breaking news
Krishna
-
13న ఇండో–అమెరికన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి నిరసన
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇండో– అమెరికన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు 13న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించి కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయతలపెట్టడాన్ని రైతుసంఘం ఖండిస్తోందన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు నిరసనగా ప్రజలు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టుల పేరుతో సేకరించిన భూ వివరాలతో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఆచరణ యోగ్యం కాని భారీ ఖర్చుతో కూడుకున్న పోలవరం– బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరైంది కాదన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జములయ్య, రైతుసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడు యల్లమందరావు పాల్గొన్నారు. -
అమృత్ భారత్ స్టేషన్ల పనులు వేగిరం చేయాలి
దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎం ఎన్.రమేష్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) ఎన్.రమేష్ అధికారులను ఆదేశించారు. విజయవాడ డివిజన్ కమర్షియల్ విభాగం పనితీరు, గూడ్స్షెడ్ల అభివృద్ధి, అమృత్ భారత్ స్టేషన్ పనుల పురోగతిపై గురువారం ఆయన డివిజనల్ కార్యాలయంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, ఫ్రైట్ సర్వీసెస్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సాంబశివరావు, ప్యాసింజర్ సర్వీసెస్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ డి.సత్యనారాయణలతో కలసి పీసీసీఎం రమేష్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ డివిజన్ వ్యాప్తంగా పనులు జరుగుతున్న 15 గూడ్స్ షెడ్ల పురోగతిని సమగ్రంగా వివరించారు. వాటిలో ఐదు గూడ్స్ షెడ్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే కార్గో సామర్థ్యం పెరిగి, సరుకు రవాణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. అమృత్ భారత్ స్టేషన్ల పనుల పురోగతిని వివరించి గుర్తించిన అమృత్ భారత్ స్టేషన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేసే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు వివరించారు. డివిజన్లో గూడ్స్ షెడ్లు, స్టేషన్ల పునరాభివృద్ధి పనుల్లో డివిజన్ పురోగతిపై పీసీసీఎం రమేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. అప్రోచ్ రోడ్లు, సీసీటీవీ ఇన్స్టాలేషన్లు, కవర్ ఓవర్ ప్లాట్ఫాం పనులు, గూడ్స్ షెడ్లలో కార్మికుల సౌకర్యాలను వేగవంతం చేయాలని సూచించారు. పనుల సమయంలో అన్ని భద్రత ప్రొటోకాల్స్, పర్యావరణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సరుకు రవాణా ఆదాయం పెంచేందుకు స్థానిక మార్కెట్ డిమాండ్లను విశ్లేషించి ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. రైల్ మదద్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం టీటీఈలతో మాట్లాడి రోజువారీ విధుల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్వీన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, పలువురు బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లు కాదు స్మార్ట్ బాంబులు
సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ కృష్ణలంక(విజయవాడతూర్పు): అదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు వినియోగదారుల పాలిట స్మార్ట్ బాంబులని సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ భవనలో విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం స్మార్ట్మీటర్లను పెట్టొద్దని కోరుతూ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లతో విద్యుత్ చార్జీలు మరింత భారం కానున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి విద్యుత్ చార్జీల భారంతోనే టీడీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్న సంగతి ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో మరోసారి టీడీపీ ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. అనంతపురం, గుడివాడ, విజయవాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లని వినియోగదారులు ధ్వంసం చేశారని తెలిపారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ ధరలను కూడా వినియోగదారులే చెల్లించాలన్నారు. వాడుకున్న యూనిట్ ధరలే కాకుండా, అదనంగా ఇంధన చార్జీలు, సుంకాలు, ట్రూఅప్ చార్జీలు, నిర్వహణ చార్జీలల పేరుతో వినియోగదారుల నడ్డి విరిచే ప్రయోగమే స్మార్ట్ మీటర్లని ఎద్దేవా చేశారు. న్యూడెమోక్రసీ నగర నాయకురాలు పద్మ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ఉద్యమంలో మహిళలు ముందుండాలని పిలుపునిచ్చారు. రెడ్ఫ్లాగ్ పార్టీ నాయకుడు మరీదు ప్రసాద్బాబు మాట్లాడుతూ మరో విద్యుత్ ఉద్యమం తప్పదని, ఆగస్టు 5న విద్యుత్ ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. అనంతరం వక్తలు పలు తీర్మానాలు చేయగా సమావేశం ఆమోదించింది. మండలాలు, పట్టణాల్లో మీటింగ్లు జరపాలని, ఈ నెల 29 వరకు కరపత్రాలు పంపిణీ చేయాలని, సంతకాల సేకరణ, ఇంటింటి ప్రచారం, 30 నుంచి ఆగస్టు 4 వరకు సమావేశాలు, పాదయాత్రలు, ప్రచారం, ప్రభాత భేరీలు నిర్వహించాలని, ఆగస్టు 5న విద్యుత్ సబ్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు, ఆందోళనలు చేయాలని తీర్మానాలు చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వెంకటేశ్వరరావు, ఎన్సీహెచ్ శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జాషువా సాహిత్యం అజరామరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రచనలు చేసిన ఆధునిక కవుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన గుర్రం జాషువా సాహిత్యం అజరామరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ కొనియాడారు. నవయుగ కవి చక్రవర్తి జాషువా వర్ధంతి సందర్భంగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర లయోలా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో లయోల కాలేజీలో గురువారం జాషువా జీవిత చరిత్రపై కవి సమ్మేళనం, గుర్రం జాషువా సాహిత్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన గొప్ప రచయిత అని అన్నారు. సాహితీవేత్త, న్యాయవాది డాక్టర్ వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ ఎనిమిది నాటకాలు, మూడు నవలలు, ఏడు ఖండ కావ్యాలు రచించిన జాషువా చిరస్మరణీయుడన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆమంచి అంజయ్య, డాక్టర్ ఎంఎస్కే షా, ఎం.అంజయ్య, కాకాని ప్రకాష్లకు గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అందె శ్రీనివాసులు, నిర్వాహకులు కె.మురళీమోహన్ రాజు, లయోల కాలేజీ ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ ఎన్.మెల్కియోర్ ఎస్జె, లెక్చరర్ డాక్టర్ కోలా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఘనంగా జాషువా సాహిత్య పురస్కారాల ప్రదానం -
ఉప్పొంగుతున్న ఏటిపాయ
కంకిపాడు: వరదనీటితో ఏటిపాయ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గురువారం నాటికి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మండల పరిధిలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద ఏటిపాయ వరదనీటితో ఉధృతంగా పొంగి పొర్లుతోంది. వరదనీరు ఉరకలు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. కోతకు గురైన అంతర్గత రహదారి కృష్ణానది ఏటిపాయలో మద్దూరు వద్ద పుచ్చలలంక ప్రాంతానికి రైతులు, కూలీలు వెళ్లేందుకు వీలుగా రహదారి మార్గం నిర్మించుకున్నారు. వరదనీటి ఉధృతితో అంతర్గత రోడ్డు కోతకు గురైంది. పలు చోట్ల రోడ్డు గండ్లు పడింది. ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు మరింత ధ్వంసమయ్యే పరిస్థితి ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఏటిపాయలో నీటి ఉధృతిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. పూర్తిగా స్తంభించిన రాకపోకలు రెండురోజులుగా ఏటిపాయలోకి రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ఏటిపాయ రోడ్డు గండ్లు పడి ధ్వంసం కావటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏటిపాయలోకి పొలం పనులకు సైతం రైతులు, కూలీలు వెళ్లలేని పరిస్థితి. పశువుల కాపరులు, జీవాల పెంపకందారులు ఏటిపాయ ఒడ్డున జీవాలు, పశువులకు మేతకు తీసుకెళ్తున్నారు. రోడ్డు ధ్వంసం కావటంతో ఏటిపాయలోని లంక భూములతో పాటుగా ఏటిపాయ గుండా అవతలి వైపున గుంటూరు జిల్లా గొడవర్రు, వల్లభాపురం, కొల్లిపర ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఏటిపాయలో నీటి ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తహసీల్దార్ వి.భావనారాయణ నేతృత్వంలో అధికారులు ఏటిపాయను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తోడేళ్లదిబ్బలంకకు పడవలో రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు నీటి ఉధృతికి ధ్వంసమైన రహదారి నిలిచిన రాకపోకలు సమీక్షిస్తున్న రెవెన్యూ యంత్రాంగం తోట్లవల్లూరు: కృష్ణమ్మ పరవళ్లు తోట్లవల్లూరును తాకాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న మిగులు నీటిని విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్న విషయం విదితమే. దీంతో మండలంలోని రొయ్యూరు రేవుకు బుధవారం రాత్రే వరద నీరు చేరుకుంది. కృష్ణానదికి వరద నీటి రాకతో లంకలకు వెళ్లే తాత్కాలిక రహదారులు కోతకు గురై నీట మునిగాయి. వరద రాకతో పాములలంక, తోట్లవల్లూరు, రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బలంకతో పాటు పలు లంక గ్రామాలకు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. కృష్ణానదికి వరద రాక దృష్ట్యా లంక గ్రామాల ప్రజలు, కరకట్ట వెంబడి గ్రామాల రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.కుసుమకుమారి సూచించారు. -
విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధనను అందించడంతో పాటు సృజనాత్మక శక్తిని వెలికితీసేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో ఎ.కొండూరు, రెడ్డిగూడెం, గంపలగూడెంలలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో మైనార్టీ విద్యార్థులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐకాన్ స్కూల్స్ మార్చేందుకు చర్యలు పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) ద్వారా జిల్లాలోని 29 పాఠశాలలను ఎంపిక చేసి మూడు దశలలో ఐకాన్ స్కూల్స్గా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ. 6.72 కోట్లు మంజూరు చేసి రూ.4.72 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. ఇప్పటికే రూ.2.32 కోట్ల విలువైన పనులను పూర్తిచేశామన్నారు. ఆయా స్కూల్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు మెరుగైన పరిశోధనలు చేసేలా, వినూత్న ఆలోచనలను కార్యరూపమిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వారికి అవసరమైన ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, సీఎంవో ఎన్.చంద్రశేఖర్, ఏఎంవో ఎస్.అశోక్బాబు, అసిస్టెంట్ ఏఎంవో శిరీష, ప్రోగ్రాం ఆఫీసర్ ఏవీవీ ప్రసాద్బాబు తదితరులు ఉన్నారు. -
ఆన్లైన్లో ఇంటి పన్ను చెల్లింపులు
డీపీఓ లావణ్య కుమారి నున్న(విజయవాడరూరల్): స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో జరిగే ఇంటి పన్ను చెల్లింపులు వచ్చే(ఆగస్టు) నెల నుంచి ఆన్లైన్లో జరుగుతాయని జిల్లా పంచాయతీ అధికారి పి.లావణ్య కుమారి తెలిపారు. గురువారం నున్న గ్రామ పంచాయతీ రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వివరాలను, ఇంటి యజమాని పేరు, ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం జరిగిందనే వివరాలను ఆన్లైన్ చేస్తారన్నారు. ఇంటి యజమానులే ఆన్లైన్లో ఇంటి పన్ను, నీటి పన్ను, గ్రంథాలయం పన్ను, డ్రెయినేజీ పన్ను చెల్లించుకోవచ్చునన్నారు. ఈ విధానం ద్వారా దుర్వినియోగం ఉండదన్నారు. అందుకుగాను 2025–26వ సంవత్సరానికి గాను డిమాండ్లు తయారు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రూ.44 కోట్ల ఇంటిపన్ను గాను రూ.37 కోట్లు వసూలు చేశామన్నారు. ఇక మీదట కొత్తగా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు ఇంటి పన్ను విధింపు ఐజీఆర్ఎస్ను అనుసరించి నిర్ణయిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ విలువను బట్టి ఇంటి పన్ను నిర్ణయిస్తామన్నారు. నేడు కూడా కొనసాగనున్న ఐటీఐ కౌన్సెలింగ్ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఎన్టీ ఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి బుధ, గురు వారాలు నిర్వహించిన కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోయిన వారి కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్ తీసుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలియజేశారు. ఇతర వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లో నేరుగా కాని, 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో కాని సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో 4.38 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు 4.38 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 10.4, విజయవాడ రూరల్లో 9.6, నార్త్లో 7.8, సెంట్రల్, వెస్ట్లో 7.6, ఈస్ట్లో 7.4, గంపలగూడెంలో 6.0, జగ్గయ్యపేటలో 5.2, ఎ.కొండూరులో 4.0, తిరువూరులో 3.6, జి.కొండూరులో 3.4, చందర్లపాడులో 3.4, వీరులపాడులో 3.4, రెడ్డిగూడెంలో 3.2, కంచికచర్లలో 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
1 నుంచి స్వర్ణరథం
నున్న(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి స్వర్ణరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పి.లావణ్యకుమారి తెలిపారు. నున్నలో గురువారం చెత్త సేకరణ పనులను ఆమె పరిశీలించారు. పోలారెడ్డి ఉష ఇంటి వద్ద గ్రామ పంచాయతీ చెత్తను సేకరించే పద్ధతిని పరిశీలించారు. అనంతరం డీపీఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక వాహనంలో పొడిచెత్తను సేకరించి వాటికి నిత్యావసరాలైన ఉల్లి పాయలు, వెల్లుల్లి, అల్లంలాంటివి ఇస్తారని తెలిపారు. గుంటూరు జిల్లాలో అమలుచేస్తున్నట్లు విజయవాడ రూరల్ మండలం నున్న, రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో స్వర్ణ రథం కార్యక్రమాన్ని పైలెట్ మండలంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో రూరల్ డెప్యూటీ ఎంపీడీఓ మన్నే వెంకట దుర్గాప్రసాద్, నున్న పంచాయతీ కార్యదర్శి సురేష్బాబు సిబ్బంది పాల్గొన్నారు. నిత్యావసరాల బ్లాక్మార్కెట్పై నిఘా పెట్టాలిగాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యావసరాల బ్లాక్మార్కెట్పై నిఘా పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. జేసీ చాంబర్లో గురువారం జేసీ ఇలక్కియ అధ్యక్షతన జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని రైతుబజార్లు, హోల్ సేల్, రిటైల్ షాపులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం నిత్యావస సరుకుల ధరలు స్థిరంగా ఉన్నాయని, పచ్చి శనగపప్పు ధర విషయంలో కొద్దిగా పెరిగినట్లు గమనించి దాల్ మిల్లర్లు, వర్తకులకు ధర తగ్గింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. టమాట ధరలు పెరిగితే చిత్తూరు జిల్లా నుంచి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అందించాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో ఎ.పాపారావు, జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి బి. రాజాబాబు, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రైసు మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్భయంగా, నిజాయతీతో విధులులబ్బీపేట(విజయవాడతూర్పు): విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయతీతో వ్యవహరించాలని ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సూచించారు. విశాఖపట్నం రేంజ్ గ్రేహౌండ్స్లో శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ కమిషనరేట్కు కేటాయించిన 54 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు గురువారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం సాధన, పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలను అభినందించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఏసీపీలు బి.ఉమా మహేశ్వరరెడ్డి, డి.పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి, సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక వారంతపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి, సాయినగర్ షిర్డీ (07637) ప్రత్యేక రైలు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు సాయినగర్ షిర్డీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07638) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి సోమవారం రాత్రి 7.35 గంటలకు సాయినగర్ షిర్డీలో బయలుదేరి, మరుసటి రోజు అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. -
సత్ఫలితాలు సాధించవచ్చు
గర్భధారణ సమస్యను ఎదుర్కొంటున్న జంటలు ముందుగా సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించి కారణాలను గుర్తించి తగిన చికిత్స ఎంపికలను చర్చించాలి. మంచి ఏఆర్టీ ల్యాబ్తో సరైన వైద్యుడిని, సౌకర్యాన్ని ఎంచుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. వంధ్యత్వాన్ని పరిష్కరించడంలో జీవనశైలి సర్దుబాట్లు, వైద్య జోక్యం, భావోద్వేగ మద్దతు వంటి బహుముఖ విధానం ఉంటుంది. మా వద్దకు వస్తున్న జంటల్లో చాలా మంది సంతానోత్పత్తి పొందుతున్నారు. – డాక్టర్ హారిక మత్తి, కల్సల్టెంట్ ఫెర్టిలిటీ, ఐవీఎఫ్, విజయవాడ● -
మాతృత్వ మధురిమలేవీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు అమ్మతనం కోసం ఆరాటపడతారు. పసిపాపలు ఇంట్లో సందడి చేయాలని పెద్దలు ముచ్చటపడుతుంటారు. మాతృత్వం అనేది ప్రతి మహిళకు వరం. అయితే నేటి ఆధునిక జీవన శైలి కారణంగా అనేక మంది మహిళలు సంతానలేమి సమస్యతో సతమతమవుతున్నారు. అందుకు వైద్యులు అనేక కారణాలున్నాయంటున్నారు. పిల్లలు పుట్టక పోవడానికి కొందరు మహిళల్లో, మరికొందరు పురుషుల్లో సమస్యలు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్నిచోట్ల భార్యాభర్తలు ఇద్దరిలోనూ సమస్య ఉంటున్నట్లు సంతాన సాఫల్య వైద్యులు అంటున్నారు. శుక్రవారం ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) డే సందర్భంగా ప్రత్యేక కథనం. పెరిగిన వంధ్యత్వం ఒకప్పుడు సంతానలేమి సమస్య 8 నుంచి 10 శాతం మంది జంటల్లో మాత్రమే ఉండేదని లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సమస్యతో సతమతమవుతున్నవారు 15 నుంచి 20 శాతం మంది ఉన్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వారిలో అర్బన్ ప్రాంతాల్లో 20 శాతం వరకూ ఉంటుండగా, రూరల్ ప్రాంతంలో తక్కువగా 8 నుంచి 10 శాతం సంతానలేమితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. సంతానలేమికి పురుషుల్లో 40 నుంచి 45 శాతం లోపాలు ఉంటుండగా, సీ్త్రలలో 50 నుంచి 55 శాతం వరకూ ఉంటున్నట్లు పేర్కొంటున్నారు.ఏం చేయాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామం సమతుల్య ఆహారం తీసుకోవడం, మితమైన వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది. ధూమపానం, మద్యం మానేయడం ధూమపానం, అధికంగా మద్యం తీసుకోవడం పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ అలవాట్లను మానేయాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గర్భధారణకు ముందు కౌన్సెలింగ్ ఫోలిక్యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రారంభించడానికి, వైద్య పరిస్థితులను పరీక్షించడానికి గర్భధారణకు 3 నెలల ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఏడాది ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి ఒత్తిడి హార్మోన్ స్థాయిలు, అండోత్సర్గమును ప్రభావితం చేస్తుంది. మైండ్ఫుల్నెస్, యోగా లేదా థెరపీ వంటి పద్ధతులు ఒత్తిడి తగ్గింపులో సహాయపడతాయి. సంభోగం సమయం క్రమం తప్పకుండా కలవడం, ముఖ్యంగా అండం విడుదల సమయంలో, గర్భధారణ అవకాశాలను పెంచుతుంది. బరువు విషయంలో తక్కువ బరువు, అధిక బరువు ఉన్న వ్యక్తులు సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటారు. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. పెరిగిన సంతానలేమి సమస్య మహిళలతో పాటు, పురుషుల్లోనూ లోపాలు జీవనశైలి కారణమంటున్న వైద్యులు సరైన నియమాలతో మహిళలకు అమ్మతనం నేడు ఐవీఎఫ్ డే -
బంగరు భవితకు బాటలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ వసతులు వినియోగించుకుని విద్యార్థులు బంగరు భవితకు బాటలు వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. గురువారం ఆయన విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా..? ఆహారం నాణ్యత ఎలా ఉంది? వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో 370 మంది విద్యార్థులుండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకొన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యతోపాటు సరైన ప్రవర్తన కూడా ముఖ్యమని.. ఇవి రెండూ ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులను సరైన దారిలో నడిపించడానికి ఇటీవల ప్రభుత్వం మెగా పీటీఎం నిర్వహించిందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కెరీర్ కౌన్సెలింగ్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ వెంట పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం.నరసింహాచార్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ -
లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్ .. 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా దార్శనిక ప్రణాళికల రూపకల్పన జరిగిందని, శాఖల వారీగా కీలక పురోగతి సూచిక (కేపీఐ)లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. గురువారం వ్యవసాయం, మత్స్య, పట్టు పరిశ్రమ, సాంఘిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్ – కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడేలా సీసీఆర్సీ కార్డుల ద్వారా సత్వరం బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంటర్న్షిప్, అప్రెంటీస్తో యువతకు జాబ్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయని.. వీటి ఆధారంగా మెరుగైన కెరీర్ను అందుకునేందుకు వీలుంటుందన్నారు. స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించాలని.. ఇందుకు అందుబాటులో ఉన్న పీఎంఈజీపీ వంటి పథకాలను ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
వానొస్తే నరకమే..
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కూటమి పాలనలో విజయవాడలో రోడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి. వానొస్తే రోడ్లు చెరువులుగా మారుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటుతున్నా నగరంలోని మురుగునీటి కాలువల్లో పూడిక తీయకపోవడం, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చకపోవడంతో కొద్ది పాటి వర్షానికే నగరంలోని రహదారులు నీట మునుగుతున్నాయి. మురుగునీటి పారుదల, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో నగర వాసులు నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు అవస్థలు పడుతున్నారు. ఒక వైపున జోరున వాన, రోడ్లపై నిలిచిన వర్షం నీరు, మరోవైపు స్తంభిస్తున్న ట్రాఫిక్తో నగర వాసులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వర్షం.. డ్రెయినేజీ నీరు పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్, మధుచౌక్, నైస్బార్ జంక్షన్, మైనేని జంక్షన్, రమేష్ ఆసుపత్రి జంక్షన్, చుట్టుగుంట సర్కిల్, సింగ్నగర్ ఫ్లైవోవర్ లోబ్రిడ్జి ఏరియాల్లో వర్షం నీటితో పాటు డ్రెయినేజీ నీరు, యూజీడీ మ్యాన్హోల్స్ నుంచి బయటకు వస్తున్న మురుగునీరు అన్నీ కలిసిపోయి రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. వాహనచోదకులు, పాదచారులు ఈ నీటిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు సైడు కాలువ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. బందరురోడ్డుకు ప్రత్యామ్నాయంగా వాహనచోదకులు ఈ రోడ్డును ఉపయోగిస్తుంటారు. ఈ దారిలో కూడా వ్యాపార సముదాయాలు ఉండటంతో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డులో వానొస్తే రెండు అడుగుల మేర వర్షం నీరు మురుగునీటితో కలిసి ప్రవహిస్తుంటాయి. సుపరిపాలనలో పూడికలు తీసే ఆలోచన ఏదీ! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని సుపరిపాలనలో తొలి అడుగు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ డ్రెయిన్లలో పూడిక తీయించాలనే ఆలోచన రాలేదు. ఇలా చేస్తే కాలువల్లో నీరు సజావుగా ప్రవహించి వర్షం నీరు రోడ్డుపై నిల్వ ఉండదనే ముందుచూపు కూడా కూటమి ప్రజాప్రతినిధులకు లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని రానున్న మరో మూడు రోజుల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనైనా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. జలమయమవుతున్న రహదారులు ఒక వైపు వర్షం...మరో వైపు ట్రాఫిక్ అవస్థలు పడుతున్న ప్రజలు విజయవాడలో పూడికతీయని కాలువలు రోడ్లు మునకే ఎంజీరోడ్డులో బెంజ్సర్కిల్, పంటకాలువ రోడ్డు, డీవీ మనార్ రోడ్డు, ఆటోనగర్ రోడ్డు, మహానాడు రోడ్డు, ఏలూరు రోడ్డు, క్రీస్తురాజపురం రోడ్డు, అజిత్సింగ్నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పైపుల రోడ్డు, లోబ్రిడ్జి ప్రాంతం ఇవి నగరంలోని అత్యంత ప్రధానమైన రహదారులు. కొద్దిపాటి వర్షం కురిసినా ఈ రోడ్లపై వర్షం నీరు నిలిచి చెరువులుగా మారుతున్నాయి. దీనికితోడు మురుగుకాలువల్లో నీరు దీనిలో కలిసిపోవడంతో పాదచారులు, వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు. -
గ్రంథాలయాలు ఉన్నంతకాలం అయ్యంకి సజీవులే
పటమట(విజయవాడతూర్పు): ప్రజలకు విజ్ఞానాన్ని అందించడానికి పరిశ్రమించిన అయ్యంకి వెంకట రమణయ్య గ్రంథాలయాలు ఉన్నంతకాలం సజీవంగా ఉంటారని ఏపీ పౌర గ్రంథాలయాల సంచాలకుడు ఎ. కృష్ణమోహన్ అన్నారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య 135వ జయంతి సందర్భంగా ఏపీ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యాన గురువారం సర్వోత్తమ గ్రంథాలయంలోసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రంథాలయాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించడానికి భిన్న మార్గాలను ఎంచుకొని పట్టుదలతో అన్నింటిలో విజయాలను సాధించిన అయ్యంకిని ప్రతి గ్రంథాలయ కార్యకర్త, గ్రంథపాలకుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ వందేళ్ల క్రితమే ఎంతో ముందు చూపుతో గ్రంథాలయ, విజ్ఞాన రంగాల ప్రగతికి బాటలు వేసిన అయ్యంకిని సమాజ దార్శనికుడు అన్నారు. ఏపీ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ మహనీయుల చరిత్రలు జాతిని ప్రభావితం చేస్తాయని చెప్పారు. గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద మాట్లాడుతూ జాతీయోద్యమ కాలంలో గ్రంథాలయాలతో ప్రజలు స్ఫూర్తిపొందారన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో 11 కాలేజీల విద్యార్థులు పోటీ పడగా, ప్రథమ స్థానాన్ని దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ద్వితీయ స్థానాన్ని మారిస్టెల్లా కళాశాల, తృతీయ స్థానాన్ని లయోలా కళాశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. పలువురు గ్రంథ పాలకులు, విద్యార్థులు, వివిధ ప్రైవేటు గ్రంథాలయాల నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ముగిసిన ఆషాఢ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో నిర్వహిస్తున్న ఆషాఢ మాసోత్సవాలు గురువారం ముగిశాయి. ఉదయం అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన అర్చకులకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సారెగా పట్టుచీర, పూజా సామగ్రితో పాటు రూ. 4.25 లక్షల విలువైన బంగారు హారాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. సారె సమర్పించిన భక్త బృందాలు ఆషాఢ మాసం చివరి రోజు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో సేవలు అందించిన భక్త బృందానికి చెందిన 500 మంది సారె సమర్పించారు. మరో వైపున వర్షాలు పడుతుండటంతో గురువారం కూడా ఘాట్రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. భక్తులను మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించు కున్నారు. ఆర్జిత సేవలకు డిమాండ్ ఆషాఢ అమావాస్య నేపథ్యంలో దుర్గగుడిలో ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున 3.30 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవకు 50కి పైగా టికెట్లను విక్రయించారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో జరిగే ఖడ్గమాలార్చనకు డిమాండ్ అధికం కావడంతో రెండు షిఫ్టుల్లో పూజ చేశారు. రెండు షిప్టుల్లో మొత్తం 30 టికెట్లను విక్రయించగా, అరవై మందికి పైగా పూజలో పాల్గొన్నారు. ఇక చండీహోమానికి ప్రత్యక్షంగా పూజకు 180కి పైగా టికెట్లను విక్రయించగా పరోక్ష సేవగా మరో 86 టికెట్లను విక్రయించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ప్రధాన ఆలయంలో చేసిన స్వర్ణ పుష్పార్చనకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం పంచహారతుల సేవలోనూ ఉభయ దాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుర్గమ్మకు ఆలయ అర్చకుల సారె బంగారు హారాన్ని సమర్పించిన అర్చక బృందం -
కూటమి నేతల ప్లాన్.. మైనర్లతో దొంగల ముఠా తయారీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్మిట్టల్ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్’ ప్లాన్ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. పట్టించిన సిమ్ ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్ఫోన్ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్పై మోజుతో ఓ మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. మంత్రి ఫోన్తో 41ఏ నోటీసులతో సరి..!విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
వేమిరెడ్డిపల్లి తండాలో జ్వరాల విజృంభణ
వేమిరెడ్డిపల్లి(విస్సన్నపేట): మండలంలోని వేమిరెడ్డిపల్లి తండాలో జ్వరాలు విజృంభించాయి. ఇంటికి ఒక్కరు, ఇద్దరు చొప్పున జ్వరాల బారిన పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు నీరు ఇళ్ల ముందే నిల్వ ఉండి దోమలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి జ్వరాలు రావడంతో తిరువూరులో ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నామని, కొంతమందికి టైఫాయిడ్, మరికొంత మందికి కాళ్లు నొప్పులతో జ్వరాలు వస్తున్నాయన్నారు. డీఎంహెచ్ఓ పరిశీలన.. డీఎంఅండ్హెచ్ఓ సుహాసిని బుధవారం వేమిరెడ్డి పల్లి తండాను సందర్శించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాచివడపోసిన నీరు తాగాలన్నారు. వైద్యశిబిరంలో జ్వరాలతో బాధపడేవారిని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంఓ మోతీబాబు, ఎస్హెచ్ఓ బాబావలి, మండల వైద్యాధికారి శ్రీనివాసరావు, డాక్టర్ అశ్వినీదత్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలకు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని అన్న మంత్రి అచ్చెనాయుడు వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు బుధవారం ఓప్రకటనలో ఖండించారు. అచ్చెన్నాయుడు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామన్న ప్రధాన ఎన్నికల హామీని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆ పార్టీకి మహి ళలపై, ఎన్నికల వాగ్దానాలపై చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆడబిడ్డలకు ఆసరా, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, చేయూత పథకాలు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మహిళలకు లబ్ధ్ది చేకూరేలా చేశారని కొనియాడారు. మహిళలపేరు మీదే ఇంటి పట్టాలు, సంక్షే పథకాలు అమలు చేశామన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అబద్ధాలాడి, సూపర్ సిక్స్ పథకాలతో మోసం చేసి చంద్రబాబు గెలిచారన్నారు. గెలిచిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారా అని ఎవరైనా ప్రశ్నిస్తే అప్పు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే చెవిలో చెప్పమనడం వంటి మాటలు చంద్రబాబు వల్లెవేస్తున్నారని, ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్ను అమ్మాలని అచ్చెనాయుడు చెబుతున్నారని ఈ రాష్ట్రానికి, మహిళలకి ఇదేనా వారు ఇచ్చే విలువ అని ప్రశ్నించారు. అమలు కాని హామీలు ఇచ్చి మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఆంధ్రను అమ్మాలంటే అంత హాస్యంగాను, అపహాస్యంగా కనబడుతోందా అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకం
పెనమలూరు: లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నికై న లయన్ పర్వతనేని శుభాష్బాబును పోరంకి లయన్స్ సేవాభవన్లో బుధవారం జరిగిన కార్యక్ర మంలో ఘనంగా సన్మానించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ శాఖలో మూడు దశాబ్దాల పాటు ఇంజినీర్గా సేవలు అందించి, లయన్గా సేవా కార్యక్రమాలు చేసి 24 ఏళ్ల తరువాత ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నికవటం గర్వకారణమన్నారు. ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా చేసి లయన్స్క్లబ్లో సేవలు అందించి పేదల కోసం సేవా కార్యక్రమాలు చేసిన శుభాష్బాబుకు పదవి రావటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్లో వివిధ హోదాల్లో ఉన్న మూల్పూరి ఉపేంద్ర, ఆంజనేయులు, పాపారావు, కె.రమణారావు పాల్గొన్నారు. -
వయసులో మైనర్లు.. చోరీల్లో మేజర్లు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆ ముగ్గురు ఒకే ప్రాంతానికి మైనర్లు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ రోజూ బడికి వెళ్లొచ్చే విద్యార్థులు. ఇది వారి తల్లిదండ్రులకు, ఆ ఊరి జనానికి తెలిసిన విషయం. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తుంటే తల్లిదండ్రులతో పాటు ఊరి జనం అభంశుభం తెలియని పిల్లలను ఏదో కేసులో ఇరిక్కించే ప్రయత్నం చేస్తున్నారని భయపడ్డారు. ఆ పిల్లలను పోలీసుల నుంచి రక్షించాలని ఊరి పెద్దలు సైతం ప్రయత్నించారు. ఆ ముగ్గురు బాలురు చేసిన నేరాలకు సంబంధించి రూ.లక్షల్లో సొత్తును పోలీసులు రికవరీ చేసి చూపించటంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ కేసు వివ రాలను బందరు డీఎస్పీ సీహెచ్.రాజ బుధవారం మచిలీపట్నం పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. బందరు మండలం మేకవానిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్కు చెందిన ఇద్దరు మైనర్లు ఎనిమిదో తరగతి, మరొకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఆ ముగ్గురు ఆన్లైన్ క్రికెట్ పందేలకు అల వాటుపడ్డారు. పందేలకు డబ్బు కావాలంటే దొంగ తనాలే మార్గమని నిర్ణయించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చిలకలపూడి, సర్కారుతోట, విశ్వబ్రాహ్మణకాలనీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రెక్కీ నిర్వహించటం మొదలుపెట్టారు. పగలు స్కూలు, కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో తాళాలు వేసివున్న ఇళ్లను గుర్తించేవారు. ఆర్టీసీ కాలనీకి చెందిన మహంకాళి గురు తేజశర్మ ఇంటిలోని మరో పోర్షనులో మోపిదేవి వెంకటసత్యశ్రీనివాసు నివసిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన వారిద్దరి ఇళ్లలో చొరబడిన ముగ్గురు బాలురు సుమారు 100 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.1.12 లక్షల నగదు అపహరించారు. సర్కారుతోటలో మరో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి నగదు మాయం చేశారు. గురుతేజశర్మ, సత్యశ్రీనివాసులు మచిలీ పట్నం పోలీసులకు, సర్కారుతోటకు చెందిన బాధితులు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులను ఛేదించేందుకు డీఎస్పీ సీహెచ్ రాజ క్రైం టీం సిబ్బందిని రంగంలోకి దింపారు. క్రైం టీం సిబ్బంది మచిలీపట్నం ఎస్ఐ నేతృత్వంలో మైనర్లు గురుతేజశర్మ ఇంట్లో చోరీ చేసిన సెల్ఫోన్లో సిమ్ మార్చి వినియోగించడాన్ని గుర్తించారు. చోరీకి పాల్పడిన మైనర్లను అదుపులోకి తీసుకుని, మంచి మాటలతో కౌన్సెలింగ్ ఇవ్వగా వారు చేసిన నేరాలకు ఒప్పుకున్నారు. మైనర్లు చోరీ చేసిన సుమారు రూ.10 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులను వెంటనే రికవరీ చేసి అధికారుల ఎదుట ఉంచారు. ముగ్గురు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. కేసును ఛేదించిన క్రైం పార్టీ సిబ్బంది ఏఎస్ఐ జె.శ్రీనివాసు, హెచ్సీ కె.శ్రీనివాసరావు, పీసీలు జి.కోటేశ్వరరావు, జి.రామ కృష్ణతో పాటు మచిలీపట్నం ఎస్ఐ బి.ప్రభాకరరావు, పీసీ బి.శ్రీనివాసరావును డీఎస్పీ అభినం దించి, ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు పాల్గొన్నారు. పగలు రెక్కీ, రాత్రి వేళ చోరీలు చేస్తున్న వైనం 100 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి చోరీ ముగ్గురు బాలురిని అదుపులోకి తీసుకున్న క్రైం పోలీసులు చోరీకి గురైన వస్తువులను రికవరీ చేసిన సిబ్బంది -
జెడ్పీ చైర్ పర్సన్ దంపతులకు బైరెడ్డి పరామర్శ
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము దంపతులను శాప్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి పరామర్శించారు. బుధవారం రాత్రి 7 గంటలకు కృష్ణా జిల్లా పెడన మండలం కృష్ణాపురం గ్రామంలోని రాము నివాసానికి చేరుకున్న ఆయన వారితో మాట్లాడారు. ఈ నెల 12న గుడివాడలో టీడీపీ, జనసేన పార్టీకు చెందిన గూండాలు దాడి చేసిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనల వీడియోలను చూసిన ఆయన క్యాబినెట్ ర్యాంకు మహిళపై అమానుషంగా దాడి చేస్తున్న వారిని నిలువరించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇటువంటి దాడులను సహించేది లేదని, ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈయనతో పాటు వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఇతర నాయకులున్నారు. బైరెడ్డి పెడన వస్తున్నారని తెలిసి వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
అందని జీతం.. వెతలే సమస్తం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకూ జీతాలు అందలేదు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ‘జీతాలు ఇవ్వండి మహాప్రభో...’ అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలోనే ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ ముగిసింది. పలువురు టీచర్లకు వారు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి పొజిషన్ ఐడీలు రాలేదు. దీంతో ప్రభుత్వం వారి జీతభత్యాలను నిలిపివేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ పాఠశాలకు, ఎక్కడ స్థానానికి బదిలీ అయ్యారో దానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. అప్పుపడే సీఎప్ఎంఎస్లో వారి వివరాలు నమోదవుతాయి. అప్పుడు మాత్రమే వేతనాలు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. పోజిషన్ ఐడీ ఇవ్వటంలో ఆలస్యం కారణంగా బదిలీ అయిన ఉపాధ్యా యులు ఇప్పటి వరకూ జీతం అందుకోలేదు. మూడు వేల మందికి అందని జీతాలు! ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాపితంగా సుమారు నాలుగు వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వారిలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సమానస్థాయి కేడర్ ఉపాధ్యాయుల, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, ఆర్ట్/ డ్రాయింగ్ / క్రాఫ్ట్ / మ్యూజిక్ / ఉపాధ్యాయులు తదితర కేడర్లలో ఉన్న వారిలో సుమారుగా నాలుగు వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడటంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల రోజులు కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా సుమారుగా మూడు వేల మంది ఉపాధ్యాయులకు జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరికే అందిన వేతనాలు గత ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీఓ 21ను తీసుకొచ్చింది. ఆరు రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్ గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరుకావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లోనూ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈఎంఐలు చెల్లించక... చెక్లు బౌన్స్ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ప్రతి ఒక్కరూ నెల నెలా ఏదో ఒక చెల్లింపు చేస్తుంటారు. చాలా మందికి ఈఎంఐలు ఉంటాయి. అయితే జూన్ మాసం వేతనం జూలైలో పడకపోవటంతో దాదాపుగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ చెక్లు బౌన్స్ అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్లో సాధారణంగా ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వంటి సామగ్రి కోసం రూ.వేలల్లో చెల్లించాల్సి ఉంటుంది. బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అయిన టీచర్లకు అందని జీతాలు వచ్చే నెలలో అయినావస్తుందో లేదోనని అనుమానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 వేల మందికిపైగా ఎదురుచూపులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్న ఉపాధ్యాయ సంఘాలు సమస్యను తక్షణం పరిష్కరించాలి ఉపాధ్యాయుల పొజిషన్ ఐడీల సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి. బదిలీ అయిన చాలా వేలాది మందికి ఐడీలు రాక జూన్ మాసం జీతం అందలేదు. చాలా బంది బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకూ ఐడీలు రాకపోవటంతో బిల్లులు తయారు కాలేదు. దీని వల్ల వచ్చే నెలలోనూ జీతాల విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకొని స్పందించాలని విజ్ఞప్తి. – ఎ.సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యుటీఎఫ్, ఎన్టీఆర్జిల్లా జూలై జీతం సైతం అనుమానమే జూలై మాసానికి సంబంధించిన జీతాలు బిల్లులు అధికారులకు సమర్పించేందుకు గడువు సమీపించింది. ఇప్పటి వరకూ కొత్తగా ఐడీలు రావాల్సిన వారికి ఇంతవరకూ అందలేదు. ఐడీలు వచ్చిన తరువాత బిల్లులు తయారు చేయాల్సి ఉంటుంది. జూలై 25వ తేదీ లోపు బిల్లులు సమర్పిస్తేనే వాటికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి ట్రెజరీకి పంపటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ ఐడీలు రాకపోవటంతో వచ్చే నెలలోనూ జీతాలు అందు తాయో లేదోననే సందేహంలో ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఈ విధమైన ఇబ్బందులతో ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షిస్తుందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ల వద్ద పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. ఈ సందర్భంగా పవన్.. ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మచిలీపట్నంలోని రేవతి ధియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి థియేటర్ వద్ద రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారిని కట్టడి చేయలేక పోలీసులు.. లాఠీలకు పని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియెలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మచిలీపట్నంలోని రేవతి ధియేటర్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోకి పరిమితికి మించి అభిమానులు థియేటర్కు వచ్చారు. దీంతో, పోలీసులు.. వారిని కట్టడి చేయలేకపోయారు. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తోసుకుంటూ థియేటర్లోకి చొచ్చుకొచ్చారు. దీంతో, థియేటర్ ఎంట్రన్స్ గేటు గ్లాస్ ధ్వంసమైంది. అంతటితో ఆగకుండా.. ఫ్యాన్స్ తోసుకుంటూ ఒకరిపై మరొకరు వాటర్ క్యాన్లతో దాడి చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీలకు పని చెప్పడంతో పరిస్థితి కొంత సర్దుమణిగింది.ఇక, కడప నగరంలోని రాజా థియేటర్ వద్ద కూడా పవన్ ఫాన్స్ హంగామా సృష్టించారు.. బైక్ సౌండ్స్తో రచ్చ రచ్చ చేశారు. బైకుల సైలెన్సర్లు తీసి నగరంలో బైక్ రైడింగ్తో హంగామా చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలుగా విడిపోయి ఫ్యాన్స్ కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు సర్దిచెప్పినా పవన్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో, థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. సంధ్య థియేటర్ వద్ద భారీ బందోబస్తు..ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా చేశారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
మచిలీపట్నం: యూ ట్యూబ్ వీడియోలు చూసి..
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో యూ ట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు ముగ్గురూ 9వ తరగతి విద్యార్థులే. వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడిన మైనర్లు.. రెండు నెలల్లో నాలుగు దొంగతనాలు చేశారు. ఆ ముగ్గురు నుంచి రూ.10 లక్షల 20 వేలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుర్ల నుంచి చోరీ సొత్తును కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. జువైనల్ హోంకు తరలించారు. మైనర్ల నుంచి చోరీ వస్తువులు కొనుగోలు చేసిన ఇద్దరికి నోటీసులిచ్చి వదిలేశారు. కాగా, చోరీ చేసిన సొత్తును కొన్నవారికి 41 నోటీసులిచ్చి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
క్లస్టర్ టీచర్లతో మేలు
క్లస్టర్ టీచర్లతో బోధనా కార్యక్రమాలు ప్రభావవంతంగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో క్లస్టర్ టీచర్లలో ఒక్కరైనా ఖాళీగా ఉండటం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లినప్పుడు, క్లస్టర్ టీచర్లను వెంటనే ఆ స్కూళ్లకు పంపిస్తున్నాం. పిల్లల చదువుకు అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులన్నీ భర్తీ చేసి, మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇతర జిల్లాల్లో అవసరమైన చోటకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. – రామారావు, కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి -
కార్తికేయుని సన్నిధిలో విజిలెన్స్ అడిషనల్ డైరెక్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని విజిలెన్స్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఎల్.వి.రమణమూర్తి దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించారు. అర్చకులు బుద్దు సతీష్ శర్మ, మణికుమార్శర్మ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. రమణమూర్తికి ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఈ నెల 24వ తేదీన జరిగే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రస్టులో జరుగుతున్న భద్రతా ఏర్పా ట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ నేతృత్వంలో అధికారుల బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది. గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గీతాంజలిశర్మ ఆదేశించారు. గవర్నర్ పర్యటించే విజయవాడ నుంచి ఆత్కూరు వరకు రహదారి మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి సారించా లని సూచించారు. ఏఎస్పీ సత్యనారాయణ, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా పీ4 అమలు నందిగామరూరల్: పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పీ–4 విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని కేతవీరునిపాడులో నిర్వహిస్తున్న పీ–4 ఇంటింటి సర్వే తీరును ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారన్నారు. జిల్లాలో 86,398 బంగారు కుటుంబాలను గుర్తించగా 3,669 మంది మార్గదర్శకులుగా ముందుకొచ్చి 28,992 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోవటం, బ్యాంకు ఖాతా, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, తదితర వివరాల ఆధారంగా జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వేద శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం ఘంటసాల: మండలంలోని తాడేపల్లి గ్రామంలోని శ్రీ మలయాళస్వామి పెద్దాశ్రమంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలలో శిక్షణకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆశ్రమం కన్వీనర్ కావూరి కోదండ రామయ్య తెలిపారు. ఆశ్రమం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం, తిరుపతిలోని జాతీయ సంస్కృత కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలలో రెండేళ్ల ప్రాక్ శాస్త్రి (ఎంటీసీ) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వసించే అన్ని కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కోర్సులో గణితం, సంప్రదాయ శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు ఉంటాయని, రెండేళ్ల శిక్షణ సమయంలో విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలను యాజమాన్యమే కల్పిస్తుందని తెలిపారు. ఆసక్తిగల అర్హులు ఈ నెలాఖరులోపు దరఖాస్తులు సమ ర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు 70756 65766 సెల్ నంబరులో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో మొవ్వ శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
శ్రావణ మాసం ఎంతో శుభప్రదం..
శ్రావణమాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధిని అందించే మాసంగా పురాణాల్లో పేర్కొన్నారు. వైష్ణవారాధనతో పాటు మహా శివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 26 నుంచి నవంబర్ 27 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. తిరుపతమ్మ ఆలయంలో ఈమాసంలో పదుల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. – శివరాంభొట్ల ఆంజనేయశర్మ, తిరుపతమ్మవారి ఆలయ పురోహితుడు -
ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాల్వలు, చెరువుల వెంట ఆక్రమణలను గుర్తించి, తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఎన్టీఆర్ జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో జిల్లా వాచ్డాగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జీవో నంబర్ 386లో నిర్ధేశించిన విధంగా నీటి వనరులు, చెరువుల బెడ్లను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జిల్లా స్థాయి వాచ్డాగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ జిల్లాలోని నీటి వనరులు, ట్యాంక్ బెడ్లను గుర్తించి వాటి స్థితిని ప్రతి నెలా సమీక్షించి, ప్రభుత్వానికి రౖతై మాసిక నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రతినెలా నిర్ణీత సమయంలో కమిటీ సమావేశమై ఆక్రమణలను గుర్తించడంతో పాటు తొలగించేందుకు కార్యాచరణ చేపట్టాల్సిందిగా తాజా సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.ఆర్ మొహిద్దీన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, విజయవాడ నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ సంధ్య రత్నకుమార్ పాల్గొన్నారు. అందుబాటులోకి ‘పోస్టల్ అడ్వాన్స్డ్’ సేవలు ఇంటి నుంచే బుకింగ్స్, డెలివరీలకు అవకాశం చల్లపల్లి: అడ్వాన్స్డ్ పోస్టల్ 2.0 ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించనున్నారు. భారత ప్రభుత్వ తపాలా శాఖ మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఈనెల 7వ తేదీన 78, 21వ తేదీన 115 పోస్టాఫీసుల్లో కొత్త టెక్నాలజీని అప్గ్రేడ్ చేశారు. డివిజన్ పరిధిలో ఉన్న అన్ని 193 పోస్టాఫీసుల్లో సేవలు వేగవంతం కానున్నాయి. ఈ సందర్భంగా తపాలా శాఖ మచిలీపట్నం డివిజన్ సూపరింటెండెంట్ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కొత్త సాంకేతికత ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ లెటర్లను, స్పీడ్ పోస్టులను బుక్ చేసుకునే వీలు కలుగుతుందన్నారు. సెల్ఫోన్లో ఎస్ఎంఎస్ ద్వారా గానీ, ఈ–మెయిల్ ద్వారా గానీ బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటును ఈ టెక్నాలజీతో కల్పించారని తెలిపారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఓటీపీ లేదా ఆధార్ ఆధారిత డెలివరీలను ఎంచుకునే వీలుందని చెప్పారు. డోర్ డెలివరీలాగా ఇక నుంచి డోర్ రిసీవింగ్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఆధార్ కార్డులకు సంబంధించిన అన్ని సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బుడమేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం ఈలప్రోలు(ఇబ్రహీంపట్నం): బుడమేరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈలప్రోలు వద్ద పాతవంతెన కింద ముళ్ల కంచెకు పట్టుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పట్టిసీమ నుంచి నీరు విడుదల కావడంతో మృతుడు ఏప్రాంతానికి చెందిన వారై ఉంటారనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రుద్రవరంలో భారీ చోరీ
జి. కొండూరు: ఒక వైపు కుటుంబ పెద్ద మృతితో తీరని శోకంలో ఉన్న ఆ కుటుంబానికి ఇంట్లో జరిగిన భారీ చోరీ మరింత విషాదాన్ని నింపింది. ముగ్గురు కుమార్తెల కోసం దాచుకున్న బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో బాధిత మహిళ లబోదిబోమంటున్నారు. గుండెపోటుతో మృతి చెందిన పాస్టర్ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై ఉండగా ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండల పరిధి రుద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాలు ఇవి.. కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండల పరిధి సీతనపల్లి గ్రామానికి చెందిన పాస్టర్ రెవరెండ్ నల్లగంగుల శుభకరరాజు తన భార్య విమల, నలుగురు కుమార్తెలతో కలిసి రెడ్డిగూడెం మండల పరిధి రుద్రవరం గ్రామంలోని సీఎస్ఐ చర్చిలో పని చేసేందుకు రెండు సంవత్సరాల క్రితం వచ్చారు. ఈ కుటుంబం రుద్రవరం గ్రామంలోనే చర్చి వెనకాల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఒక కుమార్తెకు మాత్రమే వివాహం అయ్యింది. అయితే ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో పాస్టర్ శుభకరరాజుకి గుండెపోటు వచ్చి ఇంట్లోనే మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులు.. తమ బంగారు ఆభరణాలు, రూ.25వేలు నగదును ఇనుప బీరువాలో ఉంచి ఇంటికి తాళ వేసి పాస్టర్ అంత్యక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని తీసుకొని స్వగ్రామం సీతనపల్లి గ్రామానికి అదే రోజు సాయంత్రం వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత 12వ తేదీన తిరిగి రుద్రవరం గ్రామానికి వచ్చారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో పాస్టర్ భార్య విమలకు అనుమానం వచ్చి ఇనుప బీరువా తెరిచేందుకు ప్రయత్నించారు. ఇనుప బీరువా కూడా తాళం పెట్టకుండానే తెరుచుకోవడం, బీరువాలో బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆధారాల్లేవు.. వెంటనే రెడ్డిగూడెం పోలీసులకి సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగులు వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్త పడడంతో క్లూస్ టీంకు సైతం ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఈ చోరీలో రెండు బంగారు గాజులు, ఒక నల్లపూసల గొలుసు, నాలుగు జతల చెవి దిద్దులు, ఒక జత జోకాలు, మూడు పెద్ద ఉంగరాలు, రెండు చిన్న ఉంగరాలు, ఒక జత చెవుల జోడు, చైన్లు రెండు, రూ.25వేలు కరెన్సీ నోట్లు కలిపి మొత్తంగా రూ.13లక్షల విలువ చేసే ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ చోరీ ఘటనపై పాస్టర్ భార్య విమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్నాం.. ఈ ఘటనపై రెడ్డిగూడెం ఎస్ఐ బండి మోహన్రావు వివరణ కోరగా గ్రామంలో అనుమానితులను విచారించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. రూ.13 లక్షల విలువగల బంగారు ఆభరణాలు అపహరణ కుటుంబ పెద్ద మరణంతో సొంత గ్రామానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లో బీరువాలోని ఆభరణాలు మాయం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్న పోలీసులు -
మునిసిపల్ కార్మికుల సమ్మె వాయిదా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా జీతాలు పెంచిందన్నారు. కొన్ని అవకాశవాద సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారి డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేయని కారణంగా పాక్షిక విజయం మాత్రమే సాధ్యమైందన్నారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, 28 రోజులుగా విజయవాడలో డిమాండ్ల పరిష్కారం కోసం సమరశీలంగా పోరాడిన మునిసిపల్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి ఎస్.జ్యోతి బసు, రాష్ట్ర నాయకులు టి.తిరుపతమ్మ, టి.చిన్న, జె.విజయలక్ష్మి, జె.నాగరాజు, నల్ల శ్రీను, కృష్ణవేణి, పద్మ, దుర్గాప్రసాద్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి నాణ్యతపై అప్రమత్తత అవసరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వర్షాకాలం నేపథ్యంలో నగర ప్రజలకు సరఫరా చేసే తాగునీటి శుద్ధి, నాణ్యతా ప్రమాణాలు, సరఫరా వ్యవస్థలో ఎక్కడా లోపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం ఆయన విద్యాధరపురం 38వ డివిజన్ పరిధిలోని డాక్టర్ కేఎల్ రావు మునిసిపల్ హెడ్ వాటర్ వర్క్స్ను సందర్శించి నీటి శుద్ధి, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. నిర్వహణ, ఆధునిక మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైపుల లీకేజీలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిరంతర తనిఖీలతో నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ చీఫ్ ఇంజినీర్ ఆర్. శ్రీనాథ్రెడ్డి, పర్యవేక్షణ ఇంజినీర్ పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అడ్డొచ్చిన పాము.. కాలువలోకి దూసుకెళ్లిన కారు పెనమలూరు: పెదపులిపాక వద్ద కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎటుంవటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం గ్రామానికి చెందిన లంక రవిరాజు పూజారిగా పని చేస్తారు. ఆయన కారులో సోమవారం రాత్రి పెదపులిపాక నుంచి చోడవరం గ్రామానికి బయలుదేరారు. అలా వెళ్తున్న సమయంలో పెదపులిపాక వద్ద రోడ్డుపైకి అకస్మాత్తుగా పాము రావటంతో దానిని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు కేఈబీ కెనాల్లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ కాలువలో నీరు తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించారు. విధులను అంకితభావంతో నిర్వర్తించండి కోనేరుసెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సెక్షన్లోనూ సిబ్బంది రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి అందాల్సిన బెనిఫిట్స్తో పాటు మరణించిన సిబ్బంది కుటుంబాలకు శాఖాపరంగా అందే ప్రయోజనాలు అందే విషయంలో అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏవో ఎంఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
మనసారా.. కొలి‘సారె’
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలు భక్త బృందాలు, ఆలయానికి చెందిన వివిధ విభాగాల సిబ్బంది సారెను సమర్పించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సారెను సమర్పించారు. అర్జున వీధిలోని శృంగేరీ మఠం అన్నదాన భవనంలో తొలుత అమ్మవారికి ఆలయ ఈవో శీనానాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద దేవతా మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. ఆలయ ఏఈవోలు వెంకటరెడ్డి, చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు, కె. గంగాధర్లతో పాటు అన్నదాన సిబ్బంది పాల్గొన్నారు. శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో.. జమ్మిదొడ్డి ఆవరణలోని అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఏఈవోలతో పాటు శానిటేషన్ సిబ్బంది కుటుంబసమేతంగా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ అధికారులు వీరికి సాదరంగా స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 60కి పైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. అర్చకులు ఆశీర్వచనం అందజేసి, ప్రసాదాలను బహూకరించారు. దుర్గమ్మకు సారె సమర్పించిన ఆలయ అన్నదానం, శానిటేషన్ సిబ్బంది -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్లర్ లక్ష్మీశ నందిగామ రూరల్: రైతులు ఉద్యాన పంటలు సాగు చేయటం వల్ల అధిక, సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులు పండిస్తున్న పంటలు.. ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వల్ల అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ముఖ్యంగా వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో పండించటం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తెగుళ్లు, కలుపు మొక్కల వంటి సమస్యలతో పాటు ఎరువుల అవసరమూ తగ్గుతుందని చెప్పారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్లు, పూల మొక్కల సాగు చేపట్టాలని సూచించారు. అగ్రిటెక్పై అవగాహన.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి మంగళ, బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సాగు పరంగా రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి శాస్త్రవేత్తలు, అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందిస్తామని తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచి తద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే వీలుగా కేతవీరునిపాడు గ్రామంలో యానిమల్ హాస్టల్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ హనుమంతరావు, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత.. సాగుకు వెత
తోట్లవల్లూరు/బంటుమిల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు పనులు ఊపందుకున్నాయి. అయితే యూరియా కొరత రైతులను వేధిస్తోంది. వ్యవసాయావసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా లేదు. దీంతో రైతులు సొసైటీల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్ధితి దాపురించింది. తోట్లవల్లూరు మండలంలో లంక గ్రామమైన పాముల లంకను మినహాయిస్తే మిగిలిన 15 గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. 20 రోజులుగా వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వరినాట్లు దాదాపుగా పూర్తికాగా మరికొన్ని గ్రామాల్లో తుది దశలో ఉన్నాయి. బంటుమిల్లి మండలంలో ఏటా ఖరీఫ్లో 11 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. సొసైటీల వద్ద రైతుల పడిగాపులు ఖరీఫ్ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా జరగటం లేదనే ఆరోపణలు రైతుల నుంచి వినవస్తున్నాయి. యూరియా కోసం పీఏసీఎస్ల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలోని నార్తువల్లూరు పీఏసీఎస్ వద్ద రైతులు ఉదయాన్నే సొసైటీకి చేరుకుని క్యూలో నిలబడటం చూస్తే యూరియా కొరత ఎంత ఉందో అర్థమవుతోంది. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో అవసరాలు తీరటం లేదు. దీంతో మళ్లీ బయటి వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి, కంచడం, బర్రిపాడు సొసైటీల్లో ఎకరాల లెక్కన ఆధార్, పాస్ పుస్తకం చూపిస్తే ఎకరాకు ఒకటి, రెండు కట్టల యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఈ యూరియా చాలదని రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు గుళికలు కొంటేనే యూరియా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొంత మంది ఎరువుల వ్యాపారులు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియాను ప్రభుత్వ ధరకు ఇస్తామని స్పష్టంచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సొసైటీల్లో 45 కిలోల యూరియా బస్తా ధర రూ.265 మాత్రమే. 50 కిలోల డీఏపీ ధర రూ.1,350. వ్యాపారుల వద్ద డిమాండ్ను బట్టి యూరియా బస్తా రూ.350, డీఏపీ బస్తా రూ.1400లకు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పర్యవేక్షించాలి.. వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో తోట్ల వల్లూరు మండలంలోని లంకల్లోని వాణిజ్యపంటలు, వరి పొలాల ఎదుగుదలకు రైతులు ప్రస్తుత దశలో యూరియా, డీఏపీ ఎక్కువగా వినియోగిస్తారు. ఈ రెండు ఎరువులకు డిమాండ్ పెరిగి కొరత ఏర్పడటంతో రైతుల అవసరాలకు సరిపడా అందటం లేదు. దీంతో రైతులు బయట వ్యాపారుల వద్ద ఎక్కువ ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సొసైటీలపై దృష్టి సారించాలని, వ్యవసాయావసరాలకు అనుగుణంగా యూరియా, డీఏపీ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల సేవల కోసం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే) అలంకారప్రాయంగా మిగిలాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల్లో పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉండేవి. కూటమి పాలనలో ఎరువుల కోసం తిప్పలు తప్పడంలేదని రైతులు వాపోతున్నారు. ఎరువుల కోసం సొసైటీల వద్ద రైతుల క్యూ ఎకరాకు ఒకటి రెండు కట్టలే ఇస్తున్న వైనం యూరియా కట్టకుమార్కెట్లో రూ.350 వరకు వసూలు బ్లాక్లో విక్రయిస్తే చర్యలు మార్కెట్లో యూరియా కొరత లేదు. బంటుమిల్లి మండలంలో 80 టన్నుల స్టాకు ఉంది. యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులతో కలిపి విక్రయించినా, అధిక ధర వసూలు చేసినా చర్యలు తప్పవు. మండలంలోని మూడు సొసైటీల వద్ద యూరియా స్టాకు ఉంది. యూరియా వాడకం తగ్గించడం కోసమే ఎకరానికి అర బస్తా చొప్పునే ఇవ్వాలన్న నిబంధన విధించాం. ఎరువులకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. – ఎన్.రమాదేవీ, ఏడీఏ, బంటుమిల్లి -
ఉద్యోగుల కరువు భత్యం ప్రకటించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగుల కరువుభత్యం, మధ్యంతర భృతిని తక్షణం ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.సుందరయ్య డిమాండ్ చేశారు. సమఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం విజయవాడలోని సంఘ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీకి సంబంధించి వెంటనే కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ లోపు 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యాలు, సరేండర్ లీవ్ బకాయిలను తక్షణం చెల్లించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విలువైన సమయాన్ని బోధనకు కేటాయిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు మాట్లాడుతూ.. జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు వారంలో కనీసం ఒక రోజు మండలంలో అందుబాటులో ఉండి ఉపాధ్యాయుల సర్వీస్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బేగ్, వి.రాధిక, వెంకటనారాయణ, ఎండీ ఆష్హర్, పూర్ణచంద్రరావు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆడబిడ్డ నిధి’ అమలుకు ఆంధ్రాను అమ్మేయాలా?
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏడాది పాలన తర్వాత పథకాల కోసం రాష్ట్రాన్ని అమ్మా లని చెబుతున్నారని, ఇప్పటికే సగం రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ బినామీలకు అమ్మేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ విస్తృత ప్రచారం చేసి, వాటి అమలుకు తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్న నేతలు నేడు సాకులు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. అవినాష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పి, నేడు మాట మారుస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ లోని ఆడబిడ్డ నిధి అమలు చేయలేమన్న సంకేతాలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు మీడియా ద్వారా తెలియచేశారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే యాలని చెబుతూ.. ఈ పథకాన్ని అమలు చేయలేమని చెప్పకనే చెప్పారన్నారు. సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చారని, 13 నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయకుండా వదిలేశారన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే కూటమి ప్రభుత్వం ఏకంగా రెండు కోట్ల మంది మహిళలను దారుణంగా మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏడాది గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. మూడు గ్యాస్ సిలిండర్ల హామీని ఒక్క సిలిండర్కే పరిమితం చేశారని ఇంకా మ్యానిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హామీలు అమలు చేయలేమని చెప్పకనే చెప్పారు ఇప్పటికే సగం రాష్ట్రాన్ని బాబు, లోకేష్ బినామీలకు అమ్మేశారు -
టీడీపీ నేత వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో ఎల్లో నేతలు.. మహిళల పట్ల కీచకుల్లా మారి పెట్రేగిపోతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో టీడీపీ నేత వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా వీఏవోగా పని చేస్తున్న మహిళను చిలుకూరు గ్రామ టీడీపీ నేత కాటేపల్లి సుబ్బారావు వేధిపులకు గురి చేస్తున్నారు.సుబ్బారావు వేధింపులు తాళలేక డ్వాక్రా వీఏవో పురుగుల మందు తాగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ఆమెపై డ్వాక్రా గ్రూపు సభ్యులతో దాడి చేయించేందుకు సుబ్బారావు యత్నించాడు. సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటోంది. -
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్మీటర్లను పగలగొట్టమన్నారుగా!
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్, వర్కర్స్ యూనియన్, గ్రామ/వార్డు సచివాలయం ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అండ్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు నాలుగు వేల మంది కారి్మకులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ కారి్మకుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరిస్తానని చెప్పారు. తెలంగాణ మాదిరిగానే నేరుగా జీతాలు అందజేసే విధానాన్ని ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎనర్జీ అసిస్టెంట్స్, లైన్ మేన్లకు, ఇతర కారి్మకులకు ఉద్యోగభద్రత కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టండని ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశి్నంచారు. -
ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి!
పెడన: బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి. గతంలో మాట ఇది. ప్రస్తుతం బోధనేతర పనులతో సతమతమవుతున్నారు. ‘తమ పిల్లలకు పాఠాలు చెప్పుకోనీయండి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తం చేస్తున్న మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. త్వరలో ఉపాధ్యాయులు ఎన్డీయే కూటమి సర్కారు ప్రవేశపెడుతున్న యాప్లు, ఆన్లైన్ వర్క్లు, ఇతర బోధనేతర కార్యక్రమాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కే పరిస్థితి స్పష్టంగా కనపడుతోందని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఎవరూ బహిరంగంగా చెప్పడానికి, మీడియా ముందు మాట్లాడటానికి భయపడుతున్నారు. మనకెందుకులే అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో వారి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వడ్డ్ అయిన మెసేజ్లో వివరాలను పరిశీలిస్తే తెలుస్తుంది స్కూలు పునః ప్రారంభం నుంచే బోధనేతర పనులు విద్యార్థులకు కిట్లు పంపిణీ, వాటి వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు ఆన్లైన్ చేశారు. ఆ తరువాత మెగా పేరంట్స్ సమావేశం. దీనికి సంబంఽధించిన అన్ని అంశాలను ఆన్లైన్లో ఎంటర్ చేయడం. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర యాప్. పాఠశాలలో పరిసరాల పరిస్థితిని ఫొటోలు తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కాలేదు. ఒక పక్క అప్లోడ్ చేయకపోతే ఎందుకు చేయలేదంటూ ఫోన్లు. మరోవైపు అప్లోడ్ చేస్తూనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాజాగా విద్యార్థులకు అందజేసిన కిట్లు, పుస్తకాలు, బ్యాగులు ఇచ్చినందుకు వాళ్ల తల్లిదండ్రులు, పిల్లల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలి. వీటిని మళ్లీ యాప్లో అప్లోడ్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. యాప్లో 18 కోర్సులు ఉమ్మడి జిల్లాలో సుమారు 14000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఐ గాట్ కర్మయోగి అనే యాప్లో 18 కోర్సులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి లీడర్షిప్ ట్రైనింగ్. సెకండ్ స్పెల్ ట్రైనింగ్కు హాజరుకావాల్సి ఉంది. మండల స్థాయిలో హెచ్ఎంలు, ఎంఈవోలు గంటల తరబడి సమావేశాలు వినాల్సి వస్తోంది. అదీ కాకుండా ఈ ఏడాది కొత్తగా ఎగ్జామ్స్లో పిల్లవాడు రాసిన ఆన్సర్ షీట్స్ను ఫొటో తీసి లీప్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో హైస్కూల్ టీచర్లు 500 నుంచి 1000 వరకు ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇవి ఎప్పటికి అప్లోడ్ అవుతాయో.. కావో తెలియని దుస్థితి. ఈ టార్చర్ మామూలుగా ఉండదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంకా పెరిగాయి బోధనేతర పనులతో సతమతం మమ్మల్ని పాఠాలు చెప్పుకోనీయండి వాట్సాప్ గ్రూపుల్లో ఉపాధ్యాయులు ఆవేదన టెన్షన్ టెన్షన్గా స్కూళ్లకు వెళ్తున్న వైనం ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలుండవని అనుకున్నామని, కానీ బోధనేతర కార్యక్రమాలు ఇంకా పెరిగాయని వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన వెలిబుచ్చుతున్నారు. విద్యాశాఖ మంత్రి గత కొద్ది నెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. అధికారులతో ఉపాధ్యాయ సంఘాలు సమావేశమైనా ఎలాంటి ఉపయోగం ఉండదని, ఇప్పటికై నా విద్యా శాఖా మంత్రి ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాట్సాప్ గ్రూపుల్లో పేర్కోవడం విశేషం. -
సీసీ కెమెరాలు అలర్ట్.. దొంగలు పరార్
పెడన: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 2.15 గంటల ప్రాంతంలో మెయిన్రోడ్డులోని ఒక బడ్డీకొట్టులో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించి సీసీ కెమెరాలు అలర్ట్తో పరారైన సంఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు పట్టణంలోని పెడన శాఖ గ్రంథాలయానికి వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు పక్కన భోగాది కమలప్రసాద్కు చెందిన (మాస్టారు)కిళ్లీ షాపునకు ఆధునీక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి సుమారు 2.12 గంటలకు గుర్తు తెలియని ఇద్దరు దొంగలు బడ్డీకొట్టు వద్దకు ప్రవేశించి తాళాలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ లోగా సీసీ కెమెరా అలర్ట్ కావడంతో పాటు వచ్చిన వారిని ఫ్లాష్తో ఫొటోలు తీసి యాజమానిని అలర్ట్ చేసింది. ఎప్పుడైతే సీసీ కెమెరా ఫొటోలు తీసిందో దొంగలు ముఖాలను చేతులతో కప్పుకొని పరారయ్యారు. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో సీసీఎస్ పోలీసులు, పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణ జరిగిన సంఘటనపై ఆరా తీశారు. షాపు యాజమాని కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. -
సారె తెచ్చి.. కనులారా దర్శించి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు సోమవారం సారెను సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. దుర్గగుడిలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఎజైల్ సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బంది సోమవారం అమ్మవారికి సారెను సమర్పించారు. జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో శీనానాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న సిబ్బంది అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, భక్త బృందాలు సారె సమర్పించేందుకు క్యూలైన్లో బారులు తీరారు. మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. 24తో ముగియనున్న ఆషాఢ ఉత్సవాలు ఈ నెల 24వ తేదీతో ఆషాఢ మాసోత్సవాలు ముగియనున్నాయి. ఆషాఢ మాసం చివరికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి సారెను సమర్పిస్తున్నారు. మంగళవారం ఆలయ అన్నదాన విభాగం, శానిటేషన్ విభాగం వేర్వేరుగా అమ్మవారికి సారెను సమర్పించనున్నారు. దుర్గమ్మకు సారె సమర్పిస్తున్న భక్త బృందాలు -
చట్టపరిఽఽధిలో సమస్యలకు పరిష్కారం
కృష్ణా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: మీ కోసంలో అందిన అర్జీలను చట్ట పరిఽఽధిలో విచారణ జరిపించి బాధితులకు సత్వర న్యాయం అందడానికి చర్యలు తీసుకుంటామని కృష్ణా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో ఆయన పాల్గొన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా మీకోసంలో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఫిర్యాదు ఎలాంటిదైనా విచారణ జరిపించి బాధితులకు అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు. ఫిర్యాదుల్లో కొన్ని ●తోట్లవల్లూరుకు చెందిన ప్రత్యూష అనే బాధితురాలు ఎస్పీతో తన భర్త ఏడాది క్రితం క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు తెలిపింది. తనకు ఇద్దరు పిల్లలు ఉండగా భర్త చనిపోయిన నాటి నుంచి అత్తమామలు తనతో పాటు తన పిల్లలను ఇంటి నుంచి గెంటేసినట్లు చెప్పారు. జరిగిన అన్యాయంపై పెద్దలతో మాట్లాడించినా అత్తమామలు, ఆడపడుచు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రాధేయపడింది. ●గుడివాడకు చెందిన మురళీ అనే ఓ తండ్రి ఎస్పీని కలిసి తన కుమార్తెను కొందరు సామాజిక మాధ్యమాల్లో అల్లరి చేస్తూ పోస్టింగ్లు పెడుతున్నారంటూ వాపోయారు. ఆమెను మానసికంగా వేధిస్తూ అవమానిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తన బిడ్డకు రక్షణ కల్పించాలని కోరారు. ●కంకిపాడుకు చెందిన రవి ప్రైవేట్ ఉద్యోగి. రెండు నెలల క్రితం సోషల్మీడియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు కనిపించగా సంబంధిత వ్యక్తులతో మాట్లాడి ప్రాసెసింగ్ ఫీజు కింద లక్ష రూపాయలు ఇచ్చినట్లు ఆయను చెప్పారు. ఇంత వరకు వారి నుంచి సమాధానం రావడం లేదని తనకు న్యాయం చేయాలని కోరారు. అర్జీలపై స్పందించిన ఎస్పీ విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. పోలీస్ గ్రీవెన్స్కు 72 ఫిర్యాదులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్కు 72 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డెప్యూటీ పోలీస్ కమిషనర్ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడారు. వికలాంగులు, వృద్ధుల వద్దకు ఆమె వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదును తీసుకున్నారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
గుడివాడరూరల్: అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 6.50 లక్షల విలువైన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తెలిపారు. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు, వచ్చిన సమాచారం మేరకు సీఐ కొండపల్లి శ్రీనివాస్, ఎస్ఐ గౌతమ్కుమార్ సిబ్బందితో టీంలుగా ఏలూరురోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కోరదల ఏసు, చిలకంటి రంగా రావు.. వారి బైక్లను తిప్పుకుని పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారన్నారు. దీనిలో14 బైక్లను వివిధ ప్రాంతాల్లో తాకట్టు పెట్టినట్లు తెలుసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్లో ఒకరు ఆటోడ్రైవర్, మరొకరు తాపీమేసీ్త్ర అని తెలిపారు. ఆటస్థలాలు, ఆస్పత్రులు, ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన బైక్లను మారు తాళాలతో దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారన్నారు. ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా బైక్లను చోరీలు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వివరించారు. దొంగలను పట్టుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గౌతమ్, కానిస్టేబుళ్లు సురేంద్రబాబు, వేణుగోపాల్, మురళీకృష్ణ, సత్యనారాయణను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. రూ.6.50 లక్షల విలువైన 14 బైక్లు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
అదుపుతప్పి పంట కాల్వలో బూడిద లారీ
ఇబ్రహీంపట్నం: బూడిద చెరువు నుంచి బూడిద లోడింగ్తో వస్తున్న లారీ అదుపుతప్పి ఖిల్లా రోడ్డు పక్కన పంట కాల్వలోకి సోమవారం దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అతివేగంతో ప్రమాదానికి గురైంది. నిమ్రా, నోవా కళాశాలల విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో వర్షం కారణంగా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఖిల్లా రోడ్డులో బూడిద రవాణా లారీల రద్దీతో ప్రజలు, కళాశాల విద్యార్థులు, కొండపల్లి ఖిల్లా పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరోడ్డులో ప్రయాణించాల్సి వస్తోంది. లారీలు అతివేగానికి కళ్లెం వేయాలని పలుమార్లు ఎన్టీటీపీఎస్ అధికారులకు ప్రజలు చెప్పినా వారు స్పందించక లారీల వేగాన్ని నియంత్రించే వారు కరువైయ్యారు. ఎట్టకేలకు రెండు జేసీబీలు, ఒక పొక్లెయిన్తో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. -
ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయండి
బందరులో పీడీ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల ధర్నా మచిలీపట్నంటౌన్: ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ సేవలు అందించేందుకు తప్పనిసరి చేసిన ముఖ గుర్తింపు విధానం (ఎఫ్ఆర్ఎస్)ను రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం స్థానిక పోర్ట్ రోడ్డులోని పీడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ విధానంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సర్వర్ పని చేయక ఎఫ్ఆర్ఎస్ పడక సమయం వృథా అవుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై వేధింపులను నివారించడానికి అధికారులు స్పందించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి, సీఐటీయూ నేత సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ నాంచారమ్మ, కార్యదర్శి రెజీనారాణి, సెక్టర్ నాయకురాలు లక్ష్మి, సీతారత్నం, విజయశ్రీ, సుజాత, సౌజన్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు. పోలవరం కాల్వలో పడి వ్యక్తి గల్లంతు పాయకాపురం(విజయవాడరూరల్): పాతపాడు గ్రామం వద్ద పోలవరం కాల్వలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళిన వ్యక్తి కాలుజారి కాల్వలో కొట్టుకెళ్ళినట్లు వచ్చిన ఫిర్యాదుపై నున్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ప్రకాష్నగర్ కు చెందిన పత్తివాడ మధుసూదన్ (26) క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి పాతపాడు గ్రామం వెళ్లారు. స్నేహితులతో మద్యం సేవించిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో పోలవరం కాల్వలో పడి కొట్టుకెళ్లిన మధుసూదన్ కోసం గాలించినా ఆచూకి దొరకలేదని మధుసూదన్ తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. -
ఆస్పత్రికెళ్తూ అనంతలోకాలకు..
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె – కోల్కతా జాతీయ రహదారిపై హనుమాన్జంక్షన్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లా దేవరపల్లి సమీపంలో పల్లంట్ల చెందిన పసలపూడి రాఘవ (30), ఆయన బావ, మేనమామ అయిన తాడేపల్లిగూడెం సమీపంలోని కృష్ణంపాలెంకు చెందిన ఎల్లిమెల్లి భాస్కరరావు (50)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బావ భాస్కరరావును విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం రాఘవ తీసుకెళ్తున్నారు. బైక్పై వెళ్తున్న రాఘవ, భాస్కరరావును హనుమాన్జంక్షన్ బైపాస్ రోడ్డులో శేరినరసన్నపాలెం క్రాస్ రోడ్డు దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి వీరిని ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలతో రక్తస్రావమైన ఇద్దరూ ఘటనాస్థలిలోనే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న హనుమాన్జంక్షన్ ఎస్ఐ వి.సురేష్ ఘటనాస్థలికి చేరకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్యరోదనగా మారింది. బావను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చిన బావమరిది కూడా ప్రమాదంలో దుర్మణం చెందడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఘటనపై కేసు నమోదు చేశారు. లారీ ఢీకొని బావ, బావమరిది దుర్మరణం జంక్షన్ సమీపంలో ఘటన -
‘శాతవాహన’ను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): శాతవాహన కళాశాలకు చెందిన స్థలాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కళాశాలను నిర్వహించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిటెండ్ పి.రవిచంద్ర అన్నారు. శాతవాహన కళాశాలను పునఃప్రారంభించాలని కోరుతూ శాతవాహ న కళాశాల పరిరక్షణ కమిటీ, విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు సంయుక్త ఆధ్వర్యంలో సోమ వారం ఉదయం కళాశాల గేటు దగ్గర ఆందోళన చేశారు. కళాశాల గేటు తెరిపించి విద్యార్థి సంఘాల నాయకులు, పరిరక్షణ కమిటీ సభ్యులు కళాశాల మైదానంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి.. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ శాతవాహన కళాశాలను జూన్ 6వ తేదీన కోర్టు ఉత్తర్వుల పేరుతో బోయపాటి వర్గీయులు కళాశాల భవనాలను కూల్చివేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని, ఉన్నత విద్యామండలి వారు డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ప్రకటించి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. వందల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోకపోవడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వి.సాంబరెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్స్వామి, శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రదరఖాస్తు చేసుకోండి.. అనంతరం కళాశాల ఆవరణలో పరిరక్షణ కమిటీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు టెంట్లు వేసి కూర్చున్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ అడ్మిషన్లను ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. -
పారాహుషార్!
విజయవాడకు పొంచి ఉన్న వ్యాధుల ముప్పు వ్యాధుల కాలం.. అప్రమత్తతేదీ? వర్షాకాలంలో దోమకాటు వ్యాధులైన మలేరియా, డెంగీ వంటి జ్వరాలతో పాటు, కలుషిత ఆహారం, నీరు కారణంగా టైఫాయిడ్, డయేరియా, వైరస్ కారణంగా కామెర్లు సోకే అవకాశం ఉంది. ఆయా వ్యాధులు సోకకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహిస్తోంది. కానీ ఇప్పుడు పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ మురుగు అక్కడే ఉంటోంది. చెత్తను తరలించే వారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రభలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాధులు తప్పవని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వచ్ఛ నగరంగా పేరుగాంచిన విజయవాడలో ఎక్కడ చూసినా చెత్త పేరుకు పోయింది. సైడు కాలువల్లో పూడిక తీసేవాళ్లు లేక, నీరు పారుదల కాక, చిన్న వర్షానికే రోడ్డుపైకి మురుగు చేరుతోంది. రోడ్లపై నిలిచిన నీటితో చెత్త వ్యర్థాలు తేలియాడుతున్నాయి. అసలే వర్షా కాలం ప్రారంభమై, రోజూ ఏదో సమయంలో వర్షం కురుస్తుండగా, చెత్త, వ్యర్థాలు తరలించే వాళ్లు లేక ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడంతో వ్యాధి కారక బ్యాక్టీరియాలు, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమ్మెలో కార్మికులు.. విజయవాడలో శానిటేషన్ పనులు చూసే కార్మికులు రెండు వారాల నుంచి సమ్మెలో ఉన్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోతోంది. తాత్కాలిక సిబ్బందితో కొన్ని ప్రాంతాల్లో చెత్తను తొలగించినా అన్ని ప్రాంతాల్లో తరలించలేక పోతున్నారు. దీంతో ఫుడ్స్టాల్స్, హోటళ్లు ఉన్న ప్రాంతాల్లో డంపర్బిన్ నిండి, వాటి చుట్టూ వ్యర్థాలు గుట్టలుగా పడి ఉంటు న్నాయి. వర్షానికి అవి తడిసి, నీటిలో కలిసి అంతా ప్రవహిస్తూ అపరిశుభ్రం చేస్తున్నాయి. నగరంలో ఏ రోడ్డులోకి వెళ్లినా ఇదే పరిస్థితి నెలకొంటోంది. అలాంటి అపరిశుభ్ర వాతావరణంతో ఈగల ద్వారా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మురుగు సమస్య ఎక్కువే.. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో డ్రెయిన్లలోని వ్యర్థాలు తొలగించే కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రెయిన్లు పూడిపోయి వర్షం నీరు కూడా పారుదల కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా బెంజిసర్కిల్లో మోకాళ్లలోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో డ్రెయిన్లలో మురుగు రోడ్డుపై ప్రవహించడంతో రోడ్లపై మురుగు పేరుకుపోయింది. నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఇబ్బందులు సైడ్ కాలువల్లో సిల్ట్ తీసే వారూ కరువు సీజనల్ వ్యాధులపై కొరవడిన అధికారుల అప్రమత్తత ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు మత్తు వీడని ప్రభుత్వం.. నగరంలో శానిటేషన్ కార్మికులు రెండు వారాల నుంచి సమ్మెలో ఉంటే ప్రభుత్వం మాత్రం మత్తు వీడటం లేదు. దీంతో నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రెయిన్లు పూడిక తీత లేక చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
దుర్గమ్మకు రూ.6లక్షలతో బంగారు గొలుసు, సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.6లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయ వాడ రామలింగేశ్వరపేటకు చెందిన జంధ్యాల కుమార స్వామి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సుమారు 61గ్రాముల బంగారంతో తయారు చేసిన గొలుసు, రెండు మంగళ సూత్రాలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. రేపు ఐటీఐ కౌన్సెలింగ్ గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో రెండో విడత చేరికలకు కౌన్సెలింగ్ ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఓ. మంజులాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9346118232, 8143653907లో సంప్రదించాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతులపై పరిశీలన ఉయ్యూరు రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పరిశీలన బృందం ప్రతినిధులు ఉయ్యూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కాటూరు, బోళ్లపాడు, ముదునూరు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నిశితంగా పరిశీలించారు. ప్రజల నుంచి గ్రామస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, రహదారులు, డ్రెయినేజీలతో పాటు తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా విభాగాలను పరిశీలించారు. పంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను తనిఖీ చేశారు. కాటూరులో గుడివాడ డీఎల్పీఓ, ఉయ్యూరు ఎంపీడీవో శేషగిరిరావు, డెప్యూటీ ఎంపీడీవో ఏఎస్ఆర్ కోటేశ్వరావు పాల్గొని బృంద ప్రతినిధులకు పలు అంశాలపై వివరించారు. ఇద్దరు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. సోమవారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో జీఎం భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా అన్ని సెక్షన్లలో సేఫ్టీ డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ డివిజన్లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన సామర్లకోటలోని టీటీఐ డీవీకేఎస్పీ చైతన్య, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ కె.పాపారావుకు జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అవార్డులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
ఆశల సేద్యం
వరుణ నైవేద్యం..కృష్ణమ్మ రాకతో రైతుల్లో హర్షాతిరేకాలుజలకళ.. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మసాక్షి,ప్రతినిధి, విజయవాడ: జల సవ్వడులతో కృష్ణాతీరం పులకిస్తోంది. వరుణ నైవేద్యంతో అన్నదాత ఆశల సేద్యాన్ని ఆరంభించాడు. మన జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అరకొరగా అందుతున్న సాగునీటితో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి సాగు చేపట్టగా.. ఇప్పుడు పుష్కలంగా అందుతున్న నీటితో మిగిలిన ప్రాంతాల్లోని రైతులు అమితానందంతో సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని చివరి భూముల రైతులకు ఈ వర్షాలు కొత్త ఊపిరిని పోశాయి. సాగుకు కొత్త జీవం.. ఉమ్మడి జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,62,123 హెక్టార్లు కాగా, 64,675 హెక్టార్లలో ఇప్పటికే వరి పంట సాగైంది. ● ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ సాగు 94,931 హెక్టార్లు కాగా, 38,789 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు 48,167 హెక్టార్లు కాగా, 6,126 హెక్టార్లలో పంట సాగైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్ట పంటకూ ఊపిరి పోస్తున్నాయి. కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు పంటలకు మేలు చేకూరుతోంది. జిల్లాలో పత్తి సాధారణ సాగు 36,254 హెక్టార్లు కాగా, 26,909 హెక్టార్లలో సాగైంది. ● కృష్ణా జిల్లాలో సాగునీటి కాలువలు అధ్వానంగా ఉండటంతో, చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు అల్లాడిపోయారు. పెడన, గుడి వాడ, పామర్రు నియోజకవర్గాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరట నిస్తున్నాయి. వరినాట్లు జోరందుకున్నాయి. ఈనెల చివరి నాటికి అవనిగడ్డ ప్రాంతం మినహా మిగతా ప్రాంతాల్లో వరి సాగు దాదాపు పూర్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల నీరు ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలువలకు సైతం నీరు తగ్గించారు. సోమవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 7,250 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. కాలువలకు 3,522 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీ నాలుగు గేట్లు, ఒక అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇంకా రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బ్యారేజీకి ప్రవాహం అలాగే కొనసాగే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న నీరు దిగువకు నీటిని వదులుతున్న అధికారులు కృష్ణా డెల్టాలో ముమ్మరంగా ఖరీఫ్ పనులు ఇప్పటికే 65వేల హెక్టార్లలో వరి సాగు ఊపిరి పీల్చుకున్నాం.. నిన్న, మొన్నటి వరకు నీరందని దుస్థితి ఉంది. ఇప్పుడు నీరు పుష్కలంగా రావడమే కాకుండా కాలువల ద్వారా కూడా నీరొచ్చింది. పంటలకు బాగా నీరందుతోంది. వెదసాగు వేసుకున్నవి చనిపోవడంతో నారుకొని ఊడ్పులు ఊడ్చుకుంటున్నాం. నారు వేసిన వారు అధికంగా ఉన్న నారును విక్రయించుకుంటున్నారు. సమయానికి నీరందడంతో ఊపిరి పీల్చుకున్నాం. – గరికిముక్కు నాంచారయ్య, రైతు, లంకలకలువగుంట, పెడన మండలం వరి నాట్లు ప్రారంభించాం.. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లను ప్రారంభించాం. పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల వరి నాట్లు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే విధంగా వర్షాలు కురిస్తే నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. వర్షం పడటం వల్ల రైతన్నలందరికీ మేలు జరుగుతుంది. – సుబ్బారావు, కౌలు రైతు గుడివాడ వర్షంతో వరి పంటకు మేలు.. తొలకరి రాగానే వరి నారు సిద్ధం చేసుకుని నాట్లు వేసుకున్నాం. మొన్నటి వరకూ వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా ఎండలు అధికంగా కాశాయి. దీంతో పైర్లు ఎండుముఖం పట్టాయి. బోదెల్లో ఉన్న నీటిని వినియోగించుకుని పైర్లు సంరక్షించుకుంటున్నాం. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షాలు వరి పంటకు మేలు చేశాయి. పైర్లు ఊపిరిపోసుకున్నాయి. పంట బోదెల తవ్వకం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తే పొలాల్లో మురుగు మళ్లించుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. – నకరికంటి శేఖర్, కౌలురైతు, ఈడుపుగల్లు -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
– ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం విద్యుత్శాఖ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలపై ఆయన డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల బకాయిలను ఉన్నతాధికారులతో మాట్లాడి తాము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వేతర కార్యాలయాలు గాని, వినియోగదారుల నుంచి దీర్ఘకాలిక పెండింగ్ ఏమైనా ఉంటే సత్వరమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి జిల్లాలో 2,500 కనెక్షన్లు ఇచ్చామని, ప్రస్తుతం ఇంకా 550 కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ పఽథకం ద్వారా జిల్లాలో 1860 సోలార్ కనెక్షన్లు ఇచ్చామని ప్రతి నెల 300 కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. ఏఈ, లైన్మెన్, గ్రేడ్–2 జూనియర్ లైన్మెన్లకు పోస్టింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఆపరేషన్స్ డైరెక్టర్ మురళీకృష్ణయాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ పీవీఎస్ఎన్ మూర్తి, ఏపీసీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. సత్యానందం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సకాలంలో అర్జీలను పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బి. శ్రీదేవి, హౌసింగ్ ఇన్చార్జ్ పీడీ పోతురాజు, ఏఎస్పీ సత్యనారాయణ, మెప్మా పీడీ సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘మీ కోసం’ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వాటిని సకాలంలో పరిష్కరించి ప్రజల్లో సంతృప్తిస్థాయి పెంచాలన్నారు. శకటాలు సిద్ధం చేయండి.. రానున్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 10 సూత్రాల కార్యక్రమంపై శకటాలు రూపొందించేందుకు సంసిద్ధం కావాలన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన పీ4 కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో బంగారు కుటుంబాలు – మార్గదర్శుల విజయగాధలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా 20 శాతం ఎరువులు ఆదా అవుతాయని పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుందని నేలసారం పెంపుతో పాటు సాగుకు ఖర్చులు తగ్గిస్తాయని తెలిపే వాల్ పోస్టర్లను డీఆర్వో ఆవిష్కరించారు. నగదు ప్రోత్సాహకాలు.. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముగ్గురు అంతకు మించి పిల్లలు ఉన్న కుటుంబాల్లో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన మూడు కుటుంబాలకు ఒక్కొక్కరికీ ప్రశంసాపత్రం, రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని డీఆర్వో చేతుల మీదుగా అందజేశారు. అలాగే వ్యాసెక్టమీ ఆపరేషన్లకు అంగీకరించిన వారికి, ఉత్తమ గైనకాలజిస్ట్, ఉత్తమ వ్యాసెక్టమీ సర్జన్ వైద్యులైన డాక్టర్ సుచిత్ర, డాక్టర్ హరిరంగ ప్రసాద్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మీకోసం కార్యక్రమంలో అధికారులు 125 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో చంద్రశేఖరరావు ‘మీ కోసం’లో 165 అర్జీలు స్వీకరణ వచ్చిన అర్జీల్లో కొన్ని.. గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ప్రస్తుతం నిలిపివేశారు. ఆపరేటర్లకు ఉన్న బ్యాంకు బకాయిలను జమ చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం క్లియరెన్స్ సర్టిఫికెట్లు అందజేసి జీవనోపాధికి అవకాశం కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కృష్ణా జిల్లా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిండి శ్యాంబాబు అర్జీ ఇచ్చారు. మచిలీపట్నానికి చెందిన జల్దు కల్యాణ్బాబు కలెక్టర్కు అర్జీ ఇస్తూ నగరంలో నిర్మించిన పీవీఆర్ షాపింగ్ మాల్ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తెలిపారు. భవన నిర్మాణం సమయంలో కొన్ని ప్రాంతాల్లో శ్లాబుల కూలిపోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే వరంమాల్లో వచ్చే ప్రజలకు పార్కింగ్ తదితర అంశాల్లో అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని వీటిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని తక్షణమే చర్యలు చేపట్టాలని విన్నవించారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025నేడు ‘మీ కోసం’ చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం తెలిపారు. తిరుపతమ్మ సేవలో.. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు.భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. 7 -
కనులపండువగా..
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మోపి దేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక (ఆడికృత్తిక)స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం అమ్మవార్లను శాకంబరీదేవిగా అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు బుద్దు పవన్కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 7 గంటలకు తీర్థపు బిందె, ధ్వజస్తంభ పూజ, నందీశ్వరపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన అమ్మవార్లను వివిధ రకాల పండ్లు, కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. ఉదయం కలశాభిషేకం, పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్లకు ఏకాదశ రుద్రాభి షేకం, శాకంబరీ అలంకారం చేశారు. లక్షబిల్వార్చన, శాంతి కల్యాణం, మహా నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం వారు అన్న ప్రసాదం స్వీకరించారు. శాకంబరీ అలంకారంలో శ్రీవల్లీ దేవసేన అమ్మవార్లు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి పండ్లు, కూరగాయలతో అలంకరణ -
శాకంబరిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: శివాలయంలో భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ అమ్మవారిని కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. విఘ్నేశ్వరుణ్ణి, నందీశ్వరుడిని, ప్రసన్నాంజనేయస్వామిని, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని కూడా అలంకరించారు. ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దంపతులు ఆషాఢ సారె సమర్పించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక గ్రామ పెద్దలు, భక్తులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం కూడా అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమివ్వనున్నారు. -
‘మెడికల్ ఎంప్లాయీస్’ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం ఎంపిక
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ గుర్తింపు సంఘం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జరిగిన ఎన్నికల్లో అన్ని పోస్టులకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.శేషయ్య ప్రకటించారు. కార్యవర్గం వీరే జిల్లా అధ్యక్షుడుగా వై.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎ.నిర్మలరత్నకుమారి, టి.విజయకుమార్, ఆర్.నల్లయ్య, ఎం.సుధాకర్బాబు, డాక్టర్ జి. ప్రవీణ్కుమార్ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.నాగరాజు, డిప్యూటీ సెక్రటరీగా టి.సాంబయ్య తదితరులు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీఎం ప్రసాద్ వ్యవహరించనున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి సత్యనారాయణ, గిరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. సమస్యల పరిష్కారానికి సిద్ధంకండి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి ఉంటుందని సంఘ రాష్ట్ర నాయకులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ వేసి 36 శాతం ఐఆర్ చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల సహాయ అధికారిగా ఎ.రాధ వ్యవహరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నక్క రమేష్, మెడికల్ కాలేజీ గౌరవ అధ్యక్షులు రాముడు తదితరులు పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీని తలపించేలా..
అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడమే కాకుండా రెండు రోజుల పాటు పోలీసులు ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించేలా ప్రవర్తించారు. సిట్ కార్యాలయం వద్ద, కోర్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? వేలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తే, వారి పట్ల పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ వాతావరణం కల్పించారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
అప్రజాస్వామికం
ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, అభిమానులు నగరానికి తరలివచ్చారు. లిక్కర్ స్కామ్ పేరుతో కట్టుకథలు అల్లుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా.. అక్రమ కేసులో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం తీరును, పోలీసులు వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు, మిథున్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సిట్ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో జనసందోహంగా మారాయి. ఆధారాలు లేని కేసులో ఎంత మందిని అరెస్టు చేసుకుంటూ వెళ్తారంటూ మీడియా వేదికగా మండిపడ్డారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కర్ఫ్యూ వాతావరణం.. వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి విచారణకు హాజరైన దగ్గర నుంచి అరెస్టు, కోర్టులో హాజరు పరిచే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. సిట్ కార్యాలయం వద్ద వందలాది మంది పోలీసులతో బందోబస్తు పెట్టి, రాకపోకలను నిషేధిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలా చేశారంటున్నారు. అంతేకాకుండా వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన ప్రభుత్వాస్పత్రి వద్ద, అనంతరం సివిల్ కోర్టుల వద్ద పోలీసుల తీరు అలాగే ఉండటంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన సమీపానికి సైతం ఎవరినీ రాకుండా అడ్డుకోవడంపై మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో అణచి వేయాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంగా పైకి లేస్తామని నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ప్రజలంతా చూస్తున్నారు.. కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. – భరత్, ఎమ్మెల్సీ, కుప్పం -
కవులు, రచయితల శక్తి అసామాన్యమైనది
ప్రణామం కవి సమ్మేళనంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ కల్చరల్/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): కవులు, రచయితలకు ఉన్న శక్తి అసామాన్యమైనదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. వారి కలం నుంచి జాలువారిన అక్షర శక్తి ముందు తూటా శక్తి కూడా నిలువలేదని చెప్పారు. విజయవా డ బందరురోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ఆవరణలో ఆదివారం మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ ఆధ్వర్యంలో ‘ప్రణామం’ కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అర్థవంతమైన రచనలు సమాజ దిశను దశను మార్చుతాయని, సమాజంలోఎన్నో విప్లవాత్మక మార్పులకు కలం, గళమే కారణమన్నారు. కార్యక్రమాన్ని చొప్పా రాఘవేంద్ర శేఖర్ పర్యవేక్షించగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 80 మంది కవులు తెలుగు భాష, ప్రపంచశాంతి, పర్యావరణం, దేశభక్తి, సామాజిక చైతన్యం అంశాలపై కవితాగానం చేశారు. అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా కవులు ప్రమాణం చేశారు. సుప్రసిద్ధ కవులు శ్రీరామకవచం సాగర్, డాక్టర్ ఎం.ప్రభాకర్, వ్యాఖ్యాన శిరోమణి వేముల హజరత్తయ్య గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ ఘంటా విజయ్కుమార్, మల్లెతీగ కలిమిశ్రీ, బుక్ ఆఫ్ భారత్ రికార్డ్స్ డాక్టర్ ఎస్. దుర్గాకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేవరకొండలో నీట మునిగిన పొలాలు
దేవరకోట(ఘంటసాల): అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆకుమడులు, నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయని నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె జగదీష్ డిమాండ్ చేశారు. ఘంటసాల మండలం దేవరకోటలోని ఘంటసాల – రామానగరం ప్రధాన రహదారి గుండేరు డ్రెయిన్ వద్ద ఉన్న వంతెనపై జగదీష్ ఆధ్వర్యంలో సన్న, చిన్న కారు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ గుండేరు డ్రెయిన్లో గుర్రపు డెక్క, తూటుకాడ భారీగా పేరుకుపోయిందన్నారు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువ ప్రవహించే పరిస్థితి లేదన్నారు. దీంతో నీరు ఎగతట్టి దిగువ బాగంలో ఉన్న దిబ్బ చేలు, మూలగొంది పొలాలు, చిట్టూర్పు పొలాలు, ఇతరప్రాంతాల్లో ఆకుమడులు, నాట్లు వేసిన సుమారు 300 ఎకరాల్లో పొలాలు పూర్తిగా నీట మునిగాయని చెప్పారు. దీనిపై రెండు మూడు రోజులుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గుండేరు పరివాహక ప్రాంతంలో ఉన్న వంతెనల వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటు కాడ, మొదలగు వ్యర్థాలను మిషన్ల ద్వారా తొలగించాలన్నారు. రైతులు, కౌలు రైతులు జాస్తి రామచంద్రబాబు, కొప్పుల వెంకటేశ్వరరావు, అజయ్ కుమార్, సన్న, చిన్న కారు రైతులు పాల్గొన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం గుండేరు డ్రెయిన్ వద్ద రైతుల ధర్నా -
విద్యకు పేదరికం అడ్డు కాకూడదు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) ఏటా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్లో ఉన్న ‘అమ్మ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం అమ్మ హాలులో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథి లక్ష్మీశ విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం పీ–4 విధానాన్ని తీసుకొచ్చిందని, దాదాపుగా 300 బంగారు కుటుంబాలకు ఆంధ్రామోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) మార్గదర్శకులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకురావడం అభినందనీయమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా కూడా అమ్మ ఆధ్వర్యంలో ప్రచారం చేయాలన్నారు. వృద్ధులకు ఆశ్రయం అమ్మ అధ్యక్షుడు గారపాటి సతీష్బాబు మాట్లాడుతూ ఈ ఏడాది 408 మంది విద్యార్థులకు రూ.16 లక్షలను ఉపకార వేతనాలుగా అందచేస్తున్నామని చెప్పారు. కానూరులో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని నిర్మించి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నామని చెప్పారు. సంఘం సభ్యులు జీవీ సుబ్బారావు, దుర్గాప్రసాద్, చంద్రశేఖర్తో, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
స్కూలు బ్యాగులు.. నాణ్యత నిల్
ఎన్డీయే కూటమి గొప్పగా చెప్పుకుంటున్న విద్యా ర్థులకు అందజేసిన స్కూలు కిట్లలోని బ్యాగులను చూస్తే నాణ్యతా ప్రమాణాలు ఏ పాటివో తేటతెల్లమవుతున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి అందజేశామని పేర్కొంటున్నా బడులు తెరిచి నెల రోజులు కూడా పూర్తికాకుండానే అవి తెగిపోవడం, జిప్పులు ఊడిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు వాటిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, వారు సంబఽంధిత టైలర్ వద్దకు తీసుకువచ్చి బాగు చేయించడం పరిపాటిగా మారింది. బ్యాగు చినుగును, జిప్పులూడిన వాటిని బట్టి రూ.50 నుంచి రూ.150 వరకు చార్జి వసూళ్లు చేస్తున్నారు. ఉచితం మాటున చేతి చమురు వదులుతోందని పెడనలో పలువురు తల్లిదండ్రులు పేర్కొనడం గమనార్హం. – పెడన -
దుర్గగుడికి పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. భవానీపురానికి చెందిన కేసరి శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి తమ కుమార్తె నీవిద, తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, రాజేశ్వరిల పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబుకు అందజేశారు. ఉచిత ప్రసాదం పథకానికి.. అమ్మవారి సన్నిధిలో ప్రతి నిత్యం జరిగే ఉచిత ప్రసాద వితరణకు గుంటూరు భక్తులు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. చంద్రమౌళినగర్కు చెందిన శ్రీమోహన్సాయి, లక్ష్మీనారాయణ, రజనీ, డాక్టర్ అనులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. శివశంకర్, పద్మ పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గోసంరక్షణకు రూ. లక్ష.. దుర్గమ్మ సన్నిధిలోని గోసేవ పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన జి.రంగలక్ష్మి, సూర్యనారాయణ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి గోసంరక్షణ నిధికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
యనమలకుదురు లాకుల వద్ద గుర్తు తెలియని మృతదేహం
పెనమలూరు: యనమలకుదురు లాకుల వద్ద గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు రావడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు లాకుల వద్ద పురుష మృతదేహం నీటిలో కొట్టుకు వచ్చింది. మృతుడి వయస్సు 45 నుంచి 50 మధ్య ఉంటుంది. మృతదేహం కుళ్లి పోయి కనిపిస్తోంది. మృతుడి శరీరంపై చొక్కా, చిరిగిన ప్యాంట్ ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదృశ్యమైన వృద్ధురాలు శవమై కనిపించారు కోడూరు: అదృశ్యమైన వృద్ధురాలు చెరువులో పడి మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన చందన రాంప్రసాదం (90) శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెదికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువులో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పరిశీలించగా రాంప్రసాదంగా గుర్తించినట్లు ఎస్ఐ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతురాలి మనవడు మనోజ్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. 566.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 566.70 అడుగులకు చేరింది. ఇది 248.2946 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 67,556 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసి, ప్రతిపక్ష పార్టీ వారిపై అక్రమ కేసులు, అరెస్టులు చేయడంపైనే దృష్టి పెట్టింది. వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసింది. విద్యా వ్యవస్థను నాశనం చేసి, వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలను అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోంది. – ఎ.రవిచంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం -
హారిక దంపతులపై దాడి నీచమైన చర్య
పెడన: కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళా అయినటువంటి ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాములపై టీడీపీ, జనసేన గుండాలు చేసిన దాడి చాలా నీచమైందని, హేయమైన చర్య అని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంక ట ప్రతాప్ అప్పారావు అన్నారు. ఆదివారం ఆయన పెడన మండలం కృష్ణాపురంలోని హారిక, రాముల నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ నెల 12న గుడివాడలో జరిగిన దాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో దాడి జరిగితే అండగా ఉండకుండా నిందితులకు వత్తాసు పలకడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి రానీయకుండా పోలీసులు నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయనతో పాటు కృష్ణాజిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ నూజివీడు అధ్యక్షుడు శివ తదితరులున్నారు. జీతాల సమస్యలు పరిష్కరించండి వన్టౌన్(విజయవాడపశ్చిమ): బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎన్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రసాద్ మాట్లాడుతూ 2024, 2025 సంవత్సరాల్లో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు కరువు భత్యాలు, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య మాట్లాడుతూ బోధనేతర పనుల నుంచి, యాప్ల నుంచి ఉపాధ్యాయులకి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎం. కృష్ణ్ణయ్య, పి. లీల, పి. నాగేశ్వరరావు, మహేశ్వర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక తిరువూరు: ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం తిరువూరు శ్రీవాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. సంఘ నూతన కార్యవర్గాన్ని ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్. రాంబాబు నాయక్ (వత్సవాయి), ప్రధాన కార్యదర్శిగా ఈఎల్సీ కేశవరావు(ఏకొండూరు), కోశాధికారిగా సీహెచ్ వెంకటనారాయణ (కొండపల్లి), గౌరవాధ్యక్షుడిగా పీఎస్ఎన్ రాజు (తిరువూరు), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఈ సుధాకర్ (విస్సన్నపేట), ఏ రాంబాబు (రుద్రవరం), సీహెచ్వీ సుబ్రహ్మణ్యం (విజయవాడ), కేంద్ర కార్యదర్శిగా ఆర్. విజయ రామారావు(విజయవాడ) ఎన్నికయ్యారు. సమావేశం ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి కొమ్మా విజయ్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్షలు మచిలీపట్నంఅర్బన్: ఏపీపీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు కానూరులోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కృష్ణాజిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్లో 200 మంది అభ్యర్థుల్లో 133 మంది హాజరవ్వగా, 67 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్న సెషన్లో 873 మంది అభ్యర్థుల్లో 359 మంది మాత్రమే హాజరవ్వగా, 514 మంది గైర్హాజరైనట్లు డీఆర్ఓ తెలిపారు. -
ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సత్కారం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ ఎడ్యుకేషన్ మీడియా అధికారులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన పలువురికి ఏపీ హెల్త్ ఎడ్యుకేషన్, మీడియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ నాగేశ్వరరావు, మురళీధర్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సంఘం సాధించిన ప్రగతి కార్యకలాపాలపై చర్చించారు. సంఘ సభ్యుల అభ్యున్నతికై పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసిన ఆర్. రాజేశ్వరితో పాటు, జె.రఘురామ్, వి.సుభావతి, పి.రత్నకుమారి, ఎస్. భానుమూర్తి, వసంతరావును సత్కరించారు. ఈ సదస్సులో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు రామాంజనేయులు, తెలంగాణ వైద్యశాఖ మీడియా అధికారుల సంఘం అధ్యక్షుడు కొప్పు ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సంఘ కోశాధికారి నరేంద్ర శేషు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడలో మరో దారుణ హత్య?
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలో జరిగిన జంట హత్యల ఘటనను మరువక ముందే మధురానగర్ వంతెన వద్ద మరో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన అజిత్సింగ్నగర్ పీఎస్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. గవర్నర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 16వ తేదీన ఓ రౌడీషీటర్ రెచ్చిపోయి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్యచేసిన విషయం విదితమే. ఐదు రోజుల వ్యవధిలోనే మరో వ్యక్తి అదే విధంగా నడిరోడ్డుపై రక్తపు మడుగులో మృతిచెందాడు. వరుస ఘటనలతో ప్రజలు హడలిపోతున్నారు. రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి.. మృత్యుఒడిలోకి...గుంటూరు జిల్లా మొగలాయిపాలెం గ్రామానికి చెందిన షేక్ సాధిక్ (28)కు నగరంలోని వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన కరిష్మతో 2019లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అతను పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్ల నుంచి ఆమెకు దూరంగా జీవిస్తున్నాడు. వారిద్దరూ విడాకులకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతను గుంటూరులోని తల్లివద్దే ఉంటున్నాడు. ఈ నెల 16వ తేదీన విజయవాడ వెళ్లివస్తానని చెప్పి గుంటూరు నుంచి బయలుదేరాడు. సాధిక్ 19వ తేదీ తన తల్లి రిహానాకు ఫోను చేసి రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అయితే 20వ తేదీ తెల్లవారుజామున రక్తపు మడుగుల్లో శవమై కనిపించాడు. భార్య, అనుమానితులను విచారణ చేస్తున్న పోలీసులుసాధిక్ భార్య కరిష్మతో పాటు ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితులుగా కనిపించిన గంజాయి బ్యాచ్ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కరిష్మ తన భర్త అసలు ఇంటికే రాలేదని పోలీసులకు స్పష్టం చేసింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సాధిక్, కరిష్మల ఫోన్ డేటాలను కూడా సేకరిస్తున్నారు. సాధిక్ తల్లి రిహానా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ప్రభుత్వాస్పత్రికి తరలించామని, ఆ రిపోర్టు ఆధారంగా సాధిక్ హత్యకు కారణాలు తెలుసుకొని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్ పనా? వివాహేతర సంబంధం కారణమా? భార్యను కలుద్దామని నగరానికి వచ్చిన సాధిక్ వాంబేకాలనీలో ఉన్న తన భార్య కరిష్మను కలిశాడో లేదో తెలియడం లేదు. వాంబేకాలనీ నుంచి మధురానగర్ వైపు ఉన్న ట్రెండ్ సెట్ మార్గంలో అక్కడే బస్స్టాప్ వద్ద రెండు రోజుల నుంచి అతను తిరుగుతూ ఉన్నట్లు తెలిసింది. తమ కోడలు కరిష్మకు వివాహేతర సంబంధం ఉందని, వారే తన కొడుకును హతమార్చి ఉండొచ్చని సాధిక్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సాధిక్ మరణించిన సమయంలో అతని శరీరంపై దుస్తులు లేకపోవడం, అతను మధురానగర్ వంతెన వద్ద తల పగిలి తీవ్ర రక్తస్రావంలో పడిఉండటం వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సాధిక్ బ్యాగులో గంజాయి కూడా పోలీసులకు లభించినట్లు తెలిసింది. గంజాయి మత్తులో గంజాయి బ్యాచ్ సభ్యులకు అతనికి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? గంజాయి బ్యాచ్ సభ్యులు ఎవరైనా అతన్ని హత్య చేసి ఉంటారా? లేక ఏదైనా వాహనం ఢీకొని మరణించి ఉంటాడే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గంజాయి బ్యాచ్ సభ్యులు హత్య చేసి ఉంటారనే అనుమానాలు భార్య వివాహేతర సంబంధంపై మృతుడి బంధువుల ఆరోపణ మృతుడి భార్య, గంజాయి బ్యాచ్ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
బారులు తీరి.. సారెనిచ్చి..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తబృందాలు సారెను సమర్పించాయి. ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు 80 వేలకు పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేసి, భక్తులందరిని అన్ని టికెట్ల క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న వంద మంది భక్తులలో దాదాపు 80 మంది చేతిలో అమ్మవారి సారె ఉండటం విశేషం. అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు గాను అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా త్వరతిగతిన దర్శనం అయ్యేలా ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు సమన్వయంతో చర్యలు తీసుకున్నారు. కిటకిటలాడిన ఆరో అంతస్తు.. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను చూపేందుకు భక్త బృందాలు క్యూ కట్టాయి. ఉదయం 10 గంటల తర్వాత భక్త బృందాలతో ఆరో అంతస్తు కిటకిటలాడింది. అమ్మవారికి సారెను చూపేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మహా మండపం లిఫ్టు, మెట్లమార్గంతో పాటు ఘాట్రోడ్డు, పాత మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం ఆరో అంతస్తుకు చేరి సారెను సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి కూడా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అంతరాలయ దర్శనం రద్దు.. ఆదివారం ఉదయం నుంచే అంతరాలయ దర్శనాలను ఆలయ ఈవో శీనానాయక్ రద్దు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను సైతం నిలిపివేసి, బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కనిపించింది. మహా మండపం లిఫ్టు మార్గం ద్వారా కేవలం వికలాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, నడవలేని వారికి మాత్రమే కొండపైకి తీసుకెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన వారిని మల్లేశ్వరాలయం, మహామండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు సారె సమర్పణకు 2 గంటల సమయం రాత్రి వరకూ కొనసాగిన రద్దీ -
భక్తిశ్రద్ధలతో కావడిసేవ
మచిలీపట్నంటౌన్: నగరంలోని కాసానిగూడెంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుబ్బారాయుడి ఆడి ఆషాఢ కృత్తిక మహోత్సవంలో భాగంగా ఆదివారం నగరంలో కావడి సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం కావడి సేవ చేశారు. మూడు స్తంభాల సెంటర్లోని విజయగణపతి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ కావడిసేవ వాయిద్యాల నడుమ నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా అన్నాభిషేకం జరిగింది. అనంతరం ఆలయంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞ నంద సరస్వతి శ్రీ బాలస్వామీజీ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులకు అన్న సమారాధన జరిగింది. స్థానిక మేకవానిపాలెంలో వేంచేస్తున్న నాగేంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆడి కృత్తిక కావడి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కావళ్లు ఎత్తారు. -
తిరువూరు ఏఈఈ అదృశ్యంపై వీడిన మిస్టరీ.. సురక్షితంగా పట్టుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఆయన్ని తిరువూరు పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు. గత నెలలో బదిలీ అయినప్పటికీ రిలీవ్ కాకుండా ఉన్నతాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అడ్డుపడ్డారంటూ కిషోర్ రాసిన సూసైడ్ లేఖ సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో ఒక అధికారి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దారి తీయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.తిరువూరులో శుక్రవారం మధ్యాహ్నం మైనర్ ఇరిగేషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన ఏఈ కిషోర్ సెల్ఫోన్ సిగ్నల్స్ తొలుత ఖమ్మం జిల్లా వీఎం బంజరు వద్ద లభ్యమయ్యాయని ఆ శాఖ సిబ్బంది చెబుతుండగా, తర్వాత కొద్దిసేపటికి విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. తమ అల్లుడి ఆచూకీ తెలియలేదని, ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయారని ఏఈ మామ జామ ఆనందరావు తెలిపారు.ఆత్మహత్యకు తిరువూరు ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారుల వేధింపులే కారణమని శుక్రవారం రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువూరు నుంచి గౌరవరానికి ఏఈ కిషోర్ బదిలీ అయినప్పటికీ నెల రోజులుగా రిలీవ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి అదృశ్యమవడంతో కంగుతిన్నారు. శనివారం ఉదయం ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్ హుటాహుటిన ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వులు జారీచేశారు. రెండు రోజుల క్రితం క్రితం చివరగా ఖమ్మం జిల్లా వి.ఎం బంజర్ నెట్వర్క్ పరిధిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి సమీపంలో ఫోన్ ఆన్ చేసినట్లు సాంకేతికపరంగా పోలీసులు గుర్తించారు. చివరికి కిషోర్ను పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు. మరికొన్ని గంటల్లో ఏఈఈను తిరువూరుకు తీసుకురానున్నారు. -
వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
మోపిదేవి: మోపదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం ఉదయం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో అర్చకులు, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్కుమార్ శర్మ, వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, నిత్యార్చన, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్టానములు, హవనం, పవిత్ర జలప్రోక్షణ, పూర్ణాహుతి, వేదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పములచే సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాల చరిత్ర పుస్తకావిష్కరణ ఎంతో చరిత్ర గల పుణ్యక్షేత్రాల చరిత్రను భావితరాలకు అందించడానికి దివిసీమ వాసులు ఆధ్యాత్మిక గురువు తుర్లపాటి రామ మోహనరావు ప్రత్యేకంగా ఎస్టేట్ ఆలయాల చరిత్రను పుస్తక రూపంలో రచించినట్లు స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి క్షేత్రం, పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి క్షేత్రం, శ్రీకాకుళం శ్రీకాకులేశ్వరస్వామి క్షేత్రం, యార్లగడ్డ శ్రీ వేణుగోపాలస్వామి క్షేత్రాల చరిత్ర సంబంధించి పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. పుస్తక రచయితను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ సూపరింటెండెంట్లు మదుసూదనరావు, సత్యనారాయణ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంటౌన్: ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ శనివారం సైకిల్పై పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలో బాగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిందన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కాలుష్యం నివారణకు నడుం బిగించాలన్నారు. ప్రతి చోట సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం అధికమైందని చెప్పారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను వినియోగించరాదు. ఇకనైనా ప్రజలు రాబోయే కాలంలో మానవ మనుగడకు పర్యావరణానికి కలిగే ముప్పును గుర్తుంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి చేతి నూలు సంచిని తీసుకెళ్లే పాతకాలపు అలవాటును మరలా పాటించాలన్నారు. దీంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని చెప్పారు. తద్వారా మురుగు కాలువల్లో నీరు కూడా సజావుగా ప్రవహిస్తుందన్నారు. ఇకపై ప్రజలు కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను వినియోగించరాదని నిర్ణయం తీసుకోవాలన్నారు. నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎంతో అంకితభావంతో పరిశుభ్రం చేస్తున్నారని, వారికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎంసీ కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కార్పొరేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. -
మోటార్ల దొంగల ముఠా అరెస్ట్
● ముఠా నాయకుడు జనసేన నేత కావడంతో కేసును నీరు గార్చిన పోలీసులు ● పట్టుకున్నది 60 మోటార్లు.. చూపించింది 12 మాత్రమే కోడూరు: ఇంటి ఆవరణతో పాటు ప్రభుత్వ సముదాయాల్లో ఉన్న మోటార్లను అపహరించే దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని, అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చారనే విమర్శలు దివిసీమలో కలకలంరేపాయి. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇళ్ల వద్ద ఉండే మోటార్లను గుర్తు తెలియని దుండగులు అపహరిస్తున్నారు. నెల రోజులుగా మోటార్ల అపహరణపై బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు అందించారు. వారం క్రితం పిట్టల్లంక పంచాయతీ కార్యాలయంలో ఉన్న విద్యుత్ మోటార్ను దొంగల ముఠా అపహరించింది. దీంతో పంచాయతీ అధికారులు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును చేధించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పిట్టల్లంక గ్రామానికి చెందిన శీలం కల్యాణ్రామ్, బావిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన సింగంశెట్టి సాయి శ్రీనివాసరావులు మోటార్లను అపహరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు పిట్టల్లంక సమీపంలోని ఓ రొయ్యల చెరువుల వద్ద పని చేస్తున్నారు. వీరిని మోటార్ల దొంగతనం చేసేందుకు సంబంధిత చెరువు యజమాని ప్రేరేపించినట్లు పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. ఇద్దరు యువకులతో పాటు చెరువు యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేత దొంగల ముఠా నాయకుడు.. మోటార్ల దొంగల ముఠాను ముందుండి నడిపిన చెరువుల యజమాని జనసేన నేత కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు యజమానిని కేసు నుంచి తప్పించేందుకు నియోజకవర్గం, మండలంలోని జనసేన నేతలు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు యువకులను బలి చేసి అసలు ముఠా నాయకుడిని వదిలేసేందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు చేధనలో పోలీసులు నిందితుల నుంచి 60కు పైగా మోటార్లను రికవరీ చేసినట్లు సమాచారం. కేసులోని నిందితులను శుక్రవారమే అరెస్టు చేసినా కూడా సమాచారాన్ని మీడియాకు ఇవ్వలేదు. మోటార్ల దొంగల గురించి సామాజిక మాధ్యమాల్లో రావడంతో కంగుతిన్న పోలీసులు శనివారం ఉదయం ఈ కేసుకు సంబంధించి ప్రెస్నోట్ను హడావుడిగా విడుదల చేశారు. ఈ ప్రెస్నోట్లో కూడా ఇద్దరు యువకులనే నిందితులుగా చూపించారు గానీ అసలైన ముఠా నాయకుడి ప్రస్తావన చేయలేదు. ఈ కేసులో రూ.1.35 లక్షల విలువైన 12 మోటర్లు రికవరీ చేసినట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్, ఇన్చార్జి ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరు మోటార్లను భారీ ఎత్తున చోరీ చేసిన నిందితులకు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన సెక్షన్లు నమోదు చేయకుండా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంపై బాధితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఎస్పీ ఈ మోటార్ల చోరీ ఘటనపై సమగ్రమైన విచారణ జరిపాలని బాధితులు కోరుతున్నారు. -
నేడు 10 నుంచి 3 గంటల వరకు టికెట్ల విక్రయాలు రద్దు
అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఆషాఢ మాసం అమ్మవారికి సారెను సమర్పించేందుకు భక్తులు, భక్త బృందాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నామన్నారు. బంగారు వాకిలితో పాటు సర్వదర్శనం క్యూలైన్లు మూడు, మరో రెండు క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి ఉచితంగా అనుమతిస్తామన్నారు. వృద్ధులు, చంటి పిల్లలతో దర్శనాలు వచ్చే తల్లులు ఉదయం 10 గంటల లోపు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే రావాలన్నారు. భక్తులు సహకరించాలని ఈఓ కోరారు. గుర్తు తెలియని మృతదేహాల లభ్యం కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సీతమ్మ వారి పాదాల సమీపంలోని శనైశ్వరస్వామి గుడి వెనుక వైపు కృష్ణానదిలో నీటిలో ఓ మృతదేహం తేలుతున్నట్లు శనివారం ఉదయం సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 45 ఏళ్లు ఉండవచ్చని, డార్క్ బ్లూ కలర్ టీ షర్ట్, గ్రే కలర్ ఫ్యాంట్, గ్రీన్ కలర్ బెల్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లేదా 98498 08555 నంబర్లో సంప్రదించాలని కోరారు. రొయ్యూరులో వృద్ధురాలి మృతదేహం.. తోట్లవల్లూరు: రొయ్యూరు సమీపాన కేఈబీ కాలువలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం శనివారం లభ్యమైనట్లు తోట్లవల్లూరు ఎస్ఐ సీహెచ్ అవినాష్ తెలిపారు. మృతదేహం బాగా పాడైపోయిన స్థితిలో ఉందన్నారు. మృతురాలి వయసు 60 నుంచి 65 ఏళ్లతో పాటు ఎరుపు రంగు చీర, పచ్చ రంగు జాకెట్ ధరించి ఉందన్నారు. వీఆర్వో అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం గౌరవరం(జగ్గయ్యపేట): టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదారపు నాగమణి(42) కొంత కాలంగా జగ్గయ్యపేట పట్టణంలోని తొర్రకుంటపాలెంలో నివాసముంటోంది. ఈ క్రమంలో తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవటంతో శుక్రవారం గౌరవరం గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉంది. నందిగామ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తున్న టిప్పర్ ఆమెను వేగంగా ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తించిన స్థానికులు చిల్లకల్లు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇరిగేషన్ ఏఈ అదృశ్యంపై వీడని మిస్టరీ
తిరువూరు: తిరువూరు మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ అదృశ్యమైన సంఘటనలో రెండో రోజు కూడా మిస్టరీ వీడలేదు. తిరువూరులో శుక్రవారం మధ్యాహ్నం మైనర్ ఇరిగేషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన ఏఈ కిషోర్ సెల్ఫోన్ సిగ్నల్స్ తొలుత ఖమ్మం జిల్లా వీఎం బంజరు వద్ద లభ్యమయ్యాయని ఆ శాఖ సిబ్బంది చెబుతుండగా, తర్వాత కొద్దిసేపటికి విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్థారణ అయ్యిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంతవరకు ఏఈ ఆచూకీ లభించలేదని చెబుతున్నారు. తమ అల్లుడి ఆచూకీ తెలియలేదని, ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయారని ఏఈ మామ జామ ఆనందరావు తెలిపారు. ఆత్మహత్యకు తిరువూరు ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారుల వేధింపులే కారణమని శుక్రవారం రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వుల జారీ తిరువూరు నుంచి గౌరవరానికి ఏఈ కిషోర్ బదిలీ అయినప్పటికీ నెల రోజులుగా రిలీవ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి అదృశ్యమవడంతో కంగుతిన్నారు. శనివారం ఉదయం ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్ హుటాహుటిన ఏఈకి రిలీవింగ్ ఉత్తర్వులు జారీచేశారు. -
డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం
● ఇతర రాష్ట్రాల్లో పూర్తయిన అడ్మిషన్లు ● ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయని ప్రభుత్వం ● నోటిఫికేషన్ ఆలస్యంతో డిగ్రీ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు ● ఆందోళనకు దిగనున్న విద్యార్థి సంఘాలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు దాటినా డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జూలై మాసానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై తరగతులు సైతం ప్రారంభమవుతుంటాయి. కానీ ఇంతవరకు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో ఆందోళనలతో పాటు గందరగోళం నెలకొంది. గడిచిన మూడు మాసాలుగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో సుమారు 35,484 మందికిగాను 31,736 మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారు ఉన్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 30 వేలకు పైగా సీట్లు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయం పరిధిలో సుమారుగా 140 వరకు వివిధ కళాశాలలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటుగా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. సుమారుగా 100 వరకూ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరం 30 నుంచి 32 వేల సీట్లు మొదటి ఏడాది విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నత విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 40 నుంచి 50 శాతం సీట్లు మిగిలిపోయాయి. నగరాల్లో ఉన్న ప్రముఖ కళాశాలల్లోనూ కొన్ని కోర్సుల్లో సగం కూడా నిండని పరిస్థితులు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. మేజర్ సబ్జెక్టులపై సందిగ్ధం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇంటర్ ఫలితాలు విడుదలై మాసాలు గడుస్తున్నా ప్రవేశాలు చేపట్టకపోవటంపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభమై నెలన్నర దాటింది. ఇంకా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవటం వలన విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తక్షణమే డిగ్రీ అడ్మిషన్ల నోటిపికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలి. – వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘం నేత డిగ్రీ కోర్సులకు సంబంధించి సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్ట్లపై సందిగ్ధం కొనసాగుతోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్ట్లతో నూతన డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. అయితే వీటిపై వస్తున్న సందిగ్ధంతో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో వీటిపై మరింత లోతైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, విద్యావేత్త ఆచార్య వెంకయ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయినా ప్రభుత్వం డిగ్రీ నోటిఫికేషన్పై గందరగోళ పరిస్థితులను కొనసాగిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైపు ఇంటర్ ఫలితాలు వచ్చి మూడు మాసాలైంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. అయినా ఏపీలో డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవటంపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఇటీవల ఆందోళనను నిర్వహించాయి. అలాగే నాలుగైదు రోజుల్లో డిగ్రీ విద్యాసంస్థల సమ్మె చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. -
వక్ఫ్ భూములను ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తాం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను కాపాడి వాటిని ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డు భూములను ఆయన శనివారం పరిశీలించారు. ఎన్టీటీపీఎస్ పరిధిలో ఉన్న వక్ఫ్ బోర్డు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీటీపీఎస్ నుంచి వక్ఫ్ భూములకు సంబంధించి బోర్డుకు ఎలాంటి ప్రయోజనాలు లభించడం లేదని స్థానిక ముస్లిం నాయకులు వివరించారు. అల్తాఫ్ రజా వక్ఫ్ బోర్డ్ చైర్మన్కు అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూముల వివరాలను, వాటి గురించి చేస్తున్న పోరాటాలను తెలియజేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అక్రమ్, సీఈఓ మహమ్మద్ అలీ, ముస్లిం మైనార్టీ నాయకులు ఫతావుల్లా, మసూద్ అలీ జిన్నా తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి ఆలయంలో ఆర్వో ప్లాంట్లు ప్రారంభం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో దివీస్ లెబోరేటరీస్ లిమిటెడ్ రూ.32 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం ప్రారంభించారు. దివీస్ ల్యాబ్ ప్రతినిధులు నగేష్, శ్రీనివాస్ను ఆలయ ఈఓ శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఘనంగా సత్క రించారు. ఆశీర్వచనాలు అందజేసి స్వామి చిత్రపటం బహూకరించారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానాన్ని టీటీడీ కల్యాణ మండపంలోకి మార్చి, ఆక్కడ నిర్వహిస్తున్న అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పాల పొంగళ్లు, చెవుల కుట్టు పోగుల సేవలను దేవస్థానం ప్రాంగణంలోకి మార్చనున్నట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. 23, 24 తేదీల్లో చలో ఢిల్లీగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనతోపాటు కుల గణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గానరేష్ డిమాండ్ చేశారు. బీసీల జనగణన, రిజర్వేషన్లు, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23, 24 తేదీల్లో చలో ఢిల్లీ చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆయన శనివారం చలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23, 24 తేదీల్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, వాటిలో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ, బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ కన్వీనర్ రంగు విక్రమ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పోతిన వరప్రకాష్, పిల్లా దినేష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతోనే అభివృద్ధి వీరులపాడు: ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని పంచా యతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ పేర్కొన్నారు. సమిత్వా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మండలంలోని పొన్నవరంలో ఇంటి నిర్మాణాలు, సరిహద్దులకు సంబంధించి నివాస గృహాల యజమానులతో శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. కృష్ణతేజ మాట్లాడుతూ.. గ్రామంలోని ఇళ్లు, వాటి హద్దుల పూర్తి వివరాలతో కూడిన పత్రాన్ని యజమానులకు అందిస్తామన్నారు. అనంతరం పాఠశాలను పరిశీలించి అదనపు గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నెలలుగా వేతనాలు రావటం లేదని, ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు పెంచాలని కోరుతూ ఫీల్డు అసిస్టెంట్ల సంఘ నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాజు పాల్గొన్నారు. -
శిక్షణ, బోధనేతర విధుల్లో ఉపాధ్యాయులు బిజీ
మచిలీపట్నం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల చదువులు గాడి తప్పాయి. పాఠశాలలు ప్రారంభమై 36 రోజులు గడిచినా, ఉపాధ్యాయులు తగినంత సమయాన్ని విద్యార్థులకు కేటాయించకపో వడం విద్యా ప్రమాణా లను దెబ్బతీస్తోంది. ఉద్యోగోన్నతి పొందిన, బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా స్థానాల్లో ఇప్పటికీ బాధ్యతలు చేపట్టలేదు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కారణంగా మిగిలిపోయిన ఉపాధ్యాయులను క్లస్టర్ టీచర్లుగా నియమించారు. మరోవైపు శిక్షణలు, ఇతర కార్యక్రమాలకే ఉపాధ్యాయులు పరిమితమై, పాఠాలు బోధించడంలేదు. వీటన్నింటి ఫలితంగా బడి చదువులను మరింత దిగజార్చాయి. బోధనా సమయం వృథా యోగా డే, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వంటి కార్యక్రమాల పేరుతో బోధనా సమయాన్ని ప్రభుత్వం వృథా చేసింది. శిక్షణల పేరుతో తరచూ ఉపాధ్యాయులను పాఠశాల విధుల నుంచి దూరం చేస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఫార్మెటివ్ అసెస్మెంట్ –1 పరీక్షలు జరగనున్నాయి. అయితే ఉపాధ్యాయులు అందుబాటులో లేక, పాఠాలు బోధించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగులు టీచర్లకు క్లస్టర్ విధులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2,710 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ పేరుతో వాటిని 2,687 పాఠశాలలకు కుదించింది. దీంతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు మిగిలిపోయారు. మిగులు ఉపాధ్యాయులను అధికారులు క్లస్టర్ టీచర్లుగా నియమించారు. మండలాల్లో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,612 మంది ఉపాధ్యాయుల్లో 693 మంది క్లస్టర్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సేవలను ఒకే పాఠశాలలో నిరంతరం ఉపయోగించకుండా, అవసరమున్న పాఠశాలలకు రొటేషన్ పద్ధతిలో పంపిస్తున్నారు. పిల్లల చదువులు పటిష్టంగా కొనసాగాలంటే ఉపాధ్యాయులు పూర్తి సమయానికి పాఠశాలల్లో ఉండేలా చూడటం అవసరం. పోస్టింగ్ల్లో స్పష్టత, శిక్షణల సమన్వయం, పరిపాలనా వ్యవస్థలో సమర్థత లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు సవాలుగా మారుతోంది. ఈ సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డీఎస్సీ తరువాతా కష్టమే డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసిన తరువాతే ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులు, బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి 1,048 ఖాళీలు ఉండగా 1,213 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ వ్యత్యాసం విద్యాశాఖ లోపభూయిష్ట నిర్వహణను బయటపెడుతోంది. ఒకవేళ డీఎస్సీతో నోటిఫై చేసిన టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, ఒకపక్క డీఎస్సీ మిగులు, మరోపక్క క్లస్టర్ టీచర్ల సర్దుబాటులో అనిశ్చితి ఏర్పడనుంది. నియామకాల్లో స్పష్టత లేక విద్యా వ్యవస్థలో గందరగోళంతో విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగా సాగుతాయి.తల్లిదండ్రుల్లో సడలిన నమ్మకం విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 12 రకాల పాఠశాలల విధానం తీవ్ర అవస్థలకు దారితీసింది. పాఠశాలల విలీనం, మూసివేత, ఉపాధ్యాయుల సర్దుబాటు, రేషనలైజేషన్ చర్యలతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం సడలింది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించడంలో అనిశ్చితి ఏర్పడింది. కృష్ణాజిల్లాలో 198 మోడల్ ప్రైమరీ పాఠశాలు ఉండగా, 108 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 నుంచి 40 వరకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లలో తక్షణమే విద్యార్థుల చేరికలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు ఇలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,612 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో 391 మంది ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–ఐఐ), 771 స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) తెలుగు, 21 ఎస్ఏ ఉర్దూ, 15 ఎస్ఏ సంస్కృతం, 714 ఎస్ఏ హెచ్ఎం, 858 ఎస్ఏ ఇంగ్లిష్, 898 ఎస్ఏ మ్యాథ్స్/తెలుగు, 06 ఎస్ఏ మ్యాథ్స్/ఉర్దూ, 646 ఎస్ఏ పీస్/తెలుగు, 06 ఎస్ఏ పీఎస్/ఉర్దూ, 697 ఎస్ఏ బీఎస్/ తెలుగు, 06 ఎస్ఏ బీఎస్/ఉర్దూ, 714 ఎస్ఏ ఎస్ఎస్/తెలుగు, 06 ఎస్ఏ ఎస్ఎస్/ఉర్దూ, 472 ఎస్ఏ పీడీ, 67 ఎస్ఏ ఎస్పీఏల్ ఈడీఎన్ తెలుగు, 563 పీఎస్ హెచ్ఎం తెలుగు, 23 పీఎస్ హెచ్ఎం ఉర్దూ, 4743 ఎస్జీటీ తెలుగు, 237 ఎస్జీటీ ఉర్దూ, 23 ఆర్ట్, డ్రాయింగ్, 14 క్రాఫ్ట్, 20 ఒకేషనల్, 08 మ్యూజిక్, 78 క్లస్టర్ ఎస్ఏ తెలుగు, 49 క్లస్టర్ ఎస్ఏ ఇంగ్లిష్, 01 క్లస్టర్ ఎస్ఏ సంస్కృతం, 03 క్లస్టర్ ఎస్ఏ ఉర్దూ, 08 క్లస్టర్ ఎస్ఏ బయో, 24 క్లస్టర్ ఎస్ఏ మ్యాథ్స్, 17 క్లస్టర్ ఎస్ఏ పీఎస్, 36 క్లస్టర్ ఎస్ఏ ఎస్ఎస్, 08 క్లస్టర్ ఎస్ఏ పీడీ, 428 క్లస్టర్ ఎస్జీటీ తెలుగు, 41 క్లస్టర్ ఎస్జీటీ ఉర్దూ ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యాప్రమాణాల పెంపే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం. బదిలీ అయిన ఉపాధ్యాయుల బాధ్యతల స్వీకరణ, క్లస్టర్ టీచర్ల సమర్థ వినియోగం, శిక్షణల సమన్వయం వంటి అంశాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ఫార్మేటివ్–1 పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాం. క్లస్టర్ టీచర్ల సేవలను అవసరమైన పాఠశాలల్లో సమర్థవంతంగా వినియో గించే విధంగా మార్గదర్శకాలు జారీ చేశాం. ఖాళీ పోస్టుల భర్తీ అనంతరం విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. – పి.ఇ.జె.రామారావు, డీఈఓ, కష్ణాజిల్లా విధుల్లో చేరని ఉద్యోగోన్నతి పొందిన, బదిలీ అయిన టీచర్లు టీచర్ల నియామకాల్లో స్పష్టత లేక విద్యా వ్యవస్థలో గందరగోళం తక్షణ చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై దుష్ప్రభావం -
గన్నవరం పీఎస్కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్
గన్నవరం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ శనివారం గన్నవరం పోలీస్స్టేషన్కు వచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ షరతుల మేరకు ఆయన పీఎస్లో సంతకం చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశాయి. వారందరిని వంశీమోహన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను సమన్వయంతో, పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు పరీక్షలు జరుగు తాయని తెలిపారు. పరీక్షలకు 1,813 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పెనమలూరు మండలంలోని కానూరులో ఉన్న ఆయాన్ డిజిటల్ జోన్, ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగూరులోని ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మచిలీపట్నంలోని డీఎంఅండ్ హెచ్వీహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని వివరించారు. అభ్య ర్థులే కాకుండా ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష హాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకురాకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు తెరవకుండా మూసి ఉంచాలని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు మౌలిక వసతులు కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు ఆరోగ్యరాణి, విజయలక్ష్మి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కిష్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి ముప్పు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గుడివాడరూరల్: విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–2047 సంకల్పంలో భాగంగా శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిద్దామన్నారు. ఆహార అవసరాలకు ఆకులతో తయారు చేసిన ప్లేట్లు, సహజసి ద్ధంగా తయారైన వస్తువులనే వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తించి వ్యక్తిగత అవసరాలకు జూట్ సంచులు, స్టీలు, పింగాణీ పాత్రలు, పర్యావరణహితమైన వస్తువులను వినియోగించాలని సూచించారు. తొలుత ప్లాస్టిక్ నియంత్రణపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోంది
పెడన:రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోందని, ఇందులో భాగంగానే మహిళలపై దాడులు పెరిగా యని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ బీసీసెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్లు రమేష్ యాదవ్ అన్నారు. బీసీ మహిళ, క్యాబినేట్ ర్యాంకు ఉన్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమ న్నారు. రమేష్యాదవ్తో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, కె.ఆర్.జె.భరత్, పలు బీసీ సంఘాల నాయకులు పెడన మండలం కృష్ణాపురంలోని హారిక, రాము నివాసానికి చేరుకుని వారిని పరామర్శించారు. ఈ నెల 12న గుడివాడలో టీడీపీ, జనసేన గూండాలు చేసిన దాడి గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం రమేష్యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. హారిక దంపతులను చంపుతామంటూ దాడి చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై బెదిరింపులకు దిగేలా పోలీసుల తీరుందన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఐదు నిమిషాల్లో చర్యలు తీసుకుంటానన్న డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బీసీ మహిళపై దాడి జరిగి వారం గడిచినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకే చెందిన బీసీ మంత్రి సాటి మహిళ బాధపడుతుంటే మహానటిగా పేర్కొవడం సిగ్గుచేటన్నారు. బీసీలపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకోబోమని హెచ్చరించారు. హారికకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా అండగా ఉంటామన్నారు. పోలీసులు దగ్గరుండి జరిపించినట్టుంది దాడి జరిగిన వీడియోలను చూస్తే చాలా బాధ కలిగిందని, పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్లు ఉందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. ఒక మాజీ పోలీస్ అధికారిగా జరిగిన ఘటనను వీడియోల్లో చూసి సిగ్గు పడుతున్నానన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ డీఎస్పీ దాడి సమయంలో ఉన్నా తానేం చేయాలని పేర్కొవడం హాస్యాస్పదంగా, దాడిని ప్రోత్సహించి నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల బాధ్యత మరచారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై గవర్నర్కు, రాష్ట్రప్రతికి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు ఉన్నారనే ధైర్యం లేదు భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కాని, ప్రజలను కాపాడటానికి పోలీసులు ఉన్నారనే నమ్మకాన్ని పోగొట్టేలా హారికపై దాడి జరిగిన ఘటనలో పోలీ సుల తీరు ఉందని ఎమ్మెల్సీ కె.ఆర్.జె.భరత్ అన్నారు. గుడివాడలో జరిగిన దాడిపై కేసు పెట్టడానికి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లితే పెడనలో కేసు పెట్టాలని సూచించడం శోచనీయమన్నారు. హారికకు జరిగిన అన్యాయంపై బీసీ కమిషన్కు, మహిళా కమిషన్ ఎక్కడ న్యాయం దొరుకుతుందో అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగురి సూర్యనారాయణ, ఏలూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, సంఘ నాయకులు మిద్దె వెంకటేశ్వరరావు, డి.శ్రీనివాస్, తుమ్మగుంట రంగ, రాష్ట్రంలోని పలు బీసీ సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హారిక దంపతులను పరామర్శించారు. హారికపై పోలీసులే దాడిని ప్రోత్సహించినట్లు ఉంది దాడిపై గవర్నర్కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, ఏసురత్నం, భరత్ ఉప్పాల హారిక, రాముకు పరామర్శ -
మినుముకు దక్కని మద్దతు
కంకిపాడు: పునాదిపాడు గ్రామానికి చెందిన రైతు సాయిబాబు ఐదెకరాల్లో మినుము సాగు చేశాడు. ఎకరాకు ఎని మిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతేడాది క్వింటా మినుము ప్రభుత్వ మద్దతు ధర రూ.7,400. మార్కెట్లో క్వింటా ధర రూ.9100కు పైగా పలికింది. గతేడాది మాదిరిగానే ఈ సారీ మంచి ధర లభిస్తుందని ఆశించాడు. రోజురోజుకూ ధర తగ్గడంతో ఆందోళన చెందుతున్నాడు. పంటను ఇంట్లో నిల్వ చేసుకోలేక, వచ్చిన ధరకు తెగనమ్మలేక సతమతమవుతున్నాడు. ఇది ఈ ఒక్క రైతు ఇబ్బందే కాదు. జిల్లా వ్యాప్తంగా గత రబీలో మినుము సాగు చేసిన రైతులు అందరి పరిస్థితి. ధర ఆశాజనకంగా ఉంటుందని ఆశించి పంట నిల్వ చేసిన రైతులు నేడు నానాటికీ పడిపోతున్న మినుము ధరలను చూసి నిరాశ చెందుతున్నారు. దళారులు మార్కెట్ను నియంత్రించి అడ్డగోలుగా ధర నిర్ణయం చేస్తుండటంతో రైతులులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలుచేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దిగుబడులు భళా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో గత రబీ సీజన్లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగయింది. పెసర మరో మూడు వేల హెక్టార్లలో సాగయింది. అక్కడక్కడా పల్లాకు తెగులు, బంగారు తీగ, మచ్చల పురుగు ఆశించినా మంచి దిగుబడులు లభించాయి. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు రైతులకు సాగు ఖర్చులవగా, ఏడు నుంచి తొమ్మిది క్వింటాళ్ల వరకూ దిగుబడులు వచ్చాయి. పతనమవుతున్న ధర గత రబీ సీజన్లో జిల్లాలో 12 ప్రాంతాల్లో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల ద్వారా 519 మంది రైతుల నుంచి 1,128.45 టన్నులు పెసరను కొనుగోలు చేశారు. మినుము మద్దతు ధర రూ.7,400 కాగా మార్కెట్లోనూ రూ.7,400 నుంచి రూ.7,600 వరకు ధర పలకడంతో మినుముల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలనే డిమాండ్ రైతుల నుంచి రాలేదు. గతేడాది ఇదే సీజన్లో రూ.9,100కు పైగా మార్కెట్లో ధర లభించింది. అదే తరహాలో ధర పెరుగుతుందనే ఆశాభావంతో చాలా మంది రైతులు ఇళ్ల వద్దే మినుమును నిల్వ చేసుకున్నారు. ఊహించని విధంగా ధర నేల చూపులు చూస్తోంది. క్వింటా ధర రూ.6500 నుంచి రూ.6,600 చొప్పునే పలుకుతోంది. రైతుల గోడు పట్టని కూటమి సర్కారు రోజు రోజుకూ మినుము ధర పతనమవుతున్నా కూటమి సర్కారు స్పందించటం లేదు. కనీస మద్దతు ధర కూడా దక్కక, పంటను విక్రయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులపై కనికరం చూపడం లేదు. మార్కెట్లో దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయం చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కళ్లుతెరిచి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల స్థాయిలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తే తప్ప మద్దతు ధర దక్కదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. క్వింటా మినుము మద్దతు ధర రూ.7,400 రూ.6,600 మాత్రమే ఇస్తున్న వ్యాపారులు రైతుల వద్ద పేరుకుపోయిన నిల్వలు -
పంటలు పండటం లేదు
రొయ్యలు చెరువులు లేనప్పుడు మా పొలంలో దిగబడులు బాగా వచ్చేవి. రెండోపంట మినుము కూడా పండేది. రొయ్యల చెరువుల కారణంగా కొన్నేళ్లుగా పంటలసాగు ఖర్చులు కూడా రాకపోతుండటంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాం. –బండి రాజేంద్ర, రైతు. ఘంటసాల పొలం కొని నష్టపోయారొయ్యల చెరువుల ఉప్పునీటి కారణంగా మేము కొనుక్కున్న పొలం పాడైపోయింది. కనీసం కౌలుకు ఇద్దామనుకున్నా రైతులు ముందుకు రావడం లేదు. ఈసమస్యను పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదు. –వడ్లమూడి కోటయ్య, రైతు, తాడేపల్లి -
పొలాలను కబళిస్తున్న రొయ్యల చెరువులు
ఘంటసాల: నాన్ అక్వాజోన్లో కొందరు వ్యక్తులు రొయ్యల చెరువుల సాగు చేస్తుండటంతో ఘంటసాల నుంచి చిలకలపూడికి వెళ్లే రహదారిలో వేలాది ఎకరాలు చౌడు భూములుగా మారాయి. రొయ్యల చెరువుల కారణంగా పంటలు పండటం లేదని సమీప పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దకాలంగా ఈ అంశంపై అధికారులకు మొర పెట్టుకుంటునప్పటికీ పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజి కాలువ పొడవునా.. ఘంటసాల నుంచి చిలకలపూడికి వెల్లే రహదారిలో గంజికాలువ (భీమనది డ్రైన్) పొడవునా కొంతమంది రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. 2014లో ఈ ప్రాంతంలో 50ఎకరాల్లో కొంతమంది చేపల చెరువులు తవ్వేందుకు ప్రయత్నించగా ఈ ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాన్ ఆక్వాజోన్లో చెరువులు తవ్వితే తమ పొలాల్లో పంటలు పండవంటూ అప్పట్లో స్పందనలో అధికారులకు అర్జీలు అందజేశారు. ఈక్రమంలో సదరు వ్యక్తులు చెరువుల్లో చేపలు మాత్రమే సాగు చేస్తామని, పొలాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు, రైతులను నమ్మబలికారు. అయితే చేపల సాగు ఆశాజనకంగా లేకపోవడంతో యజమానులు వాటిని రొయ్యల చెరువులుగా మార్చారు. రొయ్యల సాగు కోసం నీటిలో భారీస్థాయిలో ఉప్పు బస్తాలు వేస్తుండటంతోపాటు రసాయనాలను కూడా కలుపుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని పంటపొలాల్లో ఉప్పు చేరి ఆ భూముల చౌడుగా మారుతున్నాయి. దీంతో సుమారు 2వేల ఎకరాల్లోని పంటపొలాలు దెబ్బతింటున్నాయని బాధిత రైతులు వాపోతున్నారు. రెండో పంటకు ఆస్కారం లేదు.. గతంలో ఈప్రాంతంలోని పొలాలు ఏటా రెండు పంటలు పండేవి. రొయ్యల చెరువుల సాగు కారణంగా చౌడుభూములుగా మారి రెండో పంట ఆస్కారం లేకుండా పోయింది. ఉప్పునీటి ఉరకతో దిగుబడులు కూడా తగ్గిపోయాయి. దీంతో పొలాలను కౌలుకు కూడా తీసుకోవడం లేదు. కలుషితమవుతున్న నీరు.. రొయ్యల చెరువుల నుంచి ఉప్పునీరు, వ్యర్థాలను వాటి యజమానులు గంజికాలువ(భీమనది డ్రెయిన్)లోకి వదులుతుండటంతో నీరు కలుషితమై ఉప్పగా మారిపోతోంది. సమీపంలోని బోళ్లపాడులో భూగర్భజలాలు కూడా ఉప్పలుగా మారడంతో గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారు. గత నెల 30వ తేదీన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశామని, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పందించి రొయ్యల చెరువుల సాగును నిలుపుదల చేయించి తమను ఆదుకోవాలని ఈప్రాంత రైతులు, ప్రజలు కోరుతున్నారు. నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తా.. నాగరాజు, మత్స్యశాఖ జేడీ ఘంటసాల రైతులు ఇచ్చిన అర్జీపై ఇటీవల గ్రామంలోని రైతులతో మాట్లాడాం. రొయ్యల చెరువుల యజమానులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.. నెలాఖరులోపు సమస్యను పరిష్కరిస్తాను. చౌడుగా మారుతున్న పొలాలు 2వేల ఎకరాలకు ముప్పు కలుషితమవుతున్న తాగు,సాగునీరు పట్టించుకోని అధికారులు -
స్పెషల్ బ్రాంచ్ సీఐ సస్పెన్షన్
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ వాసంశెట్టి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాసరావు ఏడాది కాలంగా జిల్లా స్పెషల్బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగా ఐజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమికుడి మోసానికి యువతి బలి ఉయ్యూరురూరల్: ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరు మండలంలోని చిన్న ఓగిరాల్లో చోటుచేసుకుంది..పోలీసుల కథనం మేరకు మండలంలోని చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన సుధా అనే యువతి, కంకిపాడు మండలం నెపల్లి గ్రామానికి చెందిన డొక్కు జితేంద్ర ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాలు వేరు అనే నెపంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో జితేంద్ర, సుధాను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆమె మోతాదుకు మించి టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆ యువతి శుక్రవారం మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉయ్యూరు రూరల్ ఎస్సై సురేష్కుమార్ తెలిపారు. కుక్కల దాడితో బాలుడికి తీవ్రగాయాలు శివాపురం(పెనుగంచిప్రోలు): వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొంక కేతన్సాయి అనే 17నెలల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. ఈఘటనలో బాలుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతనం మెరుగైన చికిత్స కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా రెండు రోజుల కిందట కూడా గ్రామానికి చెందిన దైదా వీరయ్య, కురువెళ్ల దాసు అనే ఇద్దరిని కూడా కుక్కలు గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి గుడివాడరూరల్: ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుడివాడ ఆటోనగర్లోని ఓ ఇంజినీరింగ్ వర్క్స్లో గొర్రె వెంకటేశ్వరరావు(50), గల్లా రాంబాబు(42) వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని స్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి వెంకటేశ్వరరావు మృతి చెందారని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాంబాబును విజయవాడకు తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి హత్యకేసులో నిందితుడి అరెస్టు
కంకిపాడు: వృద్ధురాలి హత్యకేసును కంకిపాడు పోలీసులు చేధించారు. గన్నవరం డీఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు కంకిపాడు పోలీసుస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మంతెన గ్రామానికి చెందిన తిరుమల స్వర్ణకుమారి(70)ని ఈనెల 13వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దారుణ హత్యకు గురికాగా, ఆమెను అదే గ్రామానికి చెందిన తిరువీధుల భవానీ ప్రసాద్ (24) హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ రమ్మీకి బానిపై.. కేసు వివరాల్లోకి వెళితే..ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడ్డ భవానీప్రసాద్, అప్పులు తీర్చడం కోసం యాప్లలోనూ అప్పులు చేశాడు. ఈక్రమంలో ఈనెల 3, 4తేదీల్లో మృతురాలి స్వర్ణకుమారి ఇంట్లో టైల్స్ పనికి చేరాడు. పగటివేళలో స్వర్ణకుమారి భర్త వెంకటేశ్వరరావు పొలానికి వెళ్తుండటంతో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గుర్తించాడు. ఈనెల 13న స్వర్ణకుమారికి ఫోన్చేసి మిగిలిన టైల్స్ ముక్కలు కావాలని అడిగాడు. వచ్చి తీసుకోమని చెప్పడంతో ఇంట్లోకి ప్రవేశించిన భవానీప్రసాద్, వంట గదిలో ఉన్న స్వర్ణకుమారి మెడ చుట్టూ ఫోన్ చార్జింగ్ వైర్ను బిగించడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బతికి ఉందనే అనుమానంతో వంట గదిలో ఉన్న చాకుతో ఆమె ఎడమచేతి మణికట్టును కోశాడు. మృతురాలి మెడలోని రెండు పేటల బంగారు నానుతాడు (47 గ్రాములు), మృతురాలి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నేరం తన మీద పడకుండా ఉండేందుకు మృతురాలి ఫోన్లోని సిమ్ తీసిపారవేశాడు. ఫోన్ను స్థానికంగా ఉన్న రైల్వేస్టేషన్ సమీపంలోని బడ్డీ షాప్ వద్ద పడేశాడు. ఈక్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, నిందితుడు తన ఫోన్ను తన ఇంట్లోనే పెట్టి ఉండటం అనుమానాలను తావిచ్చింది. సాంకేతిక అంశాల ఆధారంగా స్వర్ణకుమారిని హత్యచేసినది భవానీప్రసాద్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి బంగారు నానుతాడు, చాకు, రెండు ఫోన్లు, బైక్, ఫోన్ అడాప్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భవానీప్రసాద్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు సందీప్, తాతాచార్యులు, సురేష్, పోలీసు సిబ్బందిని ఈసందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. -
పెన్షన్ ఫైల్స్లో చేతివాటం తగదు : యూటీఎఫ్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ఫైల్స్ పరిష్కారంలో డీటీవో కార్యాలయ సిబ్బంది చేతివాటాన్ని నివారించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా డీటీవో కార్యాలయంలో అధికారులను కలసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్ ఫైల్స్ ఏజీ నుంచి వచ్చినవి వెంటనే పరిశీలన చేసి ట్రెజరీలకు పంపడంలో డీటీవో కార్యాలయం సిబ్బంది తీవ్రజాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రిటైౖర్ అయిన పలువురు ఉపాధ్యాయుల ఫైల్స్ ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ జూలై నెలలో కూడా ఆమోదిత ఉత్తర్వులు మంజూరు చేయలేదన్నారు. పెన్షన్ ప్రతిపాదనలు తీవ్ర జాప్యంతోపాటు రిటైర్డ్ అయిన వారికి కనీస సమాచారం సైతం ఇవ్వడం లేదనిన్నారు. దీంతో ఆఫైళ్లు నెలల తరబడి వారి వద్ద పెండింగ్లో ఉంచుతున్నారన్నారు. ముడుపులు ముట్టచెబితేనే పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపించారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలని వారు కోరారు. డీటీవో కార్యాలయంలో వినతిపత్రం అందించిన వారిలో యూటీఎఫ్ నాయకులు కె.సంజీవరెడ్డి, పి.రామారావు, జె.కృష్ణ తదితరులు ఉన్నారు. -
హారికకు జెడ్పీ సీఈవో పరామర్శ
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై ఈనెల 12న గుడివాడలో దాడి జరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆమెను జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు పరామర్శించారు. డిప్యూటీ సీఈవో ఆనంద్కుమార్తో కలిసి శుక్రవారం ఆయన పెడన మండలం కృష్ణాపురం గ్రామంలో హారిక నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ దాడి ఘటనలో ధ్వంసమైన ప్రభుత్వ కారును కన్నమనాయుడు పరిశీలించారు. అయితే కారును ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టే అంశాన్ని విలేకరులు సీఈవో కన్నమనాయుడు వద్ద ప్రస్తావించగా, ఆ అంశంపై ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంపై గమనార్హం. -
పోలీస్స్టేషన్లో వైఎస్సార్ సీపీ నేతల నిర్బంధం
కోనేరుసెంటర్: ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది నాయకులను ఇనగుదురుపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్లితే...వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్ (సుబ్బన్న), ట్రెజరర్ థామస్నోబుల్, ఉపాఽఽధ్యక్షులు గూడవల్లి నాగరాజు, తిరుమలశెట్టి ప్రసాద్, కొలుసు హరిబాబు, కోఆప్షన్ సభ్యుడు తుమ్మలపల్లి జగన్నాధరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆపార్టీ కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్దకు చేరి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆందోళన చేశారు. తమ నాయకులను కలవాలని వారు కోరగా, అందుకు పోలీసులు అనుమతించలేదు. విషయం తెలుసుకున్న మరికొందరు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరడంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. విషయం తెలుసుకుని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు స్టేషన్ వద్దకు చేరుకుని తమ నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ సీఐ పరమేశ్వరరావును నిలదీశారు. అరెస్టయిన వారిని కలిసి మాట్లాడేందుకు పేర్ని కిట్టును అనుమతించడంతో ఆయన వెళ్లి వారితో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో వైఎస్సార్ సీపీ మహిళలు గురువారం చీపుర్లతో నిరసన తెలిపిన ఘటనపై టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనకు దిగిన నాయకులు, కార్యకర్తలు ఇనగుదురుపేట ఠాణా వద్ద ఉద్రిక్తత -
భార్య..అత్తను తీసుకురండి.. లేదంటే చచ్చిపోతా!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నా భార్య నాకు కావాలి... మా అత్తతో నేను ఇప్పుడే మాట్లాడాలి.. వాళ్లిద్దరూ ఇక్కడకు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ ఓ యువకుడు హల్చల్ చేసిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు న్యూఆర్ఆర్పేటకు చెందిన బేతంచర్ల వెంకట జానకీరామ్(26)కు గతేడాది వైఎస్సార్ కాలనీకి చెందిన చింతల వెంకటదేవితో వివాహమైంది. అయితే పెళ్లయిన కొన్ని నెలల నుంచే భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో రెండురోజుల కిందట వారి మధ్య మరింత గొడవ చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన జానకీరామ్ శుక్రవారం న్యూఆర్ఆర్పేటలోని తన తల్లి వద్దకు వచ్చి ఆమెను ఇంటిలో నుంచి బయటకు పంపించి తలుపులు వేసుకొని లోపలే ఉన్నాడు. తన భార్య, అత్తను పిలిపించి మాట్లాడాలని లేనిపక్షంలో నేను చనిపోతానంటూ కేకలు వేస్తూ వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్చేస్తూ నిప్పంటించుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న సింగ్నగర్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హూటాహూటిన సంఘటనా స్థలానికి చేరుకొని అతనితో మాట్లాడేందుకు చాలా ప్రయత్నం చేశారు. కాసేపటికి గ్యాస్ అయిపోవడంతో జానకీరామ్ ఇంట్లోని నూనె తన ఒంటిపై పోసుకొని చనిపోతానంటూ హడావుడి చేశాడు. ఎట్టకేలకు పోలీసులు అతని భార్య, అత్తను పిలిపించి మాట్లాడతామని హామీ ఇచ్చి బయటకు తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. పోలీసులు జానకీరామ్ తల్లి, భార్య, అత్తను పిలిపించి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇంటి తలుపులు మూసివేసి.. గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి హల్చల్. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు -
నైపుణ్యం పెంపుతోనే ఆర్థిక పురోగతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్థిక వ్యవ స్థలో ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యసాధనకు నీతిఆయోగ్ కృషి చేస్తోందని నీతిఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ అరవింద్విర్మానీ పేర్కొన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్షులు గడ్డం బాలవెంకటరవికుమార్ అధ్యక్షతన చాంబర్ సభ్యులతో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అరవింద్ విర్మానీ మాట్లాడుతూ దేశంలో విద్యావంతుల్లో చాలామందికి ఆయారంగాలలో నైపుణ్యం, ప్రావీణ్యం లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. విద్యతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకుని, మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసుకుంటేనే ఆయారంగాలో, దేశంలోనూ పురోగతి ఉంటుందన్నారు. అందరూ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఏదోగొప్పగా చెబుతున్నారని, దానికంటే ముందుగా మౌలిక సౌకర్యాలను కల్పించుకోవడం, నైపుణ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. సభ్యులు మాట్లాడుతూ జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా, ఆయా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని విర్మానీ తెలిపారు. అనంతరం అరవింద్ విర్మానీని చాంబర్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. చాంబర్ ఉపాధ్యక్షులు వి.వి.కె.నరసింహారావు, దర్శి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, కోశాధికారి తమ్మన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు ఈమని దామోదర్, బాలకిషన్ లోయ పాల్గొన్నారు. -
జంట హత్యల నిందితుడు అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అద్దెకు ఉంటున్న గదిలో చోటు, డబ్బుల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిందితుడు జమ్ము కిషోర్ విచారణలో వెల్లడించినట్లు ఏసీపీ పావన్కుమార్ తెలిపారు. ఈనెల 16వ తేదీ గవర్నర్పేటలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడు జమ్ము కిషోర్ను గవర్నర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్పేట స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ... విజయవాడ వించిపేట నైజం గేటుకు చెందిన జమ్ము కిషోర్ భార్యతో గొడవ పడి కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట రాము అనే కేటరింగ్ మేస్త్రి వద్ద ఉంటూ హోటళ్లలో పనిచేస్తున్నాడు. అతని వద్ద పనిచేసే వారికోసం రాము గవర్నర్పేటలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ రూమ్లో కిషోర్, నాగరాజుతోపాటు హత్యకు గురైన రాజు, వెంకట్ కలిసి ఉంటున్నారు. రూమ్లో చోటు, డబ్బు విషయంలో మద్యంమత్తులో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కిషోర్ను ఆ రూం నుంచి పంపించి వేయాలని రాజు, వెంకట్ నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం వంట పనులకు వెళ్లిన సమయంలో తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఈక్రమంలో 16వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజు, వెంకట్ ఉండడాన్ని గమనించి వారితో ఉద్దేశపూర్వకంగా గొడవ పడ్డాడు. వారిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డు వచ్చిన నాగరాజు, బాషా అనే వారిని తోసేసి అక్కడి నుంచి పారిపోయి, రైలులో సికింద్రాబాద్ చేరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం అధారంగా కిషోర్ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కిషోర్పై ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు వివరించారు. కేసును చేధించిన సీఐ అడపా నాగమురళి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
విజయవాడలో మద్యం, గంజాయి మత్తులో హత్యలు
గ్యాంగ్ వార్.. జూన్ 8న పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై క్రీస్తురాజుపురం ఆల్ఫా టీ సెంటర్ సమీపంలో కొందరు యువకులు, రౌడీ షీటర్లు మద్యం మత్తులో బీరు సీసాలు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసు స్టేషన్కు అతి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. పాత నేరస్తుడి హత్యాకాండ.. విజయవాడ గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో తనతో కలిసి అద్దెకు ఉంటున్న ఎం.రాజు, గాదె వెంకట్ అనే ఇద్దరు యువకులను జమ్ము కిశోర్ అనే రౌడీ షీటర్ మద్యం మత్తులో బుధవారం మధ్యాహ్న సమయంలో కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిపై ఇప్పటికే ఎనిమిది కేసులు కూడా ఉన్నాయి. శ్మశానంలో హత్య.. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల కిందట రామవరప్పాడు శ్మశానంలో మద్యం మత్తులో ఉన్న వైకుంఠం, చికెన్సాయి అనే వ్యక్తుల మధ్య వివాదం చెలరేగగా, చికెన్సాయి కోడిని కోసే కత్తితో వైకుంఠం ఛాతిపై బలంగా పొడవడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఒంటరిగా వెళ్లడమే పాపం.. విజయవాడ రైల్వే యార్డులో గతేడాది అక్టోబర్ 10వ తేదీన విధులలో ఉన్న లోకోపైలెట్ డి. ఎబినేజర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 2గంటల సమయంలో గంజాయి మత్తులో ఉన్న దేవ్కుమార్ అనే యువకుడు డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వనందుకు ఇనుపరాడ్లతో ఎబినేజర్పై దాడి చేయడంతో మృతి చెందాడు. మాటామాటా పెరిగి.. మే నెలలో మాచవరం పోలీసు స్టేషన్ పక్క రోడ్డులో మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో రాంబాబు అనే వ్యక్తిని మరొకరు బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. ఇది పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరిగింది. జంట హత్యలు.. వన్టౌన్ పోలీసుస్టేషన్కు సుమారు అరకిలోమీటర్ దూరంలో ఉన్న గద్దబొమ్మ సెంటర్కు సమీపంలో రెండు హత్యలు జరిగాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంల్లో హత్యలు జరగటం కలవరపాటుకు గురి చేసింది. బ్లేడ్ బ్యాచ్ దారుణం.. గతేడాది అక్టోబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్కు సమీపంలో ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యాపారి శ్యామ్గుప్తాను బ్లేడ్ బ్యాచ్కు చెందిన వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. అతనిని పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపు మరణించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వెలుగుచూసిన ఘటనలే కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జరిగాయి. విచ్చల విడిగా మద్యం, గంజాయి సులువుగా లభ్యమవుతుండటంతో మత్తోన్మాదులు పెచ్చుమీరుతున్నారు. నగరంలో అర్ధరాత్రి ఒంటరిగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఇవిగో సాక్ష్యాలు.. -
పబ్లిసిటీ తప్ప పర్యవేక్షణేది?
నగరంలో పోలీసులు డ్రోన్లు, సీసీ కెమెరాలు పెట్టామని నిఘా పెట్టామని హడావుడి తప్ప, క్షేత్ర స్థాయిలో బేసిక్ పోలీసింగ్ను గాలికి వదిలివేశారు. నగరంలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్తులపైన పోలీసులకు నియంత్రణ లేకుండా పోతోంది. జైళ్ల నుంచి విడుదల అవుతున్న పాత నేరస్తులపై నిఘా కొరవడింది. దీంతో దొంగతనాలు, చేసిన వాళ్లే మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. లాడ్జిల్లో తనిఖీలు జరగటం లేదు. రక్షక్, బ్లూకోట్స్ పనితీరు నామమాత్రంగానే ఉంది. ఈగల్ టీంలు కనిపించటం లేదు. నేరాల సమీక్ష ఉండటం లేదు. నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా, ఈ కెమెరాలు సంబంధింత పోలీస్స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం పూర్తి స్థాయిలో జరగటం లేదు, దీంతో సీసీ ఫుటేజీ అందుబాటులో ఉండటం లేదు. మొత్తం మీద నేరాల సంఖ్యను తక్కువ చేసి చూపడంలో భాగంగా పలు స్టేషన్లలో కేసులు సైతం నమోదు చేయడం లేదని తెలుస్తోంది. -
సారె తెచ్చి.. మనసారా కొలిచి..
భక్త బృందాలతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు బృందాలుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. ఘాట్రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు ప్రధాన ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని దర్శించుకుని సారెను సమర్పించారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. సారె సమర్పించే భక్తులకు రూ. 100, రూ. 300 క్యూలైన్లో ఉచితంగా అనుమతించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. భక్తుల ఇబ్బందులు.. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు రాజగోపురం, ఘాట్రోడ్డు, చిన్న గాలి గోపురం ప్రాంతాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ ప్రాంగణంలో కొన్ని చోట్ల కాయర్ మ్యాట్ వేసినా.. మిగిలిన చోట్ల భక్తులు కాళ్ల కాలుతుండటంతో పరుగులు పెట్టారు. -
కార్తికేయుని సన్నిధిలో పండుగ వాతావరణం
మోపిదేవి: పండుగ వాతావరణంలో సుబ్బారాయుడి పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో రెండో రోజు శుక్రవారం ఆషాఢ కృత్తిక పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ, వేదపండితులు, రుత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, నిత్యార్చన, నవకుంభారోపణం, ఏకాదశ ద్రవ్యాభిషేకం, అన్నాభిషేకం, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్టానాలు, హవనం, మూలమూర్తులకు ఉత్సవ మూర్తులకు పట్టు పవిత్రాల సమర్పణ, మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రదోష కాలార్చన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగం భక్తిశ్రద్ధలతో జరిపించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. -
దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ దంపతులను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు వాయిదా చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఆయా సంఘాల సభ్యులు హాజరుకాకపోవటంతో వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆయా ప్రభుత్వశాఖల అధికారులు హాజరైనప్పటికీ, చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సమావేశాలు నిర్వహణ సమయం ప్రకటించిన ప్రకారం వేచి చూసి, ఒక్కొక్క సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం సీఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ స్థాయీ సంఘ సమావేశాలకు సభ్యులు ఎవరూ హాజరు కాలేదని, సమావేశాలు నిర్వహించే తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చిలకలపూడి(మచిలీపట్నం): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేను శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. ఈ గ్రీవెన్స్ డేలో అధికారులు 29 అర్జీలు స్వీకరించగా, వాటిలో 9 రెవెన్యూ, ఆరు పోలీస్, మూడు డీఆర్డీఏ, ఇతర శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ వచ్చినట్లు డీఆర్వో తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో రానున్న రెండు రోజుల పాటు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తతతో జాగ్రత్తగా ఉండాలని, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామన్నారు. వర్షాలు, గాలుల సమయంలో భారీ హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర ఉండకూడదన్నారు. పిడుగులు కూడా పడే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ, పశునష్టం, పంట నష్టం జరగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 28న ప్రత్యేక పాస్పోర్టు శిబిరం కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిని రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపద ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో ప్రత్యేక పాస్పోర్ట్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉయ్యూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఎస్. రాజేష్ తెలిపారు. ఆయన ఎంపీడీవో డి. సుహాసినితో కలిసి శుక్రవారం కూచిపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ పాస్ పోర్ట్ శిబిరాన్ని విజయవంతం చేయడానికి సంయుక్తంగా కృషి చేయాలన్నారు. కళాపీఠం ఉప ప్రధాన చార్యులు చింతా రవి బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కేవీ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మిథున్రెడ్డి అరెస్ట్పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం
మిథున్రెడ్డి అరెస్టును ఖండించిన కాసు మహేష్రెడ్డికూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయితప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదుమిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారువైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం: ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికక్ష సాధింపు లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారుఏపీ లో కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారుమిథున్ రెడ్డి ఖచ్చితంగా న్యాయ పోరాటంలో విజయం సాధిస్తారువైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అరెస్ట్ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్రేపు కోర్టులో హాజరుపర్చనున్న సిట్లేని మద్యం కేసును సృష్టించి.. కుట్రలకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వంమిథున్రెడ్డి అరెస్ట్పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహంవిజయవాడసిట్ కార్యాలయంలో 6 గంటలకు పైన కొనసాగుతున్న ఎంపీ మిథున్రెడ్డి విచారణఏ సమయం వరకు విచారణ సాగిస్తారో చెప్పని అధికారులురాత్రికి సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథ్న్ రెడ్డిని ఉంచనున్నట్లు సమాచారంసిట్ కార్యాలయం బయట ఉదయం నుండి భారీ భద్రతలిక్కర్ కేసుకు సంబంధించి చార్జీ షీట్ను జడ్జి ఇంటికి తీసుకెళ్ళిన సిట్ అధికారులుజడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్ షీట్ను వెనక్కి తీసుకొచ్చిన సిట్ అధికారులు300 పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు సమాచారంపూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో ఉంచాలని చూస్తున్నారంటున్న వైఎస్సార్సీపీవిజయవాడమద్యం పాలసీ కేసులో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి విచారణవిజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్రెడ్డిఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్రెడ్డిసిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తిరుపతి..మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందివైఎస్సార్సీపీలో ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో పాటు మిగిలిన వారిని టార్గెట్ చేసుకుని ఇలా సిట్ వేధింపులకు గురిచేస్తున్నారు.50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదునీతిగా నిజాయితీగా పాలన చేశాంవైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది.. అవినీతికి అవకాశం లేదుఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచారుజగనన్న పాలనలో బెల్ట్ షాపులు లేవు.ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించాం అంబటి రాంబాబు కామెంట్స్..ఇది పూర్తిగా తప్పుడు కేసు.ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారు.మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా మద్యం అక్రమ కేసు.ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. తాడేపల్లి..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..ఏపీలో కక్షసాధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందిజగన్ చుట్టూ ఉండే కీలక నాయకుల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారుకూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుసాక్ష్యాలు ఏం ఉన్నాయో చూపాలని కోర్టు అడిగితే సిట్ చూపించలేక పోయిందిరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం2014-19 మధ్య అసలైన లిక్కర్ స్కాం జరిగిందిదాన్నుంచి తప్పించుకునేందుకే కొత్తగా మా పార్టీ నేతలపై కేసులు పెట్టారుఎంపీ మిథున్ రెడ్డి స్వచ్చందంగా విచారణకు హాజరయ్యారువిచారణ సందర్భంగా ఒక యుద్ద వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసిందిరోడ్డు పొడవునా పోలీసులను పెట్టి హడావుడి చేస్తోందిఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదుచిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఎంపీ గురుమూర్తి కామెంట్స్..మిథున్రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు.రాజకీయ కక్షతోనే మిథున్రెడ్డిపై కేసు.కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్చంద్రబాబు, నారా లోకేష్ కక్ష్య సాధింపుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.వైఎస్సార్సీపీలో కీలక నేత, జగన్ సన్నిహితుడు అయిన ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్రలు జరుగుతోంది.ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర.మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేని మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు.ఓ అభూత కల్పనతో దారుణాలకు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతున్నారుఇప్పటి వరకు అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవుఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, కొట్టడం చేస్తున్నారు.రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు మిథున్ రెడ్డి కామెంట్స్..రాజకీయ కక్షతో కేసు పెట్టారు.ఇది పూర్తిగా తప్పుడు కేసు.మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కేసులకు భయపడే ప్రసక్తే లేదు.రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు.సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డి. సిట్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు. విజయవాడ..ఎనికేపాడు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుగన్నవరం విమానాశ్రయం నుండి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు బయల్దేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు.సిట్ కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలుఎవరిని అనుమతించని పోలీసులుసిట్ కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణును ఆపేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి.మద్యం కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఏపీలో మద్యం కేసులో విచారణ విషయమై.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే మిథున్ రెడ్డి.. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.నేడు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో హంగామా చేస్తున్నారు.విమానాశ్రయం ఎంట్రన్స్లో భారీగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల వివరాలు అడిగి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం నేపథ్యంలో ఆంక్షలు విధించారు. -
ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి
మైలవరం: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మొర్సుమల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామానికి చెందిన జెట్టి శివకృష్ణ(16) పశువులను మేతకు తోలుకు వెళ్లాడు. పశువులు మేత మేస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగాయి. గేదెలను తోలుకు రావడానికి చెరువులోకి దిగిన శివకృష్ణ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాలువలోకి దూకిమహిళ ఆత్మహత్య పెనమలూరు: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళ బందరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మృతురాలి కుమార్తె నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి కుమారి(57) గత కొద్దికాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి ఒక రొమ్ము తొలగించారు. ఆమె ఆరోగ్యం కోలుకుంది. అయితే రెండవ రొమ్ముకు కూడా క్యాన్సర్ రావటంతో ఇటీవల అది కూడా తొలగించారు. ఆమెకు గుండె జబ్బు కారణంగా మరింత వైద్యచికిత్స చేయటానికి సమస్య తలెత్తింది. దీంతో బాధతో ఉన్న ఆమె ఈనెల 15వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమయింది. ఈ నేపథ్యంలో యనమలకుదురు లాకుల వద్ద బుధవారం రాత్రి శవం ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అది కుమారి మృతదేహమేనని గుర్తించారు.ఈ ఘటనపై ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం నిడుమోలు(మొవ్వ): మండలంలోని నిడు మోలు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పామర్రు మండలం కనిమెర్ల గ్రామానికి మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కూచిపూడి ఎస్ఐ కేఎన్ విశ్వనాథ్ తెలిపిన వివరాల మేరకు కొల్లి శ్రీలక్ష్మి (47) నిడుమోలు శివారులో వ్యవసాయం చేస్తుంది. గురువారం నాట్లు వేయించేందుకు నిడుమోలు వచ్చిన శ్రీలక్ష్మి మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా పామర్రు నుంచి బందరు వెళుతున్న టిప్పరు అతి వేగంగా వెనక నుంచి ఢీకొట్టింది. టిప్పరు సుమారు 50 అడుగుల మేర ఈడ్చుకు వెళ్లటంతో శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతురాలి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూచిపూడి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త గతంలో మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మంత్రి కొల్లుకు మహిళల సెగ
● జెడ్పీ చైర్పర్సన్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన ● చీపురులతో ఆయన ఫొటోలను కొడుతూ నిరసన మచిలీపట్నంటౌన్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు మహిళల సెగ తగిలింది. కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికను కొల్లు రవీంద్ర మహానటిగా అభివర్ణిస్తూ, తోటి బీసీ మహిళను చులకనగా మాట్లాడడాన్ని నిరసిస్తూ మహిళలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి సమీపంలోని జవ్వారుపేట సెంటర్లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురులను చేపట్టి మంత్రి కొల్లు రవీంద్ర ఫొటోలను కొడుతూ నిరసన తెలిపారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర.., డౌన్ డౌన్ కొల్లు రవీంద్ర.., మహానటుడు కొల్లు రవీంద్ర.., జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికకు మంత్రి రవీంద్ర క్షమాపణ చెప్పాలి.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనుకోని ఘటన జరగడంతో మానసిక ఒత్తిడికి గురై కంట తడి పెట్టిన హారికను మహానటిగా అభివర్ణించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ హారికకు మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం మచిలీపట్నం సౌత్ అధ్యక్షురాలు కర్రా స్వప్న, పలువురు మహిళా కార్పొరేటర్లు, పలు డివిజన్లకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రారండోయ్ కొండకు పోదాం.. దుర్గమ్మకు సారె ఇద్దాం
● కుటుంబ సమేతంగా తరలివస్తున్న భక్తులు ● భక్త బృందాలతో ఇంద్రకీలాద్రి కిటకిట ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో అమ్మవారికి సారెను సమర్పించేందుకు గ్రామాలకు గ్రామాలు తరలివస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా అమ్మవారి చెంతకు చేరుకుంటున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని సారెను సమర్పిస్తున్నారు. అమ్మవారికి సారెను సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో నిత్యం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారికి సారెను సమర్పించేందకు విచ్చేసిన భక్త బృందాలు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకుంటున్నారు. అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెగా తీసుకువచ్చిన చీరలు, పూలు, పండ్లు, మిఠాయిలు, పొంగలి అన్నం, పాయసాలను సమర్పిస్తున్నారు. సారె సమర్పించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవారి తరఫున దీవెనలు అందజేస్తున్నారు. సారె సమర్పించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సారె సామగ్రిని ఒకరికి మరొకరు పంచుకుని పండుగ చేసుకుంటున్నారు. -
ఊపిరి...ఉఫ్!
తెలిసీ తెలియని వయసులో యువకులు సరదాగా చేసుకున్న అలవాటు వారికి జీవితకాలపు వ్యసనంగా తయారవు తోంది. వారి ఆయుర్దాయాన్ని సగానికి సగం తగ్గించేస్తుంది. ఒక్కో సిగరెట్ జీవితకాలంలో ఒక్కో నిమిషాన్ని తగ్గిస్తుంది. ప్రాణాంతక వ్యాధులకు గేట్లు తెరిచి ఆహ్వానం పలుకుతుంది. నిండు జీవితాన్ని ఉఫ్న ఊదేస్తుంది. ● ధూమపానం ప్రాణాంతక వ్యాధులకు ఆహ్వానం ● మనిషి జీవిత కాలాన్ని తగ్గించేస్తున్న సిగరెట్ ● ఏటా పెరుగుతున్న పొగాకు బాధితులు ● గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, రక్తపోటుకు దారితీస్తున్న వైనం ఎలా మానవచ్చు... ● సిగరెట్ తాగాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక గంట వాయిదా వేసుకోండి. అలా చేస్తే రోజు మొత్తంలో తాగే సిగరెట్ల సంఖ్య కొంతవరకై నా తగ్గించుకోవచ్చు. ● బాగా సిగరెట్ తాగాలనిపించినప్పుడు నిలబడి లేదా కూర్చుని లోతైన శ్వాస తీసుకోండి. అప్పుడు ఓ గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ● సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు కళ్లెదుట దృష్టిలో పడకుండా ఉంచండి. ● సిగరెట్ తాగాలనిపించినప్పుడు నోట్లో చూయింగ్ గమ్, ఏదైనా స్వీట్, పిప్పర్ మెంట్ లాంటివి పెట్టుకుని, లోతైన శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ● పౌష్టికాహారం తీసుకోవడం వలన పొగ తాగడానికి ఆకర్షితులవ్వం. లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో ధూమపానం చేసేవారే అధికంగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ధూమపానం చేసే వారిలో దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులు కూడా సరిగా పనిచేయవంటున్నారు. అలాంటి ధూమపానం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేటి సమాజంలో ఫ్యాషన్ కోసం కొంతమంది సిగరెట్ తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. టీవీల్లో వచ్చే ప్రకటనలు, సినిమాల్లో హీరోలను అనుసరిస్తూ చాలా మంది యువకులు పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఏటా పెరుగుతున్న బాధితులు పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతిఏటా 30 వేల మంది వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, లివర్, శ్యాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. లంగ్, గొంతు క్యాన్సర్ బాధితులు ఇటీవల జిల్లాలో పెరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కారణంగా పొగ పీల్చే వారు సైతం పలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ధూమపానం కారణంగా నమోదైన క్యాన్సర్ కేసుల్లో 10 శాతం మందిలో సిగరెట్ తాగకపోయినా పొగ పీల్చడమే కారణంగా బాధితులవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంపై చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోవడం లేదు. ధూమపానంతో వచ్చే రుగ్మతలివే... ● పొగతాగడం వలన శరీర భాగాలైన గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. ● గుండె రక్తనాళాలు బిరుసుగా మారి హార్ట్ ఎటాక్కు దారి తీస్తుంది. ● నాడీ సంబంధ వ్యాధులు, పక్షవాతంకు దారి తీస్తుంది. ● మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కారణం ● దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై ప్రభావం చూపుతుంది. ● పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల సంఖ్య తగ్గి, రుతుక్రమం త్వరగా నిలిచిపోతుంది ● శారీరక సామర్ధ్యం, ఎముకల పటుత్వం తగ్గుతుంది. మందులు పనిచేయవు ధూమపానం చేసేవారిలో మందులు పనిచేయని పరిస్థితి నెలకొంటుంది. దీంతో మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ధూమపానం చేస్తే మందులు వాడినా అదుపులోకి రావడం కష్టంగా మారతుంది. రక్తంలో మూడు నెలల చక్కెర స్థాయిలు(హెచ్బీఎ1సీ) 7శాతం కంటే తక్కువ ఉండాలి. కానీ రక్తంలో నికోటిక్ కలవడం వలన మరో 3 నుంచి 4 శాతం అధికంగా ఉంటుంది. ధూమపానం చేసేవారిలో మధుమేహం కారణంగా వచ్చే దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. కంటి రెటీనా సమస్యతో పాటు, సైలెంట్ హార్ట్ఎటాక్, పక్షవాతం, కిడ్నీల సమస్యలు తలెత్తుతాయి.పాదాలకు పుళ్లు పడి తగ్గని పరిస్థితి ఉంటుంది. –డాక్టర్ టీవీ మురళీకృష్ణ, ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
యువతికి తీవ్రగాయాలు గన్నవరం: మండలంలోని మర్లపాలెం వద్ద ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, అతని స్నేహితురాలైన యువతి తీవ్రంగా గాయపడిన సంఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం...ఆగిరి పల్లి మండలం ఈదులగూడెంకు చెందిన ఈడే పవన్కుమార్(22) విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగిగా చేస్తున్నాడు. చిన్నఅవుటపల్లి మండలం పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఇబ్రహీంపట్నంకు చెందిన గరికపాడు భాగ్యలక్ష్మితో అతనికి ఇటీవల స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి భాగ్యలక్ష్మిని బైక్పై ఎక్కించుకున్న పవన్కుమార్ జాతీయ రహదారి బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపు బయలుదేరారు. అతివేగంగా బైక్ నడుపుతున్న పవన్కుమార్ మర్లపాలెం వద్ద రహదారిపై ఆగివున్న లారీని ప్రమాదవశాత్తు వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, భాగ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వారి మిత్రులు అక్కడికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న భాగ్యలక్ష్మిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్కుమార్ మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి అతని బంధువులకు అప్పగించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇదే ఆస్పత్రికి చెందిన నర్సింగ్ కళాశాలలో స్టాఫ్ నర్సు కోర్సు పూర్తిచేసిన భాగ్యలక్ష్మి నాలుగు రోజుల క్రితం నర్సుగా ఉద్యోగంలో చేరినట్లు సహచర విద్యార్థులు తెలిపారు. -
బెంజిసర్కిల్ వద్ద కారు బీభత్సం
సాక్షినెట్వర్క్(విజయవాడ): బెంజిసర్కిల్ వద్ద గురువారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడిపే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో ముందు వెళ్లే రెండు కార్లను ఢీకొట్టి, రోడ్డు పక్కన ఉన్న మరో నలుగురు విద్యార్థినులను ఢీకొట్టగా వారికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బెంజిసర్కిల్ సమీపంలోని క్రోమా షోరూమ్ వద్ద జనం రద్దీగా ఉన్న సమయంలో ఓ కారు వేగంగా దూసుకు వచ్చింది. ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి, రోడ్డు పక్కన ఉన్న కళాశాల విద్యార్థినుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆ రెండు కార్లు దెబ్బతినగా నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను పటమటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పూటుగా మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.పోలీస్స్టేషన్లో రాచమర్యాదలుమద్యం మత్తులో కారు నడిపి నలుగురు విద్యార్థులను గాయపరిచిన న్యూ ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్లి ఆదినారాయణకు పటమట పోలీస్స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారు. ఆయన నగరంలోని ఓ ఏసీపీకి బాగా కావాల్సిన వ్యక్తి కావడంతోనే అలా చేస్తున్నారని బాధితులు అంటున్నారు. అంతేకాదు మద్యం మత్తులో కారు నడిపిన అతన్ని తప్పించి మరో డ్రైవర్పై కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సామాన్య ప్రజలు మద్యం తాగి పట్టుబడితే రూ.10వేలు, రూ.15 వేలు జరిమానాలు వేసే పోలీసులు, తమకు తెలిసిన వారైతే, మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించినా స్టేషన్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్యపాయకాపురం(విజయవాడరూరల్): పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపం చెందిన భర్త సలాది సురేష్ (36)గురువారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు, వాంబే కాలనీ డోరు నంబరు 270, ఎఫ్ బ్లాక్కు చెందిన సలాది సురేష్కు ఉయ్యూరుకు చెందిన మహిళతో 2022లో వివాహం జరిగింది. వీరికి సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య కలహాలు రేగాయి. ఈ నేపథ్యంలో సురేష్ భార్య గత ఫిబ్రవరిలో పుట్టింటికి వెళ్లింది. పెద్దలను పంపినా ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన సురేష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంచెతో ఉరి వేసుకున్నాడు. మృతుని తల్లి సలాది నాగమణి ఇంటికి వచ్చేటప్పటికి సురేష్ ఉరి వేసుకొని వేలాడుతుండడంతో స్థానికుల సహాయంతో కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో స్వీటుబండి వ్యాపారి మృతిపెనమలూరు: పోరంకి–నిడమానూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం నిడమానూరుకు చెందిన ప్రజాపతి మోనారామ్(40) స్వీట్ బండి వ్యాపారం చేస్తాడు. అతను రాజస్థాన్ రాష్ట్రం కిషన్గఢ్ గ్రామం నుంచి కొద్ది సంవత్సరాల క్రితం నిడమానూరుకు వచ్చి భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. గురువారం మోనారామ్ బైక్పై పోరంకి నుంచి నిడమానూరుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మోనారామ్ తలకు బలమైన గాయమయింది. గాయపడిన అతనిని కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రజకీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులకు ఐఐటీ సీట్లు
విస్సన్నపేట: అతి సాధారణ రైతు కుటుంబంలో నుంచి ఇద్దరు సోదరులు ఐఐటీలో సీట్లు సాధించి గర్వకారణంగా నిలిచారు. విస్సన్నపేటకు చెందిన నెక్కళపు సూర్యనారాయణ, అంజమ్మ దంపతుల చిన్న కుమారుడు చిట్టిబాబు హైదరాబాద్లో సీబీఐ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. చిట్టిబాబు, సునీత దంపతుల చిన్న కుమారుడు దీపక్ చౌదరి 2025 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 8,380 ర్యాంకు సాధించి ఐఐటీ పాలకడ్లో బీటెక్ ఇన్ డేటాసైన్స్లో సీటు సాధించాడు. అతని అన్న పవన్ సూర్య 2023లో జేఈఈ అడ్వాన్స్డ్లో 903 ర్యాంక్ సాధించి ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్లో సీటు సాధించాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ము లు ఐఐటీలో సీట్లు సాధించినందుకు గ్రామంలో పలువురు వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జంట హత్యల కేసులో నిందితుడు అరెస్టు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చంపి పారిపోయిన రౌడీషీటర్ జమ్ము కిషోర్ను గురువారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ గవర్నర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భవనంలో అద్దెకు ఉంటూ కేటరింగ్ పనులు చేసే ఇద్దరు వ్యక్తులు బుధవారం హత్యకు గురైన విషయం విదితమే. కొత్తపేట స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ జమ్ము కిషోర్ మద్యం మత్తులో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీ సులు నిర్థారణకు వచ్చారు. పూటుగా మద్యం తాగి రాజు, వెంకట్ అనే ఇద్దరితో గొడవ పడి వారిద్దరినీ కత్తితో పొడిచి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం ఏడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని స్నేహితులు, పాత నేరస్తుల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితుడు సికింద్రాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడు కిషోర్ను అరెస్టుచేసి విజయవాడ పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. ఇదిలావుండగా హత్యకు గురైన రాజు, వెంకట్ మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించారు. కిషోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అతని నుంచి హత్యకు గల కారణాలు, ఒకడే హత్య చేశాడా? ఇంకా ఎవరైనా సహకరించారా తదితర సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. -
రేపు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర
● విద్యా సంస్థల్లో ఎకో క్లబ్లను క్రియాశీలం చేయాలి ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం శ్ఙ్రీప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాంశ్రీశ్రీ అనే ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో పాటు వివిధ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాల విజయవంతానికి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు మార్గదర్శకాలు ఇచ్చిందని, ఇందులో భాగంగా ఈ నెల ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్తో కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, కరపత్రాలు, కళా ప్రదర్శనలు, డిజిటల్ కంటెంట్ తదితరాల ద్వారా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ దుష్పరిణామాలు, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో గ్లాస్ బాటిల్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్యాకింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. రైతు బజార్లు, అన్ని రకాల దుకాణాల్లోనూ పాలిథిన్ సంచులు ఉపయోగించకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఎకో క్లబ్లను క్రియాశీలం చేసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్లుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా జాగృతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
కోనేరుసెంటర్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. కృష్ణా జిల్లా బందరు మండలం కరగ్రహారం గ్రామంలో నిర్మించనున్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం నిర్మాణ పనులకు గురువారం ఆమె రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ యార్లగడ్డ రాము, ఐజీపీ అశోక్కుమార్, ఎస్పీ గంగాధర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. బందరులో దాదాపు 46 ఎకరాల్లో ఏర్పాటవుతున్న పోలీస్ శిక్షణ కేంద్రం మచిలీపట్నానికి తలమానికం కానుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాలు ఘోరాలు జరగ కుండా నిరంతర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతంలోనే మైరెన్ పోలీసు స్టేషన్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.32 కోట్ల వ్యయ అంచనాతో 46 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్రాజా, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హోం మంత్రి అనిత మచిలీపట్నంలో పోలీసు శిక్షణ కేంద్రం నిర్మాణ పనులకు భూమిపూజ -
బీసీల రాజ్యమంటూనే బీసీ మహిళపై దాడులా?
పెడన: బీసీల రాజ్యమంటూనే బీసీ మహిళలపై దాడులా.. ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము దంపతులపై కూటమి గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్ద, మహాత్ముని పాదాల వద్ద వినతిపత్రాలను ఉంచి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ హారిక, రాము దంపతులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపీ రాజులపాటి వాణి, జెడ్పీటీసీ మైలారత్నకుమారి, పెడన మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ చారుమతి, మహిళా నాయకులు వన్నం శ్రీలత, పాముపుష్ప, బొడ్డు శ్యామల, జ్యోతి, బేగం, రెహతున్నీసా, గుడిసేవ లక్ష్మీరాణి, ఎంపీపీలు సంగా మధుసూదనరావు, వెలివెల చినబాబు, జెడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? న్యాయం జరగకపోతే పోరాటం మరింత తీవ్రతరం వైఎస్సార్ సీపీ శ్రేణులు పెడనలో కొవ్వొత్తుల ర్యాలీ -
‘రెడ్బుక్’తో అరాచకాలు అధికమయ్యాయి
పెడన: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలు అధికమయ్యాయని, మహిళలపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. గురువారం ఆయన పెడన మండలం కృష్ణాపురంలోని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము దంపతుల నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆయనతో పాటు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుల్లా మేరీకుమారి, రాష్ట్ర బొందిలి సంఘం అధ్యక్షుడు నరేంద్రసింగ్, ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, బలిజ సంఘం రాష్ట్ర కన్వీనర్ పాల రాంబాబు, నరసాపురం చేనేత విభాగం అధ్యక్షుడు కరేళ్ల ముక్తేశ్వరరావు, వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ చల్లబోయిన ఆంజనేయులు, గౌడ సంఘ నాయకుడు బొక్కా సత్యనారాయణ, రజక సంఘ నాయకులు చెంచినాడ జైశ్రీను, వెంకటేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీరంశెట్టి పూర్ణచంద్రరావు, కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్ తదితరులు హారిక, రాము దంపతులను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఏపీని దిగజారుస్తున్న ఎన్డీయే సర్కార్ వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ ఆడవారిపై దాడులు చేసే నీచ సంస్కృతికి ఎన్టీయే కూటమి ఏపీని దిగజార్చే స్థితికి తీసుకువస్తోందన్నారు. ఎదుటివారిపై దాడి చేయడమే కాకుండా బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి హింసించాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ మాట్లాడుతూ గుడివాడలో రాము, హారిక దంపతులపై దాడి దారుణమన్నారు. చంద్రబాబు పేదలకు అన్యాయం చేసి కర్రపెత్తనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆయన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎంబీసీ విభాగం అధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు అక్కడే ఉన్నా టీడీపీ, జనసేన గూండాల దాడులను నిలువరించకపోవడం దారుణమన్నారు. ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఉప్పాల హారికకు నేతల పరామర్శ -
ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటాలి
జి.కొండూరు: ఐఐటీ, నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి గురుకుల పాఠశాలల సత్తా చాటాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. జి.కొండూరు మండల పరిధిలోని కుంటముక్కల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలతో పాటు తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాలు, స్టోర్ రూమ్ను పరిశీలించారు. బియ్యం, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఈ, నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో వసతుల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. బాలికల భద్రతకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సిబ్బందికి చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో నియమించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర నారాయణ, క్రిస్టియన్ మైనార్టీ విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రుద్రపాటి తేజ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సికిల్సెల్ ఎనీమియా సర్వే సక్రమంగా చేయండి లబ్బీపేట(విజయవాడతూర్పు): సికిల్సెల్ ఎనీమియా సర్వేను సక్రమంగా చేయాలని, ప్రతి రోగిని గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఇళ్ల వద్ద ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి, పీఎం జేఏవై పథకం ఆవశ్యకతను వివరించారు. కంచికచర్లలోని సొసైటీ బజారులో ప్రతి ఇంటికీ వెళ్లారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ప్రసవాలు పెంచాలని వైద్యుడు, సిబ్బందిని ఆదేశించారు. కార్య క్రమంలో ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ స్నేహసమీర, డాక్టర్ బీవీ వసుంధర, సూపర్వైజర్ జీవీ రాఘవేంద్రరావు, ఎన్. శివప్రసాద్, రాణి, రోజా తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ కోర్సులను వినియోగించుకోండి వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్ స్కూల్ సేవలను అర్హులైన వారు వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గురువారం ఓపెన్ స్కూల్ కోర్సులపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు పైబడిన వారు, చదువు మధ్యలో మానివేసిన వారు, అక్షర జ్ఞానం కలిగిన వారు ఓపెన్ స్కూల్తో విద్యాభ్యాసం పొందవచ్చన్నారు. 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియెట్ పరీక్షలు దూరవిద్య ద్వారా రాయవచ్చని పేర్కొన్నారు. సార్వత్రిక విద్యాపీఠం స్థానికంగానే పరీక్ష కేంద్రం కేటాయిస్తుందని తెలిపారు. పది, ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన వారికి కూడా ఓపెన్ స్కూల్లో అవకాశం ఉందన్నారు. పదవ తరగతి ఏవైనా ఐదు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేయవచ్చని తెలిపారు. అన్ని వర్గాలకు ఓపెన్ స్కూల్ మంచి అవకాశమన్నారు. ఓపెన్ స్కూల్లో చేరి విద్యాభ్యాసం చేయాలనుకున్నవారు స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాశాఖ అధికారులు లేదా జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ ప్రచారాన్ని ఆయన ఆ విభాగ అధికారులతో కలిసి ప్రారంభించారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025వర్షంతో ఊరట ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న విజయవాడవాసులకు గురువారం సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఊరటనిచ్చింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. తిరుపతమ్మకు సారె పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మకు గురువారం ఆలయ ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు సారె సమర్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కేంద్ర బృందం పరిశీలన గూడూరు: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా గూడూరులో అమలు అవుతున్న కార్యక్రమాలను కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. 7 -
దళారీ వ్యవస్థను సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతుబజార్లలో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ హెచ్చరించారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో గురువారం మార్కెటింగ్, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రైతు పండించిన పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి ప్రభుత్వం రైతుబజార్లు ఏర్పాటు చేసిందన్నారు. విజయవాడ అర్బన్లో తొమ్మిది, రూరల్లో ఆరు రైతుబజార్లు ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. ఉదయం ఆరు గంటలకే అన్ని రైతుబజార్లలో ఎస్టేట్ అధికారులు విధుల్లో ఉండి ధరల పట్టికను సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు. వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరిసరాలను, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్ను మెరుగుపరచాలని ఆదేశించారు. రైతుబజార్ల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని, విధుల్లో అలసత్వం వహించినా, ఫిర్యాదులు వచ్చినా సహించబోమని ఎస్టేట్ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు బి. రాజబాబు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు. రైతుబజార్లలో నిర్ణయించిన ధరలకే విక్రయించాలి జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
హే స్వామినాథా కరుణాకరా..
మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆషాఢ కృత్తిక మహోత్సవాలను గురువారం వైభవంగా ప్రారంభించారు. దేవదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో 11 మంది రుత్వికులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, అభిషేక జల సంగ్రహణం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం ఇతర పూజలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు వాస్తుహోమం, అంకురా రోపణ, ప్రధాన దేవతా సహిత సర్వతో భద్ర మండపారాధన, పట్టు పవిత్రాలు, ఆసాధన, చతుర్వేద స్వస్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేదపండితుడు ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన దోషాలు తొలగడానికి అభివృద్ధికి, భక్తుల సంకల్ప సిద్ధికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు అచ్యుత మధుసూదనరావు, బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు -
కూటమి అసమర్థ విధానాలతోనే దుస్థితి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీనికి నిదర్శనం ఈ ఏడాది ఒకటో తరగతిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 200 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో అడ్మిషన్ ఉండటమే. గత ఏడాది నుంచి కూటమి పాలకులు అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు తగ్గుతున్నాయి. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చడానికి ముందుకు రావడం లేదు. సాధారణంగా జూన్లోనే అడ్మిషన్ల హడావుడి కనిపిస్తుంది. కానీ జూలై 15 దాటినా వందల సంఖ్యల్లోని పాఠశాలల్లో చేరికలు లేకపోవటంతో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణల పేరుతో గందరగోళం కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యా శాఖలో గందరగోళం సృష్టిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులను బడికి దూరం చేయడం, సకాలంలో ఉపాధ్యాయుల భర్తీ చేయకపోవడం వంటి కారణాలతో సర్కారు బడుల్లో పిల్లల చేరిక తగ్గుతోందంటున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో వందలాది పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా కొత్తగా చేరకపోవడం ఆందోళనకర విషయంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పాఠశాల పేరుతో విద్యార్థులకు బడిని దూరం చేస్తోందని, దీంతో వారు ప్రైవేటు బడి బాట పడుతున్నారని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని కూటమి ప్రభుత్వం చెబుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పలువురు వివరిస్తున్నారు. అడ్మిషన్లపై వసతుల ప్రభావం వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి విద్యారంగాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. గత ప్రభుత్వం నాడు–నేడు పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయా పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అదే క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెండో విడత చేపట్టిన పనులు ఎన్నికల ఫలితంగా మధ్యలో నిలిచిపోయాయి. అనేక చోట్ల అదనపు తరగతి గదులు కూడా పూర్తికాలేదు. కేవలం 40 నుంచి రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తే కనీసం 300 విద్యాసంస్థల్లో వందలాది తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపడం లేదని పలువురు విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 200 ప్రభుత్వ బడుల్లో జీరో అడ్మిషన్ పాఠశాలల్లో వసతులపై శ్రద్ధ ఏదీ! పట్టించుకోని పాలకులు పిల్లలను చేర్చడానికి ముందుకు రాని తల్లిదండ్రులు పాలకుల నిర్లక్ష్యమే కారణం పాలకుల నిర్లక్ష్యమే పాఠశాలలను పేదలకు దూరం చేస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద సంఖ్యలో పాఠశాలల్లో జీరో అడ్మిషన్ చోటు చేసుకోవడం దారుణం. బదిలీలు, విలీనాల పేరుతో గందరగోళాలను సృష్టించారు. చాలా పాఠశాలల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. వసతులు లేకపోవడంతో పిల్లలను చేర్చటానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. –సీహెచ్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం ఉమ్మడి కృష్ణాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 3,242 వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 2200 పైచిలుకు ఉన్నాయి. ఏటా ఒకటి, ఆరో తరగతుల్లోనే ప్రధానమైన అడ్మిషన్లు జరుగుతుంటాయి. మిగిలిన తరగతుల్లోకి ఒకటి రెండు అడ్మిషన్లు జరిగినా ప్రధానంగా ఆ రెండు తరగతుల్లోనే చేరికలు ఉంటాయి. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 200 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క అడ్మిషన్ సైతం జరగలేదని అధికార నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా కృష్ణాజిల్లాలో సుమారు 150కు పైగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఒక్కటి కూడా జరగలేదని అధికార నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై కలెక్టర్ సైతం విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనకంజ వేస్తున్నారు. పాఠశాలల విలీనం, ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయడం అనేక కారణాలతో పేదలకు పాఠశాలలను దూరమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం -
మంత్రి కొల్లు ఇంటి ముందు వైఎస్సార్సీపీ మహిళా నేతల నిరసన
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి ముందు వైఎస్సార్సీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు. చీపుర్లతో కొల్లు రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పాల హారికకు కొల్లురవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు.మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లోవాళ్లేనా?. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించైతే ఇలానే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఉప్పాల హారిక భర్త రాముపై కేసు పెట్టడం దుర్మార్గం. తక్షణమే మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలి. ఉప్పాల హారికకు క్షమాపణ చెప్పేవరకూ మా పోరాటం ఆగదు’’ వైఎస్సార్సీపీ మహిళా నేతలు హెచ్చరించారు. -
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ కారు ధ్వంసంపై కేసు ఏది?
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 12న కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ఘటనలో జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గుడివాడలో జరుగుతున్న వైఎస్సార్సీపీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన జెడ్పీ చైర్పర్సన్ కారుపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన వాహనం. ఈ ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా జిల్లా పరిషత్ అధికారులు ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు అధికారులు లోనయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా పరిషత్ సీఈవో కె.కన్నమనాయుడును ‘సాక్షి’ వివరణ కోరగా చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచనల మేరకు కారులో ప్రయాణిస్తున్న తమ కార్యాలయ డ్రైవర్, అటెండర్ల రాతపూర్వక స్టేట్మెంట్లను తీసుకుని అప్పుడు ఫిర్యాదు చేస్తామని చెప్పటం గమనార్హం. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటన గురించి ఇంతవరకు జెడ్పీ సీఈవో అడగటం గాని, గాయపడిన చైర్పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించటం గాని జరగలేదంటే ఆయన కూటమి నాయకుల చెప్పుచేతల్లో ఉన్నారనే విషయం అర్థమవుతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
ముగిసిన స్పెషల్ ‘కేటగిరీ’ సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్–2025 (ఎంపీసీ) పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం సాయంత్రంతో ముగిసింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, విభిన్న ప్రతిభావంతులు, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అభ్యర్థులు.. వారు పొందిన ర్యాంకుల ఆధారంగా తేదీలను కేటాయించి, సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. సీఏపీ–28, విభిన్న ప్రతిభావంతులు–129, స్కౌట్స్ అండ్ గైడ్స్–61 మంది చొప్పున 218 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను బుధవారం పరిశీలించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. ఈ నెల 18వ తేదీలోగా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 19వ తేదీన నమోదు చేసుకున్న వెబ్ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని, ఈ నెల 22వ తేదీ సాయంత్రం సీట్ అలాట్మెంట్ వివరాలను ఆన్లైన్లో విడుదల చేస్తారని తెలిపారు. తిరుమలగిరి నుంచి దుర్గమ్మకు సారె తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి తరఫున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా బుధవారం సారె సమర్పించారు. ఆలయ ఈవో సాంబశివరావు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, భక్తులు, సిబ్బంది అమ్మవారికి పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భరద్వాజ్, ప్రదానార్చకుడు రామకృష్ణమాచార్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో క్షయ నివారణ చర్యల పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఆ బృందంలోని సభ్యులు డాక్టర్ భావనీసింగ్ కుశ్వహా, టీబీ ఆఫీసర్ ఈ. దర్మారావు, గంగాధర్ దాస్లతో పాటు రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రమేష్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి సోకిన వారికి ఇచ్చే మందులు, వ్యాధి రాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలు, జాగ్రత్తలపై నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. అందులో భాగంగా ఏపీఐఐసీ కాలనీలోని యూపీహెచ్సీ, ప్రభుత్వాస్పత్రిలోని టీబీ ల్యాబ్, అక్కడ నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. అనంతరం టీవీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవ్య మహిళా మండలిని సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, జిల్లా టీబీ అధికారి డాక్టర్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు బీమాపై అవగాహన కల్పించండి చిలకలపూడి(మచిలీపట్నం): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులందరూ బీమా చెల్లించేలా అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులందరూ బీమా ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం జిల్లాలో 46 మంది రైతులు మాత్రమే బీమా చెల్లించటం ఆశ్చర్యకరంగా ఉందని, బీమా ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ప్రీమియం కట్టేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు, ఏడీ మణిధర్, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్ల దోపిడీపై ప్రజా ఉద్యమం
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై విద్యుత్తు భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సామాన్యులకు అండగా ఉండాలంటే ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుదల వ్యతిరేక ఐక్య ప్రజా వేదిక ఆధ్వర్యంలో స్థానిక బుట్టాయిపేట జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కళ్లెం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి లింగం ఫిలిప్ అధ్యక్షత వహించారు. నరసింహారావు మాట్లాడుతూ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఒప్పుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ తెలుగుదేశం, జనసేన పార్టీలు మోదీకి సాగిలపడి ప్రజల ప్రయోజనాలను తుడిచి పెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. జూలై 17– 22 తేదీల మధ్య సదస్సులు నిర్వహణ, 23 – 29 తేదీల మధ్య ఇంటింటి ప్రచారం సంతకాల సేకరణ కార్యక్రమం, జూలై 30 – ఆగస్టు 4వ తేదీల మధ్య వీధి సమావేశాలు, ప్రదర్శనలు ఆగస్టు 5వ తేదీన విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని సంఘాల నాయకుల హాజరు.. ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు జి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో బిగించకుండా చేపట్టే ఉద్యమంలో భాగంగా ప్రజా వేదిక రూపొందించిన తీర్మానాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు ప్రవేశపెట్టగా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వివిధ పక్షాల సభ్యులు చేతులెత్తి మద్దతు తెలియజేశారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు, టైలర్స్ అసోసియేషన్ మచిలీపట్నం నగర అధ్యక్షుడు రామాంజనేయులు, ఏఐటీయూసీ, కు ల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంఘం, ఐద్వా, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. -
మచిలీపట్నంలో నిరుద్యోగాన్ని రూపుమాపుతాం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపుతానని, వచ్చిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఆవరణలో బుధవారం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఆయన వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమానికి 2,328 మంది నిరుద్యోగులు హాజరుకాగా, వీరిలో వివిధ కంపెనీల్లో 646 మంది ఉద్యోగాలు పొందారు. మరో 137 మందికి తర్వాతి ఇంటర్వ్యూలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 2026 జూన్–డిసెంబర్ నాటికి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయి రవాణా రాకపోకలు మొదలవుతాయన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు, సీ డాప్ జేడీఎం సుమలత, జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మంత్రి రవీంద్ర -
రెండు ఆటోలు ఢీ ఏడుగురికి గాయాలు
పులిగడ్డ(అవనిగడ్డ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగడ్డ టోల్ప్లాజా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కొందరు ఆటోలో మోపిదేవి ఆలయానికి వచ్చి తిరిగి వెళుతుండగా, రేపల్లె వైపు నుంచి వస్తున్న కోడిగుడ్ల ఆటో లారీని తప్పించబోయి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీరరాఘవమ్మ, కోసూరు అరుణతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరరాఘవమ్మ, అరుణను మచిలీపట్నం తరలించగా, స్వల్పగాయాలైన మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రూ.32 లక్షల విలువైన ఎరువులు సీజ్ తిరువూరు: సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎరువులు విక్రయిస్తున్న తిరువూరులోని రెండు ఫెర్టిలైజర్స్ దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. తిరువూరులోని ఓ దుకాణంలో రూ.25,44,990 విలువైన 109.673 టన్నుల ఎరువులు, మరో దుకాణంలో రూ.7.62 లక్షల విలువైన 29,300 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు తిరువూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఏవీఎస్ రంగారావు తెలిపారు. ఫారం లేకుండా, స్టాక్ రిజిస్టరులో వివరాలు నమోదు చేయక, లైసెన్సులో సరైన సమాచారం పొందుపరచకపోవడంతో ఆయా దుకాణాల్లో గుర్తించిన ఎరువుల విక్రయాలను నిలిపివేశామన్నారు. డీలర్లు బిల్ బుక్ ఫారం, స్టాక్ రిజిస్టర్ తప్పక నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీలో విజిలెన్స్ అధికారులు హనుమంతరావు, నాగరాజు, వెంకటేష్, పద్మ, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు కోచ్లలో సీసీ కెమెరాలు
ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్లో ఏర్పాటు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత దృష్ట్యా భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైలు కోచ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా విజయవాడ డివిజన్లోని కోచింగ్ డిపోలో విజయవాడ–లింగంపల్లి ఎక్స్ప్రెస్ రైలులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ నూతన సాంకేతికతను ప్రదర్శించడానికి బుధవారం గైడెడ్ మీడియా టూర్ నిర్వహించారు. ప్రయోగాత్మకంగా.. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ రైల్వే నెట్వర్క్లో డిజిటల్ భద్రత, ఆధునికీకరణ దిశగా ముందుకు వెళ్తోందన్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 74వేల కోచ్లు, 15 వందల లోకోమోటివ్లలో హై–డెఫినిషన్ సీసీ కెమెరాలను ఏర్పాటుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిందన్నారు. ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్లో విజయవాడ–లింగంపల్లి ఎక్స్ప్రెస్లోని రెండు ఏసీ కోచ్లలో సీసీ కెమెరాలను అమర్చామన్నారు. ఒక్కో కోచ్లో ఆరు హై–డెఫినిషన్ డోమ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద రెండు, కోచ్ లోపల మార్గంలో రెండు కెమెరాలు ఏర్పాటు చేశామని, అదే విధంగా లోకోమోటివ్లో ఆరు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రతా వ్యవస్థ బలోపేతం.. ఈ చొరవ కేవలం నిఘా గురించి మాత్రమే కాదని, ఇది మొత్తం భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తుందని డీఆర్ఎం చెప్పారు. త్వరలోనే దశలవారీగా అధిక రద్దీ మార్గాలలో నడిచే అన్ని రైళ్లలోను కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఏడీఆర్ఎం పీఈ ఎడ్విన్, సీనియర్ డీఎంఈ సంజయ్ అంగోతు, డిజిల్ లోకోషేడ్ డీఎంఈ జి.ఉదయ్ భాస్కర్, కోచింగ్ డిపో ఆఫీసర్ హరి శివప్రసాద్, పీఆర్ఓ నుస్రత్ ముండ్రూప్కర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ నుంచి పారిపొయొచ్చిన చిన్నారులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): హైదరాబాద్లోని మదర్ సా నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులను ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ హోమ్కు తరలించారు. బిహార్కు చెందిన 12 ఏళ్ల వయసు కలిగిన ఐదుగురు బాలురను వారి తల్లిదండ్రులు మూడు నెలల క్రితం హైదరాబాద్లోని మదర్ సాలో చేర్పించారు. అక్కడ భోజనం నచ్చకపోవడంతో పాటు అక్కడ ఉండడం ఇష్టంలేక అక్కడ నుంచి పారిపోయి హైదరాబాద్ బస్టాండ్లో విజయవాడ బస్సు ఎక్కి పీఎన్బీఎస్ బస్టాండ్కు చేరుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక గంటపాటు బస్టాండ్లోనే ఉన్నారు. బుధవారం ఉదయం వారిని గమనించిన ట్రస్ట్ ప్రతినిధి ఎం.గీతావాణి రెస్క్యూ చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాన్ని ఆమె చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ హోమ్కు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించామని, సోమవారం వచ్చి చిన్నారులను తీసుకెళ్తామని చెప్పినట్లు గీతావాణి తెలిపారు. -
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ భవానీపురంలోని మానవ మందిరం రోడ్డులో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రత్నాకరం జీవనసాయి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం నారాయణ కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆగ్రహంతో కళాశాల వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపేసి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, ప్రిన్సిపాల్, అధ్యాపకుడు ఎం.వి.రావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, నాయకుడు అరుణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్ను అరెస్ట్ చేసి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. యాజమాన్యం స్పందించకపోవడం దుర్మార్గం ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కళాశాల మాథ్స్ అధ్యాపకుడు ఎం.వి.రావు విద్యార్థి జీవనసాయిని విద్యార్థులందరి ముందు తీవ్రంగా కొట్టడమే కాకుండా దూషించి అవమానించడం వల్లే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. జీవనసాయి ఆత్మహత్యకు పాల్పడితే యాజమాన్యం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోమల్ సాయి, నాయకులు వి.రవీంద్ర, సురేంద్ర, జి.రవీంద్ర, పి. హోసన్న, ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, బీసీఎస్ఎఫ్ నేతలు షణ్ముఖ్, గణేష్, సాయికుమార్, కామరాజ్ హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న విద్యార్థి సంఘం నాయకులను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకుడు అడపా శేషు పరామర్శించారు. -
పాడి అభివృద్ధికి పెయ్య దూడల ఉత్పత్తి పథకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పాడి రైతులు, పాడి పరిశ్రమ అభివృద్ధికి నాణ్యమైన సెమెన్ అవసరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా మిల్క్ యూనియన్ పెయ్య దూడల ఉత్పత్తి పథకానికి శ్రీకారం చుట్టిందని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ పరిపాలన భవనంలో బుధవారం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలుత యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, జిల్లా పశువుల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.శ్రీనివాస్, గన్నవరం వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ వెంకట శేషయ్య, సమితి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు నాణ్యమైన సెమెన్ రైతులకు అందించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ చేపడుతున్న చర్యలపై చర్చించారు. రూ.150కే సెమెన్ డోస్ అనంతరం చైర్మన్ చలసాని మాట్లాడుతూ గ్రామాల్లోని నిరుద్యోగ యువత పాడి పరిశ్రమ వైపు అడుగులు వేస్తోందన్నారు. ఎన్డీడీబీ సహకారంతో నాణ్యమైన సెమెన్ డోస్ను కేవలం రూ.150కే అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ వీర్యం వల్ల పుట్టిన దూడల్లో 95 శాతం పెయ్య దూడలే జన్మిస్తాయని, దీంతో రైతులు దూడలను పెంచి పాడి గేదెలుగా అభివృద్ధి చేసుకుంటారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకు 70 వేలకు పైగా సెమెన్ను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ఆశలు ఆవిరి
తడారిన మడి.. నీళ్లు లేక నెర్రెలిచ్చిన చివరి ఆయకట్టు భూములుసాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్యం కృష్ణా డెల్టా రైతులకు శాపంగా మారింది. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులు చేయకపోవడంతో రైతుకు కన్నీరు మిగులుతోంది. అనువైన సమయంలో మిన్నకుండిపోయిన ప్రభుత్వం.. కాలువలకు నీటిని విడుదల చేసే సమయంలో నిధులు మంజూరు చేసి, చేతులు దులుపుకొంది. ఇప్పుడు పనులు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాలువలు తూటికాడ, గుర్రపుడెక్క పూడికతో నిండి ఉండటంతో సాగునీరు సక్రమంగా పారడం లేదు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు అందటం గగనంగా మారింది. దీనికి తోడు తీవ్ర వర్షాబావం నెలకొనడంతో భూములు నెర్రెలు చీలాయి. ఎద పద్ధతిలో సాగు చేసిన వరి కళ్లముందే ఎండిపోవటం చూసి రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. అరకొరగా వేసిన వరి నాట్లు ఎండిపోతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఆ మూడు నియోజకవర్గాల్లో.. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో రైతులు సాగునీరందక విలవిల్లాడుతున్నారు. పెడన, బంటుమిల్లి మండలాల్లో ఒకసారి వెద పద్ధతిలో వేసిన వరి పంట దెబ్బతినడంతో, రెండోసారి వేసుకునేందుకు కొందరు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మురుగు డ్రెయిన్ల సమీపంలో ఉన్న రైతన్నలు ఆ నీటిని తోడుతూ పంటను బతికించుకుంటున్నారు. కాలువల్లో నీరు పారడం లేదు.. బందరు, రైవస్, కేఈబీ, ఏలూరు కాలువలు తూటికాడ, గుర్రపు డెక్కతో నిండి ఉన్నాయి. పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు, అక్కడక్కడ కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి కోసం కోసం రూ. 26.03కోట్ల విలువైన 650 పనులను మంజూరు చేశారు. కానీ కాలువలకు సాగు నీరు విడుదల చేస్తుండటంతో నిర్వహణ పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటికిపోక అల్లాడిపోయే పరిస్థితులున్నాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర్ డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకోడు, వన్నేరు, ముస్తాఫా కోడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకోడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూడు దట్టంగా పేరుకుపోయి మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ ఆదిలోనే తీవ్ర ఆటంకాలు కాలువల్లో ముందుకు సాగని నీరు కనీసం తూటికాడ, పూడికతీయక సమస్యలు నోళ్లు తెరుస్తున్న భూములు.. ఎండుతున్న నారు విలవిల్లాడుతున్న అన్నదాతలు మురుగునీటితోనే సాగు చేస్తున్న వైనంఎండుతున్నాయి.. నేను 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశా. ఇప్పటి వరకు ఎకరాకు రూ.7వేలు చొప్పున రూ.28వేలు పెట్టుబడి పెట్టా. ఒకపక్క నీరు లేక, మరో పక్క వర్షాలు పడక, పంటలు ఎండిపోతున్నాయి. అప్పులు చేసి మరీ వరినాట్లు వేశా. అధికారులు, పాలకులు స్పందించి శివారు గ్రామాల పొలాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. – బి.మరియదాసు, కౌలురైతు, శేరీవేల్పూరుమురుగునీటిని తోడుతున్నా.. కొంకేపూడిలో 13 ఎకరాలను కౌలుకు తీసుకొని, వెదసాగు వేశా. నీరందలేదు. పూర్తిగా ఎండిపోయింది. చేసేది లేక మోటారులు పెట్టి కొంకే పూడి డ్రయిన్లోని నీటిని తోడుకొని, రెండో సారి వెదసాగు వేశా. దానిని కాపాడుకునేందుకు మురుగు డ్రెయిన్లో నీటిని వాడాల్సి వస్తోంది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. – బొల్లా బ్రహ్మయ్య, కౌలు రైతు, పురిటిపాడుకృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా.. (ఎకరాల్లో) కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షలు – కేఈబీ 1.38లక్షలు – ఏలూరు 0.56లక్షలు 1,332 రైవస్ 2.17లక్షలు 425 మొత్తం 5.62లక్షలు 1,757 -
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), స్థూల విలువ జోడింపు (జీవీఏ) పెంపు లక్ష్యంగా రూపొందిన జిల్లా, నియోజకవర్గ దార్శనిక ప్రణాళికల లక్ష్యాలను చేరుకోవాలంటే కీలక ప్రగతి సూచికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం పరిశ్రమలు, ఉద్యాన, పౌర సరఫరాల శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్–కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా సూచికలను గుర్తించామన్నారు. ఈ సూచికల్లో ప్రగతి మొత్తం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రగతి సూచికల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. సూచికలు ఇవే.. 30 శాఖలకు సంబంధించి 523 కీలక ప్రగతి సూచికలు ఉన్నాయని.. పరిశ్రమల శాఖకు 20, ఉద్యాన శాఖకు 5, ఆహారం, పౌర సరఫరాల శాఖకు మూడు సూచికలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఎంఎస్ఎంఈల్లో కొత్త పెట్టుబడులు, ఎగుమతుల విలువ పెంపు, పరిశ్రమల్లో ఉపాధి సృష్టి, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు తదితరాలపై పరిశ్రమల శాఖ దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సూక్ష్మ సేద్య విస్తీర్ణం, ఉద్యాన పంట సాగు విస్తీర్ణం, ఉద్యాన పంట ఉత్పాదకతను పెంచడంపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టిసారించాలన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పటిష్ట అమలు, ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్లకు సంబంధించిన సూచికలు పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో శాశ్వత పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): మధ్యవర్తిత్వంతో కక్షిదారులు తమ కేసులకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘దేశం కోసం మధ్యవర్తిత్వం – చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమం’ పేరుతో నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా గుడి వద్ద ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. 90 రోజుల ప్రత్యేక కార్యక్రమం.. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు 90 రోజుల మధ్యవర్తిత్వ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిపై ప్రజలకు గత వారం రోజులుగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కోర్టుకు సంబంధించిన అన్ని రకాల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చని, దీనికి కక్షిదారులు వారి న్యాయవాదులను సంప్రదించి రాజీ కుదుర్చుకోవచ్చన్నారు. రాజీ చేసుకోవటం ద్వారా ఇరుపార్టీలు గెలిచిన వారవుతారన్నారు. ఒక్కసారి రాజీపడిన కేసుకు శాశ్వత పరిష్కారం, మరలా అప్పీలుకు వెళ్లే అవకాశం లేకుండా ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో శిక్షణ పొందిన దాదాపు 60 మంది మధ్యవర్తులు ఉన్నారని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తులు ఎస్. సుజాత, పి. బాబు నాయక్, జి. వెంకటేశ్వర్లు, కేవీ రామకృష్ణయ్య, కేవీఎల్ హిమబిందు, సీహెచ్ యుగంధర్, పి. సాయిసుధ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి -
చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి
గన్నవరం: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం గన్నవరంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గన్నవరం సగర్లపేటకు చెందన పొట్రు సతీష్(15) మానసిక దివ్యాంగుడు. పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన నక్క చైతన్య(12), మరో బాలుడితో కలిసి సతీష్ స్థానిక కోనాయి చెరువు పైలెట్ ప్రాజెక్ట్ వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. ప్రాజెక్ట్ పక్కనే ఉన్న తొండంగట్టు చెరువులో తామర పూలు కోసేందుకు ఇద్దరూ అందులోకి దిగారు. కొద్దిసేపటికి వారిద్దరూ నీట మునగడాన్ని వారి వెంట వెళ్లిన బాలుడు గమనించి, వారి కుటుంబ సభ్యులకు తెలిపాడు. చెంచులపేటకు చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయడంతో ఆయా కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారుల మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. సతీష్ తండ్రి నరసింహారావు గన్నవరం పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా, చైతన్య తండ్రి దుర్గారావు తాపీమేస్త్రిగా పని చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గన్నవరం పోలీసులు విచారణ చేపట్టారు. -
క్రేజీ కంప్యూటర్స్
ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి భారీ డిమాండ్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. కౌన్సెలింగ్లో తమకు కావాల్సిన చోట సీటు రాదు అనే నమ్మకంతో చాలా మంది మేనేజ్మెంట్ కోటా కోసం కళాశాలలకు బారులు తీరుతున్నారు. ఆ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. తమ కళాశాలల్లో చేరండంటూ విద్యార్థులకు ఫోన్లు చేస్తున్నాయి. అనుకున్న చోట సీట్లు దొరకవనే ప్రచారం ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేచి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరక్కపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. సీటు విషయమై ఒక అంచనాకు వస్తే బాగుంటుందని, ముందస్తుగా కొంత అడ్వాన్స్ ముట్టజెప్పాలని ఆయా కళాశాలలు కోరుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ రావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా కొలువులను ఆఫర్ చేస్తుండడంతో చాలా వరకూ సీఎస్ఈ, దానికి అనుబంధంగా ఉండే బ్రాంచ్లకు డిమాండ్ ఏర్పడింది. మేనేజ్మెంట్ సీట్ల కోసం.. ప్రస్తుతం మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి జోరుగా బేరసారాలు కొనసాగుతున్నాయి. డిమాండ్ను బట్టి సుమారు లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకూ ఫీజును ఆయా కళాశాలలు వసూలు చేస్తున్నాయి. జిల్లాకు సమీపంలో ఉన్న కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లు పది లక్షల వరకూ పలుకుతున్నాయి. గత మాసంలోనే ఈ సీట్ల అమ్మకాలు ప్రారంభమైనా, తాజా షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సీట్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన కళాశాలల్లోనూ కంప్యూటర్స్ అనుబంధ కోర్సుల సీట్లే భర్తీ అవుతున్నాయి. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు సీట్లు పొందడానికి సిఫారసులు సైతం చేసుకునే పనిలో ఉన్నారు. కన్వీనర్ కోటాకే ప్రభుత్వ సహాయం కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి. బీటెక్లో అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. విద్యార్థుల ఇష్టం మేరకూ కోర్సు ఎంచుకుని కన్వీనర్ కోటాలో చేరవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకం కన్వీనర్ కోటాలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆ దిశగా ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 19 వేల సీట్లు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 32 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో 19వేల సీట్లు ఉన్నట్లు అంచనా, ఆ సీట్లలో సుమారుగా 30 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లుగా కళాశాలల్లో తమ కిష్టమైన వారికి సీట్లు కేటాయించుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి కొన్ని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లను కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. 19 వేల సీట్లలో సుమారుగా ఎనిమిది నుంచి పది వేల వరకూ కంప్యూటర్స్ దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సీట్లే ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటావైపు విద్యార్థుల మొగ్గు కౌన్సెలింగ్ జరుగుతుండగానే కళాశాలల బేరసారాలు ఆ సీట్లను మరింత పెంచుకునేందుకు యాజమాన్యాల ఎత్తుగడలు సగానికిపైగా కంప్యూటర్ సైన్సే.. ఉమ్మడి జిల్లాలోని దాదాపుగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో సగానికి పైగా కంప్యూటర్ సైన్స్ సీట్లే కనిపిస్తున్నాయి. మెకానికల్, సివిల్కు పూర్తిగా డిమాండ్ పడిపోయింది. అలాగే ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్లకు అంతంత మాత్రంగా చేరటానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తిగా కంప్యూటర్ సైన్స్పైనే మక్కువ చూపుతున్నారు. దాంతో ఇంజినీరింగ్ కళాశాలలు ఆ దిశగా తమ ప్రాంగణాల్లో సీట్లను భారీగా పెంచుకుంటున్నాయి. సాధారణంగా సీఎస్ఈ అనేది ఒకటి మాత్రమే కంప్యూటర్ సైన్స్, ఐటీలకు సంబంధించిన బ్రాంచ్లు ఉండేవి. కానీ నేడు దానికి అనుబంధంగా ఆర్టిఫీషియల్ ఇంజినీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి సబ్జెక్ట్లతో కొత్త సెక్షన్లను కళాశాలల యాజమాన్యాలు తెచ్చుకుంటున్నాయి. దాంతో ఆయా కళాశాలల్లో సగానికి పైగా కంప్యూటర్స్ దాని అనుబంధ సీట్లే ఉంటున్నాయి. -
నీళ్లున్నా.. ఎత్తిపోసేలా లేరు
నారు పోసినా నీరులేక మొలక రాలేదు నాకు వెల్లటూరు బంధుచెరువు కింద మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇప్పటికే పొడి నారు పోశాం. చెరువులో చుక్కనీరు లేదు. వర్షాలు వెనకాడాయి. పోలవరం కాల్వలో నీరు వస్తున్నప్పటికీ ఎత్తిపోతల పథకం పనిచేయక చెరువుకు నీరు రావడంలేదు. అధికారులు వెంటనే స్పందించి మోటార్లను బాగు చేసి నీటిని విడుదల చేయాలి. – చింతపల్లి సత్యనారాయణ రైతు, వెల్లటూరు గ్రామం ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి నాకు ఆత్కూరు గ్రామంలో సావరాల చెరువు కింద ఆరు ఎకరాల పొలం ఉంది. చెరువుకు నీటిని అందించే ఎత్తిపోతల పథకం పనిచేయక నీరు రావడంలేదు. ప్రభుత్వం ముందు చూపుతో ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసుకొస్తే చెరువుల్లోకి నీరు వచ్చేది. ఇప్పటికై నా స్పందించి మోటార్లను బాగు చేయాలి. లేదంటే ఖరీఫ్ సాగు కష్టంగా మారుతుంది. – దొడ్డా విష్ణువర్ధన్రావు, రైతు, ఆత్కూరు గ్రామం జి.కొండూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. గతేడాది బుడమేరు వరదలకు ముంపునకు గురైన ఎత్తిపోతల పథకాల మోటార్లను ఏడాది గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోయలేని పరిస్థితిలో ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా చెరువుల్లో చుక్కనీరు లేక ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. వర్షాలు వెనకాడి నార్లు పోసేందుకు కూడా నీరు లేకపోవడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పొడి వరి విత్తనాలు చల్లిన రైతులు నీరు లేక మొక్క మొలవక లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి త్వరితగతిన ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసు కొస్తే రైతులకు సాగునీటి కష్టాలు తప్పుతాయి. మోటార్లు పనిచేయక.. జి.కొండూరు మండల పరిధిలోని హెచ్.ముత్యాలంపాడు గ్రామ పరిధిలోని మూడు చెరువులకు నీరు నింపేందుకు ఇదే గ్రామం వద్ద బుడమేరుపై రూ.51.48 లక్షలతో ఎత్తిపోతల పథకం, ఇక్కడే రూ.190 లక్షలతో ఆత్కూరు గ్రామ పరిధిలోని మూడు చెరువులను నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని 2018లో నిర్మించారు. అదేవిధంగా వెల్లటూరు బంధుచెరువును నింపేందుకు పోలవరం కుడికాల్వపై వెలగలేరు వద్ద రూ.109.10 లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడే రూ.40.57లక్షలతో చేగిరెడ్డిపాడు వీరయ్య చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. గత ఎనిమిది రోజులుగా పోలవరం కుడి కాల్వలో పట్టసీమ నీళ్లు పుష్కలంగా వస్తున్న క్రమంలో వెల్లటూరు, చేగిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాలకు నీరు అందుబాటులో ఉన్నప్పటికీ మోటార్లు పనిచేయక నీటి సరఫరా ఆగిపోయింది. అదేవిధంగా హెచ్.ముత్యాలంపాడు గ్రామం వద్ద బుడమేరుపై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు పోలవరం కుడికాల్వలో ప్రవహిస్తున్న పట్టిసీమ నీళ్లు ఎగదన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పనిచేయక నీటి సరఫరా ఆగిపోయింది. రైతులే బాగు చేసుకోవాలా ? ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మాణాంతరం వాటిని రైతులే నిర్వహించుకోవాలని వారికి అప్పగించినట్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే బుడమేరుపై ఉన్న ఎత్తిపోతల పథకాలలో మోటార్లు వరదలకు మునిగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు నిధుల విడుదల కోసం ఐడీసీ అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలుస్తుంది. గతేడాది వరదలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు పొలాల్లో గండ్లు పూడ్చుకోవడం, మేటలను తొలగించడం వంటి ఖర్చులతో ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వమే ఎత్తిపోతల పథకాల నిర్వహణ చేస్తుందనే అశతో ఇప్పటి వరకు ఎదురు చూశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చెరువులలో నీరులేక, నార్లు పోసే వీలులేక ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు బాగు చేయించుకునేందుకు రైతులే చందాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు మోటార్లు మరమ్మతులకు నోచుకోని వైనం నీరు లేక వెలవెలబోతున్న ఆయకట్టు చెరువులు ఖరీఫ్ ఆలస్యమవుతుందన్న ఆందోళనలో రైతులు -
మరో నారాయణ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,విజయవాడ: నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. భవానీపురం నారాయణ కాలేజీలో జీవన్ సాయి చదువుతున్నాడు. అయితే,ఈ క్రమంలో మార్కులు తక్కువ వచ్చాయని జీవన్ సాయిని కాలేజీ లెక్చరర్ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన జీవన్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న భవానిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.తన కుమారుడి మరణానికి నారాయణ కాలేజీ యాజమాన్యమే కారణమని విద్యార్ధి తల్లి శిరీష కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాబిడ్డను అందరి ముందు కొట్టారు. నా కొడుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ సాయి ఆత్మహత్యపై భవానిపురం నారాయణ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. లెక్చరర్ కొట్టడంతో మనోవేదనకు గురై ఆత్మ చేసుకున్న విద్యార్థి ఏమీ పట్టనట్లు కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాలేజీపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. -
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
తిరువూరు: ఎ.కొండూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కె. కాంతారావు(40) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తిరువూరు పట్టణ శివారులోని టౌన్షిప్లో అపస్మారక స్థితిలో ఉన్న కాంతారావును స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి తిరువూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్కు సిఫారసు చేశారు. తిరువూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తూ ఇటీవల సాధారణ బదిలీల్లో ఎ.కొండూరుకు బదిలీ అయిన కాంతారావు విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తాడని పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తిరువూరు కోర్టులో కాంతారావుపై ఒక న్యాయవాది నమోదు చేసిన ప్రైవేటు ఫిర్యాదు నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారని భావిస్తున్నారు. అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం పెనమలూరు: అప్పుల బాధతో ఓ వ్యక్తి కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన పాపినేని సురేష్ (56) భార్య సాయిలక్ష్మితో కలిసి ఉంటున్నాడు. అతను గత 20 ఏళ్లుగా లారీల వ్యాపారం చేస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం రావటంతో అప్పులపాలయ్యాడు. ఉన్న లారీలు అమ్మి అప్పులు తీర్చినా ఇంకా అప్పులు మిగిలాయి. దీంతో సురేష్ ఆందోళనలో ఉన్నాడు. ఫ్రాన్స్లో ఉంటున్న కుమారుడు ప్రసాద్ తాను అప్పులు తీర్చుతానని కంగారు పడవద్దని తండ్రికి తెలిపాడు. కాగా ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సురేష్ గడ్డిమందు తాగాడు. అనంతరం తాను గడ్డి మందు తాగానని బంధువులకు తెలపటంతో అతని వెంటే పోరంకిలో ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర చికిత్సకై చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బందరు కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధిలో బందరు కాలువలో వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడిప ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బడుగు మధుసూదనరావు(52) పెయింటర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య శాంతకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన ఇంట్లో కుటుంబ తగాదాలు గత కొద్దికాలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధుసూదనరావు సోమవారం రాత్రి యనమలకుదురు పంచాయతీ ఆఫీసు రోడ్డులో ఉన్న వంతెన వద్దకు వచ్చి చెప్పులు వదిలి బందరు కాలువలో దూకాడు. బందరు కాలువలో నీరు ఎక్కువగా ప్రవహించటంతో ఇదిచూసిన స్థానికులు అతనిని రక్షించలేక పోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మంగళవారం రంగంలోకి దింపి బందరు కాలువలో గాలింపు చేపట్టారు. అయితే గ్రామ పరిధిలో ఉన్న జన్మభూమి వంతెన వద్ద కాలువలో మధుసూదనరావు మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ గుర్తించి, బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు దుర్మరణం పెనమలూరు: టీడీపీ ఫ్లెక్సీలు యువకుడిని బలిగొన్నాయి. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకిలో టీడీపీకి చెందిన సొసైటీ సభ్యుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దానికి సంబంధించిన ఫ్లెక్సీలను సోమవారం అర్ధర్రాత్రి కానూరుకు చెందిన యువకుడు బి.ప్రమోద్(19) కడుతున్నాడు. ఈ క్రమంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ఘటనలో ప్రమోద్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. గాయపడిన ప్రమోద్ను ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు కడుతున్నవారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. -
బకాయిలు పూర్తిగా చెల్లించాలి
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీ రంగరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపడిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా.. అరకొరగా రూ.600 కోట్లు విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నాయన్నారు. తక్షణమే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రూ.6,400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల దూరం చేసే జీవో 77 రద్దు చేయాలని రంగరాజ్ డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండెల నాసర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, కృష్ణాజిల్లా కార్యదర్శి సాదిక్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు శివ, సహాయ కార్యదర్శి అమర్నాథ్, ప్రణీత్, పవన్, విజయవాడ నగర అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్, జగదీష్, మహిళా నాయకులు షణ్ముఖప్రియ, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
‘పీ–4’ అమలుపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): ేపదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పీ–4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టిసారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో పీ–4 కార్యక్రమం అమలుపై నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమానికి సంబంధించిన సమస్యలు, సలహాలు, సూచనలు తెలియజేయాలన్నారు. అర్హులైన పేద కుటుంబాలను గుర్తించటంతో పాటు వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గుర్తించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్గదర్శులు, బంగారు కుటుంబాలను ఎంపిక చేసే క్రమంలో ఆన్లైన్ పోర్టల్లో కేవలం కుటుంబ యజమాని పేరు మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని సభ్యులందరి పేర్లు నమోదు చేయాలన్నారు. జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీపీవో జె. అరుణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, సీపీవో ఎస్.భీమరాజు, పశుసంవర్ధకశాఖ జేడీ చిననరసింహులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
చిలకలపూడి(మచిలీపట్నం): రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు గుడివాడ రామస్వామి అన్నారు. ధర్నా చౌక్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలన్నారు. పెన్షనర్లకు చాలా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుతం మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయని, నాల్గో డీఏ కూడా చెల్లించాల్సి న సమయం వచ్చినప్పటికీ ఇంత వరకు ఒక్క డీఏ కూడా చెల్లించలేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే అమలు చేయాలన్నారు. రైల్వే, విమాన ప్రయాణాల్లో సీనియర్ సిటిజెన్స్ రాయితీని పునరుద్ధరించాలన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు కాంప్రెహెన్సివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీంను అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. సంఘ ప్రధాన కార్యదర్శి ఏవీ ప్రసాదరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, బి. శంకర్నాథ్, రామకృష్ణ, పి. శ్రీనివాసరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఆషాఢ సంబరం
దుర్గమ్మకు ప్రసాదాల పోటు, నాయీ బ్రాహ్మణుల సారె సమర్పణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకొని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రసాదాల పోటు, కేశఖండనశాల నాయీ బ్రాహ్మణులు మంగళవారం అమ్మవారికి సారెను సమర్పించారు. తొలుత జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారికి ప్రసాదం పోటు సిబ్బంది పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రసాదాల పోటు నుంచి సారెతో ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. కేశఖండనశాల నుంచి.. దుర్గాఘాట్ ఎదుట ఉన్న కేశఖండనశాల నుంచి సారె బయలుదేరగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు, పరిపాలనా సిబ్బంది ఊరేగింపులో పాల్గొన్నారు. సుమారు నాలుగు వందల మంది నాయీబ్రాహ్మణుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అమ్మవారికి సారె సమర్పించిన వారిలో రాష్ట్ర దేవాలయాల కేశ ఖండన కార్మికుల జేఎసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, రాలి వెంకట రమణ, నారాయణ, గుంటుపల్లి హరి, కిరణ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ప్రసాదాల పోటు, కేశఖండనశాల సిబ్బందిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు జరిపించుకున్న అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. అమ్మవారి దయతో భక్తులందరూ, ఆలయ అధికారులు, సిబ్బంది సుఖ సంతోషాలతో ఉండాలని ఏటా సారె సమర్పిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు ఎన్. రమేష్బాబు, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు చివరికీ సాగునీరు అందాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పంట కాలువలకు సాగునీరు విడుదలపై జలవనరులశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరులశాఖ ఇంజినీరింగ్ అధికారులు రైవస్ కాలువకు 5,200 క్యూసెక్కులు, బందరు కాలువకు మూడు వేల క్యూసెక్కులు, ఏలూరు కాలువకు 1500 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశామని తెలిపారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా ప్రాంతాల్లో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రైతులకు ఎలాంటి సాగునీరు సమస్య లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. నిత్యం క్షేత్రస్థాయిలో ఇంజినీరు సహా కిందిస్థాయి సిబ్బంది పంటకాలువల వెంబడి ముమ్మరంగా పర్యటించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. తాను కూడా పంటకాలువలు పరిశీలిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ ఎస్ఈ ఆర్.మోహనరావు, ఈఈలు ఆంజనేయప్రసాద్, రవికిరణ్, పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
అక్రమ కేసులకు భయపడం
సాక్షి ప్రతినిది, విజయవాడ: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పామర్రులో ఈ నెల ఎనిమిదో తేదీన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించేందుకు పోలీసుల సాయంతో కూటమి నేతలు ప్రయత్నించారని విమర్శించారు. ఆ రోజు ఉదయమే పామర్రులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను బలవంతంగా పోలీసులు తొలగించి భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని పేర్కొన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు నాలుగు రోజుల తరువాత, ఆ సమావేశానికి వచ్చిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు కేసు బనాయించారని వివరించారు. పేర్ని నానిని తాను ప్రేరేపించి మాట్లాడించినట్లు తనతోపాటు, నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, ముఖ్యనేతలు, కల్యాణ మండపం యజమాని సహా ఆరుగురిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. కేసులను న్యాయ స్థానాల్లో తేల్చుకుంటామని కైలే అనిల్కుమార్ స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ -
అక్రమ లే అవుట్లు ధ్వంసం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ శివారు ప్రాంతంలో ఏర్పాటైన అనధికార లేఅవుట్లపై కార్పొరేషన్ అధికారులు కన్నెర్ర చేశారు. ‘పంచుకో.. దోచుకో’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. కండ్రిక – రామవరప్పాడు రహదారిలో 3.90 ఎకరాల్లో ఏర్పాటైన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతకు సంబంధించిన అనధికార లేఅవుట్లో ఉన్న మట్టిని జేసీబీతో తొలగించి, రోడ్లను ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మరో లే అవుట్ చుట్టూ నిర్మించిన గోడను కూల్చి వేశారు. లేఅవుట్ను చదును చేశారు. ప్లాన్లు లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు, అదనపు అంతస్తులపై దృష్టి సారించి భవన యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వసూళ్లకు పాల్పడిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత కలెక్షన్ ఏజెంటు ‘మామ్మూల్యాద్రి’ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణ చేస్తున్నాం అనధికార లేఅవుట్లు, అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అదనపు అంతస్తులపై దృష్టి సారించి సిబ్బందితో విచారణ చేయిస్తున్నామని వీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పన్నారు. బాధ్యులైన సిబ్బందిపైనా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025u8లో మున్సిపల్ కార్మికుల అరెస్ట్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తమ డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు విజయవాడలో మంగళవారం ధర్నా చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 556.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కు 64,789 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.కొనసాగుతున్న ఆషాఢ సంబరం దుర్గగుడిలో ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రసాదాల పోటు సిబ్బంది, కేశఖండనశాల నాయీ బ్రాహ్మణులు అమ్మ వారికి సారె సమర్పించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అనారోగ్యానికి గురైన ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకు మొదటిగా గుర్తుకొచ్చేది విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్). ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తారు. ఆయా జిల్లాల ఆస్పత్రుల నుంచి ముఖ్యమైన కేసులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికే అక్కడి వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర సీరియస్ కేసులను జీజీహెచ్కే తరలిస్తున్నారు. ఇంతటి ముఖ్యమైన ఆస్పత్రిలో పాలన గాడి తప్పింది. అధికారులు ఏసీ గదులకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులు ఏమైతే తమకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి మృతి చెందితే వారి బంధువులు మహాప్రస్థానం వాహనం కోసం అధికారుల చుట్టూ తిరిగి బతిమలాడాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రోగుల సేవలను పట్టించు కోరుగాని కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లు దండు కోవడంలో శ్రద్ధ చూపుతారనే విమర్శలు ఉన్నాయి. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆస్పత్రిలో రోగి ఎవరైనా మృతి చెందితే మహాప్రస్థానంలో తరలించాలంటే ఆర్ఎంఓ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తాస్పత్రిలో మహాప్రస్థానం వాహనాలు చూసే ఆర్ఎంఓలు ఫోన్లకు స్పందించరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగి మృతి చెందిన తర్వాత నాలుగైదు గంటలు మృతదేహం ఆస్పత్రిలోనే ఉన్న సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక్కోసారి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫోన్ ఎత్తినా, మహాప్రస్థానం చూసే డెప్యూటీ ఆర్ఎంఓ ఫోన్ ఎత్తడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు జరిగినా ‘మేమింతే.. మారేది లేదంతే... అనే రీతిలో డెప్యూటీ ఆర్ఎంఓ వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవడంలో ఆర్ఎంఓ వ్యవస్థ కీలకం. ప్రభుత్వాస్పత్రిలో ఆ వ్యవస్థ నిర్వీర్యమైంది. సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పాత ఆస్పత్రికి వెళ్లడంతో, కొత్త ఆస్ప త్రిలో పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించే డెప్యూటీ ఆర్ఎంఓ ఏసీ గది దాటి బయటకు రావడం లేదని రోగులు, వారి బంధువులు విమర్శిస్తున్నారు. భారమంతా అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఏఆర్ఎంఓలపై పడుతోంది. వారి మాట టీచింగ్ వైద్యులు వినడంలేదు. సీఎస్ ఆర్ఎంఓ ఉంటే ప్రొఫెసర్లకూ ఆదేశాలు ఇవ్వొ చ్చని పేర్కొంటు న్నారు. జూనియర్లను ఏఆర్ఎంఓలుగా నియమించడంతో వారిని ఎవరూ లెక్కచేయడంలేదన్న విమర్శలు ఉన్నాయి. రక్త పరీక్షలకు రోగుల తిప్పలు అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ 7న్యూస్రీల్ జీజీహెచ్లో అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం ఆర్ఎంఓ వ్యవస్థ నిర్వీర్యం రోగుల కష్టాలు పట్టించుకునే నాథుడేడీ? సివిల్ అసిస్టెంట్ సర్జన్లపైనే భారం చుక్కాని లేని నావలా మారిన పరిస్థితిమామూళ్లపైనే దృష్టి నిబంధనలు గాలికి.. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. రోగులకు అందాల్సిన సేవలు, సౌకర్యాలను పర్యవేక్షించాల్సిన ఆర్ఎంఓ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. రోగుల గోడు వినే నాథుడే లేకుండా పోయాడు. మేమింతే.. మా తీరింతే.. మేము మారమంతే.. అనే విధంగా కొత్తాస్పత్రిలోని అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.మృతదేహాన్ని తరలించాలంటే చచ్చేచావు రోగుల సేవలను పర్యవేక్షించడంలో అలసత్వంగా వ్యవహరించే అధికా రులు మామూళ్లపై మాత్రం దృష్టి సారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్పత్రిలో లేని రక్తపరీక్షలను ప్రైవేటు ల్యాబ్లో చేయించాలి. ఆ ల్యాబ్కు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ చెల్లిస్తుంటారు. ఆ పరీక్షలను పర్యవేక్షించే అధికారికి మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇతర కాంట్రాక్టర్ల నుంచి దండుకుంటున్నట్లు చెబుతున్నారు. మామూళ్లు వచ్చే పనిపై ఉన్న శ్రద్ధ రోగుల సేవలపై చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఓపీకి నిత్యం 2500 నుంచి 2800 మంది వరకు రోగులు వస్తారు. వారిలో 800 నుంచి 1100 మందిని వైద్యులు రక్తపరీక్షలకు పంపిస్తారు. నిత్యం 300 మందికి ఆల్ట్రా స్కానింగ్లు, 300 మంది వరకూ ఎక్స్రేలు తీస్తారు. అయితే రోగులకు అందాల్సిన సేవలను పర్యవేక్షించాల్సిన ఆర్ఎంఓ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. డయాగ్నొస్టిక్ బ్లాక్లో రక్త పరీక్షలు చేయించుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ రిజిస్ట్రేషన్ కోసం గంటకు పైగా క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కోసం వెళితే మధ్యాహ్నం 12 గంటలు దాటితే, మరుసటి రోజు రావాలని చెబుతున్నారు. డయాగ్నొస్టిక్ బ్లాక్ పర్యవేక్షించే అధికారి అటువైపు కన్నెత్తి కూడా చూడరు. రక్తపరీక్ష శాంపిల్స్ ఉదయం 9 గంటలకు తీసుకుంటే, రిపోర్టులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఇస్తారు. రిపోర్టులు తీసుకున్న తర్వాత వైద్యులు ఉండరు. మళ్లీ మరుసటి రోజు ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. డయాగ్నొస్టిక్ బ్లాక్లో రక్తపరీక్షలు చేయించుకోవాలన్నా, ఎక్స్రే తీయించుకోవాలన్నా క్యూలైన్లో కుస్తీ తప్పదు. కొన్ని సందర్భాల్లో కిట్లు లేక సీరమ్ క్రియాటిన్ వంటి పరీక్షలను సైతం బయట చేయించాల్సిన దుస్థితి నెలకొంది. -
రెడ్బుక్ రాజ్యాంగం అమలు
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులపై టీడీపీ, జనసేన గూండాల దాడి రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బీసీ మహిళను కారులో నిర్బంధించి దాడి చేయడం దారుణమన్నారు. హారికను దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండి తోక జగన్మోహనరావు, ఎన్టీఆర్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం పరామర్శించారు. హారిక, రాము దంపతులపై గుడివాడలో టీడీపీ, జనసేన గూండాలు దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హారిక, రాము దంపతులను వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అనుమతి తీసుకోవాలా? మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలో టీడీపీ, జనసేన గూండాలు హారికపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. గుడివాడలో సభ పెట్టాలంటే టీడీపీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. దాడులు చేస్తుంటే చూస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. తెలుగు యువత, తెలుగు మహిళ మాదిరిగా తెలుగు పోలీస్ అని పేరు పెట్టుకోవాలని సూచించారు. బీసీ మహిళపై దాడి జరిగితే మహానటి అంటారా అని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ డమ్మీగా మారిందని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) ధ్వజమెత్తారు. రౌడీలకు, గూండాలకు గులాంగిరీ చేస్తున్న వ్యవస్థగా మారిందని ఆరోపించారు. దాడులు జరుగుతున్న సమయంలో డీఎస్పీ, సీఐలు, పోలీసులు చూస్తూనే ఉన్నారని, వ్యవస్థ న్యాయం చేయలేని రోజు తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హారిక దంపతులకు కొడాలి నాని పరామర్శ పెడన: జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము దంపతులను మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పరామర్శించారు. మంగళవారం రాత్రి ఆయన పెడన మండలం కృష్ణాపురంలోని రాము నివాసానికి చేరుకుని హారికపై ఇటీవల జరిగిన దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కిట్టు, నంది వాడ ఎంపీపీ పెయ్యేటి ఆదాం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి సుబ్రహ్మణ్యం(చంటి), రామిరెడ్డి, మిరియాల రాజేంద్రప్రసాద్, గుదె రవి తదితరులు పాల్గొన్నారు. హారిక, రాము దంపతులను పరామర్శిస్తున్న అవినాష్, విష్ణు, జగన్మోహనరావు, పేర్ని కిట్టు తదితరులు అవినాష్ మాట్లాడుతూ.. బీసీ మహిళపై పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం చూస్తుంటే రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలుకావడంలేదని స్పష్టమైందన్నారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి అందుకు ఉదాహరణన్నారు. హారికకు తామంతా అండగా ఉంటామన్నారు. దాడులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళ కన్నీరు పెట్టుకుంటే మంత్రి కొల్లు రవీంద్ర కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. తక్షణమే హారికకు రవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడికి ప్రతి దాడి ఓటు రూపంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహనరావు అన్నారు. టీడీపీ గూండాలే దాడి చేసి బాధితులపై ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. తాము హారిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
434 మంది సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్–2025 (ఎంపీసీ స్ట్రీం)లో ర్యాంక్లు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని హెల్ప్లైన్ సెంటర్లో ఈ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఎన్సీసీ–162, సీఏపీ– 160, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–112 మంది చొప్పున 434 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సీఏపీ కేటగిరీ అభ్యర్థులకు 1,50,001 నుంచి చివరి ర్యాంక్ వరకు, విభిన్న ప్రతిభావంతులు, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరి అభ్యర్థుల మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. 20న ‘ప్రణామం’ కవి సమ్మేళనంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20న విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం నందు ‘ప్రణామం’ కవి సమ్మేళనం జరుగుతుందని సంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ చేతుల మీదుగా కవి సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ, ఒక తపస్సుతో కవిత్వం రాస్తున్న కవుల సమ్మేళనానికి తప్పకుండా వస్తానన్నారు. కలిమి శ్రీ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొని భాష, సామాజిక స్పృహ, దేశభక్తి, ప్రపంచశాంతి, పర్యావరణం అంశాలపై తమ కవితలను వినిపించొచ్చని సూచించారు. పాల్గొన్న కవులందరికీ ప్రశంసాపత్రం, బుక్ ఆఫ్ భారత్ రికార్డ్స్ చిరు జ్ఞాపికలు అందజేస్తామని మల్లెతీగ ఉపాధ్యక్షుడు చొప్పా రాఘవేంద్రశేఖర్ తెలిపారు. వివరాలకు 92464 15150 నంబరులో సంప్రదించాలని కోరారు. రేపటి నుంచి కార్తికేయుని పవిత్రోత్సవాలు మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా శాంతి కల్యాణం, రుద్రాభిషే కాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొన్నారు. 20వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి శాంతి కల్యాణం జరుగుతుందని తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మనక్షత్రం ఆఢికృత్తిక సందర్భంగా ఈ నెల 20వ తేదీన వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకాలు, శాకంబరీ అలంకరణ జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు. పాఠశాలల అభ్యున్నతిలో భాగస్వాములు కావాలి వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాలల అభ్యున్నతిలో ప్రధానోపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధి కారి యు.వి.సుబ్బారావు సూచించారు. స్టెల్లా కాలేజీలో జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంలకు మంగళవారం నాయకత్వ లక్షణాలపై శిక్షణ శిబిరం ప్రారంభించారు. డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ.. నూతన మోడల్ ప్రైమరీ స్కూల్స్ను ప్రభుత్వ ఆలోచలనకు అను గుణంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ పాఠశాలలను అన్నింటికన్నా మిన్నగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నిపుణులు ప్రసంగించారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏఎస్పీ సత్యనారాయణ, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో ఎ.స్వాతి, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. పెడన పట్టణానికి చెందిన దివ్యాంగురాలు పడమట పద్మ వద్దకు కలెక్టర్ వచ్చి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి వాహనం లేదని బ్యాటరీ స్కూటరు అందజేయాలని కోరారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీకి సూచించారు. గుడివాడకు చెందిన దివ్యాంగుడు కొడాలి పోతురాజుకు ముఖ్యమంత్రి పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం మూడు చక్రాల స్కూటీని కలెక్టర్ అందజేశారు. తోట్లవల్లూరుకు చెందిన దివ్యాంగురాలు పెద అమ్మాజీ తన మేనకోడలు శివలక్ష్మి మోసం చేసి 25 సెంట్ల స్థలాన్ని తన వద్ద నుంచి రాయించుకున్నారని కలెక్టర్కు మొరపెట్టుకోగా, ఆయన స్పందిస్తూ న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం అందిస్తారని, అక్కడకు వెళ్లాలని సూచించారు. మీకోసంలో మొత్తం 194 అర్జీలను అధికారులు స్వీకరించారు. జాబ్మేళా పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 16న మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని నేషనల్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాపై రూపొందించిన వాల్పోస్టర్ను కలెక్టర్ డీకే బాలాజీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ప్రధానమైన అర్జీలు ఇవే... ● పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో సర్వే నంబరు 124/1 లో గతంలో ఎడ్లబండ్లు, రైతుల రాకపోకలకు రహదారి ఉండేదని రైతులు సుమారుగా 200 ఎకరాలకు వెళ్లే దారిగా ఉపయోగించుకునే వారని, అయితే గ్రామ సర్పంచ్ కుమారుడు ఎస్సీల శ్మశానభూమి అంటూ రాకపోకలకు వీలు లేకుండా సిమెంటు స్తంభాలు పాతి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ● తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన బొప్పన గోపాలకృష్ణ గ్రామంలో 1500 మంది నివసిస్తున్నారని తూర్పువైపున డ్రైనేజీ కోడు పూర్తిగా ఆక్రమణకు గురై పూడిపోయిందని, అధిక వర్షాల సమయంలో గ్రామంలో ఉన్న మురుగునీరు బయటకు పోక ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, డ్రెయినేజీ కోడు విడగొట్టి ఆక్రమణదారులను తొలగించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం మీకోసంలో 194 అర్జీలు స్వీకరించిన అధికారులు -
ఆంధ్రాలో ఆటవిక రాజ్యం
పెడన: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సోమవారం ఆయన కృష్ణాజిల్లా పెడన మండలం కృష్ణాపురంలోని ఉప్పాల రాము నివాసానికి చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ హారికను పరామర్శించి ధైర్యం చెప్పారు. మూడు రోజుల కిందట గుడివాడలో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. కారు వద్దకు వెళ్లి పగిలిన అద్దాలను చూపుతూ టీడీపీ, జనసేన గూండాలు ఏ విధంగా దాడి చేశారో భరత్కు హారిక వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భరత్ మాట్లాడుతూ బీసీల పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్ర బాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ హారికపై దాడి జరిగిన ఘటనపై స్పందించకపోవడం చాలా అన్యాయమన్నారు. మహిళలపై దాడులు జరిగినా, అన్యాయం జరిగినా పూనకం వచ్చినట్లు ఊగిపోయే మీరు బీసీ మహిళకు అన్యాయం జరిగితే ఏం చేస్తున్నారంటూ డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ప్రశ్నించారు. స్పష్టంగా దాడి జరిగినట్లు వీడియోలలో కనిపిస్తున్నా, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు హెల్మెట్లు పెట్టుకుని వచ్చారంటే... పోలీసులకు అక్కడ ఏం జరుగుతుందో ముందుగానే తెలుసన్నట్లుగా హెల్మెట్లు పెట్టుకుని రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. ఏడాది కాలం నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతికంగా, మానసికంగా దాడులు చేస్తూ ఎవరూ ఏంచేయలేరన్నట్టుగా ఎన్డీయే కూటమి సర్కారు నడుస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి హామీలను ఎగ్గొట్టేందుకే ఈ దాడులు చేస్తూ ప్రజలను నోరు విప్పనీయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలైన హారికపై దాడి అమానుషం హారిక, రాము దంపతులపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే హారికను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎల్లకాలం చెల్లవు... ‘‘గుర్తుపెట్టుకోండి...ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. చంద్రబాబునాయుడుకు వయస్సు అయిపోయింది, వయస్సులో ఉండే వ్యక్తులు ఎవరయ్యా అంటే పవన్కల్యాణ్, లోకేష్లు. మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితులు ఏమిటనే ఆలోచన చేయండి’’ అని మార్గాని భరత్ హెచ్చరించారు. ఏపీలో ఇప్పటికే ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత వచ్చిందని, పోటీ చేసే వారికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికై నా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. బీసీ పార్టీ అని చెప్పుకోవడం కాదని, చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరిగితే బీసీ సంఘాలు తక్షణం బయటకు వచ్చి ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ నుంచి హారిక కుటుంబానికి అండగా నిలబడతామన్నారు. సమావేశంలో ఉప్పాల హారికతో పాటు వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), జి.కొండూరు, పెడన ఎంపీపీలు వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, రాజులపాటి వాణి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు సోమవారం విరాళాలను అందజేశారు. విజయవాడకు చెందిన ఘట్టమనేని రాజగోపాల్, రుసూద్ర పేరిట కుమారుడు నవీన్కుమార్ అన్నదానానికి రూ.1.20 లక్షలను ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. కానూరుకు చెందిన కరిపినేని శివరామకృష్ణారావు పేరిట కుటుంబ సభ్యులైన నాగేశ్వరరావు అన్నదానానికి రూ.1,11,116 విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మకు సారె సమర్పించిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారికి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తరఫున సారెను సమర్పించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కొమ్మన స్వప్న, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, శైలజారెడ్డి అమ్మవారికి సారెను సమర్పించారు. సారెతో అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం మహిళా విభాగం నేతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. తిరుపతమ్మకు సారె సమర్పణపెనుగంచిప్రోలు: ఆషాఢమాసం సందర్భంగా గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారికి సోమవారం అమ్మవారి పుట్టిన ఊరు అనిగండ్లపాడు గ్రామం నుంచి మహిళలు సారె సమర్పించి బోనాలు చెల్లించారు. వీరికి ఆలయం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి సారెను అమ్మవారికి అందజేశారు. అనంతరం సారె తీసుకు వచ్చిన వారికి వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయం వారు అన్నప్రసాదం అందజేశారు. శ్రీదుర్గ శివసాయి సేవా సమితికి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారె తెచ్చి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ ఎల్.రమ, సూపరింటెండెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలిగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్పేలోని సీపీఐ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.6400 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ.600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొందన్నారు. కొన్ని కళాశాలలు ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు తమ వద్దే ఉంచుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలని, నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పేదలకు వైద్య విద్యను దూరం చేసే జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు అడుగులు వేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ షెడ్యూల్డు కులాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి లో విశేష కృషి చేస్తోందని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్ కుమార్బాబు, కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ జనాభా (2011 సెన్సస్ ప్రకారం 18.32 శాతం), ఎస్సీ వర్గాల్లో అక్షరాస్యత, వివిధ పథకాల అమలు, ఆరోగ్యం, పోషణ, భూ పంపిణీ, నవోదయం తదితర అంశాలను కలెక్టర్ లక్ష్మీశ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న కార్య క్రమాల ప్రగతిని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, వాటిలో పురోగతిని, గ్రామాల్లో సైతం సీసీ కెమెరాల ద్వారా నిఘా వంటి విషయాలను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వివరించారు. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి.. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మాట్లాడుతూ అట్రాసిటీకి సంబంధించి ఎస్సీల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టుకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలకోసారి తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చట్ట ప్రకారం పరిహారం, ఉపాధి కల్పనపై చర్యలు తీసుకోవాలన్నారు. -
అమ్మానుషానికి షెల్టర్ జోన్లు!
కొండ ప్రాంతాలు.. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ‘అమ్మ..’ అన్న పిలుపు కోసం మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. వివాహం జరిగి సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టని వారు ఇష్టదైవాలకు మొక్కుకుంటారు. మాతృత్వ మాధుర్యం కోసం ఎంతగానో పరితపిస్తారు. అయితే ఇటీవల విజయవాడ కొత్తపేట పరిధిలో చోటు చేసుకున్న ఘటనలు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచాయి. నెలన్నర క్రితం నెలలు నిండని చిన్నారి మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశారు. ఆ ఘటనను మరువక ముందే మరో శిశువును జీవించి ఉండగానే రోడ్డు పక్కన పడేశారు. ఒకే ప్రాంతంలో నెలన్నర వ్యవధిలో రెండు ఘటనలు జరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ డ్రెయిన్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో అప్పుడే పుట్టిన శిశువులను వదిలేసిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 45 రోజుల్లో రెండు ఘటనలు మే 28వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో కొత్తపేట కొండ ప్రాంతంలోని సింహాద్రి వీధిలో నడిరోడ్డుపై నెలలు నిండని పసిగుడ్డు మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. నెలలు నిండని మగ శిశువుకు కనీసం బొడ్డు తాడు కూడా కోయలేదు. పసికందు పరిస్థితిని చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. రెవెన్యూ అధికారి ఫిర్యాదు అనంతరం మృత శిశువును ఖననం చేశారు. తాజాగా ఈ నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ పోతిన సాయిప్రసాద్ వీధిలో బిడ్డ గుక్కపెట్టి ఏడవడం స్థానికులకు వినిపించింది. ఆ ఏడుపు ఎంతకూ ఆగకపోవడంతో సగురుపిళ్ల సోమరాజు కుటుంబం బయటకు వచ్చి గాలించగా చిమ్మ చీకటిలో రోడ్డు పక్కగా అప్పుడే పుట్టిన మగ బిడ్డ కనిపించింది. చీకటిలో ఎలుకలు కోరుకుతుండటంతో ఎవరో వదిలేసిన ఆ పసిగుడ్డు గుక్కపెట్టి ఏడ్వడాన్ని గుర్తించి సోమరాజు కుటుంబ సభ్యులు అక్కున చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆ బిడ్డను ప్రభుత్వాస్పత్రిలో చేర్చించి వైద్యం చేయించారు. కొండప్రాంతాల్లో అబార్షన్లు? నగరంలోని పలు ప్రయివేటు ఆస్పత్రులు, హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న కొంత మంది సిబ్బంది తమ ఇంటి వద్ద అశాసీ్త్రయ పద్ధతిలో అబార్షన్లు, కాన్పులు చేస్తున్నట్లు కొండ ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. తెలిసీ తెలియక చేసిన తప్పులతో గర్భందాల్చుతున్న యువతులను కొండ ప్రాంతాల్లోని ఇళ్లలో అద్దెకు దింపి అక్కడే గట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారని తెలుస్తోంది. అబార్షన్ చేసే క్రమంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఇటు వంటి తప్పులు బయట పడే అవకాశం లేదంటున్నారు. రోడ్ల పక్క, డ్రెయిన్లో అప్పుడే పుట్టిన శిశువులు బెజవాడ కొత్తపేటలో నెలన్నరలో రెండు ఘటనలు దృష్టి పెడితే సమస్యకు పరిష్కారం కొత్తపేట, మహంతిపురం, వించిపేట, గొల్లపాలెం గట్టు, ప్రైజర్పేట, కేఎల్రావునగర్, లంబాడీపేట, చిట్టినగర్ పరిధిలో కొండ ప్రాంతాల్లో తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ ఘటనపై స్థానికులు, వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారే తప్ప బాధ్యలెవరనేది రుజువు కావడం లేదు. యువతి గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెలా తమ ఇంటి సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసు కుని పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంది. లేదా సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం తప్పక పొందుతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జిల్లా స్థాయి అధికారులు ముందుకొచ్చి ఘటన జరిగిన ప్రాంతంలోని అంగన్వాడీ సిబ్బందితో స్థానికంగా విచారణ జరిపిస్తే తప్పక ఫలితం ఉంటుందంటున్నారు. ప్రతి నెలా వచ్చే గర్భిణులు, డెలివరీ అయిన వారి వివరాలను సరి చూసుకోవడం ద్వారా ఈ బిడ్డల వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఒక వేళ కనికరం లేకుండా బిడ్డలను కని రోడ్డున పడేసే తల్లులను గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట వాసులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీసెట్ – 2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఎన్సీసీ అభ్యర్థులు 245 మంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు 183, సీఏపీ అభ్యర్థులు 217 మంది చొప్పున 645 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. నేటి షెడ్యూల్ ఇదీ.. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 50,001 నుంచి చివరి ర్యాంకు వరకు, సీఏపీలో 1,00,001 నుంచి లక్షా యాభై వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. ఎంపిక చేసుకున్న ఆప్షన్లల్లో మార్పులు, చేర్పులకు ఈ నెల 22వ తేదీ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్టీల సమగ్రాభివృద్ధికి కృషి చేయండి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో షెడ్యూలు తెగల సమగ్రాభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో పాఠశాల బయట ఉన్న షెడ్యూలు తెగల బాలలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. ఆధార్కార్డు లేని వారిని గుర్తించి కార్డులు జారీ చేసేందుకు తగిన చొరవ చూపాలన్నారు. ఆరోగ్య కార్డులు, ఆయుష్మాన్కార్డులు జారీ చేసేందుకు డీఎంహెచ్ఓ కృషి చేయాలని ఆదేశించారు. మత్తుపదార్థాల బానిసల విముక్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. షెడ్యూలు తెగలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వారికి రేషన్కార్డులు, ఓటర్ ఐడీ, ఇంటి స్థలం కేటా యించేందుకు రెవెన్యూ అధికారులు చొరవ చూపాలని సూచించారు. వారి గృహాలకు అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీ–4 కార్యక్రమంలో ఎస్టీలను ప్రత్యేక భాగస్వామ్యులుగా చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణారావు, డీఈఓ పి.వి.జె.రామారావు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ ఈఈలు లోకేష్, నటరాజ్, డీపీఓ జె.అరుణ, డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు.