంచి ఈ ధరలు సగానికి సగం పడిపోతున్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం పండు కాయ బస్తా ధర రూ.1000 నుంచి రూ.1300, పెద్ద సైజు కాయ బస్తాకు రూ.1200 ధర పలుకుతోంది. చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వస్తుంది. నిమ్మ ఎగుమతయ్యే ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో అక్కడ నిమ్మ కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రేటు ఉందని చెట్ల మీద చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులు కాయలను కోయడంతో దిగుబడులు పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మ అధికంగా దిగుబడి రావడంతో ఢిల్లీ, గుజరాత్ వంటి నగరాల్లో ధర పెరగడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రోజుకు ఏడు వేల బస్తాల రాక..ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఏకై క నిమ్మ మార్కెట్ను 2018 జూన్ 17న నకిరేకల్లో ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. నకిరేకల్ నిమ్మ మార్కెట్కు గత 15రోజుల వరకు ప్రతిరోజు 2వేల నుంచి 3వేల వరకు నిమ్మకాయల బస్తాలు రాగా.. తాజాగా వారం రోజుల నుంచి రోజుకు 6వేల నుంచి 7వేల బస్తాలు వస్తున్నాయి. ఈ నిమ్మ మార్కెట్ నుంచి డీసీఎంలలో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి. నిమ్మ దిగుబడులు పెరగడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మకాయలు అధికంగా రావడంతోనే ధరలు పడిపోయాయని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి మంచి ధర వచ్చేలా చూడాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. వేసవిలో లభించని ఆశించిన రేటు దిగుబడి పెరగడంతో ధర లేదంటున్న మార్కెట్ అధికారులు -
ప్రమాదవశాత్తు ఆయిల్ పామ్ తోట దగ్ధం
గుర్రంపోడు: మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన కొండ పెద్దులు ఆయిల్ పామ్ తోట ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఉపాధిహామీ కూలీలు తన ఆయిల్ పామ్ తోట వెంట కాల్వలో కంపచెట్లు తొలగించి నిప్పు పెట్టి వెళ్లడంతో ఆ మంటలు తన తోటకు అంటుకొని చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు. మొత్తం మూడెకరాల తోటలో దాదాపు రెండెకరాలలో కాపు కొచ్చే దశలో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు, డ్రిప్పు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపారు. చౌల్లరామారంలో.. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలోని సౌట కుంటలో సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌట కుంటలో ఇటీవల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు తొలగించిన కంప చెట్లకు సోమవారం నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పక్కనే ఉన్న వరి పొలాల వైపు వ్యాపించాయి. స్థానిక రైతులు గమనించి మోత్కూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. -
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన
నకిరేకల్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని, ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీఓను విడుదల చేయడంపై హర్షిస్తూ నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డ్రోన్ సహాయంతో నకిరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. అనంతరం సాయి మందిరం సమీపంలో స్టేడియంకు వెళ్లే దారిలో మహనీయుల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం జీవితాంతం పరితపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, పూజర్ల శంభయ్య, మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, బత్తుల ఉశయ్యగౌడ్, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -
విద్యార్థులపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ
యాదగిరిగుట్ట: విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు, యువతకు కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రూ.5లక్షల రుణాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేబినెట్లో ఆ విషయాన్ని ప్రసావించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల హక్కులు సాధించేలా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువతది కీలకపాత్ర అన్నారు. 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాసాల ఐలేష్యాదవ్, కొంపల్లి నరేష్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ -
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
పెద్దవూర: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించటంతో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే పంట ఎదుగుదల, దిగుబడిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వేసిన, ఎదిగిన పంట పెరుగుదలను కాపాడుకుంటూ, పంట పరిస్థితిని బట్టి రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగు చేపట్టాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆయిల్పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన తరువాత చిన్న, చిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్ (30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి. ● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉంటే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్పామ్ తోటల్లో వేసవిలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి. ● మూడేళ్ల లోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాదనంతో(రెండుసార్లు) తొలగించాలి. ● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను తొలగించాలి. ● ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ● ఎదిగిన ఆయిల్పామ్ తోటల్లో గెలలు కోసిన తరువాత నరికి ముక్కలు చేసిన ఆయిల్పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్గా పరచాలి. ● ఎదిగిన ఆయిల్పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తిని ఉపయోగించి కోయాలి. ఆయిల్పామ్ సాగులో పాటించాల్సిన మెళకువలపై ఉద్యానవన అధికారి సూచనలు ఎదిగిన ఆయిల్పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ను, ఒక కిలో బోరాక్స్ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వల్ల సమయం, ఎరువులపై ఖర్చు కూడా ఆదా చేయొచ్చు. ఆయిల్పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కోసం పంపాలి. -
ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య
● న్యాయం చేయాలని కోదాడ– జడ్చర్ల హైవేపై కుటుంబ సభ్యుల రాస్తారోకోనిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్లోనే సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్రెడ్డి కూడా హైదరాబాద్లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. చీకోటి ప్రవీణ్పై కేసు నమోదునల్లగొండ: హనుమాన్ జయంతి సందర్భంగా నల్ల గొండ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓవైసీ బ్రదర్స్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సుమోటోగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
మునుగోడు: భర్త గుండెపోటుతో మృతిచెందడం తట్టుకోలేక ఒక్క రోజు వ్యవధిలోనే భార్య కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నల్ల గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య(65), దుబ్బ లక్ష్మమ్మ(61) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శంకరయ్య మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం శంకరయ్యకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సోమవారం శంకరయ్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన మృతదేహంపై పడి బోరున విలపించినా లక్ష్మమ్మ కూడా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు హైదరబాద్కు తరలించారు. అక్కడకి వెళ్లేసరికి ఆమె కూడా మృతిచెందింది. అన్యోన్యంగ జీవించిన భార్యాభర్తలు ఒక్క రోజు వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దంపతుల అంత్యక్రియలు సోమవారం పలివెల గ్రామంలో ఒకేసారి నిర్వహించారు. ఒక్కరోజు వ్యవధిలో గుండెపోటుతో ఇరువురు మృతి -
కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామానికి చెందిన అప్పల కొండయ్య కుమారుడు ఆదిత్య(27), ఊర ముత్తయ్య కుమారుడు ప్రవీణ్(25) చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిద్దరు ఆదివారం రాత్రి కొత్తపేట నుంచి బైక్పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో చీకటిగూడెం గ్రామ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై ఉన్న జంక్షన్ వద్ద సూర్యాపేట వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుపుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి -
నిర్దిష్టమైన ధర నిర్ణయించాలి
నేను మూడెకరాల్లో నిమ్మ సాగు చేశాను. 250 చెట్లు ఉన్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్కు 13 బస్తాల నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఒక్కో చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వచ్చింది. పండు కాయలకు బస్తాకు రూ.1300, పెద్ద సైజు కాయలకు రూ.1200 మించి ధర రావడం లేదు. పది రోజుల క్రితం మార్కెట్కు వస్తే రోజుకు రూ.30 వేలు వచ్చేవి. నేడు రూ.10వేలకు మించి రావడం లేదు. ధర సగానికి సగం పడిపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి. నిమ్మ దీర్ఘకాలిక పంట అయినందున ప్రభుత్వం బస్తాకు ఒక నిర్దిష్టమైన ధర నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. – అన్నెబోయిన సురేందర్, బండమీదిగూడెం, శాలిగౌరారం మండలం -
పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర్లు
మోత్కూర్: స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన వర్రె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి శివశంకర్రావును నియమించగా.. ముగ్గురు సభ్యులలో ఒకరిగా వర్రె వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల మోత్కూరు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భూమి చదును చేస్తుండగా బయల్పడిన శివలింగం చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు బాజీరెడ్డి ఆదివారం తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా శివలింగంతో పాటు నాగప్రతిమ బయల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శివలింగాన్ని తిలకించారు. కాగా ఈ స్థలంలో గతంలో గుడి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. ఆలయంలో చోరీ నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్లో గల సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సోమవారం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం ముఖద్వారం తలుపు తెరిచి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలను తీశారు. అందులో ఉన్న సీతాదేవికి సంబంధించిన 15 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.20వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ యడవల్లి వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డీజే నిర్వాహకులపై కేసు సూర్యాపేటటౌన్: నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు డీజే నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం చిలుకూరు మండలం బేతవోలులో బర్త్డే వేడుకల్లో డీజే వినియోగించడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు చిలుకూరు పోలీస్ స్టేషన్లో కార్యక్రమ నిర్వాహకులు, డీజే యజమానులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి డీజే సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. శనివారం సూర్యాపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూరి బజార్లో పెళ్లి వేడుకలో డీజే ఉపయోగించినందుకు గాను ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఆదివారం సూర్యాపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాంతండాలో బర్త్డే వేడుకల్లో డీజే పెట్టగా.. ఇద్దరు నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
తెలంగాణ నుంచి ఇస్రోకు ఫినోలిక్ ఫోం ప్యాడ్స్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేట్ నుంచి ఎకో థెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్లు ఇస్రోకు ఎగుమతి అయ్యాయి. జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం సమయంలో క్రయోజెనిక్ సిస్టమ్స్లో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఈ ప్యాడ్లు వాడుతున్నారు. ఇస్రో ఈనెలలో ప్రయోగించే జీఎస్ఎల్వీ రాకెట్లో అమర్చే అగ్ని నిరోధక పదార్థం దేశంలో ఇక్కడే తయారవుతుంది. ఈ ఫోం ప్యాడ్లు బీబీనగర్ మండలం జమీలాపేట్లో వీఎన్డీ సెల్ప్లాస్ట్ అనే కంపెనీ తయారు చేసి ఎగుమతి చేస్తోంది. సంస్థ తయారు చేసిన 365 ఫోం ప్యాడ్లను.. త్రివేండ్రంలోని విక్రమ్సారాభాయి స్పేస్ సెంటర్కు సంస్థ యాజమాన్యం ఎగుమతి చేసింది. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో వీటిని పరిశీలించి నెల్లూరులో ఇస్రో సెంటర్కు అందజేస్తారు. ఉష్ణాన్ని నియంత్రించే ఫోం ప్యాడ్స్ ఫినోలిక్ ఫోం ప్యాడ్లు జీఎస్ఎల్వీ రాకెట్ను భూమి నుంచి నింగిలోకి ప్రయోగించే సమయంలో వాడతారు. ఉష్ణోగ్రత మారితే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఫినోలిక్ ఫోం ప్యాడ్లు లేకుండా.. జీఎస్ఎల్వీ రాకెట్ను ప్రయోగించలేరు. రాకెట్లో వేడిని నియంత్రించడానికి థీమ్ ప్యాడ్స్ అమరుస్తారు. బయటినుంచి వచ్చే వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. లోపలినుంచి బయటికి వెళ్లి చల్లదనాన్ని అడ్డుకుంటుంది. ఉష్ణోగ్రతలు మారకుండా ఫోం ప్యాడ్లు అడ్డుకుంటాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు సరఫరా.. దేశంలో ప్రస్తుతం ఫినోలిక్ మిశ్రమాలను ఒక్క బీబీనగర్లోనే తయారు చేస్తున్నారు. మైనింగ్, రక్షణ సంçస్థలకు సరఫరా చేస్తున్నారు. ఇస్రోతో పాటు రైల్వేలు, డీఆర్డీవో, డీఆర్ఎల్, ఎయిర్ఫోర్స్, ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు వీటిని సరఫరా చేస్తున్నారు. ఎద్దుమైలారం సాయుధ ట్యాంకులలో ఆయిల్ ఉష్ణోగ్రత సమతుల్యత కోసం ఇన్సులేషన్కు ఫినోలిక్ ఫోం ప్యాడ్లను వినియోగిస్తున్నారు. ఇస్రో నుంచి ఆర్డర్తో.. ఇస్రో నుంచి ఆర్డర్తో మాకు ఎంతో మేలు చేకూరుతుంది. జీఎస్ఎల్వీ రాకెట్కు తొలిసారిగా సరఫరా చేస్తున్నాం. పది సంవత్సరాలుగా పలు ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నాం. 2003లో ఎన్.సుఖజీవన్రెడ్డితో కలిసి కంపెనీని ప్రారంభించాం. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మా కంపెనీ ఉత్పత్తులపై సెర్చింగ్ పెరిగింది. థర్మల్ ఇన్సులిన్కు సంబంధించిన పదా«ర్థాలను తయారు చేస్తున్నాం. ఇస్రో డైరెక్టర్ ఉన్నికృష్ణన్ అయ్యర్ మా ఉత్పత్తుల రవాణాను వర్చువల్గా ప్రారంభించారు. రూ.20 లక్షల విలువైన మెటీరియల్ పంపించాం. ఒక జీఎస్ఎల్వీ రాకెట్కు 365 ఫినోలిక్ ఫోం ప్యాడ్స్ వాడతారు. ఇప్పటికే ఒక రాకెట్కు సరిపడా ఫోమ్స్ పంపించాం. – డి.చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్, వీఎన్డీ సెల్ప్లాస్ట్ సంస్థ -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చౌటుప్పల్ : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ పదవీ ప్రమాణస్వీకా రోత్సం ఆదివారంఅట్టహాసంగా జరిగింది.ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కుంభం అనిల్కుమార్రెడ్డి, వేముల వీరేశం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. నూతన చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లతో మార్కెట్ కార్యదర్శి రవీందర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 20 శాతం నిధులు వ్యవసాయానికి కేటా యించి చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. చౌటుప్పల్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి నిధులు తీసుకువస్తానన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలోని మూసీ కాలువల్లో కృష్ణా, గోదావరి జలాలను పారించడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించే బాధ్యత తనదేనన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయం బాగుండాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.రాజకీయాల్లో రాజగోపాల్రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఆయనకు మంత్రి పదవి లభిస్తే చౌటుప్పల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాజగోపాల్రెడ్డి నాయకత్వంలో చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నూతన పాలకవర్గం రైతులకు చేరువై సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్రెడ్డి, తాడూరి వెంకట్రెడ్డి, చిక్కా నర్సింహ, గుత్తా ఉమాదేవి, నూతి రమేష్రాజు, అందెల లింగంయాదవ్, నారబోయిన రవి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ సెక్రటరీ రవీందర్రెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్, పాశం సంజయ్బాబు, చెన్నగోని అంజయ్యగౌడ్, ఉప్పు భద్రయ్య, కొయ్యడ సైదులుగౌడ్, మొగుదాల రమేష్, సుర్వి నర్సింహ, బోయ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణపుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. తెలుగుభాష ఘనతను చాటిన ఉషారాణిమోత్కూరు : ఉగాదిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో మోత్కూరుకు చెందిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం కార్యదర్శి రేగోటి ఉషారాణి ప్రతిభ కనబరిచారు. చక్కటి కవిత రచించడమే కాకుండా గానం చేసి తెలుగు భాష ఘనతను చాటారు. ఇందుకు గాను ఆమెకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.ఎన్.నర్సింహారెడ్డి, సైనిక దళం జనరల్ మేజర్ ఎన్.శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమెంటో అందుకున్నారు. ప్రచారం చేసి.. ఆలోచింపజేసి చౌటుప్పల్ : మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. ఆదివారం చౌటుప్పల్లోని వారాంతపు సంతలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు – అనర్థాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా యువతకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూమపానం, మద్యపానంతో పోలిస్తే డ్రగ్స్ వందల రెట్లు ప్రమాదకరమైనవన్నారు. డ్రగ్స్కు అలవాటుపడితే వారిచే మాన్పించడం చాలా కష్టమన్నారు. బానిసలుగా మారిన వ్యక్తులు నేరాలకు పాల్ప డుతారని పేర్కొన్నారు. తాము చంపుతున్నది ఎవరినో సైతం వారికి తెలియని పరిస్థితులు ఉంటాయన్నారు. డ్రగ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. అల్లందేవిచెర్వు మాజీ సర్పంచ్కు పురస్కారం సంస్థాన్ నారాయణపురం: మండలంలోని అల్లందేవిచెర్వు మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్య బిందేశ్వరి మండల అవార్డు అందుకున్నారు. యాదవ రాజ్యాధికార సాధన సమితి, బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందజేశారు. యాదయ్య సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం అనేక పోరాటాలు చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యాదయ్య తెలిపారు. -
గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తా
యాదగిరిగుట్ట: గొర్రెల కాపరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆవిర్భావ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గొల్ల కురుమ బిడ్డగా గొర్రెల కాపరుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాపరులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. అంతకు ముందు బీసీ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
1,200 మందికి ఉద్యోగ అవకాశాలు
బీబీనగర్: బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీబీనగర్లో నిర్వహించిన జాబ్ మేళాలో 1,200మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. మేళాలో 63 కంపెనీలు పాల్గొనగా 250 మందికి వెంటనే ఉద్యోగాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు మేళాను ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కంపెనీలతో జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు పొట్ట నవీన్కుమార్, దాసమోని వెంకటేశ్, శ్యామ్, రవి, విశ్వనాథ్, శ్రీను, బాలు, వెంకట్, విజయ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవిపై మాటల యుద్ధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి మంట రేపుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి జానారెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరులో బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో 15 రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైందని, ఇక ప్రకటనే తరువాయి అన్న చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్లో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాయడంతో చిచ్చు మొదలైంది. రాజగోపాల్రెడ్డికి వచ్చే మంత్రి పదవిని అడ్డుకునేందుకు ఆయన లేఖ రాశారని రాజగోపాల్రెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోలోపల రగులుతూనే ఉన్నా ఆ మంట ఆదివారం బహిర్గతమైంది. జానాపై భగ్గుమన్న రాజగోపాల్రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కొంతమంది దుర్మార్గులు అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి ధర్మరాజు మాదిరిగా పెద్దన్నలా వ్యవహరించకుండా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం, సామాజిక కూర్పు అంటున్న జానారెడ్డికి ఇన్నేళ్ల తర్వాత ఆ అంశం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తానికి జానారెడ్డి లేఖ కాంగ్రెస్లో కాకరేపగా.. ఆయనను రాజగోపాల్రెడ్డి ధృతరాష్ట్రుడితో పోల్చుతూ హాట్ కామెంట్ చేయడం పార్టీలో చిచ్చు రగిల్చింది. ఫ జానారెడ్డి తీరుపై భగ్గుమన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఫ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపాటు ఫ వేరే జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని లేఖ రాయడంపై అభ్యంతరం ఫ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నఅధిష్టానం నిర్ణయం ఏమిటో? ప్రస్తుత పరిస్థితులు అన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. జానారెడ్డి లేఖను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇస్తుందా..? ముందుగా ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మాట నిలుపుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జిల్లా కాంగ్రెస్ పెద్దలు డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్కు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారన్న చర్చ సాగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని బాలునాయక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఇది జరగడం, ఆయన ఎప్పుడు బహిర్గతం అవుతారోనన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి రచ్చ ఎటు దారి తీస్తుందో? ఎప్పుడూ గుంభనంగా ఉండే జానారెడ్డి ఒక్కసారిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని సూటిగా చెప్పలేక వేరే జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది. ఆయన లేఖ తరువాతే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి బహిరంగా విమర్శలు చేయడం ఎటు దారి తీస్తుందో చూడాలి. అంతేకాదు మరోవైపు రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు. తాను ఇన్నాళ్లూ ఆగానని, ఇకపై కచ్చితంగా మంత్రి పదవిని అడుగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు ఖమ్మంలో 9 మంది గెలిస్తే మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మంది గెలిచినప్పుడు ఎందుకు మూడో మంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు. -
ఈదురు గాలులు, వడగండ్లు
అడ్డూగూడూరు : జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ ఈదురుగాలు, వడగండ్ల వర్షం కురిసింది. అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు చౌల్లరామారం, కోటమర్తి, చిర్రగూడూరు, జానకిపురం గ్రామాల్లో అక్కడక్క చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వర్షపు నీటిలోనుంచి వడ్లను వేరు చేసేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. చౌల్ల రామారం గ్రామానికి చెందిన పురుగుల మల్లేష్ సాగు చేసిన మూడెకరాల వరి చేను వడగండ్ల వానకు దెబ్బతింది. ఏడు ఎకరాల్లో సాగు చేసి కుప్ప చేసి మొక్కజొన్నలు వర్షానికి తడిసి మద్దయ్యాయి. దీంతో రూ.5లక్షల వరకు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆలేరురూరల్ : మండల పరిధిలోని శ్రీనివాసపురం, పటేల్గుడెం, కొలనుపాకలో చెట్లు కూలాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆత్మకూరు(ఎం) : పల్లెపహాడ్లోని కొనుగోలు కేం ద్రంలో వడ్లు కొట్టుకుపోయాయి. కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోటకొండూర్: చామాపూర్లోని పాశం బాల్రెడ్డి ఇంటి ఎదుట కరెంట్ స్తంభం కూలిపోయింది. దీంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోతకు వచ్చిన వరి చేల్లో ఈదురు గాలులు, వడగండ్లకు వడ్లు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రాలిన మామిడి కాయలు, నేలకొరిగిన వరి చేలు కూలిన చెట్లు, స్తంభాలు, నిలిచిన కరెంట్ సరఫరాఉదయం ఎండ, సాయంత్రం వాన భువనగిరిటౌన్ : జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అ వుతుండగా, సాయంత్రం ఉన్నట్టుండి వాతా వరణం చల్లబడి వర్షం కురుస్తోంది. ఆదివా రం ఆలేరులో 10.8 మి.మీ, అడ్డగూడూరు 9 మి.మీ, మోటకొండూరు 3.3, బీబీనగర్ 1, రాజాపేట 0.8, యాదగిరిగుట్టలో 0.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సగటున 40 డిగ్రీల సెల్సీయస్గా నమోదైంది. -
‘చలో వరంగల్’ను విజయవంతం చేయాలి
యాదగిరిగుట్ట రూరల్ : వరంగల్లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాసిన చలో వరంగల్ వాల్ రైటింగ్ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో స్వయంగా చలో వరంగల్, జై కేసీఆర్ నినాదాలతో వాల్ రైటింగ రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సభలో కేసీఆర్ చెప్పే మాటల కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వెంట ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు రేపాక స్వామి, కానుగు బొట్టు రాజు, సీస శేఖర్, యడపల్లి మహేష్, కానుగు అనిల్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత -
నల్లగొండ బిడ్డకు ఉన్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి మరో ఉన్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్ఎం, ీపీహెచ్డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా మారాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, సహచర న్యాయమూర్తులకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం -
ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు
చౌటుప్పల్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కొందరు వ్యక్తులు దుర్మార్గంగా అడ్డుపడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. మహాభారతంలో ధర్మరాజులా ఉండాల్సిన మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇవ్వాలని అధిష్టానానికి జానా లేఖ రాశారని పేర్కొన్నారు. 20 ఏళ్లు మంత్రి పదవులు అనుభవించిన జానాకు ఈ అంశం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ‘ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వొద్దని కొందరు మాట్లాడుతున్నారు. ఇద్దరికి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవినే త్యాగం చేశారు.నేను సోనియాగాంధీని ఒప్పించి, తెగించి పార్లమెంట్లో పోరాడా. మా ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మందికి 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి?’ అని రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు.మాట నిలుపుకోవాల్సింది ఎవరు?గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రు లు ఇన్చార్జీలుగా ఉన్న పార్లమెంట్ స్థానాలైన కరీంనగర్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, మెదక్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని రాజగోపాల్రెడ్డి గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆ స్థానాల బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. తన బలం ఏమిటో తెలిసినందునే ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని వస్తానన్న నమ్మకంతో ఎమ్మెల్యే అయిన తనను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జిగా అధిష్టానం నియమించిందన్నారు. పదవుల కోసం అడుక్కోను.. పాకులాడను..తాను మంత్రి కావాలని జాలితోనో, పైరవీ చేసో అడగట్లేదని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. తనకు దమ్ము, ధైర్యం ఉందని.. మంత్రి పదవికి అర్హత, పదవిని సమర్థంగా చేపట్టగలనని నమ్మితేనే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. తాను పదవుల కోసం పాకులాడనని, పదవులు కావాలని అడుక్కోనని స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడట్లేదని తేల్చిచెప్పారు. ప్రాణం పోయినా నియోజకవర్గ ప్రజలు తలదించుకొనేలా ప్రవర్తించబోనని భావోద్వేగానికి లోనయ్యారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. కాగా, చండూరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఓపికను చేతగాని తనంగా చూడొద్దని.. తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 16 నెలలుగా మంత్రి పదవులను ఖాళీగా ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డారు. -
ముంపు లేకుండా గంధమల్ల
1.41 టీఎంసీల సామర్థ ్యంతో రిజర్వాయర్ నిర్మాణం.. పాలనా ఆమోదం తెలిపిన ప్రభుత్వంసాక్షి, యాదాద్రి : ఆలేరు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గంధమల్ల రిజర్వాయర్కు పరిపాలనా ఆమోదం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వ రం ప్రాజెక్టు ప్యాకేజీ –15లో భాగంగా ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్ను.. ముంపు సమస్య లేకుండా, తక్కువ భూసేకరణతో నిర్మించనున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం రెండు దఫాలు కుదింపుతుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. జలాశయాన్ని 9.86 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.800 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించింది. ఈ రిజర్వాయర్ ద్వారా ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 68 వేల ఎకరాలకు సాగు నీరందించాలన్నది లక్ష్యం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. బెకమ్, నవయుగ, ప్రసాద్ సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. అయితే రిజ ర్వాయర్ నిర్మాణంలో ఐదు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో వీరారెడ్డిపల్లి పూర్తిగా, గంధమల్ల, భీమరిగూడెం, ఇందిరానగర్ పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా 4,027 (అటవీ భూములు 230ఎకరాలు కలుపుకుని) ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇది అధికారులకు సవాల్గా మారింది. దీంతో పాటు ముంపు ప్రాంతాల గుండా 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉండడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పవర్గ్రిడ్ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. సాంకేతిక కమిటీ సూచన మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించింది. అయినా మూడు గ్రామాలు ముంపునకు గురవుతుండడం, 2,094 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుంది. ముంపు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం మరోసారి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గించింది. రూ.574.56 కోట్లు మంజూరు పాత కాంట్రాక్టు సంస్థలకే పనులు అప్పగింత భూసేకరణకు సిద్ధమవుతున్న రెవెన్యూ, నీటిపారుదల శాఖ ప్రాజెక్టు పూర్తయితే 68 వేల ఎకరాలకు సాగు నీరుమాట నిలుపుకున్నాం గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని ఎన్నికల ప్రచా రంలో హామీ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది. వీలైనంత త్వరలో రిజర్వాయర్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. ముంపు బాధలేకుండా రిజర్వాయర్ పనులకు పరిపాలనామోదం తెలిపినందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు. –బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే 1.41 టీఎంసీలతో నిర్మాణం1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకోసం రూ.574.56 కోట్లు మంజూరు చేసింది. రిజర్వాయర్ కోసం గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవెన్యూ పరిఽధిలో సుమారు వెయ్యి ఎకరాలు సేకరించాల్సి వుంది. ఇందులో రిజర్వు పారెస్ట్ నుంచి 239 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి బదులు వరంగల్ జిల్లాలో ప్రభుత్వం భూమిని అటవీశాఖకు కేటాయించింది. ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం లభించడంతో భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న బెకమ్, నవయుగ, ప్రసాద్ సంస్థలు సంయుక్తంగా రిజర్వాయర్ పనులు చేపట్టనున్నాయి. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
భువనగిరి : 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈసారి ముందస్తుగానే పుస్తకాల సరఫరా ప్రారంభించింది. విడుతల వారీగా నెల రోజుల్లో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని భువనగిరిలోని పాత గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు. 51,542 మంది విద్యార్థులుజిల్లాలో 730 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక 484, ప్రాథమికోన్నత 68, ఉన్నత, జిల్లా పరిషత్ 163, కస్తూరిబా 7, మోడల్ స్కూళ్లు, గురుకులాలు 11 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 51,542 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి 5 నుంచి 11 పుస్తకాలు అవసరం. రెండు విభాగాలుగా పుస్తకాల ముద్రణఇంగ్లిష్, తెలుగు భాషల్లో పుస్తకాల ముద్రణ ఉండటంతో రెండు విభాగాలుగా సరఫరా చేస్తున్నారు. జిల్లాకు 3,90,170 పుస్తకాలు, 110 టైటిల్స్ ఇండెంట్ పెట్టారు. ఇందులో మొదటి విడత ఎస్ఏ–1 పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు 2 లక్షలు రావాల్సి ఉంది. ఇందులో ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం పుస్తకాలు వస్తున్నాయి. వీటిని ఓ పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్లో ముద్రించారు. 3నుంచి 10వ తరగతి వరకు క్యూ ఆర్ కోడ్ ముద్రించారు. ప్రస్తుతం 27,960 పుస్తకాలు, 8 టైటిల్స్ జిల్లాకు చేరాయి.నెల రోజుల్లో పూర్తి స్థాయిలో వస్తాయి రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు రావడం ప్రారంభమైంది. ఈనెల 11వ తేదీ నాటికి 27,960 పుస్తకాలు, 8 టైటిల్స్ వచ్చాయి. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరుతాయి. వీటిని పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – సత్యనారాయణ, డీఈఓ 3.90 లక్షల పుస్తకాలకు ఇండెంట్ జిల్లాకు చేరినవి 27,960 పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పంపిణీ -
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి
రాజాపేట : ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని, భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం రాజాపేటలో నిర్వహించిన గావ్ చలో.. బస్తీ చలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా వరకు స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాయివాలాను ప్రధానమంత్రిని చేసిన ఏకై క పార్టీ బీజేపీయేనన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానిక కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మేకల రమేష్, పట్టణ ఇంచార్జి కంచర్ల శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు సాధనబోయిన శంకర్, నాయకులు దాచపల్లి శ్రీను, జెన్న సిద్దులు, మధు, గొట్టి పాముల సాయికృష్ణ, దిడ్డి సత్యనారాయణ, ఉపేందర్, శ్రీహరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కలకు అందించే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి..
ఇళ్లలో పిల్లులు, కుక్కల్ని పెంచుకునేవారు.. వాటిని ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. అయితే, వీటిని పెంచడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి ప్రత్యేక దుస్తులు, బెల్ట్లు, బెడ్లు, ఆహార పదార్థాలు అవసరం. ఇప్పుడు నల్లగొండ పట్టణంలో వాటికోసం ప్రత్యేక స్టోర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కుక్కలు, క్యాట్లకు కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు, బెల్ట్, బెడ్, షాంపులు లభిస్తాయి. అన్ని రకాల పప్పీస్ బ్రీడ్ విక్రయిస్తారు. అంతే కాకుండా ఇంటి వద్దకు వెళ్లి డాగ్కు కావాల్సిన సర్వీస్ చేస్తారు. కుక్కల యజమానులు ఔటింగ్కు వెళ్లినప్పుడు డే కేరింగ్ సౌకర్యం ఉంది. డాగ్స్కు గ్రూమింగ్, బాతింగ్ చేయిస్తారు. అంతే కాకుండా వాటికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రితో పాటు ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి. పర్సనల్ డాక్టర్లు కూడా ఉన్నారు. కుక్క పిల్లలకు మొదటి 30 రోజుల వరకు మదర్ మిల్క్ తప్పనిసరి. ఒకవేళ మదర్ మిల్క్ సరిపోకపోతే 20 రోజులు దాటిన తర్వాత బాలెన్స్డ్ ఫుడ్ అందించాలి. 30 రోజుల వయస్సు తర్వాత హైప్రొటీన్తో కూడిన స్టాటర్ ఫుడ్ అందించాలి. 3 నుంచి 18 నెలల మధ్యలో లెస్ ప్రొటీన్ ఉన్నటువంటి పప్పి ఫుడ్ పెట్టాలి. 18 నెలల తర్వాత ఇచ్చే ఫుడ్ను అడల్ట్ ఫుడ్ అంటారు. ఇందులో పెడిగ్రీ ప్రో, రాయల్ కానైన్, వెట్ ప్రొ, డ్రూల్స్, ఎన్ అండ్ డీ ఇలా చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మదర్తో కడుపులో ఉన్న పప్పీని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఇవ్వాలి. ఇందులో హై ప్రొటీన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ ఏ, ఈ, అమైనో యాసిడ్లు ఉంటాయి. -
నేడు రక్తదాన శిబిరం
భువనగిరిటౌన్ : మహానీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం భువనగిరిలోని బాగాయత్ హైస్కూల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అయ్యప్ప సేవకుడికి పురస్కారంభూదాన్పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాలకు చెందిన అయ్యప్ప సేవకుడు సుర్వి బాలరాజుగౌడ్ గురుస్వామి పరశురాం పురస్కారం అందుకున్నారు. కేరళలోని మలయాళ భగవతి పీఠం, ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్గోపన్, శబరిమలై పూర్వ మేల్ శాంతిశంకరన్ నంబూద్రి, బ్రహ్మశ్రీ శివ నరసింహన్ తాంత్రి, సుబ్రహ్మణ్యం నంబూద్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. అయ్యప్పస్వామి దీక్ష వ్యాప్తి, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పురస్కారం దక్కినట్లు బాలరాజు తెలిపారు. 24న పాడి రైతుల సదస్సు భువనగిరిటౌన్ : ఆలేరులో ఈనెల 24న జరిగే పాల రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలోని సుందరయ్య భవన్లో మేక అశోక్రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా అఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందుతున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు తక్కువ ధరకు పాలు సేకరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నెలనెలా పాల బిల్లులు కూడా రావడం లేదన్నారు. సదస్సులో పాడి రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ జహంగీర్, మంగ నర్సింహులు, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాషిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
భువనగిరి: రూ.80 లక్షలు విలువ చేసే మత్తు పదార్థమైన హాషిష్ ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషరేట్లో సీపీ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాకు చెందిన పెట్ల శేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని శ్రీవిద్యా కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా హైదరాబాద్లో గంజాయి సరఫరా చేసే దుర్గా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హషిష్ ఆయిల్ సరఫరా చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో శేఖర్ తన చిన్ననాటి స్నేహితుడైన అనిమినిరెడ్డి దుర్గారావును కలిసి హాషిష్ ఆయిల్ గురించి వివరించాడు. దీంతో దుర్గా నుంచి హాషిష్ ఆయిల్ సేకరించి ఇద్దరు తమకు తెలిసిన ప్రాంతాల్లో అవసరమైన వారికి విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శేఖర్, దుర్గారావులు దుర్గా వద్ద సుమారు 4 కేజీల హాషిష్ ఆయిల్ కొనుగోలు చేశారు. భువనగిరి రైల్వేస్టేషన్లో దిగి మండలంలోని అనంతారం గ్రామానికి వెళ్లే సర్వీస్ రోడ్డు మార్గంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో సమాచారం మేరకు ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. వారి వద్ద 4 కేజీల హాషిష్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్తో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, దుర్గా పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎస్ఓటీ పోలీసులు, రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్కుమార్ ఉన్నారు. రూ.80లక్షల విలువగల హాషిష్ ఆయిల్ స్వాధీనం -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
ఆలేరురూరల్: తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. శారాజిపేట గ్రామానికి చెందిన దూడల ఆంజనేయులు(45) కుల వృత్తిలో భాగంగా ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పైనుంచి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులకు వృద్ధురాలు అప్పగింతనల్లగొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన వృద్ధురాలిని కలెక్టర్ శుక్రవారం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వృద్ధురాలు నాగమ్మ తన ఇంట్లో సమస్యల కారణంగా మనస్థాపానికి గురై నల్లగొండకు వచ్చింది. సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గత మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్లో వృద్ధురాలిని గుర్తించాడు. ఆమె వివరాలు అడిగి వయోవృద్ధుల శాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో వయోవృద్ధుల శాఖ అధికారి కృష్ణవేణి మెడికల్ కళాశాలలో చేర్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఇక్కడ ఆశ్రయం కల్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం నల్ల గొండకు రాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి, శ్రీకాంత్ సునీల్ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోదాడరూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న ఆటోను కోదాడరూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలేనికి చెందిన షేక్. సికిందర్ కోదాడ మండల బీక్యాతండాలో రేషన్కార్డుల దారుల నుంచి నాలుగు క్వింటాళ్ల పాత రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేశాడు. వాటిని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భరత్ కుమార్కు విక్రయించేందుకు వెళ్తున్నాడు. కూచిపూడి వద్ద పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఈమేరకు సికిందర్పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు
రామన్నపేట: పెంచుకున్న రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. పెరిగిన అప్పుల కారణంగా దంపతుల మధ్య వాగ్వాదం నెలకొంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న భర్త మరుసటిరోజే గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. హృదయ విదారకమైన సంఘటన రామన్నపేట మండలంలోని నిధానపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన బొబ్బల మల్లయ్య కుమార్తె కావ్య(25)కు రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామానికి చెందిన జినుకల ఆంజనేయులు(31)తో ఏడేళ్ల క్రితం జరిగింది. వారికి నిహాన్, విహాన్ అనే ఇద్దరు ఆరేళ్లలోపు కుమారులు ఉన్నారు. ఆంజనేయులు నిధానపల్లిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వారికి చెందిన రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. దాంతో పాటు యాసంగిలో సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఈనెల 8న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదేరోజు భర్త ఆంజనేయులు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన కావ్య గురువారం తమ వ్యవసాయబావి వద్ద పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త తెలుసుకున్న ఆంజనేయులు హైదరాబాద్ నుంచి రామన్నపేటకు బయలు దేరాడు. మార్గమధ్యంలో గడ్డిమందు కొనుగోలు చేశాడు. ఇంద్రపాలనగరం శివారులోని అయ్యప్పగుడి సమీపంలో దానిని సేవించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్చేసి తెలిపాడు. దీంతో వారు అక్కడకు వెళ్లి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. కాగా.. కావ్య, ఆంజనేయులు మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. దంపతుల మధ్య గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భార్య విషయం తెలుసుకుని గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ భర్త తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు అనాథలైన చిన్నారులుతల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమారులు నిహాన్, విహాన్లు అనాథలయ్యారు. అంత్యక్రియల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక ధీనంగా చూస్తూ ఉండిపోయారు. చిన్నారుల చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. హృదయ విదారకమైన సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధం
హుజూర్నగర్రూరల్: విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధమైన ఘటన శుక్రవారం హుజూర్నగర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వేలపసింగారం గ్రామానికి చెందిన రైతులు కర్నె వీరారెడ్డి, కలకండ జయరాజులకు చెందిన ట్రాక్టర్లలో తమ వ్యవసాయ పొలంలో ఉన్న వరిగడ్డిని శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకువస్తున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్న పశువుల ఆస్పత్రికి చెందిన విద్యుత్ వైరుకు గడ్డి ట్రాక్టర్ తగలడంతో వైరు తెగి వరిగడ్డిపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంతేకాకుండా వెనుక వస్తున్న జయరాజు చెందిన ట్రాక్టర్లో ఉన్న గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. వరిగడ్డి పూర్తిగా దగ్ధమైందని సుమారు రూ.15 వేలు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని ఒకరు మృతి
మాడ్గులపల్లి: రోడ్డు వెంట నిలిపిన ట్రాక్టర్ను బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, గోప్యానాయక్తండా గ్రామానికి చెందిన ముడావత్ ిపీర్యా(36) చిట్యాల మండలం నుంచి పనినిమిత్తం తన ద్విచక్ర వాహనంపై హాలియా మండలం సూరేపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన రేకా గోవింద్ అనే వ్యక్తి తన ట్రాక్టర్ను నార్కట్పల్లి– అద్దంకి రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచాడు. ఈక్రమంలో బైక్పై వస్తున్న పీర్యా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్తి కోసం ఘాతుకం
సవతి కూతురును హత్యచేసిన మహిళ శాలిగౌరారం: ఆస్తి కోసం సవతి కూతురును హత్య చేసి మృతదేహాన్ని మూసీనదిలో పూడ్చిపెట్టగా పోలీసులు హత్య కేసును ఛేదించి ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామం పడమటితండా(డి)కి చెందిన జాటోతు పీనానాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య శాంతి, రెండవ భార్య లలిత. మొదటి భార్యకు కొడుకు, కూతురు మహేశ్వరి(23) ఉండగా రెండవ భార్య లలితకు కుమార్తె(14) ఉన్నారు. మొదటి భార్య శాంతి అనారోగ్యం బారినపడడంతో 16 సంవత్సరాల క్రితం ఆమెకు పీనానాయక్ రూ.4 లక్షలు నగదు, పోషణ కోసం నెలకు రూ.4 వేలు ఇవ్వడంతో పాటు కుమార్తె మహేశ్వరిని తన వద్ద ఉంచుకొని చదివిపించి వివాహం చేసేవిధంగా పెద్దల సమక్షంలో ఒప్పదం చేసుకుని శాంతికి దూరంగా ఉంటున్నాడు. దీంతో శాంతి తన కుమారుడితో కలిసి దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని తన పుట్టినింటికి వచ్చి అక్కడే ఉంటోంది. శాంతి నుంచి విడిపోయిన సంవత్సరం తర్వాత పీనానాయక్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆయన తన కుమార్తె మహేశ్వరి, రెండవ భార్య లలితతో కలిసి ఉంటున్నాడు. ప్రస్తుతం లలితకు కుమార్తె(14) ఉంది. ప్రస్తుతం పీనానాయక్ రెండవ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. పీనానాయక్కు స్వగ్రామంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమితో పాటూ హైదరాబాద్లోని బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. తండ్రి, పినతల్లి వద్ద ఉంటూ మహేశ్వరి(23) బీఎస్సీ నర్సింగ్ విద్య పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్లో కాంట్రాక్టు పద్ధతిలో స్టాప్నర్స్గా పనిచేస్తుంది. మహేశ్వరికి వివాహం చేసేందుకు తండ్రి పీనానాయక్ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్కు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న బంధువైన ఓ అబ్బాయికి మహేశ్వరిని ఇచ్చి వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో 2024 అక్టోబర్లో రూ.కోటి కట్నం ఇచ్చేవిధంగా ఒప్పందంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. మహేశ్వరికి కట్నం కింద బోడుప్పల్ లక్ష్మీనగర్లోని ఒక ఇల్లుతో పాటు బంగారం, కొంత నగదు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డిసెంబర్ 7న ఇంట్లో హత్య చేసి... మహేశ్వరిని చంపాలనే పథకంలో భాగంగా 2024 డిసెంబర్ 7న ఇంట్లో పాయసంలో నిద్రమాత్రలు వేసి మహేశ్వరికి ఇచ్చారు. ఆ పాయసం తాగిన మహేశ్వరి స్పృహతప్పి పడిపోవడంతో లలిత, రవిలు కలిసి మహేశ్వరిని గొంతునులిమి చంపాశారు. అనంతరం మహేశ్వరి మృతదేహాన్ని గోనేసంచిలో మూటకట్టి మరో వ్యక్తి సహాయంతో అదేరోజు రాత్రి రవి కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి వద్ద మూసీనదిలో బ్రిడ్జి పిల్లర్ నెంబర్ 1 సమీపంలో ఇసుకలో గుంతతీసి పూడ్చిపెట్టారు. రాత్రి ఇంటికి వచ్చిన పీనానాయక్.. కుమార్తె మహేశ్వరి ఇంటికి రాకపోవడంతో ఎటు పోయిందని భార్య లలితను అడగగా డ్యూటీకని చెప్పి ఇంట్లో ఫోన్వదిలి వెళ్లిపోయిందని, తాను ప్రేమించిన వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటానని ఫోన్చేసి చెప్పిందని వివరించింది. దీంతో భార్య చెప్పిన విషయాన్ని నమ్మిన మహేశ్వరి తండ్రి పీనానాయక్ కుమార్తెకు వివాహ నిశ్చితార్ధం కావడంతో ప్రేమ విషయాన్ని బయటకు పొక్కుండా రహస్యంగా ఉంచి కుమార్తె కోసం వెతకడం ప్రారంభించాడు. మహేశ్వరిని వివాహం చేసుకునే అబ్బాయి మహేశ్వరి ఫోన్ ఎత్తడం లేదని, మెసేజ్లకు స్పదించడంలేదని మామ పీనానాయక్కు చెప్పడంతో అదోఇదో చెబుతూ నెట్టుకొస్తున్నాడు. ఈక్రమంలో ఆ అబ్బాయి ఒత్తిడి చేస్తుండటంతో వారం రోజుల క్రితం పీనానాయక్ తన కుమార్తె అదృశ్యంపై మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యుల ఫోన్కాల్ డేటా, లొకేషన్ ఆధారంగా పీనానాయక్ రెండవ భార్య లలితను, ఆమె ప్రియుడు రవిని విచారించారు. దీంతో మహేశ్వరి హత్య, మృతదేహం పూడ్చివేత విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మేడిపల్లి పోలీసులు, శాలిగౌరారం పోలీసుల సహాయంతో శుక్రవారం ఉదయం నేరస్తులను పట్టుకొచ్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక తహశీల్దార్ యాదగిరి సమక్షంలో పంచనామా జరిపి హైదరాబాద్కు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మహేశ్వరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని మూసీనది ఇసుకలో పాతిపెట్టిన నిందితులు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ఫోన్కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులుఆస్తి పోతుందనే కక్షతో... తనవద్ద ఉంటున్న సవతి కుమార్తె మహేశ్వరి పెళ్లికి కోటి రూపాయల కట్నం ఇస్తుండటం, కట్నం కింద ఇల్లు, బంగారం, నగదు ఇవ్వడం లలితకు నచ్చలేదు. దీంతో మహేశ్వరిపై లలిత కక్ష పెంచుకుంది. మహేశ్వరిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పీనానాయక్ పేరున బ్యాంకులో ఉన్న రూ.20 లక్షల నగదును భర్తపై ఒత్తిడి తెచ్చి తన ఖాతాలోకి మార్చుకుంది. ఇక ఇల్లు, బంగారం దక్కాలంటే మహేశ్వరిని భూమి మీదలేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో లలిత తన స్వగ్రామమైన వెలిశాలకు చెందిన తన మేనమామ కుమారుడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన రవితో వివాహేతర సంబంధం పెట్టకొని.. మహేశ్వరిని చంపితే ఆస్తి మొత్తం తనకు, తన కుమార్తెకే దక్కుతుందని, ఎలాగైనా మహేశ్వరిని చంపాలని రవితో కలిసి పథకం రచించింది. -
మహనీయుడు.. మహాత్మా ఫూలే
భువనగిరిటౌన్ : మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని.. భారత గడ్డపై పుట్టడం మన అందరి అదృష్టమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని జగదేవ్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే జయంతి ఉత్సవాలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి వివిధ సంఘాల నాయకులతో కలిసి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో ఎన్నో మార్పులకు జ్యోతిరావు ఫూలే ముఖ్య కారణమన్నారు. నాడు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి సామాజిక మార్పు తీసుకొచ్చిన గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే ఎంతగానో శ్రమించారన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించుకుందామ న్నారు. కులాల అంతరాలు పోవాలంటే చదివే చిరునామా అని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మాజీ మున్సిపల్ చైర్మన్, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫూలే.. భారతగడ్డపై పుట్టడం మన అదృష్టం భువనగిరి ఎమ్మెల్యే కుంభ ర , కలెక్టర్ హనుమంతరావు -
కేంద్రం నిధులిచ్చే పథకాలకు పీఎం ఫొటో పెట్టాలి
మోత్కూరు : కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పెట్టాల్సిందేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మోత్కూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలకు హాజరయ్యారు. అనంతరం గావ్ చలో...బస్తీ చలో అభియాన్లో భాగంగా స్థానిక చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తకొండ ఉషారాణి, సుష్మ, బద్ధం మహేందర్రెడ్డి, సాయిచరణ్లు బీజేపీలో చేరారు. బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు చాడ మంజుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాప రవి, కూరాకుల వెంకన్న, మల్లెపాక సాయిబాబు, గుజ్జ సోమనర్సయ్య, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని -
రైతన్నలకు అకాల కష్టం
సాక్షి,యాదాద్రి: వరినాట్లు మొదలుకొని.. చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునే దాకా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. వీటికితోడు ఏటేటా అకాల వర్షాలు అన్నదాతలకు అంతులేని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లు వెల్లువలా తరలివస్తున్నా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ఈ క్రమంలో కేంద్రాల్లో పోసిన ధాన్యం అకాల వర్షాలకు తడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు అకాల వర్షంఈనెల 3, 10 తేదీల్లో జిల్లాలో రెండుసార్లు అకాల వర్షం కురిసింది. 3న కురిసిన వర్షంతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో 139 మంది రైతులకు చెందిన వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 160 ఎకరాల మామిడి, 60 ఎకరాల వరిపంట దెబ్బతిన్నట్లు అధికారులే లెక్కకట్టారు. కాగా 10వ తేదీన కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోగా, కోతకు సిద్ధంగా ఉన్న వరిపైర్లు నేలవాలాయి. కొన్నిచోట్ల ధాన్యం రాలింది. జిల్లాలోని నాన్ఆయకట్టులో వరికోతలు తుది దశకు చేరుకోగా, మూసీ ఆయకట్టులో వరికోతలు జోరందుకున్నాయి. ఇదీ..పరిస్థితి!ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు వేగం పుంజుకోలేదు. దీనికితోడు మిల్ల ర్లకు ధాన్యం కేటాయించలేదు. కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయశాఖ అధికారులు తేమ శాతం కూడా చూసిందిలేదు. మిల్లులకు ధాన్యం తరలించే లారీల కేటాయింపు పూర్తి కాలేదు. కొనుగోలును ఎంట్రీ చేసే ట్యాబ్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అక్కడక్కడా అరకొరగా కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఽరైతుల ధాన్యం కొంత తడవగా, మరికొంత కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని అరబెట్టడం, కుప్పపోయడంతోనే సరిపోతుందని, కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.ఇప్పటి వరకు ప్రారంభించినవి 92నిర్ణయించిన కొనుగోలు కేంద్రాలు 323 కొనుగోలు కేంద్రాలకు వెల్లువలా ధాన్యం ఖరారుకాని మిల్లుల ట్యాగ్ తేమ శాతం చూసేవారే కరువు నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు అకాల వర్షాలతో వడ్లు వర్షార్పణం కన్నీరుమున్నీరవుతున్న రైతాంగంకొనుగోలు చేసిన ధాన్యం 242 మెట్రిక్ టన్నులుఐదు క్వింటాళ్ల వడ్లు చెరువుపాలు ఇరవై రోజుల క్రితం 500 బస్తాల వడ్లను గుండాల బండమీద రాశిగా పోశా ను. రెండుసార్లు అకాల వర్షం కురిసింది. దీంతో వడ్లు తడవడమే కాకుండా సుమారు ఐదు క్వింటాళ్ల వడ్లు బండ కింద ఉన్న రామసముద్రం చెరువులోకి కొట్టుకుపోయాయి. రోజూ ఆరబెట్టి కుప్పపోస్తున్నా. రంగు మారితే కొంటారో లేదోనని భయంగా ఉంది. వెంటనే కొనుగోలు చేయాలి. – దేవనబోయిన మంజుల రైతు, గుండాలకొనుగోలు లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు -
బాధితులకు న్యాయం చేస్తాం
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని జంగంపల్లి గ్రామంలో పహాణీల్లో పేర్లు మార్పుల వల్ల భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి గ్రామంలో పహాణీల్లో పేర్లు మార్చి భూములను తొలగించిన కారోబార్పై గత నెల 22న సాక్షి దినపత్రికలో ప్రచురించిన కబ్జాల కారోబార్ కథనానికి యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ కృష్ణారెడ్డి శుక్రవారం గుట్ట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ కమిటీలోని సభ్యులైన ఆర్ఐలు విజయసింహారెడ్డి, శ్రీకాంత్, సర్వేయర్లతో సమావేశమై మాట్లాడారు. పహాణీలో మార్పుల జరిగిన భూముల వివరాలు క్షేత్ర స్ధాయిలో విచారణ చేయాలన్నారు. కాలువల పేరుతో భూములను తొలగించి, వాటిల్లో కాలువ పోకుండా ఉన్న భూములను పరిశీలించాలన్నారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్నారు. రైతులు అధైర్యపడవద్దని, అసైన్డ్ భూములు ఎవరు అమ్మినా కొన్నా కఠిన చర్యలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ సత్యనారాయణ, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ రాము త దితరులు ఉన్నారు. భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ‘కబ్జాల కారోబార్’ వ్యవహారంపై విచారణ చేయాలని ఆదేశం -
ధాన్యం కాంటాలు వేగవంతం చేయాలి
ఆత్మకూరు(ఎం): ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేగవంతం చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి (డీఎస్ఓ)నరసింహారావు ఆదేశించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడవడంతో శుక్రవారం సాక్షిలో అకాల వర్షం.. రైతుకు నష్టం శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వెంటనే ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటలో మోత్కూరు ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం తూకవేయక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన వెంట కేంద్రం ఇన్చార్జి పెండెం నరహరి తదితరులు ఉన్నారు. అధికారులు సమయపాలన పాటించాలిబొమ్మలరామారం: అధికారులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని జెడ్పీ సీఈఓ ఎన్.శోభారాణి అన్నారు. శుక్రవారం బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో వన నర్సరీని పరిశీలించారు. ఎండాకాలంలో మొక్కలకు రెండు పూటల నీరు అందిచాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ధరకాస్తులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాష్రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి, ఏపీఓ, కార్యదర్శులు తదితరుల పాల్గొన్నారు. వైభవంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట: Ķæ*§ýl-WÇVýS$-rt }ÌS-„îSÃ-¯]l-Æý‡-íÜ…çßæ-ÝëÓ-Ñ$ „óS{™èl…ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… ´ë…^èlÆ>{™èl BVýSÐ]l$Ô>{çÜ¢… {ç³M>Æý‡… B…yé-âŒæ AÐ]l$Ã-ÐéÇMìS F…fÌŒæ õÜÐø™èlÞÐ]l… OÐðl¿ýæ-Ð]l…-V> °Æý‡Ó-íßæ…^éÆý‡$. ÝëĶæ$…-{™èl… Ðólâýæ AÐ]l$Ã-Ðéǰ {ç³™ólÅ-MýS…-V> AÌS…MýS-Ç…_, BÌSĶæ$ †Æý‡$-Ð]l*Éýl Ò«§ýl$-ÌZÏ ¿ýæMýS$¢ÌS Ð]l$«§ýlů]l õÜÐ]l¯]l$ FÆó‡-W…^éÆý‡$. B…yé-âŒæ AÐ]l$Ã-Ðéǰ FÆó‡-WçÜ$¢¯]l² çÜÐ]l$-Ķæ$…-ÌZ Ð]l$íßæâýæ ¿ýæMýS$¢-Ë$ Ð]l$…VýSâýæ àÆý‡-™èl$-ÌS-™ø ÝëÓVýS™èl… çœÍM>Æý‡$. A¯]l…-™èlÆý‡… A§éªÌS Ð]l$…yýl-ç³…-ÌZ AÐ]l$Ã-Ðéǰ A«¨íÙt…_ F…fÌŒæ õÜÐø™èlÞ-Ðé°² ^ólç³-sêtÆý‡$. B…yé-âŒæ AÐ]l$Ã-ÐéÇMìS CçÙt-OÐðl$¯]l ¯é«§ýl çÜÓÆ>°² Ñ°í³…^éÆý‡$. A¯]l…-™èlÆý‡… àÆý‡-†°^éaÆý‡$. CMýS BÌS-Ķæ$…-ÌZ °™èlÅ ç³NfË$ Ķæ$£éÑ«¨V> Mö¯]l-Ýë-V>Ƈ$$. ˘ నేడు వైన్స్లు బంద్ భువనగిరిటౌన్ : హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా పరిధిలోని వైన్స్లన్నీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని రాచకొండ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాలతోపాటు కల్లు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రశాంతంగా హనుమాన్ జయంతి జరుపుకోవాలని సూచించారు. -
ఇచ్చేదే కొంత.. దానికీ చింతే!
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా క్రమం తప్పకుండా చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపోషణ భారంగా మారుతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్లు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. – నర్సింహ, పారిశుద్ధ్య కార్మికుడు, మహబూబ్పేట ప్రతినెలా తిప్పలే.. రెండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. నాలుగు నెలల వేతనం బకాయి ఉండగా రెండు నెలల జీతం ఇచ్చారు. మరో రెండు నెలలు ఆపారు. ప్రతి నెలా ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. వేతనాల అందక ఆర్థికంగా అవస్థలు పడుతున్నాం. ఇంటి అవసరాలకు బాకీలు చేయాల్సి వస్తుంది. – బర్ల ఇస్తారి, పారిశుద్ధ్య కార్మికుడు, మాసాయిపేట వేతనం కోసం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నిరీక్షణ యాదగిరిగుట్టరూరల్ : గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీ లోపే వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఆలస్యమవుతోంది. 14 నెలలుగా ఏ సమయంలో వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 428 గ్రామ పంచాయతీల్లో 1,860 మంది పారిశుద్ధ్య కార్మికులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.9,500 చొప్పున గ్రామ పంచాయతీలు వేతనం చెల్లిస్తున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తరువాత వీరికి వేతన కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన స్పెషల్ గ్రాంట్స్, ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో నిధుల కొరత ఏర్పడి ప్రత్యేక అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఎంతోకొంత ఆస్తిపన్ను వసూలైనప్పటికీ పంచాయతీల నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. నెలనెలా ఎదురుచూపులే.. వీధులను శుభ్రం చేయడం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర సేవల్లో రోజూ పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమవుతుంటారు. వీరికి ప్రతినెలా వేతన వెతలు తప్పడం లేదు. ప్రస్తుతం రెండు నెలలకు (ఫిబ్రవరి, మార్చి) సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది.అధికారులు చొరవ చూపి క్రమం తప్పకుండా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. నెలవారీ అవసరాలకు అవస్థలు పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందు నెల కాగానే ఠంచన్గా వచ్చిన వేతనాలు ఆ తరువాత జాప్యం జరుగుతుండడంతో పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉన్న వారికి అద్దె చెల్లింపు, కిరాణ షాపుల్లో బకాయిలు, రుణాలు, చిట్టీలు ఉన్న వారికి కిస్తులు చెల్లించడం కష్టతరంగా మారింది. ఫ రెండు నెలలుగా పెండింగ్ ఫ పంచాయతీల్లో నిధుల లేమి ఫ చేతులెత్తేస్తున్న ప్రత్యేక అధికారులు -
చౌటుప్పల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు
చౌటుప్పల్ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఖరారయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు శుక్రారం ఉత్తర్వులు జారీ చేశారు. గత మార్చి నెలలోనే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పంపించిన విధంగా కమిటీ ఏర్పాటు ప్రతిపాదనలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలోని 5గ్రామాలతోపాటు పోచంపల్లి మండలంలోని 10, నల్లగొండ జిల్లా చిట్యాల మండంలోని 10 పంచాయతీలు ఈ మార్కెట్ పరిధిలోకి రానున్నాయి. అందులో బాగంగా పాలకవర్గ ఏర్పాటులోనూ ఆయా మండలాల నుంచి పలువురికి ప్రాతినిథ్యం లభించింది. నూతన కమిటీలో చోటు దక్కింది వీరికే..మార్కెట్ కమిటీ పాలకవర్గం 18మంది సభ్యులతో ఖరారయ్యింది. చైర్మన్గాచౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లికి చెందిన ఉబ్బు వెంకటయ్య నియమితులయ్యా రు. వైస్ చైర్మన్గా లక్కారం గ్రామానికి చెందిన ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లుగా బోయ వెంకటేశం, కరంటోతు శంకర్, ఢిల్లీ చంద్రకళ, చప్పిడి సంజీవరెడ్డి, కాటేపల్లి నవీన్, ఎండి.గౌస్ఖాన్, చిమ్ముల వెంకట్రెడ్డి, పబ్బు శ్రీకాంత్, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేష్, ట్రేడర్ల నుంచి దాచేపల్లి విజయ్, గజ్జెల కృష్ణమూర్తితోపాటు వెలిమినేడు పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, చౌటుప్పల్ మున్సిపల్ ప్రత్యేకాధికారి, చౌటుప్పల్ వ్యవసాయాధికారి సభ్యులుగా వ్యవహరించనున్నారు. చౌటుప్పల్ సింగిల్విండో చైర్మన్కు కమిటీలో చోటు దక్కలేదు. నూతన పాలకవర్గం ఈనెల 13న ప్రమాణస్వీకారం చేయనుంది. చైర్మన్గా ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్గా ఆకుల ఇంద్రసేనారెడ్డి వెలువడిన అధికారిక ప్రకటన 13న ప్రమాణ స్వీకారం -
ఈదురు గాలులతో దెబ్బతిన్న పండ్ల తోటలు
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాలం వర్షానికి పండ్ల తోటల రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. మోత్కూరు పరిధిలోని బుజిలాపురంలో రైతు చింత విజయభాస్కర్రెడ్డికి చెందిన 12 ఎకరాల మామిడి, రెండు ఎకరాల సపోట తోటల్లో భారీగా కాయలు రాలి కొమ్మలు విరిగాయి. దీంతో సుమారు రూ.9 లక్షల నష్టం వాటిల్లిందని రైతు విజయభాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేగ్రామంలో కొల్లు శంకరయ్య, వల్లందాస్ వెంకటయ్య, వరికుప్పల రామచంద్రు, భీమగాని చంద్రయ్యకు చెందిన మామిడి తోటలో కాయలు నేల రాలాయి. పండ్లతోటలు నష్టపోయిన తమకు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
భువనగిరి : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కన్వీనర్ కొల్పుల అమరేందర్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిర ణ్కుమార్, జనగాం పాండు. రచ్చ శ్రీనివాస్రెడ్డి, మాజీ జేడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, గోపాల్, సత్తిరెడ్డి,అబ్బగాని వెంకట్, భిక్షపతి, పాండు, వినోద్, జహంగీర్ పాల్గొన్నారు. -
అమ్ముకోం.. వండుకుంటం
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు.సన్న బియ్యంపై లబ్ధిదారుల సంతృప్తిసద్దుమణిగిన అసమ్మతి మదర్ డెయిరీ చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన డైరెక్టర్లు ప్రభుత్వ బీర్ల ఐలయ్య జోక్యంతో మెత్తపడ్డారు.- 9లోశుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- 8లోసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. సరిగ్గా వండుకుంటే సమస్యే లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. గంజి సరైన సమయంలో సరిగ్గా వార్చకపోతే కొద్దిగా ముద్ద అవుతోందని, అయినా పరవాలేదని సన్న బియ్యం పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త బియ్యం అయినందున కొన్నాళ్లు ఆగి వండుకుంటే మరింత బాగుంటుందని పేర్కొంటున్నారు. అక్కడక్కడ కొంతమేర నూకలు వస్తున్నా, దొడ్డు బియ్యంతో పోల్చితే సన్న బియ్యాన్ని పూర్తిగా వండుకొని తింటామని ప్రజలు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలోనే సన్నబియ్యం సరఫరా అయ్యాయి. 90 నుంచి 60 శాతం మంది లబ్ధిదారులు బియ్యాన్ని ఇప్పటికే తీసుకెళ్లారు. తొలి మూడు, నాలుగు రోజులు లభ్దిదారులు షాపుల వద్ద బారులు తీరారు. సన్న బియ్యం చింట్లు, హెచ్ఎంటీలు రకంగా పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్నవి ఫోర్టిఫైడ్ సన్నబియ్యం అని చెబుతున్నారు. సన్న బియ్యంలో మూడు రకాల బియ్యం ఉన్నాయని, 30శాతం వరకు నూకలు, మెరిగెలు ఉన్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ వండుకుంటున్నారు ఎక్కడా అమ్ముకోవడం లేదు. బియ్యంలో సుమారు 15 నుంచి 20 శాతం వరకు నూకలు ఉన్నట్లు లబ్ధిదారులు తెలుపుతున్నారు. బియ్యం తినడానికి వీలుగా ఉన్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్నం బాగానే ఉంటుందని గంజి వార్చితే ఇంకా బాగుంటుందని మహిళలు చెబుతున్నారు. ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తుండడంతో తాము పిండి పట్టించడానికి ఇతర అవసరాలకు వాడుకున్నామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం వండుకొని తింటున్నట్లు పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సన్న బియ్యం తీసుకున్న ప్రజలు ఆ బియ్యంతో ఏం చేస్తున్నారు.. గతంలో దొడ్డు బియ్యాన్ని ఇడ్లీ, దోశలకు వినియోగించినట్లుగానే వినియోగిస్తున్నారా? వాటిలా అమ్ముకునేందుకు ఆలోచన చేస్తున్నారా? లేదంటే తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే అంశాలపై ‘సాక్షి’ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది. లబ్ధిదారులతో మాట్లాడింది. మొత్తానికి సన్న బియ్యంను తాము తినేందుకే వినియోగిస్తామని ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రజలు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. ఇంకా సాగుతున్న పంపిణీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం రేషన్ షాపులు 2122 ఉండగా, వాటి పరిధిలో 10,08,829 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులపై ప్రతినెలా 1,75,70,855 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1,92,12,855 కిలోల బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయగా, ఇప్పటివరకు 1,44,47,914 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ఇంకా 31.22.941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. పేదలకు మేలు సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో దొడ్డుబియ్యం పంపిణీతో దళారులకు లబ్ధిచేకూరేది. ఆ బియ్యాన్ని తినలేక చాలా మంది అమ్ముకునేవారు. కోళ్లకు, గేదెలకు పెట్టేవారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఈ బియ్యాన్నే తింటారు. – గంపల కిష్టమ్మ, నెమ్మికల్లు, ఆత్మకూర్(ఎస్) మండలం సన్నబియ్యం పర్వాలేదు గతంలో ఇచ్చిన దొడ్డు రకం బియ్యం కంటే ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఇస్తున్న సన్న బియ్యం పర్వాలేదు. అన్నం కొద్దిగా మెత్తగా అవుతోంది. గతంలో ఉన్న బియ్యం తినలేకపోయాం. నాకు నెలకు ఆరు కిలోలు వస్తాయి. సన్నబియ్యం నిరంతరం ఇస్తే బాగుంటుంది. – కిన్నెర రాములమ్మ, తిప్పర్తిన్యూస్రీల్ఫ సరిగ్గా వండితే.. సాఫీగానే భోజనం ఫ కొన్నిరోజులు ఆగి వండుకుంటే మరింత బాగు ఫ గంజి సరిగ్గా వార్చకపోతే కాస్త ముద్దగా అన్నం ఫ కొంతమేర నూకలు.. అయినా బాగున్నాయని ఆనందం -
కారు ఢీకొని మహిళ మృతి
మోటకొండూర్: రోడ్డు దాటుతున్న మహిళను కారుతో ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన మోటకొండూర్ మండలం కొండాపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన గుడేటి నర్సమ్మ(60) బుధవారం రాత్రి గ్రామ పరిధిలో రోడ్డు దాటుతుండగా మోత్కూర్ నుంచి భువనగిరి వైపు కారులో అతివేగంగా వెళ్తున్న ఎర్గుంట సూరజ్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుడేటి నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు గుడేటి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి బంధువుల రాస్తారోకో.. గుడేటి నర్సమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కొండాపురం గ్రామంలోని మోత్కూర్–రాయిగిరి రహదారిపై గురువారం సాయంత్రం మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రమాదానికి కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. రోడ్డుపై వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోవడంతో ఏసీపీ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. -
ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
ఫ డ్రైవర్కు గాయాలు హుజూర్నగర్రూరల్: ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామ ంలో గురువారం జరిగింది. వివరాలు.. పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన బోగాల సతీష్రెడ్డి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. గురువారం గ్రామంలోని తన మామ శంభిరెడ్డికి చెందిన ట్రాక్టర్లో ధాన్యం లోడుతో హుజూర్నగర్లోని రైస్ మిల్లుకు వస్తున్నాడు. కాగా హుజూర్నగర్ మండలం గోపాలపురంలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోకి రాగానే ట్రాక్టర్ ట్రాలీ హైడ్రాలిక్ను చేయి తగలడంతో ట్రాలీ పైకి లేచి బోల్తా పడింది. దీంతో ధాన్యం మొత్తం మిర్యాలగూడ– హుజూర్నగర్ రహదారిపై పడడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ ఘటనలో డ్రైవర్ సతీష్రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. కారు బోల్తా.. నలుగురికి గాయాలుమునగాల: విజయవాడ–హైదరాబాద్ జాతీ య రహదారిపై మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న కారు మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. రైస్ మిల్లులో తనిఖీలు మిర్యాలగూడ: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహాతేజ రైస్ మిల్లులో గురువారం జిల్లా తూనికలు, కొలతల అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించా రు. వేబ్రిడ్జిలో పది టన్నుల ధాన్యంకు రూ.40కిలోల తేడా వస్తుండడం గుర్తించి వేబ్రిడ్జిని సీజ్ చేసి, రూ.1.25లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అట్రాసిటి కేసులో జైలు శిక్ష, జరిమానాఅడ్డగూడూరు: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో 2019లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కాగా.. ఈ కేసులో అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కుక్కునూరు సురేందర్రెడ్డి అలియాస్ విష్ణువర్ధన్రెడ్డి, బొడ్డుగూడేనికి చెందిన తీగల నర్సిరెడ్డికి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ గురువారం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పునిచ్చినట్లు అడ్డగూడూరు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
గౌస్కొండలో మద్యపాన నిషేధం
భూదాన్పోచంపల్లి : మండలంలోని గౌస్కొండలో మద్యపాన నిషేధం అమలుచేస్తూ గ్రామస్తులు గురువారం తీర్మానం చేశారు. బెల్ట్షాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతుండడం, కుటుంబాలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతుండడంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని నిర్ణయించారు. ఈ మేరకు రామాలయం ఆవరణలో గ్రామపెద్దలు, మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించారు. ఇకపై ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తే వారికి రూ.25వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. సమాచారం ఇచ్చిన వారికి ఐదు వేల రూపాయల పారి తోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గొంగిడి వెంకట్రెడ్డి, మర్రి పాండురెడ్డి, నోముల శ్రీనివాస్రెడ్డి, మునుకుంట్ల నరేశ్ మద్ది తశ్వన్రెడ్డి, వంగూరురవి, వంగూరి యాదగిరి, వారాల పాండురెడ్డి, గొంగిడి రామిరెడ్డి, వాకిటి జంగారెడ్డి, నారాయణరెడ్డి, కొయ్యడ గనేశ్, బాలరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్న బీజేపీ
కోదాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాలరాసే కుట్ర చేస్తోందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శ్రీజై బాపు– జై భీమ్– జై సంవిధాన్శ్రీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దాని కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ఆయన ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్కె. బషీర్, వరప్రసాదరెడ్డి, సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, షాబుద్దీన్, కాంపాటి శ్రీను, సైదిబాబు, కట్టెబోయిన శ్రీను, కోల్లా కోటిరెడ్డి పెండెం వెంకటేశ్వర్లు, రాజు, డాక్టర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఫ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య -
‘బడిబాట’ పట్టారు
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేదు. అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు బోధన జరుగుతుంది. కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులతో పాటు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అసక్తితో స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమం నిర్వహించడం మంచి పరిణామం. –సత్యనారాయణ, డీఈఓ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల సంఖ్య ఏటేటా తగ్గుతుంది. తల్లిదండ్రులు ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రభుత్వ బడులు మూతపడే ప్రమాదం ఉంటుంది. వాటిని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్కు ధీటుగా బోధన అందుతుంది. సౌకర్యాలున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. బడులను సందర్శించి పనితీరును పరిశీలించే అవకాశం ఉంది. –బి.ఉపేందర్జీ, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్, కక్కిరేణి, రామన్నపేట మండలంభువనగిరి, రామన్నపేట : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు నడుం బిగించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడానికి వేసవి సెలవులకు ముందే కలెక్టర్, డీఈఓ సూచన మేరకు బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 23వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రైవేట్ వైపు వెళ్లకుండా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు ఏటేటా పడిపోతుంది. జిల్లాలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 100, ప్రాథమిక పాఠశాలలు 200పైనే ఉంటాయి. విద్యార్థులు లేక మూతపడిన ప్రాథమిక పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బతికించుకునేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందస్తు బడిబాటకు శ్రీకారం చుట్టారు. బడులను బతికించుకునేందుకు బడిబాట సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ మొదటి, రెండో వారంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు అధికారికంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈలోగా వేసవి సెలవుల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి అందమైన బ్రోచర్లతో రంగుల ప్రపంచం చూపించి అడ్మిషన్లు చేయించే వారు. బడులు తెరిచిన తరువాత ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించినా స్పందన లభించేది కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయులే ముందస్తు బడిబాట చేపట్టారు. బ్రోచర్లు, ఫ్లెక్సీలను సిద్ధం చేసుకుని తల్లితండ్రులను కలుస్తున్నారు. ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని వివరిస్తున్నారు. ఒంటిపూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ఉదయం 7నుంచి 8గంటల మధ్య.. మరికొన్ని చోట్ల మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత చేపడుతున్నారు. ఫ ముందస్తుగా బడిబాట కార్యక్రమం ఫ కలెక్టర్, డీఈఓ సూచన మేరకు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఫ జూన్ మొదటి వారంలో మరోదఫా.. -
రేషన్ బియ్యం పట్టివేత
గట్టుప్పల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ గుత్తా వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలంం డాకు తండాకు చెందిన దశరథ గట్టుప్పల్ మండలంలో రేషన్ లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి అంతంపేటలోని ఓ ఇంట్లో భద్రపరిచాడు. ఈ బియ్యాన్ని గురువారం బొలేరో వాహనంలో గట్టుప్పల్ మీదుగా సంస్థాన్ నారాయణపురంలోని కోళ్లఫాంకు తరలిస్తుండగా.. విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు గట్టుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సైదులు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్లో భద్రపరిచారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచిట్యాల: చిట్యాల పట్టణంలోని గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. నార్కట్పల్లికి చెందిన బాశెట్టి శ్రీనివాస్ అలియాస్ వెంకన్న(58) చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో గల రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం నార్కట్పల్లి నుంచి బైక్పై వెళ్తుండగా.. చిట్యాల పట్టణ సమీపంలోని బాలనర్సింహస్వామి ఆలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బీబీనగర్లో రాకెట్ సామగ్రి తయారీబీబీనగర్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) త్వరలో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్లో వినియోగించే ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్ల తయారీ బీబీనగర్ మండలంలో జరిగింది. మండల పరిధిలోని జమీలాపేట గ్రామ శివారులో గల వీఎన్డీ సెల్ ప్లాస్ట్ పరిశ్రమలో 365 ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్లను తయారు చేశారు. రాకెట్లో వినియోగించనున్న వీటిని పరిశ్రమ యాజమాన్యం ఇస్రో సంస్థతో ఒప్పందం చేసుకొని తయారు చేసినట్లు సమాచారం. ప్యాడ్ల తయారీ పూర్తికావడంతో వాటిని పరిశ్రమ నుంచి తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్కు కంటైనర్ల ద్వారా తరలించారు. -
డ్రిప్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నడిగూడెం: రాయితీపై తీసుకున్న సూక్ష్మ సేద్యపు పరికరాలు(డ్రిప్, స్ప్రింక్లర్లు) రెండోసారి తీసుకోవాలంటే ఏడేళ్లు ఆగాలని, అంతవరకు వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్కుమార్ అన్నారు. ప్రస్తుత వేసవిలో ఉద్యానవన పంటల సాగుకు నీరు చాలా అవసరమని, ఇలాంటి సమయంలో డ్రిప్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. ఫ ఒకసారి పొలంలో అమర్చుకున్న డ్రిప్ పరికరాలను రైతులు జాగ్రత్తగా వాడుకోవాలి. వాటి పనితీరు, చిన్నపాటి మరమ్మతుల గురించి అవగాహన కలిగి ఉండాలి. డ్రిప్ సిస్టమ్ హెడ్ కంట్రోల్ యూనిట్లో వివిధ రకాల ఫిల్టర్లు నీటిలోని ఇసుక, ఆల్గే(నాచు) చెత్త, మలినాలు వేరు చేసేందుకు అమర్చబడి ఉంటాయి. అవి మూసుకుపోకుండా ఫిల్టర్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. అందులో ఇసుక ఫిల్టర్ను బ్యాక్వాష్ పద్ధతిలో శుభ్రం చేసుకోవాలంటే అందులో ఉండే నాలుగు వాల్వ్ల గురించి తెలుసుకోవాలి. సిస్టమ్ నడుస్తున్నప్పుడు 2, 4 నంబర్ వాల్వులు తెరిచి 1, 3 నంబర్ వాల్వులు పూర్తిగా మూసివేసి నీటిని పంపండం ద్వారా ఇసుక బెడ్ శుభ్రపడతాయి. రెండో పద్ధతిలో ఇసుక బెడ్లోని ఖాళీలు మూసుకుపోయినప్పుడు ముందుగా 1, 3 నంబర్ వాల్వులు తెరిచి 2, 4 నంబర్ వాల్వులు మూసేసి నీటిని నింపడం ద్వారా అందులో మలినాలు 1వ నంబర్ వాల్వ్ ద్వారా బయటకు పోయి ఇసుక బెడ్ శుభ్రమవుతుంది. ఈ పద్ధతిని శాండ్ ఫిల్టర్ అమర్చిన రెండు ఫ్రెషర్ గేజ్లను మధ్య తేడా 0.5 కిలో లేదా 0.5.సెం.మీ కన్నా ఎక్కువ పెరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్ ఇసుక ఉండాల్సిన మట్టానికి తక్కువైనప్పుడు తిరిగి మట్టానికి ఇసుక నింపుకోవాలి. బ్యాక్వాష్ చేసే ముందు శ్యాండ్ ఫిల్టర్ మూత తెరిచి చేతులతో ఇసుక బెడ్ను కలియబెట్టాలి. ఇలా చేయడం వలన ఫిల్టర్ను తొందరగా శుభ్రం చేసుకోవచ్చు. స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం ఇలా..సిస్టం నడుస్తుండగా స్క్రీన్ ఫిల్టర్ను శుభ్రం చేసుకోవాలంటే ఫిల్టర్ కింది భాగంలో అమర్చిన డ్రైన్ వాల్వ్ను తెరిస్తే స్క్రీన్ మెష్పై ఉన్న మలినాలు ఈ వాల్వ్ ద్వారా బయటకుపోతాయి. చాలాసార్లు మలినాలు ఫిల్టర్ మెష్పై పేరుకుపోయి మెష్పైనే అంటుకొని ఉంటాయి. అలాంటప్పుడు పంప్ ఆఫ్ చేసి ఫిల్టర్ మూతను తెరిచి ఫిల్టర్లోని మెష్ను బయటకు తీసి పేరుకపోయిన మలినాలను సున్నితమైన ప్లాస్టిక్ బ్రష్ లేదా చేతివేళ్లతో శుభ్రం చేయాలి. (మెష్ చిరిగిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి) స్క్రీన్ ఫిల్టర్లో మెష్ లేకుండా నడపకూడదు. పేడ, ఇతర సేంద్రియ ఎరువులను డ్రిప్ ద్వారా పంపకూడదు. దీని వల్ల ఫిల్టర్లు, డ్రిప్పర్లు మూసుకపోతాయి. ఇక పీవీసీ పైపులు, లేటరల్ పైపులు శుభ్రం చేసుకొనేందుకు ఎండ్ క్యాప్ లేదా ఎండ్ ప్లగ్ ప్రతివారం లేదా కనీసం 15 రోజులకోసారి తెరచి నీటిని పూర్తి ప్రెషర్తో లోపలికి పంపితే ఎండ్ ప్లగ్ చివర్ల ద్వారా మలినాలు బయటకు కొట్టుకపోతాయి. మూడు నెలలకొకసారి లేదంటే కనీసం ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా యాసిడ్ ట్రీట్మెంట్ ద్వారా డ్రిప్ యూనిట్ను శుభ్రం చేసుకోవాలి. యాసిడ్ ట్రీట్మెంట్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
