breaking news
Krishna
-
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టండి
పామర్రు: రైతులు యూరియా వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి, అధిక ఆదాయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో కలెక్టర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత పామర్రు మండలంలోని కురుమద్దాలి గ్రామం సందర్శించి రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. గతేడాది బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించామని, ఒక వైపు రసాయనిక ఎరువులు వేసిన వరి పొలం, దాని పక్కనే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన వరి పొలం గమనించామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంట నిటారుగా నిలిచిందని, మంచి దిగుబడి వచ్చిందని చెప్పారు. రసాయన ఎరువులతో సాగు చేసిన వరి పంట దిగుబడి లేక రైతు నష్ట పోయారని అన్నారు. గ్రామంలో కూలీల సమస్య ఉందని రైతులు కలెక్టర్కు చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవసరమైన వారికి డ్రోన్లు పంపిస్తామని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం సందర్శన.. అనంతరం కలెక్టర్ ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడీ సక్షం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి చిన్నారులతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పామర్రులోకి చాట్లవానిపురంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, ప్రణాళిక చిత్రపటాన్ని పరిశీలించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం.. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పామ ర్రు సచివాలయం–1లో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఉయ్యూరు ఆర్డీవో శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఈడబ్ల్యూఎస్ ఐడీసీ ఈ రాజన్న, తహసీల్దార్ రవికాంత్, డెప్యూటీ ఎంపీడీవో గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి శివ నాగరాణి, ఏఈ రాజేష్, వసతి గృహం సంక్షేమ అధికారి వీణకుమారి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
రూ.30లక్షల డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా
రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో తొమ్మిది డ్వాక్రా గ్రూపుల్లో దాదాపు రూ. 30లక్షలు స్వాహా అయిన సంఘటనపై బుధవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెడ్డిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చనపల్లి గ్రామంలో 9 గ్రూపులకు సంబంధించిన నగదును విస్సన్నపేటలోని ఇండియన్ బ్యాంకులో జమ చేస్తుంటారు. అయితే బుక్ కీపర్ అయిన బత్తుల మౌనిక మహిళ మండలి ప్రిసిడెంట్, సెక్రటరీ, గ్రూపు సభ్యులకు తెలియకుండా పలు దఫాలుగా సుమారు రూ. 30లక్షల వరకూ డ్రా చేసింది. దీనిని గుర్తించిన గ్రూపు సభ్యులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్బ్యాంకు మేనేజర్, సిబ్బంది, ఏపీఎం, సీసీల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలా ఎలా? గ్రూపు సభ్యుల సంతకం తేడా వస్తేనే డబ్బులు ఇవ్వని బ్యాంకు సిబ్బంది.. బుక్ కీపర్కు అంత మొత్తం ఎలా ఇచ్చారంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాయకష్టం చేసి మహిళా మండలి సభ్యులు పొదుపు చేస్తుంటే ఇండియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది, బుక్ కీపర్, ఏపీఎంలు కుమ్మకై డబ్బులు స్వాహా చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. నగదు మాయం నిజమే.. కాగా ఈ విషయమై ఏపీఎం రామకృష్ణను అడుగగా గ్రూపు సభ్యుల నగదు స్వాహా అయిన మాట నిజమేనని, దీనిపై విస్సన్నపేట ఇండియన్ బ్యాంకులో అడిట్ జరుగుతున్నట్లు తెలిపారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది డ్వాక్రా గ్రూపు సభ్యులు -
బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం
విస్సన్నపేట: స్థానిక విస్సన్నపేట–నూజివీడు రోడ్డులో రాణి కల్యాణమండపం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్, మినీలారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో.. బస్సు రోడ్డు సైడ్కు దూసుకెళ్లి ఆగిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాలుగు గ్రామాల నుంచి డ్రైవర్తో పాటు 42 మంది కలసి నిర్మలగిరి (గౌరీపట్నం )వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్ డ్రైవర్ లక్ష్మణ్రెడ్డికి కాలు విరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్ఐ అర్జున్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో వైద్యానికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. -
పూల ధరలకు రెక్కలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా మెయిన్ కెనాల్ సమీపంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిటకిటలాడింది. గురువారం పండుగను పురస్కరించుకొని పూజలకు, ఇతర అలంకరణ నిమిత్తం పూలను తీసుకెళ్లేందుకు నగర వాసులు భారీగా మార్కెట్కు తరలివచ్చారు. అందుకనుగుణంగా రైతులు కూడా భారీగా పూలను మార్కెట్కు తరలించారు. బంతి, చామంతి, మల్లి, లిల్లీ, గులాబీ పువ్వులు భారీగా వచ్చాయి. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం రోడ్డు మొత్తం వినియోగదారులు, వాహన చోదకులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేయటానికి వచ్చిన వినియోగదారులు ముందుకు సాగటానికి దారి లేక తోపులాటలు చోటు చేసుకున్నాయి. ధరలు.. భారీగా పెంచేశారు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రెండు రోజుల క్రితం ఉన్న ధరలు రెట్టింపయ్యాయి. ఆ ధరలను విని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మొన్నటి వరకూ కనకాంబరాలు కిలో రూ.200 నుంచి రూ.400 పలుకగా బుధవారం ఉదయం రూ.800, సాయంత్రం రూ.1000 మేర ధర పలికింది. అదేవిధంగా మల్లెపూలు మొన్నటి వరకూ కిలో రూ.200 మాత్రమే ఉండగా బుధవారం రూ.600 దాటింది. వాటితో పాటుగా చామంతి, గులాబీ ధరలు సైతం నాలుగు రెట్లు పెరిగి మూడు వందల నుంచి నాలుగు వందల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే లిల్లీ మొన్నటి వరకూ వంద నుంచి మూడు వందల రూపాయలు పలుకగా, బుధవారం రెండు రెట్లు పెరిగాయి. ఈ ధరలు గత ఏడాది రెట్టింపుగా ఉన్నాయని వ్యాపారులు వివరించారు. పూల ధరలు హోల్సేల్ మార్కెట్లో ఈ విధంగా పలుకుతుంటే రిటైల్గా ఇళ్ల వద్ద ఆ ధరలు మరింత పెరిగి వినియోగదారులకు మరింత భారమయ్యాయి. మార్కెట్లో పూలదండలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆలయాలు, ఇళ్లలో దేవుని విగ్రహాలతో పాటుగా అలంకరణకు దండలు వినియోగిస్తారు. అదే విధంగా దస్త్రాలు ఉన్న దుకాణాదారులు సైతం భారీగా పూలదండలను తీసుకెళ్లారు. అదేవిధంగా పండుగ సందర్భంగా వివిధ సభా కార్యక్రమాలను నిర్వహించే సంస్థలు సైతం దండలకు ఆర్డర్లు ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వీటి ధరలు రూ.200 నుంచి రూ.1000 వరకూ పలుకుతున్నాయి. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురోరాగ్యాలతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన మాస్టర్స్ (వెటరన్స్) జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, జావెలిన్త్రో, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్త్రో, హైజంప్ల్లో మహిళ లు, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆధార్ నంబర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 30, 31వ తేదీల్లో గుంటూ రు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఎ.కొండూరు: మండలం పరిధిలోని చీమలపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన 33వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో గత మూడేళ్లుగా చేసిన పోరాటాలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు, డిమాండ్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని విన్నవించారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పానెం ఆనందరావు, రైతులు పాల్గొన్నారు. పెనమలూరు: కానూరులో ఇంటర్ చదువుతున్న బాలిక బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు నాగార్జున ఆస్పత్రి సమీపంలో యశ్విని(16) కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆమె విజయవాడ మోగల్రాజపురంలో ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతూ మొదటి ఏడాది ఎంఈసీ పరీక్ష రాసింది. అయితే ఆమె ఇంట్లో ఉదయం చున్నీతో ఉరేసుకొని మృతి చెందింది. చదువుల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు
కోనేరుసెంటర్: లారీ ఢీకొనటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న మచిలీపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు వదలగా ఓ మహిళ తన పిల్లలను మోపెడ్పై ఎక్కించుకుని ఇంటికి వెళుతోంది. సరిగ్గా పరాసుపేట సెంటర్ సర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో కరగ్రహారం నుంచి పరాసుపేటకు చేరుకున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చిన్నారులు వెళుతున్న మోపెడ్ను ఢీకొన్నాడు. తల్లి పిల్లలు రోడ్డుపై పడిపోగా రెండు అడుగుల దూరం వరకు మోపెడ్ను లారీ దూసుకుంటూ ఈడ్చుకు వెళ్లింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి వాహనదారులు లారీడ్రైవర్ నిర్లక్ష్యాన్ని మందలిస్తూ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీని రివర్స్ చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు లారీ చక్రాల కింద పడి నలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పరారీలో డ్రైవర్! గాయాలపాలైన పిల్లలను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన లారీడ్రైవర్ వాహనాన్ని పక్కకు పెడుతున్నట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు, బందరు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి లారీ ఘంటశాలకు చెందినదిగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్తో పాటు వాహన యజమానిని స్టేషన్కు పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం. పెడన: పెడన– బంటుమిల్లి 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కట్లపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పెడన పట్టణంలోని శ్రీకృష్ణతులసీ థియేటర్ సమీపంలో నివాసం ఉండే పెయింటర్ యాళ్ల సాయి(24) తమ సమీప బంధువుల పిల్లలు గూట్ల మేఘశ్రీ(5), పుట్టి వైష్ణవి(12)లతో కలిసి సాయి తల్లిదండ్రులుంటున్న శింగరాయపాలెంకు సుమారు రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయల్దేరాడు. ఈక్రమంలో నరసాపురం నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి వీరి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, మేఘశ్రీ, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
సజావుగా ‘పది’ పరీక్షలు
98.91 శాతం హాజరు నమోదు మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎస్ఎస్సీ హిందీ, ఏపీఓఎస్ఎస్ ఇంగ్లిష్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఎస్ఎస్సీ పరీక్షలకు 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది హాజరవగా, 98.91 శాతం, ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరవడంతో 73.08 శాతం హాజరు నమోదైందన్నారు. రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు.. రెగ్యులర్ ఎస్ఎస్సీ పరీక్షలకు 21,257 మందికి గాను 21,063 మంది హాజరై 99.09 శాతం హాజరు నమోదైందని డీఈఓ తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థుల్లో 55 మందికి గాను 16 మంది హాజరై 29.09 శాతం హాజరు నమోదవగా, 39 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరై 73.08 శాతం హాజరు నమోదవగా, 161 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాలను పరిశీలించి, సిబ్బంది తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు అందివ్వడం ద్వారా మత సామరస్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ముస్లిం సోదరులకు బుధవారం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత వున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ’రోజా’(ఉపవాస దీక్షలు), దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందన్నారు. ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అలాగే ఇతర శాఖల్లో కూడా వారి సేవలు ప్రశంసనీయమన్నారు. డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, షరీన్బేగం, కేజీవీ సరిత, కె. కృష్ణ ప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, బి. లక్ష్మీనారాయణ, ఎస్వీడీ ప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొనారు. -
పీజీ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు బుధవారం విఽడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి ఏప్రిల్ ఒకటో తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇతర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. -
రైతులతో వాతావరణం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు ఎండ మండిపోగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారం మొదలైన కొద్ది సేపటికే ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, పలు ప్రచార బోర్డులు నేలకూలాయి. జొన్న, మొక్కజొన్న, మునగ వంటి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆర బెట్టిన మిర్చి, మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసి కల్లాల్లో ఆరబోసిన పంటలపై పట్టాలు కప్పి కాపాడుకునే రైతులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు, కృష్ణాజిల్లా పరిధిలో పెనమలూరు, నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి, మూలపాడు, లంక గ్రామాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వర్షం నీటితో పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల నేలవాలిన చేలల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. మునగ చేలు సైతం వేర్లుతో సహా నేలకూలడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. మచిలీపట్నంటౌన్: దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు పేర్కొన్నారు. మచిలీ పట్నం బస్టాండ్ ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వారితో కలిసి చిన్నాపురం గ్రామం వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు అమలు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బీపేట(విజయవాడతూర్పు): అభిమాన తరంగం ఉప్పొంగింది. వర్షపు జల్లులతో పోటీపడుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వెల్లువలా తరలి వచ్చింది. వాన చినుకులను లెక్కచేయక తమ అభిమాన నేత కోసం వేచిచూసింది. జననేత కనిపించిన ఆనందంతో జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పా టుచేశారు. ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ విందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పొంగిన అభిమాన తరంగం ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విజయవాడ చేరుకున్నారు. ఈదురు గాలులు, వర్షపు జల్లు లను లెక్కచేయక వివిధ ప్రాంతాల నుంచి ఇఫ్తార్ విందు జరిగే ఎస్ఎస్ కల్యాణ మండపం వద్దకు వేలాదిగా తరలి వచ్చారు. కల్యాణ మండపం పరిసరాలు అన్నీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. తమ అభిమాన నేత కనిపించగానే జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. ఆ ప్రాంతం జగన్ నామ స్మరణతో మారుమోగింది. ఇఫ్తార్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులతో పాటు, పెద్ద సంఖ్యలో అభిమానులతో నమాజు చేసే ప్రాంగణం వైఎస్ జగన్ రాకకు గంట ముందే నిండిపోయింది. బయట చిరు వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ తమ అభిమాన నేతను చూసేందుకు తడుస్తూనే అభిమానులు వేచి చూశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇఫ్తార్ విందు ముగించుకుని బయటకు వచ్చిన వైఎస్ జగన్ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో వైఎస్ జగన్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చిన తర్వాత సైతం అపార్ట్మెంట్లపై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుండటాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి కారు నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంజాద్బాషా, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణకుమార్, ఇషాక్, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, స్వామిదాసు, ముస్లిం నేతలు, మగ్బూల్, ఖాదర్ బాషా, నదీమ్, అహ్మద్ అలీఖాన్, నియోజకవర్గ ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, దేవ భక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, అంజిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమాజులో పాల్గొన్న ముస్లింలు (ఇన్సెట్) వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డివర్షంలో తడుస్తూ జననేత వైఎస్ జగన్ను చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న అభిమానులుఅభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి -
నేటి నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గురువారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష సుగంధ పుష్పాలతో అర్చన జరగనుంది. నూతన పూజా మండపంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి గురువారం తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కళావేదికపై పంచాంగ పఠనం జరుగుతుంది. తెలుగు సంవత్సరాది నేపధ్యంలో అమ్మ వారి ఆలయాన్ని పూలతో విశేషంగా అలకరించారు. మల్లెలు, మరువంతో అర్చన వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన గురువారం అమ్మవారికి మల్లెపూలు, మరువంతో విశేషంగా అర్చన జరుగుతుంది. తొలుత అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా పూజామండపానికి చేరుకుంటారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.2500 టికెట్ కొనుగోలు చేయాలి. ఉగాదిని పురస్కరించుకుని శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమై కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమల విలాస్, రమణయ్య కూల్డ్రింక్స్ షాపు, బోడెమ్మ హోటల్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
వ్యాగన్ వర్క్షాప్ను సందర్శించిన రైల్వే జీఎం
ఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం పాల్గొన్నారు. వర్క్షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్క్ షాపులోని పలు విభాగాలను జీఎం శ్రీవాత్సవ పరిశీలించారు. ముఖ్యంగా మెషీన్ షాప్, ఎంఎండబ్ల్యూ సెక్షన్, పెయింట్ షాప్, సాబ్ సెక్షన్, స్క్రాప్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్, వీల్షాప్ యార్డ్ ఆఫీస్ కాంప్లెక్స్లను సందర్శించారు. సంస్థ నిర్వహణపై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యాగన్ వర్క్షాపు ఉద్యోగులు, కార్మికుల కృషితో సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మరింత పురోభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వీల్ మిషన్, పెయింట్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారు జామున జరిగిన సుప్రభాత సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నాలుగు గంటలకు నిర్వహించిన ఖడ్గ మాలార్చనకు 24 టికెట్లను విక్రయించారు. దీంతో రెండు షిఫ్టుల్లో ఈ సేవను నిర్వహించాల్సి వచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో జరిగిన చండీహోమంలో 150 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా, మరో 50 మంది పరోక్షంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఈ సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పాత ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ బుధవారం సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్ నియంత్రణలో ప్రతి తల్లీ ఈగల్ బ్రాండ్ అంబాసిడరేనని, ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ ‘సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వాడకం పై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డాక్టర్ సామ్రాజ్యం, విజయవాడ ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలిసి వారు ప్రార్థనలు చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన విద్యార్థులు.. ఏం జరిగిందంటే..!
సాక్షి, విజయవాడ: టీడీపీకి ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు షాకిచ్చారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గురించి డబ్బా కొట్టడానికి వెళ్లిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడ్డంగా బుక్కయ్యారు. గొల్లపూడిలో ఎంపీపీ పాఠశాల తనిఖీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. మీ కోసమే మధ్యాహ్నభోజనంలో మంచి ఆహారాన్ని అందిస్తున్నామంటూ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు.ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం నాసికరంగా ఉందన్న విద్యార్థులు.. చిక్కీల్లో పురుగులు కూడా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే మైలవరంలోని తారకరామా నగర్ ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజనంపై తీవ్ర విమర్శలు రాగా, స్కూల్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టర్ను మార్చింది. తాజాగా మరో స్కూల్లో చిక్కీలపై ఫిర్యాదు రావడంతో టీడీపీ ఎమ్మెల్యే కంగుతిన్నారు. -
నటనా ‘కోట’కు ఆస్కార్ నీరాజనం
కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. కంకిపాడు నుంచే అన్నీ.. గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్ నడిపేవారు. వైద్యుడిగా అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు. అరుదైన గౌరవం.. కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది. – గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడుసమయం చిక్కినప్పుడల్లా.. కోట ఎంత బిజీగా ఉన్నా.. ఏ కొంత సమయం చిక్కినా కంకిపాడుకు వచ్చేవారు. ఆయన స్వస్థలంలో ఉన్న నివాసానికి వచ్చి గ్రామస్తులతో ఇష్టాగోష్టి జరిపేవారు. సినీ అభిమానులు ఆయన్ను కలుసుకుని ఆశీర్వాదం పొందేవారు. కళారంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కళాభిమానుల్ని ప్రోత్సహించేవారు. -
ఆడిందే ఆటగా..
సాక్షి టాస్క్ఫోర్స్: పామర్రులో పేకాట మూడు ముక్కలు.. ఆరు పేకలు అన్న చందంగా సాగుతోంది. కృష్ణా జిల్లాలోనే ఈ నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట డెన్లు ఏర్పాటు చేసి జోరుగా జూదాన్ని సాగిస్తున్నారు. ఆట మోజులో పడి అనేకమంది పేకాట రాయుళ్లు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పుల పాలై పలు కుంటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇదే అదునుగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తూ, నిర్వాహకుల నుంచి రోజువారీ, నెలవారీ మామూళ్లు పెట్టి భారీగా దండుకొంటున్నారు. పేకాటను అరికట్టాల్సిన పోలీసులు సైతం సందట్లో సడేమియా అన్నట్లుగా.. పేకాట శిబిరాలపై దాడి మాట దేవుడెరుగు, ఆ శిబిరాలకు వీరే రక్షణ కవచంలా వ్యవహరిస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. పమిడిముక్కల, పామర్రు ప్రాంతాల్లోని పోలీసు బాస్లు, సైతం అక్కడ జరిగే ఆటను బట్టి పర్సంటేజీ పెట్టుకోవడంతో పాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రోజువారీ, నెలవారీ మామూళ్లు వసూలు చేసే బాధ్యతను తీసుకున్నట్లు ఈ ప్రాంతంలో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా స్థానిక పోలీసులే, నియోజకవర్గ ప్రజాప్రతినిధితో కుమ్మక్కై జోరుగా పేకాటను నడుపుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంత ధీమాగా ఆట నడుపుతున్నారంటే, పై స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ తంతు నడుస్తుందా అనే భావన సైతం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇక్కడ జరుగుతున్న పేకాటకు సంబంధించి నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి స్పెషల్ పార్టీలతో ఆకస్మిక దాడులు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. పేకాట జరిగే ప్రాంతాలు ఇవే.. ప్రధానంగా పామర్రు నియోజకవర్గం, మొవ్వ మండలంలోని క్రోసూరు, కాజ, పామర్రు మండ లంలో పామర్రు, ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు, పెదపారుపూడి మండలంలోని మహేశ్వరపురం, పమిడిముక్కల మండలంలోని హనుమంతపురం, పమిడిముక్కల, తోట్లవల్లూరులోని లంక గ్రామాల్లో యథేచ్ఛగా పేకాట సాగుతోంది. దీంతో పాటు పామర్రులో చిత్తుల ఆట నిర్వహిస్తున్నారు. ఈ ఆటకు సైతం రోజువారీ మామూలు రూ.10 వేలుగా పోలీసులు నిర్ణయించినట్లు జోరుగా చర్చ సాగుతోంది. పర్మినెంట్ పేకాట క్లబ్కు యత్నం.. పెదపారుపూడి మండలం దోసపాడులో పర్మినెంట్ పేకాట క్లబ్ ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. విషయం బయటకు పొక్కడంతో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ వెంటనే స్పందించి పామర్రులో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని, ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. దీంతో అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. తాత్కాలికంగా క్లబ్ ప్రతిపాదన ఆగిపోయింది. పామర్రు తరువాత పెనమలూరు నియోజకవర్గంలోనే పేకాట జోరుగా సాగుతోంది. ఇక్కడ కూడా నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అంతా సాగుతోందని తెలుస్తోంది. పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటంతో వారు నోరు మెదపడం లేదు. ప్రధానంగా పోరంకి, పద్మావతి కాలనీ, వణుకూరు, పెనమలూరు, కంకిపాడులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో, ఉయ్యూరులోని పలు ప్రాంతాల్లో పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోరంకి–నిడమానూరు రోడ్డులో గన్నవరం నియోజకవర్గం వారు వచ్చి ఆడుకొనేలా అధికార పార్టీనేతలే ఏర్పాట్లు చేశారు. గతంలో పోరంకి సమీపంలో పోలీసుల దాడుల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరుడు పట్టుపడిన విషయం విదితమే. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, పోలీసులకు ముడుపులు అందుతుండటంతో, ఈ పేకాట డెన్ల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆస్కార్ నీరాజనం
నటనా కోటకు కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. కంకిపాడు నుంచే అన్నీ.. గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్ నడిపేవారు. వైద్యుడిగా అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు. కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది. – గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడు -
అజరామరం పొట్టిశ్రీరాములు త్యాగం
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన పట్టుదల ఆదర్శనీయమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతిలో 58 అడుగుల స్టాట్ట్యూ ఆఫ్ శాక్రిఫైజ్ కాంస్య విగ్రహాన్ని నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధేయ వాది అయిన పొట్టి శ్రీరాములులోని పట్టుదల, త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రసంగించారు. డీఆర్వో చంద్రశేఖరరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగాలు అజరామరం
ఏఎస్పీ నాయుడు జేసీ నవీన్ 23.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చల్లపలి: కోళళ్ల ఫారాలకు తరలిస్తున్న 23.5 టన్నుల రేషన్ బియ్యాన్ని చల్లపల్లి పోలీసులు సోమవారం పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉండడాన్ని గుర్తించారు. బియ్యాన్ని తరలిస్తున్న గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన పి.మాణిక్యాలరావు, లంకపల్లికి చెందిన కె.నాగేంద్రం, డ్రైవర్ సాదిక్లపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు. -
అధిక ప్రాధాన్యంతో సత్వర పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ ఎం. నవన్, డీఆర్వో చంద్రశేఖరరావు, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతన్నా మీ కోసం రెండో విడత కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఐదు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయశాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. మీ కోసం కార్యక్రమంలో అధికారులు 109 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లు నూతనంగా నిర్మించుకున్న డ్రైయ్యర్ వల్ల అవస్థలు పడుతున్నామని గ్రామ శివారు ఎన్టీఆర్ కాలనీవాసులు పేర్కొన్నారు. డ్రైయ్యర్ కారణంగా ఇళ్లలోకి విపరీతమైన దుమ్మూ, ధూళి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వివరించారు. ఇప్పటికే దీని కారణంగా ఒకరు చనిపోయారని, ముగ్గురు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వాపోయారు. అంతేకాకుండా మంచి నీటి చెరువు కూడా కలుషితమవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. -
ఆల్ ఇండియా జూనియర్ లాన్ టెన్నిస్ చాంపియన్షిప్–2026 ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆల్ ఇండియా జూనియర్ (అండర్–16, బాలురు, బాలికల) లాన్ టెన్నిస్ చాంపియన్ షిప్–2026 పోటీలను సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో గమనించి తల్లిదండ్రులు ఆ క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తే వారు రాణిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై.బాబూరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ఈ.లలిత్కుమార్, కోశాధికారి శ్రీనివాసరావుతో పాటుగా సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆకివీడులో మత కల్లోలాలకు కుట్ర నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో మతకల్లోలాలకు కుట్ర జరుగుతోందని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీనగర్ లోని ఒక హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకివీడులో గత మూడు నెలలుగా అశాంతి నెలకొందన్నారు. డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైఖరి వల్ల హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని జాన్ మస్క్ మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై దృష్టి సారించకుండా, ప్రార్థనా మందిరాల కూల్చివేతలకు పాల్పడటం శోచనీయమన్నారు. కేవలం బీజేపీకి దగ్గరయ్యేందుకే రఘురామకృష్ణంరాజు రాష్ట్రాన్ని మణిపూర్ తరహాలో మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తక్షణమే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.సమావేశంలో ఏపీ క్రిస్టియన్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షుడు పాస్టర్ ఎండీ ఇస్మాయిల్, జి.రాజేష్ ఖన్నా, పీతల రాజు, యోసేబు, విజయ శేఖర్, ప్రకాష్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
బార్ అనుమతులు రద్దు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ను పరిశీలించిన ఎకై ్సజ్ శాఖ డీసీ చిలకలపూడి(మచిలీపట్నం): నిబంధనలకు విరుద్ధంగా మంగిన పూడిబీచ్ రోడ్డులో బార్ షాపును నిర్వహిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు పరిశీలించిన అనంతరం అమ్మకాలను నిలిపివేసి, సస్పెండ్ చేస్తున్నట్లు ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘కిక్కు’రుమనడం లేదు! శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి, మచిలీపట్నంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన లాటరీ పద్ధతిలో నిర్వహించిన ప్రక్రియలో ఎంపికై న లైసెన్సుదారుడికి ప్రొవిజినల్ లైసెన్సు అందజేశామని తెలిపారు. అయితే 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు అన్ని సదుపాయాలతో బార్ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా అమ్మకాలు జరుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఎకై ్సజ్ అధికారులు పరిశీలించి, నిబంధనలకు లోబడి లేకపోవటంతో వెంటనే అమ్మకాలను నిలిపివేసి, అనుమతులు సస్పెండ్ చేశామన్నారు. లైసెన్సుదారుడికి నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం 77 మంది కార్యదర్శులకు గ్రేడ్–4 నుంచి గ్రేడ్–3గా సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కలెక్టర్ ఆయన చాంబర్లో అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ పాల్గొన్నారు. -
తొలి రోజు ప్రశాంతం
జిల్లాలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ తెలుగు)తో పాటు ఓపెన్ స్కూల్ (ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షలు (తెలుగు/ఉర్దూ) జిల్లాలో సోమవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలను ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి పరిశీలించగా, మరో 12 పరీక్ష కేంద్రాలను సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా అబ్జర్వర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ సందర్శించి పరీక్షల నిర్వహణ విధానంపై సంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదనంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, రెండు ఏసీజీఈలు మొత్తం 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు.. జిల్లాలోని 148 పరీక్ష కేంద్రాల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 21,438 మంది విద్యార్థుల్లో 21,173 మంది హాజరై, 265 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 98.76గా నమోదైంది. రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు.. రెగ్యులర్ విద్యార్థుల్లో 21,272 మంది నమోదు కాగా, 21,080 మంది హాజరై 192 మంది గైర్హాజరయ్యారు. హాజరు 99.10 శాతంగా నమోదు కాగా ప్రైవేట్ (వన్స్ ఫెయిల్) విద్యార్థుల్లో 166 మంది నమోదు కాగా, 93 మంది హాజరై 73 మంది గైర్హాజరయ్యారు. హాజరు 56.02 శాతంగా ఉంది. ఓపెన్ స్కూల్.. ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లాలోని ఎనిమిది పరీక్ష కేంద్రాలలో మొత్తం 591 మంది విద్యార్థులు నమోదు కాగా, 428 మంది హాజరయ్యారు. 163 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 72.42గా నమోదైంది. పరీక్ష కేంద్రాల పరిశీలన.. జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు నగరంలోని సీపీఎం హైస్కూల్ చిలకలపూడి, నిర్మల హై స్కూల్, హైని హై స్కూల్, బాలాజీ విద్యాలయం, బాలభాను హై స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే నిర్మల హై స్కూల్, బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాలను కూడా సందర్శించారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ త్రిమూర్తి చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆర్య వైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగుళానికి 5 వేల చొప్పున వసూలు చేశారు. 158 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం 17వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ వైఎస్సార్సీపీ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాం. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సన్మానించాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా పొట్టి శ్రీరాములు జయంతి కానీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు కానీ నిర్వహించలేదు. పొట్టి శ్రీరాములుని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఏడాది ఘనంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు’ అని చెప్పుకొచ్చారు. -
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెనమలూరు: వినియోగదారులకు హక్కులపై అవగాహన కల్పించాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కానూరులో ఆదివారం సిద్ధార్థ లా కాలేజీ, ఏపీ కన్స్యూమర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన, సాధికారతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నా హక్కులపై అవగాహన లేక మోసాలకు గురవుతున్నారని తెలిపారు. నేడు సమాజంలో నిబద్ధత, పారదర్శకత లోపిస్తోందని, అవినీతి, కల్తీ పెరిగిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్, విద్యా, వైద్యరంగంపై వినియోగదారులకు అవగాహన లేక పోవడంతో మోసాలకు గురవుతున్నారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి మాట్లాడుతూ విద్య, వైద్యం వ్యాపారంగా మారాయన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు ఎం.రాజయ్య, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు, ప్రో ఉపకులపతి డాక్టర్ రత్నప్రసాద్, బార్ అధ్యక్షుడు మన్నే హరిబాబు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతిలోనే మహిళలను గౌరవించే విధానం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులను సత్కరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన ప్రధాని మోదీ చేతల మనిషి అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేనిదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మనమందరం సంతోషంగా, సుఖంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికులే కారణమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అందరికంటే మహానుభావులన్న ప్రధాని మోదీ వారి కాళ్లు కడిగారని గుర్తు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో నా పెద్ద కుమారుని పేరుతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
అలరించిన కూచిపూడి నృత్యాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో యువ కళాకారిణులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలోనిని కళావేదికపై నాట్య గురువు మద్దాలి సత్యవాణి శిష్య బృందం కణ్వల, విజయ, నందిత, ప్రసన్న, అనిత, హేమ, వీణ, సరయు, మన్విత, చార్వి, జుహిత, నిష్కళలు పలు అంశాలకు చక్కని అభినయం, ఆహార్యంతో నర్తించి పలువురిరి ప్రశంసలు అందుకున్నారు. వారు ప్రదర్శించిన నృత్యాంశాల్లో నర్తన గణపతిం, బాల కనకమయ, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన, కులుకక నడవరో, కాలభైరవాష్టకం, శివ పంచాక్షరి, శివాష్టకం, ఒక పరికొక పరి, శివస్తుతి, భావములోన, పలుకే బంగారమాయెనా, లింగాష్టకం చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా నాట్య గురువు సత్యవాణి మాట్లాడుతూ జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం
వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా కంకిపాడు: నూరుశాతం అక్షరాస్యత సాధనే ప్రభుత్వ లక్ష్యమని వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రంజిత్బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా 20 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాయడం, చదవడం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ అంశాలపై అవగాహన కలిగి ఉండేలా అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఉల్లాస్ కార్యక్రమం కింద వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ 100 గంటల పాటు అవసరమైన శిక్షణ అందించామన్నారు. 2029 నాటికి దశల వారీగా అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.బసవయ్య, పరీక్ష కేంద్రం పర్యవేక్షకురాలు యార్లగడ్డ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని రంజిత్బాషా సందర్శించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 73,327 మంది అభ్యాసకులకు 980 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసంచాలకులు ఎండీ.హాజీబేగ్, ఎంపీడీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నూతన తెలుగు సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని ఏపీ ముదిరాజ్ మహాసభ రూపొందించిన ముదిరాజ్ –2026 డైరీని సినీ నటుడు సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. ఏపీ ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొర్న వెంకట నారాయణ ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో నూతన డైరీని విడుదల చేశారు. కార్యక్రమంలో పీవీఎల్ఎన్ రాజు ముదిరాజు, మద్దం కోటేశ్వరరావు ముదిరాజు, వెంకటేశ్వరరావు ముదిరాజు, మహిళా నాయకురాలు బోడి మాధవి ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): శ్రీరాముని భక్తుడు ఉపేంద్ర దాస్ గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు చేపట్టిన గంగోత్రి–రామేశ్వరం యాత్ర ఆదివారం కొండపల్లి గ్రామానికి చేరుకుంది. 2023 జూన్ 2 వ తేదీన ఆయన గంగోత్రిలో భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తూ గంగోత్రి–రామేశ్వరం యాత్ర చేపట్టారు. యాత్ర కొండపల్లి చేరిన సందర్భంగా స్థానిక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, షాబూఖారీ దర్గా పీఠాధిపతి మహ్మద్ అల్తాఫ్ రజాతో పాటు పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. యాత్రికుడు ఉపేంద్ర దాస్ మాట్లాడుతూ గంగోత్రి నుంచి రామేశ్వరానికి భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి, లోక కల్యాణమన్నారు. అవనిగడ్డ: స్థానిక లంకమ్మ అమ్మవారిని జిల్లా జడ్జి బాబు నాయక్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు బాబు నాయక్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. పలువురు న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అవినాష్ పుట్టినరోజు వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పార్టీ నేతలు కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేత నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా దేవినేని అవినాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 (పురుషుల) జట్టు ఎంపికలు ఈ నెల 19వ తేదీ నిర్వహిస్తున్నామని సంఘం కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో సెలక్షన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. 1.9.2007 తర్వాత జన్మించిన వారు పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, తెల్లటి దుస్తులు(వైట్ డ్రస్), స్పోర్ట్స్ షూ, సొంత క్రికెట్ కిట్, రెడ్ కలర్ బాల్తో ఈ ఎంపికలకు హాజరు కావాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పెనమలూరు: పోరంకి వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు సుగాలీ కాలనీకి చెందిన ఎన్.రాంబాబు (45) బోరింగ్ పనులు చేస్తాడు. అతను శనివారం అర్ధరాత్రి రసనా బార్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఘటనలో రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. మృతుడి కుమారుడు సాయినాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజుల పాటు అంతర్జాతీయ గణిత సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ జి.పార్థసార ట వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు అంశంపై జరగనున్న అంతర్జాతీయ గణిత సదస్సుకు అతిథులుగా వర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాథరావు, జేఎన్టీయూ హైదరాబాద్ అకడమిక్స్ డైరెక్టర్, కంప్యూటర్ సైన్స్ విభాగ ఆచార్యులు డాక్టర్ వి.కామాక్షి ప్రసాద్ హాజరు కానున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గణిత సదస్సులో దేశ విదేశాల నుంచి రీసోర్స్ పర్సన్స్, ఔత్సాహికులు పాల్గొని తాము రూపొందించిన పరిశోధనా పత్రాలను ప్రదర్శించనున్నారన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. -
భర్త హత్యలో భార్య ప్రమేయం
సహకరించిన మరో ఇద్దరి అరెస్టు గూడూరు: రామరాజుపాలెంలో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరసా నాగరాజు కేసులో అతని భార్య పరసా జ్యోతి ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమెకు సహకరించిన కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులు, పుల్లేటి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మృతుడు పరసా నాగరాజు భార్య జ్యోతి, కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులుతో కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ఇది నచ్చని నాగరాజుకు భార్యను పద్ధతి మార్చుకోవాలని వారిస్తున్నాడు. అయినా ఆమె తీరు మారకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలిసిన నాగరాజు సోదరులు పద్ధతి మార్చుకోవాలని జ్యోతిని మందలించారు. దీంతో నాగరాజును ఎలాగైనా చంపేయాలని తటవర్తి ఆంజనేయులుతో కలసి పథకం రచించింది. 10 తేదీ రాత్రి వేళ మద్యం సేవించి వచ్చిన పరసా నాగరాజు ఇంట్లో మంచంపై మత్తులో పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యోతి.. ఆంజనేయులకు సమాచారం ఇచ్చింది. అతను తనకు తోడుగా పుల్లేటి నాగరాజు అనే యువకుడిని కూడా తీసుకువచ్చాడు. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న నాగరాజు కాళ్లను పుల్లేటి నాగరాజు గట్టిగా పట్టుకోగా ఆంజనేయులు, జ్యోతి కలిసి మెడకు తుండు చుట్టి ఊపిరాడనీయకుండా చేసి హతమార్చారు. నాగరాజు ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న ఆంజనేయులు, తనతో వచ్చిన పుల్లేటి నాగరాజును తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జ్యోతి తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ... నిద్రపోతున్న తన కుమారుడిని లేపి తండ్రి చనిపోయిన విషయం చెప్పి బంధువులకు సమాచారం ఇచ్చింది. అయితే పరసా నాగరాజు మృతిపై తమకు అనుమానం ఉందని అతని సోదరుడు ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హంతకులను సాక్ష్యాధారాలతో పట్టుకుని, కోర్టుకు హాజరుపర్చారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై సీహెచ్ దివ్య ప్రకాష్, ఏఎస్సై స్వాములు, సిబ్బందిని సీఐ అభినందించారు. పెదపాలెం(నాగాయలంక): గ్రామంలోని పేద దళితుడి ఇల్లును ఆదివారం కూల్చేశారు. 40 ఏళ్ల క్రితం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెదపాలెం కాలువ గట్టుపై సిమెంట్ రేకులతో ఇల్లు నిర్మించుకుని జీవిస్తుంటే దౌర్జన్యంగా పొక్లెయినర్తో కూల్చేసి వీధిపాలు చేశారని నాంచారయ్య కుటుంబం గగ్గోలు పెట్టింది. ఆదివారం ఉదయాన్నే తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్, ఎస్.ఐ కలిదిండి రాజేష్ సమక్షంలో పంచాయతీ అధికారులు గృహాన్ని పడగొట్టారు. గ్రామం పరిధిలోని సౌత్చానల్ డైరెక్ట్ పంట కాలువ గట్టుపై ఆక్రమణలో ఉన్న ఈ గృహాన్ని తొలగించాలని ఇరిగేషన్ అధికారులు పంచాయతీని కోరిన మీదట ఈ చర్య చేపట్టినట్లు కార్యదర్శి సునీల్కుమార్ చెప్పారు. పెద నాంచారయ్య ఇంటిని కూల్చి వేసిన ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు దళితులపై ఉన్న అసలు వైఖరిని బహిర్గతం చేసిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ విమర్శించారు. కోర్టు స్టే ఆర్డర్ కేసు పెండింగ్లో ఉన్నా కూల్చేయడం దారుణమని రమేష్ పేర్కొన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు నిలయమైన పెద్దల విగ్రహాలు అధికార యంత్రాంగానికి కనిపించవని మారుమూల ప్రాంతంలో జీవనం సాగిస్తున్న పేద దళితుడు మాత్రం ఆక్రమణ దారుడిగా కనిపిస్తాడని ఆయన విమర్శించారు. -
ప్రభుత్వ విద్య నిర్వీర్యం!
జి.కొండూరు: గత వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన ప్రభుత్వ విద్యారంగం.. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమవుతోంది. ‘నాడు–నేడు’తో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తే, చంద్రబాబు సర్కార్ గవర్నమెంట్ స్కూళ్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్రయివేటు రంగానికి ఊతమిస్తోంది. సరిపోనూ లేని ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయించి, విద్యా నాణ్యతపై భరోసా కలిగించేలా ప్రచారం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం ఆ పని చేయకుండా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలలను నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. జి.కొండూరు మండల పరిధిలో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి బాలురు 1,352, బాలికలు 1,308 మంది కలిపి 2,660 మాత్రమే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ సంఖ్య 3,500కి పైగా ఉండేది. వీటిలో 23 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కోడూరు, వెల్లటూరు, వెలగలేరు, కవులూరు, కట్టుబడిపాలెం, గంగినేని, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు, చెవుటూరు, కుంటముక్కల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మాత్రమే మోడల్ ప్రైమరీలుగా మార్చారు. ఒక్కొక్క పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయించారు. మిగిలిన 11ప్రాథమిక పాఠశాలలను బేసిక్ ప్రైమరీలుగా మార్చి ఇక్కడ కూడా ఐదు తరగతులు ఉన్నా పాఠశాలకు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించారు. చంద్రబాబు సర్కార్ వెల్లటూరులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయిందనే నెపంతో ఇటీవల స్కూల్ను మూసివేసింది. దీనిలో గత విద్యాసంవత్సరంలో పది మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు జి.కొండూరు శివారు గొల్లగూడెం, పినపాక శివారు విద్యానగరం ప్రాథమిక పాఠశాలలను సైతం వచ్చే విద్యా సంవత్సరానికి మూసేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని తెలిసి ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తరగతులను మెర్జ్ చేయడంతో సమస్య జి.కొండూరు పంచాయతీలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను ఎక్కడా లేని విధంగా జి.కొండూరు జెడ్పీ హైస్కూల్లో మెర్జ్ చేసి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడుని కేటాయించి దీన్ని ఫౌండేషన్ పాఠశాలగా మార్చారు. దీనితో ఈ స్కూల్లోవిద్యార్థుల సంఖ్య ముగ్గురికి పడిపోయింది. వచ్చే ఏడాది ముగ్గురు కూడా ఉండే అవకాశం లేకపోవడంతో ఈ పాఠశాలను మూసేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద ఈ పాఠశాలను ఆధునికీకరించారు. ఈ పాఠశాలను మూసి వేసి జెడ్పీ హైస్కూల్లో తరగతులను కలపడంతో తమ పిల్లలు రోజూ కిలోమీటరుపైగా నడిచి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తమ గ్రామంలోనే ఉంటే విద్యార్థుల సంఖ్య పెరిగి, పిల్లలు నడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. జి.కొండూరుకు, గొల్లగూడెంకు మద్యలో పులివాగు కూడా ఉండటంతో వానాకాలంలో పిల్లలు వంతెన దాటి వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. గొల్లగూడెం ఫౌండేషన్ పాఠశాలను తొలగిస్తామనే అపోహ వద్దు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను ఒకటవ తరగతిలో ఫౌండేషన్ స్కూల్లో చేర్చేలా అవగాహన కల్పిస్తున్నాం. పినపాక పాఠశాల బేసిక్ ప్రైమరీగా కొనసాగుతుండటంతో మూసివేయడం జరగదు. –వీరాస్వామి, మండల విద్యాశాఖ అధికారి, జి.కొండూరు -
దుర్గమ్మ సేవలో జస్టిస్ బాలాజీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడపల్లి బాలాజీ కుటుంబ సమేతంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అర్చకులు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోమరిగిరిపట్నంకు చెందిన కొప్పాడి రమేష్ కుటుంబం రూ. 2.50లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచొద్దని నిరుద్యోగ వ్యవసాయ యువ శాస్త్రవేత్తల బృందం డిమాండ్ చేసింది. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ప్రొఫెసర్లు వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని వివిధ సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికే 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో దశాబ్ద కాలంగా ఎటువంటి నియామకాలు జరగలేదన్నారు. దీంతో వ్యవసాయ, అనుబంధ అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారి నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 65 ఏళ్ల ఉద్యోగ విరమణ అంశమే లేదని, మరి మన రాష్ట్రంలో పెంచడం ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో యువ శాస్త్రవేత్తలు రాజేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా
● జనావాసాల్లోనే బార్, వైన్షాపులు ● ప్రజలు తిరగబడినా ఫలితం శూన్యం ● నెలలు గడుస్తున్నా ప్రొవిజినల్ లైసెన్సుతోనే బార్ నిర్వహణ ● విచ్చలవిడిగా బెల్టుషాపులు ● నిబంధనల అమలును గాలికొదిలేసిన ఎకై ్సజ్ అధికారులు గతంలో ఇలా.. నిబంధనలకు నీళ్లు.. విచ్చలవిడి ‘గొలుసు’.. నిబంధనలంటే అలుసు.. -
బరి తెగించి మద్యం అమ్మకాలు
● ఇంజినీరింగ్ కళాశాలకు అతి సమీపంలోనే బార్ ఏర్పాటు ● కల్తీ మద్యం అమ్ముతున్నా మంత్రికి పట్టడం లేదు ● మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం చిలకలపూడి(మచిలీపట్నం): కంచే చేను మేసిన చందంగా ఎకై ్సజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో బరితెగించి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దానికి మంత్రి వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ మైక్లలో మాత్రం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్న మంత్రి.. కాసుల కక్కుర్తితో మద్యాన్ని విచ్చలవిడి చేస్తున్నారన్నారు. మంగినపూడిబీచ్ రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా.. షామియానాలో బార్ను ఏర్పాటు చేయటం అధికార పార్టీ నాయకులకే చెల్లిందన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ను ఆరు బయట, స్టేట్ హైవే వద్ద ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారన్నారు. ప్రజలకు కనపడకుండా ఏర్పాటు చేయాల్సినప్పటికీ డమ్మీగా ఈఎస్ గంగాధరరావును పెట్టుకుని ఏఈఎస్ భార్గవ్ను ఏజెంట్గా పెట్టుకుని అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి అడ్డగోలుగా దోచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. మంత్రి కనుసన్నల్లో అమ్మకాలు జరుగుతున్నా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఆయనకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదన్నారు. ఈ విషయాలపై తాను సమాచార హక్కు చట్టం కింద నాలుగు నెలల క్రితం కోరినప్పటికీ మామూళ్ల మత్తులో నిద్రపోతున్న ఎకై ్సజ్ అధికారులు ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు. కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారు? ఈ విధంగా మద్యం మాఫియా చెలరేగుతుంటే కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఏం చేస్తున్నారు.. కనీసం పట్టించుకోవాలి కదా అని పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రి ఏం పాపం చేసినా చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. కేవలం జెండాలు కట్టడానికే పోలీస్ బందోబస్తు పనిచేస్తుందా అని ఆయన అన్నా రు. ఎకై ్సజ్ చట్టాన్ని తుంగలోకి తొక్కి, ప్రొహిబిషనరీ నిబంధనలను గాలికొదిలేసి ఏఈఎస్ భార్గవ్.. మంత్రి కొల్లుకు చెంచాగిరీ చేస్తున్నారని విమర్శించారు. బార్ను సీజ్ చేయండి.. అధికారులు మత్తు వీడి ధర్మానికి ఉద్యోగం చేయాలని పేర్ని హితవు పలికారు. వెంటనే బార్ను సీజ్ చేయాలని, ఏఈఎస్ భార్గవ్ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ బార్లో ఎంత సరుకు కొంటున్నారో, ఏ బ్రాండ్, ఎంత విలువైనది, ఎన్ని సీసాలు అమ్మారో బహిరంగంగా వివరాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు గాజుల భగవాన్, బూరగ రామారావు తదితరులు ఉన్నారు. -
దుర్గమ్మ సన్నిఽధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో వైపున అంతరాలయ రద్దీ తగ్గడంతో రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులకు రూ. 100 క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రద్దీ తగ్గుముఖం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధలతో జరిగింది. సూర్యభగవానుడి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
యనమలకుదురు ఆలయ ఈవో సస్పెండ్
పెనమలూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సాక్షి దినపత్రికలో ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై వచ్చిన వరుస కథనాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. యనమలకుదురు ఆలయంలో హుండీలో సొమ్ము స్వాహా చేసిన ఘటనపై ఎండోమెంట్ జాయింట్కమిషనర్ జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఘటనపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక అందించారన్నారు. ఆలయంలో హుండీల లెక్కింపులో సరైన చర్యలు తీసుకోలేదని, సీసీ కెమెరాలు ఆపి బయట వ్యక్తులు ప్రవేశించి, హుండీలలో సొమ్ము కాజేశారని, అంతరాలయంలో హుండీ నకిలీ తాళంతో తెరిచి సొమ్ము స్వాహా చేశారని, స్వామివారి ఆభరణాలు, సొమ్ము భద్రపర్చడంలో విఫలమయ్యారని, పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారన్న అభియోగాలు మోపుతూ ఈవో ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ వీడరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కానూరు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యంకు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచూకీ ఎక్కడ? ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన యనమలకుదురు ఆలయం ఈవో భవానీ ఇప్పటికై నా బయటకు వస్తారనా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండోమెంట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆమె హెడ్క్వార్టర్స్ అనుమతి లేకుండా వీడరాదని పేర్కొన్నారు. వాస్తవానికి ఈవో భవానీ గత వారం రోజులుగా అదృశ్యమయ్యారు. పైగా ఆలయంలో ఎండోమెంట్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేసిన సమయంలో ఆమె హాజరుకాలేదు. పోలీసులు కూడా భవానీ కోసం గాలిస్తున్నారు. -
మడతెట్టేస్తున్నారు!
కృష్ణాజిల్లాసోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026తీరంలో తమ్ముళ్ల భూదందా● 100 ఎకరాల మడ భూములపై కూటమి నేతల కన్ను ● ఇష్టానుసారంగా నరికేస్తున్న వైనం ● ఇప్పటికే సుమారు 20 ఎకరాలు నరికివేత ● ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు కృత్తివెన్ను: అది ప్రభుత్వ అసైన్డ్ భూమి.. మడ అడవులతో నిండి ఉంది.. తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి ప్రజలను రక్షించే రక్షణ కవచం.. కానీ కూటమి నేతల కన్ను ఆ భూములపై పడింది.. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వందల మందితో ఇష్టానుసారంగా మడ అడవులను నిర్ధాక్షిణ్యంగా నరికేయడం ప్రారంభించారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ గోగిలేరు పరీవాహక ప్రాంతంలోని ఆర్ఎస్ నంబర్ 105లో సుమారు 120పై చిలుకు ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు వాటిని నరికేసి చెరువులుగా మార్చేందుకుగాను ఇప్పటికే సుమారు 20 ఎకరాల వరకూ చెట్లను నరికేశారు. నిడమర్రు దళితవాడ, గోగిలేరు పాయకు మధ్యలో దాదాపు 120 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూముల్లో విస్తారంగా మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. సముద్రానికి అత్యంత చేరువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి రక్షించడంలో మడ అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు ఈ భూములపై కన్నేశారు. మడ చెట్లను నరికేసి మొత్తం ఈ భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. రోజుకు సుమారు 100 మందికి పైగా కూలీలను మడచెట్లు నరికే పనికి పురమాయించారు. ఇప్పటి వరకు సుమారు 20 ఎకరాలకు పైగా భూముల్లో మడ చెట్లను నరికేశారు. దీనిపై స్థానికులు కొందరు తమ ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కూటమి నాయకులు ఈ విధంగా దోచుకునేందుకు పాల్పడుతుండటంపై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై కనీసం స్పందించని అధికారుల తీరును వారు తప్పు పడుతున్నారు. మడ అడవుల నరికేతవేతపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా.. సర్వే నంబర్ 105లో ఉన్నవన్నీ ప్రభుత్వ భూములేనని, వాటిలో మడచెట్లను నరకడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని చెప్పారు. 7చిలకలపూడి: కలెక్టరేట్లో సోమవారం ఉదయం పది గంటల నుంచి ప్రజాసమస్య ల పరిష్కార వేదిక (మీ కోసం)ను నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మీ కోసం కాల్ సెంటర్(1100)కు కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు. గుడ్లవల్లేరు:వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. అధికారులు అమ్మవారి చిత్రపటం అందించారు. తీరప్రాంత పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి తీరం వెంబడి మడ మొక్కలను నాటి సంరక్షిస్తుంటే.. కృత్తివెన్ను మండలంలో మాత్రం ప్రభుత్వ భూముల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ అడవులను ధ్వంసం చేసి కబ్జా చేస్తున్న వైనంపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..!
మచిలీపట్నం: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఎక్సైజ్ చట్టాలను తుంగలో తొక్కి, బార్ రూల్స్కి విరుద్ధంగా టెంట్లు వేసి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పందిర్ల కింద బార్ లైసెన్స్ మంజూరు చేసి, మద్యం సిండికేట్ల అవినీతి మత్తులో మునిగితేలుతున్నారు కృష్ణాజిల్లా ఎక్సైజ్ అధికారులు. రాష్ట్రం మొత్తం ఒక రూల్.. మచిలీపట్నం మరొక రూల్ అన్నట్లు ఇక్కడ మద్యం అమ్మకాల నిర్వహణ సాగుతోంది. ‘ ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై’ అన్నట్లుగా సాగుతున్నాయి మద్యం విక్రయాలు. బార్ రూల్స్కు విరుద్ధంగా ఖాళీ స్థలంలో టెంట్లు, పందిర్లు వేసి మచిలీపట్నం బీచ్ రోడ్లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు నిర్వహకులు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దాంతో స్థానికుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. టెంట్లు, పందిళ్ళ కింద బార్ లైసెన్సులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్న స్థానికులు.గుడారాల్లోనే బార్లుజనసేనకు చెందిన కొరియర్ శ్రీను గుడారాల్లోనే బార్ నిర్వహిస్తున్నారు. తన అనుచరులతో బార్ టెండర్లు పొందిన మచిలీపట్నంకు చెందిన జనసేన నేత కొరియర్ శ్రీను.. భవన నిర్మాణాలు చేపట్టకుండానే గుడారాలు వేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు.ఇది ఆబ్కారీ శాఖ వింతపోకడలకు అద్దం పడుతోంది. ఇలా గుడారాల్లో బార్ నిర్వహించడం రూల్స్కి విరుద్ధమైనా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.అబ్కారీశాఖ మంత్రి ఇలాకాలో మద్యం పరవళ్లు..కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తూ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు, రాత్రి పరవళ్లు తొక్కుతుంది. అదేమంటే మేమింతే అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు (మద్యం వ్యాపారులు) సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026రేపు ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అధికారులకు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్గిరికి ృచెందిన ఎస్. సంధ్యారాణి కుటుంబం అమ్మవారి గోసంరక్షణ పథకానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అధికారులు చందు శ్రీనివాస్, డీవీవీ సత్యనారాయణలు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 16వ తేదీ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు వేదిక మార్పు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో కాకుండా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మార్పు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇఫ్తార్ విందులో పాల్గొనే మత పెద్దలు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు వేదిక మార్పును అంశాన్ని గమనించాలన్నారు. ఇఫ్తార్ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, వసతులు, ట్రాఫిక్ వంటి విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో యాకూబ్ బాషా, విజయవాడ ఆర్డీవో టి.వి.సతీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, ప్రొటోకాల్ డైరెక్టర్ టి.మోహన్రావు, వక్ఫ్ బోర్డు అధికారులు ఆదం షఫీ, మస్తాన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.మచిలీపట్నంటౌన్: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నా.. వినియోగదారుల్లో దొరకదనే భయం ఉంది. అమెరికా, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావంతో మచిలీపట్నం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సమస్య జటిలమవుతోంది. గ్యాస్ సిలిండర్పై మచిలీపట్నం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. సిలిండర్ల కోసం వినియోగదారులు వారి వాహనాలకు గ్యాస్ బండలను కట్టుకొని లేదా ఆటోలో వేసుకుని, మోసుకుంటూ కంపెనీలకు చేరుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్లో వేలాది రూపాయలకు అమ్ముకుంటూ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీల బాట ఓ వైపు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా సజావుగానే జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా మచిలీపట్నంలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. నాలుగు రోజుల నుంచి నగరంలోని గ్యాస్ కంపెనీల వద్ద వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఏజెన్సీల నిర్వాహకులు డోర్ డెలివరీ చేయకపోవడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల బాట పడుతున్నారు. గ్యాస్ లోడు ఆటోలను డెలివరీకి పంపకుండా కంపెనీల వద్దే ఉంచుతున్నారు. బందరు సుకర్లాబాదులో ఉన్న ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద శనివారం నిండు గ్యాస్ సిలిండర్లతో ఉన్న నాలుగు ఆటోలు నిలిపి ఉన్నాయి. నగరంలోని భారత్, హెచ్పీ గ్యాస్ కంపెనీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉండడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాల్సిన సివిల్ సప్లయి అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సివిల్ సప్లయి అధికారులు దృష్టి సారించి గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు డోర్ డెలివరీ అయ్యేలా చూడాలని వారు కోరుతున్నారు.7 -
విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం
చల్లపలి: జీవనోపాధి కోసం పనికి వెళ్లిన యువకుడు కరెంటు షాక్ తగిలి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రామానగరానికి చెందిన అల్లంశెట్టి నాగేశ్వరరావుకు కుమారుడు సురేష్(25), కుమార్తె ఉన్నారు. శనివారం పాగోలు పంచాయతీ శివారు శ్రీనగర్ కాలనీలో తాపీ పని చేసేందుకు తోటి పనివారితో కలిసి వెళ్లాడు. పొద్దుపోయాక పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పరంజాకు నిలిపి ఉన్న ఇనుప రాడ్డు జారి పక్కకు ఒరిగిపోతుండగా సురేష్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. రాడ్డు పక్కనున్న కరెంటు తీగలకు తగిలి సురేష్కు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి పనివారు వెంటనే సురేష్ను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ దంపనపూడి దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సురేష్ దేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికందివచ్చిన కొడుకు ఒక్కసారిగా విగత జీవుడిగా మారడంతో సురేష్ తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా హృదయవిదారక పరిస్థితి నెలకొంది. రేషన్ బియ్యం పట్టివేత పెనమలూరు: కానూరులో రేషన్ బియ్యాన్ని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో కానూరు ఆటోనగర్లో రోడ్డు పక్కన రేషన్ బియ్యంతో ఉన్న లారీ నిలిపి ఉండటంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు లారీని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
9వ తరగతి విద్యార్థులను పదికి సిద్ధం చేయండి
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీ పట్నం): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పదో తరగతికి సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2027 ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తొమ్మిదో తరగతి నుంచే పదో తరగతి సిలబస్పై దృష్టి పెట్టాలని సూచించారు. దీని కోసం ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రత్యేకాధికారులు శ్రద్ధ చూపాలని పలు సూచనలు చేశారు. వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం పదో తరగతి పాఠ్యాంశాలను చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి పాఠ్యాంశాలు చదువుకోవటం ద్వారా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. విద్యార్థులు చదివింది రాయటం, పునఃశ్చరణ చేసుకోవటం వల్ల సబ్జెక్టు ఎక్కువగా గుర్తుంటుందన్నారు. ఏకాగ్రత కోసం ప్రాణాయామాలు చేయాలన్నారు. క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అవసరమైతే ట్యూషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉంచి పిల్లలు చదువుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. బాగా చదువుకునేందుకు పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని పోషకాహారంపై శ్రద్ధ పెట్టాలన్నారు. తరచూ పదో తరగతి సిలబస్పై పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టే భరోసా, ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 1,09,105 కేసులు పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,09,105 కేసులను పరిష్కరించినట్లు ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్లను ఏర్పాటు చేసి ఈ కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిల్లో 96,999 క్రిమినల్ కేసులు, 394 సివిల్ కేసులు, 886 చెక్కు బౌన్స్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. 124 మోటారు వాహన ప్రమాదాలకు గాను రూ.20.08 కోట్లు నష్టపరిహారం అందించడానికి ఇన్సూరెన్సు కంపెనీలు అంగీకరించాయన్నారు. 10,702 కేసులు ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించి అవార్డులను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
గ్యాస్ అక్రమ వినియోగంపై కేసులు నమోదు
41 సిలిండర్లు స్వాధీనం పెనమలూరు: గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ అక్రమ వినియోగంపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. మండల పరిధిలోని పోరంకి, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెనమలూరు, మొవ్వ, గుడివాడ, గన్నవరం ప్రాంతాలకు చెందిన డెప్యూటీ తహసీల్దార్ల బృందం శనివారం దాడులు చేశారు. గృహావసరాలకు ఉపయోగించాల్సిన వంట గ్యాస్ను టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపులు, వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండటంతో 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా నిబంధనలు పాటించాలని సూచించారు. రేపటి నుంచి రైతన్న మీకోసం వారోత్సవాలు జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి కంకిపాడు /గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా రైతులకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలో తిరిగి ఇదే నెలలో 23 నుంచి 25వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ ఉద్యాన సహాయకులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొంటారని వివరించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల ఇళ్లకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన లేఖలోని సందేశాన్ని అందించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తామన్నారు. రైతుల నుంచి వారికి కావలసిన సమాచారాన్ని వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక ఇతర అనుబంధ శాఖల వారు సేకరిస్తారన్నారు. తదనుగుణంగా 2026 – 27వ సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారన్నారు. జిల్లాలోని రైతులందరూ రైతన్న మీకోసం వారోత్సవాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జేడీఏ పద్మావతి కోరారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధనం విద్య భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది విద్య ఒక్కటేనని, దానిని అందించే గురువులు కూడా అంతే శక్తివంతమైనవారని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. శనివారం పోరంకి భాష్యం బ్లూమ్స్లో బ్లూమ్స్ బ్లూమ్రాంగ్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డ ఏ విధంగా గురువుల చేతిలో తీర్చిదిద్దబడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ పిల్లలు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీయాలని సూచించారు. మరో అతిథి డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ తరన్నుమ్ మాట్లాడుతూ పరీక్షల వేళ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ అధ్యక్షత వహించగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కృష్ణాజిల్లా భాష్యం జెడ్ఈఓ జోషి, పోరంకి భాష్యం బ్లూమ్స్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, గుంటూరు భాష్యం బ్లూమ్స్ జెడ్ఈఓ అండ్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘రోల్ మోడల్’ కృష్ణా కలెక్టర్
మచిలీపట్నంఅర్బన్: నాలుగో తరగతి చదువుతున్న తన కుమారుడికి వైద్యం చేయించేందుకు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా సర్వజన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి అందరికీ ‘రోల్ మోడల్’గా నిలిచారు. కలెక్టర్ బాలాజీ శనివారం సాధారణ పౌరుడిలా తన బిడ్డకు వైద్యం చేయించడానికి మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం ఉంచుతూ స్వయంగా ఆస్పత్రిని ఆశ్రయించడంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు.మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 45 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ సివిక్స్ పేపర్–1 పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు మొత్తం 1,923 మంది విద్యార్థులు నమోదు కాగా, 1,726 మంది హాజరయ్యారన్నారు. 197 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ మేరకు మొత్తం హాజరు 90 శాతంగా నమోదైందన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, సెట్–3 పేరును వినియోగించినట్లు డీఐఈఓ తెలిపారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. పది పరీక్షలపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 411 హైస్కూళ్లకు చెందిన 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదై ఉన్నారన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 21,296 మంది కాగా, ప్రైవేట్ విద్యార్థులు 936 మంది ఉన్నారని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 11,351 మంది, బాలికలు 9,945 మంది ఉన్నారని, ప్రైవేట్ విద్యార్థుల్లో బాలురు 590 మంది, బాలికలు 346 మంది ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు డివిజన్లలో... జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డివిజన్లో 7,692 మంది రెగ్యులర్ విద్యార్థులు, 264 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 7,956 మంది పరీక్షలకు హాజరవుతారు. ఈ డివిజన్లో 13 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్లో 118 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది రెగ్యులర్, 341 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 6,803 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ డివిజన్లో 9 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు డివిజన్లో 120 పరీక్ష కేంద్రాల్లో 7,142 మంది రెగ్యులర్, 331 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 7,473 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక్కడ 7 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని డీఈవో తెలిపారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు జిల్లాలో మచిలీపట్నం డివిజన్లో 173 పాఠశాలలు, గుడివాడ డివిజన్లో 118, ఉయ్యూరు డివిజన్లో 120 పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు జిల్లాలో మొత్తం 29 స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాల పంపిణీ కోసం 10 రూట్లను గుర్తించి 20 మంది రూట్ అధికారులను నియమించారు. ఎనిమిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 205 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 205 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల కోసం 51 మంది అదనపు జాయింట్ కస్టోడియన్లను నియమించారు. మొత్తం 1,562 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. విద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. పరీక్ష సమయం ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు కనీసం 50 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను కూడా జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తానని డీఈవో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం, సందేహాలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కాలంలో కంట్రోల్ రూమ్లో కె. గణేష్ (9491505378), వై.ప్రసాదరావు (9441665999), కె.నాగరాజు (7702427788), బి.నాగమల్లేశ్వరరావు (9849501067) 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తారు. -
ఇండియన్ బ్యాంక్ మెగా క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపెయిన్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన మెగా క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎం.శేషగిరిరావు లబి్ధదారులకు రూ.260 కోట్ల విలువైన రుణాల మంజూరు పత్రాలను అందజేశారు. అదేవిధంగా ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పలువురు లబ్ధిదారులకు రూ.1,422 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వ్యవసాయం ఇతర రంగాలకు చెందిన లబి్ధదారులకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ జీఎంఓ పరిధిలో ఉన్న ఎనిమిది జోన్లలో ఈ మెగా క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు తెలిపారు. -
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
● ‘బండ’ కోసం బారులు
మిడిల్ ఈస్ట్లో యుద్ధ సెగ జిల్లాను తాకింది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజల ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు. ఆన్లైన్ సేవలు సైతం నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయంతో ఏజెన్సీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ తక్షణం స్పందించి పరిస్థితి సరిదిద్దాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. విజయవాడ మిల్క్ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఓ గ్యాస్ కంపెని వద్ద పరిస్థితిని చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
బ్లాక్స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో నోటిఫై చేసిన 123 బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ (డీఆర్ఎస్సీ) సమావేశం జరిగింది. జిల్లాలో రహదారి ప్రమాదాలు, ఎన్ఫోర్స్మెంట్, హిట్ అండ్ రన్ స్కీమ్ అమలు, ఈ–డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్టు తదితరాలపై చర్చించారు. గత సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. గతేడాది 1,105 రహదారి ప్రమాదాలు జరగగా 373 మరణాలు సంభవించాయని, 967 మంది క్షతగాత్రులయ్యారని వివరించారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 171 ప్రమాదాలు జరగ్గా.. 58 మరణాలు నమోదయ్యాయని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదాలే అధికం.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భాగస్వామ్య పక్షాలు పటిష్ట సమన్వయంతో పనిచేసి రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. 38 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని.. ఈ నేపథ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ట్రాఫిక్ డేటా సమగ్ర విశ్లేషణ.. విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు రియల్టైమ్ డేటాను విశ్లేషిస్తున్నామని సీపీ రాజశేఖరబాబు అన్నారు. డీటీసీ ఎం.పురేంద్ర, డీసీపీ (ట్రాఫిక్) షేక్ షరీన్ బేగం, ఆర్టీవో ఆర్.ప్రవీణ్, ఎంవీఐలు ఎంవీఎన్ రాజు, మొహమ్మద్ అలీ, పూర్ణిమ, అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు
చిల్లకల్లు(జగ్గయ్యపేట): విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమారి హెచ్చరించారు. చిల్లకల్లు సెక్షన్ పరిధిలోని 20 గ్రామాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం పాలశీతలీకరణ కేంద్ర భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెక్షన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో 41 బృందాలుగా ఏర్పడి 2,522 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశామన్నారు. వీటిలో 359 సర్వీసులు అదనపు విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి వారికి రూ. 7.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీఈ రవిచంద్ర, విజిలెన్స్ డీఈలు శ్రీనివాసరావు, శివకుమార్, గురుకిషోర్, సుధాకర్, ఏఈ రమేష్బాబు, అకౌంట్స్ అదికారి రవికుమార్, డివిజన్లోని సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డీఈవో ఎల్. చంద్రకళతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. 27,360మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించామని.. 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యి మీటర్లలోపు జిరాక్సు షాపులు తెరిచి ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చన్నారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ 9154970454కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. పూర్తి పారదర్శకంగా.. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబరును ఆన్సర్ స్క్రిప్ట్ లేదా ఓఎంఆర్ షీట్పై ఎక్కడా రాయకూడదన్నారు. ప్రత్యేక అవసరాలున్న (సీడబ్ల్యూఎస్ఎన్) 193 మంది విద్యార్థులకు స్కైబ్లను ఏర్పాటు చేశామనిని.. వీరికి గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. -
ఇఫ్తార్ విందు ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను శుక్రవారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరిశీలించారు. లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా, కదిరి ఇన్చార్జి మక్బుల్లతో కలిసి దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ముస్లిం మైనార్టీలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వారి వెంట మైనారిటీ నేత మీర్హుస్సేన్ కూడా ఉన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): గొప్ప కవయిత్రిగా మొల్లమాంబ పేరుప్రఖ్యాతలు గడించారని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం డీఆర్వో మాట్లాడుతూ మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత, విద్యార్థులు స్ఫూర్తిపొందాలన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన గొప్ప కవయిత్రి అని కొనియాడారు. బీసీ సంక్షేమశాఖ సాధికారత అధికారి జి. రమేష్, కుమ్మరి, శాలివాహన సంఘ నాయకులు ఏసుబాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారులు పాల్గొన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న నాన్–టీచింగ్ ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై సంయుక్త సంచాలకులను కలిసి వివరించామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, కళాశాలల పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి సంఘం సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానం, ఉచిత ప్రసాద వితరణకు పలువురు భక్తులు శుక్రవారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఎం. దశరథ రామారావు, ఇందిర అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ. 2,01,116 అందించారు. చీరాల వైకుంఠపురానికి చెందిన వైబీవీ నాయుడు కుటుంబం ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
సజావుగా సెకండ్ ఇంటర్ ఫిజిక్స్–2 పరీక్ష
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించిన సెకండ్ ఇంటర్మీడియెట్ ఫిజిక్స్–2 పరీక్ష సజావుగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 20,282 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు కాగా, వీరిలో 20,129 మంది హాజరయ్యారయ్యా రని, 153 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని వినియోగించా మని, మొత్తం 99 శాతం హాజరు నమోదైనట్లు డీఐఈఓ పేర్కొన్నారు. గన్నవరం: కొండపావులూరు శివారులోని ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబుకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. సూరంపల్లి శివారులో జరగనున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హెలికాఫ్టర్లో సాయంత్రం 4.42 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వి.వి.ఎన్. ప్రసన్నకుమార్, కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డు మార్గంలో సభ వేదిక వద్దకు బయలుదేరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అద్విక ట్రేడింగ్ కంపెనీలో కొద్ది మొత్తంలో డిపాజిట్ చేసి, అధిక మొత్తంలో కంపెనీ నుంచి నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు ఏజెంట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం రామవరప్పాడుకు చెందిన చిలకలపూడి నాగ దుర్గాకల్యాణ్ అద్వికలో ఏజెంట్గా ఉన్నారు. సుమారు రూ.5.70 లక్షలు డిపాజిట్ చేశారు. ఆ మొత్తానికి వడ్డీ, ఏజెంటు కమిషన్ కలిసి రూ. 1.02 కోట్లు కంపెనీ నుంచి పొందారు. అతనితో పాటు, తమ్ముడు చిలకలపూడి వీర వెంకట నాగ రాజేంద్రకుమార్తో కలిసి కంపెనీలో వారికి తెలిసిన వారి ద్వారా డిపాజిట్లు పెట్టించి, అద్విక ఐపీ పెట్టేలోపు అధిక లాభాలు పొందారు. వారు రూ.1.53 కోట్లు డిపాజిట్లు చేయగా, రూ 4.77 కోట్లు అక్రమంగా అధికంగా పొందారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరొకరు ఇలా.. ప్రకాశం జిల్లా చింతల గ్రామానికి చెందిన పాటిబండ్ల సుధాకర్ ఏజెంట్గా ఉండి అద్విక నుంచి అక్రమంగా అధిక మొత్తం పొందినందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 18 మంది నుంచి రూ.2.87 కోట్లు డిపాజిట్ చేయించారు. వారికి రిటర్న్గా రూ.1.67 కోట్లు చెల్లించారు. నిందితుడు రూ.8.35 లక్షలు డిపాజిట్ చేయగా, ఏజెంట్ కమిషన్ డిపాజిట్తో కలిసి రూ.3.22 కోట్లు అక్రమంగా పొందాడు. ఇతనికి కంపెనీ నుంచి రూ.2.76 కోట్లు అధికంగా వచ్చాయి. ఇలా అతని చెల్లెలు బొల్లినేని సుజాతతో డిపాజిట్ చేయించి అధిక మొత్తంలో పొందడంతో అతనిపై టాస్క్ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. మైలవరం: రైతుల రుణభారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ –పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.6వేలు రైతు ఖాతాలో జమచేస్తుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మైలవరం మండలం వెల్వడం గ్రామం రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడవ విడత నిధులు విడుదల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందిన ఘటన పటమట పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురానికి చెందిన చెర్రి లిఖిత్సాయి నగరంలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాల సమీపంలోని కరెన్సీనగర్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం రాత్రి రూమ్ నుంచి ద్విచక్ర వాహనంపై లబ్బీపేటలోని ఫుడ్కోర్టుకు వెళ్లి వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న ఆస్పత్రి వద్ద సర్వీస్రోడ్డులో ముందు వెళ్తున్న వారిని.. ఎదురుగా వస్తున్న కారును.. తప్పించిపోయి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు లిఖిత్సాయి స్నేహితుడు గరగ అరుణ్ఆదిత్యకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న లిఖిత్ స్నేహితుడు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన లిఖిత్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్నేహితుడు అరుణ్ ఆదిత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అటెన్షన్!
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధంవన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 28,142 మంది విద్యార్థులు 149 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బాలురు 14,425 మంది, బాలికలు, 13,717 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 27,359 మంది రెగ్యులర్ విద్యార్థులు. పరీక్షల కాలం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఇప్పటికే ‘టెన్’షన్ మొదలైంది. తొలిసారి పబ్లిక్ పరీక్షలు అనగానే తెలియని ఆందోళన. తెలిసిన సమాధానాలే అయినా వాటిని పేపరుపై ఎలా రాయాలో తెలియక కొందరు సతమతమవుతారు. తరగతి గదిలో ఠకీమని జవాబు చెప్పే కొందరు విద్యార్థులు పరీక్షలలో మాత్రం వెనుకబడుతూంటారు. వచ్చిన సమాధానాలను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడమే దీనికి కారణం. ఆ చిన్న అవరోధాన్ని అధిగమిస్తే విజయం వారి పాదాక్రాంతమవుతుంది. రెండు వేల మంది సిబ్బంది.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలకు సుమారుగా రెండు వేల నుంచి 2100 మంది ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. అందులో డిపార్ట్మెంటల్ అధికారులుగా 149 మందిని, చీఫ్ సూపరింటెండెంట్లుగా 149 మందిని, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లుగా 1700 మంది సేవలందిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగే రోజున విధులను మార్పు చేస్తారు. జిల్లాలోని సుమారుగా 26 పోలీసుస్టేషన్ల పరిధిల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో అర్బన్లోని ఎనిమిది, రూరల్లోని 18 పోలీసుస్టేషన్లు ఈ పరీక్షలకు బందోబస్తును అందిస్తున్నాయి. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు జరుగుతుంది. 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు జిల్లాలోని 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 11,122 మంది విద్యార్థులు (5085 మంది బాలురు, 6037 మంది బాలికలు) ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 16237 మంది (8824 మంది బాలురు, 7413 మంది బాలికలు) ఉన్నారు. అలాగే ఒకసారి పరీక్ష తప్పి పరీక్షకు హాజరవుతున్న వారు 783 మంది(519 మంది బాలురు, 267 మంది బాలికలు) ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. గుర్తించిన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పరిశీలించనున్నాయి. ఈ బృందంలో తహసీల్దార్ లేదా డెప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ స్థాయి పోలీసు అధికారి, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పోలీసు ఎస్కార్ట్ ఉంటారని అధికారులు తెలిపారు. జిల్లా స్టోరేజీ పాయింట్గా బిషప్ అజరయ్య హైస్కూల్.. ఎన్టీఆర్ జిల్లా పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజీ పాయింట్గా నగరంలోని బిషప్ అజరయ్య బాలికల హైస్కూల్ను ఏర్పాటు చేశారు. విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఆయా పరీక్ష కేంద్రాల సమీప పోలీసుస్టేషన్లకు ప్రశ్నపత్రాలు చేరుకోనున్నాయి. ఈ ఏడాది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ను ఇవ్వటంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే నో మొబైల్ జోన్గా పరీక్ష కేంద్రాలను ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలో 92, నందిగామ డివిజన్ పరిధిలో 38, తిరువూరు డివిజన్ పరిధిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
మచిలీపట్నంలో జనసేన రౌడీయిజం!
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో జనసేన నేతల రాజకీయ రౌడీయిజం రోజు రోజుకూ మితిమీరుతోంది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి అతి సమీపంలో జనసేన జెండా దిమ్మెను నిర్మించి రాజకీయ చిచ్చు రేపేందుకు శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూనుకున్నారు. పోలీసుల సమక్షంలోనే పక్కాగా కాంక్రీటుతో దిమ్మె నిర్మించారు. రెండో రోజు అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేతలు రామానాయుడుపేటలో గురువారం జనసేన, వైఎస్సార్ సీపీ నాయకులకు జెండా ఏర్పాటు విషయంలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు జనసేనకు కొమ్ముకాస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై జులుం ప్రదర్శించి అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. శుక్రవారం జనసేన నాయకులు పోలీసుల సమక్షంలో అదే ప్రాంతంలో జెండా దిమ్మె నిర్మాణానికి పూనుకున్నారు. సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మరి కొంత మంది.. జనసేన నాయకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అక్కడ నుంచి పంపడానికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు, విఠల్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బొర్రా విఠల్ అక్రమ నిర్బంధం ఇదే అవకాశంగా భావించిన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు బొర్రా విఠల్ను బలవంతంగా జీపులోకి ఎక్కించి గూడూరు పోలీస్స్టేషన్ తరలించి అక్రమంగా నిర్బంధించారు. అక్కడ ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. పోలీసులపై విఠల్ దాడి చేశాడనే సాకు చూపించి ఆయనపై అక్రమంగా కేసు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం. ఇతర నాయకులను బైండోవర్ చేసి భయపెట్టడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గూడూరులో పోలీసుల ఓవరాక్షన్! గూడూరు: బొర్రా విఠల్ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆ సమయంలో బలప్రయోగం చేయడంతో విఠల్ చేతి వేలికి తీవ్ర గాయమై రక్త స్రావమైంది. తనపై ఎలాంటి కేసు లేకుండా ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విఠల్ ప్రశ్నకు పోలీసులు స్పందించలేదు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గూడూరు పీఎస్కు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీసీ నాయకుడి అక్రమ అరెస్టుపై శ్రేణులు పీఎస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేసమయంలో మచిలీ పట్నం ఇన్చార్జి పేర్ని కిట్టు, ఇతర నేతలు స్టేషన్కు వచ్చారు. పెడన ఇన్చార్జి ఉప్పాల రాము కూడా స్టేషన్కు రావడంతో పోలీసులు విఠల్కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారు. నడుచుకుంటూ.. అయితే తనను ఎలా పోలీసు వాహనంలో తీసుకువచ్చారో అలాగే తీసుకెళ్లి దించాలంటూ పట్టుబట్టారు. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో గూడూరు స్టేషన్ నుంచి నడుచుకుంటూ మచిలీ పట్నం బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కూడా గూడూరుకు చేరుకున్నారు. పేర్ని నాని, ఉప్పాల రాము, పేర్ని కిట్టు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పాదయాత్రగా గూడూరు సెంటరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితిని గమనించిన పోలీసులు బొర్రా విఠల్ను పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని మచిలీపట్నం తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. విపత్తులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఫామెక్స్లో భాగంగా మాక్డ్రిల్ నిర్వహించారు.I రెండు జిల్లాల్లోనూ భారీగా తగ్గిన లబ్ధిదారులు కౌలు రైతులకు ఎగనామం భరోసా లేక అవస్థలు పడుతున్న అన్నదాతలు -
విస్తృత అవగాహనతోనే విపత్తులకు కళ్లెం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని.. ముందస్తు సిద్ధత, అప్రమత్తతతో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు స్పందన–అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్(ఫామెక్స్)–2026లో భాగంగా మాక్డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాటర్ డెమో నిర్వహించారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ పౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ల పనితీరును ప్రదర్శించారు. కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందస్తు సన్నద్ధతతో సమర్థత.. మాక్ డ్రిల్ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థంగా ఎదుర్కొనగలమని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి జి.రామారావు, ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు కె.వెంకటేశ్వర్లు, ఎస్ఆర్కేజీ వెంకట్, ఐ.హరికృష్ణ, డీఎంహెచ్వో ఎం.సుహాసిని పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం పది గంటల తర్వాత మరింత పెరిగింది. సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి మహానివేదనకు మధ్యాహ్నం గంట సేపు దర్శనాలు నిలిపేశారు. ఆ తర్వాత అన్ని లైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ చేయగా పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. అనంతరం దర్బారు సేవ, పల్లకీ సేవలను నిర్వహించగా, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం కనిపించింది. -
ఇసుక రీచ్కు అనుమతి ఇవ్వొద్దు
ప్రజాభిప్రాయ సేకరణలో శ్రీకాకుళం గ్రామస్తులు శ్రీకాకుళం(ఘంటసాల): ఇసుక రీచ్కు అనుమతిస్తే ఉన్న కొద్దినీరు అడుగంటి సంక్షోభ పరిస్థితులు ఎదురవుతాయని.. శ్రీకాకుళం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళంలో ఇసుక రీచ్ నిర్వహణకు విజయవాడకు చెందిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీకాకుళం పంచా యతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఈఈ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బందరు ఆర్డీవో సాంబశివరావు అధ్యక్షతన సేకరణ జరిగింది. ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్, రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీకాకుళం ఇసుక రీచ్ కార్యనిర్వాహక సంక్షిప్త వివరణ వినిపించారు. స్పందించిన సర్పంచ్ ముప్పనేని రవి ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక రీచ్పై పర్యవేక్షణ పంచాయతీకి ఇవ్వాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ లంక భూముల్లో పంటలు పండించుకోవడానికి ఇసుక మేటలు తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వని అధికారులు, ఇప్పుడు శ్రీకాకుళం ఇసుక రీచ్కు ఎలా అనుమతిస్తారని నిలదీశారు. లంక భూములను తవ్వేస్తారా! ఇసుక రీచ్ కొరకు 30 హెక్టార్లు గుర్తించామంటున్న వారు అక్కడ అంతభూమి లేదని వాపోతే లంకభూములను తవ్వేస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతినిధి జేటీ రామారావు మాట్లాడుతూ సొమ్ము శ్రీకాకుళంది, సోకు అమరావతిది అన్న చందాన శ్రీకాకుళం ఇసుకరీచ్ పని ఉందన్నారు. నిబంధనల మేరకు పనులు చేయాలని, ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రీచ్కు అనుమతిస్తే ఇబ్బందులు వస్తాయని గ్రామస్తుడు నాగరాజు తెలిపారు. పాపవినాశనం క్వారీపై వైస్ ఎంపీపీ నాగేంద్రబాబు మాట్లాడారు. స్పందించిన ఆర్డీవో సాంబశివరావు పాపవినాశనం ఇసుక క్వారీని మైనింగ్ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, ఎస్ఐ వేమన చందన, ఆర్ఐ కె.శ్రీనివాస్, వీఆర్వో దగాని గోపి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో మరోమారు ఉధ్రిక్తత
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పదే పదే రాజకీయ విద్వేషాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. గత రాత్రి మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపం రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా ఏర్పాటుకు జనసేన నాయకుల యత్నించారు. అయితే వారిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే ఈరోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) మళ్లీ కాంక్రీట్తో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలను అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేత బొర్రా విఠల్ను బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన జనసేన కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ కేబినెట్ భేటీ..పవన్ సహా ఆరుగురు మంత్రుల డుమ్మా!
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రుల గైర్హాజరు చర్చాంశనీయంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆరుగురు మంత్రులు హాజరు కాకపోవడం విశేషంశుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, అమరావతి రాజధాని పురోగతి వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. అయితే, ఈ సమావేశానికి పలువురు మంత్రులు డుమ్మా కొట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. నాదెండ్ల మనోహర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణంగా హోమ్ మంత్రి అనిత, మంత్రి టీజీ భరత్, మంత్రి గొట్టిపాటి రవి.. కుటుంబ కార్యక్రమం కారణంగా మరో మంత్రి ఫరూక్ హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.మొత్తం ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడంతో ఈ కేబినెట్ సమావేశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ వరుసగా రెండు కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంపై వివిధ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అధికార వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఇంకెన్నాళ్లీ వెక్కిళ్లు!
భవానీపురం(విజయవాడపశ్చిమ): జక్కంపూడి వైఎస్సార్ కాలనీవాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ఏడాదికేడాది ఎదురు చూపులు తప్ప తాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. కాలనీ ఏర్పాటై దశాబ్ద కాలం గడిచింది. అయినా నేటికీ మంచినీళ్ల కోసం స్థానికులు అల్లాడుతున్నారంటే అటు విజయవాడ నగరపాలక సంస్థ, ఇటు గొల్లపూడి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేసి స్థానికులు దాహార్తి తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వాడుక అవసరాలకు సైతం చాలీచాలని నీటితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాలనీలో ఎవరిని కదిపినా నీటి కష్టాలను ఏకరువు పెడుతున్నారు. గొంతెండిపోతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో రిజర్వాయర్ నిర్మాణం దేవినేని ఉమా మహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేగా వేసిన శిలాఫలకానికే పరిమితమైందని కాలనీవాసులు ఎద్దేవా చేస్తున్నారు. 35వేల మందికి ఒక్కటే ట్యాంక్.. కాలనీలో మొత్తం 280 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో 32 ఫ్లాట్లు చొప్పున ఉన్నాయి. ఫ్లాట్కు కనీసం నలుగురు చొప్పున లెక్కేసుకున్నా సుమారు 35 వేల మందికిపైగానే నివసిస్తున్నారు. కాలనీ మొత్తం మీద 1500 కేఎల్ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ మాత్రమే ఉంది. ఇది కాలనీకి ఒక వైపు ఉండగా అటు పక్కన ఉండే బ్లాకుల్లోని ప్రజలకు మాత్రమే వాడకం నీరు అరకొరగా అందుతోంది. కాలనీకి మరో వైపు బ్లాకుల్లో నివసించే ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని బ్లాకుల్లో సుమారు 20 వరకు బోర్లు ఉండగా వాటి ద్వారా వచ్చే నీటిని మాత్రం వాడుకుంటున్నారు. -
మచిలీపట్నంలో ఉద్రిక్తత
మచిలీపట్నంటౌన్: జనసేన నాయకులు మచిలీపట్నంలో జెండా రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఇంటి సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ జెండా దిమ్మె లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో రాత్రికి రాత్రే జెండా దిమ్మె ఏర్పాటుకు జనసేన నాయకుల ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న, పార్టీ నాయకుడు గాజుల భగవాన్, కార్యకర్తలు అక్కడకు చేరుకుని జెండా దిమ్మె నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని, నిర్మాణం నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలో జనసేన నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు అక్కడకు వచ్చి కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా పంపించారు. కొద్దిసేపటి తరువాత జనసేన నాయకులను కూడా అక్కడి నుంచి పంపించారు. జనసేన నాయకులు రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారని సుబ్బన్న ఆరోపించారు. అధికారం ఉందని జనసేన నాయకులు పాల్పడే చర్యలను గట్టిగా తిప్పికొడతామన్నారు. మచిలీపట్నంఅర్బన్: విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఒకేషనల్ విద్య దోహదపడుతుందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. కృష్ణవేణి ఐటీఐ కళాశాలలో ఒకేషనల్ విద్యకు సంబంధించి గురువారం ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేషనల్ విద్య విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.సీతామహాలక్ష్మి, ఏపీఓ కె.ఏడుకొండలు, ఏఎంఓ శ్యామ్, ఎంఐఎస్ సుభాన్, సీఎంఓ టి.రమేష్, వీసీఎస్ జి.పద్మజ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా ప్రజాభిప్రాయ సేకరణ
తోట్లవల్లూరు: ఇసుక క్వారీల అనుమతుల మంజూరు విషయమై సాగిన ప్రజాభిప్రాయ సేకరణ మొక్కుబడిగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. రొయ్యూరు, నార్తువల్లూరు ఇసుక క్వారీల విస్తీర్ణం పెంపుదల కోసం కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ ఆధ్వర్యాన మండలంలోని రొయ్యూరు, తోట్లవల్లూరు గ్రామాలలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు జరిగాయి. సదస్సుల ఉద్దేశాన్ని ఈఈ శ్రీనివాస్ వివరించారు. రొయ్యూరు, నార్తువల్లూరు రీచ్లలో సుమారు 9 లక్షల టన్నులు ఇసుక తవ్వకాలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఇసుక తవ్వకాలు వలన పర్యావరణ పరంగా తలెత్తే ఇబ్బందులను తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయా సదస్సులకు ప్రజల నుంచి స్పందన కొరవడింది. ఇసుక తవ్వకాలు, రవాణాకు వ్యతిరేకంగా అర్జీలు ఇచ్చినా అధికారులు పెద్దగా పట్టించుకోరనే ఉద్దేశం ప్రజల్లో బలంగా నాటుకుపోవటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణ జరుపుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని సామాజిక కార్యకర్త తూమాటి సుధాకర్ తోట్లవల్లూరు సదస్సులో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రొయ్యూరులో కృష్ణా కరకట్ట నుంచి కృష్ణానది వరకు ఉన్న జాలురోడ్డు అభివృద్దికి చర్యలు తీసుకోవాలని బీసీ జనగణన సాధన సమితి నాయకుడు లుక్కా వెంకట శ్రీనివాసరావు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి, మైనింగ్ ఏడీ కొండారెడ్డి, తహసీల్దార్ కుసుమకుమారి, వీఆర్ఓలు శ్రీను, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకర్లతో వాడకం నీరు సరఫరా
నగరపాలక సంస్థ రోజూ నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు వాటర్ ట్యాంకర్లు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి బ్లాకులో ఉన్న వాటర్ సంప్లోకి ఆ నీటిని డంప్ చేస్తారు. ఒక్కో సంప్ నిండాలంటే కనీసం రెండున్నర ట్యాంకర్ల అవసరం అవుతాయి. సంప్ నిండిన తరువాత మోటారు వేస్తే ఆ బ్లాక్ టెర్రస్పై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి నీరు చేరుతుంది. ఆ నీటిని బ్లాకులో ఉండే 32 ఫ్లాట్లలో నివసించేవారు వాడుకోవాల్సి ఉంటుంది. మోటారు వేసినప్పుడు వచ్చే కరెంట్ బిల్లు ఆయా ఫ్లాట్లలో ఉండేవారు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ట్యాంకర్ల ద్వారా వచ్చేవి మంచినీరే అయినా సంప్లోకి వచ్చే సరికి తాగేందుకు పనికిరాదు. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ నుంచి కూడా సంప్ల్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. తాగేందుకు మాత్రం మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి క్యాన్లు కొనుగోలు చేయాల్సిందే. -
కానూరులో దళితుడి ఇల్లు కూల్చివేత
● ప్రతిఘటించిన వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్చార్జి చక్రవర్తి ● గ్రామంలో ఉద్రిక్తత పెనమలూరు: కానూరులో దళితుడి ఇల్లును మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. సమాచారం తెలుపుకున్న వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి బాధితుడికి అండగా ఆ ఇంట్లో బైఠాయించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ నజీర్, పోలీసులతో చక్రవర్తికి తీవ్ర వాగ్వాదం జరగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానూరులో మురుగుకాలువ కట్టపై చాలా కాలంగా పేదలు ఉంటున్నారు. ఇటీవల పేదల ఇళ్లను కూటమి ప్రభుత్వం కూల్చింది. అయితే దమ్ము ప్రమీలారాణి, దమ్ము ప్రసన్నకుమార్ ఇల్లుతో పాటు జనసేన నాయకుడి ఇళ్లను కూల్చలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్, సీఐ వెంకటరమణ, సిబ్బంది జేసీబీతో ఒక్కసారిగా వచ్చి ప్రసన్నకుమార్ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో కూల్చడానికి సిద్ధపడి రేకులు ధ్వంసం చేశారు. స్పృహ తప్పిన యజమానురాలు మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేయటంతో ఇంట్లో ఉన్న ఇంటి యజమానురాలు ప్రమీలారాణి తీవ్ర ఆందోళన చెంది కుప్పకూలిపోయింది. ఆమెకు బీపీ పెరిగి, షుగర్ తగ్గటంతో చలనం లేకుండా పడిపోయింది. దీంతో ఆమెను 108 వాహనంలో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు అందరినీ కలిచివేసింది. చక్రవర్తి నిరసనతో పట్టా అందజేత.. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి వచ్చి బాధితుడి ఇంట్లో బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నోటీసు ఇవ్వకుండా ఇంట్లో మనుషులు ఉండగానే ఇల్లు ఎలా కూల్చుతారని కమిషనర్ నజీర్ను నిలదీశారు. పేదల ఇళ్లే టార్గెట్ చేయటం తగదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కళ్లల్లో ఆనందం చూడటానికి కమిషనర్ తన పరిధి దాటుతున్నాడని ఆరోపించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. బాధితుడికి వెంటనే ఇంటి పట్టా ఇప్పించారు. బాధితులు నిరసన.. గతంలో ఇదే ప్రాంతంలో ఇళ్లు తొలగించి బాధితులకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. బాధితులు పట్టాలతో వచ్చి కమిషనర్ నజీర్, తహసీల్దార్ రాజును నిలదీశారు. తాడిగడపలో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని అక్కడ ఇళ్లు కట్టుకోవటానికి కనీసం దారి కూడా లేదన్నారు. పేదలను ప్రలోభాలు పెట్టి మోసం చేయటం న్యాయం కాదన్నారు. కాలవ కట్టపై తాము ఖాళీ చేసిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఎలా పెట్టారని అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వసంత నవరాత్రులు, ఉగాది ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు, ఉగాది పర్వదిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయానికి చేసే పూల అలంకరణ, పంచాంగ శ్రవణం, విశేష పూల అర్చనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వెండి రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. చైత్ర బ్రహ్మోత్సవాల పైన చర్చ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించే చైత్ర మాస బ్రహ్మోత్సవాలపైన చర్చ జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదిదంపతులకు నిర్వహించే వాహన సేవలు, వెండి రథోత్సవంతో పాటు ఉత్సవాల చివరి రోజున జరిగే హంస వాహన సేవ ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వి.శ్రీధర్శర్మ, ఏసీ రంగారావు, ఏఈవోలు బి.వి.రెడ్డి, పి.చంద్రశేఖర్, కె.గంగాధర్, ఈఈ ఎల్.రమ పాల్గొన్నారు. -
కావూరి అంత్యక్రియల్లో పేర్ని నాని
మచిలీపట్నంటౌన్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) గురువారం నివాళులర్పించారు. హైదరాబాద్లోని కావూరి నివాసంలో ఆయన భౌతికకాయాన్ని పేర్ని నాని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కావూరి అంతిమ యాత్రలో పేర్ని నాని పాల్గొని పాడెను మోశారు. అలాగే మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లంకె వెంకటేశ్వరరావు కూడా కావూరి పాడెను మోశారు. కావూరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కృష్ణాజిల్లా వ్యవసాయ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ జన్ను రాఘవరావు, వైఎస్సార్ సీపీ నగర నాయకుడు బూరగ రామారావు తదితరులు ఉన్నారు. సాక్షి నెట్వర్క్: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగరంలో గురువారం ఓ వింత చోటుచేసుకుంది. సామాన్యంగా ఎకై ్సజ్ బార్ అండ్ రెస్టారెంట్ షాపునకు సంబంధించి లాటరీలో ఎంపిక పద్ధతిలో షాపు కేటాయించిన లైసెన్సుదారుడు బార్ అండ్ రెస్టారెంట్ను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే నగర పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఓ కంటైనర్లో ఏర్పాటు చేసి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. తాత్కాలికంగా కంటైనర్ను తీసుకువచ్చి దానిలో షాపును ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించారు. ఈ విషయంపై ఎకై ్సజ్ ఏఈఎస్ భార్గవ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించిన లాటరీలో ఈ షాపు కేటాయింపు జరిగిందన్నారు. 15 రోజుల వరకు ప్రొవిజనల్ లైసెన్సు ఇస్తామని, ఆలోగా బార్ అండ్ రెస్టారెంట్ను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన అనంతరం తాము పరిశీలించి పర్మినెంట్ లైసెన్సు ఇస్తామని వివరించారు. ఈ బార్కు సంబంధించిన లైసెన్సుదారుడు ప్రొవిజనల్ లైసెన్సును పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తాము కాలపరిమితి పెంచామని ప్రస్తుతం ఈ బార్ అండ్ రెస్టారెంట్ ప్రొవిజనల్ కాలపరిమితిలోనే ఉందన్నారు. అయితే బార్ అండ్ రెస్టారెంట్ ఈ విధంగా ఏర్పాటు చేయకూడదని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. నిబంధనలకు నీళ్లు.. బార్ అండ్ రెస్టారెంట్ను ఎక్కడ ఏర్పాటు చేసిన ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంది. లైసెన్సు ఇచ్చి నెలరోజులు దాటినప్పటికీ ఇంత వరకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయకపోవటం, ప్రొవిజనల్ లైసెన్సు కాలపరిమితి పెంచటం చూస్తుంటే అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని తెలుస్తోంది. బార్ అండ్ రెస్టారెంట్ను తాము ఏ విధంగానైనా నిర్వహిస్తామని నిబంధనలు వర్తించవచ్చన్న రీతిలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసిన తీరే ఇందుకు నిదర్శనం. -
సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై కసరత్తు
గన్నవరంరూరల్: మండలంలోని సూరంపల్లి రెవెన్యూ పరిధిలోని మాదలవారిగూడెం గ్రామంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, రాష్ట్ర సూక్ష్మ నీటి సేద్యం పథకం అదనపు సంచాలకులు ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యాన అదనపు సంచాలకులు సీబీ హరినాథరెడ్డిలతో కలసి సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రి సమయంలో కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అధికారులు నాయుడు సత్యనారాయణ, పుల్లారెడ్డి, పోతురాజు, పద్మావతి, అరుణ, మోహన్బాబు, యుగంధర్, జ్యోతి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ నిధుల విడుదల గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద మూడో విడతలో జిల్లాలోని రైతులకు రూ. 67.69 కోట్లు లబ్ధిచేకూరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడో విడతలో 1,18,629 మంది లబ్ధిదారులకు రూ.4 వేలు చొప్పున రూ. 47.45 కోట్లు లబ్ధి జరుగుతుందని.. అదేవిధంగా పీఎం కిసాన్ కింద 1,01,200 మంది లబ్ధిదారులకు రూ. 2 వేలు చొప్పున రూ. 20.24 కోట్లు జమవుతుందన్నారు. శుక్రవారం రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు. నిధులను ఖాతాల్లో జమచేసే కార్యక్రమాలు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ జరగనున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. -
ప్రత్యేక షెడ్డులో భద్రపరిచిన నూతన రథం
మోపిదేవి: ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆర్థిక సహకారం కోటి రూపాయలతో తయారుచేసిన కొయ్య రథాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో గురువారం భద్రపరిచారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి స్వామివారి బ్రహ్మోత్సవాలకు గాను బహూకరించిన ఈ రథాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సినీ నిర్మాత నారాయణరావుతో వేదపండితులు ఉదయం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో రథాన్ని భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు వెల్లడించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, ఆలయ అఽధికారులు బర్మా ప్రసాద్ పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఈ నెలలో వచ్చే రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భారీ వర్షాలు, మోంథా తుపాను కారణంగా గతంలో ప్రకటించిన సెలవులకు మార్చి 14 తేదీ పరిహార పనిదినంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ కామర్స్–1 పరీక్ష గురువారం ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళ కుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,806 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు కాగా, 1,631 మంది హాజరయ్యారు. 175 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం 90 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సెట్–1 ప్రశ్నపత్రం వినియోగించినట్లు వివరించారు. మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్న పదో తరగతి బ్రిడ్జి కోర్స్ శిక్షణ తరగతులపై కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవగాహన కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలిపారు. ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠ శాలల్లో 9వ తరగతి నుంచి పదో తరగతికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారన్నారు. మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే బ్రిడ్జి కోర్స్ శిక్షణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డీఈఓ చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏపీ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద వాక్థాన్ను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు జెండా ఊపి ప్రారంభించగా, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, నెఫ్రాలజిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.అమ్మన్న, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎంవీ సాయికృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ టి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్చార్జ్లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ యు.వి.సుబ్బారావు తెలిపారు. ఈ పరీక్షల వివరాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 411 హైస్కూళ్ల నుంచి 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 21,296 మంది, ప్రైవేట్ విద్యార్థులు 936 మంది ఉన్నారని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 11,351 మంది, బాలికలు 9,945 మంది, ప్రైవేట్ విద్యార్థుల్లో బాలురు 590 మంది, బాలికలు 346 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. వాటిలో 55 ఏ కేటగిరీ కేంద్రాలు, 43 బీ కేటగిరీ, 50 సీ కేటగిరీ (సమస్యాత్మక) కేంద్రాలుగా గుర్తించామన్నారు. 148 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్మెంటల్, ఇతర అదనపు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 29 స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, గోప్యమైన సామగ్రి పంపిణీ కోసం పది రూట్లు గుర్తించి, 20 మంది రూట్ అధికారులను నియమించామని వెల్లడించారు. ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల కోసం 51 మంది అదనపు జాయింట్ కస్టోడియన్లు నియమించామన్నారు. సుమారు 1,500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారని, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖల అధికారులతో ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని డీఈఓ సుబ్బారావు తెలిపారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు కామర్స్, సోషియాలజీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళకుమారి తెలిపారు. 1,835 మంది విద్యార్థులకు 1,739 మంది హాజరవగా, 96 మంది గైర్హాజరయ్యారని, హాజరు 94 శాతంగా నమోదైంది. కామర్స్–2 (పేపర్) పరీక్షకు సెట్–3 ప్రశ్న పత్రాన్ని వినియోగించారు. ఎన్టీఆర్ జిల్లాలో 3,975 మంది విద్యార్థులకు 3,715 మంది హాజరవగా, 260 మంది గైర్హాజరయ్యారు. -
దుర్గమ్మకు రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల కానుకలు సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించారు. 18 రోజులకు రూ.3,35, 86,637 నగదు, 302 గ్రాముల బంగారం, 3.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 1,337 యూఎస్ఏ డాలర్లు, 55 ఇంగ్లాండ్ డాలర్లు, 132 సింగపూర్ డాలర్లు, 335 యూఏఈ దిర్హమ్స్, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 60 కువైట్ దినార్లు, 220 ఖతర్ రియాల్స్, 20 హాంగ్కాంగ్ డాలర్లు, 200 మాల్దీవ్స్ రూపీ, 240 కెనడా డాలర్లు లభించనట్లు వివరించారు. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొనగా, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. దుర్గమ్మకు రూ.4.50 లక్షల విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం రూ.4.50 లక్షల విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన కోటిరావు, అంజుకుమారి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈఓ శీనానాయక్ను కలిసి అంజుకుమారి, తనీషిరావు పేరిట నిత్య ఉచిత ప్రసాద వితరణకు రూ.2.25 లక్షలు, గో సంరక్షణ పథకానికి రూ.2.25 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షగన్నవరం రూరల్: మండలం సూరంపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎంత మంది రైతులు వస్తారు, వారికి ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి, వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలి తదితర అంశాలపై చర్చించారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలిచిలకలపూడి(మచిలీపట్నం): అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచించారు. జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తమ హయాంలో ఇప్పటికి 150 మంది వరకు కారుణ్య నియామకపత్రాలు అందజేశామని పేర్కొన్నారు. 100 మందికి పైగా ఉద్యోగోన్నతులు పొందారని వివరించారు. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యు లను జాగ్రత్తగా చూసుకుని అందరి మన్ననలు పొందాలని సూచించారు. రికార్డు అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రెరీ అసిస్టెంట్లు ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. జూనియర్ అసిస్టెంట్లుగా 19 మందికి, టైపిస్టులుగా 19 మందికి, ఆఫీస్ సబార్డినేట్లుగా ముగ్గురికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, ఏఓ ఎం. తేజస్వీ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న మంత్రి కొల్లు
ఇదేనా సంపద సృష్టి ..!చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రికార్డు స్థాయిలో అప్పులు చేయడమే సంపద సృష్టా అని పేర్ని నాని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్, అన్ని తానై నడుపుతున్న కీలక మంత్రి నారా లోకేష్ తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం, అభివృద్ధి చేస్తా మని ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించేందుకు సంపద సృష్టిస్తామని మాయమాటలు చెప్పి అధికా రంలోకి వచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 60 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పుతో ప్రజలకు సంక్షేమం, రోడ్ల అభివృద్ధి, విద్యావ్యవస్థలో నూతన మార్పులతో పాటు అనేక రంగాల్లో నిధులు వెచ్చించి అభివృద్ధి బాటలో పయనించారని గుర్తుచేశారు. అప్పుడు రాష్ట్రం శ్రీలంక మాదిరిగా తయారవుతోందని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, ఆయన వదిన పురందరేశ్వరి, పవన్కల్యాణ్ గగ్గోలు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ మంగళవారంతో కలిపి కేవలం 22 నెలల్లోనే రూ.3.33 లక్షల కోట్లు అప్పులు చేసి రికార్డు సృష్టించిందని, అందుకు అభినందనలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చేస్తున్న అప్పులపై పవన్కల్యాణ్, బీజేపీ నాయకులు మాధవ్, పురందరేశ్వరి ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. -
అక్రమాల ప్లానింగ్పై కొరడా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీకి సైతం ఆరు నెలలుగా భారీగా ఫిర్యాదులు అందాయి. నేపథ్యంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు కీలక పత్రాలను పరిశీలించారు. కళ్లముందే అక్రమ కట్టడాలు బుధవారం కూడా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగాయి. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో భవనాలను తనిఖీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో రావడం అనుమానాలకు దారితీసింది. కళ్లముందే అక్రమ కట్టడాలు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా అజిత్సింగ్ నగర్లోని ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్యనగర్లో ఏసీబీ అధికారులు మూడు అక్రమ కట్టడాలను గుర్తించారు. బుధవారం సాయంత్రానికి రెండు భవనాలను క్షుణంగా తనిఖీ చేశారు. మూడో కట్టడాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా భవన నిర్మాణాల్లో డీవియేషన్లు, సెట్బ్యాక్స్, తీసుకున్న అనుమ తులు, ప్లానింగ్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టారా లేదా వంటి అంశాలను తనిఖీచేశారు. అక్రమ నిర్మాణాలపై లావాదేవీలు జరిగాయనే అనుమానం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద డాక్యుమెంట్లను సేకరించారు. నగరంలోని మూడు సర్కిళ్లలో దాదాపు ఏడు భవనాలకు సంబంధించి తమ పరిశీలనలో డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రధానంగా సర్కిల్ –2 పరిధిలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని సమాచారం. సర్కిల్–1 పరిధిలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్టౌన్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ ఒక భవనాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా ప్లాన్లో చూపించిన వాటికన్నా, అదనంగా అంతస్తుల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారుల అవినీతికి సంబంఽధించి వచ్చిన ఆరోపణలపైనా ఆరా తీస్తున్నారు. సర్కిల్–3 ప్రాంతంలో మూడు భవనాలను పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో తవ్విన కొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. ప్లాన్లో చూపించిన వాటి కంటే అనధికారికంగా అదనపు అంతస్తుల నిర్మాణం యథేచ్ఛగా జరిగింది. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేశారు. ఇలాంటివి పెద్ద ఎత్తున విజయవాడ సెంట్రల్, వన్టౌన్ ప్రాంతంలో జరిగాయి. ఈ విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీ స్థలానికి చెల్లించాల్సిన రుసుం తగ్గించి, కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించారు. కొన్ని భవనాల యజమానుల నుంచి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయలేదు. లేబర్ సెస్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ క్షేత్ర స్థాయి తనిఖీలు, రికార్డులను పరిశీలించి, జరిగిన అవకతవలకపై ఏసీబీ అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ఉద్దేశం
చిలకలపూడి(మచిలీపట్నం): పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించటమే జాతీయ లోక్అదాలత్ ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్లో బుధవారం జడ్జిలు, న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి గోపీ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి కృష్ణాజిల్లాలో జాతీయ లోక్అదాలత్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆయా కోర్టుల్లో ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. న్యాయవాదులు, పోలీసులు, ఇతర అధికారులు సహ కరించాలని కోరారు. సత్వర న్యాయం పొందటం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఇటీవల కృష్ణాజిల్లా పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీడియేషన్పై ప్రత్యేక సదస్సు నిర్వహించి కేసుల పరిష్కరానికి కృషి చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. చిన్న, చిన్న తగాదాలను పరిష్కారం చేసుకో వటం ద్వారా గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి లోక్అదాలత్ దోహదపడుతుందని సూచించారు. గత లోక్ అదాలత్లో రాష్ట్రస్థాయిలో కృష్ణాజిల్లా నాల్గో స్థానంలో నిలిచిందని, ఈ సారి మొదటి స్థానం సాధించేందుకు జడ్జిలు, న్యాయవాదులు, పోలీస్ అధికారుల పరస్పర సహకారంతో కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి.రామకృష్ణయ్య, జడ్జిలు జి.వెంకటేశ్వర్లు, బి.బాబునాయక్, ఎస్.సుజాత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు, న్యాయవాదులు పుప్పాల శివరామకృష్ణప్రసాద్, పేర్ని సురేష్, గంజి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ -
హ్యాండ్బాల్ టోర్నీ విజేత కేబీఎన్ కాలేజీ
విజయవాడరూరల్: నున్న విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నీ బుధ వారం ముగిసింది. విజయవాడకు చెందిన కేబీఎన్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు ద్వితీయస్థానాన్ని దక్కించుకుంది. మైలవరానికి చెందిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మూడో స్థానంలో, విజయవాడకు చెందిన పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. నాకౌట్–కమ్–లీగ్ విధా నంలో జరిగిన ఈ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అనేక కళాశాలల జట్లు పాల్గొన్నాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాం డెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా యూనివర్సిటీ పురుషుల హ్యాండ్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్ కుమార్, సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నే స్వామి, డి.హేమచంద్రరావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మచిలీపట్నం పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: మచిలీపట్నం పోలీసులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు ఏపీ హైకోర్టులో ఉపశమనం దక్కింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని పోలీసులకు హైకోర్టు గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం, ఏపీ కోర్టు.. పోలీసుల పిటిషన్ను తోసిపుచ్చింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని గుర్తు చేసింది. ఈ క్రమంలో జయసుధ ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే, రేషన్ బియ్యం అక్రమ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
అభివృద్ధి పథానికి ఐదేళ్లు..!
పటమట(విజయవాడతూర్పు): బెజవాడ అభివృద్ధి బాటపట్టి ఐదేళ్లయింది. విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ)కు వైఎస్సార్ సీపీ పాలకపక్షం ఏర్పడి ఈ నెల 18వ తేదీతో ఐదేఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్ సమావేశం జరగనుంది. విజయవాడ మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 64 డివిజన్లు ఉండగా సెంట్రల్ నియోజకవర్గంలో 22 మంది కార్పొరేటర్లు, విజయవాడ తూర్పునకు 22 మంది, పశ్చిమకు 20 మంది కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించారు. వారిలో 2021 మార్చి 18వ తేదీన ఏర్పడిన కౌన్సిల్ల్లో వైఎస్సార్సీపీ నుంచి 49 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహించగా టీడీపీ నుంచి 14 మంది, సీపీఎంకు ఒక సభ్యుడు కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఐదుగురు కో–ఆప్షన్ సభ్యులుగా నియామకం అయ్యారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కేటాయించి, మేయర్ కూడా మహిళ జనరల్కు కేటాయించటంతో విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి 46వ డివిజన్కు కార్పొరేటర్గా ఎన్నికై న బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని 12వ మేయర్గా ఎన్నుకున్నారు. విజయవాడ నగర పాలక సంస్థకు పదవీ కాలం ముగియకముందే మేయర్ను మార్చే ఆనవాయితీ ఉండేది. ఐదేళ్లపాటు మేయర్గా పదివిలో ఉన్న వారిలో రాయన భాగ్యలక్ష్మి ఐదో వ్యక్తి. ఇక తొలిసారిగా ఇద్దరు డిప్యూటీ మేయర్లను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించగా 15వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బెల్లందుర్గ, 58వ డివిజన్కు ప్రాతినిధ్యం వహించిన అవుతు శైలజరెడ్డి కౌన్సిల్ సభ్యులు ఎన్నుకున్నారు. మారిన నగర రూపురేఖలు.. వీఎంసీ పాలకపక్షం ఏర్పాడే నాటికి ఉన్న ఆదాయ వనరులను మరింత పెంచి నగరపాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపారు. నగరంలోని రోడ్లు, మేజర్, మైనర్ అవుట్ఫాల్ డ్రైయిన్లు, కొండ ప్రాంతాల రక్షణకు రిటర్నింగ్వాల్, సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న కేటీరోడ్డు విస్తరణ–ఆధునీకరణ, రాజీవ్గాంధీ పార్కు, రాఘవయ్యపార్కు, అంబేడ్కర్పార్కు అభివృద్ధితోపాటు అజిత్సింగ్నగర్లోని డంపింగ్ యార్డులో నూతనంగా నాలెడ్జ్ పార్కు అభివృద్ధి, ఆధునీక వసతులతో ట్రాన్ఫర్స్టేషన్ నిర్మాణం జరిగింది. ముంపు నుంచి శాశ్వత పరిష్కారం.. ఇంకా నగరానికి ప్రధానంగా కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానదికి వరద వచ్చే వరద ప్రమాదాన్ని నిరోధించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మా ణం, ఇదే ప్రాంతంలో ఆధునిక వసతులతో రివర్ ఫ్రంట్ పార్కు నిర్మాణం, లెనిన్సెంటర్ పార్కు అభివృద్ధి, భవానీపురం, విద్యాధరపురంలో స్మార్ట్ రోడ్ల నిర్మాణం, లబ్బీపేటలో ఈట్ స్ట్రీట్ నిర్మాణం, నగరంలోని మూడు ఇండోర్ స్టేడియాలను ఆధునీకరణ, వసతలు మెరుగుదల చేశారు. రామలింగేశ్వరనగర్, ఆటోనగర్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఆధునీకరించటం చేశారు. ఇంకా తాగునీటి వసతిని మరింత మెరుగుపరచేందుకు పటమట, సత్యనారాయణపురం, కృష్ణలంక, అజిత్సింగ్నగర్, భవానీపురం, రామకృష్ణాపురం, మధురానగర్, వాంబేకాలనీ ప్రాంతాల్లో నూతనంగా రిజర్వాయర్లు నిర్మాణం, భవానీపురంలోని హెడ్వాటర్ వర్క్స్ ఆధునీకరణ, కొండప్రాంతాల సరఫరాకు జరిగే లీకేజీలను అరికట్టి నూతన పైపులైన్లు ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. రెండుసార్లు అవార్డులు: గడచిన ఏళ్ల కాలంలో జాతీయ స్థాయిలో జరిగే స్వచ్చ సర్వేక్షన్ ర్యాంకింగ్లో రెండుసార్లు మెరుగైన ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య నగరంగా తిర్చిదిద్దారు. ఇంకా క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) ద్వారా ఇంటి వద్దనే చెత్త సేకరణను శ్రీకారం చుట్టి నగరంలోని 286 సచివాలయాల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల ద్వారా చెత్త సేకరించి జాతీయ స్థాయిలో అవార్డును సాధించింది. 2021లో జాతీయ స్థాయిలో మూడోర్యాంకు, 2022లో మొదటి 10 ర్యాంకింగ్లో స్థానం, 2023లో ఆరోవ ర్యాంకు, 2024–25లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన వసతుల కల్పనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వీఎంసీకి ఏటా రూ. 100 కోట్ల, రూ.50 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఏడాది ప్రత్యేక నిధులు కేటాయింపుల చేసి నగరవాసుల సమస్యలను త్వరితగతిన పూర్తి చేయటానికి కృషి చేశారు. కౌన్సిల్ ఎజెండాపై మేయర్ సమావేశం బుధవారం కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపద్యంలో మేయర్ భాగ్యలక్ష్మి మంగళవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఎ.రవీంద్రరావు, సెక్రటరీ ఇంచార్జి కె. ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ వి. చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యుసిడి) ఎం.విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడిలో బంగారం దొంగ అరెస్ట్
125 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఇటీవల జరిగిన మహా కుంభాభి షేకం ఉత్సవాల్లో చోటుచేసుకున్న బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్కు చెందిన కాకర్ల సుష్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం రావిచెట్టు వద్ద పూజలు చేసి బయటకు వచ్చిన తరువాత ఆమె బ్యాగ్లో ఉండాల్సిన బంగారు ఆభరణాల పెట్టె కనపడకుండా పోయింది. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా, విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె కొండ దిగి, ఆటో ఎక్కి స్థానికంగా ఉన్న లాడ్జికి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి విచారించగా ఆమె నకిలీ ఆధార్, తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చినట్లు తేలింది. అయితే ఆమె అక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయటంతో ఆ వివరాలు, ఫోటో సాయంతో ఆమె విశాఖపట్నంకు చెందిన కోవెలకొండ నీరజ(27)గా గుర్తించారు. ఆమె ఐదో తేదీన విశాఖపట్నంలో, ఆరో తేదీన విజయవాడలో ఉన్నట్లు ఫోన్ డేటా ధ్రువీకరించుకొని ఆమెను ఆమె నివాసంలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. ఆమె చోరీ చేసిన 125 గ్రాముల విలువైన వివిధ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వివరించారు. -
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
కోనేరుసెంటర్: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ కారును సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు మంగళవారం బందరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెనాలికి చెందిన మనబోటి ఈశ్వరప్రసాద్, తమిళనాడుకు చెందిన దురై మోహన్కుమార్, విశాఖపట్నంకు చెందిన అల్లాఅమీన్ గతంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ గతంలో పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి తమిళనాడు జైలులో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి డబ్బు సంపాదించాలన్న ఆశతో గంజాయి అమ్మకాలను యథేచ్ఛగా చేస్తున్నారు. అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిలో ఈశ్వరప్రసాద్పై 2022లో టంగుటూరు పోలీస్స్టేషన్, 2023లో చైన్నె, 2025లో విజయవాడ పటమట స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. జైలు శిక్ష అనుభవించి 2026లో విడుదల అయ్యాడు. అలాగే మోహన్కుమార్ 2022లో గంజాయి కేసులో పట్టుబడి జైలు శిక్ష అనుభవించి 2025లో విడుదల అయ్యాడు. వీరితో పాటు అమీన్ గంజాయి వ్యాపారులకు వాహనాలు సరఫరా చేస్తూ చైన్నె పోలీసులకు పట్టుబడి జైలు పాలై 2025లో విడుదల అయ్యాడు. గంజాయి తరలిస్తుండగా.. ఈ ముగ్గురు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన బాబూరావు వద్ద కేజీ రూ.5000 చొప్పున 50 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. సరుకును తరలించేందుకు పాత కారు కొనుగోలు చేసి తోట్లవల్లూరు మండలం కల్లంవారిపాలెం మీదుగా గంజాయిని తరలిస్తున్నారు. ఎస్ఐ కిషోర్కు వచ్చిన సమాచారం మేరకు కాపు కాచి వారు వెళ్తున్న కారును అడ్డుకుని సోదా చేయగా సుమారు 52 కిలోల గంజాయి సంచులు పట్టుబడ్డాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయి ముఠాను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ముగ్గురు అద్విక ట్రేడింగ్ కంపెనీ ఏజెంట్లు అరెస్టు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అద్విక ట్రేడింగ్ కంపెనీలో లబ్ధి పొంది, ఆ డబ్బు తిరిగి చెల్లించని ముగ్గురు ఏజెంట్లను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కంభంపాటి మధు రూ.5.5కోట్లు, శంకరపు నాని రూ.3.5కోట్లు, నక్కారం బాలాజీ రూ.కోటి మేర అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏం జరిగిందంటే.. ట్రేడింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి.. ఆరు జిల్లాల పరిధిలో 1,450 మంది నుంచి రూ.413 కోట్లు డిపాజిట్లు వసూలు చేసి, వారికి కుచ్చుటోపీ పెట్టారు. ఈ డిపాజిట్ల సేకరణకు 60 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఇందులో కొంత మంది ఏజెంట్లు లబ్ధి పొందినట్లు పోలీసులు గుర్తించారు. రూ. 144 కోట్లను ముంచేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రధాన నిందితునితోపాటు, మిగిలిన నిందితులకు సంబంధించి 52 ఆస్తులను గుర్తించారు. వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. కొంత మొత్తానికి లెక్కలు లేకుండానే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది మంది నిందితులు.. కేసులో ప్రధాన సూత్రధారి తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య, ఆయన భార్య సుజాతతో పాటు అనుచిత లబ్ధి పొందిన గాదెం శెట్టి బాలకృష్ణ మూర్తి, ఆయన భార్య నాగలక్ష్మి, చిర్రా రామిరెడ్డి ఆయన భార్య ఝూన్నీ, గుంజి సురేష్, తాడేపల్లి సుధాకర్లను అరెస్టు చేశారు. వీరి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, ఆస్తులను సీజ్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్ 26వ తేదీ గణేష్ చంద్ర అనే డిపాజిటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని మాచవరం స్టేషన్లో కేసు నమోదు చేశారు. విజయవాడ క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్రెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కొనసాగుతున్న గాలింపు.. అద్విక ట్రేడింగ్ కంపెనీ ద్వారా లబ్ధి పొంది, ఆ డబ్బులను తిరిగి కట్టకుండా మరో 15 మంది ఏజెంట్లు తప్పించుకు తిరుగుతున్నారు. వారిపైన పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. వారు డబ్బు కట్టక పోతే అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరి ఆస్తులను సీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అరెస్ట్ అయిన ఏజెంట్లు కంభంపాటి మధు, శంకరపు నాని, నక్కారం బాలాజీ మరో 15 మంది కోసం కొనసాగుతున్న వేట -
ఎంఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 86 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 284 జీవోను బుధవారం విడుదల చేసింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్కుమార్ జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఈనెల 18వ తేదీ నుంచి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ వ్యవహరించనున్నారు. -
దుర్గమ్మకు రూ.3 లక్షల విలువైన బంగారు హారం
విజయవాడరూరల్: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాంగణంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీడ్) లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్ను నాకౌట్–కమ్–లీగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో విజయా బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్కుమార్, కృష్ణా యూనివర్సిటీ సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నె స్వామి, డి.హేమచంద్ర రావు, వికాస్ బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ సరేష్, లెక్చరర్లు డి.రత్నబాబు, జి.విజయ్ పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): కాకినాడ లో బుధవారం నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఎస్సీ నాయకులు విడుదల చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా గల అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్ కాలే పుల్లారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, కార్యదర్శి గుడిశె శ్యాంబాబు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు పోలిమెట్ల శరత్ బాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కామెళ్ల కోటేశ్వరరావు(జోజి), సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జల నాగ సురేంద్ర, గొర్రుముచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. వైఎస్ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు రూపొందించనున్న కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
మొక్కజొన్న చేలో రేషన్ బియ్యం పట్టివేత
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఉషశ్రీ పెనమలూరు: బార్లో జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి బీర్ సీసాతో దాడి చేసి గాయపరిచిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురుకు చెందిన కంచరపల్లి కామేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కామేష్ యనమలకుదురులో బార్కు వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకట్, చలమలశెట్టి పవన్ పాత కక్షల కారణంగా కామేష్తో గొడవపడ్డారు. దీంతో వెంకట్ బీరు సీసాతో కామేష్పై దాడి చేశాడు. ఈ ఘటనలో కామేష్కు బీర్ సీసా మెడ వద్ద గుచ్చుకుని గాయమైంది. గాయపడిన కామేష్ను విజయవాడ ప్రభుత్వస్పత్రిలో చికిత్సకు చేర్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026uIIలో రెచ్చిపోతున్న ● పచ్చనేతల డైరెక్షన్లో వ్యవస్థీకృతంగా దోపిడీ ● పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు ● ఫలానా వ్యక్తికే బియ్యం ఇవ్వాలంటూ రేషన్ డీలర్లకు హుకుం ● ప్రతి నియోజకవర్గం నుంచి 500 టన్నుల బియ్యం మాఫియా చేతికి ● కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి ● రేషన్ మాఫియా డాన్ వైపు కన్నెత్తిచూడని అఽధికారులు Iవిజయవాడ కార్పొరేషన్కు వైఎస్సార్ సీపీ పాలకపక్షం ఏర్పడి ఈ నెల 18తో ఐదేళ్లు పూర్తవుతుంది. బుధవారం చివరి కౌన్సిల్ సమావేశం జరగనుంది.దుర్గగుడిలో ఇటీవల మహాకుంభాభిషేకం ఉత్సవాల్లో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 125 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
టీటీడీకి కూరగాయల లారీ
మచిలీపట్నంటౌన్: బందరులోని పరాసుపేట శ్రీ సువత్సలా సమేత ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సత్రానికి మంగళవారం ఒక కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఆలయ పాలకవర్గ సభ్యుడు ఐల శివనాగేశ్వరరావు, వారి కుమారుడు దుర్గ సాయి మారుతి కృష్ణ కుమార్, ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ ఆలపాటి రమేష్, కార్యనిర్వాహణాధికారి టి.వి.వి. మోహనరావు, పాలకవర్గ సభ్యులు జెండా ఊపి లారీని ప్రారంభించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రెండో మంగళవారం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చెడువ్యసనాలకు బానిసై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భవానీపురం స్టేషన్ పరిధిలోని విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాలుగు స్తంభాల సెంటర్కు చెందిన ప్రకాష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తల్లిని తలచుకుని బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం, సొల్యూషన్ తాగుతూ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. 9వ తేదీ రాత్రి ఎప్పటిలాగే సొల్యూషన్ తాగి వచ్చి పడుకున్నాడు. 10వ తేదీ ఉదయం అతని భార్య శృతి నిద్ర లేచి చూడగా ప్రకాష్ మంచంపై కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా హుక్కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందాడు. దీనిపై భార్య శృతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మేట వేసిన నిర్లక్ష్యం
కంకిపాడు సెక్షన్ వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలు కోమటిగుంట రెగ్యులేటర్ వద్ద తూడుతో నిండిన కాలువలు గుర్రపుడెక్కతో నిండిన పునాదిపాడు చానెల్ చలివేంద్ర పాలెం వద్ద పుల్లేరు కాలువలో గుర్రపుడెక్కపంట కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయాయి. ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి సాగునీరు కూడా దిగువకు వెళ్లే ఆస్కారం లేదు. కంకిపాడు సెక్షన్, కోమటి గుంట రెగ్యులేటర్ల పరిధిలోని పలు ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నిట్లోనూ గుర్రపుడెక్క, తూడు మేట వేసుకున్నాయి. అధికారులు ఏమాత్రం దృష్టి సారించటం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. –కంకిపాడు -
ప్రారంభ దశలో గుర్తిస్తే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం
రాష్ట్ర లెప్రసీ విభాగం జేడీ డాక్టర్ దేవసాగర్ మచిలీపట్నంఅర్బన్: కుష్ఠు వ్యాధి ఒక సంక్రమణ వ్యాధి కాగా, ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని రాష్ట్ర లెప్రసి విభాగం (ఎస్.ఎల్.డి) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ తెలిపారు. సోమ వారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జాతీయ లెప్రసీ నిర్మూలనలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్పై డీఎంహెచ్ఓ డాక్టర్ పి.యుగంధర్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ లేప్రోసి వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ వ్యాధని చెప్పారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సమ యానికి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. జిల్లా లెప్రసి వ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ వ్యా ధి నివారణ, గుర్తింపు, చికిత్సలో వైద్య సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమని చెప్పారు. జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ లెప్రసి వ్యాధి ఉన్నవారిని సమాజం దూరం పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందించి చికిత్స కల్పిస్తోందన్నారు. వ్యాధిని తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ, మెడికల్ అధికారులు, ఫార్మసీ అధికారులు, పిహెచ్సి నోడల్ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జాయింట్ కలెక్టర్ నవీన్ మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ టీకా కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్పీవీ టీకా తప్పనిసరిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ టీకా గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాలు, ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ ఎం.ఎన్.రాణి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని పీపీ యూనిట్లో హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. డాక్టర్ సుష్మా మాట్లాడుతూ గర్భాశయ ముఖ క్యాన్సర్ను నివారించేందుకు 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. -
స్వామివారి కానుకలపై చోరుల కన్ను
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో కొండ పై వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం నిధులు స్వాహా చేయటం గుడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలపై కన్నేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇద్దరు అర్చకులు, గుడిలో పని చేసే కార్మికుడు స్వాహా చేయటం భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతో శక్తివంతమైన శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో సిబ్బంది దొంగతనానికి పాల్పడటం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంతో నమ్మకంతో స్వామి వారికి సమర్పించిన కానుకలను అధికారులు భద్రపర్చాల్సి ఉండగా చేతివాటం చూపటంతో భక్తులు తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురయ్యారు. శివశివా అపచారం జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం అభివృద్ధే లక్ష్యంగా... స్వయం భూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని అభివృద్ధే లక్ష్యంగా దాత సంగా నరసింహారావు ఇప్పటి వరకు రూ.50 కోట్లు నిధులు పైగా వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. భక్తులు కూడా తమ వంతు సాయంగా ఆలయ అభివృద్ధికి దోహదపడ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు సమకూరక పోయినా దాతఉ ముందుకు వచ్చి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆదాయం తగ్గటంతో అనుమానం... కాగా శ్రీ రామలింగేశ్వరస్వామివారికి కార్తీక మాసం, మహాశివరాత్రితో పాటు ఇతర పండుగలకు భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. ఏడాదికి మూడుసార్లు హుండీలో కానుకలు లెక్కిస్తారు. రెండేళ్లుగా భక్తులు పెరుగుతున్నా స్వామివారి హుండీ ఆదాయం తగ్గింది. దీంతో అనుమానం వచ్చి నిఘా ఉంచారు. సీసీ కెమేరాలు కూడా గోప్యంగా ఏర్పాటు చేశారని సమాచారం. దీంతో స్వామివారి హుండీలలో సొమ్ము స్వాహా చేసిన దొంగలు చిక్కారని తెలిసింది. స్వాహా చేసి సొమ్ము ఈవో వేరే ఖాతాకు బదిలీ చేసినట్లు ఆధారాలు పోలీసులకు దొరికాయని సమాచారం. సొమ్ము చోరీలో ముగ్గురు అరెస్ట్.. ఆలయం సొమ్ము స్వాహా చేసిన కేసులో పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, గుడిలో పని చేసే కార్మికుడు రోశయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవానిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. దేవస్థానంలో భారీ అవినీతి బయటపడినా దేవదాయ శాఖ అధికారులు జాడ లేదు. ఆలయ రికార్డులు స్వాధీనం చేసుకోలేదు. నకిలీ తాళాలతో హుండీ తెరిచారన్న ఆరోపణలు వచ్చిన వెంటనే అధికారులు ఆలయానికి వచ్చి తాళాలు తనిఖీ చేయలేదు. తాళాలు మార్చలేదు. ఆలయ సొమ్ము చోరీపై ఉన్నతాధికారులు సైతం స్పందించినట్లు కనబడ లేదు. ఈ విషయమై ఏసీ సాంబశివరావును వివరణ కోరగా హుండీలు తనిఖీ చేస్తానని, ఆ తరువాత రికార్డులు పరిశీలిస్తామన్నారు. -
నిశ్శబ్దంగా చూపును ప్రభావితం చేసే గ్లకోమా
మచిలీపట్నంఅర్బన్: నీటికాసులు (గ్లకోవూ) నిశ్శబ్దంగా చూపును ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యాధి అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్లకోమాపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని, కుటుంబంలో ఎవరికై నా ఈ వ్యాధి ఉన్నట్లయితే ఇతరులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ భానుమూర్తి మాట్లాడుతూ కనుగుడ్లు చుట్టూ రంగుల వలయాలు కనిపించడం, కంటి నొప్పి, చూపు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే గ్లకోమా అయ్యే అవకాశముందని చెప్పారు. సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే చూపును కాపాడుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
వసంత నవరాత్రోత్సవాలకు సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 19వ తేదీ ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలు, 27వ తేదీ శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 19వ తేదీ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మ వారికి స్నపనాభిషేకం, అనంతరం అలంకరణ, అర్చన పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. 9.15 గంటలకు వసంత నవ రాత్రోత్సవాలకు కలశ స్ధాపన, ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతుంది. వెండి రథోత్సవం.. ఉగాదిని పురస్కరించుకుని 19వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథోత్సవం జరుగుతుంది. ఆది దంపతులు వెండి రథంపై నగర పుర వీధుల్లో విహరిస్తారు. అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ పుష్పాలతో విశేష అర్చన జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ అర్చన ప్రారంభమవుతుంది. అర్చనలో పాల్గొనే ఉభయదాతలు రూ. 2500 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పూజలో పాల్గొనే వారికి శేషవస్త్రం, రవిక, అమ్మవారి శ్రీచక్ర పీఠం, పెద్ద లడ్డూతో పాటు ఇద్దరికి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. పూర్ణాహుతితో పరిసమాప్తం.. 26న ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, నాగవల్లీ దళార్చన (తమలపాకులు)తో అర్చన జరుగుతుంది. 27వ తేదీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఘాట్ రోడ్డులోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 28వ తేదీ ఉదయంం 9 గంటలకు దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో వసంత నవ రాత్రోత్సవాలు పరి సమాప్తమవుతాయి. -
చట్ట పరిధిలో సమస్యల పరిష్కారం
కోనేరుసెంటర్: మీకోసంలో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిశీలించి పరిష్కరించటం జరుగుతుందని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరించటం జరుగుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పై స్థాయి అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదుదారులతో మర్యాదమాట్లాడటంతో పాటు వారి సమస్యలను సామరస్యంగా ఆలకించి ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే నమ్మకాన్ని బాధితుల్లో కలిగించాలన్నారు. అప్పుడే పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులతో అమర్యాదగా మాట్లాడినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 35 అర్జీలు అందుకున్నట్లు తెలిపారు. ● హనుమాన్ జంక్షన్ నుంచి హరి అనే వ్యక్తి వచ్చి తన స్నేహితునికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 3 లక్షలు అప్పుగా ఇవ్వడం జరిగిందని, తీసుకుని రెండేళ్లు గడుస్తున్నప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరాడు. ● పామర్రుకు చెందిన వీరయ్య అనే వృద్ధుడు వచ్చి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తన దగ్గర బంధువులు ఫోర్జరీ చేసి వారి పేర రాయించుకోవాలని చూస్తున్నారని అడిగినందుకు తపై దాడి చేస్తూ హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. ● తోట్లవల్లూరు నుంచి లత అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి రెండేళ్లయిందని చెప్పింది. అయితే పిల్లలు పుట్టలేదనే కారణంతో భర్త అత్తింటి వారు బలవంతంగా విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. తనకు అన్యాయం జరగకుండా చూడాలని కోరింది. పై అర్జీలపై స్పందించిన ఎస్పీ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
టెన్త్క్లాస్ పరీక్షల నిర్వహణపై అవగాహన సదస్సు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): త్వరలో నిర్వహించనున్న టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులకు సోమవారం కొండపల్లి డీఏవీ పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమవ్వాలని, పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవకతవకలు జరగకుండా పేపర్ కోడ్ ఆధారంగా ఏరోజు ప్రశ్నపత్రం ఆ రోజే అందేలా చూడాలన్నారు. సమావేశంలో వివిధ డివిజన్ల డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ముంజేరు దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితుల న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం కమిటీ ఆధ్వర్యలో ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. కేసులు ఎత్తివేయాలని, ఎమ్మెల్యే లోకం మాధవి దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. కనీసం స్పందించడం లేదు.. బాధితుల న్యాయ పోరాట కమిటీ అధ్యక్షుడు బోనెల జోగేంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ ముంజేరు దళిత కాలనీ సిద్ధార్థ నగర్కు మురుగు నీరు కాల్వను మళ్లించి దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. 94 రోజులుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదన్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి దళితులకు న్యాయం చేయకపోగా, వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ దళితవాడ గుండా మురుగు కాలువ తవ్వించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మగౌరవ దీక్షలో ముంజేరు బాధితుల న్యాయ పోరాట కమిటీ -
పవర్ లిఫ్టర్ చంద్రికకు రూ.లక్ష ఆర్థిక సాయం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక త్వరగా కోలుకొని మళ్లీ క్రీడా మైదానంలో అడుగు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ ఏ.రవినాయుడు ఆకాంక్షించారు. ఆనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న చంద్రికను సోమవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవర్ లిప్టింగ్లో చంద్రిక సాధించిన విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వైద్య చికిత్స కోసం లక్ష రూపాయలను అందచేశారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. బంటుమిల్లి: భర్త, అత్త వేధింపులు భరించేని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని అర్తమూరు గ్రామంలో విషాదం నింపింది. పోలీసు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాకాల రాజగోపాల్ కుమార్తె లిఖిత(26)ను ఆగిరిపల్లి మండలం, కొత్తఈదర గ్రామానికి చెందిన బెక్కం కిరణ్కు ఇచ్చి 2024 నవంబరు 16వ తేదీన వివాహం చేశారు. వివాహం తర్వాత భార్యభర్తలు ఉద్యోగం నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యుకే) వెళ్ళారు. అక్కడ కిరణ్ జాబ్ సక్రమంగా లేదని భావించిన పోలీసులు భార్యభర్తలను ఇండియాకు పంపారు. అత్తారింటికి చేరిన లిఖితకు అత్త, భర్తల సూటిపోటీ మాటలతో వేధింపులు మొదలయ్యాయి. యుకేలో కిరణ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. అత్తారింట్లో ఎదురైన వేధింపులను తోబుట్టువులకు ఫోన్ల్ చేసి చెప్పుకుంది. ఈ స్థితిలో కట్నంగా ఇచ్చిన పొలం అమ్ముకుని డబ్బులు తీసుకురమ్మని కిరణ్ లిఖితను బెదిరించడంతో నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న లిఖిత సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయములో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న మాకాల సాయిసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేష్కుమార్ కేసు నమోదు చేశారు. చల్లపల్లి: స్నానానికని వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన కె.వెంకటకృష్ణయ్య, దేవిప్రియల కుమార్తె కీర్తి (13) స్థానిక హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళిన కీర్తి మార్గంమధ్యలో తనకు నెలసరి రావటంతో ఇంటికి తిరిగి వచ్చింది. పంచాయతీలో స్వీపరుగా పనిచేస్తున్న తల్లి దేవిప్రియ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. స్కూలుకు ఎందుకు వెళ్ళలేదని అడగటంతో తనకు కడుపు నొప్పిగా ఉందని కీర్తి చెప్పింది. స్నానం చేసి వస్తే ఆసుపత్రికి వెళదామని తల్లి కూతురుని స్నానానికి పంపింది. కీర్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో తలుపులు తెరచి చూడగా కీర్తి చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. అది చూసి కంగుతిన్న దేవిప్రియ కేకలకు స్థానికులు వచ్చి కీర్తిని హుఠాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక కీర్తి మృతి చెందినట్లు చెప్పారు. ఎస్ఐ డి.దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తి క్రమశిక్షణతో, టీచర్లతో ఎంతో వినయంతో నడచుకునేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు: రాష్ట్రస్థాయి పూటీ లాగుడు ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కోడూరులోని స్వతంత్రపురం పీహెచ్సీ సమీపంలోని ఖాళీ స్థలంలో స్థానిక వ్యాపారి పసుపులేటి రాము ఆధ్వర్యంలో ఈ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండవ రోజైన సోమవారం న్యూ జూనియర్స్ విభాగంలో పోటీలను నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 16 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. దివిసీమలోని ఆరు మండలాలకు చెందిన ప్రజలు, రైతులు పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
పన్ను పాట్లు!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపారుల నుంచి బకాయిలు వేగంగా వసూలు చేయండి’ అంటూ వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు గడిచిన 15ఏళ్లుగా ఉన్న బకాయిలు మొత్తం వసూలు చేసి తీరాలంటూ అధికారులకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావటంతో వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు ఈ బకాయిల వసూళ్లపైనే దృష్టి సారించాలని ఆదేశించటంతో ప్రస్తుతం ఉన్న పనులన్నీ నిలిపివేసి అధికారులందరూ దీనిపైనే పని చేస్తున్నారని ఆ శాఖ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.700 కోట్ల బకాయిలు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1 డివిజన్, విజయవాడ–2 డివిజన్, విజయవాడ–3 డివిజన్ పేర్లతో మూడు ప్రధాన కార్యాలయాలు పని చేస్తున్నాయి. వాటి పరిధిలో సుమారుగా రెండు జిల్లాల్లో 17 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిన్నింటి నుంచి ప్రభుత్వానికి సుమారుగా రూ.700 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. దాంతో కమిషనర్ కార్యాలయం నుంచి ఏరోజుకారోజు నివేదికలు అడుగుతూ అధికారులపై ఒత్తిడి పెడుతున్నారని నాయకులు వివరిస్తున్నారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆయా సంస్థలను పట్టుకునే పనిలో బిజీబిజీగా పని చేస్తున్నారని నాయకులు చెబుతున్నారు. ఆదాయం లేకనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అటు పరిశ్రమల నుంచి ఉత్పత్తి సైతం దిగజారింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చే ఆదాయం సైతం కానరావటంలేదు. వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల నుంచి ఆదాయ పన్నుల శాఖకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోవటంతో దానిని ఏదో విధంగా భర్తీ చేసేందుకు బకాయిలపై పడినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో వాణిజ్య శాఖ నుంచి భారీ ఆదాయం వస్తోందంటూ ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ఆదాయానికి సైతం గతి లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు. దీంతో కమిషనర్ కార్యాలయం నుంచి బకాయిలు వసూలు చేసి పడిపోయిన ఆదాయాన్ని దీని ద్వారా భర్తీ చేయాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు పదేపదే ఒత్తిడి పెడుతున్నారని ఆ శాఖలో వినిపిస్తున్నాయి. మరింత ఒత్తిడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తోంది. ఈ 20 రోజుల్లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆదాయం చూపించాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో జీఎస్టీ నిబంధనల్లో లేని అడ్వాన్స్ పన్నులు వసూలు చేసి కొంత ఆదాయం చూపించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఏదో విధంగా ఆదాయాన్ని చూపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తాపత్రయపడుతోంది. ఆ క్రమంలో 20 రోజుల్లో అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని, బకాయిల గురించి ఒత్తిడి తీసుకురావటంతో అధికారులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పదేపదే కాన్ఫరెన్స్ల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఆ శాఖలో పని చేస్తున్న అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కొక్కస్థాయి అధికారి వేరువేరుగా కాన్ఫరెన్స్లు పెట్టడంతో బకాయిల వసూళ్లకు ఎక్కడ అవకాశముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలతో వ్యాపారాలు జరగక ఆదాయం పడిపోతే తమపై ఒత్తిడి పెట్టడం ఏమిటంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు ఈ కాన్ఫరెన్స్లతో ఉన్న పుణ్యకాలమంతా అయిపోతుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో బకాయిల పేరుతో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవి సైతం బయటకు తీసి వసూలు చేయాలంటూ కమిషనర్ కార్యాలయం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా జీఎస్టీకి ముందు కొనసాగిన వ్యాట్ విధానంలో ఉన్న బకాయిలు చాలా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దానికి తోడు చాలా వ్యాపార సంస్థలు ఇచ్చిన చిరునామాల్లో లేవు. అలాగే బకాయిలు ఉన్న అనేక సంస్థలు దివాలా తీశాయి. కొన్ని సంస్థల వ్యక్తులు చనిపోయిన వారి పేర్లతో వ్యాపారాలు చేసి మోసగించినవి అందులో కనిపిస్తున్నాయి. వాటికి తోడు చాలా వరకూ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి అన్ని కలిపి భారీగా బకాయిలు ఉన్నాయంటూ కమిషనర్ కార్యాలయం చెప్పటంతో స్థానిక డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
అర్జీలను సకాలంలో పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సానుకూలంగా, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రభుత్వశాఖలకు సంబంధించిన నివేదికలను వెంటనే అందజేయాలన్నారు. 24 గంటల్లోగా పరిష్కరించాల్సిన అర్జీలు ఇంకా 37 పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. మీ కోసంలో అధికారులు ప్రజల నుంచి 126 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. మొవ్వ మండలం యద్దనపూడి గ్రామంలో సర్వే నంబరు 180లో 145.2 చదరపు గజాల స్థలంలో 1982 నుంచి పాలసేకరణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని దక్షిణం వైపు ఉన్న సరిహద్దుదారురాలైన పామర్తి సాయిరాణి 2022లో మచిలీపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామానికి చెందిన పామర్తి వీరజనార్దనరావు ఆరోపించారు. ఈ స్థలం తమదేనని పాలసేకరణ కేంద్రానికి నోటీసు పంపామని చెప్పారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు. -
బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రాజకీయ పార్టీల తరఫున బూత్స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్కు వేసిన తాళం, సీల్ను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు సజావుగా ఉన్నదీ, లేనిదీ విచారించారు. అనంతరం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాలకు బూత్స్థాయి ఏజెంట్లను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నియమించుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారికి సంబంధించిన నియోజకవర్గాల వారీగా బూత్స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, మార్కెటింగ్ ఏడీ ఎల్. నిత్యానందం, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, పంతం గజేంద్ర, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం మచిలీపట్నంటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కె. వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఉన్న రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు. బస్ పాస్తో సంబంధం లేకుండా ఏ రూట్లో వెళ్లే బస్సుకై నా ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే అల్ట్రా పల్లెవెలుగు, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గేట్ మీటింగ్స్ నిర్వహించి, నోటీసు బోర్డులో సమాచారం ఉంచినట్టు తెలిపారు. గోసంరక్షణ పథకానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన డి. వెంకటరావు, చిన్నమ్మ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి గోసంరక్షణ పథకానికి రూ. 1.45లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాల్సిందే కృత్తివెన్ను: అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహించినా, అనుమతులు పొంది తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలంలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. మండలంలోని పడతడిక, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలలో బాణసంచా తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రాలలో సరైన లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, నిల్వ పరిమితులు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకార్మికులు ఉన్నారా తదితర వివరాలను ఆరా తీశారు. ఆయనతో పాటు బందరు ఆర్డీవో కె. సాంబశివరావు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఏసురత్నం, తహసీల్దార్ శశి కుమార్ తదితరులు ఉన్నారు. -
కూటమిలో కొట్లాట!
అవనిగడ్డలో జనసేన వర్సెస్ టీడీపీ కోడూరు: అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీరును ఎండగడుతూ కోడూరు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇంతటితో ఆగకుండా బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారికి టీడీపీ నేతలు కూడా మరోసారి శంకుస్థాపన చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే.. కోడూరులోని తొమ్మిదో వార్డు ఎస్సీకాలనీలో ఎన్ ఆర్ఈజీఎస్ కింద రూ.22లక్షల నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం జనసేన పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. ఇది జరిగిన అరగంటకే మండల టీడీపీ నేతలు మళ్లీ అదే రహదారికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలోని గ్రామస్తులతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఒంటెద్దు పోకడలకు నిరసనగానే.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధప్రసాద్ పెట్టుకున్నారని ఆ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి పొత్తు ధర్మాన్ని బుద్ధప్రసాద్ విస్మరిస్తూ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోని నేతలను కూడా జనసేనలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో తమ ఇష్టమొచ్చినవారికే పనులను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్చంద్రబోస్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆదేశాల మేరకే బుద్ధ ప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారి తాము కూడా శంకుస్థాపన చేసినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జనసేన కౌంటర్గా.. రహదారికి టీడీపీ నేతలు కూడా శంకుస్థాపన చేయడంతో మండల జనసేన నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వారు కౌంటర్కు దిగారు. సోమవారం సాయంత్రం మరోసారి రహదారి నిర్మాణ ప్రాంతానికి వెళ్లి బుద్ధప్రసాద్ను పొగడ్తలతో ముంచెత్తారు. రహదారి నిర్మాణాన్ని టీడీపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని, నియోజకవర్గంలో మద్యం, రేషన్, బుసక, ఇసుక దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందంటూ జనసేన పార్టీ మండలాధ్యక్షుడు మర్రే గంగయ్య విమర్శించారు. -
ఘాట్రోడ్డుపై నో పార్కింగ్ జోన్ !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్రోడ్డులో వాహనాల పార్కింగ్ నియంత్రణకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇతర ఇంజినీరింగ్ అధికారులు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఘాట్రోడ్డును నో పార్కింగ్ జోన్గా ప్రకటించే అవకాశాలున్నట్లు అధికారుల పర్యటనలో తేటతెల్లమైంది. దుర్గగుడిపై నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవానికి హోంమంత్రి అనిత హాజరైన రోజున ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద మంత్రి కాన్వాయ్ సుమారు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు పరిశీలన.. ఈ నేపథ్యంలో సోమవారం సీపీ రాజశేఖరబాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఓం టర్నింగ్ నుంచి ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రం వరకు ఉన్న వాహనాల పార్కింగ్ను పరిశీలించారు. దేవస్థాన భద్రతా, ఘాట్రోడ్డుపై వాహనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలయ అధికారులతో చర్చించారు. ఘాట్రోడ్డుపైకి ఎవరి వాహనాలు పడితే వారివి అనుమతించకుండా ప్రోటోకాల్ ఉన్న వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు. -
కునుకే బంగారమాయెనే!
● విజయవాడ గాంధీనగర్కు చెందిన 40 ఏళ్ల రాజుకు ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, ఆలోచనలు ఎక్కువ కావడంతో తలనొప్పి, ఇతర రుగ్మతలు చుట్టుముట్టాయి. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా.. ఎటువంటి జబ్బూ లేదని, ఒత్తిడి కారణమని తేల్చారు. ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు అన్ని వర్గాలకు చెందిన వారు శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక యుగంలో రాణించాలంటే ఉరుకులు పరుగుల జీవనం తప్పదు. ఈ క్రమంలో కంటినిండా నిద్ర ఉండదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి లోనై వ్యాధుల బారిన పడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు అదుపు తప్పు తున్నాయి. కొరవడిన మానసికోల్లాసం.. ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం లోపించిందనే చెప్పాలి. ఆధునిక యుగంలో రాణించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తుంటారు. కొందరు కనీసం పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సాయంత్రం వేళ పిల్లలతో కాసేపు సమీపంలోని పార్కుకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందంటున్నారు. కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలపై దృష్టి పెట్టడం వంటి చేయాలి. మధుమేహుల్లో ఒత్తిడి ప్రభావం ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. యువత వాటికి బానిసలుగా మారడంతో ఇతర అంశాలపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టిపెట్ట లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, ఇలా అనేక రంగాల వారు ఈ సమస్యలతో కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు మధుమేహం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి మధ్య సంబంధం ద్విముఖమైనది. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కార్టిసోల్, ఇతర స్ట్రెస్ హార్మోన్లను పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికమవుతాయి. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించి టైప్–2 డయాబెటిస్కు మార్పు వేగవంతం కావచ్చు. నిద్రలేమి, అనియంత్రిత ఆహారం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహ చికిత్సలో చక్కెర నియంత్రణతో పాటు, భావోద్వేగ ఆరోగ్యాన్ని సమానంగా పరిగణించే వైద్య విధానం అనుసరించాలి. – డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహ వ్యాధి నిపుణుడు -
పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కోడూరు: రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కోడూరు మండలంలోని స్వతంత్రపురం పీహెచ్సీ సమీపంలోని ఖాళీ స్థలంలో స్థానిక వ్యాపారి పసుపులేటి రాము ఆధ్వర్యాన పోటీలకు శ్రీకారం చుట్టారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య పోటీలను ప్రారంభించారు. వారు నిర్వాహకుడు రామును శాలువాతో సత్కరించారు. అనంతరం పోటీకి వచ్చిన ఎడ్ల జట్ల యజమానులతో మాట్లాడారు. పోటీల్లో 22 ఎడ్ల జతలు.. తొలి రోజు ఆదివారం వ్యవసాయ విభాగానికి సంబంధించిన ఎడ్ల జతలకు పోటీలను నిర్వహించారు. బాపట్ల, చీరాల, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 22 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సోమవారం న్యూ జూనియర్ విభాగానికి చెందిన ఎడ్ల జతలకు పోటీలు ఉంటాయని, వీటిలో గెలుపొందిన జతలకు నగదు బహుమతులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. -
రజకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేదు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనాభాలో మూడు శాతం ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎీస్టీ, మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పానుగుపాటి శ్రీనివాస్, దాచేపల్లి మోహన్రావు, పేట శ్రీనివాస్, బైరవరపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు పాల్గొన్నారు. -
మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల భాగస్వామ్యంతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక జెడ్పీ సమావేశపు హాలులో ఆదివారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. వీటిని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసి వారి ఉన్నతికి తోడ్పాటును అందించారన్నారు. తాను జెడ్పీ చైర్పర్సన్గా ఐదేళ్లు సమర్థంగా నిర్వహించామంటే అది వైఎస్ జగన్ నాకిచ్చిన గౌరవమేనన్నారు. జెడ్పీ సభ్యులుగా ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ హారికను సభ్యులందరూ గజమాల, పూలకిరీటంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలకపాత్ర.. తొలి మెట్టు అదే.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక -
మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు సాధికారత సాధించినప్పుడే సమగ్ర ప్రగతికి పునాది అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘రైజ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మహిళా దినోత్సవంలో 20సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్: 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడారు. అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలను సత్కరించారు. చెక్కులు అందజేత.. డీఆర్డీఏ ద్వారా 4,646 మంది స్వయం సహాయక సంఘ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.83.78 కోట్లు, 6,146 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.829.55 కోట్లు, సీ్త్రనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద 18,550 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.138.41 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (వర్సున్నపేట)కు ట్రాక్టర్ అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దే అనురాధ, మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జోత్స్న అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026
పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కొండపై ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీల్లో సొమ్ము చోరీ అయ్యింది. దీనిపై దాత సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో ఎన్.భవాని, ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, వర్కర్ రోశయ్యపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ ప్రాంగణంలో శివాలయం, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గణపతి, ఆంజనేయ, నాగేంద్రస్వామి ఆలయాల వద్ద హుండీలున్నాయి. భక్తులు ఈ హుండీల్లో సమర్పించిన కానుకలను ఏడాదికి మూడుసార్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవాని, ప్రధాన అర్చకుడు జి.ఆర్.వి.సాగర్, అర్చకులు, అటెండర్లు, గ్రామస్తుల సమక్షంలో లెక్కిస్తారు. ఆలయ పూజారులు పూర్ణ, సాగర్ శుక్రవారం గ్రామంలో మద్యం తాగి గొడవపడ్డారు. సొమ్ము విషయంలో తేడాలు.. హుండీల్లో కాజేసిన సొమ్ము విషయంలో వారి మధ్య గొడవ జరగడాన్ని ఆలయ దాత సంగా నరసింహారావు, డ్రైవర్ రాజులపాటి సాయిబాబు గమనించారు. ఈ విషయాన్ని నరసింహారావుకు చెప్పారు. దీంతో ఆయన ఆలయంలో రోజువారి పనిచేసే రోశయ్యను పిలిచి ప్రశ్నించారు. రెండేళ్లుగా హుండీలో సొమ్ము స్వాహా చేస్తున్నట్లు రోశయ్య ఆయనకు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో పలు ప్రదేశాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును లెక్కింపునకు తీసుకొచ్చే సమయంలో మధ్యలోనే ఈవో భవాని సహకారంతో పూజారులు సాగర్, పూర్ణ, తాను స్వాహాచేసినట్లు రోశయ్య తెలిపారు. అంతరాలయంలో ఉన్న ప్రధాన హుండీకి నకిలీ తాళం చెవులు తయారు చేసి కూడా సొమ్ము కాజేశారని, రూ.10 లక్షల వరకు సొమ్ము స్వాహా చేశారని నరసింహారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సూత్రధారులు ఈవో ఎన్.భవాని, ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, వర్కర్ రోశయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు. అభిషేకానికి పవిత్ర జలాలను బంగారు గోపురం వద్దకు తీసుకెళ్తున్న అర్చకులుపెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు కానూరు అశోక్ జిమ్లో ఆదివారం సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ పోస్టర్ ఆవిష్కరించారు. మనోహర్, అశోక్ వివరాలు తెలుపుతూ ఈ పోటీలు విజయవాడలో మార్చి 29వ తేదీన జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ 2026 అవార్డుతో పాటు, వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. కె.ఈశ్వరరావు, సీహెచ్ రాజు, ఈదా రాజేష్, అల్లూరిరెడ్డి, ఎస్కే ఖాదర్ పలువురు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9705663252లో సంప్రదించాలని సూచించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ, రేషన్ మాఫియాకు డాన్లా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ను అమలు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజా సత్యనారాయణ(50) నందిగామ, మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల వద్ద నుంచి, కొంతమంది డీలర్స్ వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడని తెలిపారు. సత్యనారాయణ తొలిసారిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011లో పట్టుబడ్డాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న డెప్యూటీ తహసీల్దార్కు వచ్చిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు తెలిపారు. కంకిపాడు: లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ అన్నా రు. మండలంలోని ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజ మానులకు అందించారు. పన్ను వసూళ్లు, పెండింగ్ పన్నులపై సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన అధిగమించాలన్నారు. బకాయిలపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఈఓ బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా క్రతువు జరిగింది. కుంభాభిషేకం వేళ తులసీవనం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రసాదాల విక్రయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసే మార్గంలోని బంగారు గోపురం వీక్షించే ప్రాంతం, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి కుంభాభిషేకాన్ని వీక్షించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందంగా అలంకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 9గంట లకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ రాజశేఖరబాబు, చైర్మన్ రాధాకృష్ణ, దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు, వేద పండితులు అమ్మవారి బంగారు కలశం వద్దకు చేరుకున్నారు. బంగారు కలశానికి విజయేంద్ర సరస్వతి స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సుముహూర్తమైన 9.34 గంటలకు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన స్వామిజీ నేరుగా ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాల్లో జరిగే విశేష పూజల వల్ల ఫలితాలు, భగవంతుడికి, భక్తుడికి మాధ్యమంగా ఉండేవి ఆలయాలేనని, యువ త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. వారంలో రెండు రోజుల పాటు యువతకు, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక దర్శన సమయం ఇవ్వాలని స్వామిజీ ఆకాంక్షించారు. అనంతరం ఈవో, చైర్మన్, ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు అధికారు లు, సిబ్బందికి స్వామిజీ ప్రసాదాలను అందించారు. పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా అభిషేకం దుర్గమ్మవారికి స్వామిజీ ప్రత్యేక పూజలు ఆలయ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి -
జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు
కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చింతకింద సునీల్, మేక స్వాతి తేజ్ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్ మండిపడ్డారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయవాడలో కాల్పుల కలకలం
సాక్షి, విజయవాడ : విజయవాడలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులపైనే కాల్పులు జరిపేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే, ట్రిగ్గర్ బ్లాక్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో గన్ ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీంతో, అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సదరు వ్యక్తిని పట్టుకున్నారు. దుండగుడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని వరంగంల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడిని ఈగల్ టీమ్ విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. -
9న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటిస్ మేళా
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలోని ఎనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టు రోస్టర్ ప్రకారం భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో అర్హత కలిగిన అభ్యర్థులు సీడీపీవో ఆఫీసులో సంప్రదించి ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి వివాహిత అయ్యి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఐసీడీఎస్ కార్యాలయ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. నాగాయలంక: ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల బాలిక పాము కాటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మండలంలోని పెదపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్.ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. లోయ శివరామకృష్ణ, ఝాన్సీ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఝాన్సీ ఇంటి ముందు పని చేసుకుంటోంది. ఆ సమయంలో రెండేళ్ల కుమార్తె పల్లవి పక్కనే బూత్రూమ్ దగ్గర ఆడుకుంటూ అకస్మాత్తుగా ఏడుస్తూ కేకలు వేసింది. అది విని తల్లి కుమార్తె దగ్గరకు వెళ్ళి పరిశీలించగా బాలిక కుడిచేతి మణికట్టు కింద పాము కాటు వంటి రెండు గాట్ల గుర్తులతో రక్తస్రావం కావడాన్ని గమనించింది. తక్షణం చికిత్స కోసం బాలికను అవనిగడ్డ సిహెచ్సికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యండకుదురు(ఘంటసాల): ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి విద్యుత్తు స్థంభాన్ని ఢీ కొట్టడంతో రెండు స్తంభాలు పడిపోవడంతో పాటు కారు ద్వంసంమైన ఘటన శుక్రవారం ఘంటసాల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. చల్లపల్లి మండల మాజేరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం వాటపల్లిలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మచిలీపట్నం నుంచి మాజేరు కారులో వస్తున్నారు. ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి – పచ్చవారిలంక గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు 11 కేవీ విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు ముందుబాగం దెబ్బ తినడంతో పాటు ట్రాన్స్ ఫార్మర్ సపోర్టుగా ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టడంతో రెండు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్తు వైర్లు కారు మీద పడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పడమే కాక ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో బోధనేతర సిబ్బందిపై దాడికి పాల్పడిన టెన్త్ విద్యార్థులకు పోలీస్స్టేషన్లో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లితే.. గత నెల 26వ తేదీన వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులు మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతుండగా ల్యాబ్ అసిస్టెంట్ సీహెచ్ రవీంద్రరావు మందలించడంతో టెన్త్ విద్యార్థి పునీత్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆయనపై దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం, మీడియాలో వార్తలు వెలువడటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరవల్లి పోలీస్స్టేషన్లో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. గుడివాడ డీవైఈవో రవికుమార్, బాపులపాడు ఎంఈవో–2 కొమ్మా విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల సమక్షంలో వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ ముగ్గురు టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ముగ్గురు విద్యార్థులకు క్రమశిక్షణ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పట్ల గౌరవం, విద్యా సంస్థలో సత్ప్రవర్తన కలిగి ఉండటం గురించి ఎస్ఐ సత్యం సురేష్ వివరించారు. తల్లిదండ్రుల గైడెన్స్ లోపించడం వల్లే విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణ పాటించడం లేదన్నారు. దీనికిగానూ భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల ప్రవర్తన, భవిష్యత్కు పూర్తి బాధ్యత వహిస్తామని పేర్కొంటూ తల్లిదండ్రుల నుంచి పోలీసులు హామీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి
నందిగామ రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. మండలంలోని పల్లగిరి గ్రామానికి చెందిన పాల్వాయి నీలాంబరం, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం. తేజ (14), సోదరి తేజశ్రీ, తనూజ్ ముగ్గురు పిల్లల్లో తేజ, తేజశ్రీలు కవలలు. నీలాంబరం తాపీమేసీ్త్రగా పని చేస్తుండగా భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలోని పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న తేజ శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత తాత జేమ్స్తో కలిసి రాఘవాపురం శివారులోని మామిడి మొక్కలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తాత తోటలో నీళ్లు పెడుతుండగా తేజ బుంగతో బావిలో నీటిని తీసుకొచ్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. గమనించిన తాత బావిలోకి దూకి గాలించినప్పటికీ బాలుడు లభ్యమవకపోవటంతో కేకలు వేశాడు. చుట్టపక్కల వారు అక్కడకు చేరుకుని అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోని నీటిని తోడి బాలుడిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. -
నిర్దేశిత సూచికలను పూర్తి స్థాయిలో సాధించాలి
పెనుగంచిప్రోలు: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన సూచికల్లో పూర్తి స్థాయిలో వృద్ధి సాధించాలని నీతి అయోగ్ ఢిల్లీ అధికారి రాధిక ములే అన్నారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం మండలంలో పర్యటించారు.అంగన్వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పశు వైద్యశాలలు, పెనుగంచిప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. శనగపాడు గ్రామంలో గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం సందర్శించి అక్కడ రైతులకు అందిస్తున్న స్మార్ట్ అగ్రి కల్చర్ శిక్షణ, జియో ఫెన్సింగ్, వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వివరాలు తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, బలవర్ధకమైన ఆహారం వంటి సూచికల్లో పూర్తి స్థాయిలో వృద్ధి సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మార్గదర్శకంలో సంపూర్ణత అభియాన్ 2.0 జిల్లాలో సమర్ధవంతంగా అమలవుతూ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఎంపీడీఓ జి శ్రీను, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మీ, ఏఓ రామసుబ్బారెడ్డి, ఎంఈఓ రవీంద్ర, వైద్యాధికారి నాగరాణి, పశువైద్యాధికారి పి.అనిల్, ఏబీపీ కో–ఆర్డినేటర్ మోహన్ సందీప్, ఏపీఎం వెంకటరమణ, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ నాంచారయ్య, హౌసింగ్ ఏఈ సతీష్, ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి, డెప్యూటీ ఎంపీడీఓ సుబ్బారావు, ఏఓ సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
మైలవరం: అక్రమంగా రవాణా చేస్తున్న 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారి పి.వాణి తెలిపారు. ఈ నెల 5న అందిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధిలో మూడు రేషన్ షాపుల్లో స్థానిక అధికారులతో కలిసి తనిఖీలు చేశామన్నారు. నాలుగు టన్నుల తేడాను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల అనంతరం విజయవాడ వెళుతుండగా మార్గంమధ్యలో మైలవరం మండలం బాడవ టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి అనుమానాస్పదంగా ఉన్న లారీని గుర్తించి తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీలలో 300 ప్లాస్టిక్ బ్యాగ్లతో నిండిన 17 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి మైలవరం పోలీస్ స్టేషన్కు లారీని తరలించి, స్థానిక తహశీల్దారును కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఓ వి. శ్రీనివాస్, డీటీ బి. రామకృష్ణ, ఆర్ఐ కిశోర్, స్థానిక వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
వెళ్తారా.. కేసులు పెట్టమంటారా?
విలేజ్ సర్వేయర్లకు ప్రయోజనాలు లేవు విలేజ్ సర్వేయర్లకు పోలీసుల హెచ్చరిక వినతిపత్రం ఇవ్వడానికి జిల్లాలోని మండలాల నుంచి విలేజ్ సర్వేయర్లు కలెక్టరేట్కు చేరిక ప్రతినిధులు తప్ప మిగతావారు బయటకు వెళ్లాలని పోలీసుల సూచన వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికతో ఉద్రిక్తం -
అంగరంగ వైభవంగా..
● దుర్గగుడిపై కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం ● తొలి రోజున పవిత్ర జలాలకు పూజలు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సోయగం ఆలయానికి అలంకరణ కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, పరిసరాలను పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని అడుగడుగునా మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అంతరాలయ దర్శనం రద్దు, టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో భక్తులు అన్ని క్యూల్లో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఘాట్రోడ్డుతో పాటు ఆలయ పరిసరాల్లో 11కు పైగా ప్రత్యేక వైద్య శిబిరాలు, భక్తులకు మంచినీటి పంపిణీ, మజ్జిగను అందజేశారు. లోబ్రిడ్జి నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకునే వరకు ప్రతి వంద మీటర్లకు తాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్ గెస్ట్ హౌస్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 11వేల మందికి అన్న ప్రసాద వితరణ -
కేయూ మహిళల హ్యాండ్బాల్ చాంప్ కేబీఎన్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్గా కేబీఎన్ కళాశాల విజయం సాధించింది. విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళ హ్యాండ్బాల్ పోటీలు కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పోటీలు శుక్రవారం ముగిశాయి. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ తమ కళాశాల హ్యాండ్బాల్ పోటీల్లో 12సార్లు వరుస చాంపియన్షిప్లను కై వసం చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల మొదటగా లీగ్ పోటీలో విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న)పై 14 –2 గోల్స్ ఆధిక్యతంతో విజయం సాధించారు. రెండో లీగ్లో స్టెల్లా కాలేజ్ (విజయవాడ)పై 18–00 గోల్స్ ఆధిక్యతతో కేబీఎన్ విజయం సాధించింది. ఫైనల్లో సిద్ధార్థ మహిళ కళాశాల జట్టుపై 14–00 ఆధిక్యంతో యూనివర్సిటీ చాంపియన్షిప్ ట్రోఫీని కై వసం చేసుంది. ద్వితీయ స్థానం విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న) సాధించగా, తృతీయ స్థానాన్ని సిద్ధార్థ మహిళ కళాశాల జట్టు సాధించింది. బహుమతి ప్రదానం ముఖ్య అతిథి ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుమలత విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఏపీ ఉత్తమ క్రీడాకారిణిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కేబీఎన్ కళాశాల విద్యార్థిని బోయి సత్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరిని తయారుచేసిన క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్, యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ మెంబర్స్, అధ్యాపక సిబ్బంది తదితరులు విజేతలను అభినందించారు. -
బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నంఅర్బన్: స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ టి. లీలా ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ టీటీకే రెడ్డి.. డాక్టర్ లీలా ప్రసాద్కు అప్పగించారు. ఈ సందర్భంగా లీలా ప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బడ్జెట్ అంశాలను ఉన్నతాధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సేవలు మరింత మెరుగుపరచడానికి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన విజయేంద్ర సరస్వతి స్వామీజీని ఆలయ ఈవో, చైర్మన్, స్థానాచార్య, ప్రధాన అర్చకులు, వేద పండితులు పాదాభివందనం చేసి సాదరంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న స్వామీజీ తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను, క్రతువులను స్వామీజీ పరిశీలించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంచి పీఠాధిపతి ఇంద్రకీలాద్రికి విచ్చేశారని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. దీనిలో ఫీడర్ లెవల్ సోలరైజేషన్, ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏజీఎల్ కనెక్షన్లు, వినియోగదారులకు ఇతర సర్వీసులు అందించాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలన్నారు. లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీడర్స్ బ్రేక్ డౌన్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్(టెక్నికల్) మురళీ కృష్ణయాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) వెంకటేశ్వర్లు, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు. మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు అడిషనల్ సొలిటర్ జనరల్, మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించు కున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
పన్నుల చెల్లింపులో అధికారులకు చుక్కలు చూపిస్తున్న బడాబాబులు
మండలం గృహాలు, డిమాండ్ వసూలైంది భవనాలు చందర్లపాడు 15,408 76.13 57.09 జగ్గయ్యపేట 17,265 473.4 247.74 కంచికచర్ల 17,963 391.4 208.97 నందిగామ 11,986 157.7 119.22 పెనుగంచిప్రోలు 14,046 173.9 104.34 వత్సవాయి 14,981 119.5 71.68 వీరులపాడు 12,998 79.83 64.08 ఎ.కొండూరు 11,296 54.33 33.53 గంపలగూడెం 17,104 146.7 76.62 రెడ్డిగూడెం 8,838 68.55 27.35 తిరువూరు 10,120 50.12 32.28 విసన్నపేట 13,152 152.3 82.59 జి.కొండూరు 15,142 244.2 145.45 ఇబ్రహీంపట్నం 11,036 423.5 202.6 మైలవరం 16,122 343.8 220 55,693 2444 1475 జి.కొండూరు: గ్రామాల్లో పన్నుల చెల్లింపులో పెద్దలు వెనుకంజలో ఉండగా.. తప్పించకోవడానికి ముందంజలో ఉన్నారు. ప్రసంగాల్లో నీతులు వల్లించే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇంటి పన్నుల చెల్లింపులో మాత్రం అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సామాన్యులను ముక్కుపిండి వసూలు చేసే అధికారులు.. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించని బడాబాబులను ఏమీ చేయలేక, రాజకీయ ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఇంటి పన్నులను బడాబాబులే ఎగవేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది చివరికి వచ్చినా పన్నుల వసూళ్లు పాత బకాయిలతో కలిపి 58 శాతం మాత్రమే పూర్తవడం ఆందోళనకరంగా మారింది. గ్రామ పంచాయతీలకు ఆదాయం లేక, స్టాంపు డ్యూటీ లేక, బడాబాబుల నుంచి ఇంటి పన్నుల వసూళ్లు కాకపోవడంతో కనీస మౌలిక వసతుల కల్పన లేక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించలేని దుస్థితి నెలకొంటోంది . ఎన్టీఆర్ జిల్లాలోని 16మండలాల పరిధిలో 288 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి చివరిరే రూ.53.99కోట్లు ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. దీనిలో పాత బకాయిలే రూ.11.97కోట్లు ఉంది. గతేడాది ఆగస్టు నుంచి ఇంటి పన్ను వసూళ్లు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు పాత బకాయిలు రూ.4.60కోట్లు, నూతన ఇంటి పన్ను రూ.27.08కోట్లు కలిపి మొత్తం రూ.31.68కోట్లను వసూలు చేశారు. ఇప్పటి వరకు పేద, మద్య తరగతి వారి నుంచి మాత్రమే ఈ ఇంటి పన్నును అధికారులు వసూలు చేయగలిగారు. విజయవాడ రూరల్ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పన్నుల వివరాలు రూ.లక్షల్లో నగర, గ్రామ ఆర్థిక వ్యవస్థకు పన్నులు ప్రధాన ఆధారం. అయితే ఇటీవల పన్నులు కట్టకుండా దారులు చూస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అధిక ఆదాయం కలిగిన పెద్దలు, సంస్థలు ఇంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం బడాబాబులు పావులు కదుపుతున్నారు. పన్ను చెల్లింపులో సామాన్యులు నియమాలు పాటిస్తుంటే.. పెద్ద ఆదాయ వర్గాలు పన్నుల నుంచి తప్పించుకోవడం ఆర్థిక సమానతకు సవాల్గా మారుతోంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. సామాన్యులను ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం ఎన్టీఆర్ జిల్లాలో 2025–26లో ఇంటి పన్ను డిమాండ్ మొత్తం రూ.53.99కోట్లు ఇప్పటి వరకు 58.69 శాతం మాత్రమే వసూలు ఇంకా వసూలు చేయాల్సిన పాత బకాయిలు రూ.7.37కోట్లు, నూతన పన్ను రూ.14.93కోట్లు కలిపి మొత్తం రూ.22.30కోట్లలో 20 శాతం మొండి బకాయిలు ఉండగా మరో 20 శాతం కార్పొరేట్ విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేయాల్సి ఉంది. వీరు రాజకీయ నేతల నుంచి ఫోన్లు చేయించడం, మాట్లాడించడం వంటి దారులతో పంచాయతీ అధికారుల చేతులు కట్టేస్తున్నారు. సంబంధిత అధికారులు వచ్చినా బడాబాబులు లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఇంటి పన్నును వసూలు చేసేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. -
సమాజంలో మహిళల సేవలు అమూల్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో మహిళలు అందిస్తున్న సేవలు అమూల్యమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను వీసీ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధి స్తున్నారన్నారు. అకడమిక్, పరిశోధన, నాయకత్వం వంటి అంశాల్లోనూ సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ మాట్లాడుతూ.. లింగ సమానత్వం అనేది ఒక లక్ష్యం కాదని, అది ఉమ్మడి బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన వర్సిటీ మహిళా ఉద్యోగులు ఎన్.బి.లక్ష్మి, వి.ఝాన్సీతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఎంఆర్యూ పరిశోధనల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవిప్రభు, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.ఎస్.కిరిటీ, పీఆర్ఓ వీరకిరణ్ను సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, సీఓఈ డాక్టర్ చక్కా శ్రీకాంత్, ఫైనాన్స్ ఆఫీసర్ టి.కృష్ణ, కె.ఎల్.ఆర్.కె.ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026ఎండీయూ వాహనం.. ● ఎండీయూ వాహనాలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ● ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న వాహనాల ఆపరేటర్లు ● వాహనాల ఆపరేటర్లకు భారంగా మారిన రుణాల చెల్లింపు 7జి.కొండూరు: పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరవేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు చేసింది. ఈ వాహనాలను నిలిపివేసిన ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీని తిరిగి డీలర్లకు అప్పగించింది. వాహనాలను రద్దు చేసినప్పుడు వాటి రుణాల బకాయిలను వెంటనే క్లియర్ చేసి వాహనాల ఆపరే టర్లకు క్లియరెన్స్ లెటర్లు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. రుణాలు తీరిపోతే వాహనం ఆపరేటర్ల సొంతమై వారు ఇతర వ్యాపారాలకు వినియోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు గొప్పల డప్పుకొట్టింది. అయితే వాహనాలను తొలగించి తొమ్మిది నెలలు గడిచినా రుణాల క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వాహనాలను వినియోగించని ఆపరేటర్లు, వాటిని విక్రయించే వీలు లేక లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గడువు కూడా ముగియడంతో రెన్యూవల్ చేయించలేక సతమతం అవుతున్నారు. వాహనాలను తొలగించే ముందు రెండు విడతలు ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్కు సైతం రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వాహనాలను తొలగించాకే రేషన్ మాఫియాకు రెక్కలొచ్చాయని ఎండీయూ ఆపరేటర్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పంపిణీ వాహనాలను గత ఏడాది మే నెలలో తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనంపై అప్పటి వరకు మిగిలి ఉన్న బ్యాంకు రుణం బకాయి రూ.1.5 లక్షలను ప్రభుత్వం ఒక్కసారిగా చెల్లించి ఉంటే బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చి వాహనం ఆపరేటర్ల సొంతమయ్యేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తుండడంతో బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ వాయిదాలు చెల్లించాల్సి ఉండటంతో వాహనా లకు క్లియరెన్స్ రావాలంటే ఆపరేటర్లు మరో ఏడాది పాటు వేచి ఉండక తప్పదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలకు వాహన మిత్ర పథకంలో వచ్చే సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీతో ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఇన్సూరెన్స్ను రెన్యూవల్ చేసేందుకు రూ.11,500 చెల్లించాల్సి రావడం ఆపరేటర్లకు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు చెల్లించాల్సిన ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్ రెండు విడతలుగా చెల్లించలేదు. ఈ రెండు విడ తలు కమీషన్ కలిపి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.14 లక్షల వరకు ఆపరేటర్లకు రావాల్సి ఉంది. దసరా ఉత్సవాల తరహాలో కుంభాభిషేకంరేషన్ మాఫియా గుట్టు రట్టు మచిలీపట్నంఅర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ టి.లీలాప్రసాద్ నియమితులయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఎస్పీవీ మెడికల్ కాలేజీలో ఈఎన్ టీఈ విభాగంలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. -
ఫిట్గా ఉంటేనే అన్నింటా ఫస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శారీరక, మానసికంగా ఫిట్గా ఉంటేనే అన్నింటా ఉత్తమ ఫలి తాలు సాధించగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో క్రీడా పోటీలను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలకుమారి, కన్వీనర్ పి.మాధవి తదితరులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ... క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎజ్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్.నాగమల్లేశ్వరి, ఎస్.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
నాలుగేళ్లపాటు ఉపాధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు 2021, జనవరి 21వ తేదీన ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్కరికి సుమారుగా రూ.6 లక్షల విలువైన వాహనాన్ని అందజేశారు. ఈ వాహనం ఖరీదులో పది శాతం మాత్రమే లబ్ధిదారులు ముందుగా చెల్లించారు. బ్యాంకు రుణాలను తీర్చేందుకు ఆయా కార్పొరేషన్ల నుంచి ఒక్కొక్క వాహనానికి నెల వాయిదా పద్ధతిలో రూ.6 వేలు, ఆపరేటర్ల వేతనం నుంచి రూ.3 వేలు చెల్లించేవారు. ఈ విధంగా ఆపరేటర్లకు నెలవారీ వాయిదా, సహాయకుడి వేతనం, డీజిల్ ఖర్చు కలిపి ప్రభుత్వం నుంచి నెలకు రూ.21 వేలు చెల్లించారు. ఈ విధంగా ఆపరేటర్లు రేషన్ పంపిణీని 15రోజుల్లో పూర్తి చేసి నెలలో మిగిలిన 15 రోజులు ఇతర పనులు చేసుకొని ఉపాధి పొందేవారు. నాలుగేళ్ల పాటు ఉపాధి పొందిన ఆపరేటర్లుకు చంద్రబాబు ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాలతో రేషన్ మాఫియా సాగుతోందని అసత్యాలు వల్లెవేస్తూ వాటిని తొలగించింది. ఇప్పుడు ఉపాధి పోయి ఆ వాహనాలకు తమ పేరుకు మారక, వాటిని విక్రయించే వీలు లేక, ఇన్సూరెన్స్ చెల్లించలేక ఆపరేటర్లు నరకయాతన పడుతున్నారు. -
డ్రగ్స్ ప్రమాదకరం
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్తో ఆరోగ్యానికే కాక భవిష్యత్తుకూ ప్రమాదకరమని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బుధవారం డ్రగ్స్ వద్ద బ్రో అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథి రవికృష్ణ మాట్లాడుతూ..తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడం విద్యార్థుల బాధ్యతన్నారు. పొగాకు, మద్యం, గంజాయి, హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాలకు ఒకసారి అలవాటు అయితే బయటపడటం కష్టమని హెచ్చరించారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ఈగల్ సీఐ రవీంద్ర, ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు, పలువురు అధ్యాపకులు, సుమారు 500 మంది మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు రథోత్సవం జరిగింది. అనంతరం వసంతోత్సవం, పూర్ణహుతి, చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారిని పల్లకిలో తిరువీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి ఏడు గంటలకు వేణు గోపాలస్వామి తెప్పోత్సవం జరిగింది. -
తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం
ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్లో బుధవారం జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జిచీఫ్ ఇంజినీర్ పి.అనురాధ ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భద్రతంటే ఒక రోజు పాటించే నియమం కాదన్నారు. దైనందిన జీవితంలో భద్రత ఒక భాగం కావాలని సూచించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వంటి కీలక విభాగాల్లో పనిచేసేటప్పుడు అప్రమత్తత కీలకమన్నారు. ప్రతి ఉద్యోగీ తనతో పాటు తోటి ఉద్యోగుల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్షణ పరికరాలు ధరించడంలో నిర్లక్ష్యం తగదని హితవుపలికారు. భద్రతా కమిటీ సభ్యులు, సిబ్బంది కలిసి భద్రతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న గోసంరక్షణ కేంద్రానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. మొగల్రాజపురం శాంతినగర్కు చెందిన కె.లీలాకుమారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యుడు రామబ్రహ్మంనకు దాతలు ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం
అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..మీడియా పాయింట్:లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులులడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాంశాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాంఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారుసభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారువైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారునిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారుతిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబువెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడుఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?వైఎస్ జగన్కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలిలడ్డూపై చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులుటీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్సీపీ ఆందోళనఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టుఏపీ శాసనమండలి రేపటికి వాయిదానెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావుజంతు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్ షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పింది2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల వెళ్లుంటారు కదాఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారుమీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారుటెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సప్లై చేశారులడ్డూపై ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారుహెరిటేజ్ పేరు తూమాటి ప్రస్తావించగానే ఉలిక్కిపడ్డ మంత్రులుతూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..మండలి ఛైర్మన్పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం మండలి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలుతాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్నతాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటితూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసింది. అడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారునెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పారు.2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సరఫరా చేశారు.బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి. టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్ ఆగ్రహం..టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహంసభలో వైఎస్సార్సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహంమండలిలో ఉద్రిక్తత.. ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ. మండలి చైర్మన్ ఆగ్రహం..తన మైక్ కట్ చేస్తున్నారంటూ చైర్మన్ ఆవేదన.మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్.చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.రూల్స్ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా మంత్రుల అరుపులు. మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.వైఎస్సార్సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.హెరిటేజ్ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ భోలే బాబా డెయిరీ ఎక్స్లెంట్ అంటూ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. మంత్రుల అత్యుత్సాహం..లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ యూనిట్.ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్ వైబ్సైట్ నుంచి ఇందాపూర్ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు.ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్ డెయిరీ తిరస్కరణకు గురైంది.టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.ఏఆర్ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.సీబీఐ చార్జ్షీట్లో క్లియర్గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.పర్వతరెడ్డి ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల. మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసుఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్సీపీప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.చైర్మన్ సీరియస్.. మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి. మండలిలో మంత్రుల రగడ.. చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్.చైర్మన్తో మంత్రుల వాగ్వాదం.మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్. చైర్మన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం. తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.ముందుగా స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం పట్టు.స్వల్పకాలిక చర్చలో స్టేట్మెంట్ అనేది ఉండదు: చైర్మన్మండలి నిబంధనలపై చైర్మన్ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు. మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతి. మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల భేటీ..శాసనమండలి చైర్మన్తో భేటీ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతిప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చముందుగా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసేలా నిర్ణయంగతవారం లడ్డుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునేడు తిరుమల లడ్డుపై చర్చకు ఆమోదం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారుగ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారుభూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదుగెజిట్లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారుబఫర్ జోన్ను 500 మీటర్లు చేశారుదేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదుమార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలికానీ అలా ఫాలో అవ్వడం లేదుసేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదుఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలిమండలి సమావేశాలు ప్రారంభం..ప్రారంభమైన శాసన మండలి సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభం -
మద్యం మత్తులో కానిస్టేబుల్పై యువకుల దాడి
కోడూరు: మద్యం మత్తులో కానిస్టేబుల్పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ చాణిక్య మంగళవారం తెలిపిన కథనం మేరకు.. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ జాతరలో పోలీసు కానిస్టేబుల్ పి.వేణుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా సోమవారం రాత్రి పిట్టల్లంక గ్రామానికి యువత డీజే ఏర్పాటు చేశారు. అయితే విశ్వనాథపల్లి గ్రామంలోకి వచ్చిన తరువాత డీజేకు సంబంధించిన సౌండ్ను తగ్గించాలని కానిస్టేబుల్ వేణుస్వామి నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న పిట్టల్లంక గ్రామానికి చెందిన యువకులు కోట మహేష్, కోట నరేష్ ‘మా డీజే సౌండ్ తగ్గించమంటావా’ అంటూ కానిస్టేబుల్ మెడ పట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ వేణుస్వామిని తోటి పోలీసులు హుటాహుటినా అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. గుడివాడరూరల్: ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని మోటూరు గ్రామంలో మంగళవారం జరిగింది. సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి మోటూరు గ్రామంలోని పంచా యతీ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు తాలూకా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెనమలూరు: మండలంలోని పోరంకిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పోరంకికి చెందిన జాస్తి శ్రీదేవి (48), దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్ నాలుగేళ్ల క్రితం మృతి చెందటంతో శ్రీదేవి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లిన శ్రీదేవి ఈ నెల ఒకటో తేదీన బయలుదేరి పోరంకికి వచ్చింది. సోమవారం ఇంట్లో బెడ్రూమ్లో శ్రీదేవి సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. అదే ఇంట్లో ఉంటున్న అత్త జాస్తి ఝాన్సీ ఉరికి వేలాడుతున్న శ్రీదేవిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మృతురాలి కుమార్తె మేఘనసాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఆదేశించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో ఇంటి, నీటి పన్నుల వసూలు ఆయన మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్ను పరిశీలించారు. ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నులు, పెండింగ్లో ఉన్న పన్నులు, మొత్తం లక్ష్యంపై ఆరాతీశారు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సైతం తమ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా చూసుకోవాలని స్థానికులకు సూచించారు. మీరు చెల్లించే పన్నలుతోనే గ్రామాభివృద్ధి సాథ్యమవుతుందన్నారు. అధికారులు పాల్గొన్నారు. -
దాడులు చేయించేందుకా దశాబ్దాల అనుభవం?
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిఇబ్రహీంపట్నం: సీఎం చంద్రబాబు దశాబ్దాల అనుభవం ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులను ప్రోత్సహించేందుకేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రభుత్వమే నేర వ్యవస్థను సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. జోగి రమేష్ ఇంటి పై ఘటన వీడియోలను చూస్తే ప్రభుత్వం, పోలీసులు కనుసన్నల్లో ఆ దుశ్చర్య జరిగి తీరు అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైనా ఇటువంటి దాడే జరిగిందన్నారు. దాడుల్లో మహిళలు కూడా పాల్గొని కొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొ న్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఎటుపోతుందనే అను మానం కలుగుతోందన్నారు. చంద్ర బాబు ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి, అవసరమైన సాక్ష్యాన్ని సృష్టంచే సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ సంస్కృతి భవిష్యత్లో కొనసాగితే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వింటే టీడీపీ ప్రభుత్వ తీరు తెలిసిపోతుందన్నారు. బడ్జెట్ మొత్తం అసత్యాలేనని ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు ‘నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా, రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.20 వేలు ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారని, ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. టీటీడీ లడ్డూపై మండలిలో చర్చ జరగకుండా అడ్డుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వమేనని విమర్శించారు. లడ్డూ విషయంలో వాళ్లే స్క్రిప్ట్ రాశారు, వాళ్లే దర్శకత్వం, వాళ్లే ప్రొడక్షన్, వాళ్లే హీరో, వాళ్లే విలన్, వాళ్లే జోకర్ అన్నీ వాళ్లే కదా అని ఎద్దేవాచేశారు. -
ఘనంగా నెమలి వేణుగోపాలుని కల్యాణం
గంపలగూడెం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రాజగోపాలాచార్యులు, పరాశరం విఖనసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. 250 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. కల్యాణ వేడుకలు తిలకించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువూరు, మధిర ఆర్టీసీ డిపోలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపాయి. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య, దేవాలయ పాలకమండలి చైర్మన్ కావూరి శశిరేఖ, కమిటీ సభ్యులు కొండపల్లి కొండలరావు, గరిడేపల్లి వెంకటరమణ, మోదుగు సుహాసిని పర్యవేక్షించారు. ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయ అధికారులు పదివేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధురానగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో రాజకీయాలు తగవని, సనాతన ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం మంటకలు పుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సోమవారం జరిగిన వివాదం హిందు వుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య జరుగుతున్న రాజకీయ గొడవలకు నెమలి వేణుగోపాల స్వామి కల్యాణం వేదికవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆలయాల్లో రాజకీయపరమైన ఘర్షణలు తలెత్తడం సర్వసాధార ణంగా మారిందని విమర్శించారు. భగవంతునికి భక్తితో సమర్పించే పట్టువస్త్రాల విషయంలో పదివేల మంది భక్తులు, అర్చక స్వాముల మధ్య ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఘర్షణ జరగటం దారుణమన్నారు. భక్తి భావంతో ఉండాల్సిన వేడుకలో తోపులాటలు, ఘర్షణలకు దేవస్థానం వేదికగా మారటం ఏమిటని ప్రశ్నించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం తెలిపారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జరిపిన దాడుల్లో 15 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణకు చెందిన గోదాంలో సుమారు 15 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని తదుపరి చర్యలు నిమిత్తం కంచికచర్ల ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎనిమిది వాహనాలను వీరులపాడు పోలీస్ స్టేషన్కు అప్పగించామని వివరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, నివేదికల ప్రకారం సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వలపై జరిపిన దాడిలో డీఎస్వో పి.వాణి, ఏఎస్ఓ వి.శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్లు బి.రామకృష్ణ, సీహెచ్. సుమతి, ఆర్ఐ కె.కిషోర్, స్థానిక వీఆర్వోలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరిపై అక్రమ కేసు నమోదు లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. ఏపీ మద్యం రవాణా కాంట్రాక్ట్పై సిట్ నమోదు చేసిన కేసు నుంచి తమను తప్పించాలని సిట్ విచారణాధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు బిస్కెట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయ వాడకు చెందిన భక్తుడు మంగళవారం సుమారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ను కానుకగా సమర్పించారు. నగరంలోని చెరువు సెంటర్కు చెందిన దొడ్ల నారాయణరావు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్ర కీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ.16.87 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు బిస్కెట్ను అమ్మ వారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. పెనుగంచిప్రోలు: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7.30 గంటలకు పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ తలుపులను కవాట బంధనం చేసి మూసి వేశారు. తిరిగి బుధవారం ఉదయం 5.30 గంటలకు గోపూజ, ఆలయ పరిసరాలు ఽశుద్ధి చేసి సంప్రోక్షణ అనంతర భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు గోపీబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నందిగామ టౌన్: చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నామని కనీస వేతనాలు అందించాలని అడిగినందుకు అక్రమ అరెస్ట్లు చేయటమేంటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కటారపు గోపాల్ పేర్కొన్నారు. విజయవాడలో శాంతియుత నిరసన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. తొలుత గాంధీ సెంటర్ నుంచి రైతుపేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోవడంతో పాటు కనీస వేతనాలు అందించాలని అడిగిన అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని.. మొండిగా వ్యవహరిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపీనాయక్, సయ్యద్ ఖాసిం, అంగనవాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సరళ, వెంకట్రావమ్మ, సుజాత, వేణు, పుల్లమ్మ, మహాలక్ష్మీ, పిచ్చమ్మ, అపర్ణ, లక్ష్మీ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
అన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. నగరంలో ఏలూరు రోడ్డులోని ఆదిత్య డెంటర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ బి.రాజీవ్, ప్రశాంతి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈవారంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్ల్లోనే అందుబాటులో ఉంటాయని, ఇతర అనధికారిక వెబ్సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. హాల్ టికెట్లను www. bre.ap.gov.in వెబ్సైట్, వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర 95523 00009 లేదా లీప్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేసి, హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికడదాం
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రోజురోజుకు చెలరేగుతున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ప్రజానీకం కృషి చేయాలని, యువత భవిష్యత్తును కాపాడాలని రౌండ్టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ‘గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు’ నినాదంతో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, పీఎన్ఎం, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు, ఐద్వా జాతీయ నాయకులు డి.రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందన్నారు. వాటి ప్రభావంతో యువతలో నేర ప్రవృత్తి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ ఇలా ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా చాక్లెట్, బిస్కెట్, టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈగల్ నివేదిక ప్రకారం ఒక్క సంవత్సరంలోనే 836 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, ఎంబీవిజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేందుకు నిష్పక్షపాతంగా కఠిన చట్టాలు అమలు చేయాలని, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్కుమార్, సామాజిక న్యాయ సంక్షేమ సంఘం చైర్మన్ బాలకోటయ్య, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు గోళ్ల నారాయణరావు, డాక్టర్ ఎం.సూర్యనారాయణ, శ్రీనివాస్, లంక గోవిందరాజు, ఆండ్ర మల్యాద్రి, విజయ్ ప్రకాష్, ఎ.సూర్యారావు పాల్గొన్నారు. ప్రజాసంఘాల రౌండ్టేబుల్ సమావేశం పిలుపు -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
నందిగామ రూరల్: ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మండలంలోని కొండూరు గ్రామ సమీపంలోని కూచి వాగు వద్ద మంగళవారం జరిగింది. కొండూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ లక్ష్మణరావు, అనూష దంపతులు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినకరన్ (15) మాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి, రెండో కుమారుడు దినేష్ ఏడో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పాఠశాలకు సెలవు కావటంతో ప్రభు కిషోర్, బంశీ, చరణ్, కుమార్తో పాటు మరో నలుగురు స్నేహితులతో కలిసి దినకరన్ కొండూరు–మాగల్లు గ్రామాల మధ్య ఉన్న కూచి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో దినకరన్ వాగులోని గుంతలో మునుగుతుండటాన్ని స్నేహితులు గమనించి కేకలు వేశారు. చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని దినకరన్ను బయటకు తీసి నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దినకరన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినకరన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. పట్టణంలోని మార్చురీ వద్దకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
త్రిశూలధారిణిగా నాంచారమ్మ
కోడూరు: కృష్ణాతీరంలోని విశ్వనాథపల్లి గ్రామం జనజాతరతో పోటెత్తింది. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ప్రధాన జాతరను పురస్కరించుకొని మంగళవారం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మ వారి పుట్టింటివారైన గుంటూరు, ప్రకాశం జిల్లాల భక్తులు నాంచారమ్మ తల్లి దర్శనానికి బారులు తీరారు. హైదరాబాద్, ఉభయగోదావరి, నల్లగొండ, బెంగళూరు, విజయవాడకు చెందిన భక్తులు కూడా ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వృత్తిరీత్యి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు కూడా విశ్వనాథపల్లికి చేరడంతో ప్రతి ఇంటా పండుగ శోభతో ఉట్టిపడింది. కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన రెండ్లు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నాంచారమ్మ తల్లికి ఒడుగంటి బియ్యం సమర్పించి ఆలయం వెనుక భాగంలో కదలకుండా అమ్మ నామస్మరణతో ప్రాణాచారం చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. దీంతో మహిళలు ఈ ప్రాణాచారం చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ప్రాణాచారం చేస్తున్న మహిళలపై భక్తులు పసుపు, కుంకుమ చల్లుతూ దీవెనలు అందించారు. కొంతమంది భక్తులు తమ పిల్లలను ఆలయం ఎదుట ధ్వజ స్తంభానికి కట్టిగా, మేనమామ వరుసవారు వేలం ద్వారా విడిపించుకున్నారు. పాలపొంగళ్లు, పట్టువస్త్రాలు, చీరలు, నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. యువకులు డప్పువాయిద్యాల నడుమ కోళ్లు, మేకపోతలను ఊరేగించి సమీప పోలాల్లో కుటుంబసమేతంగా సహపంక్తీ భోజనాలు చేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో నాంచారమ్మ అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. గ్రామోత్సవంలో ఉన్న చిన్న అమ్మవారిని కూడా ఆలయ ప్రవేశం చేయించారు. పండితులు శాస్త్రోక్తంగా పూజలు గర్భాలయానికి తాళాలు వేశారు. రాత్రి ఎనిమిది గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయ తలుపులు తెరిచి భక్తులకు యథావిధిగా దర్శనం కల్పించారు. ఆలయ ఈఓ తిక్కిశెట్టి వీరవెంకటమోహనరావు, ఆలయ కమిటీ చైర్మన్ తోట సూర్య నరసింహారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంతానం కోసం ప్రాణాచారం ఆలయం మూసివేత జాతర నేపథ్యంలో నాంచారమ్మ మూలమూర్తిని త్రిశూలధారిగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, భక్తుల సమర్పించిన చీరాలు, గాజులు, పూలదండలతో ముస్తాబు చేశారు. తల్లి దివ్యస్వరూపాన్ని తిలకించి భక్తులు పరవశించారు. క్యూలైన్లు మొత్తం భక్తజనంతో కిటకిటలాడాయి. మూలమూర్తిని భక్తులు స్వయంగా తాకే అవకాశభాగ్యం ఉండడంతో పలువురు భక్తులు బంగారు మంగళసూత్రాలు, అభరణాలను సమర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వమే కల్తీ మయం
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఇబ్రహీంపట్నం: చంద్రబాబు ప్రభుత్వమే కల్తీలకు నిలయంగా మారిందని రాయచోటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన్ను మంగళవారం శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను గద్దె దింపినప్పటి నుంచి ప్రజాబలం లేని చంద్ర బాబు మేనేజ్డ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. జోగి రమేష్, అంబటి రాంబాబు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇళ్లపై పోలీసులే దగ్గరుండి దాడులు, హింసను ప్రోత్సహించడం ఏమి సంస్కృతి అని ప్రశ్నించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక దాడులు చేసిన వారిని విడిచిపెట్టబోమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీచర్లకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇంతవరకు ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సచివాలయ వ్యవస్థ జగన్మోహన్రెడ్డి మానస పుత్రిక కాబట్టే నిర్వీర్యం చేయాలని చర్యలు చేపట్టారని దుయ్యబట్టారు. గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చేసిన చంద్రబాబే లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఊగిపోయారని ఎద్దేవాచేశారు. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్చిందన్నారు. -
నేటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల
పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు బుధవారం నుంచి ఎనిమిదో తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం 6.19 గంటలకు అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. ఐదో తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం, ఆరో తేదీ రాత్రి 10.02 గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, ఏడో తేదీ రాత్రి 7.32 గంటలకు తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 5.30 గంటలకు భక్తుల బోనాల సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నతిరునాళ్లలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఇన్చార్జీ ఈఈ భాస్కర్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయం చుట్టూ నాలుగు ఆర్ఓ ప్లాంట్లు నిత్యం భక్తులకు శుద్ధజలాన్ని అందిస్తాయన్నారు. వాటర్ ప్యాకెట్ల పంపిణీతోపాటు, ఆలయం చుట్టూ చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పుణ్య స్నానాల కోసం మునేరులో 300 షవర్లు ఏర్పాటు చేశామని, తాత్కాలికంగా మరుగుదొడ్లను సిద్ధం చేశామని వివరించారు. -
అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించండి
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కవి, రచయిత, సామాజిక విశ్లేషకులు జి. లక్ష్మీ నరసయ్య పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రథమ జాతీయ మహాసభలు మంగళవారం విజయవాడ సింగ్నగర్ గుజ్జల సరళ దేవి ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పీడీఎస్యూ జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రామకృష్ణ పీడీఎస్యూ బిగి పిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పి.టాన్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ఘాయల్, పరిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోశాధికారి ఎల్ .భాను సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ జాతి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఇ .విజయ్ కన్నా, యు. గనిరాజు తదితరులు పాల్గొన్నారు. -
పట్టు కోల్పోయారు!
చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలివోలు గ్రామానికి చెందిన చీడేపూడి లంకలో సొసైటీ కింద దళితులు పొలాలు సాగుచేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 80 మంది రైతులు 92 ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకాన్ని చేసేవారు. రూ.15వేల నుంచి రూ.20వేల పెట్టుబడితో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ లాభాలు పొందేవారు. రెండేళ్లుగా సంబంధిత శాఖ అధికారులు ప్రయివేటు వ్యక్తుల నుంచి పట్టు గుడ్లను కొని సరఫరా చేయడంతో నాణ్యత లోపించి పట్టు గూళ్లు తయారు కాకముందే పురుగులు చనిపోతున్నాయని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. మార్కెట్లో వీటిని ఎవరూ కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. తగ్గుతున్న సాగు ఈసారైనా లాభాలు రాకపోతాయా అని రైతులు ఆశపడటం, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అవే నకిలీ గుడ్లను పంపించడంతో రెండేళ్లలో ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. క్రమంగా పట్టుసాగుచేసేవారి సంఖ్య రెండేళ్లలో 80 నుంచి 12 మంది రైతులకు చేరింది. పట్టు సాగుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయినట్లేనని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్పందన లేక, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పట్టుపరిశ్రమ ఈ దుస్థితికి చేరిందని ఆరోపిస్తున్నారు. లాభాలతో కళకళలాడుతుండే పట్టు పరిశ్రమ రెండేళ్లుగా వెలవెలబోతోంది. అధికారులు నాణ్యతలేని పట్టు గుడ్లును సరఫరా చేయడం, గూళ్లు తయారయ్యే దశలో పురుగులు చనిపోవడంతో ‘చల్లపల్లి’ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తరచూ.. అవే గుడ్లను సరఫరా చేయడంతో రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి పట్టు పురుగుల పెంపకంపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది. నాణ్యతలేని పట్టు గుడ్లు ఇస్తున్నామనేది రైతుల అపోహ మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం అందించకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో పట్టు పురుగులు చనిపోతున్నాయి. –ఐ.శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణాజిల్లా సెరికల్చర్ అధికారి -
అద్భుతంగా నిర్వహిద్దాం
కుంభాభిషేకాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్న కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా, అద్భుతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఆలయ ఈవో వీకే శీనానాయక్ తదితరులు సమావేశంలో కుంభాభిషేక కార్యక్రమాలపై చర్చించారు. సామాన్యు భక్తులకు పెద్ద పీట కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కుంభాభిషేకానికి మొదటి రెండు రోజులు లక్ష మంది చొప్పున, మూడో రోజున 1.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. క్యూతో పాటు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన పాయింట్లలో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, శానిటేషన్ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగతో పాటు పులిహోర వంటివి అందించాలని ఆదేశించారు. జల్లు స్నానాల ఏర్పాట్లతో పాటు సెక్టార్ల వారీగా అధికారులు, సిబ్బంది బృందాలను నియమించాలని సూచించారు. వైద్య సేవల శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను క్రియాశీలకం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈవో వీకే శీనానాయక్.. కుంభాభిషేక విశిష్టత, మూడు రోజుల ప్రత్యేక కార్య క్రమాలు, భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్చి 6న యాగశాలలో ఉదయం 8 గంటలకు జరిగే యాగశాల ప్రవేశం దగ్గర నుంచి 8వ తేదీన ఉదయం 9:34 గంటలకు ప్రధాన ఆలయ ప్రాంగణంలో జరిగే కుంభాభిషేకం క్రతువు వరకు కార్యక్రమాలను వివరించారు. పవిత్ర కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి కరకమలములతో జరుగుతుందన్నారు. మూడు రోజులు ఉచిత దర్శనాలు ఉంటాయని, అంతరాలయం దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేస్తామని ఈవో వీకే శీనానాయక్ వివరించారు. సమావేశంలో విజయవాడ ఆర్డీఓ టి.వి.సతీష్, ఆలయ ఈఈలు ఎల్.రమ, కోటేశ్వరరావు, అడిషనల్ డీసీపీ జి.రామకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓపెన్ డీల్!
ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో కొన్ని స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందాకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సెంటర్ల నిర్వాహకులు పరీక్షలు పాస్ చేయిస్తామంటూ ‘డీల్’ కుదుర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి బదులు మరొకరిని పరీక్షలు రాయించడానికి పంపుతున్నారు. దీనికి నిదర్శనం పరీక్షల మొదటి రోజే అధికారులు ముగ్గురిని పట్టుకోవడం. అక్రమార్కుల దందా బట్టబయలైనా సంబంధిత శాఖ అధికారుల్లో స్పందన కానరావడం లేదు. దీనిలో ఉన్నతాధికారులకూ భాగముందనే ఆరోపణలు వస్తున్నాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో పలు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ‘డీల్’ కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పలు స్టడీ సెంటర్లు ‘ఓపెన్’గా దందాకు పాల్పడుతున్నాయి. లక్షలాది రూపాయలను దండుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసేందుకు నిర్వాహకులు ఒప్పందాలు కుదర్చుకొని లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దందాలకు సంబంధించి పలు స్టడీసెంటర్ల నిర్వాహకులు బహిరంగంగానే వీటిపై డీల్స్ మాట్లాడుకొని వసూళ్లకు తెగిస్తున్నారని పలువురు విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకూ జరుగుతాయి. జిల్లాలో పరీక్ష రాస్తున్న 1,288 మంది.. ఇంటర్ ఓపెన్ కోర్సులకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 1,288 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీటికి సంబంధించి జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లాలో సుమారుగా 30కు పైగా వివిధ స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరుకావాలని భావించే విద్యార్థులు అధిక శాతం మంది ఆయా స్టడీ సెంటర్లను ఆశ్రయించి డబ్బులు చెల్లిస్తుంటారు. వాటి నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు కడుతుంటారు. స్టడీసెంటర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడా పూర్తి స్థాయిలో తరగతులు జరిగిన దాఖలాలు లేవు. పాస్ గ్యారెంటీ పేరుతో దందా.. ఇంటర్మీడియెట్ పాస్ గ్యారెంటీ పేరుతో ఆయా స్టడీ సెంటర్ల నిర్వాహకులు కొందరు.. అధికారులతో కుమ్మకై దందాలకు పాల్పడుతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని సబ్జెక్ట్లు రాయకుండా పాస్ చేయిస్తామని, మీకు బదులు వేరే వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ డీల్ కుదుర్చుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. వీరు కొన్ని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతుంటారని ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన ఒకరిద్దరు ప్రముఖ స్టడీ సెంటర్ల నిర్వాహకులు, చక్రం తిప్పుతుంటారని, లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడటంతో పాటు అధికారులను సైతం ప్రభావితం చేస్తుంటారని వినవస్తోంది. ఇలాంటి దందాలకు కొన్ని ప్రత్యేక కేంద్రాలు ఈ పరీక్షల దందాకు ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. విజయవాడ నుంచి 50, 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయిస్తుంటారు. విజయవాడకు చెందిన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నందిగామ, జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసే కేంద్రాలకు హాజరవుతుంటారు. వీటిలో అక్రమాలు జరుగుతాయనే ప్రచారం ఉంది. దీన్ని తొలి రోజు జరిగిన పరీక్ష నిజం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది ఓపెన్ స్కూల్ పరీక్షలను నాటి డీఈవో చాలా వరకూ నిలువరించారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల్లో ఏదో ఒక బృందం తనిఖీ చేసే విధంగా చూడటంతో పరీక్షలు సజావుగా జరిగాయి. దాదాపు పరీక్ష ఫలితాలు పది శాతం కన్నా తక్కువ వచ్చాయంటే ఎగ్జామ్స్ చక్కగా జరిగినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ ఏడాది అధికారులు మారడంతో అక్రమార్కులు తమ దందాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తొలి రోజు ముగ్గురు బయట వ్యక్తులు లోపలకు వచ్చి పరీక్ష రాస్తున్నారంటే ఆ శాఖలోని అధికారుల హస్తాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి రోజు నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి అక్రమార్కులు చేపట్టిన దందా బట్టబయలైంది. పరీక్ష రాయాల్సిన ముగ్గురు అభ్యర్థుల కోసం వేరే వ్యక్తులు హాజరు కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం రూమ్ నంబర్ నాలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థిని గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ అతనిని పరిశీలిచి అసలైన అభ్యర్థి కాదని నిర్ధారించింది. అతనిపై నందిగామ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే నందిగామలో శ్రీ విద్య ఉన్నత పాఠశాలలో ఇద్దరు అభ్యర్థుల బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి రావడంతో పరీక్ష గదిలో ముందుగానే పసిగట్టి వారిని నిలువరించారు. -
రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
నాగాయలంక: మండలంలోని గుల్లలమోద ప్రధాన మార్గంలో పెదపాలెం అంబేడ్కర్ విగ్రహం సమీపంలో సోమవారం రెండు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన జన్ను రామాంజనేయులు (40) మృతి చెందాడు. నాగాయలంక ఎస్ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. రామాంజనేయులు ఏటిమొగ గ్రామం వెళ్తున్న సమయంలో ఎదురుగా ఈలచెట్లదిబ్బ గ్రామం నుంచి నాగాయలంక వైపు వస్తున్న చెన్ను నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ నాగ రాజు బైక్పై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో రామాంజనేయులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు, నాగేశ్వరరావు కూడా గాయపడ్డారు. అందరినీ హుటాహుటిన 108 అంబులెన్స్ వాహ నంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామాంజనేయులును మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లా లని అవనిగడ్డ వైద్యులు సూచించారు. అయితే బందరు ఆసుపత్రికి వెళ్ళేసరికి రామాంజనేయులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీడియో వైరల్: కేశినేని చిన్ని Vs కొలికపూడి.. మరో వివాదం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయితీ జరిగింది. కేశినేని చిన్ని చేతుల్లోని పట్టు వస్త్రాలను కొలికపూడి లాక్కున్నారు. కొలికపూడి చర్యతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేతలు కంగుతిన్నారు. కొలికపూడిని ఎంపీ చిన్ని వర్గీయులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా ఆలయ కమిటీ, భక్తులు అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు.కాగా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. మరోవైపు, పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి.. టీడీపీ అధిష్ఠానం వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కేశినేని చిన్నిపై కొలికపూడి పోస్ట్లు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి.. వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపాయి. -
విద్యార్థుల ప్రయోగాత్మక అభ్యాసనకు సన్నాహాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజ్ఞాన శాస్త్రం(సైన్స్) పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(అప్కాస్ట్) వినూత్న కార్యక్రమం చేపట్టింది. విజయవాడ భవానీపురంలోని అప్కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ (ఆర్ఎస్సీ)ను సందర్శించిన విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులు ఇప్పటి వరకు ఉన్న అనేక ఎగ్జిబిట్స్ ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇకపై ప్రయోగాత్మకంగా అభ్యసించేందుకు(ప్రాక్టికల్ లెర్నింగ్) సుమారు రూ.20 లక్షలతో 12 కంటైనర్లను ఏర్పాటు చేస్తుంది. అందుకు భవానీపురంలోని రీజనల్ సైన్స్ సెంటర్ వేదిక కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివిధ పరికరాలను ఆయా కంటైనర్లలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో కంటైనర్లో ఒక్కో థీమ్ (పరికరాలతో సహా)ను ఏర్పాటు చేయనున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే దిశలో సరికొత్తగా ఏర్పాటు చేస్తున్న కంటైనర్లు ఉపయోగపడనున్నాయి. -
విద్యాశాఖ కఠిన వైఖరి సరికాదు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంభిస్తున్న కఠిన వైఖరి సరికాదని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ బాబు విమర్శించారు. ఆదివారం మచిలీపట్నం ఎన్జీఓ హోంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. అనేక సందర్భాల్లో హాజరు సరిగా నమోదుకాకపోవడం, యాప్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, ఆ లోపాలన్నింటినీ ఉపాధ్యాయులపై మోపడం తగదన్నారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే పదో తరగతి పరీక్ష విధుల కేటాయింపులో చోటుచేసుకున్న అసంబద్ధాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు పి. ఇమ్మానియేల్, ప్రధాన కార్యదర్శి యువీ కృష్ణమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము ప్రసాద్, సతీష్ బాబు, సీనియర్ నాయకులు ఎంవీఎస్ఎన్ ప్రసాద్, కిరణ్ బాబు, వీరబాబు పాల్గొన్నారు. ఏపీజేఏసీ కృష్ణా జిల్లా కో చైర్మన్గా లంకేశ్వరరావు -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మైలవరం/రెడ్డిగూడెం: మామిడి పంట తెగుళ్లు బారిన పడి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లోని మామిడి తోటలను ఆదివారం రైతు సంఘం నాయకులు, రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అమర్ భవన్లో ఎం.మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మైలవరం, తిరువూరు ఎమ్మెల్యేలు నష్టపోతున్న మామిడి రైతుల గురించి చర్చించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు లక్షా ఇరవై వేలకు పైగా ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తున్న రైతులు పండించిన పంటకు నల్లదోమ, పేలు బారిన పడి పూర్తిగా మామిడి దెబ్బతినడం జరిగిందన్నారు. పంట నాణ్యత లేక దిగుబడి రాకపోవడంతో రైతులు మామిడి చెట్లను నరికేస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటరెడ్డి, పీవీ ఆంజనేయులు, జిల్లా నాయకులు వీరారెడ్డి, ధనలక్ష్మి, వి.వెంకటరెడ్డి, రావుల సుబ్బారావు, అప్పిరెడ్డి, కొండపల్లి పరమేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్ ఎస్ఈగా రవీంద్రబాబు
మచిలీపట్నంటౌన్: విద్యుత్ శాఖ కృష్ణాజిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా పి.రవీంద్రబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా పనిచేసిన వీవీ చిరంజీవి ఫిబ్రవరి 28వ తేదీ శనివారం ఉద్యోగ విరమణ చేయడంతో రవీంద్రబాబు ఉద్యోగోన్నతిపై బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎస్ఈ కార్యాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రబాబు ప్రస్తుతం విజయవాడ నగర విద్యుత్ శాఖ డీఈగా పనిచేస్తూ ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో కృష్ణా జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అంతరాయం లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఈ రవీంద్రబాబుకు విద్యుత్ శాఖ మచిలీపట్నం ఈఈ జి.గోవిందరావు, అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్టీఆర్ జిల్లా జేఏసీ ఏకగ్రీవ ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏకగీవ్రంగా ఎన్నికై ంది. ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డీఎస్ఎన్ రెడ్డి, కో–చైర్మన్లుగా పి.రమేష్ (జిల్లా కార్యదర్శి, ఏపీఎన్జీఓ సంఘం), జి. అనుగ్రహ ప్రసాద్(రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం), రామకృష్ణ (రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), ఉపాధ్యక్షులుగా జి. నారాయణరావు(పెన్షనర్ల సంఘం), ఎస్.కె. నవాబ్ జానీ(పీఆర్టీయూ), కె.ప్రభాకర్ (సివిల్ పెన్షనర్స్ సంఘం), జి.అజయ్ కుమార్ (మున్సిపల్ కార్పొరేషన్), ప్రధాన కార్యదర్శిగా ఎస్.డి.ఖాసిం (ఏపీటీ ఎఫ్–257), కార్యనిర్వహణ కార్యదర్శిగా జి.రామకృష్ణ (ఏపీఎన్జీఓల సంఘం) ఎన్నికయ్యారు. వీరితో పాటు సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
తలశిల చంద్రశేఖరరావుకు ఘన నివాళులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు దశదిన కర్మ కార్యక్రమం గొల్లపూడిలోని రఘురాం నివాసం వద్ద ఆదివారం జరిగింది. ఎంపీ మిథున్రెడ్డి, సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, విడదల రజని, మేరుగ నాగార్జున, కొడాలి నాని, కురసాల కన్నబాబు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ఎండీ రుహుల్లా, మొండితోక అరుణకుమార్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని తలశిల చంద్రశేఖరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, మేకా ప్రతాప్ అప్పారావు, వల్లభనేని వంశీమోహన్, ముదునూరి ప్రసాదరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ తలారి వెంకట్రావు, దేవభక్తుని చక్రవర్తి, కార్పొరేటర్లు, నగర నాయకులు పాల్గొని నివాళులర్పించారు. -
పొగ మంచు ఎఫెక్ట్.. గన్నవరంలో విమానాల చక్కర్లు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా సోమవారం ఉదయం రెండు విమానాల ల్యాండింగ్కు అంతరాయం నెలకొంది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో, ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు సమాచారం. -
లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్, విశ్వభారతి కళాశాల చైర్మన్ కొమరగిరి పద్మావతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


