Krishna
-
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆమె గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జే.జ్యోతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సిహెచ్.వీరాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్ పోటీల విజేత కృష్ణా బాలికలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్ 23 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల బాలురు, బాలికలు పాల్గొన్నారు. బాలురు విభాగంలో అనంతపురం జట్టు విన్నర్గా, చిత్తూరు రన్నర్గా నిలవగా మూడవ స్థానంలో తూర్పుగోదావరి జట్టు నిలిచింది. అదే విధంగా బాలికల విభాగంలో కృష్ణా విన్నర్స్గా, తూర్పు గోదావరి రన్నర్స్గా, మూడవ స్థానంలో పశ్చిమ గోదావరి జట్టు నిలిచాయి. విజేతలకు ఏపీ బాస్కెట్బాల్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, తదితరులు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. -
వక్ఫ్ భూములకు న్యాయం జరిగేనా..?
పెనమలూరు: కొండపల్లి ఖాజీకి చెందిన వక్ఫ్ భూములకు మోక్షం లభిస్తుందనే ఆశతో ముస్లిం మైనార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. గత 25 ఏళ్లుగా వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేసిన ఆక్రమణదారులు నయాపైసా కౌలు చెల్లించక పోవటంతో పేద ముస్లింల సఃక్షేమం జరగలేదు. సుదీర్ణ పోరాటం తరువాత ఈ నెల 11వ తేదీన వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయనున్నారు. కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇనామ్ భూములు వక్ఫ్ పరిధిలో ఉన్నాయి. పెదపులిపాక గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లో 12.59 ఎకరాలు, తాడిగడప గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 79లో 13.41 ఎకరాలు, 173లో 4.08 ఎకరాలు, 176లో 12.92 ఎకరాలు కలిపి మొత్తం 43 ఎకరాలు భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో భూముల ధర రూ.300 కోట్లకు పై మాటే. 43 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారు ఖాజీకి గాని, వక్ఫ్ బోర్డుకు గాని నయాపైసా కౌలు చెల్లించలేదు. దీంతో పేద ముస్లింలకు న్యాయం జరగలేదు. దీనిపై వక్ఫ్ బోర్డు, కొండపల్లి ఖాజీ పోరాట బాట పట్టారు. హైకోర్టు కూడా వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయాలని ఆదేశించింది. వేలం నిర్వహించాల్సిన రెవెన్యూ అధికారులు జాప్యం చేశారు. చివరకు ప్రభుత్వం కూడా ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించే యత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన పెనమలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూములకు కౌలు వేలంపాట నిర్వహించనున్నారు. వేలం నగదు రూపంలో ముందుగానే చెల్లించాలి. పాటదారులు రూ 50 వేలు డిపాజిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్రమణదారుల చెరలో భూములు న్యాయం కోసం ఎదురు చూస్తున్న పేద ముస్లింలు ఈ నెల 11వ వేలం పాట -
కంకిపాడు లాకులను పరిశీలించిన ఇంజనీర్ల బృందం
కంకిపాడు: సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఇంజనీర్ల బృందం గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు ఇరిగేషన్ సెక్షన్ను సందర్శించింది. ఇరువురు ఈఈల నేత్వత్వంలో పది మంది ఇంజనీర్ల బృందం కంకిపాడు లాకులు, అనుబంధ కాలువల లాకులు, గేట్లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించారు. లాకులు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నట్లు బృందం నిర్ధారించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాకులు నమూనాలను రూపొందించి పంపుతామని వెల్లడించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కాలువల పరిస్థితి, సాగు విస్తీర్ణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పరిశీలనలో ఇరిగేషన్ శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, మచిలీపట్నం డీఈ అపర్ణ, కంకిపాడు ఏఈ టీ.నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై నవగ్రహ పునఃప్రతిష్ట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం మండప పూజలు, మూలమంత్ర హవనం, అధివాసాలు వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం నవగ్రహ ప్రతిష్ట నిమ్తితం అవసరమైన యంత్రాలను ఆలయ అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మల్లేశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకు రాగా, కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో 7–52 గంటలకు నవగ్రహ పునఃప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట జరిగింది. అనంతరం నూతన యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ. ప్రసాద్, కోట ప్రసాద్ , మల్లేశ్వర శాస్త్రిలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాద వితరణ జరిగాయి. శుక్రవారం నుంచి నవగ్రహ మండపంలోని భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. -
‘హద్దులు’ దాటుతున్న దందా..
ఎన్టీఆర్ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్లకు అనుమతులున్నారు. అయితే పార్లమెంటు ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కాసరబాద, కంచికచర్ల మండలం వేములపల్లి రీచ్ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలంలో ఆలూరుపాడులో ఇసుక రీచ్ సైతం ఈయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి పార్లమెంటు ప్రజా ప్రతినిధి, ఈ ఇసుక రీచ్లను తన కనుసన్నల్లో ఉంచుకొని, లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. భారీగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ‘చినబాబు’ అండదండలు ఉండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. పేరుకే ప్రభుత్వం ఉచిత ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యునికి అందుబాటులో లేదని, ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. మండలంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఈప్రమాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో రాజమండ్రి వెల్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కిలేశపురం వద్ద నందిగామ నుంచి మచిలీపట్నం వెళ్తున్న కారును ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని కారు ఢీకొట్టడంతో రెండు వాహనాల మద్య కారు ఇరుక్కు పోయింది. కారులో ఉన్న నందిగామకు చెందిన ఆదిశేషు, పుష్పావతి వారి కుమారుడు సాయి శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. కుమార్తె హర్షిత, డ్రైవర్ రాంబాబుకు పెద్దగా గాయాలు కాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. బస్సును పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన మూడు బైకులను బస్సు డ్రైవర్ ఢీకొట్టి మరో ప్రమాదానికి కారణమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పిలుపునిచ్చారు. ప్రంపచ పర్యవవరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం విజయవాడ డివిజన్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేట్టారు. ఈ సందర్భంగా అధికారులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వచ్చంద సంస్ధల వలంటీర్లతో కలసి డీఆర్ఎం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా బ్యానర్లు, ప్లాకార్డులతో క్లాక్ టవర్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫాం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ వెయిటింగ్ హాల్ వద్ద పర్యావరణ హానికర ప్రభావాలను కళ్లకు కట్టినట్టుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ప్రదర్శన ఆలోచింపజేసింది. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ లక్ష్యాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను అందజేశారు. అనంతరం కృష్ణా కెనాల్లోని శిక్షణ కేంద్రంలో సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సీనియర్ డీఈహెచ్ఎం ఎం.కిషోర్, సీనియర్ డీఈ ఎస్.వరుణ్బాబులను ఆయన అభినందించారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ -
జిల్లాలో 2.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవం సందర్భంగా 2.60 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనంతో కళకళలాడుతూ జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో నగరంలోని సత్యనారాయణపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు కారణం వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడమేనన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని సూచించారు. భూమిపైనే కాక భవనాలపై మిద్దెతోటలను పెంచితే నగరాన్ని కాలుష్యం కోరలు నుంచి కాపాడుకోగలుగుతామన్నారు. మొక్కలు నాటి సంరక్షించేందుకు ముందుకు వచ్చే ప్రతిఒక్కరికీ అవసరమైన మొక్కలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందన్నారు. ర్యాలీలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈఈ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, సేఫ్ ఎన్విరాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధి ఏలూరి లీలా కుమారి, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
రసవత్తరం... చదరంగ సమరం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా చెస్ అసోసియేషన్, స్కాట్స్ పైన్ స్కూల్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చదరంగం క్రీడా సంబరాలు గురువారం రసవత్తంగా సాగాయి. రాష్ట్రంలోని 100 క్రీడాకారులను గ్రాండ్ మాస్టర్లుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన ఉచిత గ్రాండ్ మాస్టర్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ స్కూల్లో ఈ నెల రెండో తేదీన ప్రారంభించారు. రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఇండియా 11వ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రి (గుజరాత్) ఒకే సారి 100 మంది క్రీడాకారులతో చదరంగం క్రీడలో పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వరామంగా ఈ పోటీ కొనసాగింది. టాప్ రేటింగ్ క్రీడాకారులు కొల్ల భావన్(ఎన్టీఆర్ జిల్లా), కె.సందీప్ (కృష్ణా జిల్లా), సి.హెచ్.అనయ్య (రాజమండ్రి), వి.హర్షవర్ధన్ (నంద్యాల)తో పాటు 1600 నుంచి 1800 లోపు రేటింగ్ ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనటంతో పోటీ హోరాహోరీగా సాగింది. చదరంగ క్రీడాకారులను తయారు చేసేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న ఆంధ్రా చెస్ అసోసియేషన్ను, సహకరిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని బక్రి అభినందించారు. ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి సాయిపావని, ఆంధ్రా చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ పాల్గొన్నారు. -
కేడీసీసీబీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ (కేడీసీసీ) బ్యాంక్ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులైన నెట్టెం రఘురామ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన కేశినేని శివనాధ్ మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ పదవి ఆయనకు అలంకారం మాత్రమేనని, ఎందుకంటే గతంలోనే ఎన్నో పదవులు నిర్వర్తించి వివాద రహిత వ్యక్తిగా నిలిచారని అన్నారు. తన సుదీర్ఘ అనుభవంతో బ్యాంక్ను మరింత వృద్ధిలోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్రావు, శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు, నాగుల్మీరా తదితరులు పాల్గొని నెట్టెం రఘురామ్ను అభినందించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘరామ్ మాట్లాడతూ బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ -
తవ్వుకో తమ్ముడూ!
● ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆగని ఇసుక దందా ● లారీకి రూ.10వేలు కడితేనే లోడింగ్ ● నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దోపిడీ ● తెలంగాణకు అక్రమంగా తరలింపు ● పార్లమెంట్ ప్రజాప్రతినిధి అనుచరుల అండతోనే అంతా ● పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు ● ఇసుక దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఉచిత ఇసుక పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులే ఇసుక రీచ్లను గుప్పెట్లో పెట్టుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇసుక రీచ్లో లారీకి రూ.7 నుంచి రూ.10 వేలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తున్నారు. లారీకి 40 టన్నుల చొప్పున ఇసుకను ఓవర్ లోడ్ చేసి తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రోజుకు వందల లారీల ఇసుకను అక్రమ రవాణా చేస్తూ జిల్లా సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. టీడీపీ నేతలు చేసే దోపిడీకి మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు దగ్గరుండి పచ్చ జెండా ఊపుతున్నారు. రీచ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామని, టోల్గేట్ల వద్ద నిఘా పెట్టామని అధికారులు గొప్పలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే, ఇవన్నీ బూటకపు మాటలేనని స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్లు ఉన్నా ప్రాంతాల ప్రజలను ఎవ్వరినీ కదిపినా అక్కడ జరిగే దందాను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. పేరుకు ఉచిత ఇసుక అని చెప్పడం తప్ప, రీచ్ వద్ద మాత్రం వారి చెప్పినంతా డబ్బు కట్టాల్సిందేనని వివరిస్తున్నారు. లేకపోతే వారికి ఇసుక లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు వాపోతున్నారు. కొంత మంది ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కదారిలో పక్క రాష్ట్రానికి.. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంత ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం తదితర ప్రాంతాల్లో రూ. 75వేలు ఉండగా హైదరాబాద్లో రూ. లక్ష వరకు పలుకుతోంది. దీంతో టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.. ఆపేదెవరూ.. అడ్డొచ్చేదెవరు?కృష్ణా జిల్లాలో అడ్డూ అదుపూ లేకుండా.. కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇక్కడ ఉన్న రీచ్లను కూటమి ప్రజా ప్రతినిధులు పంచుకున్నారు. పెనమలూరులోని చోడవరం రీచ్ నుంచి అనధికారికంగా నియోజక వర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. లారీ లోడింగ్కు రూ.8వేలకు పైగా వసూలు చేస్తున్నారు. రొయ్యూరు ఇసుక రీచ్ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధి, రోజుకు వందల లారీలను పోర్టు పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకోవడం గమనార్హం. పామర్రు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్ వచ్చింది. ఈ రీచ్ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 300కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్లన్నింటినీ పచ్చనేతలు తమ కనుసన్నల్లో ఉంచుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీంతో పాటు చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను తరలిస్తున్నారు. -
మిస్ తెలుగు అమెరికా పోటీలో విజేతగా పెడన యువతి
పెడన: దక్షిణ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఇటీవల నిర్వహించిన మిస్ తెలుగు అమెరికా పోటీల్లో కృష్ణా జిల్లా పెడనకు చెందిన భవిరిశెట్టి ఆనందరావు, పావని దంపతుల కుమార్తె నీహారిక విజేతగా నిలిచిందని అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి (ఆప్స్) వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరి సత్యనారాయణ (చిన్న) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా న్యూయార్క్లో లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో నీహారిక ఎంఎస్ చదువుతోందని తెలిపారు. -
జీవనోపాధి అవకాశాల మెరుగునకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధి అవకాశాల మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కార్యాచరణపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్ర శక్తి, సీఐఎఫ్, ముద్ర, పీఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికీ వెళ్లి అర్హులు తగిన వ్యాపారాలు చేసుకునేలా బ్యాంక్ లింక్డ్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఆయా పథకాలకు గుర్తించిన లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు వ్యాపార మెలకువలపై శిక్షణ ఇవ్వాలని, ఉత్పత్తుల విక్రయానికి మార్గాలు చూపాలని, ఆన్లైన్ వ్యాపారంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో మహిళ తరఫున ఆమె భర్త లేదా కుమారుడు వ్యాపారం చేసుకునేందుకు ముందుకొచ్చినా పరిగణనలోకి తీసుకొని సహకారం అందించాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు అవగాహన కల్పించాలని, వారి ఎదుగుదలతో ఇతరులకు ఉపాధి కల్పించిన వారవుతారని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ అధికారి చిననరసింహులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షాహిద్ బాబు, మత్స్యశాఖ అధికారి నాగరాజు, పలువురు ఏపీ ఎంలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
ఇంతకూ బీచ్ ఫెస్ట్ నేటి నుంచా..రేపటి నుంచా?
మంగినపూడి బీచ్ ఫెస్ట్ ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండు విధాలుగా ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. నగరంలోని లక్ష్మీటాకీస్ సెంటర్లో బీచ్రోడ్లో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి బీచ్ఫెస్ట్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విడుదల చేస్తున్న ప్రకటనలు, కరపత్రాల్లో ఈ నెల 5వ తేదీ గురువారం నుంచే ప్రారంభమవుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుదాం అనుకునే వారు ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండుగా పేర్కొంటుండటంతో గందరగోళ పడుతున్నారు. –మచిలీపట్నంటౌన్ -
మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా
కోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది. మద్యం దందాలో ఆరితేరిన వ్యాపారులు కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని పెద్దఎత్తున మచిలీపట్నంకు దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని బార్లు, వైన్షాపుల్లో బహిరంగంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మచిలీపట్నంలో నాన్డ్యూటీ పెయిడ్ మద్యం ఏరులై పారుతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కొన్ని బ్రాండ్లకు సంబంధించి మద్యం ధరలు మన రాష్ట్రంలో కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి దొడ్డిదారిన సీసాలు దింపుకొని విచ్చలవిడిగా విక్రయాలు జరిపేస్తూ ప్రజా ధనాన్ని దోచేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు బందరు నియోజకవర్గంలో 9 రెస్టారెంట్ అండ్ బార్లు, తొమ్మిది వైన్షాపులు ఉన్నాయి. ఇటీవల బందరు మండలం సుల్తానగరంలోని ఓ వైన్షాపుపై ఎకై ్సజ్ అధికారులు దాడి చేసి ఎన్పీడీ బాటిళ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. కానీ అధికారులు అధికార పార్టీ నేతలకు భయపడి అవి వైన్షాపునకు సమీపంలోని ఓ బెల్టుషాపులో దొరికినట్టు చిత్రీకరించి కేసు నమోదు చేసి చూపించారు. అందుకు షాపు యజమాని నుంచి ఎకై ్సజ్ అధికారులకు భారీగా మామూళ్లు అందినట్లు సమాచారం. మరో ఘటనలో నగరంలోని ఓ జనసేన నాయకుడికి సంబంధించిన బార్లో అర్ధరాత్రి అమ్మకాలు జరుగుతుండగా నైట్రౌండ్స్లో ఉన్న ఓ పోలీసు అధికారి రైడ్ చేసి దాదాపు 250కి పైగా సీసాలను పట్టుకున్నట్లు సమాచారం. అయితే సదరు బార్ యజమాని సంబంధిత పోలీసుస్టేషన్కు ఇచ్చే నెలవారీ మామూళ్లను అందరి ఎదుట ఎండగట్టటంతో పాటు జనసేన పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడితో ఫోన్ చేయించి బాటిళ్లు పట్టుకున్న అధికారిని గజగజలాడించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది లేక ఆ అధికారి అర్ధరాత్రి అమ్మకాలు జరుపుతున్నట్లు కేసు నమోదుచేసి పట్టుకున్న బాటిళ్లు మొత్తం బార్లోకి పంపినట్లు మద్యం వ్యాపారులు చెప్పుకుంటున్నారు. ఈ కేసుకు సంబంఽధించి సంబంధిత అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ప్రచారం లేకపోలేదు. గత సోమవారం విజయవాడకు చెందిన స్పెషల్ టీంలు మచిలీపట్నంలోని బస్టాండ్ సెంటర్, విజయవాడ రోడ్డులోని బార్లపై దాడులు చేసి చివరికి ఏమీ లేవని తేల్చి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే సదరు షాపుల్లోనూ ఎన్పీడీ బా టిళ్లను గుర్తించిన అధికారులు పెద్ద మొత్తంలో సంచులు అందుకుని ఆ రెండు బార్లకు గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి నట్లు తెలుస్తోంది. 300కు పైగా బెల్టు షాపులు బందరు నియోజకవర్గంలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బార్, వైన్షాపులతో పాటు దాదాపు 300కు పైగా బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారం. సదరు బెల్టుషాపులకు ఎన్పీడీ బాటిళ్లను సరఫరా చేసి బెల్టుషాపు నిర్వాహకుల ద్వారా వ్యాపారులు అమ్మిస్తున్నారు. అలా పట్టణంతో పాటు పల్లెల్లోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఏరులై పారుతోంది. ఇదంతా ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి నెలా లక్షల్లో ముడుపులు మచిలీపట్నంలోని మద్యం దుకాణాల్లో జరి గే అక్రమ మద్యం అమ్మకాల వైపు చూడకుండా ఉండేందుకు బందరు సిండి‘‘కేటు’’లు సంబంధిత అధికారులకు లక్షల్లో పారితోషికాలు అందజేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఎన్పీడీ అమ్మకాలతో పాటు సమయ పాల నతో సంబంధం లేకుండా చేసుకునే వ్యాపారానికి అడ్డురాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఎకై ్సజ్ శాఖకు ఒక్కో దుకాణం తరఫున రూ.20,000 చొప్పున అన్ని షాపులకు సంబంధించి నెలకు రూ. 3,60,000, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఒక్కో దుకాణం తరపున రూ.8,000 చొప్పున రూ.1,44, 000, ఇతర సిబ్బందికి రూ.6,000 చొప్పున రూ.1,06,000 ముట్టజెబుతున్నట్లు సిండికేట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అడ్డగోలు అమ్మకాలతో జనం ధనం దోపిడీ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు దిగుమతి బార్లు, వైన్షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ విక్రయాలు మామూళ్ల మత్తులో జోగుతున్న ఎకై ్సజ్ అధికారులు మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో మద్యంమాఫియా పేట్రేగిపోతోంది. మన రాష్ట్రం నుంచి అందుతున్న మద్యం చాలదన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుని మరీ అమ్ముకుంటోంది. సామాన్యుడిని మద్యం మత్తులో ముంచి మద్యం మాఫియా, ఎకై ్సజ్ అధికారులు కలసి కోట్లు కొల్లగొడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. -
బందోబస్తును పకడ్బందీగా నిర్వర్తించండి
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కోనేరుసెంటర్: మసూల బీచ్ ఫెస్టివల్ బందోబస్తును సమర్థంగా, పకడ్బందీగా నిర్వర్తించి పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి బుధవారం ఆయన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బీచ్ అవుట్ పోస్టు పోలీస్స్టేషన్ వద్ద బందోబస్తు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ ముగింపు వరకు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జనం భారీగా తరలివస్తారని ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రీడా పోటీలకు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు హాజరవుతారని, వారి రాకపోకలకు, భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఆ దిశగా బందోబస్తును నిర్వర్తించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పాయింట్లలో ఉంటూ నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లలో ఉన్న సిబ్బంది వచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసేలా చూడాలని, ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విరివిగా మొక్కలు నాటాలి
చిలకలపూడిమచిలీపట్నం): విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం జిల్లా వ్యాప్తంగా 2.92 లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంక్షేమ శాఖ వసతి గృహాల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఇరువురు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న నర్సరీల నుంచి వివిధ రకాల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నర్సరీ నుంచి 7 వేల మొక్కలు, పెడన మండలంలోని నందమూరు నర్సరీ నుంచి 40 వేలు, సరుగుడు మొక్కలు 1.5 లక్షలు, గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెం నర్సరీ నుంచి 50 వేలు, గూడూరు మండలం గూడూరు నర్సరీ నుంచి 10 వేల మొక్కలు అందిస్తామన్నారు. జూన్ 5వ తేదీ నుంచి జరగనున్న మసుల బీచ్ ఫెస్టివల్ ఉత్సవాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి శ్రీనివాసరావు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా గుడ్డతో తయారు చేసిన సంచులను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా అటవీ శాఖ అధికారి సునీత, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ షాహిద్ బాబు, డీటీడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, పశుసంవర్థక శాఖ అధికారి చిన నరసింహులు, మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జి.కొండూరు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లికి చెందిన వీసా రాజేష్(26) గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులను చూసేందుకు సొంత గ్రామానికి వెళ్లిన రాజేష్, తిరుగు ప్రయాణంలో మైలవరం వైపు వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జి.కొండూరు శివారులోకి రాగానే 30వ నంబరు జాతీయ రహదారిపై గేదెను ఢీకొని కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ని జి.కొండూరు పోలీసులు 108 అంబులెన్స్లో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ బుధవారం ఉదయం మృతి చెందాడు. చీకట్లో గేదె కనిపించక... రహదారిపై గేదెను భారీ వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి చెంది రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో అటుగా బైకుపై వస్తున్న రాజేష్కు రోడ్డుపై మృతి చెందిన గేదె చీకట్లో కనిపించక ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి వీసా భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. -
వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి అరాచకాలతో సాగింది. ఎటు చూసినా మోసం.. కుడి ఎడమల దగా అన్నట్లుగా పాలకుల తీరు నడిచింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలతో ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఏ విద్యార్థి కనిపించినా తల్లికి వందనం కింద...‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’ అంటూ వేలు పెట్టి మరీ చూపించి ఆశలు రేపారు. ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైన తీరు, ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ బుధవారాన్ని ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించి.. నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. సిగ్గులేని ప్రభుత్వాన్ని నిగ్గదీసి కడిగేసేందుకు సమాయత్తమైంది. –8లోuచిలకలపూడి(మచిలీపట్నం)/అవనిగడ్డ:జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక దోపిడీకి కూటమి నాయకులు తెరలేపారు. దీంతో పాటు మట్టి తవ్వకాలపై దృష్టి సారించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ వనరులను అక్రమంగా విక్రయిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. మరో పక్క జిల్లాలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. మద్యం దుకాణాల ఏర్పాటులో కూటమి నాయకులకు పెట్టుబడులు లేకుండా వాటాలు తీసుకోవటం.. ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. హామీలపై గాలి మాటలు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు తేవటంతో పాటు నిధులు కేటాయించి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన బందరు పోర్టు నిర్మాణాన్ని కూడా వారి ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2026 నాటికి పోర్టు పనులు మేమే పూర్తి చేస్తామని చెబుతుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. దీంతో పాటు మచిలీపట్నం నగరంలోని డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పిన నాయకులు నేడు ఆ హామీని మరచి సంబరాలు చేసుకునేందుకే ప్రాధాన్యత నిస్తున్నారు. మసులా బీచ్ ఫెస్టివల్ పేరుతో దోచుకునేందుకు తెరలేపారు. 22ఏ నిషేధిత భూముల సమస్య మళ్ల్లీ మొదటికి.. గతంలో ఆనాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు చొరవతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిష్కరించిన 22ఏ నిషేధిత భూముల సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. గతంలో చంద్రబాబు హయాంలో తలెత్తిన ఈ సమస్యను జగన్మోహన్రెడ్డి పరిష్కరించగా, అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లా చుక్కెట్టారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో 17వేల మంది రైతు కుటుంబాలు చేతిలో లక్షల ఖరీదు చేసే పొలాలున్నా అవసరాలకు అక్కరకు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను దున్నేస్తున్నా పట్టించుకోలేదు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోపిదేవి మండలంలోని పలు ప్రాంతాల్లో పండించిన పంటను కొనే నాథుడు లేక క్యాబేజీ పంటను రైతులు దున్నేశారు. బజ్జీ మిర్చి, టమాటాను కోసి రహదారుల పక్కన పారబోశారు. గత ఖరీఫ్లో పండించిన ధాన్యంను కొనే దిక్కులేక రహదారుల వెంట రోజుల తరబడి పడిగాపులు పడ్డారు. మంత్రి నాదెళ్ళ మనోహర్ హామీ ఇచ్చినా లంకపల్లిలో నెలరోజులకు ధాన్యం కొనుగోలు చేయక కొంతమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుమొండి వారధి ఊసేలేదు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ వారఽధి కోసం రూ.108 కోట్లు నాబార్డు నిధులు మంజూరవ్వగా అప్పటికే పార్టీ మారే ఉద్దేశం ఉన్న బాలశౌరి ఎక్కడ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు పేరొస్తుందని దానిని అడ్డుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎదురుమొండి వారధి నిర్మాణం వెంటనే చేపడతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ ఈ వారధి ఊసే ఎత్తకపోవడం పట్ల దీవుల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే గత ఏడాది వచ్చిన వరదలకు నాలుగు సార్లు ఎడ్లంక కాజ్వే రహదారి కొట్టుకుపోయినా పట్టించుకున్న పాపాన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. న్యూస్రీల్సూపర్సిక్స్ అంటూ అరచేతిలో వైకుంఠం ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని కూటమి ప్రభుత్వం ఓటు వేసిన ప్రజానీకానికి వెన్నుపోటు కూటమి మోసాలను ఎండగడుతూ నేడు వైఎస్సార్సీపీ నిరసన జిల్లా వ్యాప్తంగా ప్రజా భాగస్వామ్యంతో నిర్వహణకు ఏర్పాట్లుఎడతెగని వంచనఏడాది పాలన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) పర్యవేక్షణలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వ నయవంచన పాలనపై వినతి పత్రాలు అందజేయనున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పార్టీ కన్వీనర్ పేర్నికిట్టు నేతృత్వంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన పట్టణంలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకూ తరలి వెళ్లనున్నారు. నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కన్వీనర్ సింహాద్రి రమేష్ నేతృత్వంలో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో గడివాడ పట్టణంలోని ఎన్జీవో హోం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ నేతృత్వంలో ఆర్డీఓ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. పామర్రు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ కన్వీనర్ కై లే అనిల్కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లనున్నారు. పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడులో కల్యాణ మండపం నుంచి పార్టీ కన్వీనర్ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. -
ఎగనామం
సూపర్ సిక్స్కు సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో ఇళ్ల స్థలాల సాధన కోసం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారం దక్కిన తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారన్నారు. సొంత అజెండాతో పాలన సాగిస్తూ పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. మాట మార్చడం చంద్ర బాబుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. – గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) -
అంకితబావంతో పని చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఆమె చాంబర్లో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలో విధి నిర్వహణలో పని చేస్తూ అనారోగ్య కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వాటిని భర్తీ చేశామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులను పారదర్శకంగా ఇచ్చి, వారు కోరిన ప్రాంతాలకు బదిలీ చేశామని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా ఏడుగురికి, సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఏవోలుగా ఇద్దరికి నియామక పత్రాలు అందజేశామన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఒకరిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జెడ్పీ సీఈవో ఎ.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్.సి. ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో పనిచేయాలి.. చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అకస్మాత్తుగా మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు కల్పిస్తూ నియామక పత్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం రాత్రి అందజేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖలలో 8 మందికి జూనియర్ అసిస్టెంట్లుగాను, ఇరువురికి ఆఫీసు సబార్డినేట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంకితభావంతో అప్పగించిన విధులను నిర్వర్తించి పనిచేస్తున్న శాఖలలో అధికారుల మన్ననలను పొందాలని వారికి కలెక్టర్ సూచించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవీఓ సీహెచ్ వీరాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక -
11న వక్ఫ్ భూములకు కౌలు వేలం
పెనమలూరు: మండల పరిధిలోని వక్ఫ్ భూములకు ఈ నెల 11వ తేదీన కౌలు వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వక్ఫ్ భూములపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో కొండపల్లి ఖాజీ సర్వీసుకు చెందిన వక్ఫ్ భూములు వివిధ సర్వే నంబర్లలో 43.23 ఎకరాల సాగు భూమి ఉంది. చాలా కాలంగా ఈ భూములకు కౌలు వేలం నిర్వహించలేదు. కొందరి కబంధ హస్తాల్లో ఈ భూములు చిక్కుకుపోయాయి. అదేవిధంగా కౌలు సొమ్ము కూడా వక్ఫ్ బోర్డుకు చెల్లించలేదు. హైకోర్టు ఆదేశించినా కౌలు వేలం నిర్వహించడానికి అధికారులు జాప్యం చేశారు. చివరకు ఈనెల 11న తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలకు వక్ఫ్ భూముల కౌలు వేలం నిర్వహిస్తామని తహసీల్దార్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చారు. -
ఎన్డీయే కూటమి మార్కేది
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించారు. ప్రజా సంక్షేమాన్ని గాడిలో పెట్టి అనేక సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల వారికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఫీజులు అందించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. కాని నేడు ఎన్డీయే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ప్రజా సంక్షేమ మార్కు అనేది కనిపించడం లేదు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితి. – ఎండీ ఖాజా, మున్సిపల్ వైస్ చైర్మన్ పెడన -
పారదర్శకంగానే బదిలీల ప్రక్రియ
పామర్రు: బీసీ సంక్షేమ శాఖలో పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్, పామర్రు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోరల్ అధికారి జి.రమేష్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీఓను అనుసరించి వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల బదిలీలకు అర్హత గల వారి వివరాలను గత నెల 30న జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. వార్డెన్లు బదిలీలపై ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. అదే విధంగా కొందరు మహిళా వార్డెన్ల్పై బెదిరింపులకు పాల్పడుతున్నారనే సమాచారం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని పేర్కొన్నారు. -
టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మండంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. బాపట్ల జిల్లా, బాపట్ల మండలం గుడిపూడికి చెందిన వెంపరాల ఆంజనేయులు (45), వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు(డ్రైవర్) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు కిలేశపురం వద్ద అదుపుతప్పి ముదువెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ముందుసీటులో కూర్చున్న వెంపరాల ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రెండు 108 అంబులెన్సులు, ఒక హైవే టోల్గేట్ అంబులెన్స్లో విజయ వాడ వైద్యశాలకు తరలించారు. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకరు మృతి, మరో నలుగురికితీవ్ర గాయాలు తిరుపతమ్మ దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం -
యోగాతో శ్రామికుల్లో నూతనోత్సాహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం శారీరక శ్రమ చేసే కార్మికుల్లో యోగా సాధన నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, కార్మిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల థీమ్ యోగాసనాల కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, ఉపకార్మిక కమిషనర్ సీహెచ్.ఆశారాణి, వీఎంసీ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ కార్మికులతో కలిసి యోగ సాధన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రోగాలబారిన పడకుండా ఉండటంతో పాటు మానసికంగా నూతన ఉత్తేజాన్ని పొందేందుకు యోగాను మించి దివ్య ఔషధం మరొకటి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు యోగాసనాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్య నారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు తప్పడం లేదు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం దేవస్థానం రూ.8 లక్షలతో గాలిగోపురం వద్ద స్టేర్ లిఫ్ట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆలయ ఇంజినీరింగ్ అధికారుల అల సత్వం కారణంగా నాణ్యత లేని స్టేర్ లిఫ్ట్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. 15 రోజుల కిందట అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తామంటూ టెక్నికల్ సిబ్బంది స్టేర్ లిఫ్ట్ను తీసుకెళ్లారు. అయితే ఇంత వరకు ఆ లిఫ్ట్ సంగతిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దివ్యాంగుడి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆ దివ్యాంగ భక్తుడిని వీల్చైర్పై అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు. ఆలయంలోకి వెళ్లాలంటే గాలి గోపురం వద్ద మెట్లు దిగాల్సిందే. అక్కడ స్టేర్ లిఫ్ట్ లేకపోవడంతో వీల్చైర్పై వచ్చిన ఆ దివ్యాంగుడిని ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది, సేవా సిబ్బంది నలుగురు కలిసి మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. కనీసం ఇటువంటి వారిని చూసేనా ఆలయ అధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేమని రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదరణ కల్పించేందుకు కర్నాటకలో వీర రత్న ఫౌండేషన్ను స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీర నారీమణులను చైతన్యవంతులను చేసే అవగాహన కార్యక్రమాన్ని విజయవావడలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు కావాల్సిన వనరులను అందించి, వారి కుటుంబాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు వీర రత్న ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. సైనికుల పిల్లల చదువు, ఆరోగ్యం, ఇతర విషయాల్లో సహాయ, సహాకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈఓ అర్చన చక్రవర్తి, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి -
ఏసీబీకి చిక్కిన డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
చిలకలపూడి(మచిలీపట్నం): డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మంగళవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు కథనం మేరకు.. మచిలీపట్నం నగరానికి చెందిన శ్రీజ టింబరు డిపో యాజమాని వి.రవీంద్రనాథ్ టింబరు డిపో రెవెన్యూవల్ కోసం రెండు నెలల కిందట ఆటవీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించి రెన్యూవల్ చేయాలంటే రూ.25 వేల లంచంగా ఇవ్వాలని ఆటవి శాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.జయప్రకాష్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం రెన్యూవల్కు దర ఖాస్తు చేశానని, రూ.25 వేలు ఇవ్వలేనని రవీంద్ర నాథ్ తేల్చిచెప్పాడు. దీంతో రెన్యూవల్ చేసేందుకు జయప్రకాష్ ససేమీరా అన్నారు. చివరకు రూ.18 వేల లంచం ఇచ్చేలా రవీంద్రనాథ్ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం జయప్రకాష్ తనను లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులను రవీంద్రనాథ్ ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రవీంద్రనాథ్ రూ.18 వేలను నగరంలోని ఆనందపేటలో ఉన్న ఆటవీశాఖ కార్యాలయంలో జయప్రకాష్కు అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసివున్న ఏసీబీ అధికారులు జయ ప్రకాష్ చేతిలో నగదు ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జయప్రకాష్ చేతి వేలిముద్రలు, నగదు నోట్లుపై ఉన్న వేలిముద్రలు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. జయప్రకాష్పై 2017లో ఆటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్న సమయంలో ఏలూరులో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని, ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. టింబరు డిపో రెన్యూవల్ కోసం రూ.18 వేల లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పాత ఇనుప సామగ్రి దగ్ధం
నందిగామ టౌన్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో పాత ఇనుప సామగ్రితోపాటు ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన నందిగామలో మంగళవారం జరిగింది. పట్టణంలోని యాదవ బజార్లో తమ్మిశెట్టి యలమందయ్య తన ఇంటి వద్దే పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యుత్ మీటరు బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా విద్యుత్ తీగలు దగ్ధమవటంతో భవనం మొదటి అంతస్తులో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, దట్టంగా పొగలు కమ్మి, మంటలు ఎగసిపడటాన్ని గమనించారు. వెంటనే కిందకు వచ్చి అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. కంచికచర్ల అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది నరసింహారావు తెలిపారు. -
4.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
అవనిగడ్డ: రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో పలుసార్లు అక్రమ రవాణాదారులను పట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దందా యథాతథంగా సాగుతోంది. అవనిగడ్డలో మంగళవారం తెల్లవారు జామున 4.5 టన్నులు రేషన్ బియ్యాన్ని ఎస్ఐ శ్రీనివాస్ పట్టుకున్నారు. తెల్లవారు జాము 4.30 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా, రాజీవ్ గాంధీ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో నివసించే కూతాడి వెంకన్నకు చెందిన వాహనంలో 2.50 టన్నులు, అవనిగడ్డలో నివసించే కోసూరు రాజారావుకు చెందిన వాహనంలో రెండు టన్నులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం వచ్చిన సంచులను వచ్చినట్టుగానే అక్రమ రవాణా చేయడం కొసమెరుపు. కనీసం సంచులు కూడా మార్చకుంగా రవాణా చేస్తున్నారంటే అక్రమ దారులు ఎంత ధీమాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. -
గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టం అమలుపై సమన్వయ శాఖల అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో మునిసిపల్, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్ధక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాల ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం గోవధ నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డీపీఓ పి.లావణ్యకుమారి, గో సంరక్షణ సమితి ఐకాస సభ్యులు తోట సురేష్, నాగలింగం శివాజి, పోతురాజు వినోద్రాజ్ పురోహిత్, గోవిందసాబు, మిరి యాల శ్రీనివాసరావు, బాలకృష్ణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా సీ్త్ర, పురుషుల జట్లను నూజివీడులోని వీటీహెచ్ మైదానంలో సోమవారం ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు జి.సుభాష్చంద్రబోస్ తెలిపారు. పురుషుల జట్టుకు జి.నాగబాబు, ఎస్కే యాసిన్, ఎ.తేజ, బి.సంజయ్శ్రీనివాస్, మహిళల జట్టుకు బి.ప్రభుదీపిక, షేక్ అస్రా, బి.ప్రణవి, బి.కుసుమ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు. ‘ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారా ?’ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్ఓ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ ఉచిత వైద్యం, వైద్య విద్య అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి, ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచిందన్నారు. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను, వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నాయని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా జరిపిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, భవనాలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నొవేషన్ హబ్ పనులను త్వరగా పూర్తి చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రామవరప్పాడు: స్టార్టప్లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఇందుకు సంబంధించి స్పోక్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టాటా ఇన్నొవేషన్ హబ్– స్పొక్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యాలయం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎనికేపాడులో భవనాన్ని సోమవారం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐహెచ్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాలుగైదు రోజుల్లో నాలుగో అంతస్తులోని ఒక బ్లాకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హబ్కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్దారు బి. సుగుణ, ఆర్ అండ్బీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ
మీ కోసంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని, ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను సామరస్యంగా ఆలకించిన ఆయన పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. 38 అర్జీలు అందజేత.. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ కోసంకు వచ్చే బాధితులకు పోలీసులు అండగా ఉంటారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని బాధితులు సమీపంలోని డీఎస్పీ, సీఐ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లలోనూ తమ సమస్యలను వివరించి, న్యాయం పొందవచ్చని చెప్పారు. అలాగే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. తన దృష్టికి అవినీతి ఆరోపణలు వస్తే తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవనిగడ్డకు చెందిన ఓ వివాహిత వివాహ సమయంలో తల్లిదండ్రులు తనకు కొంత వ్యవసాయ భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా అన్నదమ్ములు ఇప్పుడు ఆ భూమి తమదంటూ అడ్డు పడుతున్నారంటూ వాపోయింది. అదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ వాపోయింది. న్యాయం చేయాలని కోరింది. అలాగే మచిలీపట్నంకు చెందిన మరో వ్యక్తి తన పొలం సరిహద్దుదారుడు తరుచూ తనతో గొడవలు పడుతూ మానసికంగా హింసిస్తున్నాడని, చెప్పలేని పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి దిగుతున్నాడని అతనిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాని కోరాడు. మొత్తం 38 అర్జీలు మీ కోసంలో అందాయి. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లాల 11వ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. రన్నర్స్ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన ఈ పోటీలలో పురుషుల వ్యక్తిగత చాంపియన్షిప్ను ఎం.శరత్ (ఎన్టీఆర్ జిల్లా) సాధించగా, మహిళల విభాగంలో సన్వి కొంగర, యు.ప్రేమాంమృత (ఎన్టీఆర్ జిల్లా) సంయుక్తంగా వ్యక్తిగత చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. పోటీలలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్ర స్విమ్మింగ్ జట్టు క్రీడాకారులు త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్లో జరగనున్న 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఓబుల్రెడ్డి, వెంకట్రామ్మోహన్, పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్చాంప్ ఎన్టీఆర్ జిల్లా రన్నర్స్గా కర్నూలు జిల్లా -
బదిలీల్లో గందరగోళ పరిస్థితులు తొలగించాలి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్ప్లస్ ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు ఇప్పుడే సర్దుబాటు చేసి, క్రమబద్దీకరించిన ఖాళీల జాబితాను విడుదల చేయాలని కోరామన్నారు. పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి సర్ప్లస్ టీచర్లను అధికారులు ఫోన్లు చేసి దరఖాస్తుకు ఒత్తిడి చేయటం సరికాదన్నారు. పీఎస్ హెచ్ఎంకు వెళ్లాల్సిన టీచర్ల జాబితాను సబ్జెక్ట్ పరంగా విడుదల చేయాలని చెప్పారు. ట్రాన్స్ఫర్స్ సీనియారిటీ జాబితాలు పుట్టిన తేదీ ఆధారంగా తయారు చేశారని, బదిలీల జీఓ ప్రకారం సీనియారిటీ ఆధారంగా తయారు చేయాలని కోరామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పీఎస్ హెచ్ఎం(ఉర్దూ) పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందుగానే గ్రోవియన్స్ పరిష్కరించి ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జయ ప్రకాష్, జైగం అబ్బాస్ పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
గుడివాడటౌన్: ప్రతి రోజు యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారన్నారు. ఎంతో విశిష్ఠత కలిగిన యోగాపై నేటి యువతకు అవగాహన కల్పించాలని చెప్పా. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాల సుబ్రహ్మణ్యం, డీఎస్పీ ధీరజ్ వినీల్, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలను పరిష్కరిస్తాం
మోపర్రు(పెదపారుపూడి): రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, అధైర్యపడవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. మండలంలోని మోపర్రులో బుడమేరు వరదలకు వన్నేరు డ్రెయిన్కు పడిన గండ్లను ఆయన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి సోమవారం పరిశీలించారు. కొన్ని నెలల కితం వచ్చిన బుడమేరు వరదలకు మురుగునీరు సరిగా ముందుకు పారక వన్నేరు డ్రెయిన్ కట్టలు తెగిపోవటంతో పంటలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయామన్నారు. మరలా అలాంటి నష్టం వాటిల్లకుండా కాలువ కట్టలను బలోపేతం చేసి తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన డ్రెయిన్ మరమ్మతుల కోసం ఏఏ నిధులు అందుబాటులో ఉన్నాయో జల వనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి, గండ్లను పూడ్చడంతో పాటు గండ్ల బలోపేతానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు సేవ కేంద్రాల్లో విత్తనాలు లేవు.. ప్రభుత్వ రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ బాలాజీకి ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ఈఈ కిరణ్, తహసీల్దార్ వై.రంగారావు, రైతులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
పమిడిముక్కల: మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు ధ్వంసమైంది. కొడాలి నాగేంద్రబాబు అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తుండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని నాగేంద్రబాబు తెలిపాడు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పార్టీ నాయకులతో కలిసి ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటంబాన్ని పరామర్శించి, నష్టం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అధైర్యపడవద్దని ఆదుకొంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పారదర్శకంగా క్రీడా కోటా అమలు శాప్ చైర్మన్ రవినాయుడు విజయవాడస్పోర్ట్స్: మెగా డీఎస్సీ క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు శాప్ అధికారులను ఆదేశించారు. నగరంలోని శాప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఉద్యోగానికి అర్హత కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు నష్టపోకుండా నిష్పక్షపాతంగా, అవినీతికి తావులేకుండా ఎంపిక జరగాలన్నారు. మెగా డీఎస్సీని అడ్డుపెట్టుకుని ఇప్పటికే కొన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఫేక్ సర్టిఫికెట్లు ఎరవేసి సొమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కల్పిస్తూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసి క్రీడా సంఘాల ప్రతినిధులు లక్షలు కాజేస్తున్నారని అన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నా, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాప్ ఏవో ఆర్.వెంకటరమణ, టీఎస్వో ఎస్.వి.రమణ, స్పోర్ట్స్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీలు వేణు, మల్లేశ్వరిభాయ్ పాల్గొన్నారు. స్పైసెస్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కొరిటెపాడు(గుంటూరు): ఎగుమతులు, విలువ జోడింపు – రైతు సాధికారతను పెంచడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్పైసెస్ బోర్డు స్పైసెస్డ్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోందని స్పైసెస్ బోర్డు డీడీ ఆనంద్ దేవ్ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పైసెస్ బోర్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ‘ఎగుమతి అభివృద్ధి కోసం ప్రగతిశీల, వినూత్న, సహకార జోక్యాల ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో స్థిరత్వం’ అనే ప్రధాన పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. స్థిరత్వం, ఆవిష్కరణ, ఎగుమతి అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా భారతీయ సుగంధ ద్రవ్యాల రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మే 26వ తేదీ నుంచి ప్రారంభమైందని, సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారుల కోసం స్పైస్డ్ పథకం యొక్క ఎగుమతి అభివృద్ధి, ప్రమోషన్ భాగాల కింద దరఖాస్తును ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వాటాదారులు www.indianspices. com ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు. -
శాతవాహన కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహించాలని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ శాతవాహన కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా)ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. గతంలో చేసిన ప్రయత్నాలను ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చేసిన పోరాటాల వల్ల వెనక్కు తగ్గాడన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆలపాటి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందువల్ల శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఆలపాటిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ.. విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎమ్మెల్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడం సిగ్గుచేటు అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించినా పోలీసులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజాపై కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించి వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి ఆలపాటి రాజాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆలపాటి రాజాపై చర్యలు తీసుకోకపోతే శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేస్తామని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. ఐద్వా నగర కార్యదర్శి సరోజ, నగర కమిటీ సభ్యులు షకీలా, ఆశ, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కుమార స్వామి, కార్యదర్శి మాధవ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సభ్యురాలు ఇజ్ఞాడ లక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి విద్యార్థి, మహిళా సంఘాల డిమాండ్ -
ఎస్ఎన్ పురం మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మించడంతో పాటు ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ జీఎస్ రాజు రోడ్డులో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ను సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు. డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణ.. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ అన్ని వసతులు, ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన మోడల్ పోలీస్స్టేషన్ను తన చేతుల మీదుగా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీసులు ముందున్నారని, టెక్నాలజీ ద్వారా నేరాలకు ఏపీలో అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. హాట్ స్పాట్లు ఎక్కువగా ఉన్న విజయవాడ లాంటి చోట పటిష్టమైన భద్రత అవసరమని, ఎన్టీఆర్ జిల్లా డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో జిమ్, యోగా రూమ్ కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. గంజాయి నిర్మూలనలో ఈగల్ టీమ్ పనితీరు బాగుందని.. శాంతిభద్రతలు రక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటేనే నేరాలు అదుపులో ఉంటాయని చెప్పారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సత్యనారాయణపురాన్ని మోడల్ పోలీస్స్టేషన్గా నిర్మించి ప్రారంభించామన్నారు. ఆధునిక టెక్నా లజీ పరిజ్ఞానంతో నేరం జరిగిన 24 గంటలలోపే నేరస్తుడిని పట్టుకునేలా కమిషనరేట్ పని చేస్తోందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు వేలాది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని, ఇందుకు సహకరిస్తున్న ప్రజలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మె ల్యే బొండా ఉమా, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట హోం శాఖ మంత్రి అనిత -
ప్రలోభాలు, బెదిరింపులతో గట్టెక్కిన టీడీపీ
తిరువూరు: ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వీయ పర్యవేక్షణలో ఫ్యాను గుర్తుపై గెలిచిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్న తిరువూరు నగర పంచాయతీలో 17 మంది వైఎస్సార్ సీపీ సభ్యులే. చైర్ పర్సన్ కస్తూరిబాయి పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్కు చైర్పర్సన్గా అవకాశం కల్పించడానికి కౌన్సిలర్లు ఏకగ్రీ వంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే నెల 19న చైర్పర్సన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తదనుగుణంగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నికకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలు ప్రలోభా లకు గురిచేసి ముగ్గురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చ కండువాలు కప్పారు. అప్పటికీ వారికి బలం సరిపోకపోవడంతో ఎన్నిక ప్రక్రియకు విఘాతం కలిగించారు. ఎన్నికను సైతం వాయిదా వేయించగలిగారు. మర్నాడు మే 20వ తేదీన జరగాల్సిన చైర్పర్సన్ ఎన్నికను సైతం టీడీపీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండా కట్టడి చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌన్సిలర్లకు రక్షణ కల్పించి వారిని చైర్పర్సన్ ఎన్నికకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పోలీసులు, అధికారులు విఫలమయ్యారు. రెండో రోజు కూడా చైర్పర్సన్ ఎన్నిక జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో తిరువూరు చైర్పర్సన్ ఎన్నిక వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల కొనుగోలుతో నెగ్గిన కూటమి పంతండబ్బు ఎరచూపి... వాయిదా పడిన చైర్పర్సన్ ఎన్నికను సోమవారం నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆదేశించడంతో గత వారం రోజులుగా టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మళ్లీ బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకోగలిగారు. అతి బలవంతం మీద వైఎస్సార్ సీపీ నుంచి ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ కౌన్సిలర్లతో కలిపి 10 మంది, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటుతో చైర్పర్సన్ పదవిని దక్కించుకోగలిగారు. -
ట్రాఫిక్ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ
విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్ సోమవారం స్పోర్ట్స్ షూ, మాస్క్లు, హ్యాండ్ గ్లౌజులను అందజేశారు. సీ్త్ర శక్తిని ప్రోత్సహించే సదుద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఏడీసీపీ తెలిపారు. 33 మంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ వస్తువులను అందజేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి నలు గురి ప్రాణాలు కాపాడిన నలుగురు కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పి.రామ చంద్రరావు, సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐ నాగ దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జేసీగా ఇలక్కియ బాధ్యతల స్వీకారంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎస్.ఇలక్కియ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానన్నారు. తాను గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసినట్లు తెలిపారు. నూతన జాయింట్ కలెక్టర్కు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎస్ఓ ఎ.పాపారావు, గ్రామ/వార్డు సచివా లయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎస్.శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలి చిలకలపూడి(మచిలీపట్నం): తమకు కేటాయించిన విధులను అధికారులు బాధ్యతతో నిర్వహించి మసూల బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జేసీ గీతాంజలిశర్మతో కలిసి అధికారులతో మంగినపూడి బీచ్ ఫెస్టివల్పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. మెప్మా పీడీ పి.సాయిబాబు నోడల్ అధికారిగా, వేదిక వద్ద డ్వామా పీడీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లా పంచాయతీ అధికారి, బందరు మునిసిపల్ కమిషనర్ సమన్వయం చేసుకో వాలని సూచించారు. ఆహారపు స్టాళ్లు ఏర్పాటు చేసేవారు అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేశారు. బీచ్ ఫెస్టివల్ వద్ద అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్ వద్ద వీఐపీలకు గ్రీన్రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూంను బందరు ఆర్డీఓ పర్యవేక్షించాలని ఆదేశించారు. మచిలీపట్నం నగరం నుంచి మంగినపూడి బీచ్ వరకు ఉచిత బస్సులను నడిపాలని, అవి బయలుదేరే వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ కె.స్వాతి, మెప్మా పీడీ పి.సాయిబాబు పాల్గొన్నారు. -
నేలతల్లికి గర్భశోకం
ఆదాయ వనరుగా ఇసుక గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక కావా ల్సినంత దొరికేది. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద లారీలతో ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. – షేక్ పీర్సామియా, పండ్ల వ్యాపారి, పెండ్యాల, కంచికచర్ల మండలం రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు చెరువులు, కుంటల మట్టిని కూటమి నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో లోతుగా మట్టిని తవ్వి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. గతంలో ఇటువంటి గోతులు తీయటం వల్ల ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు పట్టడంలేదు. – కందుల అశోక్కుమార్, రైతు, పేరకలపాడు, కంచికచర్ల మండలం అధికారులకు పట్టడంలేదు క్వారీల్లో బిహార్, తమిళనాడు, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. పేలుడు పదార్థాలు అధికంగా వాడటం వల్ల బ్లాసింగ్ సమయంలో కార్మికులు మృతి చెందుతున్నారు. వారి కుటుంబాలకు క్వారీ నిర్వాహకులు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. – కోట కల్యాణ్, వ్యవసాయ, కార్మిక సంఘ ఎన్టీఆర్ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శికంచికచర్ల: అధికారం అండతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రకృతి సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఉచిత ఇసుక మాటున మాఫియాను నడిపిస్తున్నారు. ఒక్క ఇసుకే కాదు, మట్టి, కంకర ఇలా ఏ ఒక్క దానినీ వదలకుండా యథేచ్ఛగా దోచేస్తూ నేల తల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. ఎక్కడ ప్రకృతి సంపద కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి దోపిడీ పర్వానికి బాటలు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ పర్వం కొనసాగుతుండటంతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. కళ్లముందే అక్రమాలు జరుగు తున్నా దృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. అధికారుల నుంచి కనీస చర్యలు కూడా కనిపించకపోవడంతో ప్రజాప్రతినిధుల అనుచరులు, నాయకులు, కార్యకర్తలు సైతం పేట్రేగిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక దందా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఎంత కావాలన్నా లభించేది. ఇసుక ధరలు సైతం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేవి. దీంతో ప్రతి ఒక్కరూ సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించటంలేదు. పేరుకు ఉచిత ఇసుక అయితే పేదలకు మాత్రం దొరకడంలేదు. ఇసుక రీచ్ల్లో కాంట్రాక్టర్కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిపోతోంది. నో చలానా.. ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచ రులు ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.10 వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని బహిరంగంగా చెబుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆ ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ల నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీలను యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటు న్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే దందాకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. కంచికచర్ల మండలం దొనబండక్వారీ నుంచి కంకరను తరలిస్తున్న లారీ ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు తెగబడుతున్న ‘పచ్చ’ మాఫియా సహజ సంపదను నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్న వైనం ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా దోపిడీ పర్వం ఈ అక్రమాలను పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందుబాటులో ఇసుక ప్రకృతి సంపదను దోచేస్తున్న కూటమి గద్దలు -
నాలుగు నియోజకవర్గాల్లో మట్టి మాఫియా
ప్రకృతి సంపదలో ఒకటైన మట్టిపై కొంతమంది టీడీపీ నేతల కన్నుపడింది. చెరువులు, కుంటలను ఎంచుకుని రాత్రి వేళల్లో పొక్లెయిన్లతో లోతుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు ఆ మట్టిని ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్ల మెర కకు తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా పొలాలను మెరక చేసుకునేందుకు రైతుల నుంచి వసూలు చేసి మట్టిని అమ్ముతున్నారు. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పేరకలపాడు, గండేపల్లి, పరిటాల, గొట్టుముక్కల చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు, జయంతి, చట్టన్న వరం తదితర గ్రామాలు, మైలవరం నియోజక వర్గంలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్మహ్మద్పేట, పెనుగంచిప్రోలు మండలం, వత్సవాయి మండలం, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
ఉచిత ఇసుక పేరుతో చోటా నాయకుల దందా
కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. అధికార పార్టీ చోటా నాయకులకు ఈ పథకం మంచి ఆదాయ వనరుగా మారింది. కృష్ణానది, మున్నేరు, ఇతర ఉపనదుల్లో ఉచిత ఇసుక పేరుతో పగలు ట్రాక్టర్లు ద్వారా ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్నారు. రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇసుకను కూటమి నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నందిగామ మండలం కంచలవద్ద వర్షాకాలం కోసం నిల్వచేసిన ఇసుక -
క్వారీల్లో కంకర స్వాహా
ఎన్టీఆర్ జిల్లాలో రాతి క్వారీల్లో విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో దాదాపు 154 రాతి క్వారీలు, 97 స్టోన్ క్రషర్లు ఉన్నాయి. కొన్ని క్వారీలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని కొండల్లో అక్రమంగా కంకరను తవ్వుతు న్నారు. క్వారీల సమీపంలో సాగర్ కాలువలను సైతం కబ్జా చేసి రోడ్లు వేసుకుని రాతి క్వారీల గుత్తేదారులు రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అదేమంటే అమరావతి నిర్మాణానికి కంకర ఎంతో అవసరం కాబట్టే తామంతా వ్యాపారం చేస్తున్నామని బహిరంగంగా చెప్పుకొంటున్నారు. కంకర తీసే సమయంలో బ్లాస్టింగ్ చేసేటప్పుడు కనీసం ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించటంలేదు. అధిక మొత్తంలో పేలుడు పదార్థాలు ఉపయోగించటం ద్వారా క్వారీల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటు న్నారు. కార్మికుల ప్రాణాలు పోగొ ట్టుకుంటున్న సమయంలో వారి కుటుంబాలకు క్వారీల నిర్వాహకులు ఎంతో కొంత ముట్టజెప్పి పోలీసు కేసులు కాకుండా చూసుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు రాతి క్వారీల నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని అక్రమ తవ్వకాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. -
కాపు ఉద్యమ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష.. హైకోర్టులో
సాక్షి,విజయవాడ: కాపు ఉద్యమ కారులపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ కేసులు మళ్ళీ తిరగదోలాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో కాపు ఉద్యమ కారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ చెయ్యాలని పీపీకి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వుల ద్వారా సమాచారం అందించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ రైల్వే కోర్టు తీర్పును వెలువరించింది. తాజాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం మళ్ళీ తుని ఘటనలో కాపు ఉద్యమ కారుల కేసులు విచారించేందుకు సిద్ధమైంది. కాగా, ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళీ అప్పీల్కు వెళ్లాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉద్యమకారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
సాక్షి,విజయవాడ: పలు అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులగా ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్ సమ్మరీతో సహా సీల్డ్ కవర్లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.గత గరువారం ..వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. -
జీవితంలో యోగా భాగం కావాలి
ఏపీ జెన్కో ఎండీ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం: యోగా మన భారతదేశ పౌరుల వారసత్వ సంపదని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఆయుష్, పర్యాటక, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా ఔత్సాహికులు యోగాసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రధర్బాబు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు సూర్య నమస్కారాలు చేసినట్లు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ.. డ్రగ్స్ రహిత రాష్ట్రం, జిల్లా లక్ష్యంగా ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ, ఈగల్ ఎస్పీ ఎన్.నగేష్బాబు, ఇతర అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు (1972 టోల్ ఫ్రీ నంబర్) నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీటీపీఎస్ సీఈ పి.శివరామాంజనే యులు, యోగాంధ్ర నోడల్ అధికారులు ఎం.సుహాసిని, శిల్ప, వి.రాణి తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా మొక్కలు నాటుదాం
చల్లపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకువచ్చి పర్యావరణాన్ని కాపాడటంలో బాధ్యతగా వ్యవహరించాలని విజయవాడకు చెందిన వైద్యుల బృందం పేర్కొంది. 30 మందితో కూడిన ఎన్విరాన్మెంటల్ హెల్త్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(ఫాగ్సి) బృందం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొంది. 216 జాతీయ రహదారికి ఇరువైపుల, జంక్షన్ పాయింట్లో మొక్కలు నాటారు. వైద్యులు మాట్లాడుతూ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. అనంతరం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను స్వచ్ఛ రథసారఽథి డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు వివరించారు. -
ఉపాధ్యాయులకు బలవంతపు బదిలీలు!
పీఎస్ హెచ్ఎంలుగా దరఖాస్తు చేయాలని ఎస్ఏలకు ఒత్తిడి మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను బలవంతపు బదిలీలు చేసేందుకు సిద్ధమైంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పీహెచ్సీ, విడోవర్స్, డైవోర్స్ టీచర్ల పట్ల అన్యాయం జరుగుతోంది. తాజాగా 2023లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందిన టీచర్లను బలవంతంగా బదిలీకి దరఖాస్తు చేయమని జాబితా విడుదల చేసింది. ఈ టీచర్లను సర్ప్లస్, రీ–అపార్షన్లో చూపించలేదు. వీరికి బదిలీలతో సంబంధమే లేదు. అయినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయం మేరకు స్కూల్ అసిస్టెంట్లను హఠాత్తుగా ప్రైమరీ స్కూల్(పీఎస్) హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి చేయాలన్న యత్నం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బదిలీల ప్రక్రియ సంబంధించి స్పష్టమైన విధానం లేదని, బలవంతపు నిర్ణయాలు తీసుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. దరఖాస్తు చేయాల్సిందే.. తప్పనిసరిగా పీఎస్ హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కోసం దరఖాస్తులు చేయాలని స్కూల్ అసిస్టెంట్లను ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి కష్ణాజిల్లాలో పీఎస్ హెచ్ఎం పోస్టులకు సబ్జెక్టుల వారీగా 65 ఎస్ఏ తెలుగు, 01 ఎస్ఏ ఉర్దూ, 44 ఎస్ఏ ఇంగ్లిష్, 52 ఎస్ఏ గణితం, 13 ఎస్ఏ పీఎస్, 18 ఎస్ఏ బీఎస్, 37 ఎస్ఏ ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్లు పీఎస్ హెచ్ఎం పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు జిల్లాలో మొత్తం 19 ఖాళీలు గుర్తించారు. అందులో జెడ్పీ/ఎంపీ పాఠశాలల్లో 06 ఎస్ఏ గణితం, 10 ఎస్ఏ సోషల్, మునిసిపల్ పాఠశాలల్లో 01 ఎస్ఏ గణితం, 01 ఎస్ఏ సోషల్, ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో 01 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉన్నాయి. పీఎస్ హెచ్ఎం వెబ్ ఆప్షన్స్ ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా.. ఉమ్మడి కృష్ణాలో స్కూల్ అసిట్టెంట్లకు.. లోకల్ బాడీస్ పాఠశాలల్లో 270 బయోలాజికల్ సైన్స్, 293 సోషల్, 521 గణితం, 8 స్పెషల్ ఏడు ఎడ్యుకేషన్, 153 ఫిజికల్ ఎడ్యుకేషన్, 317 ఫిజికల్ సైన్స్, 348 తెలుగు, 299 హిందీ, 387 ఇంగ్ల్లిష్, 4 సంస్కృతం పోస్టులు గుర్తించారు. మునిసిపల్ పాఠశాలల్లో 6 బయోలాజికల్ సైన్స్, 5 సోషల్, 10 గణితం, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్, 6 ఫిజికల్ సైన్స్, 5 తెలుగు, 7 హిందీ, 8 ఇంగ్ల్లిష్, 01 నో సబ్జెక్ట్ పోస్టులు.. మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 37 బయోలాజికల్ సైన్స్, 35 సోషల్, 57 గణితం, 17 ఫిజికల్ ఎడ్యుకేషన్, 42 ఫిజికల్ సైన్స్, 20 తెలుగు, 35 హిందీ, 51 ఇంగ్ల్లిష్, 2 సంస్కతం, 38 నో సబ్జెక్ట్ పోస్టులు గవర్నమెంట్ పాఠశాలల్లో 10 బయోలాజికల్ సైన్స్, 13 సోషల్, 19 గణితం, 1 స్పెషల్ ఎడ్యుకేషన్, 4 ఫిజికల్ ఎడ్యుకేషన్, 16 ఫిజికల్ సైన్స్, 7 తెలుగు, 3 హిందీ, 10 ఇంగ్ల్లిష్, 1 సంస్కృతం, 1 ఉర్దూ పోస్టులకు ప్రొవిజషనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. వెబ్ ఆప్షన్స్ను పీఎస్ హెచ్ఎం బదిలీల ప్రక్రియ అనంతరం ప్రారంభించనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)కు.. సంబంధించి లోకల్ బాడీస్ పాఠశాలల్లో 2,433, ప్రభుత్వ 11, మునిసిపల్ పాఠశాలల్లో 55 పోస్టులకు ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. -
వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజామున స్వామి వారి ఆలయంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణ జరిగాయి. అనంతరం స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు, ఉభయదాతలు భుజం పట్టారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వేద పాఠశాల పునఃప్రారంభం కానుందని, విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను పొందవచ్చని పేర్కొన్నారు. సమాజ వికాసానికి తోడ్పడే వేద విద్య అభ్యున్నతికి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. హోరాహోరీగా తైక్వాండో పోటీలు విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నగరంలోని ఆంధ్రా లయోల కాలేజీలో ఆదివారం హోరాహోరీగా జరిగాయి. కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కాలేజీ వ్యాయామ విద్యా అధ్యాపకులు మహ్మద్ ఇబ్రహీం ప్రారంభించారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ సీ్త్ర, పురుషు విభాగాల్లో ఈ పోటీలు అత్యంత రసవత్తరంగా జరిగాయి. వయసు విభాగాల వారీగా జరిగిన ఈ పోటీల్లో 94 మంది విజేతలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని, ఈ జట్లు ఈ నెల 9, 10, 11 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం కార్యదర్శి ఎం.అంకమ్మరావు తెలిపారు. నేడు చైర్పర్సన్ ఎన్నిక తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం జరగనుంది. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి ఎన్నిక జరుపుతారు. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో జరగనున్న ఎన్నికలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యాలయ పరిసరాల్లో జన సంచా రం నిషేధించడంతో పాటు అన్ని మార్గాల్లో బారికేడ్లు కట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఏసీపీ ప్రసాదరావు పర్యవేక్షణలో సీఐ గిరిబాబు, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడస్పోర్ట్స్: కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జ్యోతిప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరిగోపాల్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సంఘ ఎన్నికలు సంఘం కార్యదర్శి సైకం రామ్ప్రసాద్ పర్యవేక్షణలో జరిగాయి. టెన్నిస్బాల్ క్రికెట్ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఆర్.డి.ప్రసాద్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బి.మెహర్బాబు, ఉపాధ్యక్షులుగా జి.జగదీశ్వరరావు, ఎస్.కె.నబి, ఆర్.అప్పలస్వామి, సీనియర్ సహాయ కార్యదర్శులుగా ఎస్.కృష్ణప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా ఎ.శివగణేష్బాబు, జి.సాంబశివరావు, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.కోటేశ్వరరావు, వి.రాజు, ఆర్.శివయ్య, పి.చంద్రమణిని సభ్యులు ఎన్నుకున్నారు. -
‘డ్వాక్రా’కు భరోసా..
డ్వాక్రా సభ్యులకు ఆర్థిక చేయూతను అందించాలని వారు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీతో పాటు రుణమాఫీ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత సున్నా వడ్డీ, జగనన్న తోడు పథకాల ద్వారా వారికి ఆర్థ్ధిక చేయూతను అందించారు. ఈ మూడు పథకాల ద్వారా కృష్ణాజిల్లాలో 1,35,745 మందికి గత ఐదేళ్లలో రూ. 135.75కోట్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 3,45,685 మంది లబ్ధిదారులకు రూ. 464.16కోట్లు అందజేశారు. అన్నింటా మొండిచెయ్యి.. డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పి ఇంత వరకు వారికి ఎటువంటి ఆర్థిక ఆసరాలు ప్రకటించలేదు. గతంలో డ్వాక్రా గ్రూపులను తామే ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నేడు డ్వాక్రా మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదు. -
స్వావలంబనకు ‘ఆర్థిక’ ఆయుధం..
వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారు. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా కృష్ణాజిల్లాలో 90,057 మంది లబ్ధిదారులకు రూ. 135.09 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 31,906 మంది లబ్ధిదారులకు రూ. 47.85 కోట్లు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 58,095 మంది లబ్ధిదారులకు రూ. 87.14 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 56,898 మంది లబ్ధిదారులకు రూ. 85.35 కోట్లు నగదు జమ చేశారు. కనిపించని స్వావలంబన.. స్వలాభమే అంతా.. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం లేదు. ప్రతి మహిళకు రూ.1500 నెలకు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. ఉచిత బస్సు ప్రయాణం హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి నాలుగు నెలలకు ఒక సిలిండర్ను అందజేసే విధంగా నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా ఇచ్చిన గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాలో సరిగా జమ కావటం లేదని వారే వాపోతున్నారు. -
సొంతింటి కల సాకారం..
మహిళలకు సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో కృష్ణాజిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో 90,504 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,14,969 మందికి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. వీరికి ప్రత్యేకంగా కాలనీలను ఏర్పాటు చేసి వారికి అన్నిమౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అప్రోచ్రోడ్డులతో పాటు అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. అంతా మాయ.. తాను అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లపట్టాలు అందజేస్తామని ప్రతి ఒక్కరికీ మూడు సెంట్లు భూమిని ఇస్తామని చెప్పి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏడాది పాలన దగ్గరకావస్తున్నా చెప్పిన హామీని అమలు చేయకుండా వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే పాలన ఇప్పటి దాకా కొనసాగించారు. -
అల్యూమినియం తీగ అపహరణ
తోట్లవల్లూరు: విద్యుత్ తీగల దొంగలు చెలరేగిపోతున్నారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసే అల్యూమినియం తీగలను సైతం చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత నెలలో చాగంటిపాడు వద్ద రూ.4.50 లక్షల అల్యూమినియం తీగల దొంగతనాన్ని మరువక ముందే మళ్లీ బొడ్డపాడు, వల్లూరుపాలెం లైన్లో తీగల చోరీ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వల్లూరుపాలెం సబ్స్టేషన్ నుంచి బొడ్డపాడు, చినపులిపాక గ్రామాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్కో అధికారులు కొత్త లైను ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతనెల 28రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 15 స్తంభాల మధ్యలో వేసిన నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన అల్యూమినియం తీగను అపహరించారు. దీని విలువ సుమారు రూ.2.50 లక్షల వరకు ఉంటుందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. అల్యూమినియం తీగల చోరీ ఘటనపై కాంట్రాక్టర్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిసింది. -
బీసీ చైతన్య వేదిక నూతన కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీ చైతన్య వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పెండ్యాల నారాయణ, మదుగురి సూర్యనారాయణ, మట్టపర్తి సూర్యచంద్రరావు, బొక్కా సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా లుక్కా వెంకటేష్, కార్యదర్శులుగా నందవరుపు శ్రీనివాసులు, పాల సత్యనారాయణ, పితాని శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బండి ఆదికృష్ణ, రాయుడు లక్ష్మణరావు, మహిళా అధ్యక్షురాలిగా వడ్డి నాగమల్లేశ్వరియాదవ్, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా దుర్గముపాటి పద్మజ, మహిళా ప్రధానకార్యదర్శిగా మార్గని సుశీల, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా రాయుడు దుర్గ, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిగా డోలా రాజేశ్వరీదేవి, బీసీ చైత్య వేదిక రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా మరిశెట్టి సూరిబాబు ఎన్నికయ్యారు. వీరికి వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ నియామకపత్రాలు అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ మండల కమిషన్ సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగణనతోపాటు కులగణన చేపట్టి వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
5న పెడనలో జాబ్మేళా
పెడన: ఈనెల 5వ తేదీన పెడన బొడ్డునాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. జాబ్మేళా గోడపత్రికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.కార్పొరేషన్ కో ఆర్డినేటర్ వంగా బాబు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ, బిఫార్మసీ పూర్తి చేసినవారు హాజరుకావచ్చన్నారు. ఇతర వివరాలకు సెల్నంబర్లు 8897772488, 9966489796, 9989519495 సంప్రదించాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పాల్గొన్నారు. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభంమచిలీపట్నంటౌన్: మచిలీపట్నంలోని 37వ డివిజన్ రాజుపేట చెక్కలమేడ సెంటర్లో ఉన్న 7వ నంబర్ చౌక ధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీని మంత్రి రవీంద్ర ఆదివారం పునఃప్రారంభించారు. కార్డుదారులకు ఐదు కిలోల బియ్యం, అర కిలో పంచదార, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అదేప్రాంతానికి చెందిన వృద్ధులు బోయిన సుశీల, గొడవర్తి మహాలక్ష్మి ఇళ్లకు వెళ్లి వారికి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. డిఎస్ఓ పార్వతి, డీఎం శిరీష, ఆర్డిఓ కే స్వాతి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ కౌన్సిలర్ రాయపూడి చిన్ని, తహసిల్దారు పి.మధుసూదన్రావు, డీలర్ సైకం సాంబమూర్తి పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియనుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూతన వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతోపాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉదయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి భక్తుల తాకిడి కొంత కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అంతరాలయ దర్శనం రద్దు -
ఎన్టీఆర్ జిల్లాకు ఓవరాల్ చాంపియన్ షిప్
విజయవాడస్పోర్ట్స్: 11వ జాతీయ అంతర జిల్లాల స్విమ్మింగ్ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 16గోల్డ్, 10 సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్తో అత్యధికంగా 116 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫిని కై వసం చేసుకున్నారు. విజయవాడ క్రీడాకారులు ఎం.శరత్, కె.సాన్వి, యు.ప్రేమామృత వ్యక్తిగత విభాగంలో ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను ఏపీ అమెచ్యూర్ అక్వాటిక్ సంఘం చైర్మన్ కె.రవికాంత్, అధ్యక్షులు ఎం.ఓబుల్రెడ్డి, కార్యదర్శి ఎ.మోహన్వెంకట్రామ్, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రమేష్, కృష్ణాజిల్లా సంఘం అధ్యక్షకార్యదర్శులు డి.భాస్కర్, వి.వినోద్ అభినందించారు. -
మట్టి కోసం బరి తెగింపు!
జి.కొండూరు: ప్రకృతి కరుణించినా టీడీపీ నాయకుల దుర్మార్గపు చర్యల కారణంగా సాగునీరు అందడం కష్టమేనన్నట్లు తయారైంది మైలవరం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి. అధికార టీడీపీ నేతల ధనదాహం రైతుల పాలిట శాపంగా మారింది. పొలాలకు మెరక పేరుతో రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు రావుల చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్న టీడీపీ నాయకులు..చివరికి చెరువులోకి నీరు రాకుండా లాకులను సైతం ధ్వంసం చేశారు. మట్టి తవ్వకాల కోసం చెరువులోని కొద్దిపాటి నీటిని సైతం తూముల నుంచి బయటకు పంపించడంతో వారి ధనార్జన పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ సాగు కష్టమే జూన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో మరో వారంరోజుల్లో నారుమళ్లను సిద్ధం చేసేందుకు రైతులు సన్నాహలు చేస్తున్నారు. ఈ క్రమంలో రావుల చెరువులో నీరు లేకపోగా చెరువులోకి వచ్చే నీటిని కూడా అక్రమార్కులు అడ్డుకున్న వైనం తెలిసి, నీరు లేకపోతే నార్లు పోయడం కూడా దండగేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాఫ్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. చెరువును నింపేందుకు తాము లాకులను దించినప్పటికీ అక్రమార్కులు వాటిని పదే పదే తొలగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి నీరు వచ్చేలా చర్యలు చేపట్టకపోతే ఆయకట్టు పరిధిలోని 650 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జువ్వి చెరువును గుల్లచేశారు.. ఇదే గ్రామంలో ఉన్న జువ్వి చెరువును టీడీపీ నాయకులు గుల్ల చేశారు. ముగ్గురు రైతులకు పొలాల మెరకపేరుతో 3,100 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలింపునకు అనుమతులు పొంది పదివేల క్యూబిక్ మీటర్ల మట్టిని బట్టీలకు తరలించారు. ఈసారి ఏకంగా రైతుల ముసుగులో బట్టీలను నిర్వహిస్తున్న వ్యక్తుల పేరుతో అనుమతులు పొంది రావుల చెరువు నుంచి భారీస్థాయిలో మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యారు. అనుమతులు తీసుకొచ్చి మట్టి అక్రమరవాణాకు అండగా నిలిచినందుకుగానూ ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టికి రూ.200 కమిషన్ రూపంలో బట్టీల నిర్వహకుల నుంచి టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే చర్చ సాగుతోంది. అక్రమార్కుల చేస్తున్న మట్టి దందాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి రావుల చెరువు నుంచి అక్రమంగా సాగుతున్న మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నాగులూరు రావుల చెరువులోకి నీరు రాకుండా అడ్డుకున్న టీడీపీ నాయకులు లాకులు సైతం ధ్వంసం పొలాల మెరక పేరుతో అనుమతులు.. ఇటుక బట్టీలకు మట్టి తరలింపు నిద్రనటిస్తున్న అధికారులు ఖరీఫ్ సాగు కష్టమేనంటున్న రైతులు టీడీపీ నేతల అరాచకం.. రెడ్డిగూడెం మండలం నాగులూరులోని రావుల చెరువు 111ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద నాగులూరు, మైలవరం మండల పరిధిలోని కీర్తిరాయినిగూడెం, తోలుకోడు గ్రామాలకు చెందిన 650 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈ చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్థానిక టీడీపీ నాయకులు పథకం రచించారు. అందులోభాగంగా గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు పొలాల మెరక పేరుతో 11,600 క్యూబిక్ మీటర్ల మట్టి అంటే 4,640 ట్రాక్టరు ట్రక్కుల మట్టిని తరలించేందుకు ఇరిగేషన్శాఖ నుంచి అనుమతులు పొందారు. ఈ క్రమంలో రెండురోజులపాటు మట్టిని తరలించిన అనంతరం వర్షం పడటంతో ప్రస్తుతం మట్టి రవాణాను నిలిపివేశారు. అయితే వర్షం కారణంగా ఎగువన చెరువులు నిండి కోతుల వాగు నుంచి ఊట వస్తోంది. ఈ ఊట రావుల చెరువులోకి వెళ్లేందుకు చెరువు సమీపంలో లాకులు ఉన్నాయి. చెరువులోకి కోతులవాగు నుంచి నీరు వస్తే మట్టి తవ్వకాలకు అడ్డంకిగా మారుతుందని భావించిన టీడీపీ నాయకులు, లాకులను వారే ధ్వంసం చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
క్రీడాకారుల్లో శక్తి, యుక్తికి యోగా సరైన మార్గం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రీడాకారులు పోటీల్లో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన శక్తితోపాటు యుక్తికి యోగా దోహదపడుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం క్రీడాకారుల థీమ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులు, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, జూడో, కబడ్డీ, నెట్బాల్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, హాకీ, టేబుల్ టెన్నిస్, హ్యాండ్బాల్, రెజ్లింగ్ విభాగాల క్రీడాకారులు, జిమ్ ట్రైనర్లు, యోగా ఔత్సాహికులు కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈసందర్భంగా నగర కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ యోగాసనాలను ప్రతి ఒక్కరూ నేర్చుకొని జీవితాంతం ఆచరించడం ద్వారా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. బీఆర్టీఎస్ రోడ్డు యోగా స్ట్రీట్లోనూ ప్రతిరోజూ ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా క్రీడాకారులతో యోగాసనాలు సాధన చేయడం ఆనందంగా ఉందన్నారు. యోగా సాధనను ఏదో ఒక రోజుకు పరిమితం చేయకుండా తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు వీలుంటుందని ఽకమిషనర్ వివరించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర -
చంద్రబాబు అలా మాట్లాడటం సిగ్గుచేటు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: పరిశ్రమలకు భూములివ్వాలనే తాపత్రయం తప్ప చంద్రబాబుకు రైతుల గురించి ఆలోచన లేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేదంతా పారిశ్రామికవేత్తలేనంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.‘‘పక్కనున్న తెలంగాణలో సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు క్వింటాకు మద్దతు ధరకంటే అదనంగా 800 రూపాయలు బోనస్ ఇస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఏ పంటకు కూడా మద్దతు ధర దొరకడం లేదు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు...పరిశ్రమలు రావాలి. యువతకు ఉద్యోగాలు కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు రైతుల గురించి ఆలోచన చేయాలి. ఏపీలో 50 శాతం పైన భూమి కౌలు రైతులు సాగుచేస్తున్నారు. కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేయాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. -
ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వంచనకు పాల్పడిందని.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వెన్నుపోటు దినం పోస్టర్ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 175 నియోజక వర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ పాటిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జూన్ 4న జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము’’ అని బొత్స పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా: వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్ అని.. కూటమి సర్కార్.. మోసాలకు, అరాచకాలకు నిరసనగా జూన్ 4న రాజంపేట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన చేపట్టే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన విడుదల చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్ను వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతపురం: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మోసకారి అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. హామీలంటే ఇప్పుడు భయమంటున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఎందుకు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన ను విజయవంతం చేయాలని తోపుదుర్తి పిలుపునిచ్చారుకృష్ణా జిల్లా: 4న చేపట్టే ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమ పోస్టర్ను కానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని.. అబద్దపు హామీలతో సీఎం అయ్యారంటూ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి?. వెన్నుపోటుకి నిర్వచనం చంద్రబాబు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచాడు. అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబు. నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ నేతలకు దేశభక్తుని చక్రవర్తి పిలుపునిచ్చారు. -
‘న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోంది’
కృష్ణాజిల్లా: 115 రోజులుగా వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరొకటి బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు,లోకేష్ యముడిపాత్రలో ఉంటే సతీ సావిత్రిలాగా వంశీని ఆయన భార్య కాపాడుకుంటోందన్నారు పేర్ని నాని. న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోందని పేర్ని నాని తెలిపారు. వంశీ బయటకు రావడం, గన్నవరం ప్రతి గడపకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఎప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి వంశీనే నాయకత్వం వహిస్తారన్నారు పేర్ని నాని.ఈరోజు(శనివారం) కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ‘ వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందులో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు,కైలే అనిల్ కుమార్ , మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు,పెడన వైసీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి , గుడివాడ, గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘అధికార మదం చూపించుకోవాలనే వంశీపై తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు పెట్టారు. 14 ఏళ్ల క్రితం వంశీ తనకు అన్యాయం చేశారని ఒకరు. 9 ఏళ్ల క్రితం వంశీ తనకు అన్యాయం చేశారని ఒకరు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరో తప్పుడు కేసు బనాయిస్తున్నారు. దేవుడున్నాడు...న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందని ఆశతో ఉన్నాం.ఎన్ని తప్పుడు కేసులుపెట్టినా అంతిమంగా న్యాయం దొరుకుతుంది పోరాడుతున్నాం. చంద్రబాబు, లోకేష్ మానవత్వాన్ని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించి వంశీని ఏదోఒకటి చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే అనారోగ్యం వస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వగానే ఫైల్స్ వస్తాయి..ఆపరేషన్ చేయించుకోవాలి. చంద్రబాబు ఆరోగ్యం నాశనమైందని కారణం చూపించి బెయిల్ పై బయటికొచ్చారు. జైలు నుంచి బయటికొచ్చాక ఒక్క రోజు కూడా ఆసుపత్రికి వెళ్లలేదుచంద్రబాబు బెయిల్ పైన బయటికి వచ్చిన దగ్గర్నుంచి రోజూ చేసింది కుట్రరాజకీయాలే. ఈ ప్రభుత్వం పై పోరాడేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా ఈ కూటమి మోసాలను అడ్డుకునేందుకు రెడీగా ఉన్నారు. చంద్రబాబు తప్పుడు హామీలతో గెలిచి ప్రజలను మోసం చేస్తున్నాడు.పిల్లల చదువుల పై కూడా రాజకీయాలు చేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను తాకట్టుపెట్టుకోవాల్సి వస్తోంది. జూన్ 4వ తేదీన గన్నవరంలో వెన్నుపోటు దినం నిరసన తెలియజేస్తాం. రాష్టంలోని అన్ని ప్రాంతాల కంటే మిన్నగా గన్నవరంలో నిరసన చేపడతాం. వంశీ లేకపోయినా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలో విజయవంతం చేస్తాం. దేవాలయాల ఆస్తులన్నీ టిడిపి నేతల చేతుల్లోకి పోతున్నాయ్. విద్యాశాఖ మంత్రికి మాటలెక్కువ చేతలు తక్కువ. పదవ తరగతి మూల్యాంకనమే ఆ శాఖామంత్రి పని తీరుకు నిదర్శనం’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
‘నవ’ మోసాలు
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్కు మెయిల్స్, వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ సీఎస్పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్రసూల్, సీఎస్పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్బాబు పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివే1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
కేటుగాళ్లు రూటు మార్చారు
విజయవాడ స్పోర్ట్స్: గంజాయిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ మార్గంలో అది విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చేరుతూనే ఉంది. సరుకు, ప్రజా రవాణాపైనే నిఘా నేత్రం దృష్టి సారిస్తున్న ప్రస్తుత తరుణంలో గంజాయి అక్రమ రవాణాకు కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. ఈ ప్రాంతాలే టార్గెట్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు ముందుగా బైక్లను చోరీ చేస్తున్నారు. విజయవాడలోని రద్దీ ప్రాంతాలు, రాత్రి సమయంలో రోడ్లపైనే పార్కింగ్ చేసి ఉండే ప్రాంతాల్లో, ఆస్పత్రుల వద్ద బైక్లను చోరీ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్స్టేషన్, రైల్వే స్టేషన్, కొత్త, పాత ప్రభుత్వాస్పత్రి, కొండ సమీపంలోని నివాసాల వద్ద ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట, మాచవరం, సత్యనారాయణపురం, పోలీస్ స్టేషన్ల్లో ఈ దొంగతనాలు అధికంగా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గడచిన ఏడాదిలో 185 బైక్ చోరీ కేసులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. సిండికేట్గా మారి.. చోరీ ముఠా మొత్తం సిండికేట్గా మారి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధానంగా విజయవాడకు చెందిన కట్టా శ్రీను ఇక్కడ బైక్లను చోరీ చేసే ముఠాకు నాయకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. బైక్ చోరీ చేసిన వ్యకి..ఒడిశాకు చేరుకునే మార్గాన్ని ఇతనే దిశానిర్దేశం చేస్తాడు. ఒడిశాకు చేరుకున్న తర్వాత చోరీ చేసిన బైక్ను నరసింహులు అనే వ్యక్తి కొనుగోలు చేసి నగదు ముట్టజెబుతాడు. ఆ తర్వాత రమేశ్ అనే వ్యక్తి నేరగాళ్లకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో రమేష్ గంజాయి విక్రయించడంతో పాటు విజయవాడలోనూ తన ముఠాతో యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తులు బైక్లను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఏడాదిలో 185 బైక్లు చోరీకి గురవ్వగా 130 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితులు కట్టా శ్రీను, నరసింహులు, రమేశ్తో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్(ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్స్) యాక్ట్ను ప్రయోగిస్తున్నాం. ఈ కేసులో అరెస్ట్ అయితే ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ బైక్కు జీపీఎస్ ట్రాకర్ను అమర్చుకోవాలి. దీంతో బైక్ చోరీకి గురైన వెంటనే ట్రాకర్ సాయంతో గుర్తించడానికి వీలుంటుంది. – రాజశేఖరబాబు పోలీస్ కమిషనర్, విజయవాడ ఒడిశాలో అమ్మేస్తున్నారు విజయవాడతో పాటు నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లో చోరీ చేసిన బైక్లపై నేరగాళ్లు నేరుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)కి చేరుకుంటున్నారు. విజయవాడలోనే సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒడిశాలోకి ప్రవేశించి, అక్కడ వాహనాన్ని అమ్మేస్తున్నారు. వచ్చిన నగదులో కొంత జల్సాలు చేసి మిగిలిన నగదుతో అక్కడే గంజాయిని కొనుగోలు చేసి, పలు రవాణా మార్గాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. ఒక్కో నిందితుడు గరిష్టంగా 5 కేజీల గంజాయిని తీసుకొస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తీసుకువచ్చిన గంజాయిని ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్నారు. బైక్లతో పాటుగానే మొబైల్ ఫోన్లనూ ఈ ముఠా చోరీ చేసి ఒడిశాలో విక్రయించి, ఆ సొమ్ముతో గంజాయి కొని తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బైక్లు చోరీ ఆ నగదుతో ఏవోబీలో గంజాయి కొనుగోలు పాత నేరస్తుల ఆధ్వర్యంలో దందా -
నెప్పల్లి భూములు అన్నసత్రం కమిటీవే
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖదిగా చెబుతున్న కృషా ్ణజిల్లా నెప్పల్లి గ్రామంలో ఆర్ఎస్ నెం 101లోని 4.41 ఎకరాల భూమి విజయవాడలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీకి చెందిన భూమిగా ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకటలక్ష్మీ వరప్రసాద్, బి. రాజేష్ చెప్పారు. ఈ సందర్భంగా అన్నసత్రం కమిటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 150 ఏళ్ల క్రితం విజయవాడలో ఆర్యవైశ్య యాత్రికుల వసతి, భోజన సదుపాయాల కోసం శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ పేరుతో సంస్థను తమ పూర్వీకులు ఏర్పాటు చేశారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆర్యవైశ్య సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. ఆర్యవైశ్యులు భూములు ఇచ్చారు తమ సంస్థ కొనసాగించేందుకు అనేక మంది ఆర్యవైశ్యులు కొంత భూములను సంస్థకు అందించారన్నారు. ఆ క్రమంలో నెప్పల్లిలో తమకు 4.41 ఎకరాల భూమి ఉందన్నారు. 150 ఏళ్ల నుంచి తమ ఆధీనంలోనే అది కొనసాగుతోందని చెప్పారు. దాని పన్నులు తమ సంస్థే చెల్లిస్తోందన్నారు. సుమారు వంద ఏళ్లకు పూర్వం నుంచి ఒకే కుటుంబం మూడు తరాలుగా (ప్రస్తుతం దేవినేని దుర్గాప్రసాద్) దానిని తమ సంస్థ నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తోందన్నారు. దానికి సంబంధించి సుమారు 75 ఏళ్లుగా ఆ రశీదులు, రిజిస్టర్ అగ్రిమెంట్లు, పాస్బుక్లు తమ వద్ద ఉన్నాయన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వసతి, ఉచిత భోజన సదుపాయాలే కాకుండా శివరాత్రికి ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మకు, శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం (పాతశివాలయం) స్వామి వార్ల రథోత్సవాన్ని సుమారుగా 155 ఏళ్లగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం వరకూ దుర్గమ్మ సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలను సైతం తమ సంస్థ ఆధ్వర్యంలో పూర్వీకులు నిర్వహించే వారని గుర్తు చేశారు. ఇప్పటికీ పాతశివాలయం శివరాత్రి ఉత్సవాలను తమ సంస్థే నిర్వహిస్తుందన్నారు. పూర్తి ధార్మిక సంస్థగా ఈ సంస్థ వ్యక్తిగతమైనది కాదని, పూర్తిగా ధార్మిక సంస్థగా కొనసాగుతుందన్నారు. ఆ భూమిని ఎవరికీ తమ సంస్థ అమ్మలేదన్నారు. ముఖ్యంగా ఆ భూమి వివరాలను దేవదాయ శాఖ 43 రిజిస్ట్రార్లో కొత్తగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు తమ కమిటీని ఆశ్చర్యానికి లోను చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలకు తాము వివరాలను అందిస్తామన్నారు. సమావేశంలో కమిటీ ప్రముఖులు వల్లంకొండ ప్రసాద్, వీరమునిబ్రహ్మానందరావు, జగన్మోహనరావుగుప్తా, డొగిపర్తి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 150 ఏళ్లగా శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధీనంలోనే -
బీడీసీ రిటైనింగ్ వాల్ పనులపై మంత్రి అసంతృప్తి
– కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలో రూ.23 కోట్లుతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద జరుగుతున్న సిమెంట్ కాంక్రీట్ పనులను అధికారులతో కలసి శుక్రవారం మంత్రి పరిశీలించారు. పనులు నత్తనడకన జరగడంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మందకొడిగా పనులు సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 10వ తేదీనాటికి ప్రధాన పనులు పూర్తి చేయాలని ఆదేశించినా కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పందించక పోవడంపై మండిపడ్డారు. తక్షణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్మికులను సొంత జిల్లాలకు పంపండి చిలకలపూడి(మచిలీపట్నం): తెలంగాణ నుంచి వచ్చిన తొమ్మిది మంది ఏపీకి చెందిన వెట్టి చాకిరి కార్మికులను వారి సొంత జిల్లాలకు సురక్షితంగా పంపించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పెంట్లవల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఫిషింగ్ యూనిట్లో తొమ్మిది మంది వెట్టిచాకిరి చేస్తున్న (బాండెడ్) కార్మికులను ఏపీకి చెందినవారుగా గుర్తించారు. వారిని శ్రీకాకుళం, కృష్ణ, విజయ నగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందినవారని తెలియజేస్తూ సర్టిఫికెట్లను జారీ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకొనివచ్చి అప్పగించారు. వారు శుక్రవారం ఉదయం కలెక్టర్ డీకే బాలాజీని కలిశారు. కలెక్టర్ వారందరితో మాట్లాడి కార్మికులను సొంత జిల్లాలకు పంపారు. కల్తీ ఇంజిన్ ఆయిల్ వ్యాపారి అరెస్ట్ సూర్యాపేటటౌన్: కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సీసీఎస్, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్తో వ్యాపారి పట్టుబడ్డాడు. అతడిని విచారరణ చేయగా ఏపీలోని విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడు విజయవాడలోని ఓ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశాడు. ఇంజిన్ ఆయిల్ తయారీలో అనుభవం ఉన్న నాగ వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్స్, ప్లాస్టిక్ టిన్స్ తెప్పించాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో తన ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి స్టిక్కర్లు అతికించి లీటర్ రూ.200 చొప్పున బైక్ మెకానిక్లకు విక్రయించడం ప్రారంభించాడు. 2007లో విజయవాడలోని తన ఇంటిలో కల్తీ ఇంజిన్ ఆయిల్ను బాటిల్స్లో నింపుతుండగా విజయవాడ వన్ టౌన్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశాడు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత వ్యాపారం బంద్ చేశారు. మళ్లీ కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయిల్ బాటిల్స్ను కారులో వేసుకుని నేరేడుచర్ల, మిర్యాలగూడ బైక్ మెకానిక్లకు అమ్ముతున్నాడు. శుక్రవారం ఉదయం కారులో కల్తీ ఇంజిన్ ఆయిల్ బాటిల్స్తో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వస్తుండగా సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2లక్షల విలువైన ఆయిల్, కారును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ సీఐ శివ, సిబ్బంది, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఉపాధి కూలీలపై ‘తమ్ముళ్ల’ దాడి
మైలవరం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం రోజు రోజుకూ శ్రుతి మించుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అధికారమే అండగా దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి కూలీలను కులం పేరుతో దూషిస్తూ మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన పొందుగలలో జరిగింది. మైలవరం మండలం పొందుగల గ్రామం దళితవాడకు చెందిన ఉపాధి హామీ కూలీలు స్థానికంగా ఉన్న చెక్ డ్యామ్ వద్ద ఉపాధి పనులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడి అనుచరులు ఆరేపల్లి సత్యనారాయణ, నాగరాజు, గోపాలరావు వచ్చి ‘ఇక్కడ పనిచేయవద్దు మేము చెప్పిన చోట పనులు చేయాలని’ వారిపై ఒత్తిడి చేశారు. ‘మేము చెప్పిన చోట పనులు చేయకపోతే కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా చేస్తా మంటూ’ బెదిరించారు. మేము ఫీల్డ్ అధికారి చెప్పిన చోట పనిచేస్తామని ఉపాధి కూలీలు తేల్చి చెప్పడంతో కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ వివాదాన్ని ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళ వద్ద ఫోన్ లాక్కుని మరీ దాడి చేశారు. దాడిలో ఉపాధి కూలీలు సుష్మ, కమలమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఘటనలో నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో బాధిత ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తాము చెప్పిన చోటే పని చెయ్యాలంటూ దౌర్జన్యం కులం పేరుతో దూషిస్తూ దాడి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని పోలీసులు -
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
చిలకపూడి(మచిలీపట్నం): ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నారు. ప్రతిరోజూ ఉదయమే యోగాతో దైనందిన కార్యక్రమాలను సజావుగా చేసుకోవచ్చన్నారు. గ్రామాలు, మండలాల్లో ఆ మేరకు యోగా ట్రైనర్లు నిరంతరం యోగ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్రలో పేర్ల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాధారణ యాప్తో పాటు వాట్సాప్ ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా పేర్ల నమోదు కార్యక్రమం చేయడానికి అవకాశం లభించిందన్నారు. జిల్లాలో 17.39 లక్షల మంది ఉండగా ఇందులో ఇప్పటివరకు 7.59 లక్షల మంది సర్వే పూర్తైందన్నారు. అందులో 3.38 లక్షల మంది యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. గ్రామస్థాయిలో జరిగే యోగా పోటీలు పూర్తవుతాయన్నారు. వాటిని అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం రెండు రోజులపాటు మండల స్థాయిలో యోగా పోటీలు జరగనున్నాయన్నారు. వీటిని ప్రణాళిక బద్ధంగా నిర్వహించడానికి అందరూ సంసిద్ధం కావాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు గుడివాడ మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మనోహర్, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమారు, డీటీడబ్ల్యూవో ఫణి ధూర్జటి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
జగన్ సంక్షేమ సంతకం.. అన్నదాతల్లో ఆనందం
కంకిపాడులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రిల్యాబ్ కాలువలకు మరమ్మతులు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జూన్ మొదటి, రెండు వారాల్లో సాగునీటిని ప్రధాన కాలువలకు విడుదల చేశారు. కాలువలు, బోర్ల సదుపాయంతో భూములను దుక్కి, దమ్ములు చేయించి నారుమడులు, ఇతర ఖరీఫ్ సాగు పనులు రైతులు చేసుకున్నారు. రైతు భరోసా పథకం.. పెట్టుబడి సాయంగా ఖరీఫ్లోనే కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.13,500 విడతల వారీగా అందించి రైతులకు భరోసా ఇచ్చింది. 2019–24 వరకూ రూ.979.29 కోట్లు రైతు భరోసా కింద లబ్ధి చేకూరింది. మేమున్నామన్న ధైర్యం.. మిచాంగ్ తుపానుతో పంట నష్టం వాటిల్లితే నిబంధనలను పక్కన పెట్టి దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేసింది. 1,64,849 మంది రైతులకు ఇన్పుట్సబ్సిడీగా రూ. 126.03 కోట్లు అందించింది. అంతే కాకుండా వివిధ విపత్తులతో జరిగిన నష్టానికి ఐదేళ్ల కాలంలో రూ 47.77 కోట్లు రైతులకు అందించిన పరిస్థితి. రుణ సాయం.. సున్నావడ్డీ కింద రూ లక్ష లోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులు కృష్ణాజిల్లాలో 1.66 లక్షల మందికి రూ 30.23 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 30,405 మందికి రూ 7.72 కోట్లు లబ్ధి చేకూర్చింది. చెంతకే సేవలు.. రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచం యావత్తూ రైతు సేవల గురించి చర్చించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా విధానాన్ని అమలు చేసింది. గ్రామ స్థాయిలో భరోసా కల్పించిందంటూ రైతులు గుర్తు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. జలకళ సాకారం.. వైఎస్సార్ జలకళతో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకీ సబ్సిడీతో కూడిన బోరు సదుపాయం కల్పించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాల్లో జలకళ కింద బోర్లు ఏర్పాటయ్యాయి. పక్కాగా పరీక్షలు.. నియోజకవర్గానికి ఒక అగ్రిల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మట్టి నమూనాతో పాటుగా విత్తన నాణ్యత, ఎరువుల, పురుగు మందుల నాణ్యత, చేపల మేత నాణ్యత పరిశీలన వంటి అనేక పరీక్షలు అందించింది. ఒక్కో ల్యాబ్ ద్వారా నెల నెలా 100 పరీక్షలకు తగ్గకుండా జరిగాయంటే వాటిని ఎంత సమర్థంగా అందుబాటులోకి తెచ్చిందో, రైతుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుందో అర్థమవుతుంది. -
దుర్గగుడి భూముల పరిరక్షణకు చర్యలు
ఆలయ ఈవోతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ లక్ష్మీశ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ, దుర్గగుడి దేవస్థాన భూములు అన్యాక్రాంతం అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం దుర్గగుడి ఈవో శీనానాయక్తో సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబ ర్లో సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో దేవ దాయ శాఖ, దుర్గగుడికి చెందిన భూములు, పొలాలు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం కావడంపై దాతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నిర్ణయాలు.. ఈ నేపథ్యంలో దేవాలయ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్, ఈవోలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఆలయ భూములు ఉన్న మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారితో మాట్లాడారు. దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారుల వద్ద ఉన్న రికార్డుల మేరకు వెంటనే ఆలయ భూములను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. వివాదాలలో ఉన్న ఆలయ భూములు, పొలాల వివరాలను దుర్గగుడి లీజెస్ విభాగం అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చైతన్య, దేవదాయ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పురోగతి లేకుంటే ఉపేక్షించం
చిలకలపూడి(మచిలీపట్నం): గృహ నిర్మాణాల్లో పురోగతి లేకుంటే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ నెల 13న సమీక్షించినప్పుడు 910 గృహాలను లక్ష్యంగా నిర్ణయించగా.. కేవలం 412 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. మచిలీపట్నం నగరం, అవనిగడ్డ, కోడూరు, గన్నవరం, చల్లపల్లి, పెదపారుపూడి, కృత్తివెన్ను, మోపిదేవి, గుడివాడ నాగాయలంక మండలాలు పురోగతిలో చాలా వెనుకబడ్డాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో లెంటల్ స్థాయిలో 8,108, పైకప్పు స్థాయిలో 2,148, రూఫ్ కాస్టింగ్ స్థాయిలో 588 ఇళ్లు ఉన్నాయన్నారు. జూన్ నెల 13వ తేదీన నిర్వహించే సమావేశానికి పనితీరు మార్చుకోకపోతే కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు బాధ్యులైన వారిని అందర్నీ సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గృహ నిర్మాణంపై మండల ప్రత్యేక అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో పాటు వెల్ఫేర్ సెక్రటరీ, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నేడు పింఛన్ల పంపిణీ.. జూన్ ఒకటో తేదీన సెలవు కావటంతో ఈనెల 31వ తేదీ శనివారం పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమార్, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాల్లో చాలా మండలాలు వెనుకబడి ఉన్నాయి అధికారులతో కృష్ణా కలెక్టర్ సమీక్ష -
ఆలయ భూముల హస్తగతానికి కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దేవాదాయశాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయ స్థానాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన వారికి కారు చౌకగా దేవుడి భూములు కట్టబెట్టేందుకు సిద్దమైంది. దాతలు స్వామివారి నైవేద్యం కోసం ఆలయాలకు విరాళంగా ఇచ్చిన భూములను క్యాబినెట్ ఆమోదం లేకుండా, వేలం నిర్వహించకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో నచ్చిన వారికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు ఈ నెల 2న ప్రభుత్వం జీవో నంబర్ 139 విడుదల చేసింది.అంతేకాకుండా ప్రస్తుత లీజు దారులకు మరో 33 ఏళ్లు లీజు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానాల ఆదేశాలను లెక్కచేయకపోవడమే. దేవాదాయ శాఖ భూములను లీజుకు ఇవ్వాలంటే టెండర్ విధానం ద్వారా బహిరంగ వేలం నిర్వహించి ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికివ్వాలి. వ్యవసాయేతర భూములను 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వకూడదని కోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేవాదాయ శాఖ భూములను తన వారికి అప్పనంగా కట్టబెట్టేందుకు న్యాయస్థానాల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు.ధార్మిక సంఘాలను సంప్రదించలేదురాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన 4,244 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రూ. 5 లక్షల విలువ దాటిన పనులను నామినేషన్ పద్దతిన ఇవ్వకుండా గత వైయస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోంది. దేవుడి భూములు లీజుకు ఇవ్వాలంటే వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వేలం లేకుండా రూ. వేల కోట్ల విలువైన భూములను అప్పగించడానికి చట్ట సవరణ చేయడం దుర్మార్గం.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఆలయాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. హిందూ సమాజం, ధార్మిక సంఘాలను కనీసం సంప్రదించాలన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా చట్టసవరణ చేసేందుకు జీవో ఇస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ కుట్రను వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మఠాలు, సత్రాల పేరిట ఉన్న విలువైన భూములను సేవా సంస్థల ముసుగులో ఎలాంటి వేలం లేకుండా ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 139ని తక్షణం రద్దు చేయాలి. హిందూ సమాజానికి బ్రాండ్ అంబాసిడర్లంటే దేవాలయాల ఆస్తులను దోచుకోవడమేనా? ఒకవైపు ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతుంటే పట్టించుకోకపోగా మరో వైపు ఆలయాల ఆస్తులనే కాజేసే కుట్రలు చేస్తున్నారు. -
మహానాడులో ఘోరం.. ఎన్టీఆర్కు తీవ్ర అవమానం
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడులో ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘోర అవమానం జరిగింది. కార్యకర్తలను ఆకర్షించేందుకు మొక్కుబడిగా ఎన్టీఆర్ జపం చేసే చంద్రబాబు నాయుడు.. మహానాడులో ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు!. ఆయన మనవడు చనిపోతే.. కనీసం వేదికపై సంతాపం కూడా వ్యక్తం చేయలేదు!!. కడప వేదికగా జరిగిన మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చంద్రబాబు చేయలేదు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఎన్టీఆర్ ఏఐ వీడియోను తయారు చేశారు. ఇందులో ఎన్టీఆర్ మనసుకు, ఆయన ఉన్నప్పటి స్టేట్మెంట్లకు విరుద్ధంగా చంద్రబాబు పొడిగించుకున్నారు. భళా మనవడా.. అంటూ ఎన్టీఆర్ వారసుడు లోకేష్ అంటూ ఏఐ వీడియోలో చెప్పించుకుని ఆనంద పడ్డారు. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమై.. ట్రోలింగ్కూ దారి తీసింది. రాజకీయావసరం పడినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటారనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసు. పలు సందర్భాల్లో కంటి తుడుపు చర్యగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని పైకి మాట్లాడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో టీడీపీ భాగమైనప్పటికీ ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక, ఈ మహానాడుకు నందమూరి కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మహానాడుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా హాజరుకాలేదు(సినిమాలే ముఖ్యం అనుకున్నారేమో). అలాగే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా నందమూరి తారకరత్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. తారకరత్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. -
వందల కోట్లలో ముంచేసి.. ఎట్టకేలకు యూ పిక్స్ క్రియేషన్ యజమాని అరెస్ట్
పల్నాడు జిల్లా: వందల కోట్లలో అమాయకుల్ని మోసం చేసిన యూపిక్స్ క్రియేషన్స్ స్కాం అధినేత వెంకట సత్యలక్ష్మి కిరణ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నరసరావుపేట ,గుంటూరు ,విజయవాడలో వందలాది కోట్లు వసూలు చేసి ఐపీ పెట్టిన కిరణ్ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కిరణ్ను ఉత్తరాఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. కిరణ్పై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఎత్తున పోలీసు కేసులు నమోదయ్యాయి. యానిమేషన్ కంపెనీ పేరు చెప్పాడు. లక్ష పెట్టుబడి పెడితే ఏడాది సరికల్లా లాభం వస్తుందని నమ్మించాడు. నమ్మకం కుదిరేందుకు మొదట్లో చెప్పినట్లుగా పెట్టుబడిదారులందరికి లాభాలు చూపించాడు. అంతే వందల మంది జనాలు కోట్లు తెచ్చి అతని చేతిలో పెట్టారు. అలా దాదాపు వెయ్యి కోట్లు సేకరించాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ 2021లో యూపిక్స్ క్రియేషన్స్ పేరుతో ఓ యానిమేషన్ కంపెనీని ప్రారంభించాడు. యానిమేషన్లు తయారు చేసి తానో పెద్ద కంపెనీని నడుపుతున్నానని బిల్డప్ ఇచ్చాడు. యూపిక్స్ యానిమేషన్ కంపెనీని మల్టీనేషనల్ కంపెనీగా మారుస్తున్నట్లు ప్రచారం చేశాడు.విజయవాడ,గుంటూరు,నర్సరావు పేటలలో మీడియేటర్లు యూపిక్స్ క్రియేషన్ యానిమేషన్ కంపెనీ గురించి ప్రచారం చేశారు. యూపిక్స్ కంపెనీ పెద్ద పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్ అందిస్తుందని ఊదరగొట్టేశారు. యూపిక్స్ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని ఆశచూపించారు. లక్ష పెట్టుబడి పెడితే ఏడాదికి లక్ష లాభం వస్తుందని చెప్పారు. దీంతో నరసరావుపేటకు చెందిన కొందరు యూపిక్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.మాట ప్రకారం కిరణ్ కంపెనీలో పెట్టుబడిపెట్టిన పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలో లాభాలు చూపించాడు. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో నరసరావుపేటలోని బడాబాబులు,రియలర్టర్లు, డాక్టర్లు,మిర్చీ ఎక్స్పోర్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని కోట్లకోట్లు కంపెనీలో పెట్టారు.గుంటూరులో కిరణ్ మీడియేటర్లను రంగంలోకి దించడంతో పెద్ద పెద్ద బిగ్ షాట్లు ఉచ్చులో పడ్డారు. ఒక్కొకళ్లు పది,ఇరవై,ముప్పై కోట్లు వరకు ఇచ్చారు. ఇలా పెట్టుబడులు పెట్టించిన మీడియేటర్లకు కిరణ్ ముప్పై శాతం కమీషన్ ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని కిరణ్ తన అకౌంట్లో వేసుకున్నాడు.పల్నాడు జిల్లా నరసరావు పేటలో రూ.380 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఇలా గుంటూరు,విజయవాడ,హైదారబాద్,బెంగళూరు,సింగపూర్ల నుంచి వందల కోట్లు వసూలు చేశాడు. ఏడాది తర్వాత తమకు ఇస్తామన్న రిటర్న్ ఇవ్వాలని పెట్టుబడి దారులు కిరణ్ని అడిగారు. నెలరోజుల్లో ఇస్తానని చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మల్టీ నేషనల్ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం చేయడంతో పాటు దేశ, విదేశాల్లో తనకు సన్మానం జరిగినట్లు ప్రచారం చేయడంతో మరింతమంది బడాబాబులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇలా వెయ్యికోట్లు వసూలు చేసిన కిరణ్.. అదును చూసి బోర్డు తిప్పేశాడువసూలు చేసిన మొత్తాన్ని కాజేసి కుటుంబంతో కలిసి పారిపోయాడు. దీంతో కిరణ్ బండార బయటపడడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్ కోసం రెండు నెలల నుంచి గాలింపు చర్యల చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో కిరణ్ను ఉత్తరాఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి తరలిస్తున్నారు. -
వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని వినతి
గరికపాడు(జగ్గయ్యపేట): తమను వ్యవసాయశాఖలో విలీనం చేయాలంటూ జగ్గయ్యపేట మండలంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ)లు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఢిల్లీరావును కోరారు. ఢిల్లీరావు గురువారం గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను సందర్శించారు. ఈ సందర్భంగా వీఏఏలు ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి మాతృశాఖ వ్యవసాయ శాఖలోకి విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ/వార్డు సర్వేలకు తమను వినియోగిస్తుండటంతో రైతులకు సలహాలు, సూచనలు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కమిషనర్ ఢిల్లీరావు మాట్లాడుతూ వీఏఏల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.హెచ్ఎంల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్లో గందరగోళంమచిలీపట్నంఅర్బన్: ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్లో గందరగోళ పరి స్థితి ఎదురైంది. గురువారం ఉదయం ఎని మిది గంటలకు కౌన్సెలింగ్కు హెచ్ఎంలను పిలిచిన విద్యాశాఖ అధికారులు సాయంత్రం ఆరు గంటలకు సైతం ప్రక్రియను ప్రారంభించలేదు. కౌన్సెలింగ్ కోసం వచ్చిన ఉపాధ్యాయులు అప్పటి వరకు పడిగాపులు పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో జెడ్పీ, మునిసిపల్ హై స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ అధికారులు కౌన్సెలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో కౌన్సెలింగ్ను ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రం 6.30 గంటలకు మాన్యువల్ పద్ధతిలో అధికారులు కౌన్సెలింగ్ను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో గుర్తించిన 95 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీలకు 1:3 నిష్పత్తితో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేశారు.ఎలక్షన్ గోదాముకు పటిష్ట భద్రతభవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ గోదాము వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, సంబంధిత అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సాధారణ తనిఖీల్లో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచే జిల్లా ఎలక్షన్ గోదామును ఆయన గురువారం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గోదాములోని సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీచేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ గోదామును ఎప్పటికప్పుడు నిశితంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీమ్ పాల్గొన్నారు.పర్యావరణ దినోత్సవంలో భాగస్వామ్యం కావాలిసాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యంకా వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. విజయవాడలోని మండలి ప్రధాన కార్యాలయంలో గురువారం సర్కులర్ ఎకానమీపై తదుపరి కార్యచరణ సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రధానంగా ఏపీఎస్ ఆర్టీసీ, రైల్వే, నేషనల్ హైవే విభాగాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్లాస్టిక్ను అంతం చేద్దామనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 30 విభాగాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్మూలనకు ఎటువంటి పద్ధతులు వినియోగిస్తున్నారనే దానిపై చర్చించారు. -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్న గరికపాడు(జగ్గయ్యపేట): ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు సూచించారు. గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ.. జూన్ 12వ తేదీ వరకు రైతులను ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేసేలా వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో భూమి, భూసార పరీక్ష, నీరు–నీటి పరీక్షల ప్రాముఖ్యత, సాగు మెలకువలు, పంటల ఎంపిక, అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలు, యాంత్రీకరణ సౌలభ్యం, పంటల యాజమాన్యం, సస్యరక్షణ, పాడి పశువుల యాజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర పథకాలపై గ్రామ స్థాయిలో రైతులకు వివరిస్తారని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగులో రైతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. వరి, మిర్చి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు, ఆహార ధాన్యాల సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులకు శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో వివరించాలన్నారు. గ్రామాల్లో పశుపోషణకు రైతులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడుకు చెందిన రైతులు సతీష్, వెంకటేశ్వర్లు జింకు సకాలంలో పంపిణీ చేయటం లేదని, పంట నష్టపరిహారం సక్రమంగా అందించలేదని, వరిలో ఎలుకల నివార ణకు అధికారులు కనీస చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ ఢిల్లీరావు రైతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేవీకేలో వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, డీఆర్ఎస్ మాధవిలత, కేవీకే కోఆర్డినేటర్ అచ్యుతరాజు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణంరాజు, జగ్గయ్యపేట, నందిగామ ఏడీఏలు భవానీ, శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం వలంటీర్లు, ఏఓలు, వీఏఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు -
ఏడుగురు గంజాయి విక్రేతలు అరెస్ట్
నాలుగు కేజీల గంజాయి స్వాధీనం కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆర్పేట పోలీస్స్టేషన్లో ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంలోని ఓగీసుపేటకు చెందిన భూపతి వినూతన్సాయి, యర్రంశెట్టి కేశవనాగకుమార్, ఈడేపల్లికి చెందిన జోగి సాయిశ్రీనివాస్, రుస్తుంబాదకు చెందిన మల్లిపూడి వినయ్, పుప్పాల స్వామి, వెన్న అనిల్కుమార్, సుకర్లాబాదకు చెందిన చిట్టిబొమ్మ గీతకృష్ణ అనే యువకులు ఈ నెల 28వ తేదీన ఇటుకబట్టీల వద్ద గంజాయి తాగుతున్నారు. సమాచారం అందుకున్న స్పెషల్పార్టీ పోలీసులు రైడ్ చేసి పై ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నాలుగు కేజీల గంజాయి లభించింది. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా నగరంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారికి సరఫరా చేస్తున్న పలువురు పేర్లను పోలీసులకు చెప్పారు. దీంతో పట్టుబడిన ఏడుగురిపై గంజాయి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పట్టుబడిన వారికి సరుకు సరఫరా చేస్తున్న మరికొంత మందిని తర్వలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఇనగుదురుపేట, ఆర్పేట పోలీసులు, స్పెషల్పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్
ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్కుమార్ కోనేరుసెంటర్: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి జిల్లాలో నేరాల నియంత్రణ చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత డిస్ట్రిక్ క్రైం రికార్డ్ బ్యూరో (డీసీఆర్డీ)ని సందర్శించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం స్పెషల్బ్రాంచ్ను సందర్శించారు. అక్కడి నుంచి ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, హోంగార్డ్స్, డాగ్స్క్వాడ్ విభాగాలలో తనిఖీలు చేశారు. ఆయా విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీతో కలిసి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పనితీరు సంతృప్తికరం.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలు విశిష్ట కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాటి వినియోగం ద్వారా నేరాలను చాలా వరకు తగ్గించగలుగుతున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి, స్థానికుల సహకారంతో నాలుగు వేలకు పైగా సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగలిగామన్నారు. వాటి ద్వారా అనేక కేసులకు సంబంధించిన దర్యాప్తును మరింత వేగవంతం చేయగలుగుతున్నామని చెప్పారు గంజాయిపై ఉక్కుపాదం.. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు, బారికేడ్లు, రేడియం స్టిక్కర్లతో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రదేశంలో నిఘాను ఏర్పాటు చేసి గంజాయి విక్రేతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గంజాయి వినియోగాన్ని కూకటివేళ్లతో పెకలించేలా చర్యలు చేపట్టటం జరుగుతుందన్నారు. అలాగే మత కల్లోలాలు రెచ్చగొట్టేలా, మత సామరస్యానికి భంగం వాటిల్లేలా వ్యవహరించే వ్యక్తుల చర్యలను అరికట్టేందుకు స్పెషల్ బ్రాంచ్ విభాగం ద్వారా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి మతపరమైన గొడవలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ భూమి పరిరక్షణకు చర్యలు
వివాదాస్పద భూమిని పరిశీలించిన దేవదాయశాఖ ఏసీ కంకిపాడు: అమ్మ భూమి పరిరక్షణకు సమర్థ చర్యలు తీసుకుంటామని, అన్యాక్రాంతం కానివ్వబోమని దేవదా యశాఖ ఏసీ నూతక్కి వెంకట సాంబశివరావు అన్నారు. మండలంలోని నెప్పల్లిలో గల దేవదాయశాఖ భూమిని ఆ శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. వివాదాస్పదంగా మారి న భూమిలో రియల్ వెంచర్ నిర్వాహకులు చేపడుతున్న పనులను అడ్డుకున్నారు. స్థలాల మెరక, వ్యర్థనీటి తొలగింపు పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏసీ నూతక్కి వెంకట సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. అగ్రిమెంట్లు తేవాలని ఆదేశం.. మండలంలోని నెప్పల్లి గ్రామంలోని ఆర్ఎస్ నంబరు 101లో 4.41 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ దుర్గగుడి దేవస్థానానికి చెందిన భూమి ఉందని ఏసీ చెప్పారు. ఈ భూమిని దేవదాయశాఖకు సంబంధం లేకుండా కన్యకా పరమేశ్వరీ సత్రం నిర్వాహకులు అడంగల్లో పేరు నమోదు చేయించి, లీజుకు ఇచ్చారని చెబుతున్నారన్నారు. లీజుకు సంబంధించిన దస్తావేజులు అందించాలని ఆదేశించామన్నారు. దేవస్థానానికి చెందిన భూమి నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు అక్రమంగా రహదారిని నిర్మించారన్నారు. కన్యకా పరమేశ్వరీ సత్రం నుంచి తమకు లీజుకు ఇచ్చారని చెబుతున్నారన్నారు. అందుకు సంబంధించిన దస్తావేజులు, అగ్రిమెంట్లు తేవాలని ఆదేశించామన్నారు. దేవదాయ శాఖకు చెందిన భూమి నుంచి రోడ్డు నిర్మించటాన్ని సహించేది లేదన్నారు. తక్షణమే రోడ్డును మూసివేస్తున్నామన్నారు. దుర్గగుడి అధికారులతో భూమి వ్యవహారంపై సంప్రదింపులు జరిపామన్నారు. 43 ప్రాపర్టీ రిజిస్టర్లో భూమి వివరాలను పొందుపర్చటంతో పాటుగా, భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు. పరిశీలనలో ఇన్స్పెక్టన్ సుజన్కుమార్, ఈఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. లంచం తీసుకున్న డెప్యూటీ సర్వేయర్కు జైలు పెనుగంచిప్రోలు: ఏసీబీ కేసులో మండల సర్వేయర్గా పనిచేసిన సబతి సత్యనారాయణకు ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.6,000 జరిమానా విధించింది. పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అతని తండ్రి వ్యవసాయ భూమికి చెందిన సర్వే రిపోర్టును తహసీల్దార్కు పంపటానికి రూ.2,500 లంచం డిమాండ్ చేయగా.. విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు శ్రీనివాసరావు వద్ద నుంచి 2010, అక్టోబర్ 15న సర్వేయర్ లంచం డబ్బులు తీసుకొంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అతనిపై చార్జ్షీట్ వేశారు. కోర్టు విచారణ అనంతరం గురువారం జరిమానాతో పాటు శిక్ష విధించారు. అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (డీఐపీఆర్వో) ఎం. వెంకటేశ్వరప్రసాద్ గురువారం తెలిపారు. సమాచార, పౌరసంబంధాలశాఖ సంచాలకులు హిమాన్ష్శుక్లా ఆదేశాలు గురువారం జారీ చేశారన్నారు. ఈ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు లేక కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందన్నారు. ఈ ఉత్తర్వులను అనుసరించి కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల అనంతరం పొడిగింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు. -
‘వేగ’కు ఎలాంటి సంబంధం లేదు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ‘బంగారం స్కీమ్ పేరుతో జరిగిన మోసం’ కేసుకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, తమ సంస్థలో ఎటువంటి చిట్టీలు కానీ, ఏజెంట్లు కానీ లేనే లేరని వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా పేర్కొన్నారు. గుణదల సమీపంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తన సోదరుడు సుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి.. నవీన్కుమార్ మాట్లాడుతూ బంగారం స్కీమ్, చిట్టీల పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడైన ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తికి.. తమ సంస్థకు సంబంధం ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముచ్చర్ల శ్రీనివాసరావు తమ ఏజెంట్ అంటూ.. వేగ జ్యూవెలరీకి వారు మాకు హామీ ఇచ్చారంటూ కొంతమంది బాధితులు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. తమను ఏ బాధితుడు వచ్చి కలవలేదని, తాము ఎవరికీ ఎటువంటి హామీలు కానీ, వివరణలు కానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కావాలంటే విజయవాడలోని తమ బ్రాంచి సీసీ కెమెరాలన్నింటినీ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. నిజాయితీతో నడుచుకుంటూ ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తున్న తమ సంస్థ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సంస్థలో ఉన్న బంగారం స్కీములు కేవలం 11 నెలలు మాత్రమే ఉంటాయని, వాటికి కూడా తమ సంస్థ తరఫున అన్ని రశీదులు, ఆన్లైన్ లావాదేవీలు ఉంటాయని వివరించారు. తమకు ఎటువంటి ఏజెంట్లు కూడా లేరని ఈ విషయాన్ని గమనించి, ప్రజలు ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును ఛేదించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సంస్థకు ఎటువంటి ఏజెంట్లు లేరు నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా -
మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం
11, 12 తేదీల్లో నిర్వహణకు దుర్గగుడి అధికారుల ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా మండపం 5వ అంతస్తులో పూజా సామగ్రి, ప్లాస్టిక్ ఆట వస్తువులను విక్రయించే 19 షాపులకు బహిరంగ వేలం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన పనులను దేవస్థాన లీజెస్ విభాగం అధికారులు సిద్ధం చేశారు. జూన్ 11, 12వ తేదీన మహా మండపం ఆరో అంతస్తులో వేలం నిర్వహించనున్నారు. 2022లో అప్పటి ఈవో భ్రమరాంబ మహామండపంలో పూజా సామగ్రిని విక్రయించేందుకు షాపులకు బహిరంగం వేలం నిర్వహించారు. అయితే భక్తులు కొండపైకి ఘాట్రోడ్డు, లిఫ్టు మార్గంతో పాటు మెట్ల మార్గం ద్వారా చేరుకుంటున్నారు. కేవలం మహా మండపం మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే 5వ అంతస్తులోకి మళ్లించడంతో వారికే పూజా సామగ్రి విక్రయించే అవకాశం ఉండేది. వేలాది రూపాయలు అద్దెలు చెల్లించినా వ్యాపారాలు అంతగా లేకపోవడంతో తమ దుకాణాలను కొండ దిగువకు మార్చాలని దుకాణదారులు ఈవోకు మొర పెట్టుకున్నారు. దీంతో కనకదుర్గనగర్లో దేవస్థానం షాపులను నిర్మించి అద్దె బకాయిలు చెల్లించిన వారికి కేటాయింపు చేస్తామని ప్రకటించింది. దీంతో పలువురు వ్యాపారులు బకాయిలు చెల్లించి కనకదుర్గనగర్లో షాపులను దక్కించుకున్నారు. గతేడాది గోశాల వద్దకు.. గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు కనకదుర్గనగర్లోని షాపులను తిరిగి తొలగించి గోశాల ఎదుట కేటాయింపు చేశారు. అయితే ఇటీవల దుర్గగుడి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గోశాల వద్ద ఉన్న దుకాణాలను తొలగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలతో పాటు మహా మండపం 5వ అంతస్తులో ఉన్న దుకాణాలకు టెండర్ నిబంధనల ప్రకారం మూడేళ్ల కాల పరిమితి పూర్తి కానుంది. దీంతో వ్యాపారులు తమ దుకాణాలను తిరిగి రెన్యూవల్ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోసారి ఐదో అంతస్తుకు.. మహా మండపం 5వ అంతస్తుకు తిరిగి దుకాణాలను తరలిస్తున్నట్లు లీజెస్ విభాగం అధికారులు వ్యాపారులకు సూచించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. గతంలో వ్యాపారాలు సరిగా లేకనే కొండ కిందకు దిగామని, తిరిగి మహా మండపంలోకి పంపడం సరికాదని బహిరంగంగానే పేర్కొంటున్నారు. మరో వైపున గోశాల వద్ద షాపులను కేటాయింపులకు దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులతో పాటు కీలక అధికారులకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే కొంత మంది కూటమి నేతలు తమ దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా ఉండేందుకు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్ అధ్యక్షుడిగా భార్గవ్ కుమార్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ పర్యావరణ సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బి.ఎస్ భార్గవ్ కుమార్, ఆ సంస్థ గౌరవ చైర్ పర్సన్గా డాక్టర్ జి.అనిత నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఫౌండర్ సీహెచ్ భద్ర వివరాలు చెబుతూ.. అంకిత భావం గల సంస్థకి సరైన వ్యక్తులను నియమించాలనే ఉద్దేశంతో ఏపీ చాప్టర్కు బీఎస్ భార్గవ్ కుమార్ను నియమించినట్లు తెలిపారు. జర్నలిస్ట్గా కెరీర్ను ప్రారంభించి తదనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారని, ప్రస్తుతం ఏపీ హై కోర్ట్లో అడ్వకేట్గా పని చేస్తున్నారన్నారు. అలాగే ఎంతో మంది జర్నలిస్ట్లను సమాజానికి అందించిన ప్రొఫెసర్ జి. అనితను గౌరవ చైర్ పర్సన్గా ఎన్నుకున్నామని, భవిష్యత్లో ఆమె మార్గదర్శకత్వంలో అందరం పని చేస్తామన్నారు. -
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్కు వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్ జగన్ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
వరి విత్తనాలు పంపిణీ
కంకిపాడు: ఎట్టకేలకు రైతులకు వరి విత్తనాలు పంపిణీ అయ్యాయి. ‘విత్తనానికి వెతుకులాట’ శీర్షికన ఈనెల 25న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆగమేఘాలపై రైతులకు ఖరీఫ్ సాగుకు అనువైన వరి విత్తనాలను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. చర్యల్లో భాగంగా ఉప్పలూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు వరి విత్తనాలను ఏఎంసీ చైర్మన్ అన్నే ధన రామకోటేశ్వరరావు పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన వరి విత్తనాలు ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్సిడీపై అందించే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, సర్పంచ్ లాం సోనియా, మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్ పాల్గొన్నారు. 6న కూచిపూడిలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం మొవ్వ: కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో జూన్ 6వ తేదీన కృష్ణాజిల్లా స్థాయి యోగాంధ్ర–2025కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మొవ్వ ఎంపీడీవో జె. విమాదేవి తెలిపారు. సుమారు 1000 మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. వీఐపీల భద్రతపై అవగాహన రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వీఐపీలు ప్రయాణించే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రత విషయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించాలని రైల్వే ఆర్ఐ శీరిష సిబ్బందికి సూచించారు. రైల్వే ఎస్పీ కార్యాలయంలో రైల్వే రిజర్వ్డ్ పోలీసులకు, అధికారులకు వీఐపీ భద్రత విధులపై ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఐపీలు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆర్ఐ శీరిష వివరించారు. ప్రధానంగా ఉన్నత స్థాయి వ్యక్తులను, వారి పరిసరాలను రక్షించడానికి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముప్పు అంచనా, భద్రతా ప్రణాళిక, అత్యవసర ప్రతిస్పందన వంటి అనేక అంశాలను పర్యవేక్షించాలన్నారు. ముగిసిన ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు భారీగా తగ్గిన హాజరు మచిలీపట్నంఅర్బన్: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మే 19న ప్రారంభమైన పరీక్షలకు జిల్లాలో 30 కేంద్రాలు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 11,059 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 7,380 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. తెలుగు పరీక్షకు 1,003 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 598 మంది, సెకండ్ లాంగ్వేజ్కు 292 మంది అభ్యర్థులు ఉండగా కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు, థర్డ్ లాంగ్వేజ్కు 885 మందికి గానూ 486 మంది, గణితానికి 2,402 మందికి గానూ 1,681 మంది, ఫిజికల్ సైన్స్కు 2,252 మందికిగానూ 1,596 మంది, బయోలాజికల్ సైన్స్కు 2,266 మందికి గానూ 1,598 మంది, సోషల్కు 1,889 మందికి గానూ 1,352 మంది, ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్–2) పరీక్షకు 60 మందికి గానూ 39 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి నుంచి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ మోపిదేవి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పిలుపు మేరకు ఘంటసాల కేవీకే ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేవీకే సమన్వయకర్త, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ డి. సుధారాణి బుధవారం తెలిపారు. రైతులకు వివిధ పంటల్లో సార్వా సాగుకు కావలసిన సూచనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర విషయాలపై మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. అందులో భాగంగా మండలంలో తొలిరోజు గురువారం ఉదయం 9.30గంటలకు వెంకటాపురంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేస్తారని వివరించారు. -
కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు
ఇంటికే సంక్షేమం.. ఇంటికే రేషన్.. ఇంటికే వైద్యం..ఇంటికే పౌర సేవలు.. వెరసి ప్రజలను తమ గడప దాట నీయకుండా సాగింది గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్కరణల పాలన. గ్రామ సచివాలయ వ్యవస్థ.. దానికి అనుబంధంగా వలంటీర్లు.. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు దానికనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం.. ఎండీయూ వాహనాలతో రేషన్ కూడా డోర్ డెలివరీ చేసి దేశంలోనే ది బెస్ట్ అనిపించుకునేలా సేవలందించారు. సీన్ కట్ చేస్తే..కూటమి అధికారం చేపట్టిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రగతి ‘గడప’దాటడం లేదు.. వచ్చీరాగానే వలంటీర్లకు గుడ్ బై అన్నారు.. లేటెస్ట్గా ఎండీయూ వాహనాలకు టాటా చెప్పేశారు.. ఫ్యామిలీ డాక్టర్ను నెమ్మదిగా రిటైర్ చేసేస్తున్నారు. మొత్తంగా ఇంటికే ప్రభుత్వ సేవల కాన్సెప్ట్కే స్వస్తి పలికేసి.. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా చేస్తున్నారు. అంతటా కూటమి నేతల స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో సంక్షేమం జాడైనా లేకుండా.. అభివృద్ధి ఏ కోశానా కనిపించకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. – జి.కొండూరుపథకాలన్నీ గడప వద్దకే.. ఈ ఫొటోలోని మహిళ పేరు చింతలచెరువు పద్మావతి. ఈమెది జి. కొండూరు మండలంలోని గంగినేని గ్రామం. భర్త అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందారు. ఈమెకు కుమారులు వెంకటేశ్వరరావు, వెంకటకృష్ణ. ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పద్మావతి కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల వల్ల రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు పింఛన్ రూపంలో రూ.1,21,500, వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.72,951, సున్నా వడ్డీ పథకం కింద రూ.5,355, వైఎస్సార్ చేయూత పథకం కింద 56,250, రైతు భరోసా పథకం కింద రూ.21,000, జగనన్న తోడు పథకం కింద రూ.20,000, అమ్మ ఒడి పథకం కింద రూ.81,000, వాహనమిత్ర కింద రూ.20,000, ఇంటి స్థలం, పక్కాగృహం ఒక్కొక్కటి చొప్పున అందుకున్నారు. ఈ పథకాలన్నీ అర్హతే ప్రామాణికంగా ఆమెకు అందాయి. ఏ ప్రభుత్వ కార్యాలయం కానీ, అధికారుల చుట్టూ కానీ తిరగకుండా.. గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి, వివరాలు నమోదు చేసుకొని పథకాలు అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మినహా ఏ ఒక్క పథకం ఆమె కుటుంబానికి అందలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లా సమాచారంరేషన్ కార్డులు 11,12,832రేషన్ పంపిణీ వాహనాలు 710రేషన్ పంపిణీ సిబ్బంది 1420గ్రామ సచివాలయాలు 670రైతు భరోసా కేంద్రాలు 630గ్రామ వలంటీర్లు 18,547పెన్షన్ లబ్ధిదారులు 4,59,125వెల్నెస్ సెంటర్లు 614గత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా చేసింది. ప్రజలకు అవసరమైన ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని జగనన్న సురక్ష పేరుతో నేరుగా ఇంటి వద్దకే అందించింది. రేషన్ కూడా ఎండీయూ వాహనాలతో ఇంటి వద్దే పంపిణీ చేసింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థను నిలిపివేయడంతో పింఛన్ లబ్ధిదారులు నరకయాతన పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం, రెవెన్యూ సమస్యలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి 500కి పైగా సేవలను ప్రజలకు అందించింది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా, ఈ–క్రాప్, ధాన్యం కొనుగోలు వంటి సేవలు 100కిపైగా అందించే వారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి ఎరువులు, పురుగు మందుల సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల షాపులకు రెక్కలొచ్చాయి. -
రోడ్డెక్కినా.. సాయం కరువు
గత ఏడాది ఆగస్టులో బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులు తమకు పరిహారం అందలేదని రోడ్డెక్కారు. విజయవాడలో పలు ప్రాంతాలలో బాధితులు రోడ్లెక్కి నిరసన సైతం వ్యక్తం చేశారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గ్రామ వలంటీర్లే నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరికీ పరిహారం అందించేవారని అప్పట్లో బాధితులు బహిరంగంగానే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్రామ వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల వేలాది మంది బాధితులకు పరిహారం అందలేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వైఫల్యం స్పష్టమైంది. -
అనిగండ్లపాడులో ఉద్రిక్తత
● ఉపాధి పనులపై విచారణ సమయంలో కూలీల ఆందోళన ● ఏపీడీ కారును అడ్డగించి నిరసన అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉపాఽధిహామీ పనులపై నిర్వహించిన విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధిహామీ పనులకు రాని వారికి వచ్చినట్లు హాజరు నమోదు చేశారని, గతంలో చేసిన విచారణ సరిగా లేదంటూ గ్రామానికే చెందిన గింజుపల్లి వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీడీ ఎన్. శ్రీనివాసరావు, ఏపీఓ ఎన్. జనార్దనరావు మరోసారి విచారణ నిర్వహించారు. దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కూలీలు తాము అందరూ పనిచేస్తేనే కూలీ డబ్బులు వచ్చాయన్నారు. ఎఫ్ఏగా రమణ పనిచేసిన సమయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అతనినే తిరిగి ఎఫ్ఏగా నియమించాలన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇక్కడకు రావాలని కూలీలు పట్టుబట్టి పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా మేట్లకు వేణు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో చేసేది లేక విచారణాధికారి ఏపీడీ శ్రీనివాసరావు కారులో వెళ్లిపోతుండగా కూలీలు అడ్డుకున్నారు. దీంతో ఆయన మళ్లీ పోలీసుల మధ్య పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లారు. పోలీసులు సర్దిచెప్పడంతో.. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎంఎస్కే అర్జున్ సంఘటనా స్థలానికి వచ్చి కూలీలతో మాట్లాడారు. విచారణ నిర్వహించటానికే అధికారులు వచ్చారని, అధికారులు అందరి దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా అర్జీలు తీసుకున్నారన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఆందోళన తగదన్నారు. మీకు సమస్య ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. దీనిపై ఏపీడీని వివరణ కోరగా వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని, గ్రామంలో మొత్తం 40 గ్రూపులు ఉంటే 22 గ్రూపుల వారు తాము పనిచేస్తేనే డబ్బులు ఖాతాలో జమయ్యాయని లిఖిత పూర్వకంగా తెలియజేశారన్నారు. సామాజిక తనిఖీలో భాగంగా ఎఫ్ఏ నుంచి 2023–24కు సంబంధించి రూ.3లక్షల వరకు రికవరీ చేయాలని ప్రతిపాదించామన్నారు. ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేసి వేరొకరిని ఎఫ్ఏగా నియమించామన్నారు. విచారణ సమగ్రంగా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి పి. సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. -
మేడూరు చోరీ కేసు ఛేదించిన పోలీసులు
పమిడిముక్కల: మేడూరు చోరీ కేసును పమిడిముక్కల, గుడివాడ సీసీఎస్ పోలీసులు ఛేదించారు. రూ.3.50 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండీ స్వాధీనం చేసుకున్నారు. పమిడిముక్కల పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మొవ్వ మండలం మొవ్వ గ్రామానికి చెందిన కాగిత పవన్కుమార్ విలాసాలకు అలవాటు పడి, సులభ సంపాదన మోజులో కృష్ణాజిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. హనుమంతపురం అడ్డరోడ్డు దగ్గరలో గల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పమిడిముక్కల పోలీసులు పవన్కుమార్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. ఈ వస్తువులు ఎక్కడివని అడగ్గా గత సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ రాత్రి మేడూరు గ్రామంలో దొంగిలించినట్లుగా చెప్పాడు. వస్తువులను తనిఖీ చేయగా పోలీస్స్టేషన్లోని రెండు కేసులకు సంబంఽధించినవిగా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కేసుల్లో సుమారు రూ.3.50 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పవన్ గతంలో కూచిపూడి పోలీస్స్టేషన్ పరిధిలో కూడా కొన్ని నేరాలు చేశాడు. అతనిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఉయ్యూరు కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. నిందితుడు పగటి సమయంలో గ్రామాల్లో తన స్నేహితులైన షేక్ బాబావలీ, జక్కుల చందురాజ్, ప్రసాద్బాబులతో కలిసి తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ఆ రోజు ఏ ఇంటిలో దొంగతనం చేయాలో నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి ఒక్కడే వెళ్లి తాళం పగులకొట్టి ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేస్తాడని డీఎస్పీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, ఎస్ఐ బి.శ్రీను, హెచ్సీ రషీద్, పీసీ శ్రీకాంత్, పీసీ సుధీర్, గుడివాడ సీసీఎస్ సీఐ రమణి, ఎస్ఐ స్వామిదాస్, హెచ్సీలు మస్తాన్, రాంబాబు, వేణుగోపాల్ను డీఎస్పీ ధీరజ్ వినీల్ ప్రత్యేకంగా అభినందించి, రివార్డు అందజేశారు. ఇంటికి తాళం వేసి బయట ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, వేసవికాలంలో ఆరుబయట నిద్రించే వారు వస్తువులను జాగ్రత్త చేసుకోవాలని డీఎస్పీ విజ్జప్తి చేశారు. రూ.3.50 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, కేజీ వెండి స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ -
యోగాతో మానసిక ప్రశాంతత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాద రహిత, సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, అందుకు యోగా మంచి సాధనమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల జంక్షన్ వద్ద యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ వాహన చోదకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరమని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్రమాదాలు బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. డ్రైవర్లు ప్రతిరోజూ ఎంతో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాల్సిన అవసరముందన్నారు. డ్రైవర్లలో అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో డ్రైవర్లకు యోగాసనాల శిక్షణ, అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆర్టీవోలు ఆర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షుడు కె.భద్రాచలం (రాజా) తదితరులు పాల్గొన్నారు. యోగాతో గర్భకోశ వ్యాధులు దూరం నున్న(విజయవాడరూరల్): మహిళలు యోగా అలవర్చుకుంటే గర్భకోశ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.సుహాసిని చెప్పారు. మంగళవారం ప్రపంచ మహిళ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నున్న గ్రామ సచివాలయం–2లో జరిగిన యోగసనాల శిక్షణ కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ మహిళలు వేయాల్సిన యోగాసనాల గురించి వివరించారు. కిశోర బాలికలు కూడా ప్రతి రోజు యోగసనాలు వేయాలని సూచించారు. డెప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జె.ఇందు మతి, విజయవాడ రూరల్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎన్. విజయ, ఆశా కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన లోపంతో పుట్టిన శిశువును కాపాడారు
పటమట(విజయవాడతూర్పు): కాన్జెనిటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా (ఇఈఏ) అనే ఒక అరుదైన ప్రాణాంతక స్థితితో 32 వారాలకే 1.6 కిలోల బరువుతో జన్మించిన ఒక శిశువును విజయవాడలోని అంకుర ఆస్పత్రి వైద్యులు కాపాడారు. చికిత్స చేసి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్, డాక్టర్ ఇందుశ్రీ, డాక్టర్ శ్రీముఖి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ వ్యాధి కలిగిన వారికి పేగులు, ఇతర పొట్ట అవయవాలు ఛాతీ భాగంలోకి ప్రవేశిస్తాయని, దీంతో ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు. ఈ వ్యాధి ముందస్తు జననం (ప్రీటర్మ్), తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మరణ ప్రమాదం కలిగించే అవకాశాలు ఎక్కువ చేస్తుందని వెల్లడించారు. అయినప్పటికీ తమ ఆస్పత్రి వైద్య నిపుణుల బృందం శిశువుకు సమర్థంగా చికిత్స నిర్వహించారన్నారు. నియోనటాలజీ నిపుణులైన తాము ము గ్గురం కలిసి శిశువును ప్రథమంగా మెడికల్గా స్థిరపరిచి, శస్త్రచికిత్సకు సిద్ధం చేశామని, తర్వాత పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఎం.వరుణ్ కుమార్ డయాఫ్రాగ్ లోపాన్ని సర్జరీ ద్వారా విజయవంతంగా సరిచేశారని తెలిపారు. ప్రసూతి విభాగానికి చెందిన డాక్టర్ సౌమ్య శిశువును సురక్షితంగా డెలివరీ చేశారన్నారు. అనస్తీషియా నిపుణుడు డాక్టర్ నాగరాజ్ శిశువు పరిస్థితిని బట్టి అనస్తీషియా నిర్వహణ ద్వారా శస్త్రచికిత్స సాఫీగా సాగేందుకు ముఖ్య పాత్ర వహించారని తెలిపారు. చికిత్స అనంతరం శిశువు నెమ్మదిగా కోలుకోగా డిశ్చార్జ్ చేశామన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
గన్నవరంరూరల్: పశువైద్య విద్యార్థులు క్రీడల్లో కూడా రాణిస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని కళాశాల అసోసియేట్ డీన్ పీవీఎస్ కిషోర్ అన్నారు. మండలంలోని కేసరపల్లి డాక్టర్ ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో బుధవారం 15వ వార్షిక క్రీడా దిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీన్ కిషోర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. వృత్తి విద్యా కళాశాలల్లో నిత్యం చదువులతో గడిపే విద్యార్థులకు క్రీడలు సాంత్వన ఇస్తాయన్నారు. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా 410 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని క్రీడా ప్రతిజ్ఞ చేశారు. తొలుత జాతీయ జెండాను అసోసియేట్ డీన్ కిషోర్ ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. హెచ్వోడీ డాక్టర్ సీహెచ్ వెంకట శేషయ్య, పీడీ డాక్టర్ బి.కృష్ణ దీపిక, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్కు కలెక్టర్ నివాళి
చిలకలపూడి(మచిలీపట్నం): మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లాస్థాయి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకె బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలుత శివజ్యోతి విద్యాలయ నాట్యబృందం ఆధ్వర్యంలో చిన్నారులు నృత్యం ప్రదర్శించారు. గేయాలు ఆలపించారు. రోషితశ్రీవల్లిక కళ్లకు గంతలు కట్టుకుని గుర్తింపుకార్డులు చదవటం, హాలులో ప్రత్యేకంగా వ్యక్తులను గుర్తించటం, చూడకుండా బోర్డుపై చి త్రాన్ని గీయటం, సైకిల్ తొక్కటం వంటి ప్రదర్శన లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఎన్టీఆర్ జీవిత విశేషాలతో సమాచార పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, జెడ్పీ ఇన్చార్జ్ సీఈవో ఆనంద్కుమార్, బండి రామకృష్ణ, గోపీచంద్, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో...కోనేరుసెంటర్: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఎస్పీ ఆర్.గంగాధరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. 71 మంది రక్తదానం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటరీ బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది. శిబిరాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రారంభించారు. శిబిరంలో అసోసియేషన్ ప్రతినిధులు 71 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలను నీలం సాహ్ని ప్రత్యేకంగా అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు, ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ జీవీ సాయిప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్మోహన్ పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు గేదెలు మృతి నందివాడ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు గేదెలు మృతిచెందిన ఘటన ఇలపర్రు పంచాయతీ లక్ష్మీనరసింహాపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన రైతులు హనుమంతు సుబ్బారావు, ఎన్.నాగరాజుకు చెందిన రెండు పాడి గేదెలు మేతకు వెళ్తూ విద్యుత్ తీగలు కాళ్లకి చుట్టుకుని మరణించాయి. ఈ గేదెల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారుల సత్తా
విజయవాడస్పోర్ట్స్: నేపాల్లో జరిగిన 11వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారులు జె.శ్రీఆదిత్యరావ్, షేక్ అనీఫ్, ఐ.ఈశ్వర్సాయి, బి.ఈశ్వర్దుర్గ, ఎం.అనీష్కుమార్, పి.కుషాల్ సత్తా చాటారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన ఈ పోటీలకు శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, నేపాల్, భారత దేశాల క్రీడాకారులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆదిత్యరావ్ కుమితే విభాగంలో గోల్డ్, కటా విభాగంలో బ్రాంజ్, హనీష్ కటాలో గోల్డ్, కుమితేలో బ్రాంజ్, ఈశ్వర్సాయి కుమితేలో గోల్డ్, కటాలో బ్రాంజ్, ఈశ్వర్దుర్గ కుమితేలో సిల్వర్, కటాలో బ్రాంజ్, అనీష్కుమార్ కటాలో సిల్వర్, కుమితేలో బ్రాంజ్, కుషాల్లో కటాలో సిల్వర్ కుమితేలో బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరంతా నగరంలోని వాడో–ర్యు కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అకాడమీ డైరక్టర్ జె.ఎం.దాస్, ఇన్స్ట్రక్టర్ ఆరీఫ్ పాషా అభినందించారు. -
దుర్గమ్మ భక్తులకు ఇక్కట్లు తొలగేనా..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సుదూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువన ఉన్న స్నానఘాట్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి దదేవస్థానం బస్సులను నడుపుతోంది. దుర్గాఘాట్ నుంచి ఉచిత బస్సు సర్వీసుతో పాటు టికెటు సర్వీసును నడుపుతున్నారు. దేవస్థాన బస్సులు కొండపైకి చేరుకున్న తర్వాత ఓం టర్నింగ్ వద్ద బస్సు పాయింట్ నిలుపుతారు. అయితే భక్తులు బస్సు దిగే పాయింట్, బస్సు ఎక్కే పాయింట్ ఒకే చోట ఉండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాయింట్లో బస్సులు అంతకుముందే ఉంటే ఇతర ప్రాంతాల్లో బస్సులను నిలుపుతున్నారు. దీంతో భుజానికి ఉన్న లగేజీ, చేతిలో చంటి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బస్సు కోసం పరుగులు తీస్తూ ఆపసోపాలు పడవలసివస్తోంది. ప్రతి శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో ఇక్కడ ఇటువంటి దృశ్యాలు చాలా కామన్. బస్సు కోసం వేచి ఉండే భక్తులు, యాత్రికులు తాము ముందే బస్సు ఎక్కి సీటు దక్కించుకునేందుకు చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. బస్సు ఎక్కే వారు.. బస్సు దిగే వారి మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. భక్తులు బస్సు దిగే పాయింట్, బస్సు ఎక్కే పాయింట్ వేరు వేరుగా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. జేబుదొంగల చేతివాటం బస్సులోకి ఎక్కే భక్తులే టార్గెట్గా జేబుదొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలలో బస్సు పాయింట్ వద్ద జేబు దొంగతనాలు పరిపాటిగా మారింది. మహిళా భక్తుల చేతిసంచులు, బ్యాగ్లలో మనీ పర్సులు చోరీకి గురువుతున్న ఘటనలు ఓం టర్నింగ్ పాయింట్లో సర్వసాధారణమయ్యాయి. ప్రయివేటు వాహనదారుల దందా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండపైకి చేరేందుకు దేవస్థాన బస్సులు అందుబాటులో ఉన్నాయి. దుర్గాఘాట్ నుంచి దేవస్థానం ఉచిత బస్సులతో పాటు రూ.10 టికెటుపై బస్సులను నడుపుతోంది. అయితే కొంతమంది ప్రయివేటు కారు డ్రైవర్లు దుర్గాఘాట్ పాయింట్ను అడ్డాగా మార్చుకుని భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దుర్గాఘాట్ నుంచి దేవస్థాన బస్సు టికెటు రూ.10 కాగా ప్రయివేటు వాహనదారులు రూ.50 వసూలు చేస్తున్నారు. అసలు దుర్గగుడి కొండపైకి భక్తుల వాహనాలతో పాటు దేవస్థాన బస్సులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే పోలీసుల నుంచి గాని, దేవదాయ శాఖ నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 10 కార్లు కొండపైకి, కొండ దిగువకు సర్వీసులు నడుపుతున్నాయి. డ్రైవర్తో పాటు 9 మందికి మాత్రమే ప్రయివేటు వాహనాల్లో అనుమతించాల్సి ఉండగా, డబ్బుల కోసం 12 మందికి పైగానే కుక్కుతున్నారు. ఈ ప్రయివేటు వాహనాల దందాలో రాజకీయ పార్టీ నాయకుల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శీనానాయక్ భక్తుల ప్రయాణ కష్టాలు తొలగేలా చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురు చూస్తున్నారు. ఓం టర్నింగ్లో బస్సు కోసం ఇబ్బందులు స్నానఘాట్, ఓం టర్నింగ్లలో ప్రయివేటు వాహనాల దందా రూ.10 టికెటుకు రూ.50 వసూలు -
మోటార్సైకిళ్ల దొంగలు అరెస్ట్
కృత్తివెన్ను: జల్సాలకు అలవాటు పడి వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన మోటారుసైకిళ్లను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను కృత్తివెన్ను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై మచిలీపట్నం రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ బుధవారం కృత్తివెన్ను పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పల్లెపాలెం పెన్నేరు వంతెన వద్ద స్థానిక పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని మోటార్బైక్తో తిరగడాన్ని గమనించారు. అనుమానం వచ్చి వారిని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమ వరం మండలం యనమదుర్రు గ్రామానికి చెందిన విల్లూరి సుధీర్బాబు ఏడు మోటార్సైకిళ్లను దొంగిలించి పడతడికి వెళ్లే దారిలో ముళ్లపొదల్లో దాచా డు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని అతనికి సహకరించిన మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఎస్ఐ పైడిబాబుతో పాటు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డు ఇచ్చినట్లు తెలిపారు.ఏడు బైక్లు స్వాధీనం -
బంగారం’ స్కీం పేరుతో ఘరానా మోసం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నెలనెలా వాయిదా పద్ధతిలో బంగారానికి డబ్బులు కడితే 25 నెలలు తరువాత కట్టిన దానికి అదనంగా బంగారం, డబ్బులు వేసి ఇస్తారంటూ ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి రూ.30 కోట్లకు టోకరా వేసిన ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ ప్రాంతానికి చెందిన చలవాది లక్ష్మణుడు ఓ టీవీ చానెల్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. అతనికి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్లో నివసిస్తున్న ముచ్చెర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి తాను వేగ జ్యూవెల్లరీలో ఏజెంట్గా పనిచేస్తానని పరిచయం చేసుకుని బంగారం స్కీమ్ గురించి చెప్పాడు. 25 నెలల పాటు నెలకు 30 గ్రాముల బంగారానికి డబ్బులు కడుతూ ఉంటే 26వ నెల మనం కట్టిన డబ్బులకు, ఆ బంగారానికి అదనంగా వేసి తిరిగి చెల్లిస్తారని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం కలిగేలా ఓ 25 మంది టీములో ఉన్న వారిలో ఓ వ్యక్తికి మొదటినెల తాను చెప్పినట్లుగానే బంగారం ఇచ్చాడు. దీంతో అతని మాటలు నమ్మి, వేగ జ్యూవెల్లరీపై నమ్మకం కలగడంతో లక్ష్మణుడు నెల నెలా డబ్బులు కడుతున్నాడు. ఈ క్రమంలో 25 నెలలు ముగిసిన తరువాత 26వ నెల డబ్బులు, బంగారం కోసం లక్ష్మణుడు శ్రీనివాసరావుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన లక్ష్మణుడు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆరా తీయగా మూడు రోజుల నుంచి శ్రీనివాసరావు ఆచూకీ దొరకడం లేదని వారు బదులు ఇచ్చారు. ఇంతలో మరికొంతమంది బాధితులు శ్రీనివాసరావు ఇంటి వద్దకు వచ్చి తాము కూడా బంగారం స్కీముకు, చిట్టీలకు డబ్బులు కట్టామని తమకు కూడా డబ్బులు రావాలని చెప్పారు. దీంతో వారంతా కలిసి బందరురోడ్డులోని వేగ జ్యూవెలరీకి వెళ్లి అక్కడి యాజమాన్యంతో కలిసి మాట్లాడగా వారు శ్రీనివాసరావు తమ ఏజెంట్ అన్న మాట వాస్తవమేనని, అయితే అతను ఎవరి వద్ద డబ్బులు కట్టించుకున్నాడో, ఎంత కట్టించుకున్నాడో తెలియాలంటే ఆయన రావాలని, శ్రీనివాసరావును తీసుకుని వచ్చి ఆధారాలు చూపిస్తే తాము వాటిని ఇస్తామని చెప్పారు. శ్రీనివాసరావు ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో లక్ష్మణుడు ఇతర బాధితులతో కలిసి సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం, చిట్టీలు, టూర్లు ముచ్చెర్ల శ్రీనివాసరావు బంగారం స్కీములతో పాటు చిట్టీలు వేయడం, జనాలను టూర్లకు తీసుకువెళ్లడం చేసేవాడని తెలిసింది. ఇలా చిట్టీలు, బంగారం స్కీ ములు, టూర్ల పేరుతో డబ్బులు ఇచ్చిన బాధితులు మొత్తం 65 మంది సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.30 కోట్ల వరకూ బాధితులు మోసపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి ఆచూకీ తెలుసుకుని అతన్ని విచారించిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. రూ.30 కోట్లకు టోకరా టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న వేగ జ్యూవెల్లరీ ఏజెంట్పై కేసు నమోదు అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్కు క్యూకడుతున్న బాధితులు పరారీలో నిందితుడు ముచ్చెర్ల శ్రీనివాసరావు -
అందుబాటులోకి తేవాలి
వరదలకు రైతులు బాగా నష్టపోయారు. మా గ్రామ రైతుల పొలాలకు కూడా ఎత్తిపోతల పథకం నీళ్లు అవసరం ఉంది. సాగర్ జలాలు రాకపోతే ఎత్తిపోతల పథకం నీళ్లే రైతులకు ఉపయోగపడతాయి. తప్పని సరిగా ఎత్తిపోతల పథకాన్ని తక్షణం ప్రభుత్వం మరమ్మతులు చేయించి అందుబాటులోకి తేవాలి. –పాపినేని శ్రీనివాసరావు, రైతు, సుబ్బాయిగూడెంఅంచనాలు పంపాంరూ.16 లక్షలతో అంచనాలు రూపొంది పంపించాం. వరదల కారణంగా ఎత్తిపోతల పథకంలో మోటార్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. స్తంభాలు వరద నీటిలో కొట్టుకు పోయాయి. కొంతవరకు రైతులు మరమ్మతులు చేయించుకుంటున్నారు. సీజన్ నాటికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తాం. – ప్రభాకర్, ఏఈ, ఐడీసీ ● -
విజయకీలాద్రిపై సుదర్శన హోమం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. -
జాతీయ స్థాయి కూచిపూడి నృత్యంలో జెడ్పీ విద్యార్థిని ప్రతిభ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సంపసాల శ్రావ్య జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళా నిలయం సంస్థ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన 40వ జాతీయ నవరస శాసీ్త్రయ జానపద సంగీత నాట్య కళారూపాల ప్రదర్శనలో జూనియర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శనతో శ్రావ్య ఈ ఘనత సాధించింది. సంస్థ నిర్వాహకులు మంగళవారం నిర్వహించిన ముగింపు సభలో మెమెంటో, ప్రశంసాపత్రాన్ని ఆమెకు అందజేశారు. గతంలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిలో జరిగిన జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానం, దాక్షారామంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో నాట్య రవళి బిరుదు ఆమె అందుకుంది. ప్రముఖ దేవాలయాల్లో అనేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. పాఠశాల హెచ్ఎం పద్మలత, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. -
రైల్వే స్టేషన్లో ‘ఈగల్’ డ్రైవ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కొటిక్స్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్), జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. పోలీసు జాగిలాలతో కలిసి ప్లాట్ఫారంలతో పాటు వెయిటింగ్ హాల్స్, పార్శిల్ కార్యాలయం, ప్రయాణికుల లగేజీలు పరిశీలించారు. ఆ సమయంలో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపైకి వచ్చిన పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్(17479) రైలులో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్లలో క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎటువంటి మాదకద్రవ్యాలు కాని, అనుమానిత వస్తువులు కానీ కనిపించలేదని ఆర్పీఎఫ్ సీఐ జె.వి రమణ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలను అరికట్టేందుకు తరచూ రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాలలో తరచూ ఇటువంటి తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.తప్పుడు కేసులు ఎత్తివేయాలితిరువూరు: తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు తమ పార్టీ నాయకులపై నమోదు చేసిన తప్పుడు కిడ్నాప్ కేసులు ఎత్తివేయాలని నగర పంచా యతీ కౌన్సిలర్లు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసులపై గత నెల 20న పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వాస్తవం లేదన్నారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని 13, 20 వార్డుల కౌన్సిలర్లు ఇనపనూరి చిన్నారి, షేక్ నదియాలు లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసులు ఉపసంహరించని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, ప్రకాష్ తెలిపారు.ఆర్జిత సేవలకు డిమాండ్ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో ఆలయ ఈవో శీనానాయక్ దంపతులతో పాటు 27 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన ఛండీహోమంలో 183 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ యాగశాలలో కూర్చునేందుకు వీలు లేకపోవడంతో యాగశాల ఆరు బయట కూర్చొని భక్తులు యాగంలో పాల్గొన్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో సైతం ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.పెనుగంచిప్రోలు పీహెచ్సీ తనిఖీపెనుగంచిప్రోలు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, సిబ్బంది రికార్డులను పరిశీలించారు. ల్యాబ్, మందుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. సర్వేలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన సర్వేలను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఈహెచ్ఆర్ నిర్వహణ,ఎన్సీడీ–సీడీ సర్వే, గర్భిణుల నమోదు తదితర కార్యక్రమాల అమలుపై సమీక్ష చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు. -
ఖాళీల జాబితా విడుదల చేయాలని వినతి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీలలో ప్రిఫరెన్షియల్ కేటగిరీకి 50 శాతం కోరుకునే అవకాశమున్న ఉన్నత పాఠశాలల్లోని ఖాళీల జాబితా విడుదల చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు బదిలీలకు సంబంధించిన సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును వివరించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బదిలీల జీఓ ప్రకారం 2021కి ముందు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇవ్వవలసి ఉండగా ఎంఈఓలు నిరాకరించారన్నారు. దీంతో ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొందన్నారు. ప్రస్తుతం జరగబోతున్న ఉద్యోగోన్నతులకు మాన్యూవల్ కౌన్సెలింగ్ జరపాలన్నారు. మ్యూజిక్ టీచర్స్ బదిలీ ఆన్లైన్ దరఖాస్తులకు మే 27వ తేదీ చివరి రోజు కాగా ఓపెన్ కాలేదని, అప్లికేషన్లు ఓపెన్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జిల్లా కార్యదర్శి ఎన్. సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గడువుకు ముందే పరిశ్రమలకు అనుమతులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా ప్రజలకు 500కు పైగా సేవలు అందిస్తోందని, ఇందులో పారిశ్రామిక సేవలపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకొనేలా ప్రోత్సహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2025, ఏప్రిల్ 1 నుంచి మే 26 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 824 దరఖాస్తులు స్వీకరించారన్నారు. ఇప్పటికే 762 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు.. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశిత గడువుకు ముందే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రోత్సాహకాలపై స్క్రూటినీ.. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015–20), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2020–23), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2023–27) కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూటినీ కమిటీ సమావేశాలు నిర్వహించిందని కలెక్టర్ చెప్పారు. 90 క్లెయిమ్లకు రూ. 4.13కోట్లు మేర ప్రతిపాదనలు పంపగా.. వీటిపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, ఇన్చార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు
ఇదిగో నాటి వికాసంÆ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పాలన ఎంతో సమర్థంగా సాగిందంటూ ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. Æ ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రూ. కోటి వరకూ విలువైన ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తెచ్చింది. కృష్ణాజిల్లాలో 497 పంచాయతీలకు 385 సచివాలయాలు, ఎన్టీఆర్ జిల్లాలో 288 పంచాయతీలకు 285 సచివాలయాలు ఏర్పాటు చేసింది. Æ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది విద్యాభివృద్ధికి బాటలు వేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని చేరువ చేసింది. కృష్ణాజిల్లాలో 1791 పాఠశాలలకు గానూ 488 పాఠశాలల్లో రూ.179 కోట్ల ను, ఎన్టీఆర్ జిల్లాలో 886 పాఠశాలలకు గానూ 341 పాఠశాలల్లో రూ.80 కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేశారు. దీంతో విద్యా ప్రగతికి బాటలు వేయటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుంది. Æ రైతు భరోసా కేంద్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. కృష్ణాజిల్లాలో 363, ఎన్టీఆర్ జిల్లాలో 267 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు, ఏకంగా ఐక్యరాజ్య సమితి బృందం వణుకూరు, గన్నవరం మొదలైన ప్రాంతాల్లో పర్యటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తెలుసుకుని ప్రశంసించారంటే వాటి నిర్వహణ సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది. Æ ప్రజారోగ్యాన్ని పెంపొందించేలా కృష్ణా జిల్లాలో 357, ఎన్టీఆర్ జిల్లాలో 257 వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి గ్రామ స్థాయికి వైద్య సేవలను విస్తృతం చేసి, ప్రజారోగ్య పరిరక్షణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాటుపడింది.కంకిపాడు: ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ హామీలను ఊదరగొట్టింది. పింఛన్లు, మహిళలకు నెలకు రూ. 1500, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అంటూ ప్రజలను మభ్యపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,34,909 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 2,24,216 మందికి సామాజిక పింఛన్లను అందిస్తున్నారు. ఇందుకు గానూ రూ. 199 కోట్లు సొమ్ము అందజేస్తున్నారు. ఇటీవల గ్యాస్ సిలెండర్ల వర్తింపు మినహా(అదీ అరకొరే), ఇతర పథకాలు ఏవీ అమలుకు నోచుకోలేదు. ఏడాది పాలనలో ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు ఎదురుచూసిన ప్రజానీకం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచే నాటికే అమ్మ ఒడి, సాగుకు పెట్టుబడి సాయం విడతల వారీగా అందిందని గుర్తు చేసుకుంటున్నారు. అంతా మా ఇష్టం.. మా వాళ్లకే.. కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల అందజేత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ప్రహసనంగా సాగుతోంది. ఆయా గ్రామ, వార్డుల్లో కూటమి నేతలే నేరుగా అధికారులతో కలిసి వెళ్లి పింఛను లబ్ధిదారులను కలిసి పింఛన్ పంపిణీని ప్రచార ఆర్భాటంగా సాగిస్తున్నారు. నేతలు ఫొటోలకు ఫోజులిస్తూ లబ్ధిదారులను తమ గుప్పిట పెట్టుకునేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. వివిధ కార్పొరేషన్ల కింద జారీ చేసే స్వయం ఉపాధి రుణాల ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. లబ్ధిదారుల ఇంటర్వ్యూలు మండలాల్లో మొక్కుబడిగా సాగాయంటే అతిశయోక్తి కాదు. మొక్కుబడిగా యూనిట్ల కేటాయింపు, ఇంటర్వ్యూలు జరిగిపోయాయి. అన్నీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చే సిఫారసు లేఖల ఆధారంగానే పూర్తి చేశారనే విమర్శ ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధికి యువత, మహిళలకు రుణా లు అందించి, తోడ్పాటు అందించింది. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి వలంటీర్ల చేసింది. అరకొర సేవలతో అవస్థలు పడుతున్న ప్రజలు నిర్వీర్యమవుతున్న సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలు పాలనంతా కూటమి నేతల కనుసన్నల్లోనే.. ఆఖరికి స్వయం ఉపాధి రుణాల జారీలోనూ ఏకపక్ష నిర్ణయాలే లబోదిబోమంటున్న ప్రజలు గత వైఎస్సార్ సీపీ పాలనలో రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సేవలు, పథకాలువ్యవస్థలను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే గ్రామ స్వరాజ్యం సాధన దిశగా ఏర్పాటుచేసిన సచివాలయాలు, వాటిలో పనిచేసే సిబ్బంది మదింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే జరిగితే గ్రామ సచివాలయ స్థాయిలో ఉద్యోగు లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీని వల్ల గ్రామ స్థాయిలోనే అందే అనేక రకమైన పౌర సేవలకు విఘాతం కలుగుతుంది. ఇప్ప టికే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడింది. తాజాగా ఇంటికి రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి, వాహనాలపై ఆధారపడి జీవించే అనేక మంది యువతను రోడ్డు పాలు చేసింది. మళ్లీ కిలో మీటర్ల దూరం వృద్ధులు సైతం నడుచుకుంటూ వెళ్లి రేషన్ డిపోల వద్ద సరుకులు తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించబోతున్నాయి. పేరుకే సచివాలయాలు.. ఆర్బీకేలు.. ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బంది సర్వేల పేరుతో ఇళ్ల వెంబడి తిరుగుతుంటే ప్రజలు సేవల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాలు(నాటి ఆర్బీకేలు) నామ్కే వాస్తే అన్న చందంగా మారాయి. అందులో రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన కియోస్క్లు మరమ్మతులు లేక రైతు సేవలకు దూరంగా ఉంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులు పూర్తిగా కోలుకోలేదు. రబీ ధాన్యం సేకరణ దళారులు, మిల్లర్లు పుణ్యమాని అస్తవ్యస్తంగా సాగటంతో రైతులు నష్టపోయారు. ఉన్నత లక్ష్యంతో రైతుకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేలు నేడు అలంకార ప్రాయంగా మారుతున్నాయంటే.. దానికి సర్కారు అనాలోచిత, నిర్లక్ష్య విధానాలే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025కఠినంగా శిక్షించండి కూటమి పాలనలో దళిత, మైనార్టీలకు రక్షణ కరువైందని.. తెనాలి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.మత సామరస్యాన్ని కాపాడాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మత సామ రస్య పరిరక్షణకు సీపీఎం మంగళవారం సమైక్యతా యాత్రను చేపట్టింది. లెనిన్ సెంటర్ నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు సాగింది. యోగాతో ఆరోగ్యం యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం బందరులో ర్యాలీ నిర్వహించారు. u8లో 7 -
వంశీ అనుచరుడు రంగాకు ముగిసిన పోలీసుల కస్టడీ
హనుమాన్జంక్షన్ రూరల్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగా రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారంటూ హనుమాన్జంక్షన్ పీఎస్లో నమోదు చేసిన అక్రమ కేసులో ఏ 7 నిందితుడిగా ఉన్న ఓలుపల్లి మోహనరంగాను పోలీస్ కస్టడీ కోరడంతో నూజివీడు న్యాయస్థానం రెండురోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ విజయవాడ జైలులో ఉన్న మోహనరంగాను సోమవారం ఇక్కడకు తీసుకువచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో విచారణ చేశారు. రెండు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం ఆయనకు వైద్య పరీక్షల అనంతరం నూజివీడు కోర్టులో హాజరుపర్చారు. ఆ తర్వాత ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.ఆర్థిక బాధలతో యువకుడి ఆత్మహత్యచిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆర్థిక బాధలతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై కొత్తపేట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేఎల్రావునగర్ ఆరోలైన్లో మూడియల సాయి, ప్రవీణ్కుమార్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ప్రవీణ్కుమార్ ప్లాస్టిక్ సామాన్ల షాపులో గుమస్తాగా, సాయి కిరాణా షాపులో పని చేస్తుంటారు. కొంత కాలంగా ప్రవీణ్కుమార్ తెలిసిన వారి నుంచి రూ. 12 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో ప్రవీణ్కుమార్ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోతున్నాడు. సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ ఎవరి పనులకు వారు వెళ్లగా, మధ్యాహ్నం సాయి భర్తకు ఫోన్ చేసింది. గోడౌన్కు వెళ్లాడని యజమాని చెప్పడంతో తర్వా త ఫోన్ చేస్తానని చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చి త లుపులు తీసే సరికి లోపల ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ ప్రవీణ్కుమార్ కనిపించాడు. దీంతో సాయి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ప్రవీణ్ను కిందకు దింపి చూడగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.అనుమానాస్పద మృతిపై కేసుచిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టినగర్ సాధుజాన్ వీధికి చెందిన పైడిపాటి లక్ష్మి, నారాయణరావు(50) భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. నారాయణరావు కూలి పనులు, లక్ష్మీ ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పని చేస్తుంటుంది. నారాయణరావు కొంత కాలంగా మద్యం సేవిస్తుండటంతో భార్య, పిల్లలు మందలిస్తున్నారు. దీంతో నారాయణరావు తాను చనిపోతానని బెదిరింపులకు దిగే వాడు. ఈ నెల 25వ తేదీ మద్యం తాగి ఇంటికి వచ్చిన నారాయణరావు భార్యతో గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఎలుకల మందు తిన్నాడు. అతని పరిస్థితి గ్రహించిన లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు కుంకుడుకాయల రసం తాగించి ఎలుకల మందును కక్కించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ నిద్రపోయారు. ఉదయం 6 గంటల సమయంలో నిద్రలేని చూడగా, నారాయణరావు వాంతులు చేసుకుని, మంచంపై విరోచనం చేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే నారాయణరావును ఆటోలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నారాయణరావు కోలుకోలేక మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధ్దారించారు. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
యోగాంధ్రకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): మంగినపూడిబీచ్లో ఈ నెల 31వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం మధ్యాహ్నం యోగాంధ్ర కార్యక్రమాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ ఉదయం 7 నుంచి 8గంటల వరకు మంగినపూడిబీచ్లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా, ఉపాధిహామీ శ్రామికులు, అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. జూన్ 2న 5వేల మందితో అధికారులు, ఉద్యోగులతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు లక్ష్మీటాకీసు సెంటరు నుంచి సాయిబాబా గుడి వరకు ఒకవైపు రహదారిపై యోగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, యోగాంధ్ర సమన్వయ అధికారి పోతురాజు, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు శివప్రసాద్, హరిహరనాధ్, ఎంఎన్ రాణి, డీఎస్వో పార్వతి, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ బాలాజీ -
తెనాలి ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో దళిత, మైనార్టీలకు రక్షణ కరువైందని.. తెనాలి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదనంలో మంగళవారం మైనారిటీ దళిత యువకులపై తెనాలిలో పోలీసులు చేసిన అమానుష దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం హక్కులను హరిస్తున్నారని... రాష్ట్రంలో టీడీపీ చట్టాలు నడుస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై దళిత, మైనార్టీ యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కర్రలతో కొడుతూ బూటు కాళ్లతో తన్నడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలను వైఎస్సార్ సీపీ ఖండిస్తోందన్నారు. జూన్ 4న మాజీ సీఎం జగన్హన్రెడ్డి పిలుపు మేరకు టీడీపీ అరాచక పాలన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి మస్తాన్ షేక్, పఠాన్ నజీర్ ఖాన్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పేరం త్రివేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, వేముల బేబీ రాణి, ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు సుధాకర్, నాయకులు ఎర్రగోళ్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, ఈసరపు రాజా రమేష్, ఒగ్గు గవాస్కర్, కుందేరు శ్యామ్, మార్తి చంద్రమౌళి, తోపుల వరలక్ష్మి, మాతా మహేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో పెరిగిన దాడులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
ట్రయల్ సీడ్ సాగును నిషేధించాలి
మైలవరం: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్రయల్ సీడ్ సాగును ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, విత్తన రైతుల సంఘం కన్వీనర్ బి. రాము, సీపీఐ మైలవరం మండల కార్యదర్శి బుద్దవరపు వెంకట్రావు తదితరుల ప్రతినిధుల బృందం ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, రైతులు, సీడ్ ఇచ్చే కంపెనీల ప్రతినిధులు మధ్య లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్న తర్వాతే సీడ్ సాగును ప్రోత్సహించాలని, అలా ముందుకు రాని విత్తన కంపెనీలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని విత్తనాలను సాగు చేస్తే పెట్టుబడితో పాటు ఒక సంవత్సరం పాటు ఆ రైతు కుటుంబం పోషణకు అవసరమైన ఆదాయం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. బయట మార్కెట్లో సర్టిఫైడ్ సీడ్ మాత్రమే అమ్మేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాణ్యత లేని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్ముతున్న వారిపై విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు సబ్సిడీతో అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు -
ఎత్తిపోతలు.. ఎదురుచూపులు
పెనుగంచిప్రోలు: స్థానిక శింగవరం రోడ్డులో మునేరుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. 2022లో ఈ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ డీవీఆర్ బ్రాంచి కాలువ పరిధిలోని పెనుగంచిప్రోలు మేజర్ ఆయకట్టులోని చివరి గ్రామం పెనుగంచిప్రోలు. సాగర్ కాలువకు చివరగా ఉండటంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు సక్రమంగా అందడం లేదు. చివరి భూముల సాగునీటి కోసం.. చివరి భూముల సాగునీటి కోసం స్థానిక మునేరులో ఐడీసీ ఆధ్వర్యాన రూ.17.23 కోట్ల వ్యయ అంచనాతో దీనిని నిర్మించారు. ఈ పథకం ద్వారా సుమారుగా 2465.02 ఎకరాలకు సాగు నీరు అందేది. పంపుహౌస్లో 200 హెచ్సీ సామర్థ్యమున్న నాలుగు మోటార్లు, నాలుగు పంపులు ఏర్పాటు చేశారు. నాలుగు పంపుల ద్వారా ఒక రోజులో ఎత్తిపోసే నీరు 30.88 క్యూసెక్కులుగా నిర్ణయించారు. నిలిచిపోయిన పథకం గత ఏడాది సెప్టెంబర్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా మునేరుకు వరదలు రావడంతో పక్కనే ఉన్న ఎత్తిపోతల పథకం మొత్తం నీట మునిగింది. లోపల ఉన్న నాలుగు పంపుల్లోకి నీరు చేరి ఒండ్రు పేరుకు పోయింది. ప్యానెల్ బోర్డులు మొత్తం తడిసిపోయాయి. స్కీమ్కు సంబంధించిన రెండు ట్రాన్స్ఫార్మర్లతో పాటు విద్యుత్ శాఖవారికి సంబంధించిన మరో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా నీటి లో తడిసి పోయి మరమ్మతులకు గురయ్యాయి. 10 విద్యుత్ స్తంభాలు పడిపోగా స్తంభాలు మాత్రం కొత్తవి వేశారు. పూర్తిగా మరమ్మతులకు గురవ్వడంతో ఎత్తిపోతల పథకం పని చేయడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర రైతులు మరమ్మతులు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ ఎత్తిపోతల పథకం పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం గ్రామ రైతులకు ఉపయోపగపడతాయి. పథకం ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించినా తర్వాత అంతా రైతుల ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. రైతులు ఎకరానికి కొంత వేసుకుని మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాల్సి ఉంది. అయితే వరదలకు చాలా నష్టపోయామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖరీప్ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్కై నా పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం బాగుయ్యేనా వరదలకు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు.. పంపులు నిలిచిపోయిన ‘పథకం’ ఆదుకోవాలంటున్న ఆయకట్టు రైతులు -
నెల రోజుల్లో కొత్త అక్రిడిటేషన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ల గడువు నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో వాటిని తక్షణమే రెన్యువల్ చేయాలని, ఈనెల 31, జూన్ 1వ తేదీలు ఆర్టీసీ సెలవు దినాలు కావడంతో బస్పాస్లు రెన్యువల్కు చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఐఅండ్పీఆర్ డైరెక్టర్ హిమాన్ష్శుక్లాకు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఐఅండ్పీఆర్ కార్యాలయంలో డైరెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఏపీయూడబ్ల్యూజే నేతలు వినతి పత్రం అందజేశారు. మరోసారి అక్రిడిటేషన్ పొడిగించకుండా రెగ్యులర్గా ఇచ్చే కొత్త అక్రిడిటేషన్ల ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని డైరెక్టర్ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ .. వచ్చే నెల రోజుల్లోగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం ఉన్న కార్డులు రెన్యువల్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు ఇబ్బంది పడకుండా ఈనెల 30వ తేదీ లోపే బస్ పాస్లు రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకుంటామని చె ప్పారు. రెండు లేక మూడు నెలల కాలానికి అక్రిడేషన్లను రెన్యువల్ చేస్తామని, ఈలోపే రెగ్యులర్ అక్రిడేషన్ల ప్రక్రియ కూడా నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే అక్రిడిటేషన్ కమిటీ జీవో వెలువడుతుందని శుక్లా యూనియన్ నేతలకు తెలిపారు. డైరెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కమిటీ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయుల బదిలీల్లో తిరకాసు!
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో పాలకులు తిరకాసు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు.. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. హ్యాండీక్యాప్డ్, విడోస్, డిపెండెంట్ పేరెంట్స్, సెల్ఫ్ డిసీజెస్ ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాలల్లో 40 శాతం, ఉన్నత పాఠశాలలో 50 శాతం పోస్టులు మాత్రమే కోరుకోవాలనే నిబంధన విధించింది. గత ప్రభుత్వాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ప్రిఫరెన్షియల్ క్యాటగిరీలో ఎటువంటి నిబంధనలు లేకుండా కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాయి.నిబంధన సరికాదుఅయితే కూటమి ప్రభుత్వం విరుద్ధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరిపై చిన్నచూపు చూస్తూ నిబంధనలు విధించింది. ఎన్నో లోపాలు, సమస్యలు ఎదుర్కొని ఉద్యోగం సాధించి నిజాయతీగా పని చేస్తున్న పరిస్థితుల్లో కొన్ని పోస్టులు మాత్రమే కేటాయించి వాటిని మాత్రమే కోరుకోవాలన్న నిబంధన సరైనది కాదని అనేకమంది ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉద్యోగుల హక్కులపై దాడిగా ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో..ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 997 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో 25,251 మంది, 153 అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 1,693 మంది, 217 హైస్కూళ్లలో 56,197 మంది విద్యార్థులు చదువు అభ్యసిస్తున్నారు. మొత్తం 1,367 పాఠశాలల్లో సుమారు 92,141 మంది విద్యార్థులకు 10,445 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.ఆన్లైన్లో బదిలీల దరఖాస్తులుప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ విద్యాశాఖ ప్రారంభించింది. వీటిని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలలకు నిర్వహిస్తున్నారు. తొలుత మే 22 వరకు హెచ్ఎంలు, ఆదివారంతో స్కూల్ అసిస్టెంట్స్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఎస్జీటీల ఆన్లైన్దరఖాస్తులు స్వీకరణ నేటితో ముగియనుంది.బదిలీలు ఇలా..ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మొత్తం 140 ఖాళీలను విద్యాశాఖ గుర్తించింది. అందులో 6 ప్రభుత్వ పాఠశాలల్లో, 140 లోకల్ బాడీస్ నిర్వహిస్తున్న స్కూళ్లలో, 20 మున్సిపల్ యాజమాన్య పాఠ శాలలు ఉన్నాయి. ఇప్పటికే సీనియార్టీ జాబితా అనంతరం 115 మంది లోకల్ బాడీస్ నిర్వహిస్తున్న పాఠశాలకు, ఆరుగురు గవర్నమెంట్, 20 మంది మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల ప్రొవిజినల్ జాబితా విద్యాశాఖ విడుదల చేసింది. స్కూల్ అసి స్టెంట్ ట్రాన్స్ఫర్ పాయింట్లతో కూడిన ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) బదిలీలకు గుర్తించిన ఖాళీలు మొత్తం 1,455 వాటిలో 230 ఎస్ఏ ఇంగ్లిష్, 273 బయోలాజికల్ సైన్స్, 154 ఎస్ఏ హిందీ, 173 ఎస్ఏ పీడీ, 06 ఎస్ఏ సంస్కృతం, 278 ఎస్ఏ గణితం, 230 ఎస్ఏ ఫిజికల్ సైన్స్, 103 ఎస్ఏ తెలుగు, 8 ఎస్ఏ ఉర్దూ, 1,614 ఎస్జీటీలుతో పాటు 41 ఎస్జీటీ ఉర్దూ ఖాళీలు ఉన్నాయి. -
విదేశీ విహంగాల సందడి
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): పెనుగంచిప్రోలు మండలంలోని వెంకటాపురంలో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. వెంకటాపురం విదేశీ పక్షుల విడిదిగా మారింది. ఏటా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్ట్రేలియా నుంచి పెయింటెడ్ స్టాక్స్(ఎర్రకాళ్ల కొంగలు) డిసెంబర్లో గ్రామానికి వచ్చి విడిది చేస్తాయి. వందల సంఖ్యలో వచ్చిన పక్షులు సంతానోత్పత్తి తర్వాత జూన్లో వాటి స్వస్థలాలకు వెళ్తుంటాయి. గ్రామస్తులు కూడా వీటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ప్రస్తుతం కొన్ని పక్షులు వాటి స్వస్థలాలకు వెళ్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. పక్షుల కోలాహలం గ్రామంలో ఎక్కడ చూసినా పక్షుల కోలాహలం కనిపిస్తోంది. వందల సంఖ్యలో వచ్చిన పక్షులు నేడు సంతానోత్పత్తి చేయడంతో వేల సంఖ్యకు చేరాయి. ఇవి చేసే అరుపులు, ధ్వనులతో కోలాహలం సృష్టిస్తున్నాయి. గ్రామస్తులు వాటిని కాపాడుకుంటున్నారు. పక్షుల పిల్లలు గ్రామస్తులతో పాటు కింద తిరుగుతూ వారితో కలిసి పోతున్నాయి. ఇళ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ సందడి చేస్తున్నాయి. నీటి కుంట అభివృద్ధి చేస్తే.. దశాబ్దాల నుంచి తమ గ్రామానికి బంధువుల మాదిరి ఏటా వస్తున్న పక్షులను తమ సొంత పిల్లల మాదిరి, పుట్టింటికి వచ్చిన బిడ్డల్లా చూసుకుంటున్నారు. వీటికి గ్రామంలోని నీటికుంట తాగునీటి అవసరాన్ని తీరుస్తోంది. ఎకరం 80 సెంట్లు ఉన్న ఈ కుంటను ఊర చెరువుగా అభి వృద్ధి చేస్తే పక్షులకు తాగునీటి ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. కుంటలో వర్షం నీరు లేకపోయినా మునేరు ఎత్తిపోతల పథకం నుంచి నీటిని నింపవచ్చు. గతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కూడా నీటిని కుంటలోకి వదిలారు. ప్రస్తుతం నీటి కుంట మొత్తం కంపచెట్లతో నిండి పోయి ఉంది. దీంతో పక్షులు గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద నీటి కోసం వస్తున్నాయి. వెంకటాపురంలో కోలాహలం నీటికుంటను అభివృద్ధి చేయాలంటున్న గ్రామస్తులు రక్షణ చర్యలు చేపడతాం గ్రామంలో విదేశీ పక్షుల రక్షణకు చర్యలు చేపడతాం. గ్రామస్తులు వీటిని తమ సొంత బిడ్డల్లా చూసుకోవడం ముచ్చటేస్తోంది. ప్రస్తుతం గ్రామంలో వేల సంఖ్యలో పక్షులు సందడి చేస్తున్నాయి. వీటి తాగునీటికి అవసరమైన నీటికుంట అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. –మార్కపూడి గాంధీ, ఎంపీపీ -
అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి లేదు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి లేదని ఉన్నతాధికారులకు జిల్లాపై మంచి అభిప్రాయం లేదని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ పి.సాయిబాబు, ఆర్డీవో కె.స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం అర్జీల పరిష్కారంలో మొదట్లో బాగున్నప్పటికీ రానురానూ పరిష్కార ప్రక్రియపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదన్నారు. ఇంకా కొత్త, కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని అధికారులు స్పందించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి తనతో ఎండార్స్మెంట్లో సంతకాలు చేయించుకుని కూడా అర్జీదారులకు పంపడం లేదని సమాచారం వచ్చిందన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని ప్రతి ఉద్యోగి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 27వ తేదీ మంగళవారం 7గంటలకు మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలు నుంచి సాయిబాబా గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఇందులో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. మీకోసంలో 145 అర్జీలను అధికారులు స్వీకరించారు. కలెక్టర్ డీకే బాలాజీ ఎండార్స్మెంట్లు కూడా అర్జీదారులకు పంపడం లేదు పీజీఆర్ఎస్లో 145 అర్జీలు స్వీకరణ -
సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సాధారణ భక్తులకు శీఘ్రదర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగానే మహా నివేదన సమయంలో వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం ఈవో శీనానాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించి 15 రోజులైందని, ఇప్పటికే ఆలయ వ్యవహారాలను క్షుణంగా పరిశీలించానని, ఇంకా అనేక విషయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ వారికి అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడటంతో పాటు శీఘ్రదర్శనం కల్పిస్తామన్నారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించే సమయంలో రద్దీ అధికమవుతోందని గుర్తించి, ఆ సమయంలో వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇక ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దసరా నాటికి ఓ కొలిక్కి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అన్నదాన భవనం, లడ్డూ పోటులను ఉత్సవాలకు సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే పూర్తయిన పూజామండపం, రాతి యాగశాలను శ్రావణ మాసం నుంచి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. కొండపైన, కొండ దిగువన పార్కింగ్ ప్రాంతం తక్కువగా ఉండటంతో రద్దీ సమయాల్లో భక్తులు తమ వాహనాలను వీఎంసీ కార్యాలయం వద్ద నాలుగు ఎకరాల హోల్డింగ్ ఏరియాతో పాటు రెండు ఎకరాల టీటీడీ స్థలం, పున్నమి ఘాట్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల నుంచి దేవస్థానం బస్సులను నడుపుతుందన్నారు. 3 నుంచి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే విగ్రహ ప్రతిష్టకు సంబంధించి పూజా కార్యక్రమాలు, జపాలు జరుగుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ఈఈ కోటేశ్వరరావు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు దసరా నాటికి లడ్డూ పోటు, అన్నదాన భవనాలు మీడియాతో దుర్గగుడి ఈవో శీనానాయక్ -
చట్టపరిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరకట్న వేధింపులపై కొందరు, కొడుకులు పట్టించుకోవటంలేదని ఇంకొందరు, భర్తల వివాహేతర సంబంధాలపై మరి కొందరు ఎస్పీ ఎదుట వాపోతూ కన్నీరు పెట్టుకున్నారు. వారి సమస్యలు ఆలకించిన ఎస్పీ కొన్నింటిని అక్కడికక్కడే ఫోన్ల ద్వారా పరిష్కరించగా మరికొన్ని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించారు. ఇంకొన్ని ఫిర్యాదులను చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రధానమైన అర్జీలు ● వడ్లమన్నాడు నుంచి వచ్చిన ఓ వివాహిత ఎస్పీని కలిసి తనకు వివాహం జరిగి ఏడు సంవత్సరాలు అవుతోందని, గత రెండు సంవత్సరాలుగా తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, వ్యసనాలకు బానిసైన భర్త తనను పుట్టింటికి పంపించేశాడని, తనకు న్యాయం చేయమని కోరింది. ● గిలకలదిండికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు రెండేళ్ల క్రితం తన భర్త మరణించాడని, కుమారుడు, కుమార్తెకు వారికి రావలసిన ఆస్తిని సమంగా పంచామని, ఇప్పుడు కొడుకు ఉన్న ఇంటి నుంచి తనను గెంటివేసి ఇంటిని బలవంతంగా ఆక్రమించుకున్నాడని వాపోయింది. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయమని వేడుకుంది. ● పమిడిముక్కలకు చెందిన కుమార్ అనే వ్యక్తి తన పొలం సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లడానికి దారి లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ వాపోయాడు. అడుగుతుంటే భౌతిక దాడికి పాల్పడుతున్నాడని, న్యాయం చేయమని అర్థించాడు. ● పామర్రు నుంచి అమ్ములు అనే మహిళ అత్తింటి వారు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతూ హింసిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ తప్పకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు -
యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకుని జూన్ 21వ తేదీన జరిగే యోగా కార్యక్రమానికి సంసిద్ధం కావాలన్నారు. ఈ నెల 27వ తేదీన మచిలీపట్నంలో మహార్యాలీ నిర్వహిస్తున్నామని ఉద్యోగులతో పాటు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. 27 నుంచి 31వ తేదీ వరకు మండల, గ్రామస్థాయిలో ట్రైనర్లకు యోగాపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. ఈ నెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో, జూన్ 6వ తేదీన కూచిపూడిలోని నాట్యకళాక్షేత్రం, 13న ఘంటసాలలోని బౌద్ధక్షేత్రం, 19న మో పిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రాంగణంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించటమైందన్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో థీమ్ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగా ఔన్నత్యా న్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. సోమవారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో కృష్ణబాబుతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ గిరీష్ పీఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు, నగర ప్రజలు పాల్గొని డాక్టర్ రత్న ప్రియదర్శిని మార్గనిర్దేశనంతో యోగాసనాలు వేశారు. 26 జిల్లాల్లో 26 రోజులు...26 థీమ్లు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ మే 21న ప్రారంభమైన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులపాటు 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు వివరించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి, అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రతి ఒక్క వర్గాన్ని భాగస్వాములను చేస్తున్నామన్నారు. కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం కల్పించాలనే యోగాంధ్రను నిర్వహిస్తున్నామని, గ్రామ/వార్డు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో అమరావతి యోగా అసోసియేషన్, పతంజలి యోగా, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారిలు భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో విజయ వాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి.రాణి, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు -
పోలీస్ ప్రజావాణిలో 81 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కృష్ణమూర్తినాయుడు తెలిపారు. ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 39, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి ఏడు, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఏడు, దొంగతనాలకు సంబంధించినవి నాలుగు, కొట్లాటకు సంబంధించినవి ఐదు, సైబర్ నేరాలకు సంబంధించి ఐదు, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 14 ఫిర్యాదులను స్వీకరించినట్లు చెప్పారు. బాధితులతో మాట్లాడటంతో పాటు, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశించినట్లు చెప్పారు. -
ఆంధ్రనాట్యం అద్భుతః
నటరాజుకు నాట్యాభిషేకం..విజయవాడ కల్చరల్: దృశ్యవేదిక నెలవారీ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథా లయంలో ఆదివారం నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడు బృందం ప్రదర్శించిన ఆంధ్రనాట్యం అంశాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రనాట్య సంప్రదాయ నృత్యం కుంభహారతి, త్రిపుర సంహార శబ్దం, తరంగం, వారాహిస్తుతి, ఉమామహేశ్వర పాత్రుడు రచించిన సంక్షిప్త రామాయణం, దశావతారం అంశాలను ఎస్. మహేష్, పి. మానసతేజ, టి. జ్యేష్ట, కె. సాహితి, ఎం. హర్షిణి, జి. భార్గవి, టి. చిన్మ యి, ఎస్కే షర్మిల, పి. జోషిత సాయిలు అభినయించారు. నాట్యాచార్యుడు ఉమామహేశ్వరపాత్రులు మాట్లాడుతూ నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యానికి అంతర్జాతీయ కీర్తిని తీసుకువచ్చారన్నారు. సుసుమ నాగభూషణం రచించి, ఈఎస్ పవన్కుమార్ దర్శకత్వం వహించిన కాలజ్ఞానం సాంఘిక నాటికను ప్రదర్శించారు. కళాపరిషత్ నిర్వాహకులు పోపూరి నాగేశ్వరరావు, దృశ్యవేదిక వ్యవస్థాపకుడు హెచ్వీఆర్ఎస్ ప్రసాద్, బుర్రా నరేన్, నాట్యా చారిణి పద్మశ్రీ హేమంత్, రాయన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు
నాగాయలంక: మాస శివరాత్రిని పురస్కరించుకుని స్థానిక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కృష్ణానదిలోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో శివలింగానికి ఆదివారం విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన సామాన్య భక్తులతో కలసి వేకువ జామున విభూధి, నారికేళ, గోక్షీరం, తేనె, పంచదార, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అభిషేకాల తదుపరి స్వామివారిని పూలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. మాస శివరాత్రి పర్వతిథిని పురస్కరించుకుని నాగాయలంకలోని పురాతనమైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకుడు సాయి కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజ నిర్వహించారు. స్వామికి జరిపిన ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 8వ తేదీన బాడీ బిల్డింగ్ జట్టు ఎంపిక పెనమలూరు: వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లాల క్రీడాకారుల ఎంపిక చేస్తామని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్ 22వ తేదీన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పాల్గొనే క్రీడాకారులకు జూన్ 8వ తేదీ ఆదివారం జట్టు ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సింగ్నగర్ మనోహర్ జిమ్లో క్రీడాకారుల ఎంపిక ఉదయం 9 గంటలకు జరుగుతుందని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఎంపికలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86867 71358, 85550 47808లలో సంప్రదించాలన్నారు. కవులు ఉమ్మడిగా గళం విప్పాలి విజయవాడ కల్చరల్: రాజ్యాంగ నైతికతను కవులు భుజానికి ఎత్తుకోవాలని ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న అన్నారు. మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో బందరురోడ్డులోని బాలోత్సవ్ భవన్లో ఆదివారం బంగార్రాజు కంఠ రచించిన ‘దుఃఖం పండుతున్న నేల’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకన్న మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక లైక్ కోసం యువత విలువైన జీవితాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కవులు ఉమ్మడిగా గళం విప్పాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన బిక్కీ కృష్ణ మాట్లాడుతూ దేశంలో క్రమశిక్షణ లోపించందన్నారు. గజల్ రచయిత రసరాజు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేస్తూ కవికి సొంత డిక్షన్ కావాలన్నారు. రచయిత్రి ఘంటసాల నిర్మల, మల్లెతీగ సాహిత్యవేదిక వ్యవస్థాపకుడు కలిమిశ్రీ, కవి విల్సన్రావు, పోలీస్ అధికారి లోసారి సుధాకర్, పుస్తక రచయిత బంగార్రాజు, శిఖా ఆకాష్ కవిత్వంలో వస్తున్న మార్పులు అంశంగా మాట్లాడారు. ఏకగ్రీవంగా నూతన కమిటీ చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మచిలీపట్నం జి–కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా సంఘ రాష్ట్ర నాయకులు గుళ్లిపల్లి నాగసాయి, కిషోర్ వ్యవహరించారు. జిల్లాకు నూతనంగా ఎన్నికై న కార్యవర్గం సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.. అధ్యక్షుడిగా పి. రాము, సహాధ్యక్షుడిగా జి. శ్రీనివాస్ రావు, కార్యదర్శిగా తోట వరప్రసాద్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎస్. రాంబాబు, వైస్ ప్రెసిడెంట్స్గా కేవీ లోకేశ్వరరావు, ఎస్వీవీ రామారావు, కె. కోటేశ్వరరావు, సీహెచ్వీ సత్యనారాయణరావు, వి. సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా జి. రామకష్ణ, సీహెచ్ఎస్ఆర్ పవన్కుమార్, సీహెచ్ బ్రహ్మానందబాబు, ఎం. బాలాజీ, పి. ప్రవీణ్ కుమార్, హుస్సేన్, ఎండీ సలీం, ట్రెజరర్గా బి. సురేష్నాయక్బాబులను ఎన్నుకున్నారు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 25కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10,381 మంది అభ్యర్థులకు గాను ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ నిర్వహించిన పేపర్–1కు 5,716 (55.1 శాతం) మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగిన పేపర్–2కు 5,665 (54.6 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో జరిగిన పరీక్షను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. అలాగే పరీక్ష జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. హాజరైన 55 శాతం అభ్యర్థులు 25 కేంద్రాల్లో కొనసాగిన పరీక్ష పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ -
ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో ఆదివారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో కీలకమైన రూ.25 వేల వస్త్రాలంకరణ సేవలో ఆదివారం ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంంటలకు ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో 18 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాల్లోనూ ఉభయదాతలను అనుమతించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఛండీహోమం నిర్వహించగా 51మంది ఉభయదాతలు తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మూర్తి వద్ద లక్ష కుంకుమార్చన నిర్వహించారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. ఇక ప్రతి ఆదివారం నిర్వహించే సూర్యోపాసన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయా సేవల్లో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
సాయం కరువు!
అదును మొదలు.. అన్నదాత సుఖీభవ అమలు ఎప్పుడో? ఆర్థిక సాయం అందించాలి.. ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ఆర్థిక సాయం తప్పని సరిగా అందించాల్సి ఉంది. ఇప్పటి నుంచే రైతులు పొలాల్లో పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక తోడ్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. – గౌరిశెట్టి నాగేశ్వరరావు, కృష్ణాజిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి ఎదురుచూపులు.. నాడు వైఎస్ జగన్ రైతులకు చెప్పిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రైతులకు రైతు భరోసా పథకం ద్వారా భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందే గాని ఇంత వరకు అమలు చేయలేదు. నేడు ఆర్థిక సాయం కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. – గణేశన రమేష్, రైతు, ఎస్.ఎన్. గొల్లపాలెం, బందరు మండలం చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్ సీజన్ సమీపించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రమంతా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు కాస్త ముందుగానే ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే వారికి ప్రభుత్వం నుంచి సాయం కరువవుతోంది. ఇప్పటికే రబీ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో వారు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా వారికి రూ. 20వేలు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఆ సాయాన్ని అందించలేదు. ఎప్పటికి ఇస్తారో కూడా తెలియడం లేదు. దీంతో రైతులు ఖరీఫ్ సాగుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభం నుంచి రైతులకు భరోసా అందిస్తూ ఆర్థికంగా అండగా నిలిచింది. గత ఐదేళ్లలో రూ. 572.22కోట్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అండగా నిలిచింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సాయం అందించింది. జిల్లాలో ఐదేళ్లలో రూ.572.22 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేసి, సరైన సమయానికి ఆదుకుంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయ లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు హడావుడి మొదలు పెట్టింది. అర్హుల జాబితాలంటూ వెరిఫికేషన్లను ప్రారంభించింది. అయితే ప్రక్రియంతా పూర్తయ్యి సొమ్ము ఖాతాల్లో జమయ్యే పాటికి అదును వెళ్లిపోతుందేమో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 1,67,667 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్లో నష్టపోయిన రైతులు.. రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు వారు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఎకరానికి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఏ ప్రాంతంలోనూ కొనుగోలు చేయలేదు. ఏదో ఒక నెపంతో తక్కువ ధరకు కొనుగోలు చేసింది. మరో పక్క దళారులు రైతుల వద్ద నుంచి మరింత తక్కువకు ధాన్యం కొనుగోలు చేశారు. ఇటు వంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్లోనైనా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సంవత్సరం రైతుల సంఖ్య నగదు (రూ.లలో) 2019–20 1,31,595 108.09 కోట్లు 2020–21 1,44,280 110.82 కోట్లు 2021–22 1,50,099 115.00 కోట్లు 2022–23 1,52,112 118.74 కోట్లు 2023–2024 1,56,827 122.55 కోట్లు పొలాలను సిద్ధం చేసుకుంటున్న రైతులు జిల్లాలో 1,67,667 హెక్టార్లలో సాగుకు ప్రణాళిక పెట్టుబడి సాయంపై వీడని సందిగ్ధత గత ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 572.22 కోట్లు అందించినవైఎస్సార్ సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలోవైఎస్సార్ సీపీ ప్రభుత్వ రైతు భరోసా పథకం అమలు ఇలా.. పరిశీలిస్తున్నాం.. అన్నదాత సుఖీభవకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను పరిశీలన చేస్తున్నాం. ఇది పూర్తయిన తరువాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. తదానంతరం వారు పరిశీలన చేసి అర్హుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. – మనోహర్, జిల్లా వ్యవసాయశాఖ ఇన్చార్జి అధికారి -
పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు!
కంటితుడుపు ప్రకటనతో సర్కారు సరికంకిపాడు: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. పరిహారం కోసం కొద్ది రోజులుగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా పంట నష్టం నమోదు దశలోనే అధికార యంత్రాంగం ఉంది. పంట నష్టం నమోదు సక్రమంగా జరగటం లేదన్న వ్యాఖ్యలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి. పంట నష్ట పరిహారంపై కూటమి ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోందంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉద్యాన రైతుకు కష్టం.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. చేతికొచ్చిన పంట తడిసిపోయి, నాణ్యత దెబ్బతిని అవస్థలు పడ్డారు. పంట సంరక్షణకు నానా పాట్లు పడ్డారు. దీనికి తోడు విడువకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా మేజర్గా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న పంట ఎండబెట్టి మార్కెట్కు తరలించే దశలోనూ, పంట చేను మీద దెబ్బతింది. జిల్లాలో 4,750 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తే ఇంకా 40 శాతం పంట రైతుల వద్ద ఉన్నట్లు సమాచారం. మొక్కజొన్న గింజలు మొలకెత్తి పెట్టుబడులు మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది. తూతూమంత్రంగా.. ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందీ వ్యవసాయశాఖ అంచనాలను నమోదు చేయలేదు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకే మొక్కజొన్న దెబ్బతిన్నా, వరి చేలు కోత దశలో నేలవాలినా కనీసం ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ప్రాథమిక నివేదికలో పేర్కొనటం విడ్డూరం. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనలు చేయకుండా తూతూమంత్రంగా నివేదికలను సమర్పించి చేతులు దులుపేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంట దెబ్బతిందని రైతులు ఆర్ఎస్కేల్లో చెబితే పంట తీసుకొచ్చి చూపండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన సిబ్బంది ఉన్నారంటే రైతులు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కోతలు విధిస్తూ.. అయితే ఉద్యానశాఖ మాత్రం జిల్లా స్థాయిలో ప్రాథమికంగా రూపొందించిన పంట నష్టం అంచనాల్లో 127 మంది రైతులకు చెందిన 92.40 హెక్టార్లలో బొప్పాయి, మునగ, కూరగాయలు, తమలపాకు, అరటి పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదించింది. అయితే పంట నష్టం సర్వే అనంతరం 64.337 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయలు పంటలు దెబ్బతిన్నట్లు నివేదించారు. 143 మంది రైతులు నష్టపోయారని, రూ. 19.90 లక్షలు పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, పామర్రు, బాపులపాడు, ఉంగుటూరు, ఉయ్యూరులో పంట నష్టం జరిగినట్లు నివేదించారు. నష్టం భారీగా ఉంటే కోతలు విధించటం సమంజసమేనా అన్న వాదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు పంట నష్టం నమోదుపై అభ్యంతరాలు ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ విమర్శలు ఆదుకోవడంలో విఫలం.. అకాల వర్షాల అనంతరమే కూటమి ప్రభుత్వం ‘మంగళవారం’ నాటికే పరిహారం రైతుల ఖాతాకు చేరాలని ప్రకటించింది. ఇప్పటికి ఎన్నో మంగళవారాలు గడిచాయి. కానీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. కేవలం కంటి తుడుపు ప్రకటనలకు సర్కారు పరిమితం అయ్యిందని అన్నదాతలు విమర్శిస్తున్నారు. పంట వారీగా సమర్థంగా పంట నష్టం నమోదు చేసి బాధిత రైతులకు పరిహారం అందేలా చేయటంలో అటు సర్కారు, ఇటు అధికారులు కూడా విఫలమయ్యారంటూ ఆరోపిస్తున్నారు. -
యోగాతో ఒత్తిడి నియంత్రణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు సేవలు అందించడంలో నిత్యం బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు యోగసాధన చేయడం ద్వారా ఒత్తిడిని జయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల జంక్షన్ వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ఎన్జీవో, జేఏసీ నేతలు, ఉద్యోగులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని జయించి, మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాచరణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. యోగా జీవితంలో భాగం కావాలి.. ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ యోగా, ధ్యానం భారతీయ వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఉద్యోగులంతా యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. యోగాతో అద్భుత ఫలితాలు సాధించొచ్చన్నారు. పేద విద్యార్థులకు ఆర్టిస్టిక్ యోగాలో శిక్షణ ఇస్తూ, యోగాకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న ట్రైనర్ బి.శిరీష ఇకపై కూడా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా రూ. 10 వేలు తక్షణ సహాయం ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గ అధ్యక్షుడు డి.సత్య నారాయణ, సహాధ్యక్షుడు వీవీ ప్రసాద్, కార్యదర్శి పి.రమేష్, నగర శాఖ అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, కార్యదర్శి షేక్ నజీరుద్దీన్, యోగాంధ్ర నోడల్ అధికారి, డీఎంహెచ్వో ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పెడన: పట్టణంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పెడన పీఎస్లో ఆదివారం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ కరోజ్ జిల్లా బైగాం గ్రామానికి చెందిన రామ్తీథ్(35) రెండేళ్ల క్రితం పెడనకు వచ్చి పానీ పూరి బండి నడుపుతున్నారు. 21వ వార్డులోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతనికి మూడు నెలల క్రితం కామెర్లు వచ్చాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. మద్యం అలవాటున్న రామ్తీథ్ శనివారం ఇంట్లో పడిపోయాడు. ఆదివారం అతని బంధువులు నిడుమోలులో ఉంటూ పెడనకు వచ్చి రామ్తీథ్ను చూసి పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని బావమరిది ఉమేష్చంద్ర ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహన చోరీ నిందితుల అరెస్టు సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎస్ఎన్పురం పీఎస్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ద్విచక్ర వాహన చోరీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆదేశాల మేరకు ఎస్ఎన్పురం సీఐ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు షబ్బీర్, ఎ. సౌజన్య ప్రత్యేక దర్యాప్తు చేశారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీలు చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీలు చేసింది నగరంలోని పెజ్జోనిపేట, అల్లావుద్దీన్ వీధికి చెందిన సయ్యద్ సాజీజ్, స్థానికుడు ఖాన్ చాంద్ఖాన్లు స్నేహితులు. వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 48 ద్విచక్ర వాహనాల సీజ్ కోనేరుసెంటర్: బందరు సబ్–డివిజన్ చిలకలపూడి పోలీస్స్టేషన్ పరిధిలోని టెంపుల్కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. బందరు డీఎస్పీ సీహెచ్ రాజ ఆధ్వర్యంలో కార్డన్సెర్చ్ జరిగింది. బందరు సబ్–డివిజన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు టెంపుల్కాలనీకి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఇంటింటికీ వెళ్లి అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కాలనీలో బెల్టుషాపులు నడుస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. గంజాయి, మద్యం, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నదీలేనిదీ ఆరా తీశారు. కాలనీలో ఇళ్ళ ముందు పెట్టి ఉన్న 48 వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని చిలకలపూడి పోలీస్స్టేషన్కు తరలించారు. పత్రాలు ఉంటే సంబంధిత స్టేషన్ అధికారికి చూపించి వాహనాలు తీసుకువెళ్లాలని డీఎస్పీ వాహనదారులను ఆదేశించారు. కార్యక్రమంలో చిలకలపూడి, ఆర్పేట, పెడన, మచిలీపట్నం, బందరు రూరల్, బంటుమిల్లి, కృత్తివెన్ను పోలీస్స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. -
మచిలీపట్నం డివిజన్ నూతన కమిటీ ఎన్నిక
చల్లపల్లి: పంచాయతీ కార్యదర్శుల సంఘం మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడిగా చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పేర్ని వెంకట మాధవేంద్రరావును ఎన్నుకున్నారు. మచిలీపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డివిజనల్ పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ జాయింట్ సెక్రటరీగా మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ కార్యదర్శి కె.రామకోటేశ్వరరావును ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా డీఎల్పీఓ వి.సీతారామయ్య వ్యవహరించగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధి జీటీవీ రమణ, జిల్లా ట్రెజర్ ఎ.ఎస్.ఆర్.కోటేశ్వరరావు పర్యవేక్షించారు ఉయ్యూరు డివిజన్కు.. ఉయ్యూరు రూరల్: ఉయ్యూరు డివిజన్ పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గ ఎన్నిక మండలంలోని కాటూరు గ్రామపంచాయతీలో ఆదివారం జరిగింది. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘ జనరల్ సెక్రటరీ జీటీవీ రమణ, కృష్ణా జిల్లా పంచాయతీ కార్యదర్శుల కోశాధికారి ఏఎస్ఆర్ కోటేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఉయ్యూరు డివిజన్ అధ్యక్షుడిగా ఓగిరాల తిరుమల వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా ఎం. పద్మశ్రీవేణి, కేబీవీఎన్ఎం స్వామి, ప్రధాన కార్యదర్శిగా డి.మునిరాజు, పి.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా పి.వి.సుబ్బారావు, బి.వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఆంధ్ర కురియన్ జశ్వంతరావుకు భార్య వియోగం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయ డెయిరీ వ్యవస్థాపకుడు, ఆంధ్ర కురియన్ డాక్టర్ వి.జశ్వంతరావు సతీమణి స్వర్ణకుమారి (85) మృతి చెందారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ మౌలాలిలోని స్వగృహంలో ఆమె కన్నుమూశారు. ఆమె మృతికి సీనియర్ జర్నలిస్టు వీకేఎం తిలక్ సంతాపం తెలిపారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
వించిపేట(విజయవాడపశ్చిమ): విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ నియోజవర్గం 50వ డివిజన్లోని గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం తమ్మా లలిత కూలి పనులు చేసుకుంటూ జెండా చెట్టు సెంటర్లోని కొండప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు తమ్మా మాసన్ (8) ఆదివారం మధ్యాహం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్న ఒక బడ్డీ కొట్టును పట్టుకొన్నాడు. దీంతో అతనికి విద్యుత్ షాక్ తగిలింది. కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఆటోలో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. బడ్డీ కొట్టు నిర్వాహకులు సమీపంలోని తమ ఇంటి నుంచి.. ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన కొట్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా రేకులకు తాకడంతో బాలుడు ఆడుకుంటూ దాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలియడంతో స్థానిక కార్పొరేటర్ బోయి సత్యబాబు, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు బంకా చాముండేశ్వరి బాలుడి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆడుకుంటూ బడ్డీకొట్టును తాకడంతో కరెంట్ షాక్ -
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ వ్యవస్థాపకుడు కరణం రాజేష్ కుమార్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దక్షిణ భారతదేశంపై కేంద్రం వివక్ష చూపుతోందని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా ఉద్యమ వ్యవస్థాపకుడు డాక్టర్ కరణం రాజేష్ కుమార్ అన్నారు. సమస్యల పరిష్కారానికి యావత్ దక్షిణ భారతదేశం ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్క్లబ్లో జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యాన ఆదివారం రాజకీయ పార్టీల సమావేశం జరి గింది. 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. మొత్తం జనాభాలో కేవలం 17 శాతం మాత్రమే ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 1970లో డాక్టర్ కె.ఎల్.రావు ప్రతిపాదించిన నదులు అనుసంధాన ప్రాజెక్టులో ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేదన్నారు. దేశానికి రెండో రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ కమిటీ అధ్యక్షుడుగా జి.ఎస్.ఫణిరాజును నియమించారు. సమావేశంలో జైహింద్ పార్టీ దశరథరామిరెడ్డి, కనకం శ్రీనివాసులు, బాలకోటయ్య, డీఎస్ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. 2 గంటల పాటు వీఐపీ దర్శనాలు నిలిపివేత భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంట తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు. టికెట్ ఉంటేనే అంతరాలయ దర్శనం రూ. 500 టికెట్ ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు. దుర్గగుడిలో ఉదయం 11.30 నుంచి వీఐపీ దర్శనాలు నిలిపివేత టికెట్లు ఉంటేనే అంతరాలయ దర్శనం తిరుపతమ్మ ఆలయంలో.. పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలు, పరిసరాలు కిక్కిరిశాయి. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొందరు భక్తులు మునేరు అవతల మామిడి తోటల్లో సందడి చేస్తూ వంటలు వండి భోజనాలు తిన్నారు. -
పుష్కర స్నానాలకు వెళ్లొస్తూ..
నందిగామ టౌన్: తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లి తిరిగి వస్తూ కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు కృష్ణాజిల్లా పెద్దపారుపుడి మండలం వెంట్రప్రగడ గ్రామస్తుడు చింటూరి వెంకటేశ్వరరావు (66). అతను, భార్య నాగమణి, పెద్దకుమార్తె మోటమర్రి శ్యామల, బంధువులైన రవి, భార్య లక్ష్మితో పాటు విజయవాడకు చెందిన కారు డ్రైవర్ కొమరంపల్లి కార్తీక్తో కలిసి కారులో సరస్వతీ నది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లారు. పుష్కర స్నానాలు ముగించుకుని శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. అనాసాగరం వద్ద అదుపుతప్పిన కారు ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున పట్టణ సమీపంలోని అనాసాగరం వద్ద ఫ్లై ఓవర్పై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావుతో పాటు గాయపడిన వారిని స్థానికులు కారులో నుంచి బయటకు తీశారు. అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా వెంకటేశ్వరరావు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు వెంకటేశ్వరరావు కేటరింగ్ పనులు చేస్తుంటాడు. మృతునికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. డివైడర్ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు -
రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో బయట నుంచి తోపుడు బండ్లపై వచ్చి ఆహార విక్రయాలు చేస్తున్న వారిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టేషన్ డైరెక్టర్, సిబ్బంది ఆదివారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అనధికార విక్రేతలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద కొందరు బయట నుంచి తోపుడు బండ్లపై టిఫిన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రహరీ పక్కన కొంత మంది బడ్డీకొట్లలో నాణ్యత, పరిశుభ్రత లేకుండా ప్యాకింగ్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్లు, గుట్కా, సిగరెట్ల విక్రయాలు సాగిస్తుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఏడుగురు అనధికార విక్రేతలను అదుపులోకి తీసుకుని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ రైలు ప్రయాణికుల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కొందరు విక్రేతలు మాత్రం పరిశుభ్రత, నాణ్యత లేకుండా రైలు ప్రయాణికులకు నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అనధికార విక్రేతలపై చర్యలు -
ప్రభుత్వమే ఆదుకోవాలి
పంచాయతీల ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు బాగా పెరిగాయి. ఇటీవల రిక్షాలు కొనుగోలు చేయాలని, క్లాప్మిత్రలను పెట్టుకోవాలని అధికారులు చెప్పడంతో పాలుపోని దుస్థితి. ప్రభుత్వమే పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టాలి. రిక్షాలు కొనుగోలు చేసి పంచాయతీలకు ఇవ్వాలి. ఈ రిక్షాలు కూడా మోటర్సైకిల్గా ఉండాలి. పంచాయతీల పరిధి ఎక్కువగా ఉంటుంది. తొక్కుకుంటూ వెళ్లా లంటే క్లాప్మిత్రలకు ఇబ్బందికర పరిస్థితి. క్లాప్మిత్రల జీతభత్యాలను కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగవుతుంది. –గరికపాటి వెంకట రామానాయుడు, సర్పంచు, పెనుమల్లి, పెడన -
నిధుల్లేక.. కొనలేక..!
పెడన: కూటమి పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాడు టీడీపీ సర్కారులో తీవ్ర నిర్లక్ష్యానికి గురై గ్రామాలకు దూరంగా చెత్త సంపద కేంద్రాలను నిర్మించి వదిలేస్తే.. వీటి ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మళ్లీ టీడీపీ వివిధ పార్టీలతో పొత్తుపెట్టుకుని అధికారం చేపట్టి చెత్త సంపద కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. అందులో భాగంగా ప్రతి 250 ఇళ్లకు ఒక క్లాప్ మిత్రను, ఒక రిక్షాను పంచాయతీలే కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని, అవసరమైన రిక్షాలు కొనుగోలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ నిధులు అంతంత మాత్రంగా ఉన్న వాటితో ఎలా వీటిని కొనుగోలు చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు భారం పెడన నియోజకవర్గం పరిధిలో అధిక శాతం పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పంచాయతీలన్నింటికి ఆర్థిక సంఘం నిధులే ఆధారం. ప్రతి 250 కుటుంబాలకు ఒక రిక్షా, క్లాస్ మిత్ర ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా చేయాలంటే జనాభా ప్రాతిపదిక కనీసం ఒక్కో పంచాయతీకి మూడు నుంచి పది రిక్షాలు వరకు కొనుగోలు చేయాలి. ఒక రిక్షా ఖరీదు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు వరకు ఉందని, వాటిని ఎలా కొనుగోలు చేయాలంటూ పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. గతంలో కొనుగోలు చేసిన వాటికి మరమతులు చేయించాలంటేనే రూ.10వేలు వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేని పంచాయతీలే అధికం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని చాలా పంచాయతీలకు ఆదాయం రావడం లేదు. ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ద్వారా వచ్చే పన్నులు అంతంత మాత్రమే. వీటితో నెలవారి ఖర్చులకు కూడా సరిపోని దుస్థితి. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను ఇలా నాలుగు మండలాల్లో కూడా చాలా పంచాయతీల్లో రూ.2లక్షలు కూడా ఆదాయం రానివి ఉన్నాయి. ఆదాయం లేని పంచాయతీలను గుర్తించి ప్రభుత్వమే రిక్షాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు, కార్యదర్శులు కోరుతున్నారు. కొందరు క్లాప్మిత్రలు పనిచేస్తూ మానేస్తున్నారు. పంచాయతీల పరిధి ఎక్కువగా ఉండటంతో పాటు తిరగలేక, జీతాలు సరిగ్గా సరిపోక ఇబ్బందులు పడుతూ మానేస్తున్నారు. కొత్త వారిని తీసుకుందామంటే ముందుకు రాని దుస్థితి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నీలినీడలు రిక్షాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశం ప్రతి 250 ఇళ్లకు ఒక క్లాప్మిత్ర..ఒక రిక్షా అంతంత మాత్రం పంచాయతీల ఆదాయం పెడన నియోజకవర్గంలో పంచాయతీలు...సంపద కేంద్రాలు మండలం పంచాయతీలు సంపద కేంద్రాలు పెడన 24 24 గూడూరు 27 26 బంటుమిల్లి 21 21 కృత్తివెన్ను 16 16 -
మిద్దె తోటల కూరగాయలతో ఆరోగ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువుతో మిద్దె తోటల్లో కూరగాయలు, ఆకుకూరలను పండిస్తే పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. వన్ ఎర్త్ – వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో రైతులు ప్రదర్శించిన దేశవాళీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల స్టాల్స్ను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తిలకించారు. మిద్దె తోటల అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ నగరాల్లో మిద్దె తోటల పెంపకం ప్రాధాన్యం పెరిగిందని, దీంతో జీవ వైవిధ్యం మెరుగుపడుతుందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ టెర్రస్ గార్డెన్లో పెరిగిన కూరగాయలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగా మిద్దె తోటలను ప్రారంభించానుకునేవారికి చీడపీడల నివారణ పద్ధతులతో పాటు ఇతర మెలకువలను తెలియజేస్తామని చెప్పారు. పర్యావరణవేత్త కొమెర అంకారావు (జాజి) మాట్లాడుతూ సేంద్రియ ఎరువుతో పండించే ఆకుకూరల్లో ఉండే ఔషధ గుణాలను వివరించారు. వన్ ఎర్త్ – వన్ లైఫ్ (మిద్దె తోట వాట్సప్ గ్రూప్) వ్యవస్థాపకురాలు ఏలూరి లీలా కుమారి మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన పురుగుల మందులతో పండించినవి ఏవైనా ఆరోగ్యానికి హానికరమని, ఈ సమస్యకు సమర్థమైన ప్రత్యామ్నాయం మిద్దె తోటల పెంపకమేనన్నారు. తొలుత విద్యార్థులకు పర్యావరణం, వన్ ఎర్త్–వన్ లైఫ్ అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. -
వంశీని బలిగొనేందుకు బాబు సర్కార్ యత్నం: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్కు తరలించారని.. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని.. వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నను అరెస్టు చేస్తే పైల్స్ అంటూ డ్రామాలు ఆడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. వంశీకి ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా కానీ.. చికిత్స అందించడం లేదు. చెంచాగిరి చేస్తున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతాం. సీఐ భాస్కర్ రావు అయిన, ప్రభుత్వం ఆసుపత్రి సూపరిండెంట్ అయిన ఎవరిని వదిలిపెట్టం’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు.న్యాయ పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ అరుణ్కుమార్వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరుణ్కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం.. వంశీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్తాం. నిలబడలేని మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. -
పవన్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక జారీ చేశారు. థియేటర్ల బంద్పై మంత్రి దుర్గేష్ ఏకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..‘సినిమా థియేటర్ల మూసివేతపై విచారణకు ఆదేశించాం. హోంశాఖ కార్యదర్శి చేత విచారణ చేపట్టాం. ఎందుకు సినిమా హాళ్లు బంద్ చేస్తున్నారో విచారించమన్నాం. ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారించమని చెప్పాం. జూన్ 12న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంలో ఎందుకు థియేటర్లు మూసేస్తున్నారు. ఎవరితో చర్చించి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు. అందుకే మేం విచారణకు ఆదేశించాం’ అని చెప్పుకొచ్చారు. -
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు పీఎస్ నుంచి తరలింపు..
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థత గురయ్యారు. వంశీకి వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో, వంశీని కాసేపటి క్రితమే జీజీహెచ్కు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విచారణ పేరుతో పోలీసులు వంశీని కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న వంశీ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వల్లభనేని వంశీకి అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు
కంకిపాడు: విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండికానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశాడంట. అప్పుడేమో చంద్రబాబుకి.. లోకేష్ కి సమ్మగా ఉందంట.. ఇప్పుడేమో పగలదీస్తారంట. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరు. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవలేకుండా చేస్తున్నారు. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వాసుపత్రి నుంచి వంశీని పోలీసు స్టేషన్కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు.కంకిపాడు పీఎస్లో వంశీ విచారణ బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను శుక్రవారం కంకిపాడు పోలీసుస్టేషన్లో పోలీసులు విచారించారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. -
జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని జోయాలుక్కాస్ షోరూమ్ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వరల్డ్ ఫేవరేట్ జోయాలుక్కాస్ షోరూమ్ను ఆధునికీకరించి మూడు అంతస్తుల్లో పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. షోరూమ్ ప్రతినిధులు మాట్లాడుతూ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ జ్యూవెలరీ కొనుగోలు చేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ది బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షో జూన్ 8వ తేదీ వరకు తమ షోరూమ్ లో జరుగుతుందని చెప్పా రు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, సీపీ రాజశేఖరబాబు పాల్గొన్నారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా మోడల్స్ బంగారు ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ‘గోల్డ్’ శివ.. జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా పెనమలూరుకు చెందిన కుంచం శివ శంకర సాయి కుమార్ (శివ) అనే వ్యాపారవేత్త సుమారు కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శివ పెనమలూరు సమీపంలోని మురళీనగర్ నివాసి. బంగారం ధరించి బయటకు వచ్చేటప్పుడు ఇంటిలోని కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తలు చెప్పి పంపుతారని ‘సాక్షి’తో ఆయన చెప్పారు. -
లబ్ధిదారులతో మర్యాదగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మెరుగుపరుచుకుని వారితో మర్యాదగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పింఛన్ పంపిణీ అధికారులతో కౌన్సెలింగ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి నెలా అధికారులు ఐవీఆర్ఎస్, 1100 కాల్ సెంటర్ల ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కనీసం ఐదుగురు లబ్ధిదారుల స్పందనను తెలుసుకుంటున్నారన్నారు. జిల్లాలో గత మూడు నెలలుగా పింఛన్ పంపిణీ కార్యక్రమంపై ప్రతికూల స్పందన వస్తోందన్నారు. దీనిలో కారణాలను పరిశీలిస్తే పింఛన్ ఇస్తున్నామా, లేదా, నగదు మొత్తం కచ్చితంగా ఇస్తున్నామా, లేదా, సమాయానికి ఇవ్వలేకపోతే వారికి నచ్చజెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామా, లేదా అనే విషయాలను ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, లబ్ధిదారుల నుంచి ప్రతికూల ప్రభావం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ పాల్గొన్నారు.కృష్ణా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
యోగాంధ్రలో జిల్లాను నంబర్ వన్గా నిలుపుదాం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్దీ, హెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని.. మీడియాతో పాటు ప్రతి వర్గం సమష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదా పు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఏడుగురు ట్రైనర్లు అందుబాటులో ఉంటారని.. ఒక్కో ట్రైనర్ ఒక సెషన్కు 50 మందితో యోగాభ్యాసం చేయించనున్నట్లు తెలిపారు. థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు.. మన భారతీయ వారసత్వ, సాంస్కృతిక సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించేందుకు జిల్లాలోనూ నెల రోజుల పాటు థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 24న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కార్యక్రమం ప్రారంభమై జూన్ 20న సెలబ్రిటీలతో థీమ్ ఆధారిత 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్తో యోగాభ్యసన కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు. ప్రత్యేక పోటీల నిర్వహణ.. యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్, మండల స్థాయిలో యూనిటీతో యోగా, జిల్లాస్థాయిలో యోగా అండ్ యూత్ ఇతివృత్తాలతో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు అవార్డుల బహూకరణ ఉంటుందన్నారు. పోటీల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం. సుహాసిని, డాక్టర్ జె.సుమన్, ట్రైనర్లు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -
బీచ్ కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు బ్రాంజ్
విజయవాడస్పోర్ట్స్: ఖేలో ఇండియా మొదటి జాతీయ బీచ్ కబడ్డీ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు సత్తా చాటింది. ఈ నెల 19వ తేదీ నుంచి గుజరాత్లోని డమాన్ డయ్యులో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రాంజ్ మెడల్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పోటీలను నిర్వహించింది. తొలుత లీగ్ పోటీల్లో హిమాచల్ప్రదేశ్ను 41–38, ఉత్తర్ప్రదేశ్ను 42–37, హరియాణాను 42–39 తేడాతో ఓడించి సెమీ ఫైనల్కు చేరింది. సెమీస్లో రాజస్థాన్పై 40–43 తేడాతో ఓడి మూడో స్థానంలో నిలిచి పతకాన్ని అందుకుంది. జట్టులో నవీన్(నెల్లూరు), లక్ష్మారెడ్డి(ప్రకాశం) రాణించి జట్టు విజయాలకు తోడ్పాటు అందించినట్లు కోచ్లు సాతేంద్రసింగ్, పి.చైతన్య తెలిపారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పతకాన్ని సాధించిన జట్టును ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా అర్జునరావు అభినందించారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలను సమర్పించి, ఘాట్రోడ్డు, మహా మండపం మీదుగా ఆలయానికి చేరుకున్నారు. సర్వదర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మరో వైపున రూ. 100, రూ.300, రూ.500 టికెట్ క్యూలైన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కనిపించింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు గాను మధ్యాహ్నం 12 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలకు డిమాండ్.. శుక్రవారం, ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున ఖడ్గమాలార్చనకు 23 మంది ఉభయదాతలు హాజరు కాగా, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీ హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చనకు ఈవో శీనానాయక్ దంపతులు హాజరయ్యారు. -
ప్రాణాంతకంగా బూడిద రవాణా
● పైన పట్టాలు కప్పకుండా యథేచ్ఛగా తరలింపు ● గాలికి లేచి వాహన చోదకుల కళ్లల్లో పడుతున్న వైనం ● ఈ కారణంగా ఎదురొచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు ● ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో ప్రధానంగా సమస్య ● పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జి.కొండూరు: బూడిద రవాణా చేసే అక్రమార్కుల, లారీ యజమానుల అత్యాశ వాహన చోదకులకు ప్రాణాంతకంగా మారింది. బూడిదపై పట్టాలు కప్పకుండా లారీలలో పరిమితికి మించి ట్రక్కు పైన రెండు నుంచి మూడు అడుగుల మేర అదనపు లోడింగ్ చేసి రవాణా చేయడంతో దారి పొడవునా గాలికి లేచిన బూడిద వెనక వెళ్తున్న వాహన చోదకుల కళ్లల్లో పడుతోంది. తత్ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాల పాలవుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ, ఆర్టీఓ కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో బూడిద రవాణా ఇష్టారాజ్యంగా మారిపోయింది. రహదారులపై కుప్పలు తెప్పలుగా... ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన బూడిదను నీటితో కలిపి బూడిద చెరువులోకి తరలిస్తారు. అయితే బూడిదకి డిమాండ్ పెరగడంతో నీటితో ఉన్న బూడిదనే లారీలకు లోడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీ ప్రయాణించినంత దూరం లారీలో ఉన్న డస్టు నీటితో కలిసి రహదారి పొడవునా ట్రక్కుకు ఉన్న రంధ్రాల నుంచి కిందకు పడుతోంది. ఈ డస్టు ఎండకి ఎండిన తర్వాత రహదారిపై వచ్చే వాహనాల వేగానికి వచ్చే గాలితో కలిసి రహదారి పక్కన ఉన్న దుకాణాలు, ఇళ్లలోకి చేరుతుంది. దీనితో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీం పట్నం, జి.కొండూరు మండలాల్లో జాతీయ రహదారులపై ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు బూడిద లారీలను రహదారిపై నిలపడం వలన కుప్పులు కుప్పలుగా బూడిద రహదారిపై పడి నరకయాతన పడుతున్నామని ఏప్రిల్ 24వ తేదీన పశ్చిమ ఇబ్రహీంపట్నంలో స్థానికులు విజయ వాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద లారీలను అడ్డుకోవడంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పడంతో స్థానికులు తమ నిరసనను విరమించారు. ప్రతి రోజూ 500కు పైగా లారీలు వీటీపీఎస్ బూడిదను భవన నిర్మాణాలు, రహదారులు, ఇటుక బట్టీలకు రవాణా చేసేందుకు ప్రతి రోజూ ఐదు వందలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటితో పాటు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో ఉన్న క్వారీలు, క్రషర్లలో వచ్చే డస్టును తరలించేందుకు కొన్ని లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ లారీలలో రోజుకి 18వేల టన్నులకు పైగా బూడిద రవాణా అవుతుంటుంది. ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా లారీలలో డస్టును తరలిస్తుంటే అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. హెల్మెట్ లేదనో, లైసెన్సు లేదనో సామాన్యుల నుంచి ఫైన్ కట్టించే పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఈ విషయం ఎందుకు పట్టించుకోరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.