‘పోషణ పక్షం’ వాల్పోస్టర్ ఆవిష్కరణ
భువనగిరిటౌన్ : జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం –25’ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఏరోజుకారోజు డాష్ బోర్డు యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. నేటి నుంచి (శుక్రవారం) ఈనెల 22వ తేదీ వరకు పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, జిలా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఎంహెచ్ఓ మనోహర్, డీపీఓ తదితరులు పాల్గొన్నారు. -
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
రామన్నపేట: భర్త వేధింపులు భరించలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణానికి చెందిన బొబ్బిలి మల్లయ్య కుమార్తె కావ్య(25)ను 2018లో రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామానికి చెందిన జినుకల ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఆరేళ్ల లోపు వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వారం క్రితం అదనపు కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన కావ్యపై భర్త ఆంజనేయులు చేయి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మానసిన వేదనకు గురైన కావ్య గురువారం ఉదయం తమ వ్యవసాయబావి వద్ద పశువుల కొట్టంలో ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన ఆమె భర్త ఆంజనేయులు వలిగొండ సమీపంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడికి రామన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. మల్లయ్య తెలిపారు. ఫ గడ్డి మందు తాగి భర్త కూడా ఆత్మహత్యాయత్నం -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్
చివ్వెంల(సూర్యాపేట): సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన పసుపులేటి రాజు, అనంతపురం జిల్లాలోని గుంతకల్లుకు చెందిన కొమ్మూరి ఆదినారాయణ, హైదరాబాద్లోని హయత్నగర్కు చెందిన కావడి సామేల్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సురేష్ ప్రధాన్ ముఠాగా ఏర్పడి సెల్ఫోన్లు చోరీ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు కాజేసి జల్సాలు చేస్తున్నారు. గురువారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులోని ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. నలుగురు కలిసి రెండు కార్లలో వస్తూ పట్టుబడ్డారు. వీరిలో పసులేటి రాజు పరారైనట్లు సీఐ తెలిపారు. మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ.3.50 లక్షలు, రెండు కార్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడైన పసుపులేటి రాజు మిగతా ముగ్గురికి రూ.లక్ష, రూ.50 వేలు. రూ.70 వేలు చొప్పున ఇస్తూ కార్లలో తిప్పుతూ సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన బొబ్బ వెంకట్రెడ్డి సెల్ఫోన్ అపహరించి రూ.99వేలు, శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి కల్లెట్ల పల్లివీరయ్య సెల్ఫోన్ అపహరించి రూ.54వేలు, తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన గొల్లపల్లి రమేష్ ఫోన్ అపహరించి రూ.80వేలు కాజేశారు. అంతేకాకుండా సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఇద్దరు వ్యక్తుల నుంచి ఫోన్లు అపహరించి రూ.2.45లక్షలు కాజేసి అందులో రూ.1.30 లక్షలు ఖర్చు చేశారని, అదేవిధంగా దురాజ్పల్లి జాతరలో మూడు సెల్ఫోన్లు అపహరించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం
కనగల్: బైక్లపై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన కనగల్ మండలం బాబాసాహెబ్గూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సింగం కొండల్ ట్రాక్టర్లో బుధవారం వడ్ల లోడుతో కనగల్ మండలం శేరిలింగోటంలోని ఐకేపీ కేంద్రానికి వస్తుండగా.. బాబాసాహెబ్గూడెం గ్రామ స్టేజీ వద్ద టైరు పంక్చర్ కావడంతో ట్రాక్టర్ ట్రాలీని రోడ్డుపై నిలిపి ఉంచాడు. బుధవారం రాత్రి అనుముల మండలం శ్రీనాథపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బంటువారిగూడేనికి చెందిన చింతకాయల కిరణ్(33), గుర్రంపోడు మండలం పల్లిపహాడ్ గ్రామానికి చెందిన జనికల అఖిల్ కలిసి బైక్పై నల్లగొండ వైపు వస్తూ బాబాసాహెబ్గూడెం గ్రామ స్టేజీ వద్ద ట్రాక్టర్ను గమనించకుండా దానిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయడ్డారు. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కిరణ్ మృతిచెందాడు. అఖిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడు కిరణ్కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కిరణ్ వరికోత మిషన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ట్రాక్టర్ ట్రాలీని పోలీసులు రోడ్డు పక్కకు తీయిస్తుండగా.. మిర్యాలగూడలోని చెన్త్నె షాపింగ్ మాల్లో పనిచేస్తున్న గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన బల్గూరి శేఖర్(35) స్వగ్రామానికి బైక్పై వెళ్తూ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కిరణ్ తమ్ముడు సంతోష్, శేఖర్ భార్య కవిత ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ ట్రాలీని రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన సింగం కొండల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఫ ౖబైక్పై వెళ్తూ ఢీకొని ఒకరు.. ఫ పోలీసులు ట్రాక్టర్ను పక్కకు తీస్తుండగా మరో యువకుడు .. -
బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి –జటంగి నర్సమ్మ, కేతేపల్లి రూ.1,500 ఆదా అయ్యాయి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బాగానే ఉన్నాయి. మా ఏరియా వారందరూ సన్నబియ్యం వండుకుని తింటున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం వల్ల మాకు బియ్యం కొనుగోలు చేయడం తప్పింది.దాదాపు రూ.1500 వరకు ఆదా అయ్యాయి. – రమ్య, హుజూర్నగర్ -
అకాల వర్షం.. రైతుకు నష్టం
ఉదయం ఎండ, సాయంత్రం వర్షం భువనగిరిటౌన్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు మండలాల్లో మోస్తరు నుంచి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదరుగాలులు వీచాయి. సాయంత్రం 4 గంటల వరకు ఎండ కాయగా ఆ తరువాత మబ్బులు పట్టి వాతావరణం ఒక్కసారిగా చల్లడింది. సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు. గుండాల : జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలులకు చేతికొచ్చి మామిడి నేలరాలింది. కోత దశలో ఉన్న వరి నేలవాలింది. కరెంట్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుండాల మండల కేంద్రంలో బండపై ఆరబెట్టిన వడ్లు పక్కనే ఉన్న రామసముద్రం చెరువులోకి కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూర్(ఎం) : మండలంలో గంటసేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి రహీంఖాన్పేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అదే విధంగా కరెంట్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అడ్డూగూడూరు : ఈదురుగాలులకు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలయి. వరి చేలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఆలేరురూరల్ : మండలంలోని మంతపురికి చెందిన పల్లా రాజిరెడ్డి తన వ్యవసాయ బావి వద్ద గేదెను చెట్టుకు కట్టేయగా పిడుగుపాటుకు మృతి చెందింది. గేదె విలువ రూ.50వేలు ఉంటుందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని రాజిరెడ్డి కోరాడు. మోత్కూరు : మండలంలోని పలు గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పనకబండకు చెందిన నల్లపోగుల సతీష్ రెండు ట్రాక్టర్ల ధాన్యం ఆరబోయగా అందులో మూడు క్వింటాళ్ల వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఫ నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి చేలు ఫ విద్యుత్ సరఫరాకు అంతరాయం మండలం వర్షం ఉష్ణోగ్రత (మి.మీ) (డిగ్రీలు) అడ్డగూడూరు 11.8 40.9 ఆత్మకూర్(ఎం) 18.8 40.7 గుండాల 7.0 40.5మోత్కురు 44.0 40.4మోటకొండూరు 4.5 40.4రామన్నపేట 7.8 40.3నారాయణపురం 3.8 40.8ఆలేరు 31.8 40.1భువనగిరి 6.4 39.0వలిగొండ 15.5 39.0 -
మిర్యాలగూడ పట్టణంలో కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్లో గురువారం తెల్లవారుజామున 4గంటల నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర రాజు కార్డన్ సెర్చ్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చేపట్టిన కార్డన్ సెర్చ్లో భాగంగా పలువురు అనుమానిత వ్యక్తులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా 56 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. వీటిలో నంబర్ ప్లేట్ లేని 12 ద్విచక్ర వాహనాలు ఉండగా నాలుగు ఆటోలకు సరైన ధ్రువవపత్రాలు లేనట్లు గుర్తించామన్నారు. పలు వాహనాల నంబర్లు ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించామని, ఈ వాహనాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఏదైనా నేరాలకు పాల్పడ్డారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రోడ్లపై అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్లో సీఐలు పీఎన్డీ ప్రసాద్, సోమనర్సయ్య, మోతీరాంతో పాటు 12మంది ఎస్ఐలు, 75మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఫ సరైన పత్రాలు లేని 60 వాహనాలు సీజ్ ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర రాజు -
సద్దుమణిగిన ‘మదర్ డెయిరీ’ అసమ్మతి
సాక్షి,యాదాద్రి: మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన సొంత పార్టీకి చెందిన డైరెక్టర్లతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమావేశం కావడంతో వారు కాస్త మెత్తబడ్డారు. చైర్మన్ను మార్చాలన్న 10 మంది కాంగ్రెస్ డైరెక్టర్లకు, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన నలుగురు డైరెక్టర్లు కూడామద్దతు ప్రకటించారు. నేడో రేపో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం రాత్రి యాదగిరిగుట్టలో మదర్ డెయిరీ చైర్మన్, డైరెక్టర్లతో ప్రభుత్వ విప్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరువర్గాలు వారి వాదనలు గట్టిగా వినిపించారు. అనంతరం అవిశ్వాసం ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వ విప్ డైరెక్టర్లను కోరగా.. వారు కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫ చైర్మన్గా గెలిచిన నాటి నుంచి మధుసూదన్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ సమావేశంలో డైరెక్టర్లు ఆరోపించారు. ప్రైవేట్ పాల కొనుగోలులో చైర్మన్ కమీషన్లు తీసుకుంటున్నాడని, ఉద్యోగులను ఏకపక్షంగా బదిలీ చేశారని, పాల బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నాడని డైరెక్టర్లు వివరించారు. తమలో ఒకరికి అవకాశం ఇస్తే డెయిరీని లాభాల బాట పట్టిస్తామని, అందుకే అవిశ్వాసం పెట్టామని పేర్కొన్నారు. ఫ అయితే మాజీ చైర్మన్ల డైరెక్షన్లో డైరెక్టర్లంతా కలిసి తనపై కుట్ర చేస్తున్నారని చైర్మన్ మధుసూదన్రెడ్డి ఆరోపించారు. గత పాలకవర్గంలో కొందరు డైరెక్టర్లు చిల్లింగ్ సెంటర్లలో అక్రమాలకు పాల్పడగా.. వాటిని తాను చైర్మన్ అయిన తర్వాత బట్టబయలు చేయడం కొందరికి నచ్చడంలేదని పేర్కొన్నారు. డెయిరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజు లక్ష లీటర్ల పాల అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రైవేట్గా రోజు 40వేల లీటర్ల పాలు కొనక తప్పడంలేదని, డైరక్టర్లనే పాలు సరఫరా చేయాలని కోరినా ఎవరూ స్పందించడంలేదని వివరించారు. ప్రతినెలా జీతాలు, పాత బాకీలకు వడ్డీలు, నిర్వహణ ఖర్చులకే రూ.3 కోట్లు అవసరమవుతాయని చైర్మన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు.. మదర్ డెయిరీ పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు కావొస్తుంది. మొత్తం 15 మంది డైరెక్టర్లలో 11 మంది కాంగ్రెస్, నలుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చైర్మన్ గాక అధికార పార్టీకి చెందిన మిగతా పది మంది అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వీరికి నలుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇస్తామన్నారు. దీంతో అవిశ్వాసం తప్పదన్న చర్చ ప్రారంభమైంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను రంగంలోకి దింపగా.. తాత్కాలికంగా అవిశ్వాసంపై వెనక్కి తగ్గినట్లు ఓ డైరెక్టర్ సాక్షితో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మదర్ డెయిరీ ఎన్నికల జరిగిన తర్వాత మరోసారి అవిశ్వాసంపై ఆలోచన చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫ చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు డైరెక్టర్ల ప్రయత్నం ఫ డైరెక్టర్లు, చైర్మన్తో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఐలయ్య ఫ ఆయన నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గిన డైరెక్టర్లు -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
మోటకొండూర్, ఆత్మకూర్(ఎం) : మోటకొండూరు మండలం కదిరేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జెడ్పీ సీఈఓ శోభారాణి పరిశీలించారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. పోషణ అభియాన్ హ్యాండ్ వాష్ డేలో పాల్గొన్నారు. అదే విధంగా సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, ఎంపీఓ చంద్రశేఖర్, డాక్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగా హన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములునాయక్, సూపరింటెండెంట్ లోకేశ్వర్రెడ్డి, ఎంపీఓ పద్మావతి పాల్గొన్నారు. నృసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజా మున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అ నంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సా యంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి ఎస్ఏ–2 భువనగిరి : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఎస్ఏ–2 వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 484 ఉండగా వాటిలో 14,195 మంది విద్యార్థులు ఉన్నారు. ఉద యం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 9నుంచి పరీక్షలు మొదలయ్యాయి. -
ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్నప్రసాద భవనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దిగువన నూతనంగా నిర్మిస్తున్న అన్నప్రసాద భవనం త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్నప్రసాద భవనంలో పనులన్నీ పూర్తయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. వేగేశ్న సంస్థకు సంబంధించిన నిర్వాహకులు అన్నప్రసాద భవన నిర్మాణానికి సుమారు రూ.11కోట్ల వరకు ఖర్చు చేయగా, మిగిలిన పనుల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఖర్చు చేశారు. భక్తులు కూర్చొని తినే విధంగా బెంచీల ఏర్పాటు, ఇతర సామగ్రి బిగింపు పనులను సైతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు భవనం చుట్టుపక్కల గ్రీనరీ ఏర్పాటుతో పాటు మొక్కలను నాటుతున్నారు. అన్నప్రసాదం స్వీకరించేందుకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. -
రైతుబజార్లో కూరగాయలు ఫుల్
భువనగిరి టౌన్: పట్టణంలోని రైతుబజార్ అన్ని రకాల కూరగాయలతో కళకళలాడుతోంది. స్థానిక రైతులు, వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా హైదరాబాద్ నుంచి ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, చామగడ్డ, క్యాప్సికం, చిక్కుడు కాయ దిగుమతులు 15 రోజులుగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ‘రైతుబజార్లో కూరగాయల కొరత’ శీర్షికతో గత నెల 31న సాక్షి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రైతుబజార్ను సందర్శించి సమస్య తెలుసుకున్నారు. బుధవారం సుమారు 25 రకాల కూరగాయలను అందుబాటులో ఉంచారు. ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, చామగడ్డ, క్యాప్సికం చిక్కుడు కాయలను హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్ నుంచి దిగుమతి చేయించారు. ఇకనుంచి సమస్య ఉండదని తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని విజయ పైపుల కంపెనీ సమీపంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం గ్రామ పరిధిలోని సంగం హోటల్ ప్రాంతంలో గుర్తుతెలియని యాచకుడు గత ఐదు రోజులుగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బుధవారం అదే వ్యక్తి విజయ కంపెనీ సమీపంలో మృతిచెందడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, లోపల ఎరుపు రంగు టీషర్ట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలిభువనగిరిటౌన్ : దళిత బహుజన పార్టీ భువనగిరి నియోజకవర్గ నాయకుడు, బీబీనగర్ మండలం వెంకిర్యాల వాసి బీరం సతీష్ ఇంటిపై మూకుమ్మడి దాడి చేసి గాయపర్చిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వీఎల్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరిలోని సతీష్ ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, భువనగిరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు బాధితుడితో కలిసి వెళ్లి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వాకబు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ఈ కేసులో బీబీనగర్ సీఐ ప్రభాకర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే త్వరలో డీజీపీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తామన్నారు. ఆయన వెంట బాధితుడు బీరం సతీష్ అతని కుటుంబ సభ్యులు, వెంకిర్యాల గ్రామ దళిత నాయకులు ఉన్నారు ఆడబిడ్డ పుడితే అదృష్టంగా భావించాలిఅనంతగిరి: ఆడబిడ్డ పుట్టిన ప్రతి కుటుంబం అదృష్టంగా భావించాలని తహసీల్దార్ కె. హిమబిందు అన్నారు. అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో ఆడబిడ్డ పుడితే గ్రామానికి చెందిన కొందరు యువకులు ‘మన ఊరు మహాలక్ష్మి’ పేరుతో ఆ ఆడబిడ్డ పేరుపై పోస్టాఫీస్లో కొంత నగదు జమచేయడం అభినందనీయమని తహసీల్దార్ అన్నారు. బుధవారం గోండ్రియాల గ్రామానికి చెందిన గౌరా రాపు సునీత, కోటేశ్ దంపతుల కుమార్తె లోక్ష్య పేరుతో పోస్టాఫీస్లో రూ.18,464 నగదు జమ చేసి దానికి సంబంధించిన పాస్బుక్ను తహసీల్దార్ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో మన ఊరు మహాలక్ష్మి వలంటీర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వేములపల్లి ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదువేములపల్లి: పాత కక్షలు మనస్సులో పెట్టుకొని భీమనపల్లి గ్రామంలో తన 4గుంటల భూమిని కబ్జా చేయిస్తూ తనపై అక్రమ కేసులు బనాయిస్తున్న వేములపల్లి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నామిరెడ్డి శ్రీధర్రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. భీమనపల్లిలో సర్వే నం 29లో గల తనకు 16గుంటల భూమి ఉండగా బెదిరించి తన నాన్న సంతకాలను తీసుకొని కొంత భూమిని ఆక్రమించారని, ఇంకా 4గుంటల భూమి రెండు వైపులా రోడ్డు ఉండగా ఇటీవల ఎస్ఐ అండతో బొంత వెంకటయ్య, బొంత రాము, బొంత శ్రీకాంత్, కుంచం నాగయ్య, అభిమల్ల జానకిరాములు, అభిమల్ల అశోక్, గడ్డం మారయ్య, మర్రి సుదర్శన్, కొణతం కృష్ణయ్య, కొణతం రాంబాబు, కొండ్ర సాలయ్య తదితరులు తమ భూమిలో ఉన్న టేకు, సుబాబుల్ చెట్లను నరికించారని ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ స్పందించకుండా ఆ భూమిలో రూమ్ ఏర్పాటు చేయండని సలహా ఇచ్చారని అన్నారు. తనను బెదిరించిన వారితో పాటు వారికి సహకరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. -
తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలదే
బీబీనగర్: తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించకుండా వారిని చూసుకునే బాధ్యత పిల్లలదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మించిన వయో వృద్ధుల ఆశ్రయ భవనాన్ని బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. వృద్ధుల కోసం ఉన్నటువంటి చట్టాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచిందని, అలాగే ప్రతిఒక్కరికి సీఎం రీలీఫ్ ఫండ్కు బదులుగా ఆరోగ్య బీమాను కల్పించేలా ఆలోచిస్తుందని అన్నారు. దీంతో తల్లిదండ్రులు భారం అనుకునే వారికి భయం ఉండదని అన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులను ఎలా ఆదుకుకోవాలో అన్న అంశంపై శాసనసభ, శాసనమండలిలో చాలా సీరియస్గా చర్చ జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 40లక్షల మంది వయో వృద్ధులకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని, అన్నివర్గాల వారికి మేలు జరిగే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. వయో వృద్ధులు మానసికంగా బలంగా ఉండాలని అన్నారు. వృద్ధుల కోసం పార్క్ ఏర్పాటుకు కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వయో వృద్ధుల భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కాసుల సత్యనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, కోశాధికారి సోమయ్య, ఉపాధ్యక్షులు ఆగమయ్యగౌడ్, ఎర్ర మనోహర్ తదితరులు పాల్గొన్నారు, ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
ఏటీఎంను గ్యాస్కట్టర్తో కట్ చేసి నగదు చోరీ
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్తో కట్ చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. అంకిరెడ్డిగూడెం ర్రామ స్టేజీ వద్ద దివీస్ పరిశ్రమ ఉండడంతో నల్లగొండ ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. ఆ ఏటీఎంలో డబ్బులు నిల్వ చేయడం, దాని ఆపరేటింగ్ అంతా నల్లగొండలోని ఎస్బీఐ బ్రాంచ్ చూసుకుంటుంది. ఏటీఎం మానిటరింగ్ను ముంబైలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం వారు చూస్తున్నారు. ఈ ఏటీఎంలో మంగళవారం సాయంత్రం సిబ్బంది నగదును నింపి వెళ్లారు. అయితే, బుధవారం తెల్లవారుజాము 5గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ఏటీఎం నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడాన్ని ముంబైలోని ప్రధాన కార్యాలయం వారు గుర్తించి.. చౌటుప్పల్ పోలీసులకు రాత్రి 7గంటలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఏటీఎం షెట్టర్ మూసివేసి ఉంది. షెట్టర్ను పైఎత్తి చూడగా గ్యాస్ కట్టర్తో కట్ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అందులో నగదు చోరీకి గురైందని నిర్ధారించుకొని నల్లగొండ ఎస్బీఐ బ్రాంచ్కి, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రూ.20లక్షలకు పైగా చోరీ? ఆ ఏటీఎం నుంచి వినియోగదారుల చివరి లావాదేవీ బుధవారం తెల్లవారు జామున 4:25 గంటలకు జరిగింది. తర్వాత దుండగులు ఏటీఎంనుంచి నగదు ఎత్తుకెళ్లడంతో.. సుమారు రూ.20 లక్షలకు పైగా నగదు చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకు అధికారులు ఎంత నగదు పోయిందన్న విషయాన్ని నిర్ధారించలేదు. ఏటీఎంను పరిశీలించిన భువనగిరి డీసీపీ చోరీ జరిగిన విషయం తెలుసుకున్న భువనగిరి డీసీపీ అక్షాంశ్యాదవ్, రాచకొండ క్రైం డీసీపీ అరవింద్ బాబు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడి, సీఐ మన్మథకుమార్ ఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల సీపీ కెమెరాలను పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదే ఏటీఎంలో మూడేళ్ల క్రితం చోరీకి యత్నం గతంలో 2022లో ఇదే ఏటీఎంలో చోరీ చేయడానికి గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. అప్పుడు కూడా ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పట్లో ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు దుండగులను గుర్తించలేదు. -
రూ.4లక్షల యూనిట్లకు డిమాండ్!
సాక్షి, యాదాద్రి : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాటికి 25,262 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు మరో ఐదు రోజులు ఉన్నందున 30 వేలు మించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా దరఖాస్తుల్లో అధికంగా రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు విలువ చేసే యూనిట్లకు సంబంధించినవే ఉండడం గమనార్హం. తక్కువ విలువ కలిగిన యూనిట్లకు వంద శాతం సబ్సిడీ ఉన్నప్పటికీ యువత పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఎస్సీ కార్పొరేషన్కు వచ్చిన దరఖాస్తులు ఇలా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ యూనిట్ల కోసం మొత్తం 6,571 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.లక్ష లోపు విలువ చేసే యూనిట్లు 1,007 ఉన్నాయి. వీటికి వంద శాతం సబ్సిడీ ఉన్నప్పటికీ కేవలం 34 దరఖాస్తులే వచ్చాయి. ఆలేరు, భూదాన్పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఒక్క దరఖాస్తు రాలేదు. అలాగే ఆలేరు, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం, మోత్కూరు, సంస్థాన్నారాయణపురం, తుర్కపల్లి మండలాల్లోనూ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఇక రూ.2లక్షల వరకు విలువ చేసే యూనిట్లు 781 ఉండగా 411 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.3 లక్షలకు సంబంధించి జిల్లాకు 496 యూనిట్లు కేటాయించగా 2,142, రూ.3నుంచి రూ.4 లక్షల వరకు 411 యూనిట్లు ఉండగా 2,967 దరఖాస్తులు వచ్చాయి. ఇక బ్యాంకు లింకేజీతో సంబంధం లేని మైనర్ ఇరిగేషన్లో బోర్లు, సోలార్, విద్యుత్ మోటార్ కనెక్షన్కు సంబంధించి 103 యూనిట్లకు గాను కేవలం ఐదు దరఖాస్తులే వచ్చాయి. ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లలోనూ ఎక్కువ మొత్తం విలువ చేసే యూనిట్లకే అధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసానికి భారీ స్పందన ఫ 25,262 మంది దరఖాస్తు ఫ ఎక్కువ విలువ చేసే యూనిట్లపైనే ఆసక్తి ఫ రూ.లక్ష లోపు యూనిట్లకు అంతంతమాత్రంగానే స్పందన దళితబంధు లబ్ధిదారులకు నో చాన్స్ దళితబంధు లబ్ధిదారులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుఅవకాశం లేదు. ప్రభుత్వం ద్వారా ఒకసారి లబ్ధిపొందిన తర్వాత మళ్లీ ఐదేళ్ల వరకు అనర్హులు. చాలా మంది దళితబంధు లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోగా రాజీవ్ యువ వికాసం పథకం సైట్లో అప్లోడ్ కావడం లేదు. కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు ఎస్సీ 6,571ఎస్టీ 1712 బీసీ 15,466ఈబీసీ 451మైనార్టీ 1,022క్రిస్టియన్ మైనార్టీ 40మొత్తం 25,262 హార్డు కాపీలు అందజేయాలి రూ.లక్షలోపు విలువ చేసే యూనిట్లకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నప్పటికీ దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయి. పెద్ద మొత్తంలో విలువ చేసే యూనిట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసిన హార్డ్ కాపీలను అందజేయడం లేదు. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు హార్డు కాపీలు తప్పనిసరిగా అప్పగించాలి. దరఖాస్తు గడువు ఈనెలో 14వరకు ఉంది. యువత సద్వినియోగం చేసుకోవాలి. –జినుకల శ్యాంసుందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
హస్తకళలను ప్రోత్సహించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులు హస్తకళా విక్రయశాలలో వస్తువులను కొనుగోలు చేసి హస్తకళలను ప్రోత్సహించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలోని బస్టాండ్ చెంత తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హస్తకళా విక్రయశాలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. వివిధ హస్తకళలకు సంబంధించిన వస్తువులు గోల్కొండ హస్తకళల విక్రయశాలలో లభిస్తాయని పేర్కొన్నారు. హస్తకళలను ప్రోత్సహించడానికి ఈ విక్రయశాలను ఏర్పాటు చేసేందుకు ఆలయ ఈఓ భాస్కర్రావు కృషిచేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి హస్తకళలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలను తీసుకువచ్చి ఇందులో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హస్తకళలను, నైపుణ్యాన్ని పెంపొందించాలని చూస్తోందన్నారు. పెంబర్తి నుంచి హస్త కళాకారులు, బంజారా కళాకారులు వచ్చి డెమోలను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. సుమారు 45రోజుల్లోనే యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో హస్తకళల విక్రయశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విక్రయశాలతో పలువురికి జీవనోపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళాకారులు తాము రూపొందించిన మోడల్స్ను ఈ విక్రయశాలకు తీసుకొచ్చారన్నారు. రాబోయే రోజుల్లో హస్తకళల విక్రయశాలలను మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాస్కర్రావు, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఓఎస్డీ బాషా, మసూద్ అలీ, వేణుగోపాల్, గాయత్రి, సుల్తానా, శ్రీపాణి, మహేందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఫ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
ఉపాధిహామీ కూలీల చెంతకు బడిబాట
ఆత్మకూరు(ఎం) : బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం పోతిరెడ్డిపల్లికి వెళ్లారు. చాలామంది ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో.. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు.. ఉపాధిహామీ పనులు నిర్వహించే ప్రదేశానికి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయని, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని.. ఈ అవకాశాలను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఒత్తిడి లేని విద్య ఉంటుందని, మీ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయులు రవి, వరప్రసాద్, శ్రీనువాసాచారి, అనురాధ, వెంకటేశం పాల్గొన్నారు. -
దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపండి
రాజాపేట, యాదగిరిగుట్ట రూరల్ : వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని, కార్యాలయాలకు తిప్పించుకోవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం రాజాపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. ధరణితో పాటు రేషన్ కార్డులు ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులను జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పించి లబ్ధి పొందేలా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి ఉన్నారు. అదే విధంగా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ధరణిలో తప్పుడు రిపోర్టులకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష
సూర్యాపేటటౌన్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఏడుగురికి రూ.1500 జరిమానాతో పాటు ఒకరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ బుధవారం సూర్యాపేట జిల్లా సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బీవీ రమణ తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలి పారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏడుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బుధవారం కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి రూ.1500 జరిమానాతో పాటు ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తఅడవిదేవులపల్లి: భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో జరిగింది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల బాలసైదులుకు అదే గ్రామానికి చెందిన గువ్వ ల శివయ్య కుమార్తె నరసకుమారీ(30)తో 14ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్ల లున్నారు. నరసకుమారి మరో వ్యక్తితో వివా హేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బాలసైదులు తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలసైదులు కత్తితో నరసకుమారిని పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన బైక్పై పరారయ్యాడు. బుధవారం తెల్ల వారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పి. నాగదుర్గ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి శివ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం శాలిగౌరారం: బంధువుల ఇంటి వద్ద శుభకార్యానికి హాజరై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన బండి యాదగిరి(55) మంగళవారం కట్టంగూర్ మండలం నారెగూడెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన ఎల్లమ్మ పండుగకు బైక్పై వెళ్లాడు. తిరిగి రాత్రి తన బంధువులైన బూడిద భిక్షం, బూడిద యాదయ్యను యాదగిరి బైక్పై ఎక్కించుకుని వారి ఊరైన శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లిలో దింపేందుకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామానికి రాగానే.. బూడిద భిక్షం, బూడిద యాదయ్యను తీసుకెళ్లేందుకు మరో బైక్ రాగా వారు దానిపై ఎక్కి వెళ్లారు. యాదగిరి ఎన్జి కొత్తపల్లి మీదుగా లక్ష్మిదేవికాల్వ గ్రామానికి వెళ్తుండగా.. ఎన్జి కొత్తపల్లి గ్రామ శివారులో గజ్జి అంజయ్య తన పొలంలో వరి పంట కోస్తుండగా ధాన్యం తీసుకెళ్లడానికి రోడ్డు వెంట ట్రాక్టర్ను నిలిపి పొలంలోకి వెళ్లాడు. అదే రోడ్డు వెంట వేగంగా వచ్చిన బండి యాదగిరి నిలిచి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదగిరికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, బుధవారం మృతుడి పెద్ద అల్లుడు చిలుకూరి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎయిమ్స్లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్లో రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. బుధవారం ఎయిమ్స్ వైద్య కళాశాల రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ ఏ డిసౌజా వర్చువల్గా మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వికాస్ భాటియా మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాబోయే రోజుల్లో ఎయిమ్స్ పురోగతి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంఘమిత్ర పతి, డీన్ రాహుల్ నారంగ్, డాక్టర్లు సంగీత సంపత్, అభిషేక్ ఆరోరా, నితిన్జాన్, వర్గీస్ పాల్గొన్నారు.ఫ బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా -
సివిల్ సప్లై కార్యాలయంలో కాల్ సెంటర్
సాక్షి,యాదాద్రి : ధాన్యం సేకరణలో సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో కాల్సెంటర్ ఏర్పాటు చేసి 92814 23621 నంబర్ అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలు, పౌర సరఫరాల శాఖ, రవాణా కాంట్రాక్టర్ల నుంచి ఒక ప్రతినిధిని నియమించారు. కాల్సెంటర్ను బుధవారం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కొనుగోళ్లు, రవాణా, చెల్లింపులు తదితర విషయాలపై ఎలాంటి సందేహాలున్నా కాల్ సెంటర్కు ఫోన్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని, ప్రతిపాదించిన 372 కేంద్రాల్లో 25 చోట్ల ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు వనజాత, రోజారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి నీలిమ పాల్గొన్నారు. గుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు ఉద్యోగమేళా యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం కోకా కోలా కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థినుల కోసం ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఉద్యోగ మేళాలో పాల్గొనవచ్చన్నారు. వయో పరిమితి 18–24 సంవత్సరాలు, కనీస మార్కులు 60 శాతం ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.50 లక్షల వేతనం, ఉచిత రవాణా, భోజన సౌకర్యం కంపెనీ కల్పిస్తుందని వివరించారు. ఒరిజినల్ పదో తరగతి, డిప్లొమో సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, 3 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు సెల్ నంబర్ 8919925381కు సంప్రదించాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న సృజన హుజూర్నగర్: హుజూర్నగర్కు చెందిన కలువల సృజన ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించిన ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. సృజన ముద్ర లోన్ పొంది శారీ సెంటర్ పెట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తోంది. దీంతో ఆమెను ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ తరఫున ఆహ్వానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారంలో భర్త సురేష్రెడ్డి ప్రోత్సాహంతో రాణించడం వల్ల తనకు ఈ పురస్కారం దక్కిందని చెప్పారు. సృజనను పలువురు అభినందించారు. యాదగిరి క్షేత్రంలో జోడు సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్ర తిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. అదే విధంగా ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి ఆలయద్వార బంధనం చేశారు. -
తాటికల్ వాసికి డాక్టరేట్
నకిరేకల్: నకిరేకల్ మండలం తాటికల్కు చెందిన చనగాని భిక్షం–జయమ్మ దంపతుల కుమారుడు చనగాని రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. దివ్యాంగుడైన రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. అంజయ్య పర్యవేక్షణలో ‘ఆన్ ఇన్విస్టిగేషన్ ఇన్ టూ ది లైఫ్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ ధర్మభిక్షంగౌడ్ (1922–2011)’అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. దీంతో రామకృష్ణకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. రామన్నపేట యువకుడికి..రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన నకిరేకంటి నాగరాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు. హిందీ దళిత్ కహానియో మే చత్రిత్ దళిత్ జీవన్ కా యతార్ద్(1980–2010)కే సందర్భ్ మే అను అంశంపై ప్రొఫెసర్ మాయాదేవి వాగ్మరే పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం సమర్పించారు.. పీహెచ్డీ పట్టాను సాధించిన నాగరాజును పలువురు అభినందించారు. గాజులమల్కాపురం వాసికి..పెన్పహాడ్: పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామానికి చెందిన వట్టికూటి సందీప్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో దళిత బహుజనుల పాత్ర అనే అంశంపై చరిత్ర విభాగం ఆచార్యుడు అడపా సత్యనారాయణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ ఆయనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా సందీప్ను స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు. -
మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు
నకిరేకల్: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ నకిరేకల్లోని మెయిన్ సెంటర్లో పలు వాహనాలకు బుధవారం ఆయన పోస్టర్లు అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. వరంగల్ సభ పండుగను తలపించేలా ఉండబోతుందన్నారు. కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న పథకాలు సగానికే పరిమతయ్యారని ఆరోపించారు. రుణమాఫీ సగంలోనే ఆపేశారని, తులం బంగారం ఊసే లేదన్నారు. వరంగల్ సభకు నకిరేకల్ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు తలారి బలరాం, మాద ధనలక్ష్మి, మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్, దైద పరమేశం, వంటల చేతన్, రాచకొండ వెంకన్నగౌడ్, యానాల లింగారెడ్డి, సామ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
నల్లగొండ రీజియన్కు 152 ఎలక్ట్రిక్ బస్సులు
భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో బస్సుల కొరత తీరనుంది. డొక్కుబస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. 152 బస్సులు కేటాయించగా.. వీటిలో 41 బస్సులు సూర్యాపేట డిపోకు చేరుకున్నాయి. మిగితావి త్వరలోనే ఆయా డిపోలకు రానున్నాయి. ఈ బస్సులన్నీ చార్జింగ్తోనే నడవనున్నాయి. సూర్యాపేట, నల్లగొండలో ఈ చార్జింగ్ పాయింట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. రెండుచోట్ల చార్జింగ్ పాయింట్లు ఆర్టీసీ సంస్థ కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో ప్రధాన బస్టాండ్ అయిన సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్ను ఏర్పాటు చేశారు.ఇక్కడ రోజుకు ఐదారు బస్సులకు మా త్రమే చార్జింగ్ పెడుతున్నారు. సూర్యాపేట డిపోకు దాదాపు 77 బస్సులు రావడంతో కొత్తబస్టాండ్ డిపో ఆవరణలోనూ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండలో కూడా చార్జింగ్ పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా బస్టాండ్ల నుంచి హైదరాబాద్కు ఎక్కువ మొత్తంలో బస్సులను నడపనున్నారు. నల్లగొండ – సూర్యాపేట, సూర్యాపేట – వరంగల్, సూర్యాపేట – ఖమ్మం, నల్లగొండ– మిర్యాలగూడ రూట్లలో ఇలా డిపోల పరిధిలో బస్సులను నడపనున్నారు.ఫ సూర్యాపేట డిపోకు 75, నల్లగొండకు 77 కేటాయింపు ఫ త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడానికి ఆర్టీసీ అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతోంది. త్వరలోనే రీజియన్కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి. బస్సుల కొరత తీరడంతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందనుంది. –జాన్రెడ్డి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ -
మళ్లీ ‘మైక్రో’ పడగ!
సాక్షి, యాదాద్రి: మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాయి. అధిక వడ్డీలకు విచ్చలవిడిగా రుణాలు ఇస్తున్నాయి. ఏజెంట్లు వారం వారం వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. సకాలంలో చెల్లించకపోతే అదనపువసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో అధిక వడ్డీల కారణంగా కుటుంబాలు వీధిన పడడంతో ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ సంస్థలను నిషేధించింది. ప్రస్తుతం మళ్లీ విస్తరిస్తుండడంతో వీటిని అడ్డుకోవాలని మహిళలు కోరుతున్నారు. విచ్చలవిడి రుణాలతో..మైక్రో ఫైనాన్స్ ప్రతినిధులు రెండు, మూడు సంఘాల నుంచి సభ్యులను తీసుకుని, ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి రుణం ఇస్తున్నారు. దీంతో సభ్యులు బ్యాంక్ లోన్లు, సీ్త్రనిధి రుణాలు, సీఐఎఫ్ రుణాల సక్రమంగా చెల్లించడం లేదు. వీఓఏలకు రుణాల రికవరీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు, రాజాపేట, గుండాల, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్టలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇస్తున్నాయి. రాజకీయ ఒత్తిడి ఓ మైక్రో ఫైనాన్స్ ఇస్తున్న రుణాలపై ప్రశ్నించిన ఏపీఎం, వీఓఏలకు రాజకీయ బెదిరింపులు వస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ను ప్రశ్నించినందుకు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో యాదగిరిగుట్ట మండలం వీఓలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పురుషులతో కూడా సంఘాల ఏర్పాటుయాదగిరిగుట్ట మండలంలో మహిళలతోపాటు పురుషులతో కూడా సంఘాలు చేసి అప్పులు ఇచ్చేందుకు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో నూతనంగా మగవారికి కూడా సంఘాలు చేస్తూ, వారికి రుణాలు ఇస్తున్నట్లు తెలసింది. రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు మైక్రో ఫైనాన్స్లు రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఆస్తులు, డాక్యుమెంట్లు పూచీకత్తుగా పెట్టుకుంటున్నారు. తీసుకున్న రుణం వాయిదాలను వారం వారం వచ్చి వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు రికవరీ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. మహిళలు సమభావన సంఘాల్లో నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వారం వారం కిస్తులు చెల్లించడానికి అప్పులు తీసుకున్న వారు మళ్లీ కొత్త రుణాలు చేస్తూ అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు. గ్రామాల్లో విస్తరిస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు వారానికి ఒక వాయిదా చెల్లించేలా నిబంధనలు చెల్లించడంలో జాప్యమైతే అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సంస్థలు కుటుంబాలు వీధిన పడుతున్నాయని వాపోతున్న మహిళలు ఇబ్బందులు పడుతున్నాం గ్రామాల్లో కొత్తగా మైక్రో ఫైనాన్స్ వారు ఎక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ సంఘాల నుంచి లోన్లు తీసుకున్న వారు కూడా ప్రైవేట్లో తీసుకుంటున్నారు. దీంతో ఈ రెండు లోన్లు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులో నెల నెలా కట్టాల్సిన వాయిదాల్లో ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సంధ్య, కాచారం, వీఓఏ మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అరికట్టాలి మైక్రో ఫైనాన్స్ వాళ్లు గ్రామాల్లోకి వచ్చి మగవాళ్ల పేరు మీద సంఘాలు చేసి లోన్లు ఇస్తామని చెబుతున్నారు. మా గ్రామంలో ఐదుగురు మగవారితో సంఘం ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యుడికి రూ.50 వేల వరకు లోన్ ఇస్తామని రాసుకున్నారు. ఈ ప్రైవేట్ సంస్థల ఆగడాలను అధికారులు అరికట్టాలి. – సునీత, మాసాయిపేట, వీఓఏ -
మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్ : మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఈ నెల 11 నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 6 గంటలకు 5కే రన్, పానెల్ డిస్కషన్, 12న విశ్వవిద్యాలయ యువకులకు కెరీర్ అవకాశాలపై అవగాహన, 13న సింపోసియం, 14న సామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయాల పాత్రపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వకృత్త్వం, పాటలు, కవితల పోటీలను నిర్వహిస్తానమి పేర్కొన్నారు. మహనీయుల భావ స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ కొప్పుల అంజిరెడ్డి, రిజిస్ట్రార్ అల్వాల రవి, శ్రీదేవి, వసంత, కె.ప్రేమ్సాగర్, సుధారాణి పాల్గొన్నారు. -
రిజిరస్టేషన్లకు స్లాట్ బుకింగ్
రేపటి నుంచి భువనగిరి, చౌటుప్పల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుచౌటుప్పల్: ఇళ్లు, ఇంటిస్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు గతంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి. ఽగత ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో వ్యవసాయ భూములు తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగేవి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షణ కొనసాగుతుండేది. ఈ పద్ధతికి స్వస్తి పలకడంతోపాటు సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నూతనంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 144 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ప్రయోగాత్మకంగా 22 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ కార్యాలయాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో భువనగిరి, చౌటుప్పల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు 48 స్లాట్లుగా విభజన ఇప్పటివరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో అత్యధిక డాక్యుమెంట్లు సమర్పిండంతో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆయా సబ్రిజిస్ట్రార్ కార్యాలయ రోజువారీ పనివేళలను 48స్లాట్లుగా విభజించనున్నారు. ప్రజలు డాక్యుమెంట్ రైటర్లపై ఏమాత్రం ఆధారపడకుండా registration.tela ngana.gov.in వెబ్సైట్లో తమకు అనుకూలమైన తేదీ, రోజును ఎంచుకొని ఆ సమయానికి కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ పూర్తిగా 10– 15నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది. స్లాట్ బుకింగ్ లేని ఐదు డాక్యుమెంట్లకు అనుమతిస్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్లాట్ బుకింగ్ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చేసుకోని 5 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇళ్లు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్కు కొత్త విధానం ఆదేశాలు రావాల్సి ఉంది స్లాట్ బుకింగ్కు సంబంధించి అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ విధానం క్రయవిక్రయదారులకు సులువుగా ఉంటుంది. వేగవంతమైన సేవలు అందుతాయి. చౌటుప్పల్ కార్యాలయంలో జరుగుతున్న సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మారేది కేవలం ఆన్లైన్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు జరగడమే. – సందీప్, సబ్ రిజిస్ట్రార్, చౌటుప్పల్ త్వరలోనే ఆధార్ ఈ– సంతకం ప్రస్తుతం రిజిస్ట్రేషలన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసే వారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమయం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఈ– సంతకం విధానాన్ని ప్రవేశపెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. పూజల్లో భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి.తలనీలాల టెండర్ రూ.6కోట్లు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం తలనీలాలు సేకరించే లైసెన్స్ హక్కు, దేవస్థానంచే సేకరించబడిన తలనీలాల విక్రయానికి సంబంధించిన టెండర్ను ఆలయ ఈఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టెండర్లలో 15 మంది పాల్గొనగా.. తమిళనాడుకు చెందిన కేఎం ఎంటర్ ప్రైజెస్ వారు రూ.6కోట్లకు దక్కించుకున్నారు. కాగా.. గతేడాది జూలైలో టెండర్ కాలపరిమితి ముగిసింది. దీంతో 9 సార్లు నిర్వహించినా సరైన ధర రాకపోవడంతో టెండర్లు రద్దు పరిచారు. తొమ్మిది పర్యాయాలు రూ.3కోట్లకు మించి టెండర్ ధర రాకపోవడంతో మంగళవారం 10వ సారి టెండర్ నిర్వహించినట్లు ఈఓ భాస్కర్రావు వెల్లడించారు. దేవస్థానం సేకరించిన తలనీలాల స్టాక్ను సోమవారం 3వ సారి బహిరంగ వేలం నిర్వహించామని, ఇందులో 26 మంది టెండర్దారులు పాల్గొనగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్దంకి, బాపట్లకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర హెయిర్ మర్చంట్ వారు కిలో ఒక్కంటికి రూ.19వేలకు తీసుకున్నారని పేర్కొన్నారు. పంచాయతీ నిధుల వ్యయంపై విచారణఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ నిధుల వ్యయంపై ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీఓ పద్మావతి మంగళవారం పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 2019–23లో ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పులు, వ్యాపార అనుమతులకు సంబంధించి ఆన్లైన్ చేయకుండా అక్రమాలకు పాల్పడినట్లు మండల కేంద్రానికి ఎండీ హైమద్ ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి సునంద ఆదేశం మేరకు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఎంపీఓ పద్మావతి మాట్లాడుతూ.. 2019–23వరకు గ్రామ పంచాయతీ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో విచారణ చేయలేకపోతున్నామని, జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. మెయిన్ రోడ్డు వద్ద 94 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఐదు అంతస్తుల నిర్మాణంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా నాయకుడు బొబ్బల ఇంద్రారెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సీసీ రోడ్లు నాణ్యత లేకుండా నిర్మించారని గజరాజు కాశీనాథ్, యాస ఇంద్రారెడ్డి, కొరె భిక్షపతి పేర్కొన్నారు. విచారణలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, నాయకులు పాల్గొన్నారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలివలిగొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి కిష్టాఫర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఉద్యమకారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంధమల్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మండల్ ఉపాధ్యక్షుడిగా ఈపూరి శేఖర్ను నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పబ్బు లక్ష్మయ్య, చీమ కండ్ల శ్రీనివాస్, జోగు యాదయ్య, నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చమ్మకు బీఆర్ఎస్ నేతల నివాళి
మోత్కూరు: మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర మాజీ కార్యదర్శి నేవూరి ధర్మేందర్రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ ఇటీవల మృతి చెందారు. మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మంగళవారం దాచారం గ్రామాన్ని సందర్శించి పిచ్చమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ధర్మేందర్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మాతృమూర్తి రుణం తీర్చుకోలేనిదన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, నాయకులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి హరీశ్రావు -
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల పంచాయతీ కార్యదర్శులు, చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వార్డు ఆఫీసర్లు, ఉపాధి హామీ పథకం అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. సమావేశంలో డీఆర్డీఓ ఏడీ నాగిరెడ్డి, డీపీఓ సునంద, ఎంపీడీఓ సందీప్, మిషన్ భగీరథ డీఈ దీన్దయాల్, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ఎంపీఓ అంజిరెడ్డి, నర్సింహారావు పాల్గొన్నారు. -
అంతరాలను తొలగించేందుకే సన్నబియ్యం
భువనగిరిటౌన్: పేద, ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తిలతో కలిసి భువనగిరి పట్టణంలోని తారకరామ్నగర్కు చెందిన పుష్పలత నివాసంలో భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 515 రేషన్ దుకాణాల్లో 2 లక్షల17వేల మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించినట్లు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న బస్తీ దవాఖానాను వారు పరిశీలించారు. వారి వెంట జెడ్పీసీఈఓ శోభారాణి, సివిల్ సప్లయ్ మేనేజర్ శ్రీనివాస్, సివిల్ సప్లయ్ అధికారి వనజాత, సంబంధిత అధికారులు తదితరులున్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పనులు త్వరగా పూర్తిచేయాలి భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో గల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులు, వాటర్ సప్లై, డ్రెయినేజీ, విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని పరిశీలించారు. -
బెనిఫిట్స్ లేవు.. పెన్షన్ లేదు
● రిటైర్డ్ అయిన అంగన్వాడీ సిబ్బందికి అందని బెనిఫిట్స్ ● ఆవేదన వ్యక్తం చేస్తున్న 20మంది టీచర్లు, 108 మంది హెల్పర్లు భువనగిరిటౌన్: రిటైర్డ్ అయిన అంగన్వాడీలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది. ఉద్యోగ విరమణ పొంది తొమ్మిది నెలలు అవుతున్నా.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో 20మంది అంగన్వాడీ టీచర్లు, 108 మంది హెల్పర్లు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలు కాని ఎన్నికల హామీఅంగన్వాడీ టీచర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.18వేల వేతనం ఇస్తామని ప్రకటించింది. టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఇప్పుడు అమలు చేయడం లేదు. 2024 జూలై 1నుంచి ఆలేరు, రామన్నపేట, భువనగిరి, మోత్కూర్ పరిధిలో 20 మంది అంగన్వాడీ టీచర్లు, 108 మంది హెల్పర్లు పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ నిర్ణయంతో..అంగన్వాడీ టీచర్లకు తప్పనిసరి రిటైర్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ. 50వేలు ఇస్తామని మొదట్లో ప్రకటించింది. దీనిపై అంగన్వాడీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకొర వేతనాలతో ఇంతకాలం పనిచేశామని, ఇప్పుడు ఈ కొద్దిపాటి డబ్బులతో ఎలా బతకాలని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం సమీక్షించి టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ పదవీ విరమణ పొంది నెలలు గడుస్తున్నా మంత్రి హామీ ఆచరణకు నోచుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్కు వేతనం రూ.13,650కు, ఆయాలకు రూ.7,500కు అందజేస్తున్నారు. -
నిలిచిపోయిన బస్సు.. నీరసించిన చిన్నారులు
చౌటుప్పల్: ఆడుతూ...పాడుతూ బస్సులో పాఠశాలకు వెళ్లిన చిన్నారులకు మార్గమధ్యంలో అవాంతరం ఎదురైంది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని హనుమాన్నగర్కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం స్కూల్ బస్లో బడికి వెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు మధ్యలోనే ఆగిపోయింది. చేసేదేమీలేక బస్సులో కూర్చున్న విద్యార్థులే దిగి బస్సును నెట్టారు. దీంతో వారు నీరసించిపోయారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
హుజూర్నగర్ : రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్ 24న రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి రూ.15 వేలు లంచం అడిగాడని, వారిరువురి మధ్య రూ.10 వేలకు ఒప్పదం కుదిరిందని ఏసీబీ డీఎస్పీ తెలి పారు. మంగళవారం బాధితుడు చింతలపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్సై అంతిరెడ్డికి రూ.10వేలు అందజేయగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని, విచారణ అనంతరం ఎస్సైని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ తెలిపారు. -
గోడ కూలి భవన నిర్మాణ కార్మికురాలి మృతి
చౌటుప్పల్ రూరల్: నిర్మాణంలో ఉన్న గోడ కూలి భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం మన్నేవారిపంపు గ్రామానికి చెందిన మల్లేమోని భిక్షపతి, అతడి భార్య సుగుణమ్మ(50) 20 సంవత్సరాల క్రితం చౌటుప్పల్కు వలస వచ్చి, తంగడపల్లి రోడ్డులో సొంతంగా ఇల్లు నిర్మించుకుని, కూలీ పనులు చేసుకుంటూ జీవవనం సాగిస్తున్నారు. సుగుణమ్మ భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం పంతంగి గ్రామానికి చెందిన భవన నిర్మాణ గుత్తేదారు బోయ నర్సింహ ఎస్.లింగోటం గ్రామంలో ఉప్పు వెంకటేష్ ఇంటి నిర్మాణం చేయడానికి సుగుణమ్మను కూలీకి తీసుకెళ్లాడు. ఉదయం 11 గంటల సమయంలో మొదటి అంతస్తు పైకి సుగుణమ్మ ఇసుక మోస్తుండగా.. పరంజా కూలిపోవడంతో ఒక్కసారిగా ఆమె కింద ఉన్న పిల్లర్పై పడిపోయింది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ ఆమె మీద కూలింది. దీంతో సుగుణమ్మ తలకు తీవ్ర గాయాలు కాగా చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి యాజమాని వెంకటేష్, గుత్తేదారు బోయ నర్సింహ పనిచేసే చోట సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే తన తల్లి కిందపడి మృతి చెందినట్లు మృతురాలి కుమారుడు మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● మరొకరి పరిస్థితి విషమం నల్లగొండ: నార్కట్పల్లి–అద్దంకి బైపాస్పై నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఎర్రం సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి హైదరాబాద్కు షేక్ ఫిరోజ్ తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్నాడు. అదేవిధంగా హైదరాబాద్లోని బోడుప్పల్కు చెందిన పిదురు అనిల్ తన తల్లిదండ్రులు రఘురామమూర్తి(80), స్వరాజ్యంతో కలిసి కారులో ఒంగోలుకు వెళ్తూ.. నార్కట్పల్లి–అద్దంకి బైపాస్పై నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ వద్ద డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో అనిల్ ప్రయాణిస్తున్న కారు ఎగిరి అటుగా వస్తున్న ఫిరోజ్ కారుపై పడి పల్టీ కొట్టి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడిపోయింది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాధితులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రఘురామమూర్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఫిరోజ్ బంధువు మహమూద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
● చౌటుప్పల్లో గత నెల కిరాణ దుకాణంలో సిగరెట్ల దొంగతనానికి పాల్పడ్డ నిందితులు ● నిందితులంతా రాజస్తాన్ రాష్ట్రానికి చెందినవారే ● రూ.10 లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు, కారు, సెల్ఫోన్లు స్వాధీనంచౌటుప్పల్: రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు. ఈ ముఠా సభ్యులు గత నెల 6న చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బాలాజీ కిరాణ దుకాణంలో దొంగతనం చేసి రూ.10లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ మన్మథకుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాష్ట్రం బీవేర్ జిల్లా రాయిపూర్థానా గ్రామానికి చెందిన డ్రైవర్ లక్ష్మణ్రామ్, కినవాడీ గ్రామానికి చెందిన డ్రైవర్ రాఖేష్ కుమావత్, జోధ్పూర్ జిల్లా జాక్ గ్రామానికి చెందిన కూలీ పనిచేసే దినేష్ అలియాస్ దినరామ్, అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ జాబ్ చేసే అశోక్జాట్, పాలీ జిల్లాలోని హపత్ గ్రామానికి చెందిన భారత్కుమార్ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. షట్టర్ తాళం పగులగొట్టి దొంగతనం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ నుంచి చిన్నకొండూర్ రోడ్డు వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డులో ఉన్న బాలాజీ కిరాణ దుకాణంలో గత నెల 6న అర్ధరాత్రి సమయంలో వీరు దొంగతనానికి పాల్పడ్డారు. వీరులో కారులో వచ్చి దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పక్కకు తిప్పారు. రోడ్డు వెంట వెళ్లే వ్యక్తులకు ఏమీ కన్పించకుండా ఉండేందుకు షట్టర్కు అడ్డంగా పరదాలు కట్టారు. ఆ తర్వాత దుకాణానికి వేసిన తాళాన్ని గడ్డపారతో పగులగొట్టి లోనికి ప్రవేశించారు. దుకాణం నుంచి ఎనిమిది సిగరెట్ కార్టన్లను తీసుకొని బయటకు వచ్చారు. అన్నింటిని కారులో వేసుకునేందుకు ప్రయత్నించగా ఏడు మాత్రమే అందులో పట్టాయి. మరొకటి పట్టకపోవడంతో దానిని దుకాణం బయటనే పడేసి కారులో అక్కడి నుంచి పారిపోయారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు దొంగతనం జరిగిన మరుసటి రోజున దుకాణం యజమాని ఊర కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. అటుగా వెళ్తున్న నిందుతులు కారును అక్కడే ఆపి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా సిగరెట్ కార్టన్ల చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి కారుతో పాటు రూ.10లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రిమాండ్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఉరి శిక్ష సరైనదే..
పన్నెండేళ్లుగా నరకం అనుభవిస్తున్నా● కాలుకు మేకులు గుచ్చుకున్నా పరిగెత్తా.. చిలుకూరు: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో తన కాలుకు మేకులు గుచ్చుకున్నా ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తానని చిలుకూరుకు చెందిన నీలకంఠం అశోక్ తెలిపారు. నాటి ఘోర సంఘటన గురించి ఆయన మాటల్లోనే.. నేను కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దిల్సుఖ్నగర్లోని భాగ్యనగర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. రోజు మాదిరిగానే పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏ–1 మిర్చి బండి దగ్గర టీ తాగేందుకు వెళ్లాను. అక్కడికి వెళ్లిన రెండు నిమిషాలకే పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. ఆ సమయంలో నా కాలుకు మేకులు వచ్చి కుచ్చుకున్నాయి. దీంతో నా కాలు ఎముకకు తీవ్ర గాయమైంది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్ధంకాక బిత్తరపోయాను. అందరూ పరుగెడుతుండడంతో భయంతో నేను కూడా కొద్ది దూరం పరిగెత్తాను. ఆ తర్వాత పోలీసులు అంబులెన్స్లో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 15 రోజులు చిక్సిత పొందాను. ఆ తర్వాత చిలుకూరులో మా ఇంటికి వచ్చాను. పూర్తిగా కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల ఆర్థికసాయం అందింది. కాలి నొప్పులు పోయాయి. కానీ నేటికీ ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటే ఉలిక్కిపడేవాడిని. ● దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన మృతుల కుటుంబ సభ్యులు, బాధితులుహైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నింది తులకు గతంలో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్ష సరైనదే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందగా.. 13మంది గాయపడ్డారు. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఆనాటి భయానక పరిస్థితులు, పన్నెండేళ్లుగా తాము అనుభవిస్తున్న క్షోభను మృతుల కుటుంబ సభ్యులు, బాధితులు సాక్షితో పంచుకున్నారు.కోదాడ, మఠంపల్లి : ఈ జంట పేలుళ్లలో కుమారుడిని పోగొట్టుకున్న మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాకు చెందిన మాలోతు రవీందర్ అనుభవాలు ఆయన మాటల్లోనే.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నా రెండున్నరేళ్ల కుమారుడు అనిల్కుమార్ను చికిత్స నిమిత్తం నా భార్య లక్ష్మి, కుమార్తె అర్చన, తల్లి గంగులు, మామ హతియా, తమ్ముడు రంగానాయక్తో కలిసి 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్కు తీసుకెళ్లాం. కుమారుడిని ఇన్నోవా హాస్పిటల్లో డాక్టర్కు చూపించగా మూడు నెలల తర్వాత ఆపరేషన్ చేస్తానని చెప్పారు. దీంతో తిరిగి ఇంటికి వచ్చేందుకు దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి వద్దకు వచ్చి బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్నాం. సాయంత్రం సుమారు 5.45గంటలకు మేము నిలబడిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు పక్కన డబ్బా కొట్ల వద్ద బాంబు పేలింది. ఏమి జరుగుతుందో తెలుసుకొనే లోపు నా కుడికాలు తెగి రక్తం వస్తుంది. మావాళ్లందరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు వచ్చి మమ్ములను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నా కుడి కాలు తెగిపడడంతో పూర్తిగా కాలు తీసివేశారు. పేలుడు శబ్ధం ధాటికి నా కొడుకు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స వైద్యం కోసం మమ్ములను కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ నా కుమారుడు చనిపోయాడు. మా తమ్ముడికి చెవులు వినపడడం లేదు. నా భార్య కాలికి గాయం కావడంతో సరిగ్గా నడవలేకపోతుంది. మా అమ్మ చేతి వేళ్లు రెండు తెగిపోయాయి. మామ హతియాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ సంఘటన గుర్తుకు వస్తే ఇప్పటికి భయం వేస్తోంది. రూ.6లక్షల సాయమందించారుప్రభుత్వం నాకు రూ.6లక్షల ఆర్థికసాయం అందించింది. నా కుడికాలు తెగిపోవడంతో పూర్తిగా తీసివేశారు. జైపూర్ కృత్రిమ కాలును పెట్టించుకున్నాను. నాకు చికిత్సకు, కాలు ఏర్పాటుకు మొత్తం రూ.12 లక్షల ఖర్చయ్యింది. 2014లో నాకు అటెండర్ ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం కోదాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం మాకు ఐదెకరాల భూమి ఇస్తానని చెప్పింది. నేటి వరకు భూమి ఇవ్వలేదు. నా కుటుంబానికి ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలి. నా కుటుంబంతో పాటు నాలాంటి అమాయకులు అనేక మంది బలయ్యారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిందితులకు ఉరి శిక్ష వేయడం సరైనదే. ఆలస్యమైనా బాధితులకు కొంత ఊరట, మృతుల ఆత్మకు శాంతి కలుగుతుంది.● ఇన్నేళ్లకు న్యాయం జరిగిందిదేవరకొండ: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో దేవరకొండ పట్టణానికి చెందిన నక్క వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు భవనగిరి డివిజన్ పరిధిలో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం చేసేవారు. విధి నిర్వహణలో భాగంగా పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం దిల్సుఖ్నగర్ బస్టాప్లో బస్సు దిగి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతూ ఫోన్లో ఐఐటీ ఖరగ్పూర్లో చదువుకుంటున్న తన కుమారుడితో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా బాంబు పేలడంతో వెంకటేశ్వర్లు శరీరం ఛిద్రమై మృతిచెందారు. వెంకటేశ్వర్లు మృతి తర్వాత ఆయన భార్యకు అదే శాఖలో ఉద్యోగం కల్పించారు. వెంకటేశ్వర్లుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించడంతో ఇన్నేళ్లకు న్యాయం జరిగిందని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.● దివ్యాంగుడిలా మిగిలిపోయా..నాంపల్లి: దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఘటన గుర్తుచేసుకుంటూనే నా ప్రాణం లేచి వస్తుంది. ఆ పేలుళ్లలో నా కాలు విరిగింది. దీంతో నేను దివ్యాంగుడిలా మిగిలిపోయాను. ఆ ఘాతుకం సృష్టించిన నిందితులకు హైకోర్టు ఉరి శిక్షను సమర్ధిస్తూ తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం నేను ఆర్ఐగా మర్రిగూడెం తహసీల్దార్ కార్యలయంలో పనిచేస్తున్నాను.● గాయాలతో బయటపడ్డాంనిడమనూరు: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో నిడమనూరు అవాస గ్రామం నర్సింహులగూడేనికి చెందిన కొండారు శ్రీనివాస్, రాములమ్మ దంపతులు గాయాలపాలయ్యారు. ఆరోజు భయానక వాతావరణం గురించి శ్రీనివాస్ మాటల్లో.. నేను ఉపాధికోసం హైదరాబాద్లో పెట్రోల్ బంక్లో పనిచేస్తూ దిల్సుఖ్నగర్లోని పీఅండ్టీ కాలనీ నివాసముండేవాడిని. జంట పేలుళ్లు జరిగిన రోజు మా బాబు టిఫిన్ తీసుకురమ్మంటే టిఫిన్ సెంటర్లో దోశ ఆర్డర్ చేశాను. దోశ తీసుకుని నా బైక్ దగ్గరకు వెళ్లగానే బాంబు పేలింది. దీంతో నా కాలికి గాజు పెంకులు కోసుకుపోయాయి. నడవలేని పరిస్థితి, నా భార్య దూరంగా ఉండటంతో ఆమె కోసం వెతికాను. ఆమె దూరంగా కాళ్లకు గాయాలతో పడి ఉంది. మాకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సుమారు రూ.50 వేలు మా సొంతంగానే ఖర్చు పెట్టుకున్నాం. మాకు ప్రభుత్వ సాయం అందితే బాగుంటుంది. ప్రస్తుతం కూడా పెట్రోల్ బంక్లోనే పనిచేస్తున్నాను.● బైక్ పార్కింగ్ చేసిన చోటే ప్రాణాలు వదిలి..చిట్యాల: చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన ఏలే రాములు దిల్సుఖ్నగర్లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందాడు. ఆయన జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ అక్కడే నివాసముండేవాడు. ఆయనకు కుమారుడితో పాటు ముగ్గురు కుమార్తెలున్నారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో తన బైక్ను పార్క్ చేసి చౌటుప్పల్లోని తన బంధువు ఇంటికి వచ్చాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్నగర్లో తాను పార్కింగ్ చేసిన బైక్ను తీసుకుంటుండగా అకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించటంతో పాటు కుమారుడు సుధాకర్కు జీహెచ్ఎంసీలో ఉద్యోగాన్ని ఇచ్చింది. రాములు భార్య అండాలు ఇటీవల మృతి చెందింది. రాములు మృతి చెందటంతో తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అతడి కుమారుడు సుధాకర్ పేర్కొన్నాడు. పన్నెండేళ్ల తర్వాత నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించి బాధితులకు న్యాయం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగంగా చేసి తీర్పులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.● కన్న కొడుకును కోల్పోయాం..రామన్నపేట: జంట పేలుళ్ల ఘటనలో తమ కొడుకును కోల్పోయామని రామన్నపేట మండలం కక్కిరేణి మదిర గ్రామం రంగమ్మగూడేనికి చెందిన ముద్రబోయిన యాదమ్మ–శంకరయ్య దంపతులు అన్నారు. వీరివారి రెండో కుమారుడు మత్స్యగిరి దిల్సుఖ్నగర్లోని ఆనంద్ చాయ్ సెంటర్లో పనిచేసేవాడు. ఈ క్రమంలో దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో మృతి చెందాడు. మత్స్యగిరికి అన్న స్వామి, తమ్ముడు అంజనేయులు ఉన్నారు. మత్స్యగిరి మృతి అనంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.6లక్షల ఎక్స్గ్రేషియా, 160 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. మత్స్యగిరి సోదరుడు స్వామికి భువనగిరి సీపీఓ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం ఇచ్చారు. నిందితులకు శిక్ష పడటం ఆనందంగా ఉందని యాదమ్మ, శంకరయ్య పేర్కొన్నారు.షాపింగ్కు వెళ్లి పేలుళ్లలో చిక్కుకున్నాంమోతె: తన స్నేహితులతో కలిసి 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఏరియాలో షాపింగ్ చేసి బయట వచ్చి పేలుళ్లో చిక్కుకున్నామని మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన రావుల హుస్సేన్ అన్నారు. ఆయన మాటల్లోనే.. ఆ రోజు షాపింగ్ పూర్తిచేసి రోడ్డు మీదకు వచ్చే వరకు పెద్ద శబ్దంతో బాంబులు పేలాయి. నా ఎడమ చేతికి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతుండగా నా ఫ్రెండ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటనకు పాల్పడిన సంఘ వ్యతిరేక శక్తులను ఉరి తీయడం నాకు సంతోషంగా ఉంది. తప్పు చేసిన వారికి ఎప్పటికై నా శిక్ష పడాల్సిందే.● కోర్టు తీర్పు హర్షణీయంపెద్దఅడిశర్లపల్లి: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తీర్పు ఉపకరిస్తుంది. ఆనాడు బాంబు పేలుళ్ల ఘటన సమయంలో నేను బీటెక్ ఫైనలియర్ హైదరాబాద్లో చదువుకుంటున్నాను. రోజు మాదిరిలాగే ఆరోజు సాయంత్రం దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి బండి దగ్గర టీ తాగేందుకు వెళ్లాను. టీ తాగుతున్న సమయంలో పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. దీంతో నా కాలు విరగడంతో పాటు బలమైన గాయం అయ్యింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమి అర్ధం కాని పరిస్థితుల్లో నన్ను ఆటోలో సమీప ఓమ్నీ ఆస్పత్రిలో చేర్పించి నెల రోజుల పాటు వైద్యం అందించారు. నా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను.● భయాందోళనకు గురయ్యా..నేరేడుచర్ల: మాది నేరేడుచర్ల మండల కేంద్రం. నేను హైదరాబాద్లోని మలక్పేట సిరిపురం కాలనీలో నివాసముండేవాడిని. నా స్నేహితుడు టీవీ చారి కుమారుడు ఈశ్వర్ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండగా.. అతడికి డబ్బులు ఇచ్చేందుకు దిల్సుఖ్నగర్లో పేలుళ్లు జరిగిన రోజు వెళ్లాను. డబ్బులు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బాంబు పేలుళ్లు జరిగాయి. ఆనాటి పేలుళ్లలో నా ఎడమ కాలు విరగడమే కాకుండా.. కాలులోకి సైకిల్ చర్రాలు కుచ్చుకుపోయాయి. యశోదా ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేసేందుకు 8గంటల సమయం పట్టింది. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురయ్యాను. ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష సాయం అందించారు. ప్రస్తుతం కుటుంబంతో హైదరాబాద్లోనే నివాసముంటున్నా.బస్సు ఆలస్యంతో బాధితుడినయ్యా..భూదాన్పోచంపల్లి: బస్సు ఆలస్యం కావడంతో దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో బాధితుడిని అయ్యానని భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన సుక్క లింగస్వామి ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.. నేను ప్రతిరోజు పెద్దరావులపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్లోని నాగోల్కు వెళ్లి ప్రైవేట్ జాబ్ చేస్తుండేవాడిని. 2013 ఫిబ్రవరి 21న కూడా జాబ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం దిల్సుఖ్నగర్ బస్టాండ్కు వచ్చాను. పోచంపల్లి బస్సు ఆలస్యం ఉందని తెలిసి స్నేహితుడి సిమ్ కార్డు యాక్టివేషన్ చేయించడానికి సాయంత్రం 6.40 గంటలకు కోణార్క్ థియేటర్ సమీపంలో మొబైల్ షాపు వద్దకు వెళ్లాను. అదే సమయంలో మొదట వెంకటాద్రి థియేటర్ బస్టాప్లో బాంబు పేలుడు జరిగడంతో ప్రజలంతా పరుగెత్తుతున్నారు. వెంటనే కోణార్క్ థియేటర్ పక్కనే ఉన్న టీస్టాల్ వద్ద కూడా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి పొగ కమ్ముకొని దారి కన్పించక భయానక వాతావరణం ఏర్పడింది. చిన్నచిన్న ఇనుప ముక్కలు నా వీపు, భుజం, కాళ్లలో దిగాయి. అలాగే పరిగెడుతూ రన్నింగ్ బస్సు ఎక్కి ఎల్బీనగర్లో బంధువుల ఇంటికి వెళ్లాను. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాను. అదేరోజు రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకుని మా అమ్మ, బంధువులకు మాత్రం నేను సురక్షితంగా ఉన్నానని చెప్పాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత గాయపడిన నన్ను చూసి మా అమ్మ ఏడ్చింది. అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకొన్నాను. నా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డానని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇప్పటికీ దిల్సుఖ్నగర్కు వెళ్లినపుడల్లా నాటి పేలుళ్ల ఘటన గుర్తుకొచ్చి నాకు పునర్జన్మ లభించిందని భావిస్తాను. -
Telangana: గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే..మా అక్కనే స్ఫూర్తి..నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది.సొంతంగానే చదివా..గ్రూప్స్కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్కు అవసరమయ్యే మెటీరియల్ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్లో నాకు అవసరమైన మెటీరియల్ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. -
వైభవంగా శ్రీరాముడి పట్టాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం శివాలయంలో నిత్యారాధనలు నిర్వహించిన అర్చకులు మూలమంత్ర జపములు, దశ శాంతి పంచసూక్త పారాయణములతో అభిషేకములు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, అష్టోత్తర శతనామార్చనలు జరిపించారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుకను ఆలయ సిద్దాంతి, ప్రధానార్చకులు చేపట్టారు. సాయంత్రం నిత్యారాధనలు జరిపించిన అనంతరం రాత్రి 7గంటల నుంచి 8.30గంటల వరకు శివాలయ యాగ మండపంలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్పములు, కార్యక్రమాలు జరిగాయి. ఆయా వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. -
డిగ్రీ పూర్తికాగానే కొలువు !
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే.. ● మా అక్కనే స్ఫూర్తి.. నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కై రళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాఽధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది. ● సొంతంగానే చదివా..గ్రూప్స్కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్కు అవసరమయ్యే మెటీరియల్ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్లో నాకు అవసరమైన మెటీరియల్ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. ● కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపరేషన్ -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
కేతేపల్లి: కేతేపల్లి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి అశోక్ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్పై నకిరేకల్కు బయల్దేరాడు. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పల్లె రుచులు హాటల్ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్ కుడి కాలు పూర్తిగా తెగిపోయి ప్రమాద స్థలంలో పడిపోయింది. అశోక్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అదేవిధంగా చెర్కుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెర్కుపల్లి గ్రామానికి చెందిన మున్న శివ ఆదివారం రాత్రి పక్కనే ఉన్న కొండకిందిగూడెం గ్రామం నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం రాశి పైకి బైక్ దూసుకెళ్లి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మొదట సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్కు తరలించారు. -
వరంగల్ సభను జయప్రదం చేయాలి
నకిరేకల్: బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు నిండిన సందర్భంగా వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ(చలో వరంగల్)ను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను నకిరేకల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చలో వరంగల్ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్ర చేయడం సరికాదన్నారు. ఈ సభకు తరలివెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిర్బంధించడంతో పాటు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాద ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, నాయకులు పల్లె విజయ్, పెండెం సదానందం, పల్రెడ్డి మహేందర్రెడ్డి, గొర్ల వీరయ్య, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్రెడ్డి, వంటల చేతన్, యానాల లింగారెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, బోయిళ్ల కిషోర్, గుండగోని జంగయ్య, రాచకొండ శ్రవణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్ !
నడిగూడెం: ప్రస్తుత వేసవిలో పశుగ్రాసం కొరతతో పాడి రైతులు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు అజొల్లా పెంపకమే సరైన పరిష్కారమని నడిగూడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ అఖిల చెబుతున్నారు. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ నీటి మొక్క త్వరగా పెరుగుతుందని, ఇది పశుగ్రాసానికి ప్రత్యామ్నాయమని ఆమె పేర్కొన్నారు. అజొల్లాతో లాభాలు ఇవీ..అజొల్లా తిన్న పశువులకు పోషక విలువలు అందుతాయి. ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25–35 శాతం వరకు మాంసకృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. అజొల్లా లిగ్నైట్ తక్కువగా ఉండడటం వలన పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. ఒక కిలో అజొల్లా ఉత్పత్తికి 20–30 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి రోజు 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువులకు దాణాలో కలిపి తినిపించవచ్చు. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. దీని వలన పాల దిగుబడి 15నుంచి 20 శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతంలో పాటు ఎస్ఎన్ఎఫ్ పెరిగి ప్రతి లీటరు పాలకు 60 పైసలు నుంచి 150 పైసల వరకు అదనపు ఆదాయం పెరుగుతుంది. ఇలా పెంచాలి..సూటిగా సూర్యకాంతి పడని కొద్దిపాటి నీడ గల భూమి కలపును పూర్తిగా చదును చేసుకోవాలి. 10 సెం.మీ. లోతు వచ్చేలా గోతిని తవ్వాలి. అందులో చుట్టూ ఇటుకలను పేర్చాలి. ఇలా ఒక తొట్టిని 2.50 నుంచి 1.5 మీటర్ల సైజుల్లో నిర్మిస్తే అజొల్లా ఉత్పత్తి చేయవచ్చు. గోతి లోపల భూమిపై కలుపు మొక్కల వేర్లు రాకుండా ప్లాస్టిక్ సంచులు పరచాలి. దీనిపై 150 జీఎస్ఎం మందం ఉన్న ప్లాస్టిక్ షీటు వేయాలి. షీటు చివరలు ఇటుకలపై అంచువరకు వచ్చేలా పరచాలి. ఇందుకు 3.2 మీటర్ల సైజు గల ప్లాస్టిక్ షీటు ఉండాలి. షీటు కప్పిన తొలి లోతు 10 సెం.మీ. ఉండాలి. 30 నుంచి 35 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టి, మెత్తని మట్టిని ప్లాస్టిక్ షీటుపై సమానంగా పరచాలి. ఒక చదరపు మీటరుకు 10 నుంచి 12 కిలోల పశువుల పేడను 10 లీటర్ల నీటిలో పలుచగా కలిపి, దానిలో 10–20 గ్రాముల సూపర్ పాస్పేట్ను కలిపి పోయాలి. ఈ తొట్టిలో 7–10 సెం.మీ. ఎత్తు ఉండేలా నీరు పోయాలి. బెడ్లోని మట్టి, నీటిని కలియతిప్పాలి. అజొల్లా త్వరతగతిన పెరిగి 7–10 రోజుల్లో నీటి తొట్టెను పూర్తిగా ఆక్రమిస్తుంది. 8వ రోజు నుంచి ప్రతిరోజు ఒక కిలో అజొల్లాను ఒక్కొక్క తొట్టి నుంచి తీసుకోవచ్చు. బెడ్ మీద చల్లిన ఒక కిలో అజొల్లా వారం రోజుల్లో 8–10 కిలోలు అజొల్లా ఉత్పత్తవుతుంది.మేపేది ఇలా..తొట్టి నుంచి తీసుకొచ్చిన అజొల్లా చదరపు సెంటీమీటరు వెడల్పు ఉన్న రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో ఉంచాలి. దానిని సగం నీరు నింపిన బకెట్పై పెట్టి పైనుంచి నీరు పోయాలి. ట్రేలో పైన ఉన్న అజొల్లాను పశువులకు మేపాలి. ట్రేలోని రంధ్రాల ద్వారా చిన్న చిన్న అజొల్లా మొక్కలు బకెట్లోని నీళ్లలోకి వెళ్తాయి. ఈ నీటిని మరలా బెడ్లో పోయడం వలన అజొల్లాను తిరిగి పెంచవచ్చు. ప్రస్తుతం నడిగూడెం, కోదాడ మండలాలలో చుట్టుపక్కల వరి పొలాల్లో కూడా అజొల్లా కనిపిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్ నిడమనూరు: బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నరసింహ(41) మిర్యాలగూడలోని బాపూజీనగర్లో నివాసముంటూ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నరసింహ సోమవారం బైక్పై స్వగ్రామానికి వచ్చి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరసింహను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఉప్పునూతల రామేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి
కట్టంగూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన కాసర్ల యాదమ్మ, నర్సిరెడ్డి దంపతుల ఏకై క కుమారుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి(47) పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. శ్రీనివాసరెడ్డికి 25 సంవత్సరాల క్రితం వివాహం చేయగా కుమార్తె జన్మించిన మూడు సంవత్సరాల అనంతరం భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి యాదమ్మ తన మనువరాలు, కొడుకు ఆలనాపాలన చూసుకుంటుంది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసరెడ్డి తిరిగి రాలేదు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సోమవారం ఈదులూరు గ్రామ శివారులో గల బావిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం తేలి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. తన కొడుకు మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు శ్రీనివాసరెడ్డి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ఉరేసుకుని బలవన్మరణం చౌటుప్పల్: అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక మకుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
నాగార్జునసాగర్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్కాలనీలో జరిగింది. ఎస్ఐ సంపత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హిల్కాలనీకి చెందిన నెల్లం శ్రీనివాసరావు డిండి మండలంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉపాధిహామీ కూలి పెంచాలికోదాడ: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉపాధిహామీ కూలిరేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. ప్రసాద్ కోరారు. సోమవారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు 11 శాతం పెరిగితే ఉపాధి కూలీల కూలి రేటు 2శాతం మాత్రమే పెంచడం అన్యాయమన్నారు. కూలిరేట్లను రోజుకు ఏడు రూపాయలు మాత్రమే పెంచడం పేదలను అవమానించడమే అని అన్నారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల అవుతున్నా నేటికీ అమలు చేయలేదన్నారు. ఈ వర్క్షాప్లో సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మిట్టగడుపుల ముత్యాలు, స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీ గురుకులాల్లో వసతులు కరువు
● ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మైనార్టీ గురుకులాలు ● అందులో 13 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులుచౌటుప్పల్ రూరల్: మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. చాలా గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలా మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్క గురుకులానికే సొంత భవనం..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఇందులో కేవలం నల్లగొండ పట్టణంలో ఉన్న బాలుర మైనార్టీ గురుకులానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా 13 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల, చౌటుప్పల్, భువనగిరిలో బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటికి నెలకు సుమారు రూ.3.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. వసతుల్లేక ఇబ్బందులు..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల మూతపడిన పరిశ్రమ షెడ్లో కొనసాగుతోంది. డార్మిటరీ లేక రేకుల షెడ్లోనే సుమారు 320 మంది విద్యార్థులు నిద్రిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద రేకుల షెడ్ను గదులుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నారు. బాత్రూంలు కూడా సరిపడా లేవు, భోజనం చేయడానికి రేకుల షెడ్లోనే డైనింగ్ హాల్ ఏర్పాటుచేశారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో విలీనం చేసేనా..రాష్ట్ర ప్రభుత్వం 28 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను కూడా విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరిలో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లోకి ఆయా ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ గురుకులాలు విలీనం అయ్యే అవకాశం ఉంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను మునుగోడు మండలం కలకుంట్లలో నిర్మిస్తున్న సమీకృత గురుకులంలో విలీనం చేస్తారని సమాచారం. సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను విలీనం చేయకపోతే మైనార్టీ గురుకుల పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
అతివలకు ఆర్థిక భరోసా..
నాడు కూలీ.. నేడు పాడి పరిశ్రమ ఆత్మకూర్(ఎం) మండలం రహీంఖాన్పేటకు చెందిన తాల్లపెళ్లి అరుణ కావేరి మహిళా సంఘంలో సభ్యురాలు. అంతకుముందు ఉపాధిహామీ పనులకు వెళ్లేంది. సీ్త్రనిధి పథకం కింద బ్యాంకు నుంచి రూ.1లక్ష చొప్పున మూడు దఫాలు రుణం తీసుకుంది. అట్టి డబ్బుతో వ్యవసాయ బావి వద్ద పాడి పరిశ్రమ ఏర్పాటు చేసింది. గ్రామంలోని పాల కేంద్రంలో పాలు పోస్తుంది. సీ్త్రనిధి అప్పు పోను నెలకు రూ.15వేల వరకు ఆదాయం వస్తుందని అరుణ తెలిపారు. ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా.. ఆత్మకూర్(ఎం) మండల కేంద్రానికి చెందిన బూడిద గిరిజ లక్ష్మీసరస్వతి సంఘంలో సభ్యురాలు. సీ్త్రనిధి కింద లక్ష రూపాయలు రుణం తీసుకుంది. ఆ డబ్బుతో గ్రామంలోనే లేడీస్ కార్నర్ ఏర్పాటు చేసింది. నెలకు రూ.2700 కిస్తు చెల్లిస్తుంది. కిస్తు, ఖర్చులు పోను నెలకు రూ.20 వేలు సంపాదిస్తుంది. పాలిటెక్నిక్ చదివిన గిరిజ ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా.. సీ్త్రనిధి రుణంతో స్వయం ఉపాధి పొందుతుంది. స్త్రీనిధి పథకం ద్వారా విరివిగా రుణాలు ఫ వివిధ వ్యాపారాల్లో స్థిరపడిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఫ జిల్లాలో 18,106 సంఘాలు ఫ రూ.790 కోట్ల రుణాలు పంపిణీ ఆత్మకూరు(ఎం): ఒకప్పుడు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ, కూలీ పనులతో జీవనం సాగించిన మహిళలు.. నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. చేతి నిండా పని.. డబ్బుతో సంతోషంగా ఉంటున్నారు. సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. సంఘాలు, సభ్యులు.. జిల్లాలోని 17 మండలాల్లో 18,106 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 1,85,362 మంది సభ్యులు ఉన్నారు. అందులో 15,432 సంఘాల్లో 1,11,716 మంది మహిళలు సీ్త్రనిధి పథకం కింద రూ.790 కోట్ల రుణాలు పొందారు. రుణం డబ్బులతో పాడి పరిశ్రమ, బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్, కిరాణం, వస్త్ర దుకాణాలు, గొర్రెల పెంపకం తదితర వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. సీ్త్రనిధి రుణాల మంజూరులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో ఉంది. ఆత్మకూర్(ఎం)కు చెందిన జోష్న ఇంటర్ పూర్తి చేసింది. తోటి మహిళల సూచన మేరకు పల్లవి మహిళా సంఘంలో చేరింది. జీవనోపాధి నిమిత్తం బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయలు మంజూరు చేసింది. ఈ డబ్బుతో కిరాణ షాపు ఏర్పాటు చేసింది. కిస్తు రూ.2,250, ఖర్చులు పోను నెలకు రూ.15వేలు సంపాదిస్తున్నట్లు తెలిపింది. సొంత కాళ్లపై నిలబడాలన్న లక్ష్యం -
దళారులను నమ్మొద్దు
భువనగిరిటౌన్ : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మొ ద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి పేర్కొన్నారు. ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, సన్న వడ్లకు బోనస్ వివరాలతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటా రూ.2,320, బి గ్రేడ్కు రూ.2,300 ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించిన రైతులకు క్వింటా రూ.500 చెల్లిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, మార్కెటింగ్ శాఖ అధికారి సబిత, జిల్లా పంచాయతీ అధికారి సునంద పాల్గొన్నారు. -
పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
భువనగిరి టౌన్ : మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పూలే జయంతి ఉత్సవాల నిర్వహణపై సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరిలోని పూలే విగ్రహం వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, రంగులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అభివృద్ధి అధికారి వసంత కుమారి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైనసమాజాన్ని నిర్మిద్దాం భువనగిరి టౌన్ : ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ మనోహర్ కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భువనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డబ్బు పొదుపు చేసినట్టేనని, ప్రపచంలో అసలైన కుభేరులు ఆరోగ్యవంతులేనని పేర్కొన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు సమష్టి కృషి అవసరం అన్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతాశిశు సంరక్షణ అధికారి డాక్టర్ యశోద, డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానం భూదాన్పోచంపల్లి : పట్టణంలోని అభినవ యూత్ అసోషియేషన్ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్లోని ఫెడరల్ రీసెర్చ్ అండ్ రికగ్నైజేషన్ కౌన్సిల్ సంస్థ గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు–2025 ప్రదానం చేసింది. గచ్చిబౌలి లోని మెరిడియన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్రావు చేతుల మీదుగా యూత్ అధ్యక్షుడు జోగు రవీందర్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. సామాజిక సేవ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా 2018లో అభినవ యూత్ ఏర్పాటు చేశామని యూత్ అధ్యక్షుడు జోగు రవీందర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. శివుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
ఎయిమ్స్లో పీడియాట్రిక్ సర్జరీ డే
బీబీనగర్ : ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం వరల్డ్ పీడియాట్రిక్ సర్జరీ డే ఘనంగా నిర్వహించారు. పీడియాట్రిక్ వైద్య విభాగంలో చికిత్స పొందడానికి వచ్చిన చిన్నారులతో కలిసి డైరెక్టర్ వికాస్ భాటియా, వైద్యులు కేక్ కట్ చేశారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఎయిమ్స్లో చిన్నారులకు ఆధునిక వైద్యసేవలు అందజేస్తున్నామని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే సంప్రదించాలన్నారు. ఆధునిక సర్జరీ యూనిట్ల్ల ఏర్పాటకు కృషి చేస్తున్నట్లు వికాస్ భాటియా తెలిపారు. -
ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
భువనగిరి టౌన్ : సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హత కలిగిన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్లు లేని పేదలు ఎంతోమంది ఉన్నారని, వారంతా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్ 8లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఖా ళీగా ఉందని, అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలేరు తహసీల్దార్కు దరఖాస్తులు కూడా అందజేశామని పేర్కొన్నారు. స్పందించకపోతే పోరుబాట పడుతామన్నారు. అనంతరం కలెక్టర్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, నాయకులు పొన్నబోయిన రవి, పోతు ప్రవీణ్, ఉపేందర్, భవాని, సంపత్, పార్వతి, సంధ్య, సరిత తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా -
దరఖాస్తులకు సత్వర పరిష్కారం
సాక్షి,యాదాద్రి : సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వస్తున్న వినతులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించలేనివి ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాగా వివిధ సమస్యలపై 59 దరఖాస్తులు రాగా.. అందులో 38 వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. పంచాయతీ రాజ్ 7, వైద్య 2, సర్వే ల్యాండ్స్, విద్య, వ్యవసాయ, హౌసింగ్, లీడ్ బ్యాంకుకు సంబంధించి ఒక్కొకటి చొప్పున ఆర్జీలు ఉన్నాయి. వినతులు స్వీకరించిన వారిలో జెడ్పీ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● రుణమాఫీ కాలేదని బొమ్మలరామారం, మర్యాల, చీకటిమామిడి గ్రామాలకు చెందిన పలువురు రైతులు కోరారు. ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారిన తర్వాత ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిందని, దీంతో సాంకేతికంగా సమస్య తలెత్తడంతో రుణమాఫీ కాలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ● గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం రాజాపేట మండలం బేగంపేట రెవెన్యూ పరిధిలో సుమారు 80 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంది.. పట్టాదారు పాస్ పుస్తకాల్లో నుంచి భూములను తొలగించారు.. ఆరేళ్లు కావస్తున్నా పరిహారం చెల్లించలేదని బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. జాప్యం చేయకుండా పరిహారం ఇవ్వాలని, లేనట్లయితే భూములను తమ ఖాతాల్లో తిరిగి చేర్చాలని విన్నవించారు. ● అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొంది ఏడాది గడుస్తున్నా వారికి ప్రభుత్వం నుంచి బెన్ఫిట్స్ అందడం లేదని సీఐటీయూ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. జిల్లాలో 100 మంది వరకు రిటైర్మెంట్ అయ్యారని, ఆలస్యం చేయకుండా బెన్ఫిట్స్ అందజేయాలని కోరారు.ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఫ ప్రజావాణిలో వినతుల స్వీకరణ మైక్రో ఫైనాన్స్ల ముప్పు తప్పించండి మైక్రో ఫైనాన్స్ల ఆగడాలను అరికట్టాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం సంఘ బంధం సభ్యులు విన్నవించారు. యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో నాగార్జున ఫిన్కేర్, రుద్రమదేవి, సౌభాగ్యలక్ష్మి తదితర మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నాయని ఆరోపించారు. దీంతో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్ రుణాలు పొందిన సంఘాల సభ్యులు సక్రమంగా కిస్తులు చెల్లించడం లేదని, రికవరీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అతేకాకుండా కొత్తగా పురుషులతో కూడా సంఘాలు ఏర్పాటు చేయిస్తూ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీవోఏ, ఏపీఎంలపై రాజకీయంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే మైక్రో ఫైనాన్స్ సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరారు. -
ధాన్యం కొనే దిక్కేది?
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం మోటకొండూరుకు చెందిన రైతు ఎగ్గిడి రాజు ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. అందులో మూడు ఎకరాలు కోయగా 122 బస్తాల దిగుబడి వచ్చింది. స్థానికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం, సీరియల్ ప్రకారం అమ్మాలంటే ఆలస్యం అవుతుండడం, మరోవైపు వాతావరణం భయపెడుతుండడంతో ప్రైవేట్ వ్యాపారికి క్వింటా రూ.1880 చొప్పున విక్రయించాడు. కాగా వ్యాపారి బస్తా ధాన్యం 66 కిలోలు కాంటా వేసి 64 కిలోలకే లెక్కకట్టించాడు. బస్తా బరువు కిలో, తరుగు కింద కిలో కట్ చేశాడని, హమాలీ చార్జీ వందకు రెండు రూపాయల చొప్పున కట్ చేసి మిగతా డబ్బులు చెల్లించాడని రైతు వాపోయాడు. సాక్షి,యాదాద్రి : కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం.. అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా కొనే దిక్కులేక కర్షకులు ప్రైవేట్ వ్యాపారుల వైపు చూస్తున్నారు. జిల్లాలో వరికోతలు మొదలై పక్షం రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల ఏర్పా టు కొలిక్కి రావడం లేదు. గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం) మండలాల్లోనే 12 కేంద్రాలను ప్రారంభించారు. లక్ష్యం 4.50లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2,75,315 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 4.50లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు అనుగుణంగా 372 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల మొదటి వారంలోనే కేంద్రాలన్నీ తెరుస్తామని అధికారులు ప్రకటించారు. కానీ కేవలం 12 చోట్ల మాత్రమే ప్రారంభించారు. ఇక్కడ కూడా ధాన్యం కాంటా వేయడం లేదు. ఓ వైపు కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, మరోవైపు అకాల వర్షాలు భయంతో రైతులకు మరోదారి లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటా రూ.2,320 ఉండగా రూ.1,800 నుంచి రూ.2,000 వరకు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. అయినా ఎదురుచూడలేక వ్యాపారులకు అమ్ముకోవడానికి రైతులకు మొగ్గు చూపుతున్నారు. తూకంలోనూ మోసం గుండాల, అడ్డగూడూరు, ఆలేరు, మోత్కూరు, మోటకొండూరు. అత్మకూర్(ఎం), వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల్లో ముందుగానే వరి కోతలు మొదలయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు నేరుగా కళ్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలకు బదులు తూకం కాంటాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. అయినా మార్కెటింగ్, సివిల్సప్లై, తూనికలు కొలతల అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వరి సాగు 2,75,315 ఎకరాలు దిగుబడి అంచనా 6.05 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు ఫ కేవలం 12 చోట్లనే ప్రారంభం ఫ ఎదురుచూడలేక ప్రైవేట్కు ధాన్యంఅమ్ముకుంటున్న రైతులు ఫ అదునుగా తీసుకుని ధర తగ్గిస్తున్న వ్యాపారులు ఫ క్వింటా రూ.1,880 నుంచి రూ.1,950 వరకు చెల్లింపు ప్రారంభించినవి 12కొనుగోలు కేంద్రాలు 372 క్వింటా రూ.1,850కే అమ్మిన ఎకరం 20 గుంటల్లో వరి సాగు చేయగా 40 బస్తాల దిగుబడి వచ్చింది. పెద్ద కందుకూరుకు చెందిన వ్యాపారికి క్వింటా రూ.1,850 చొప్పున విక్రయించగా బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీశాడు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది. –గాజుల శ్రీనివాస్, మహబూబ్పేట -
కమనీయం.. రాములోరి కల్యాణం
చౌటుప్పల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దంపతులు యాదగిరి కొండపై నిర్వహించిన సీతారాముల కల్యాణంలో మంగళసూత్రం చూపుతున్న అర్చకుడు శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణ వేడుకలు కమనీయంగా జరిగాయి. భక్తుల జయజయ ధ్వానాల నడుమ అర్చకులు కల్యాణతంతు పూర్తి చేశారు. -
బ్రెయిన్ స్ట్రోక్తో చేనేత కార్మికుడు మృతి
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి పట్టణ కేంద్రంలోని వినోబాభావేనగర్కు చెందిన చేనేత కార్మికుడు వల్లభదాసు రాజు(53) బ్రెయిన్స్ట్రోక్తో శనివారం రాత్రి మృతిచెందాడు. రాజు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన రాజుకు శస్త్రచికిత్స చేయాలని, ఇందుకు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. వైద్యం చేయించడానికి ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుండగానే శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం రాత్రి రాజు భౌతికికాయానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య దుర్గమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడని, అతడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, గౌరవ అధ్యక్షుడు వేశాల మురళి కోరారు. -
యాదగిరిగుట్టలో శ్రీరామనవమి వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని పూజారులు వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్రస్వామికి ఉదయం విశేష పూజలు జరిపించి, 11.30గంటలకు శివాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సేవను ఊరేగించారు. యాదగిరిగుట్ట దేవాలయం తరఫున అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి దంపతులు, ఈఓ భాస్కర్రావు, ఆలయ అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శివాలయం ఉత్తర దిశలోని కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్ ఎన్. సత్యనారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు, ఆలయ అధికారులు, పూజారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు సీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం జరిపించనున్నారు. స్వర్ణగిరి దేవాలయంలో.. భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ సమీపంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం శీర్రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
కవులు సమాజాన్ని చైతన్యపరచాలి
నార్కట్పల్లి: కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత ఎన్వీ రఘువీర్ ప్రతాప్ అన్నారు. నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీసోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవి సమ్మేళనంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 67 మంది కవులు పాల్గొన్నారు. అనంతరం కవులకు బహుమతులు అందజేశారు. శివజ్ఞాన పీఠం ట్రస్ట్ అధ్యక్షుడు పోతులపాటి అరుణ రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిలువేరు సాహితీ సంస్థ, తేజస్విని సాహితీ సంస్థల అధ్యక్షుడు సిలువేరు లింగమూర్తి, పెందోట సోము, సినీ పాటల రచయిత బండారు దానయ్య, తండు కృష్ణకౌండిన్య, పున్న అంజయ్య, పెరుమాళ్ల ఆనంద్, భానుశ్రీకొత్వాల్, సాగర్ల సత్తయ్య, ఝూన్సీ, ప్రవీణ్రెడ్డి, రాజేందర్శర్మ, జయారపు రామకృష్ణ, హరికృష్ణశర్మలు తదితరులు ఉన్నారు. బుచ్చిరెడ్డి దంపతులకు సన్మానంకనగల్: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీసోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించి కవి సమ్మేళనంలో కనగల్ మండలం చిన్న మాదారం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, కీర్తి పురస్కార గ్రహీత రఘువీర్ ప్రతాప్ సన్మానించారు. కార్యక్రమంలో పెందోట సోము, సిలువేరు లింగమూర్తి, పోతులపాటి అరుణ, శివ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 7తులాల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులుమునుగోడు: మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. కచలాపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్రెడ్డి దంపతులు ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. వారి ఇల్లు గ్రామ శివారులో ఉండటంతో తాళం వేయడం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యాహ్న తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని సుమారు 7తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సాయంత్రం వ్యవసాయ బావి వద్ద నుంచి శ్రీనివాస్రెడ్డి దంపతులు ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బీరువాలోని వస్తువులు చిందరవదరగా పడేసి ఉండటం గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. -
తెలంగాణ లోకాయుక్తగా పెద్దవూర మండల వాసి
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన హైకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి తెలంగాణ లోకాయుక్తగా నియమితులయ్యారు. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు యడవెల్లి రామాంజిరెడ్డి–జయప్రద దంపతులకు ఐదుగురు సంతానం కాగా.. రాజశేఖర్రెడ్డి పెద్దవారు. ఆయన 1960 మే 4వ తేదీన జన్మించారు. రాజశేఖర్రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలోని సెయింట్ మేరీ పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్సెస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఏవీఎం కళాశాలలో, బీఎస్సీ డిగ్రీ, ఎల్ఎల్బీ వరంగల్లో సాగాయి. ఆ రోజుల్లోనే ఆయన విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్ మీడియంలో సాగింది. డిగ్రీ సైన్స్లో చేసినప్పటికీ బాబాయి కొండల్రెడ్డి అడ్వకేట్గా స్థిరపడటంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజశేఖర్రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం సాధించారు. ఎల్ఎల్బీ పూర్తికాగానే 1985లో మొదట నల్ల గొండలో న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లి అక్కడే న్యాయవాదిగా 1985 ఏప్రిల్లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతహాగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా, అదే ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013 ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2022 ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు. సీఎం రేవంత్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై లోకాయుక్తగా యడవెల్లి రాజశేఖర్రెడ్డి పేరును ఖరారు చేసి రాజ్భవన్కు పంపింది. ఒకటి, రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన యడవెల్లి రాజశేఖర్రెడ్డి పేరు ఖరారు రాజ్భవన్కు చేరిన ప్రతిపాదనలు ఒకటి రెండు రోజుల్లో జారీకానున్న ఉత్తర్వులుస్వగ్రామంతో అనుబంధం కొనసాగిస్తూ.. శిర్సనగండ్ల గ్రామానికి పండుగలకు, శుభకార్యాలకు తరచూ రాజశేఖర్రెడ్డి వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు సోదరులు యడవెల్లి దేవేందర్రెడ్డి, రఘుపతిరెడ్డి, దిలీప్రెడ్డి, సోదరి మంజుల ఉన్నారు. వీరిలో దేవేందర్రెడ్డి, రఘుపతిరెడ్డి శిర్సనగండ్ల గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. దిలీప్రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఆస్తి పంపకాల్లో రాజశేఖర్రెడ్డికి అనుముల మండలం కొసలమర్రి గ్రామంలో 12 ఎకరాల పొలం వచ్చింది. దీనిలో బత్తాయి తోట సాగుచేస్తూ తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. స్వగ్రామంలో తనకంటూ కొంత భూమి ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ మధ్యనే శిర్సనగండ్లలో రాజశేఖర్రెడ్డి మూడెకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు ఆయన సోదరుడు దేవేందర్రెడ్డి తెలిపారు. రాజశేఖర్రెడ్డి చిన్నతనం నుంచి చదువులో మంచి ప్రతిభ కనపర్చేవారని కూడా పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి లోకాయుక్తగా నియామకం కావడంతో శిర్సనగండ్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం మత్తులో కత్తితో దాడి
త్రిపురారం: మద్యం మత్తులో ఓ వ్యక్తి కల్లు గీసే కత్తితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన త్రిపురారం మండలం కొణతాలపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన నూకల ఉపేందర్రెడ్డి ట్రాక్టర్ షోరూంలకు జనరల్ మేనేజర్గా పనిచేస్తూ నల్లగొండలో నివాసముంటున్నారు. శనివారం సెలవు ఉండడంతో తన ఇద్దరు పిల్లలతో పాటు తనతో పనిచేసే రాము అనే వ్యక్తితో కలిసి కారులో కోమటిగూడేనికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం కొణతాలపల్లి శివారులో కల్లు అడ్డా వద్ద జక్కల సైదులు అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో కారు పోయేందుకు వీలేకాలేదు. ఉపేందర్రెడ్డి పక్కకు జరగమని అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు అక్కడే ఉన్న కల్లు గీత కార్మికుడి వద్ద ఉన్న కత్తి తీసుకొని ఉపేందర్రెడ్డిపై దాడి చేశాడు. కారులో ఉన్న రాము వచ్చి అడ్డుపడగా అతడిపై కూడా దాడి చేశాడు. ఉపేందర్రెడ్డి పిల్లలు కారులోంచి కిందకు దిగడంతో స్థానికులు తిరిగి వారిని కారులో కూర్చోబెట్టారు. ఉపేందర్రెడ్డి, రాముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందింతుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. క్షతగాత్రులు నల్లగొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉపేందర్రెడ్డిపై దాడి జరిగినట్లు తెలుసుకున్న కోమటిగూడెం వాసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడి చేసిన వ్యక్తిని కొట్టడంతో అతడికి గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనపై ఉపేందర్రెడ్డి భార్య కవిత త్రిపురారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. ఇద్దరికి గాయాలు పోలీసుల అదుపులో నిందితుడు -
అనారోగ్య కారణాలతో వృద్ధుడి ఆత్మహత్య
చౌటుప్పల్: అనారోగ్య కారణాలతో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన లింగాల రాములు(85)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నెల 2న తిరుపతికి వెళ్లే క్రమంలో హైదరాబాద్లో ఉంటున్న తన వద్ద ఉంటున్న రాములును అతడి కుమారుడు చౌటుప్పల్లో నివాసముంటున్న తన సోదరి సరస్వతి ఇంట్లో వదిలిపెట్టాడు. ఈ నెల 4న పెన్షన్ తీసుకునేందుకు స్వగ్రామమైన తంగడపల్లికి రాములు వెళ్లాడు. ఆదివారం ఉదయం కుమారుడు రాములుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వారికి సమాచారం అందించాడు. వారు వెళ్లి చూడగా ఇంట్లో ఉరేసుకుని రాములు మృతిచెంది ఉన్నాడు. మృతుడి కుమారుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఉరేసుకుని వ్యక్తి..పెన్పహాడ్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగారెడ్డిపాలెంకు చెందిన గునగంటి జనార్దన్(36) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులను సంప్రదించగా స్పందించలేదు. అప్పుల బాధతో యువకుడి బలవన్మరణంపెద్దఅడిశర్లపల్లి: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ అరవింద్(27) అప్పుల బాధ తాళలేక ఆదివారం పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామంలోని పుష్కర ఘాట్ వద్ద పురుగుల మందు తాగాడు. అనంతరం భార్యకు వీడియోకాల్ చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే పుష్కర ఘాట్ వద్దకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అరవింద్ను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిమిర్యాలగూడ టౌన్: వ్యవసాయ బావి వద్ద గడ్డి కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ గ్రామ సమీపంలో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బతండా గ్రామానికి చెందిన రైతు మాలోతు భద్రు(60) ఆదివారం శ్రీనివాస్నగర్ గ్రామ సమీపంలో గల మాలోతు బాలు పొలంలో పచ్చగడ్డి కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కొడవలి పక్కనే ఉన్న బోరు మోటారు వైరుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. భధ్రు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెతుక్కుంటూ వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు మాలోతు లచ్చుసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్
నల్లగొండ: నకిలీ మద్యం తయారుచేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 600 లీటర్ల స్పిరిట్, మరో 660 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం నల్ల గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి జానీపాషా గతంలో హైదరాబాద్లోని చైతన్యపురిలో మటన్ షాప్లో పనిచేసేవాడు. అతడికి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్కు చెందిన శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. అదే క్రమంలో 2016లో శ్రీనివాస్ బావమర్ది అయిన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీనివాస్గౌడ్తోనూ పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్గౌడ్ కర్ణాటక నుంచి ముడిసరుకు తెచ్చి హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం తయారు చేస్తుండటంతో 2019లో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల క్రితం శ్రీనివాస్గౌడ్ కర్ణాటక నుంచి హైదరాబాద్లో ఉంటున్న జానీపాషాకు ఫోన్ చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోతుందని, కావున ఏదైనా అనువైన ప్రదేశం చూపితే నకిలీ మద్యం తయారు చేస్తానని చెప్పాడు. దీంతో జానీపాష తనకు పరిచయస్తులైన నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన ఎర్రజెల్ల రమేష్, దోమలపల్లి యాదగిరి అలియాస్ మంగళగిరికి విషయం చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో గల ఎర్రజెల్ల రమేష్కు చెందిన తోటలో నకిలీ మద్యం తయారుచేద్దామని నిర్ణయించుకున్నారు. క్యాన్లలో నకిలీ మద్యం నింపి.. జానీపాషా, రమేష్, యాదగిరి కలిసి శ్రీనివాస్గౌడ్తో మాట్లాడి ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో నకిలీ మద్యం తయారుచేసేందుకు నిర్ణయించుకుని 5 డ్రమ్ముల స్పిరిట్ తెచ్చి తోటలో పెట్టారు. ముగ్గురు కలిసి రూ.6లక్షలు శ్రీనివాస్గౌడ్కు ఇచ్చారు. శ్రీనివాస్గౌడ్ చెప్పిన విధంగా ముగ్గురు కలిసి 40 బిస్లరీ క్యాన్లు తీసుకొచ్చారు. 2 స్పిరిట్ డ్రమ్ముల్లో శ్రీనివాస్గౌడ్ తెచ్చిన 3 రకాల ఫ్లేవర్స్ను కలిపి కల్తీ మద్యాన్ని తయారు చేశారు. ఈ నకిలీ మద్యాన్ని 40 బిస్లరీ క్యాన్లలో(ఒక్కోటి 20 లీటర్లు) నింపి 2, 3 రోజులు పులియబెట్టి తర్వాత ఒక్కో క్యాన్ రూ.10 వేలకు విక్రయించాలని శ్రీనివాస్గౌడ్ చెప్పాడు. అలా ఈ ముగ్గురు కలిసి మునుగోడులోని వైన్ షాపుల్లో పార్ట్నర్ అయిన జాజుల వెంకటేష్ను కలిసి మద్యం సరఫరా చేస్తామని చెప్పగా.. ప్యాకింగ్ సరిగ్గా లేదని అతడు తిరస్కరించారు. ఆ తర్వాత ఎర్రజెల్ల రమేష్ వారి అత్తగారి ఊరైన కనగల్ మండలం జి.ఎడవల్లిలో తనకు పరిచయమున్న బొమ్మరబోయిన భార్గవ్ను సంప్రదించగా అతడు రూ.10వేలు ఇచ్చి 20 లీటర్ల క్యాన్లు 4 తీసుకుని.. తనకు తెలిసిన బెల్ట్ షాపుల నిర్వాహకులను సంప్రదించగా వారు కూడా తీసుకునేందుకు నిరాకరించారు. జానీపాషా డ్రైవర్ సాయం ఉపేంద్రకు డబ్బులు ఇస్తామని చెప్పి.. నకిలీ మద్యాన్ని ఆటోలో తాము చెప్పిన ప్రాంతానికి చేరవేయాలని చెప్పారు. ఈవిధంగా కల్తీ మద్యం తయారు చేసి సరఫరా చేసే క్రమంలో పక్కా సమాచారం మేరకు వీరిని పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. వీరిపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎర్రజెల్ల రమేష్, మహ్మద్ జానీపాషా, సాయం ఉపేంద్ర, జాజుల వెంకటేష్, బొమ్మరబోయిన భార్గవ్ను అరెస్ట్ చేశామని, శ్రీనివాస్గౌడ్, దోమలపల్లి యాదగిరి అలియాస్ మంగళగిరి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా చండూరు మండలం దుబ్బగూడెం గ్రామంలో 20 క్యాన్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకుని చండూరు ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక, టాస్క్ఫోర్స్ సీఐ రమేష్బాబు, ఎస్ఐలు మహేందర్, శివప్రసాద్, నాంపల్లి సీఐ రాజు ఆధ్వర్యంలో నేరస్తులను పట్టుకున్న ఎస్ఐ శోభన్బాబు, నాంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎక్సైజ్ పోలీసులను ఎస్పీ అభినందించారు. 600 ÎrÆý‡Ï íܵÇsŒæ, 660 ÎrÆý‡Ï ˘ నకిలీ మద్యం స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ప్రమాదవశాత్తు వరికోత మిషన్ దగ్ధం
కేతేపల్లి: వరి పంట కోస్తుండగా ఇంజన్లో మంటలు చెలరేగి హార్వెస్టర్(వరికోత మిషన్) దగ్ధమైంది. ఈ ఘటన కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెర్కుపల్లి గ్రామానికి చెందిన చినబోయిన చిరంజీవికి చెందిన చైన్ హార్వెస్టర్తో శనివారం రాత్రి స్థానిక రైతు పొలం కోస్తుండగా ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడి మంటలు లేచాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి వరికోత మిషన్కు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న నకిరేకల్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. హార్వెస్టర్కు అంటుకున్న మంటలను ఆర్పినప్పట్టికీ అప్పటికే యాభైశాతం మేర కాలిపోయింది. యాసంగి వరికోతలు ప్రారంభం కావటంతో హార్వెస్టర్ ఇంజన్కు ఇటీవలే మరమ్మతులు చేయించినట్లు తెలిసింది. -
అంబేడ్కర్కు నివాళి
భువనగిరిటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఆదివారం జిల్లా కేంద్రంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. భువనగిరిలోని అంబేడ్కర్ విగ్రహానికి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు హక్కులను పొందగలుగుతున్నా మని పేర్కొన్నారు. అనంతరం సాంస్కృతిక సారధి అధ్వర్యంలో నిర్వహించిన ఆటా పాట అలరించింది. భువనగిరిలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు