Krishna
-
అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో వివిధ అభి వృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సీసీ, బీటీ రహదారుల అభివృద్ధి, డ్రెయిన్లు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం తదితర మౌలిక వసతుల కల్పన, అభి వృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్యత ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి నిధులు మంజూరు కోరతామని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల్లో చేసిన పనుల వల్ల ప్రయోజనం పొందే ప్రాంతాలు, లబ్ధి పొందే జనాభా, పనుల ప్రాముఖ్యత వంటి అంశాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నమ్రత అగర్వాల్, జెడ్పీ సీఈఓ జె.అరుణ, డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్బాబు, పశుసంవర్ధక శాఖాధికారి చిననరసింహులు, మెప్మా పీడీ సాయిబాబు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పరిశ్రమలు, ఎగుమతులు, ప్రోత్సాహక మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా మంజూరు చేయటమే కాకుండా ప్రభుత్వ రాయితీలు అందిస్తామన్నారు. జిల్లాలో 628 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిలో 606 దరఖాస్తులకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ఆమోదించామన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి, భూగర్భజలశాఖ ఏడీ బిందుశ్రీ, మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
పల్లెల్లో గుప్పుమంటున్న గంజాయి
మైలవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి పల్లెపల్లెకు పాకింది. మత్తుకు బానిసలైన యువత గంజాయి తాగడంతో పాటు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తు న్నాయి. పట్టణ, నగర ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం గంజాయి చేరడం నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. పోలీసులు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో సైతం పెద్ద ఎత్తున గంజాయి సేవిస్తున్న యువకులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడిన ఘటన మైలవరంలో మంగళవారం జరి గింది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బదాస్ లోహోర, గుప్తా హారిజస్ జి.కొండూరు మండల పరిధి చేగిరెడ్డిపాడు శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో కొంత కాలంగా పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఏలూరు జిల్లా, నూజివీడుకు చెందిన చింతం విజయ్ బాబు, షేక్ మెహర్ బాబా, మైలవరానికి చెందిన షేక్ ఆసిఫ్, మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన తన్నీరు గోపీకృష్ణ ఒక ముఠాగా ఏర్పడి మైలవరం, తిరువూరు, నూజివీడు, తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. బదాస్ లోహోర, గుప్తా హారిజస్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరం పాత ఎన్ఎస్పీ క్వార్టర్స్ వద్ద ముఠాలోని మిగతా నలుగురుకి అందజేస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులు దాడి చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఉన్న మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన ఆరుగురు నిందితులు గతంలో గంజాయి కేసులలో పట్టుబడిన వారేనని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏసీపీ వై.ప్రసాదరావు ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ కె.కిషోర్ బాబు, ఎస్ఐలు కె.సుధాకర్, గిరిసాయి, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల పట్టుబడిన ఘటనలు ● ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాచవరం గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల ఓపెన్ ప్లాట్లలో ఖాళీ ప్రదేశంలో ఉన్న ముగ్గురు యువకుల నుంచి సుమారు ఆరు కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ నెల నాలుగో తేదీన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల రోడ్డులో చిన్నచిన్న గంజాయి పొట్లాలు కట్టి విక్రయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో కంచికచర్ల మండలంలోని పరిటాలలో ఆరుగురు వ్యక్తుల నుంచి మూడు కిలోల గంజా యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ముత్తవరపు కల్యాణ మండపంలో పోలీసులు 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మంది గంజాయి తాగినట్లు నిర్ధారణ అయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. విజయవాడలో పట్టుబడ్డ మరో ముఠా అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): మరో గంజాయి ముఠా విజయవాడ పోలీసులకు పట్టుబడింది. సింగ్నగర్ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని అపార్ట్మెంట్ల ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకొని గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరీపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా గుమ్మడి సంజయ్, నాగభూషణం, జాన్సీ, లక్ష్మీనారాయణ, అహ్మద్ నావేల్, అన్సార్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి దొరికింది. వీరందరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల వ్యవధిలోనే సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు గంజాయి ముఠాలు పట్టుబడటం గమనార్హం. ఈ మూడు ముఠాల నుంచి మొత్తం పదిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. మైలవరంలో ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం వరుసగా పట్టుబడుతున్న గంజాయి ముఠా సభ్యులు -
వేసవి శిబిరాలు.. ప్రతిభకు వేదికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి వచ్చేసింది. పరీక్షలు అన్నీ ముగి యడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొంత మంది చిన్నారులు వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్య, బంధువుల ఇళ్లకు వెళ్లి సెలవులను సరదాగా గడిపి, ఆత్మీయత, అనురాగాలు నింపుకొని వస్తుంటారు. ఇంకొందరు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్తారు. మరి కొందరు విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాల్లో చేరి తమ నైపుణ్యాలను మరింత పెంచుకుంటారు. విద్య, క్రీడలు, యోగ, చిత్రలేఖనం వంటి శిబిరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు సంస్థలు ఉచితంగా, మరి కొన్ని నామమాత్రపు ఫీజుతో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏ శిబిరం ఎక్కడ జరుగుతోందో తెలుసుకుందాం పదండి.. శిక్షణ శిబిరాల వివరాలు ఇవీ.. ● విజయవాడ అజిత్సింగ్నగర్లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్ ఆవరణలో కరాటే, చదరంగం, కర్రసాము, సంగీతం, స్పోకెన్ ఇంగ్లిష్, తెలుగు వెలుగు, కూచి పూడి నృత్యం, భగవద్గీత శ్లోకాలు, హిందీ పరిచయం, డ్రాయింగ్, కంప్యూటర్ కోర్సుల్లో వేసవి శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. వివరాలకు 85002 89429 సెల్ నంబరులో సంప్రదించొచ్చు. ● మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆవరణలో బ్యాడ్మింటన్, యోగా, జిమ్, ఏరోబిక్స్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివరాలకు 63041 90057, 99599 59530 సెల్ నంబర్లను సంప్రదించాలి. ● విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. గాంధీనగర్, గురునానక్ కాలనీ, చిట్టినగర్లో కె.ఎల్.రావు స్మిమ్మింగ్ పూల్స్లో స్మిమ్మింగ్లో శిక్షణ ఇస్తారు. బందరురోడ్డులో దండమూడి రాజగోపాలరావు, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియాల్లో బ్యాడ్మింటన్, సత్యనారాయణపురంలోని జి.వి.ఎస్.శాస్త్రి ఉద్యానవనం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, భవానీ పురంలోని రోజ్ గార్డెన్ పార్కు ఆవరణలో స్కేటింగ్, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. ● బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్లో ఉన్న అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 5.30 నుంచి ఏడు గంటల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 77318 77444 సెల్ నంబరులో సంప్రదించాలి. ● బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (ఎంబీవీకే)లో స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ తరగతులు నిర్వ హిస్తున్నారు. వివరాలకు 94900 98042 సెల్ నంబరులో స్పందించాలి. ● పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయ ఆధ్వర్యంలో చిన్నారులకు విజ్ఞానదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే ఉద్దే శంతో లిటిల్ రీడింగ్ చాంప్–2026 పేరుతో పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తు న్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు గ్రంథాలయానికి వచ్చి 100 గంటలకు పైగా పుస్తకం పఠనం చేసిన వారికి బహుమతులను అందజేస్తారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు టాయ్ లైబ్రరీ పేరుతో విద్యార్థుల్లో ఉచ్చారణ మెరుగు పరచడానికి పుస్తకాల్లోని అంశాలను అందరికి వినబడేలా చదవడం, భావ నైపుణ్యాలు పెంపొందించడానికి కథలు చెప్పడం, కథలు రాయడం, వంటి అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. ● మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహన సర్వీసింగ్, రిపేరింగ్, అసెంబ్లింగ్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 0866 – 2470420 ఫోన్ నంబరులో సంప్రదించాలి. ● మే మూడు నుంచి జూన్ రెండో తేదీ వరకు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ కోచింగ్ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎనిమిది నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు బాలబాలికలు మాత్రమే అర్హులు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సీ–బ్లాక్లో ఉన్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానంలో శిక్షణ పొందాలనుకునేవారు 91779 91616, అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శిక్షణ పొందాలనుకునేవారు 93934 44279, జగ్గయ్యపేటలో శిక్షణ పొందాలనుకునే వారు 93469 68443, నూజివీడులో శిక్షణ పొందాలనుకునేవారు 73863 47777 నంబర్లలో సంప్రదించాలి. ● కృష్ణాజిల్లా క్రీడాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఎనిమిది నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంతో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ క్రీడాంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహించనున్నారు. -
నీటి భద్రతకు ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో నీటి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సమర్థంగా జలవనరులన్నీ నింపుకొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అధికారులకు జలధార– జలహారతి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మనిషి బతకాలంటే నీరు చాలా అవసరమని, వర్షం ఒకసారి కురిసినప్పుడు అది ఏదో నదిలో కాని, కాలువలో కాని కలిసి సముద్రంలోకి వెళ్లిపోతుందన్నారు. కొంత వరకు భూగర్భజలాలుగా ఉండిపోతుందన్నారు. ఇలా ప్రతిరోజు వర్షం కురవదు కాబట్టి నీటి నిల్వలను ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పథకం ద్వారా నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతి నీటి బొట్టును నిల్వ ఉంచి భూగర్భ జలాలు పెంపొందించాలని సూచించారు. ఇందుకోసం వంకలకు అడ్డుగా ఉన్న ముళ్లపొదలు, కంపచెట్లు అన్నింటిని స్థానికులతో కలిసి శ్రమదానం ద్వారా తొలగించుకోవాలన్నారు. సీఆర్డీ అదనపు కమిషనర్ శివప్రసాద్, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, జలవనరులశాఖ ఎస్ఈ గుణకర్, జాయింట్ కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
తాళం వేస్తే.. ఇల్లు ఖాళీ!
సెలవులకు ఊరెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త! ● పగలు రెక్కీ చేసి, రాత్రి వేళ దొంగతనాలు చేస్తున్న నేరగాళ్లు ● విలాసాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న వైనం ● పోలీసుల అదుపులో వరుస చోరీల నిందితులు ● విజయవాడ కృష్ణలంక శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఈ నెల మొదటి వారంలో అయోధ్యకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటంతో ఉలిక్కిపడింది. బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వాంబే కాలనీకి చెందిన పాత నేరస్తుడు ములకల నిరంజన్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం : 112 ఏసీపీ క్రైమ్ : 9440627040 సీఐ క్రైమ్ : 8333993112 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కోసం : 9440627040– ఎం. రాజారావు, అడిషనల్ డీసీపీ ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇస్తే, లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. ఇంట్లోని ఖరీదైన బంగారు నగలు, నగదును బ్యాంక్ లాకర్లో ఉంచి, అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి పర్మినెంట్ అడ్రసు, వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వారి వద్దకు ఎవరైనా వస్తున్నారా, రాత్రి వేళల్లో వారి చర్యలను గమనించాలి. ఇంటి పరిసరాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసు స్టేషన్కు తెలియజేయాలి. రాత్రి వేళల్లో పడుకునే ముందు ఇంటి తలుపులు, కిటికీలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఖరీదైన వస్తువులు కిటికీల వద్ద పెట్టవద్దు. ఇంటి తలుపులు, కిటికీలకు ఎలక్ట్రికల్ సెక్యురిటీ అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అపరిచిత వ్యక్తులు ఇంటికి రాకుండా చూడాలి. కిటికీలో నుంచి మాట్లాడి పంపించి వేయాలి. పనిమనిషి, సెక్యూరిటీ, వాచ్మెన్ను నియమించే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇంటి మెయిన్గేటు, ప్రధాన గుమ్మం వద్ద, హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. -
ఉత్సాహంగా చెస్ టోర్నీ
ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర 4వ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ఉయ్యూరులోని వీఆర్కేఎం పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్రెడ్డి హాజరై రైతులు, కౌలురైతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన అంశాలపై సూచనలు చేశారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమన్నారు. అనంతరం మహాసభ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 45మంది సభ్యులతో కూడిన కమి టీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.బలరాం, కార్యదర్శిగా మాగంటి హరిబాబు, కోశాధికారిగా వై.రాధాకృష్ణ, ఉపాధ్యక్షులుగా వి.శ్రీనివాసరావు, రాజబాబు, రామాంజనేయులు, లక్ష్మణస్వామితో కూడిన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కౌలురైతుల పోరాటాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. హనుమాన్జంక్షన్ రూరల్: హనుమజ్జయంతి వేడుకలు మే 7 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని ఆలయ ప్రాంగణంలో హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తామని, ఆలయ అధ్యాత్మిక వేదికపై భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పావులూరి రామారావు, ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, పుర ప్రముఖులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ట్రాక్ల నిర్వహణ కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి(18505) రైలును ఈ నెల 29న, తిరుపతి–విశాఖపట్నం (18506) రైలును ఈ నెల 30న తిరుచానూరు –తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 28న చర్లపల్లి–తిరుచిరాపల్లి(07615) రైలు పాకాలా, చిత్తూరుకు బదులుగా రేణి గుంట, మెల్పక్కం క్యాబిన్, కాట్పాడి మీదుగా దారి మళ్లించారు. తిరువన్నమలై–నర్సాపూర్ (07220) రైలు ఈ నెల 30న చిత్తూరు, పాకాలా, తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. మే ఒకటో తేదీన కన్యాకుమారి–ఎస్ఎంవీడీ కత్రా (16317) రైలును చిత్తూరు, తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం –ఓఖా తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026u8లో ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 7ఉల్లిపాలెంలోని శ్రీగోదా రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని వైఎస్సార్ సీపీ నాయకులు వెలంపల్లి, మల్లాది, సింహాద్రి రమేష్బాబు దర్శించుకున్నారు. జగ్గయ్యపేట: వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి తిరుక్కల్యాణ మహోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వారి శేషవాహన సేవను నిర్వహించారు. -
దుర్గగుడి ప్రాంగణంలో దారుణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే మహా మండపం ఆరో అంతస్తులోని మహిళల టాయిలెట్లలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. టాయిలెట్కు వెళ్లిన వారిని గోడ ఎక్కి చూడటంతో లోపల ఉన్న ఇద్దరు మహిళలు కేకలు వేశారు. ఆలయ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మహా మండపం నాలుగో అంతస్తులో సెక్యూరిటీ సిబ్బందితో ఆలయ ఈఓ, వన్టౌన్ పోలీసులు సమావేశమయ్యారు. అదే సమయంలో మహా మండపం ఆరో అంతస్తులోని టాయిలెట్లలోకి చిట్టినగర్ వాగు సెంటర్కు చెందిన మహేష్ ప్రవేశించాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళలు టాయిలెట్ల లోపలకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునే తరుణంలో గోడపై నుంచి ఎవరో తమను చూస్తున్నట్లు గుర్తించారు. తలపైకి ఎత్తి చూసే సరికి మహేష్ కనిపించడంతో వారు కేకలు వేస్తూ బయటకు పరుగు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది కేకలతో అక్కడికి చేరుకున్న ఆలయ సిబ్బంది టాయిలెట్లలో ఉన్న మహేష్కు దేహశుద్ధి చేసి నాల్గో అంతస్తులో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువకుడి వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అతని ఫోన్ను తనిఖీ పోలీసులు తనిఖీ చేస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. -
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు డిస్ట్రిక్స్ స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిచే వేసవి శిక్షణ శిబిరాలను ఎన్టీఆర్ జిల్లాలోని బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ కె.కోటేశ్వరరావు సూచించారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణ లోని డీఎస్డీఓ కార్యాలయంలో ఆయన మంగ ళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 50 శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 27 క్రీడల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. ఎనిమిది నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు శిక్షణ శిబివరాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. జిల్లా యూత్ వేల్ఫేర్ ఆఫీసర్ కె.రమేష్ పాల్గొన్నారు. అవసరాలకు అందుబాటులో ఇంధనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాకు నిత్యం ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్, ఆరు లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా అవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరాపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో మంగళవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లా డుతూ.. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454లో సంప్రదించాలని కోరారు. ఆయిల్ బంకుల పర్యవేక్షణలో కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తహసీల్దార్ బి.సుగుణ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన గుడ్లవల్లేరు: మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటిస్తారని, పకడ్బందీ ఏర్పాట్ల చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఆయన మంగళవారం గుడ్లవల్లేరులో పర్యటించారు. ఫార్మా కంపెనీ అధినేత జాస్తి వెంకట్ రూ.15 కోట్లతో నిర్మించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీతో పాటు ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హెలీప్యాడ్ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించారు. గుడివాడ ఇన్చార్జి ఆర్డీఓ పోతురాజు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి పెడన: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 30వ తేదీన పెడనలోని శ్రీబొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే జాబ్మేళాను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు నిరుద్యోగులు నేరుగా ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావొచ్చని పేర్కొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని 720కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నరేష్ కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులని పేర్కొన్నారు. అసక్తి, తగిన అర్హతలు గల వారు హెచ్టీటీపీ ఎస్://ఎన్ఏఐపీయూఎన్వైఎఎం.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99664 89796, 8897 772488 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఇది సర్కారు తెచ్చిన సంక్షోభం
పెట్రోల్, డీజిల్ కొరత చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతేవిజయవాడ ధర్నా చౌక్ వద్ద మినీ వ్యాన్ను తాడుతో లాగుతూ నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు విజయవాడ భవానీపురంలోని ఓ బంకు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వెలంపల్లి విజయవాడ మహానాడు రోడ్డు సిగ్నల్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట నిరసన తెలుపుతున్న దేవినేని అవినాష్, ఆటోడ్రైవర్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంధన కొరత ఏర్పడిందని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజలు నమ్మి కూటమికి ఓట్లేస్తే డీజిల్, ఎరువుల కోసం రైతులను, పెన్షన్ల కోసం వృద్ధులను, రేషన్, గ్యాస్ కోసం మహిళలను రోడ్డెక్కించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పెట్రోల్ బంక్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లతో ఆటోలను లాగుతూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో దేవినేని రాజశేఖర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అవినాష్ తాడుతో ఆటో లాగి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని, ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా అందించలేకపోతోందన్నారు. సర్కారు వైఫల్యాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. ● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ వద్ద మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద పెట్రోల్ బంక్ను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ 70శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తోందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయంటూ అబద్దాలు చెబుతోందన్నారు. ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ధరలు పెంచేందుకు కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ● తిరువూరు, జగ్గయ్యపేటలో ఆయా నియోజక వర్గాల ఇన్చార్జిలు నలగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నాయకులు అన్ని వర్గాలను రోడ్డున పడేసిందంటూ ఆవేదన ఇంధన కొరతపై జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన -
తప్పని పడిగాపులు
తరగని క్యూలు.. డీజీల్ అందుబాటులో లేకపోవడంతో విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిచిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంధన సంక్షోభం రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా డీజిల్ కొరత ఇంకా వేధిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బస్సులు, కారు ట్రావెల్స్ నిర్వాహకులకు డీజిల్ షాక్ తగిలింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కొన్ని బంకుల వద్ద క్యూ కట్టి దర్శనమిచ్చాయి. అక్కడక్కడ కొన్ని బంకులు తెరుచుకోలేదు. కొన్ని బంకుల యాజమాన్యం లోడ్ రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మూసివేశామని వాహనదారులకు సమాధానమిస్తున్నారు. రెండు రోజులుగా వాహనాదారులు బంక్ల వద్ద ఇబ్బందులు పడుతూ వచ్చారు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో రద్దీ తగ్గింది. రైతుల కష్టాలు తీరేదెలా? గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో 20, 30 గ్రామాలకు ఒకటి రెండు పెట్రోల్ బంకులే అందుబాటులో ఉన్నాయి. అటువంటి చోట రైతులు అసౌకర్యానికి గురయ్యారు. ట్రాక్టర్లు, వరి, మొక్కజొన్న కోసే యంత్రాలు పొలాల్లో ఉంటే సహాయకులు బైక్లపై క్యాన్లతో డీజిల్ అందిస్తూ ఉంటారు. దగ్గర్లో బంకులు లేక పోవడం... ఇవాళ కూడా కొన్ని బంకులు పరిమితులు విధించడంతో రైతుల అవసరాలకు సరిపడా అందలేదని చెబుతున్నారు. ఇక ఆటో వాలాలు దూర ప్రాంత కిరాయిలు రద్దు చేసుకున్నారు. రూ. 200, రూ. 300కే డీజిల్ పోశారని చెబుతున్నారు. ట్రావెల్స్ బస్సుల క్యూ.. నగరంలో హనుమాన్పేట ప్రైవేటు ట్రావెల్స్కు అడ్డా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులతో ఉదయాన్నే బస్సులు నగరానికి చేరుకుంటాయి. సాయంత్రం ప్రయాణికులతో తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు డీజిల్ కోసం క్యూ కట్టాయి. రాత్రిళ్లు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చామని, పగలు నిద్ర పోకుండా డీజిల్ కోసం క్యూలో బస్సులు నిలుపుకోవాల్సి వచ్చిందని డ్రైవర్లు వాపోయారు. జిల్లాలో పలు చోట్ల బంకులు మూసి ఉంచారు. వాహనదారులు అడిగితే లోడ్కు డబ్బులు కట్టామని, లోడ్ వచ్చే వరకు పెట్రోల్, డీజిల్ పోయలేమని సమాధానం చెబుతున్నారు. ఆయా బంకుల్లో పనులు లేక పోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ధర పెంచిన ప్రైవేటు బంక్లు.. జిల్లాలో ప్రైవేటు బంకులు ధరలు పెంచేశాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా డీజిల్ రూ.97.07గా ఉంది. ప్రైవేటు బంకుల్లో లీటర్కు రూ.5 చొప్పున పెంచేశారు. ప్రైవేటు బంకుల్లో పెట్రోల్ రూ. 114.19కు చేరింది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లపై పెట్రో కష్టాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలి.. ఆటో కార్మికులు ఇబ్బంది పడకుండా డీజిల్, పెట్రోల్ ప్రత్యేకంగా అందించేలా చర్యలు తీసుకోవాలి. – డి. నాయుడు ఆటో డ్రైవర్అసలే ర్యాపిడో, ఓలా, ఊబర్ లతో పాటు ఫ్రీ బస్సుల వల్ల ఆటో కిరాయిలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆటోకు అవసరమైన డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ డీజిల్ దొరుకుతుందో ఎక్కడ ఉండదో అర్థం కావటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కేవలం రూ. 200 డీజిల్ మాత్రమే పోస్తున్నారు. దీనివల్ల ఉన్న బేరాలను కూడా వదులు కోవాల్సి వస్తోంది. – ఆర్. కృష్ణ, ఆటో డ్రైవర్కుదేలవుతున్న రవాణా వ్యవస్థ ఆయిల్ లోడ్ రాకపోవడంతో తెరుచుకోని బంక్లు బారులు తీరిన ట్రావెల్స్ బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఆటోలు, కార్లకు పరిమితులు -
రెండు ఆటోలను ఢీకొన్న కారు
చల్లపల్లి: ఓ కారు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి ఒకదాని తరువాత ఒకటి చొప్పున రెండు ఆటోలను ఢీకొంది. చల్ల పల్లి – నడకుదురు రోడ్డులోని రాముడుపాలెం అడ్డరోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. చల్లపల్లి వైపు నుంచి నడకుదురు వైపు ప్రయాణిస్తున్న కారు రాముడుపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే మలుపుతిప్పే క్రమంలో అదుపుతప్పి రెండో వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా ఒకదాని వెనుక ఒకటి రెండు ఆటోలు వస్తున్నాయి. మొదటి ఆటోను డ్రైవర్ పూర్తిగా రోడ్డుపక్కకు తీసుకెళ్లినా అదుపుతప్పిన కారు ఢీకొంది. దీంతో ఆ ఆటో పక్కనున్న పంట బోదెలో పడిపోయింది. రెండో ఆటోను కూడా ఢీకొని కారు ఆగింది. పంటబోదెలో పడిన ఆటో డ్రైవర్, మరో ముగ్గురికి, రెండో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న పురిటిగడ్డ మాజీ సర్పంచ్ మాతంగి రమ్య తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించేందుకు 108 ఫోన్చేస్తే అందుబాటులో అంబులెన్సు అందుబాటులో లేదని చెప్పటంతో మరొక ఆటోలో చల్లపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. -
శ్రీమన్నారాయణుడి సేవలో వైఎస్సార్ సీపీ నేతలు
కోడూరు: మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పండితులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ వారికి ఆలయ విశిష్టను వివరించారు. అనంతరం 13 యాగశాలల్లో జరుగుతున్న హోమ క్రతువును నేతలు తిలకించారు. వేదికపై అష్టాక్షరీ స్వామిజీ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. త్వరలో ఈ క్షేత్రాన్ని తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శిస్తారని చెప్పారు. అనంతరం అష్టాక్షరీ స్వామిజీని వెలంపల్లి, మల్లాది, సింహాద్రి సత్కరించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
ఉయ్యూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉయ్యూరు జియో పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ప్రైవే టు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు క్లీనరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. రమణ ట్రావెల్స్కు చెందిన బస్సు యానాం నుంచి 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరింది. ఉయ్యూరు జియో పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే చేపల లోడుతో ఆగి ఉన్న లారీని అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుకగా వచ్చి ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జునజ్జయింది. బస్సు క్లీనరు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సంత చెరువు మార్కెట్ చెందిన ఎరబాల సూర్యచంద్రశేఖర్ (20) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవరుతో పాటుగా బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్సుల్లో వైద్యం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. తొమ్మిది మంది ప్రయాణికులు విజయవాడలో, ఐదుగురు ప్రయాణికులు ఉయ్యూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో క్లీనరు ఎరబాల సూర్యచంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయంతో భీతిల్లిన ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యానాం నుంచి బయలుదేరి సమయం నుంచి డ్రైవరు అతివేగంగానే బస్సును నడుపుతున్నట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. కొత్త హైవే మీదుగా మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక జియో పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో వచ్చిన శబ్దానికి ప్రయాణికులు భీతిల్లారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు. నిద్ర మత్తు నుంచి తేరుకునే లోపే పలువురు ప్రయాణికులు గాయాలపాయ్యారు. ఈ ప్రమాదాన్ని పెట్రోలు బంకులో పనిచేస్తున్న సిబ్బంది ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు గుర్తించి క్షతగాత్రులను బయటకు లాగటంలో సహాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులతో99 కలిసి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బస్సు క్లీనరు సూర్యచంద్రశేఖర్ మృతదేహం ప్రమాదంలో ధ్వంసమైన ట్రావెల్స్ బస్సు ముందు భాగంక్లీనరు మృతి, మరో 14 మందికి గాయాలు -
1న పమిడిముక్కల మండలంలో సీఎం పర్యటన
పామర్రు: మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్ర బాబు పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తారని, సంబంధిత అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం ఉదయం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడుతో కలిసి పడిముక్కల మండలంలో కలెక్టర్ పర్యటించారు. మండలంలోని కపిలేశ్వరపురం వద్ద పొలాల్లో చేపట్టిన హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పమిడిముక్కల గ్రామంలో ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తరువాత వీరంకి లాకులు వద్ద ఎన్టీఆర్ కాలనీలో పింఛన్ల లబ్ధిదారులు చాగంటిపాటి సాయి ప్రసన్న, గుర్రం జగదీశ్వరి, కట్ట సుబ్బమ్మ తదితరులతో మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఉయ్యూరు ఇన్చార్జి ఆర్డీఓ పి.డి.హరిహరనాథ్, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, డ్వామా పీడీ శివ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, డీఎల్డీఓ రాజేష్, డీఎల్పీఓ సంపత్కుమారి తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దాడులు, వేఽధింపులకు గురైన మైనార్టీలు వెనకడుగు వేయక ధైర్యంగా ఫిర్యాదు చేయాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం సూచించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆమె సోమవారం విజయవాడ వచ్చారు. గాంధీనగ ర్లోని ఫిల్మ్ చాంబర్లో మైనారిటీలతో ప్రత్యేకంగా సమావేశమై, ముఖాముఖీ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మైనార్టీలు తమ అభిప్రాయాలు, సమస్యలను వినతిపత్రం రూపంలో కమిషన్ సభ్యురాలికి అందజేశారు. ఈ సందర్భంగా మునవరి బేగం మాట్లాడుతూ.. మైనార్టీలపై దాడులు, వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునేలా కమిషన్ పనిచేస్తోందన్నారు. అనంతరం నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జాతీయ మైనారిటీ కమిషన్ పర్యటిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గురు ద్వారా అధ్యక్షురాలు కరం వీర్కౌర్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.నవీన్కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.చింతయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని కోరుతూ ధర్నా చౌక్లో ఫ్యాప్టో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షలు సోమవారంతో ముగిశాయి. మూడో రోజు నిరాహార దీక్ష శిబిరం నుంచి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మూడో రోజు దీక్షలను సీనియర్ నాయకుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చిరంజీవి మాట్లాడుతూ.. వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నదే తమ ప్రధాన డిమాండులని పేర్కొన్నారు. మే 31వ తేదీలోపు సమస్యలను పరిష్కరించకపోతే జూన్లో ప్రత్యక్ష కార్యాచరణకు ఫ్యాప్టో సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎం. కృష్ణయ్య, ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్లు కె.నర హరి, కాకి ప్రకాష్రావు, సీహెచ్.రమేష్, సీహెచ్.వెంకటేశ్వర్లు, బుప్యూటీ సెక్రటరీ జనరళ్లు ఎన్.వెంకటేశ్వర్లు, కె.బసవలింగా రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీటీపీఎస్ రీజనల్ కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం: ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీటీపీఎస్ నూతన రీజనల్ కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. రీజనల్ అధ్యక్షుడిగా షేక్ సలీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ఉపాధ్యక్షులుగా సుబ్బారావు, పార్వతి, రత్నరావు, రీజనల్ కార్యదర్శిగా రవీంద్రకుమార్, సహాయ కార్యదర్శిగా రవికుమార్, సత్తిరాజు, ప్రవీణ్కుమార్, కోశాధికారిగా కిషోర్, పబ్లిసిటీ కార్యదర్శిగా ఏసుదాసును ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులు కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మోహనరావు సూచించారు. -
ప్రాధాన్యతాక్రమంలో సమస్యలకు పరిష్కారం
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు మేమున్నామంటూ సిబ్బంది భరోసా కల్పించాలన్నారు. వారి పట్ల మర్యాదగా మసలుకోవాలన్నారు. మొత్తం 46 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు గన్నవరం: పెళ్లి రోజు భర్తతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ మహిళను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని కొండపావులూరు వద్ద బైపాస్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఆ మహిళ ఘటనా స్థలంలోని మృతి చెందగా ఆమె భర్త గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడలోని రాణిగారితోటలో నివసిస్తున్న సంగంరెడ్డి రాము, కుమారి దంపతుల పెళ్లి రోజు కావడంతో బైక్పై ద్వారకాతిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమైన ఆ దంపతులను మండలంలోని కొండపావులూరి పరిధిలోని జాతీయ రహదారి బైపాస్పై భారత పెట్రోలియం బంకు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై నుంచి ఎగిరిపడడంతో కుమారికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త రాము మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారుపై ‘ప్రభుత్వ వాహనం’ అనే నంబర్ ప్లేట్ ఉండడం గమనార్హం. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య మృతితో భర్త రాము శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలికి ఇరువురు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెట్రోల్ బంకులో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
గూడూరు: కృష్ణా జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరతపై ప్రజలు భయాందోళనలు చెంద వద్దని కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. మండల కేంద్రమైన గూడూరులో జాతీయ రహదారి వెంబడి ఉన్న పెట్రోల్ బంకును ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలసి కలెక్టర్ బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకు యాజమాన్యం, వాహనదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బంకులో ఆయిల్ సరఫరా నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వాస్తవానికి జిల్లాలో డీజిల్ కొరత లేదన్నారు. ఆదివారం సాధారణంగా డీజిల్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. యుద్ధం నేపథ్యంలో డీజిల్, పెట్రోలు దొరుకుతుందో లేదో అన్న భయాందోళనతో కొంత మంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. వాస్తవంగా వినియోగదారులకు అవసరమైనంత డీజిల్ అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు, మార్కెటింగ్ యజమానులందరితో మాట్లాడామని తెలి పారు. బంకుల్లో అవసరమైనంత డీజిల్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అవసరానికి మించి డీజిల్, పెట్రోలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్బాబు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, సీఐ అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను కించపరిస్తే
పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకునేందుకు సైతం పోలీసు అధికారులు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు శాఖలను ఎంతలా దిగజార్చారో ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలను ఉద్దేశించి ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై గతంలో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఇంత వరకూ పట్టించుకోలేదు. దీంతో మరోసారి ఫిర్యాదు చేసేందుకు పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జిల్లా నేతలు నాయకులు సోమవారం పోలీస్ కమిషనరేట్కు వెళ్లారు. అయితే వారి నుంచి ఉన్నతాధికారులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆ కార్యాలయంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు అందజేశారు. అనంతరం కార్యాలయం బయట పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ బండారం బయటపడింది వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతల భార్యల గురించి ఏబీఎన్ రాధాకృష్ణ అగౌరవంగా మాట్లాడి కించపరిచాడని విమర్శించారు. ఏబీఎన్ చానల్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా, ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందన్నారు. మహిళలను కించపరిచిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేస్తుంటే ఆ లెటర్ తీసుకోవటానికి కూడా భయపడుతున్నారని విస్మయం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా మహిళలు అంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బూతు చానల్లో మహిళలపై విమర్శలు మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బూతు చానల్లో సభ్య సమాజం తలదించుకునేలా తమ కుటుంబ సభ్యులైన మహిళలపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇవే విమర్శలు వారి కుటుంబ సభ్యులపై చేసుకోగలరా అని ప్రశ్నించారు. ఈ విమర్శలను చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ సమ ర్థిస్తారా అని నిలదీశారు. చంద్రబాబుది రాక్షస ఆనందమని, అసభ్య పదజాలాన్ని ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. దీనిని తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా దిగజారి వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి రేపు తప్పక వస్తుందని హెచ్చరించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఏ రోజైనా తామే చెప్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏబీఎన్ రాధాకృష్ణ అంతలా బూతులు మాట్లాడుతున్నా చర్యలు తీసుకుండా చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్, మంత్రులు సమర్థ్ధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్ సీపీ జగ్గయ్య పేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, గుంటూరు పార్టీమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. ఆయనపై ఫిర్యాదు తీసుకునేందుకు భయపడుతున్న పోలీసులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు పొరపాటున చిన్న మాట మాట్లాడి, వెంటనే క్షమాపణ చెప్పినా జైల్లో వేశారని, మరి మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గతంలోనూ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, దానిపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మళ్లీ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాధాకృష్ణపై సాక్ష్యాధారాలు సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. మహిళలను కూటమి నేతలు ఇబ్బంది పెడుతున్నా చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇంధన ఇబ్బంద్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం బంకుల వద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. గ్రామీణ ప్రాంతా ల్లోని బంకుల్లో డీజిల్ కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. ఇంధన కొరత రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల అవసరాలకు సరిపడా డీజిల్ అందుబాటులో లేనిపరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్, కార్లు, హార్వెస్టర్లకు డీజిల్ పంపిణీలో కోత విధించారు. ఒక్కో ట్రాక్టర్కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా డీజిల్ పంపిణీచేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో తెరిచి ఉన్న ప్రతి బంకు వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి. ఉదయం నుంచి రద్దీ కొనసాగుతోంది. దూరప్రాంత ప్రయాణాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారు పెట్రోల్ బంక్ల వద్దే గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంక్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులను నియమించారు. ప్రతి బంక్లోనూ నగదు మాత్రమే స్వీకరిస్తూ ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ చెల్లింపులకు స్వస్తి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్ని వర్గాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 321 బంకులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తం 321 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ బంకుల్లో రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో లేదు. ఇంధనం లేక ఆదివారం మూత పడిన పలు బంకులు సోమవారం సైతం తెరుచుకోని పరిస్థితి నెలకొంది. బంకుల రోజు వారీ అవస రాల కంటే పది శాతం అదనంగా ఇంధనం అందుబాటులో ఉంచుతామని అధికారులు చెప్పినప్పటికీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని ప్రజలు మండిపడుతున్నారు. మొక్కజొన్న, వరి కోతలు వివిధ దశల్లో ఉన్నాయి. వరి కోతకు యంత్రాలు, కల్లాల్లో నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లు అవసరం. డీజిల్ కొరతతో ఈ యంత్రాలు నిలిచిపోయాయి. డీజిల్ కొరత కారణంగా రైతుల అవసరాలకు సరిపడా ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు మానుకుని బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ పోయించుకోవడంతో సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇంధన కొరతను అధికారులు అంగీకరించడం లేదు. తిరువూరు, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరులపాడు, గంపలగూడెం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్క జొన్న చివరి దశకు వచ్చింది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు సరిపడా ఇంధనం పోయడం లేదు. పెనుగంచిప్రోలులో ఏడు బంకులు ఉండగా కేవలం ఒక్క బంకులోనే డీజిల్ అందుబాటులో ఉంది. దీంతో రైతులు ఆ బంక్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆయిల్ క్యాన్లతో పెద్ద క్యూ ఏర్పాటు చేశారు. ఇక్కడ కారు, ట్రాక్టర్, హార్వెస్టర్లకు రూ.1000, ఆటోలకు రూ.200 విలువైన డీజిల్ కొడుతున్నారు. క్యాన్లు తీసుకెళ్లిన వారికి పది లీటర్ల చొప్పున డీజిల్ పోస్తున్నారు. ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు ఆందోళన చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోనూ అరకొరగానే డీజిల్ లభిస్తోంది. ఇక్కడ ట్రాక్టర్కు 20 లీటర్ల చొప్పున పోస్తున్నారు. గంపలగూ డెంలో ఓ బంక్ వద్ద మండుటెండలో రైతులు క్యాన్లతో డీజిల్ కోసం నిరీక్షించారు. తిరువూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్లకు కూపన్లు అందజేస్తున్నారు. వత్సవాయి మండలంలో అందుబాటులో ఉన్న బంకుల్లో ట్రాక్టర్కు రూ.500 చొప్పున డీజిల్ పోస్తుండంతో రైతులు పనులు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెడ్డిగూడెంలో ఓ బంక్ వద్ద ట్రాక్టర్లు క్యూ కట్టాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో అక్వా రైతులు డీజిల్ కోసం ఓ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల బంకుల్లో ఇంధనం సరిపడా ఉంచా లని కోరుతున్నారు. -
‘జలధార – జలహారతి’లో పూడికతీత పనులు
రెడ్డిగూడెం: ఎన్టీఆర్ జిల్లాలో జలధార – జలహారతిలో భాగంగా చెరువులు, కాలువల్లో పూడికతీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచి భూగర్భ జలాలను పరిరక్షిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో ఊర చెరువు సప్లయ్ చానల్ పూడిక తీత పనులను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 339 చెరువులు ఉన్నాయని, వాటిలో నీటినిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెంచటానికి జలధార – జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో మినీ రిజర్వాయర్లు, డ్యాముల్లో పది టీఎంసీల సామర్థ్యం నీటిని నింపుతామన్నారు. జిల్లాలో ఎ.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో భూగర్భ జలాలు ఎనిమిది నుంచి 11 మీటర్ల లోతున ఉన్నాయని, వాటిని పెంచుకునేందుకు చర్యలు చేపట్టా మని పేర్కొన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాను సశ్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథి, తహసీల్దార్ జె.సుశీలాదేవి, రెడ్డిగూడెం ఎంపీడీఓ జె.ప్రభాకరరావు, ఇరిగేషన్ డీఈఈ, ఏఈలు, ఏపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చిన వైఎస్ జగన్
మచిలీపట్నం(చిలకలపూడి): పేదల సొంతింటి కల నెరవేర్చింది మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టని వారి పట్టాలను రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు. పట్టాలు రద్దుచేస్తే బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మచిలీపట్నం మండలంలోని కరగ్రహారంలో ఉన్న జగనన్న కాలనీ డీ–బ్లాక్ను ఆయన సోమవారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, తనకున్న అనుభవం మరెవరీకీ లేదని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో మూడు సెంట్ల చొప్పున ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఏవని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పేదలకు ఇళ్ల పట్టాలు అందాయని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి రూ.10 వేల కోట్లతో భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చారని పేర్కొ న్నారు. మచిలీపట్నంలో సుమారు 320 ఎకరాల్లో 19,302 మంది లబ్ధిదారులకు ఒకటే లేఅవుట్లో పట్టాలు ఇచ్చారని, ప్రతి బ్లాక్కు ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారని పేర్కొన్నారు. ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూటమి నాయకులు తీసుకెళ్లి తమకు ఇష్టమొచ్చిన చోట ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం లేనందునే కాలనీలో ఇళ్ల నిర్మాణం ఆగిందని వివరించారు. రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు జగనన్న కాలనీల్లో పట్టాలు ఇచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు పక్కాగా స్థలాలు పంపిణీ చేశారని పేర్ని నాని స్పష్టంచేశారు. లబ్ధిదారులకు వారికి కేటాయించిన స్థలాలను జియో ట్యాగింగ్తో పాటు పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నాయకులు ఏదో ఒకటి చేస్తారని తెలిసే పక్కాగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. కొల్లు రవీంద్ర పేరుకే మంత్రని ఎక్కడ దోచుకుందామా, తిందామా అనే తపన తప్ప ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచించే ప్రసక్తే లేదని ఎద్దేవాచేశారు. పట్టాలు రద్దు చేసే సత్తా ముఖ్యమంత్రికి కూడా లేదని, లబ్ధిదారులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులు రెండు సంవత్సరాలు ఓపిక పడితే తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామన్నారు. టిడ్కో ఇళ్లలో సౌకర్యాలు కల్పించాలి రుద్రవరం గ్రామంలో టిడ్కో గృహాలను ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ అట్టహా సంగా ప్రారంభించారని పేర్ని నాని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆ గృహాల్లో లబ్ధిదారులు ఎందుకు నివాసం ఉండటం లేదో గ్రహించాలన్నారు. మంత్రి మాటలు నమ్మి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అధికారులు అంతరాత్మను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుడూ టిడ్కో గృహాల్లో నివాసం ఉండేలా సౌకర్యాలు కల్పించా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ లభించక పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు రైతులు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆడించే సత్తా ఉన్నా వాడుకునే శక్తి చంద్రబాబుకు లేదన్నారు. గాలులు తగ్గినందునే విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడాన్ని ఎద్దేవాచేశారు. విండ్ పవర్ ఇప్పటికీ ప్రతి సెకండ్కు నాలుగు మీటర్లు తగ్గకుండా ఉంటుందని, ఆ మాత్రం సమాచారం లేకుండా మంత్రి మాట్లాడటం బట్టి ఆయన పరిజ్ఞానం ఏపాటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ నాయకులు శీలం మారుతీరావు (బాబ్జి), గూడవల్లి నాగరాజు, చిటికిన నాగేశ్వరరావు, గాజుల భగవాన్, మొహమ్మద్ రఫీ, షేక్ మొహమ్మద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలపై ఆసక్తిని పెంపొందించేకు మేలో తమ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవి నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రవి నాయుడు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నుంచి 16 ఏళ్ల లోపు పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహిస్తా మని చెప్పారు. రాష్ట్రంలోని 423 మండలాల్లో 1,020 ప్రాంతాల్లో 55 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంప్లు జరుగుతాయని పేర్కొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. క్యాంప్ల పనితీరును పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ల్లో అవసరమైన క్రీడా సామగ్రి కోనుగోలుకు నిధులను కేటాయించామని తెలిపారు. శాప్ ఏఓ వెంకట రమణ నాయక్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 104 అర్జీలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమ వారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి 104 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. మే ఒకటో తేదీన పమిడిముక్కల మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తారని తెలిపారు. పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడతారని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో డాక్టర్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వివరించారు. సీఎం పర్యటనల ఏర్పాట్లకు ఉయ్యూరు, గుడివాడ ఆర్డీఓలు ఇన్చార్జ్ అధికారులుగా వ్యవహరించాలని ఆదేశించారు. పింఛన్ల లబ్ధిదారులతో ముఖాముఖీ ఏర్పాట్లను డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ పర్యవేక్షించాలని సూచించారు. -
చెరువులో మహావిష్ణుమూర్తి విగ్రహం
గూడూరు: మండలంలోని రామానుజవత్తర్లపల్లిలో మహావిష్ణుమూర్తి ఆకారంలో ఉన్న శిలా విగ్రహం బయటపడింది. గ్రామంలోని చెరువులో మట్టిని స్థానిక రైతు మట్టా లక్ష్మీనారాయణ తన ఇంటి మెరక చేసుకోవడానికి తోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మట్టిని చదును చేస్తుండగా విగ్రహం బయట పడింది. విగ్రహం నల్లని రంగులో దాదాపు 3 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పుతో ఉంది. విషయం గ్రామస్తులకు తెలియడంతో జనం వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం గ్రామానికి వచ్చారు. తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, ఆర్ఐ ఝాన్సీ రాణి, వీఆర్వో బషీర్ విగ్రహాన్ని పరిశీలించి, గ్రామస్తుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. పూర్వం దశాబ్దాల క్రితం కూడా గ్రామంలో ఇదే మాదిరిగా చెరువు తవ్వకాలలో వేణుగోపాల స్వామి విగ్రహం బయట పడటం విశేషం. -
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ తరపున హామీ ఇస్తున్నాం.ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్సీపీ పాలనే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే పెట్రోల్, డీజిల్ కొరత
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, అనాలోచిత విధానాలే కారణమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. ఇంధన సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా సాధారణ ప్రజలు, ఉద్యోగులు, రైతులు, రవాణా రంగానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోందని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని, అప్పట్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్ ధైర్యంగా, సమర్థవంతంగా పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
17న విజయవాడలో బీసీ మేథోమధన సదస్సు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీల ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా మే 17న విజయవాడలో బీసీ మేథోమధన సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో మే 17 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో బీసీ సంఘ నాయకులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ ఐలాపురం హోటల్లో సదస్సు నిర్వహణపై బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీసీల మేథోమధన సదస్సులో జనగణనలో బీసీల కుల గణన సక్రమ నిర్వహణపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. బీసీ రక్షణ చట్టం, 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ వంటి వాగ్ధానాలు త్వరితగతిన అమలు చేసేందుకు ఒత్తిడి చేసేలా చర్చ జరుగుతుందని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, యువజన అధ్యక్షుడు పారుపల్లి మహేష్, మేకా వెంకటేశ్వరరావు, కొల్లూరు హనుమంతరావు, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, జేఎల్ కుమార్, బి.శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యువత భవిష్యత్తుకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు
పెనమలూరు: యువత భవిష్యత్తును దృష్టిలోఉంచుకోని రాష్ట్రంలో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ రవికృష్ణ అన్నారు. కానూరు స్కాట్స్పైస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఎస్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ –2026ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈగల్ వ్యవస్థ రక్షణ కవచంలా దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదవద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం సంస్థ లక్ష్యమన్నారు. భారతీయ యువతను బలహీనపరచటం ద్వారా దేశ భవిష్యత్తు దెబ్బతీయాలని విదేశీ శక్తులు చేస్తున్న కుట్రను యువత తిప్పికొట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే మహత్తర అవగాహన కార్యక్రమాన్ని ఈగల్ నిర్వహిస్తుందన్నారు. ఈగల్ కాల్ సెంటర్ 1972కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. చెస్ ఆడటం వలన యువత చురుకై న ఆటోచనలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏసీఏ చైర్మన్ కేవీవీ శర్మ, ఏసీఏ అధ్యక్షుడు ఎ.సురేష్, కార్యదర్శి కె.జగదీష్, టోర్నమెంట్ డైరెక్టర్ పి.రేణుక, పాఠశాల చైర్మన్ వీరమాచినేని వంశీ, డైరెక్టర్ వీరమాచినేని శాంతి, సీఈఓ కొడాలి జాహ్నవి, ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ.వీరాంజనేయులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు. -
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి భక్తులకు ఆలయ వేద పండితులు దిలీప్కుమార్ సౌజన్యంతో ఆలయం వారు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావటంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు ఆదివారం రూ. 3.54లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన వేమూరి శివరామప్రసాద్ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి సుమారు 23 గ్రాముల బంగారం, రూ. 3,54,292 విలువ కలిగిన బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు నేడు పామర్రుకు కృష్ణా కలెక్టర్ చిలకలపూడి(మచిలీ పట్నం): వారం రోజులుగా వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విధులకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఇన్చార్జ్ కలెక్టర్గా వ్యవహరించారు. కాగా సోమవారం ఉదయం కలెక్టర్ డీకే బాలాజీ పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటించనున్నారు. మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పమిడిముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హాజరుకానున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం మచిలీపట్నం కలెక్టర్లో జరిగే మీకోసం కార్యక్రమానికి హాజరవుతారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ప్రతిరోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అన్నారు. ఆయన ఆదివారం జీజీహెచ్ లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యూరాలజీ, కార్డియాలజీ వార్డులను సందర్శించి, ఆయా వార్డులోని రోగులతో మాట్లాడారు. వైద్యం సక్రమంగా అందుతుందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అటెండెంట్స్తో పాటు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అదే విధంగా రోగులు వాడే టాయిలెట్స్ను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట డెప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సూర్యమంగాదేవి తదితరులు ఉన్నారు. -
తిరుపతమ్మ ఆలయంలో మార్పులకు శ్రీకారం
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నూతన మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. కొంతకాలంగా ఆలయంలో ప్లేట్ కనెక్షన్ పెరగటంతో హుండీల ఆదాయం తగ్గుతోందని అధికారులు భావించారు. దీనిలో భాగంగా ప్లేట్ కనెక్షన్ నియంత్రించటానికి చర్యలు చేపట్టారు. ప్లేట్ లేకుండా ఏక హారతి అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో హుండీల ద్వారా వచ్చే ఆదాయం ఇటీవల లెక్కింపులో 45 రోజులకు రూ.10 లక్షల వరకు పెరిగిందని అధికారులు అంటున్నారు. అయితే కేవలం ప్లేట్ కనెక్షన్ నివారణకు చర్యలు చేపట్టిన అధికారులు బహిరంగ వేలంలో ఆదాయం ఎందుకు తగ్గిందో దానిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల మాదిరిగా భక్తులకు దర్శనం.. అమ్మవారి ఆలయంలో తిరుమలలో మాదిరిగా దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేయటంపై భక్తులు సంతోషం వ్యక్తం వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలయంలో రూ.50 టికెట్, ఉచిత దర్శనం చేసుకునే భక్తులు దూరం నుంచి క్యూలో వచ్చి అంతరాలయంలోని అమ్మవారిని దర్శిచుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకు వచ్చి అమ్మవారిని కనులారా దర్శించుకునేందుకు సరైన సమయం కూడా దొరికేది కాదు. దీంతో భక్తులు ఎంతో నిరాశకు గురయ్యేవారు. దీనిని గమనించిన అధికారులు తిరుమల తరహాలో అంతరాలయం ఎదురుగా వచ్చి అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లో మార్పులు చేశారు. దీనివల్ల భక్తులు క్యూలైన్లో అమ్మదారిని అంతరాలయం వచ్చేంత వరకు ఎక్కువ సేపు అమ్మవారిని చూసే అవకాశం కలిగింది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం.. అమ్మవారి దర్శన టికెట్లు తీసుకునే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ దేవస్థాన అధికారులు సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరూర్ వైశ్యాబ్యాంక్ వారు 3 కియోస్క్ యంత్రాలను ఆలయానికి అందజేశారు. ఈయంత్రాల సాయంతో క్యూర్ కోడ్ను స్కాన్ చేసి అమ్మవారి దర్శనం టికెట్లుతో పాటు సేవలు, కేశఖండన, ఈ–హుండీ, ఆలయ సమాచారం తెలుసుకోవచ్చు. భక్తులు టికెట్లు కోసం బారులు తీరకుండా సులభంగా ఈయంత్రం సాయంతో టికెట్లు పొందవచ్చు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టిన అధికారులు అమ్మ దర్శనంలో మార్పులు -
దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ చింతల్కు చెందిన కమ్మిరి సునీల్, పావని దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,516ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుడివాడకు చెందిన జి.ఉమాదేవి కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. పెనమలూరు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఎంసీఏ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ టి.సుమన్ త్యాగరాజ్ను నియమించారు. ఈ మేరకు ఆదివారం వివరాలు తెలుపుతూ సుమన్ త్యాగరాజ్ కానూరులో షాన్రాక్ ఇంటర్నేషనల్ పాఠశాలతో పాటు విజయవాడలో సెయింట్ జోన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ను నిర్వహిస్తున్నారు. ఆయన సౌత్, ఈస్ట్ జోన్ ఇండియా రీజన్ వైఎంసీఐ చైర్మన్గా ఉన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఎంసీఏ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఆయన 2026–29 వరకు పదవిలో ఉంటారు. యువత అభివృద్ధి, సామాజిక సేవలు, విద్యా ప్రమాణాలు పెంపొందించడంతో సుమన్ త్యాగరాజ్ ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయనకు పదవి రావడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. బస్టాండ్(విజయవాడపశ్చిమ): పండిట్ నెహ్రూ బస్టేషన్లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. పీఎన్బీఎస్ అరైవల్ బ్లాక్ మెదటి అంతస్తులో సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం సెలవు దినం కావటంతో వివిధ దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిట లాడుతుంది. ఒక్కసారిగా బస్టాండ్లో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మెదటి అంతస్తులో ఉన్న కార్యాలయాల్లోని పాత ఫర్నిచర్ను బయట బాల్కానీలో ఉంచారు అవి అగ్ని ప్రమాదంలో కాలీ బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మార్మోగిన నారాయణ మంత్రం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి క్షేత్రం నారాయణ మంత్రంతో మార్మోగింది. ఆలయంలో జరుగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞ ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక తిరుచ్చిపై స్వామివార్లను రుగ్వేద యాగశాలకు తీసుకువెళ్లి హోమక్రతువులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో రుత్వికులు 108 హోమగుండాల వద్ద ధన్వంతరి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 13 యాగశాలల్లో రుత్వికులు హోమక్రతువు జరపగ్గా, ఇష్టి హోమగుండాల వద్ద భక్తులు యజ్ఞానాన్ని నిర్వహించారు. 45మంది దంపతులు ధన్వంతరి మహాయజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. యజ్ఞం అనంతరం పూర్ణాహుతిని భక్తిప్రపత్తులతో జరిపారు. అనంతరం భక్తమండళ్ల సభ్యులు భజనలు చేస్తూ భక్తిగీతాలను ఆలపించారు. చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యజ్ఞాలు అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల వెంట నగరోత్సవాన్ని నిర్వహించారు. పోలీసు అధికారుల పూజలు.. మహాయజ్ఞ ఉత్సవాల్లో అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, సీఐ యువకుమార్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అష్టాక్షరీ స్వామిజీ డీఎస్పీ, సీఐ దంపతులను సత్కరించి ప్రసాదాలను అందించారు. 29న జరిగే రాజగోపుర మహాకుంభ ప్రోక్షణకు ఏర్పాటు చేసే బందోబస్తుపై డీఎస్పీ అష్టాక్షరీ స్వామిజీతో చర్చించారు. ఎస్ఐ చాణిక్య–పూర్ణమాధురి దంపతులు ధన్వంతరి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. కనులపండువగా సాగిన ధన్వంతరి మహాయజ్ఞం -
వ్యవసాయంపై పెట్రోల్, డీజిల్ సంక్షోభ ప్రభావం
గుడివాడటౌన్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడటం వల్ల వ్యవసాయంపై దాని ప్రభావం చూపుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్.నాగిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనేక పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని, రబీ కోతకాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందన్నారు. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరమని, అయితే స్టాకు లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. ఆక్వారంగంలో దీని ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.. గోదావరి డెల్టాలో డీజిల్ సరఫరా గణనీయంగా తగ్గడంతో వరికోత, ధాన్యం రవాణా, సాగుపనులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వరికోత ఆలస్యంకావడం, పండిన పంట నేలపై రాలిపోవడం వలన దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని, ఇప్పటికే పెరిగిన ఇన్పుట్ ఖర్చులు (విత్తనాలు, కార్మికుల వ్యయం) మధ్య ఇంధన సంక్షోభం మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇంధన సరఫరా స్థిరపర్చడం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే డీజిల్ అందుబాటులో ఉంచడం అవసరమని సూచించారు. రైతులకు ప్రత్యేక కోటా కేటాయించి ఇంధన పంపిణీ పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రదర్శన విజయవంతం
పెనమలూరు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రదర్శనలో స్థానిక క్రీడాకారులు విజయవంతంగా పాల్గొని ఉత్తమ ప్రదర్శించారు. ఈ మేరకు ఆదివారం యనమలకుదురుకు చెందిన వాన్కాన్ డో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఏపీ చీఫ్ ఎస్.దుర్గారావు వివరాలు తెలుపుతూ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం వి.విఠల్ ఆధ్వర్యంలో గిన్నీస్ వరల్డ్ రికార్డుకు 20 నిముషాల పాటు కాటా నిరంతర ప్రదర్శన 10 రాష్ట్రాల నుంచి రెండు వేల మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. యనమలకుదురు, విజయవాడ ప్రాంతాల నుంచి తమ విద్యార్థులు 11 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని సత్తాచాటారని చెప్పారు. పాల్గొన్న విద్యార్థుల్లో ఉప్పల మురళీమోహిత్, ఆరేపల్లి షణ్ముఖశ్రీహర్ష, ఆరేపల్లి దోలవెంకటశుభాష్, కొరె మోక్షిత, బెజవాడ కార్తీక్సాయి, బెజవాడ లక్ష్మణనాగశ్రీనివాస్, నైనా, దేవరకొండ హేమశ్రీ, వంశీకృష్ణ, ప్రభుకిరణ్రెడ్డి, మోహనప్రగ్న పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపారన్నారు. పి.జానకిరాములు, ఉప్పల కోటేశ్వరరావు విద్యార్థులకు స్ఫూర్తినింపారని చెప్పారు. గిన్నిస్బుక్ ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని, త్వరలో వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుతాయన్నారు. -
ఇంధన కొరతతో అల్లాడుతున్న రాష్ట్రం
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద ప్రజలు క్యూ కుడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అగచాట్ల మాటున పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిపై చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్కు స్పృహ లేకుండా పోతోందన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తరువాత కొరత మరింత ఎక్కువైందన్నారు. ఈరోజు కూరగాయలు, పండ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి నెలకొందని, కాంక్రీట్ మిక్చర్లు ఆడటం లేదని, కూలీలకు పని దొరకటం లేదని, ఇదంతా బ్లాక్ మార్కెటర్లకు పండుగలా మారిందని పేర్కొన్నారు. అనుభవం ఏమైంది? రాష్ట్రం కోసం కేంద్రంలో నడుస్తున్న మోదీ ప్రభుత్వంలో కూటమి ఎంపీలతో మీ పలుకుబడిని వాడలేరా అని చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు తన పలుకుబడిని హద్దులు లేని అప్పులు తీసుకురావడానికి, వైఎస్సార్ సీపీ నాయకుల మీద ఈడీ సోదాలు, సీబీఐ కేసులు పెట్టడానికే వాడుతున్నారని విమర్శించారు. ఇలా అని సాక్షాత్తూ చంద్రబాబు తమ్ముడే చెబుతున్నారన్నారు. 2047వ సంవత్సరానికి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని చెబుతున్న చంద్రబాబు ఈవాళ ప్రజలు పడుతున్న కష్టాలను చూడరా అని నిలదీశారు. ముగ్గురూ ముగ్గురే.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పది రోజులుగా నారా లోకేష్ కనిపించటం లేదని పేర్ని నాని విమర్శించారు. పవన్కల్యాణ్కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. తక్షణం చంద్రబాబు మేల్కొని సొరకాయ కోతలు ఆపి మోదీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. సింగపూర్కు వెళ్లిన మంత్రులకు ప్రశ్న.. నీతి, నిజాయితీలకు, అవినీతి రహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరుగా సింగపూర్ను భావిస్తుంటారని, చంద్రబాబు సావాసం కోసం సింగ పూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడకు వచ్చి ఆయన దగ్గర అవినీతిని నేర్చుకుని అక్కడ అవినీతి పాలయ్యారని పేర్ని నాని గుర్తుచేశారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్కు వెళ్లటం వల్ల ఆ దేశస్తులు చెడిపోకుండా ఉంటే చాలన్నారు. వ్యవసాయం లేని చోటికి వ్యవసాయ మంత్రి వెళతారని, పరిశ్రమలు ఎలా పెట్టుకోవాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్లారని ఎద్దేవా చేశారు. మునిసిపాలిటీలు, ఆర్అండ్బీలకు రోడ్లు వేయడానికి నిధులు ఇవ్వరు కాని సింగపూర్కు వెళ్లి వీరు ఏం నేర్చుకుంటారో చూడాలన్నారు. ఐదారు కోట్ల రూపాయలు వారి పర్యటనకు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, లంకే వెంకటేశ్వరరావు, బందెల థామస్నోబుల్, తిరుమలశెట్టి ప్రసాద్, చలమలశెట్టి గాంధీ, ఐనం తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
బంకులు బంద్!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత విజయవాడ భవానీపురంలో తాత్కాలికంగా మూసివేసిన పెట్రోల్బంక్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారు లు బంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఏ బంక్ వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వాహనదారులకు సమాధానం చెప్పలేక కొందరు ఏకంగా బంకులు మూసివేశారు. బంకుల వద్ద అడ్డంగా తాళ్లు, బారికేడ్లు, ఆయిల్ డబ్బాలు పెట్టేశారు. కొన్ని బంకుల్లో యాజమాన్యం సిబ్బందిని కూడా పంపించి వేసింది. ఇంధనం స్టాక్ ఉన్న ఒకటి అర బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, రవాణా వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం వేచి ఉండటంతో ర్యాలీని తలపిస్తోంది. వాహనదారులు గంటల కొద్దీ క్యూలైన్లో పాట్లు పడుతున్నారు. మండుటెండలో ద్విచక్ర వాహనాలపై భార్య, చంటి పిల్లలతో వచ్చి నానా అవస్థలు పడ్డారు. ఇదీ పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 186, కృష్ణా జిల్లాలో 145 మొత్తం 321 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. వీటిల్లో 321 బంకు ల్లో డీజిల్ నిల్వలు లేవు. కేవలం 20 శాతం బంకుల్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. ఆదివారం ఉదయం నుంచి 80శాతం బంకులు మూసివేశారు. ఫలితంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల్లో పెట్రోల్ రూ. 100, రూ.200 మించి పోయడం లేదు. కార్లు, ఇతర వాహనాలకు పరిమితంగా పెట్రోల్ నింపుతున్నారు. కొన్ని బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నో స్టాక్.. నో స్టాక్.. బందరు రోడ్డులోని ఓ బంకు వద్ద భారీగా కార్లు నిలిచిపోయాయి. స్టేడియం వద్ద నుంచి బెంజ్ సర్కిల్ వర కు రోడ్డు పొడవునా కార్లు క్యూ కట్టాయి. విజయవాడ గాంధీనగర్లో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న బంక్ మూసివేశారు. అలాగే గొల్లపూడిలోని యూనియన్, రాఘ వయ్య పార్క్ సమీపంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న బంక్ సైతం మూతపడ్డాయి. ఆటోనగర్ ప్రాంతంలోని బంకులు మూసివేయడంతో వాహ నాలు నిలిచిపోయాయి. ఐఓసీఎల్, హెచ్పీ, బీపీ, నయారా, జియో బంకులు పూర్తిగా మూతవేశారు. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద రవాణా వాహనాలు నిలిపివేశారు. ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో ఏ బంకులోనూ డీజిల్ అందుబాటులో లేదు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే ట్రాక్టర్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ధాన్యం గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రవాణా నిలిచిపోయింది. కానరాని డెలివరీ బాయ్స్ నగరంలో డీజిల్ ఆటోలు సగానికిపైగా రోడ్ల మీదకు రాలేదు. కొన్ని బంకుల్లో ఆదివారం ఉదయం నామ మాత్రంగా డీజిల్ విక్రయాలు జరిగాయి. వాటిల్లో ఆటోలు భారీగా క్యూ కట్టాయి. కొన్ని ఆటోలకు మాత్రమే డీజిల్ అందడంతో మిగిలిన వారు వెనుదిరిగారు. ఎక్కడైనా వాహనాలు నిలిచిపోతే బాటిల్లో పెట్రోల్ తెచ్చుకునేందుకు అవకాశం లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకుపోయే స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ వంటి పలు సంస్థల డెలివరీ బాయ్స్ పెట్రోల్ కొరత కారణంగా పెద్దగా కనిపించలేదు. ఇంధన కొరత కారణంగా లాక్ డౌన్ నాటి పరిస్థితులు చూస్తున్నామని ట్రావెల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంధనం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వాహనదారులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేనిది ఒక్కసారి బంకులన్నీ నో స్టాక్ బోర్డులు పెట్టడం వెనుక కృత్రిమ కొరతేకారణమంటున్నారు. బంకులు మూసివేసినా ఏ ఒక్క అధికారి అటువైపు వచ్చి పరిస్థితిపై దృష్టి పెట్టలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ డీలర్లు బంకుల యాజమాన్యానికి అప్పు ఇవ్వడం లేదని, క్యాష్ అండ్ క్యారీ అనడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు. -
స్వీయ గణనతో కచ్చితమైన సమాచారం
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)తో కచ్చితమైన డేటాతో పాటు అత్యంత పారదర్శకత, సమయం ఆదాకు వీలుంటుందని, ప్రతిఒక్కరూ స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం వద్ద జేసీ ఇలక్కియ 5కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రగతికి కీలమైన ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు దోహదం చేసే జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీవోవి.ఇన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చన్నారు. విశ్వసనీయ డేటా.. సెన్సస్ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం వల్ల విశ్వసనీయ డేటాతో పాటు విస్తృత ప్రజా భాగస్వామ్యానికి, సమయం ఆదాకు దోహదం చేస్తుందన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సెన్సస్ ఇన్చార్జ్ రమణ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఎ.రవీంద్ర, ఆర్డీవో టీవీ సతీష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, డీ ఎస్డీవో కోటేశ్వరరావు, మెజిస్టీరియల్ సెక్షన్ సూప రింటెండెంట్ ఎం.వెంకటరామయ్య పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్కానిస్టేబుల్ దుర్మరణం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హెడ్కానిస్టేబుల్ కొండపల్లి శ్రామికనగర్ వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన అతను మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు కొండపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి ప్రభుకుమార్(56) వీరులపాడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొండపల్లి కొత్తగేటు సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోడ్డుపై పడిన ప్రభుకుమార్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. 108 వాహనంలో విజయవాడ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. మనసు ప్రశాంతతకు యోగా దోహదం భవానీపురం(విజయవాడపశ్చిమ): తన జీవితాన్ని యోగా మార్చిందని, నిత్యం యోగా చేసేవారికి సాధారణ రోగాలు దరి చేరకపోవడంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ప్రముఖ యోగాచార్యులు, శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం(మంగళగిరి) వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం విజయవాడ నగర శాఖల ఆధ్వర్యంలో వెయ్యి యోగా శిక్షణా శిబిరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భవానీపురం –2 శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విరాట్ యోగా – 1000’ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత డాక్ట్ వేంకటేశ్వర యోగి జీవిత విశేషాలతో రూపొందించిన ‘అధునాతన యోగి – ఆదర్శ పథగామి’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. వెయ్యి శిక్షణ శిబిరాల్లో ఉచితంగా యోగా నేర్పిన గురువులు, సహకరించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భవానీపురం – 2 శాఖ అధ్యక్షుడు బొమ్మిశెట్టి తిరుమల రమేష్ మాట్లాడుతూ గురువులను సత్కరించి గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవానీపురం –2 శాఖ ఉపాధ్యక్షులు కొయ్య సూరిబాబు, ఊటుకూరి శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి తుమ్మలపెంట నాగేశ్వరరావు, కోశాధికారి కొత్తమాసు రత్నాకరరావు, మంజుల యోగి మాతాజి, వేమన యోగి గురూజీలు నిర్వహించారు. -
చేపల చెరువులో నగదు వ్యవహారం కలకలం
ఇబ్రహీంపట్నం: ఈలప్రోలు చేపల చెరువుల వివాదంలో టీడీపీ నాయకులు అరాచకాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. గుంటుపల్లికి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు కంచికచర్లకు చెందిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రామకృష్ణను రంగంలోకి దించి మత్స్యశాఖ అధికారులకు మామూళ్లు ఇవ్వాలని చెరువు లీజుదారుడు బలే లక్ష్మణరావుతో రూ.1.10 లక్షలు ఫోన్పే చేయించారు. ఆ తర్వాత గుంటుపల్లి టీడీపీ నాయకులు ఆ నగదును తమకు ఫోన్పే చేయించుకున్నారు. మీడియాను మేనేజ్ చేయాలని ఓ పీడీఎఫ్ పేపర్ రిపోర్టర్ను లీజుదారుల వద్దకు తీసుకెళ్లి ఇతను మండలానికి పెద్ద రిపోర్టర్ అని పరిచయం చేసి రెండు సార్లుగా రూ.40 వేలు ఫోన్పే చేయించుకున్నారు. తిరిగి ఆ నగదు రిపోర్టర్కు కొంత ఇచ్చి మిగిలింది ప్రజాప్రతినిధి అనుచరులు నొక్కేశారు. విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు పెండింగ్ ఉందని అందుకే చేపల వాహనం అడ్డుకున్నామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొల్లేరు వాసులు విద్యుత్ శాఖకు కట్టిన డిపాజిట్ రూ.2.60 లక్షలు ఉందని, మీటర్ రద్దు చేసుకుంటే ఆ నగదు బకాయి కింద జమ చేసుకుంటారని చెబుతున్నారు. చేపల చెరువు వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎండలో బంకుల చుట్టూ..
డీ మార్ట్కు వెళ్లి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చే క్రమంలో నా బైక్లో పెట్రోల్ కొట్టిద్దామని బంకుకు వెళ్లాను. పెట్రోల్ లేదన్నారు. దీంతో మండే ఎండలలో ఆరు పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగాను. ఎక్కడా పెట్రోల్ లేదని చెప్పటంతో ఏంచేయాలో పాలుపోలేదు. బైక్లో ఉన్న పెట్రోల్, బంకుల చుట్టూ తిరగటానికే ఖర్చయ్యిపోయింది. అదృష్టవశావత్తూ ఒక బంకులో గంటసేపు క్యూలైన్లో ఉంటే రెండు వందల రూపాయల పెట్రోల్ దొరికింది. బతుకుజీవుడా అంటూ ఇంటికి చేరుకున్నా. – కన్నయ్య శ్రీనివాస్, గుణదల -
కార్డియాక్ ఎనస్థీషియాపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్డియాక్ ఎనస్థీషియాలో అధునాతన పద్ధతులపై నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆదివారం సదస్సు జరిగింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సహకారంతో సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆశ్రమ్, పిన్నమనేని సిద్ధార్థ, నిమ్రా, ఎన్ఆర్ఐ, ప్రభుత్వ సిద్ధార్థ కళాశాలలకు చెందిన 250 మంది ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ఈ సదస్సును వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయుష్ ఆస్పత్రి చీఫ్ కార్డియాక్ ఎనస్థీషియన్ డాక్టర్ వై. రమేష్ బాబు గతంలో ఉన్న విధానాలు, ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్డ్ సిస్టమ్స్పై యువ వైద్యులకు అవగాహన కలిగించారు. సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సొంగా వినయ్కుమార్ అధ్యక్షత వహించగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అకడమిక్ సెనేట్, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భీమేశ్వర్, సెయింట్ ఆన్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. కిరణ్కుమార్ తదితరులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా డాక్టర్ సి. శ్యామ్కుమార్ వ్యవహరించారు. సుబ్బారాయుడి ఆలయంలో సినీనటుడు పూజలు మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు బాబీసింహా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్ధు సతీష్ శర్మ, విరూప్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
అమ్మ సన్నిధిలో విద్యార్థుల సెల్ఫోన్లు 12 చోరీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసిన 12 మంది విద్యార్థులు తమ సెల్ఫోన్లను మోపెడ్ సీట్ కింద భద్రపరుచుకోగా, వాటిని చోరీ చేసిన ఘటన ఆదివారం జరిగింది. అమరావతిలోకి ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులు అమ్మవారినిని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తమ బైక్లను కనకదుర్గానగర్లో నూతనంగా నిర్మిస్తున్న క్యూకాంప్లెక్స్ కింద పెట్టి తమ సెల్ఫోన్లను ఒక మోపెడ్ సీట్ కింద బాక్స్లో భద్రపరుచుకున్నారు. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చే సరికి మోపెడ్ సీట్ తెరిచి ఉండటంతో కంగారుపడి చూడగా లోపల బ్యాగ్ కింద పెట్టిన 12 సెల్ఫోన్లు మాయమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది పోలీస్ అవుట్పోస్ట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ కెమేరాలను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. -
పాలకుల నిర్లక్ష్యం.. దళారులదే రాజ్యం
ఉయ్యూరు/కంకిపాడు/తెనాలి: పాలకుల తప్పుడు విధానాలతో రైతులు, కౌలురైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ థావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో రెండో రోజైన ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. అశోక్ థావలే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు.దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయలేకపోవడంతో పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ రంగాలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు, కౌలురైతులు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.బలవంతపు భూ సేకరణను అడ్డుకుంటాంరాజధాని పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరానికి మించి ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని ఆలిండియా కిసాన్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ థావలే స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల అవగాహన సదస్సు ఆదివారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం గుడివాడలో నిర్వహించారు. తొలుత భూ సేకరణకు మార్కింగ్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.అశోక్ థావలే మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో కేవలం 70 మీటర్ల వెడల్పు అవసరమని చూపిన ప్రభుత్వం, భూసేకరణకు వచ్చేసరికి 250 మీటర్ల వెడల్పుకు మార్కింగ్ చేసినట్లు చెప్పారు. ఈ పరిణామాలతో పూర్తిగా రైతులు నష్టపోతారన్నారు. ప్రభుత్వంపై రైతులంతా సమష్టిగా పోరాడితే ఆలిండియా కిసాన్ మహాసభతో పాటు రైతు సంఘం అండగా నిలుస్తుందని వెల్లడించారు. సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె.అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో తీవ్రంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. అంగీకరించిన చంద్రబాబు
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు. ఏపీలో పెట్రో కొరతకు సంబంధించి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయన సమీక్షలో అధికారులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కంపెనీలు రిటైల్ ఔట్లెట్లకు ఇంతకు ముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీని ఫలితంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత కొనసాగుతోందన్నారు. అధికారులతో చెప్పిన దానితో ఏకీభవించిన చంద్రబాబు.. ఈ ఇంధన సంక్షోభాన్ని తొందరగా నిలువరించాలని చంద్రబాబు సూచించారు. కాగా, మూడు రోజుల నుంచి ఏపీలో పెట్రో కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నయార, రిలయన్స్, జియో బంకులకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శనివారం పెట్రోల్, డీజిల్ డిమాండ్ 34 శాతం పెరగగా, ఆదివారం 22 శాతం పెరిగింది.విజయవాడ నుండి తిరుపతి వరకు హైవేలలో అనేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.సమస్య ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో 10 శాతం పెట్రోల్ బంక్లు బంద్!
సాక్షి, విజయవాడ: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10 శాతం పెట్రోల్ బంక్లు మూతపడినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, మూడు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు.ఏపీలో దాదాపు 50 శాతం వరకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. మూడు రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి.. గంటల సమయంలో క్యూలైన్లోనే ఉండాల్సి వస్తోంది. కాగా, అధికారికంగా 10 శాతం పెట్రోల్ బంక్లు మూతపడినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.పెట్రోల్ , డీజిల్ కొరత తో అల్లాడి పోతున్న వాహనదారులు పెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులు పెట్రోలు దొరకదు అనే భయంతో అదుపు తప్పుతున్న వాహనాదారులు, గంటల కొద్దీ గా పెట్రోల్ కోసం ఖాళీ బాటిల్స్, వాహనాలతో బారులు తీరన వాహనదారులు.… https://t.co/EZRqDjo0A0 pic.twitter.com/vNGXpHVIdz— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) April 25, 2026విజయవాడ..తీవ్రంగా డీజిల్, పెట్రోల్ కొరత.రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులువిజయవాడ నగర పరిధిలో ఇప్పటికే మూతబడ్డ పలు బంక్లుబందరు రోడ్డులోని సిటీ పోలీస్ సర్వీస్ బంక్ వద్ద భారీగా క్యూకట్టిన వాహనదారులుచుట్టుపక్కల ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో సిటీ పోలీస్ సర్వీస్ బంక్ వద్ద అర కిలోమీటర్ మేర క్యూకార్ల కోసం ప్రత్యేకంగా ఒక క్యూలైన్ ఏర్పాటు చేసిన పోలీసులురేషన్ పద్ధతిలో బైక్కు 300 పెట్రోల్, కారుకు 1000 రూపాయల డీజిల్ ఫిల్ చేస్తున్న వైనండీజిల్ కోసం గంటల తరబడి బంక్ల వద్ద నిరీక్షిస్తున్న వాహనదారులుకాకినాడ జిల్లామూడవ రోజు కూడా బంకుల వద్ద డీజిల్ కోసం బారులు తీరిన వాహనాలుకార్లకు రూ.1,000, ఆటోలకు 3 లీటర్ల చొప్పున డీజిల్ కొడుతున్న బంకులుడీజిల్ కోసం గంటల తరబడి నిరీక్షణడీజిల్ సరఫరా లేక కొన్ని చోట్ల దర్శనమిస్తున్న సో స్టాక్ బోర్టులు.తూర్పుగోదావరి జిల్లా..అనపర్తి నియోజకవర్గంలో కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత.స్టాక్ లేదని బంకుల్లో బోర్డులు పెట్టిన యాజమాన్యం.వరి చేలు కోతలు సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు.కృష్ణా జిల్లా..మచిలీపట్నంలో పెట్రోల్ బంక్ల వద్ద బారులు తీరిన వాహనదారులుడీజిల్ కొరతతో మూతబడిన పలు బంక్లు పెట్రోల్, డీజిల్ కోసం బంక్ వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్న వినియోగదారులుతిరుపతితిరుపతి జిల్లాలో పెట్రోల్ బంకులు వద్ద క్యూ కడుతున్న వాహనదారులుతిరుపతి నగరంలో పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరిన వాహనాలు. తిరుమలలో భక్తులకు తప్పని తిప్పలునిన్నటి నుండి పెట్రోల్, డీజల్ తిరుమలలో ఖాళీ.నో స్టాక్ బోర్డు పెట్టిన పెట్రోల్ బంకులుఇబ్బందుల కారణంగా టీటీడీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్న భక్తులు.ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత- పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు! pic.twitter.com/SgNOOmlJnG— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) April 25, 2026 -
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
మెప్మా ఎన్నికలో హైడ్రామా !
తిరువూరు: తిరువూరు మున్సిపాలిటీలోని మెప్మా టీఎల్ఎఫ్ కార్యవర్గ ఎన్నికలో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య శనివారం హైడ్రామా నడిచింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించేందుకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం పట్టణంలోని 33 మంది సభ్యుల్లో 29 మంది విచ్చేశారు. ఎంపీ వర్గానికి చెందిన కొలికపోగు రామకోటమ్మను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ 26 మంది ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు డెక్కా నవ్యను ఆ పదవికి ప్రతిపాదించారు. ఎంపీ వర్గం మెప్మా కార్యవర్గ ఎన్నికను ఏకపక్షంగా నిర్వహించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆందోళనకు ఉపక్రమించారు. ఎంపీ అనుచరులు ఆయనకు పోటీగా ఆందోళన చేపట్టారు. రామకోటమ్మను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని ఎంపీ వర్గం నినాదాలు చేసింది. తాత్కాలికంగా ఎన్నిక వాయిదా వేయాలని మున్సిపల్ కమిషనర్కు మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు సమాచారమిచ్చినా అధికారులు లేకుండానే మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక చెల్ల దని, మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
డీజిల్కు కటకట..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు పెట్రోలు బంకుల్లో శనివారం అకస్మాత్తుగా డీజిల్, పెట్రోలు కొరత ఏర్పడింది. దీంతో చాలా బంకుల వద్ద సుమారు అర కిలోమేటరు మేర వాహనాలు బారులు తీరాయి. కొన్ని బంకుల్లో ఏకంగా నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. చల్లపల్లిలో ఓ బంకులో ఐదు రోజుల డీజిల్ నిల్వలు కేవలం మూడు గంటల వ్యవధిలో అయిపోయాయని ఆ బంకు యజమాని చెప్పారు. విజయవాడ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, రామవరప్పాడు రింగ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. – చల్లపల్లి/ సాక్షి, విజయవాడ ఫొటోగ్రాఫర్ -
పచ్చనేతల దందా
కొల్లేటి వాసులపై కొల్లేరులో పరిచయమైన గుంటుపల్లికి చెందిన వ్యక్తుల ద్వారా ఈలప్రోలు చెరువుల లీజుకు తీసుకున్నాం. లీజు కాగితాలు అన్నీ వారు తయారు చేయించారు. లీజులో 25 శాతం వాటా వారే రాయించుకున్నారు. చివరకు చేపల చెరువులు కూడా మా నుంచి లాగేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సమస్య పరిష్కరించలేదు. స్థానికుల వైపే మొగ్గు చూపారు. మాకు న్యాయం చేసేవారు లేరు. పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా దాడిచేశారు. –బలే లక్ష్మణరావు, చేపల చెరువు లీజుదారుడు కొల్లేరు వాసులకు చేపలు, రొయ్యల సాగు తప్ప వేరే కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు అస్సలు తెలియవు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నేతలు మా ప్రాంతంలో సాగు చేసుకుంటే తాము అండగా ఉంటామని మాయమాటలు చెప్పి తీసుకువచ్చి ఇప్పుడు వారిని బెదిరిస్తూ దందాకు దిగుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి వారు సాగు చేసుకుంటుంటే పైసా కూడా పెట్టకుండా 25 శాతం వాటా తీసుకుంటున్నారు. అదీ కాక ప్రజాప్రతినిధికి ఇవ్వాలంటూ ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున గత ఎనిమిదేళ్లుగా రూ.80 లక్షలు కాజేశారు. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు ఎనిమిదేళ్ల లీజు కాలంలో నాలుగేళ్ల పట్టుబడి పూర్తిగా వారికిచ్చేయాలంటూ బెదిరిస్తున్నారు. ఇదేమి దౌర్జన్యమంటూ ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఈ విషయం ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం..ఆ కొల్లేరు వాసులు లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువుల కోసం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు ప్రాంతంలో అనేక చేపల చెరువులు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన బలే లక్ష్మణరావు తన బంధువులతో కలసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామలోని 40 ఎకరాల సొసైటీ చెరువును ఏడాదికి రూ.10 లక్షలు లీజు చెల్లించి గడిచిన ఎనిమిదేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. దీంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన మరో 10 ఎకరాల్లో సొంతంగా చెరువు తవ్వించి ఏడాదికి రూ.10 లక్షల చొప్పున లీజు చెల్లిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధి అనుచరులుగా చెలామణి అవుతున్న గుంటుపల్లికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలు బలే లక్ష్మణరావును బెదిరించి చెరువులు స్వాధీనం చేసుకునే కుట్రలకు తెరతీశారు. చేపలు పట్టకుండా అడ్డుకుంటున్నారు. పట్టిన చేపలు అమ్మకానికి వెళ్లకుండా అడ్డు తగులుతూ అరాచకం సృష్టిస్తున్నారు. బెదిరింపులతో అగ్రిమెంట్... బలే లక్ష్మణరావు ఎనిమిదేళ్ల క్రితం ఈలప్రోలు గ్రామంలో ఓ సొసైటీకి చెందిన చేపల చెరువులు లీజుకు తీసుకునే సమయంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతల సహాయం కోరాడు. స్థానికులుగా తాముంటే మీ వ్యాపారానికి ఎటువంటి ఢోకా ఉండదని వారు నమ్మించారు. అవసరమైతే ప్రజాప్రతినిధి అండదండలు మీకు ఉండేలా చూస్తామని నమ్మబలికారు. అగ్రిమెంట్ తయారు చేయిస్తామని చెప్పి 25 శాతం వాటా వారికి కూడా ఉండేలా బెదిరించి రాయించుకున్నారు. అంతేకాకుండా ఏడాదికి చేపల చెరువుల లీజు రూ.80 లక్షలతో పాటు ప్రజాప్రతినిధికి ఇవ్వాలని గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి రూ.10లక్షల చొప్పున రూ.80 లక్షలు మొత్తం రూ.1.60 కోట్లు వసూలు చేశారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది. రెండేళ్ల క్రితం తీసుకున్న 10 ఎకరాలకు సంబంధించి 25 శాతం వాటాతో సంతృప్తి పడని పచ్చ నేతలు నాలుగేళ్లు పట్టుబడి మొత్తం తమకు వదిలేయాలంటూ లక్ష్మణరావుపై వత్తిడి చేయడం ప్రారంభించారు. లక్షలకు లక్షలు పెట్టుబడి తాము పెట్టి పట్టుబడి మీకు ఎలా వదిలేస్తామని లక్ష్మణరావు ఎదురుతిరిగాడు. దీంతో ఈ వివాదం సదరు ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. ఈ సందర్భంగా రూ.80 లక్షల నగదు విషయం కొల్లేరు వాసులు బయట పెట్టడంతో ఇరకాటంలో పడిన ప్రజాప్రతినిధి తన పేరుతో ఏడాదికి రూ.10లక్షలు వసూలు చేయడం ఏమిటని తన అనుచరులను సున్నితంగా మందలించారు. అయితే చేపల చెరువు పంచాయితీని ఎటూ తేల్చకుండా వదిలేయడంతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్నారు. పట్టిన చేపలను సైతం అమ్మకానికి తరలించకుండా అడ్డుకున్నారు. 20 రోజుల క్రితం లీజు చెల్లింపు విషయంలో మాటామాటా పెరిగి కొల్లేరు వాసులపై దాడికి తెగబడ్డారు. దాడి ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 9 మందిపై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ... చేపల చెరువుల్లో జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధి వద్ద చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయిందని కొల్లేరు వాసులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధి వివాదాన్ని ఎటూ తేలనివ్వడంలేదని, చెరువు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తామే ఏర్పాటు చేశామని, జనరేటర్, కంటైనర్, ఇతరత్రా సుమారు రూ.75 లక్షల సామగ్రి ఉందన్నారు. సమస్య పరిష్కరిస్తే తమ సామగ్రి తాము తరలించుకు పోతామన్నారు. తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో టీడీపీ నేతల వివాదంలో చిక్కుకున్న చేపల చెరువు -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కోనేరుసెంటర్: కృష్ణా వర్సిటీని ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా మారుస్తామని వీసీ కె.రాంజీ తెలిపారు. శనివారం పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ సూచించారు. ఉయ్యూరులో ఏపీ కౌలు రైతుల సంఘం మహాసభలో పాల్గొన్నారు. మచిలీపట్నంటౌన్: జనగణన– 2027కు సంబం ధించి శనివారం మచిలీపట్నంలో 5కే రన్ను నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. 7 -
వెనుక నుంచి ఆటోను ఢీకొన్న కారు
కంచికచర్ల: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఆటోడ్రైవర్తో పాటు ప్రయాణికురాలు మృతి చెందిన ఘటన కంచికచర్లలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల మండలం కీసరకు చెందిన షేక్ బాబు(55) ఆటోడ్రైవర్ కిరాయి కోసం కంచికచర్ల వెళ్లాడు. అనంతరం కంచికచర్ల నుంచి నందిగామ కిరాయికి బయలుదేరాడు. కంచికచర్లలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కృష్ణమ్మ స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకునేందుకు కీసర ఆటో ఎక్కింది. కంచికచర్ల పేరకలపాడుపాడు పెట్రోలు బంక్ సమీపంలోకి రాగానే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కారు ముందు వెళుతున్న ఆటోను బలంగా ఢీకొంది. ఘటనలో ఆటోడ్రైవర్ బాబు అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో కందకంలోకి పల్టీ కొట్టి నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. ఆటోడ్రైవర్ బాబుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఆటోడ్రైవర్తో పాటు మహిళ మృతి -
సాంకేతికతతో సాగు చేయాలి
వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ చిలకలపూడి(మచిలీ పట్నం): వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్ర పరికరాలను ఉపయోగించి సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. ఉయ్యూరు వీరమ్మతల్లి దేవాలయ ఆవరణలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర 4వ మహాసభలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఎగ్జిబిషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలను శోధించాలన్నారు. అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వాడాలని, అనవసరంగా మందులు విచ్చలవిడిగా వాడకూడదని సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక రంగాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఒక యాప్ను తీసుకొచ్చారని, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా యాప్ను రూపొందించారని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కౌలు రైతు లేనిదే వ్యవసాయమే లేదు మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతు లేనిదే వ్యవసాయమే లేదన్నారు. వ్యవసాయానికి కౌలు రైతులే మూలమైనా అప్పుల వల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో కౌలు చట్టాలు రద్దయ్యాయని తెలియక భూ యజమానులు కౌలు రైతులకు సంతకం పెట్టడం లేదన్నారు. సంతకం పెడితే భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తరఫున ప్రకటన ఇవ్వాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు ఉపయోగించే వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, డ్రోన్లను ప్రదర్శించారు. భారత రైతాంగ ఉద్యమఘట్టాల ఫోటోలను ప్రదర్శించారు. కె. విశ్వమోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, మాగంటి హరిబాబు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె.చంద్రశేఖర్, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీ లక్ష్మణస్వామి, పి.రంగారావు, శివనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ‘మంగినపూడి’
మంత్రి రవీంద్రకోనేరుసెంటర్: మంగినపూడి బీచ్ను రాష్ట్రంలోనే ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులు రూ. 96.78 లక్షల వ్యయ అంచనాతో మచిలీపట్నం నియోజకవర్గంలోని మంగినపూడి బీచ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ పర్యాటకంతో పాటు మత విశ్వాసాలకు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండటంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా ఆధునిక మరుగుదొడ్లు, కాఫీ షాప్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏపీఎండీసీ ద్వారా సీఎస్ఆర్ నిధుల కింద ఉపయోగిస్తారన్నారు. డచ్, బ్రిటీష్, పోర్చుగీస్ కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో విదేశీయులు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పరిశ్రమ ల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ (డీసీజీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి సంస్థ పటిష్ట భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరి అన్నారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నెల 30న జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్మినల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీల్లో గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదాలు వంటివి జరక్కుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నివేదికలు పంపాలన్నారు. అత్యవసర సమయాల్లో స్పందించే విధానంపై కార్మికులకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు. సమావేశంలో కర్మాగారాల డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, వివిధ పారిశ్రామిక సంస్థలు, కర్మాగారాల ప్రతినిధులు, భద్రతాధికారులు పాల్గొన్నారు. కంటి ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని కంటి వైద్య ఆసుపత్రులు, క్లినిక్లు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంటి వైద్యులు, ఎన్జీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్లు, ఆసుపత్రులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా లభించే ప్రయోజనాలను వివరించారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి.భానుమూర్తి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కృష్ణాజిల్లా ఐబాల్ సేకరణలో 510 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. పాఠశాల విద్యార్థుల కంటి పరీక్షల్లో రెండవ స్థానం, శుక్లాల శస్త్ర చికిత్సల్లో రాష్ట్రంలో టాప్ టెన్లో ఎనిమిదో స్థానం సాధించినట్లు తెలిపారు. విద్య, పరిశోధనా రంగాల్లో మార్పులకు శ్రీకారం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏడాది కాలంలో విద్య. పరిశోధన, పరిపాలన రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ అన్నారు. ఆయన వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో పరిపాలనా పరంగా 27, 28వ స్నాతకోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్తో ప్రత్యేకంగా సమావేశమై అకడమిక్ ప్రమాణాల పెంపుపై చర్చించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీ పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ నిపుణులతో వెబెక్స్ సమావేశాలను నిర్వహించామన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని రీసెర్చ్డే నిర్వహించి పరిశోధనలకు పెద్దపీట వేశామన్నారు. వైద్య విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణపై ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఐ.రమేష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్–2026
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ జిల్లాలో శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలో మొత్తం 25 పరీక్ష కేంద్రాల్లో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. జిల్లాలో మొత్తం 7567 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి చెప్పారు. పాలిసెట్ పరీక్ష ఫలితాలతో పాటుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా త్వరలోనే ప్రకటిస్తారని ఆయన తెలిపారు. -
శృతిలయ సమన్వితం... త్యాగరాజ సంకీర్తనం
విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురువు త్యాగరాజ స్వామి 259 వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలోని భారతీ తీర్థ శ్రవణ సదనంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు శృతి,లయ సమన్వితంగా సాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాల, యువ, విద్వాంసులు త్యాగరాజ స్వామికి కృతి సమర్పణ చేస్తున్నారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సురవరపు ఉమ, సురవరపు విద్యలను త్యాగరాజ స్వామి కృతులను మధురంగా గానం చేశారు. వీరుభట్ల సీతారమణి, చింతలపల్లి సువర్ణలక్ష్మి, కె.శివానీ, బీహెచ్ శైలజ, కాశీభట్ల ఉమ, లంక తేజస్వి, శింగరాజు కల్యాణి, సీనియర్ విద్వాంసులు టీకేవీ రామానుజా చార్యులు, అంజనా సుధాకర్, పోపూరి రామచరణ్ త్యాగరాజ స్వామి కృతులను గానం చేశారు. చలమేలరా, శోభిల్లు సప్తస్వర, మాకేలరా, దొరుకునా ఇటువంటి సేవ తదితర కీర్తనలు చోటు చేసుకున్నాయి. గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ స్వామి గురుపరంపర సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచంచారు. సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, పి.గాయత్రి గౌరీనాఽథ్, హరిప్రసాద్ పాల్గొన్నారు. కస్టడీకి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని విచారణ నిమిత్తం ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఆమెను విజయవాడ జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం..మొక్కజొన్న రైతులకు శాపం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పామర్రు: ఏపీలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నారని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన దళారుల చేతిలో మోస పోతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా రైతులు రూ.1400 నుంచి 1600 మధ్యలోనే అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ రబీలో వరి తర్వాత 12.35 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగిందన్నారు. సుమారు రూ.35 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఆ క్రమంలో రైతులు సుమారు రూ.2500 కోట్ల వరకు నష్ట పోతారని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా మూడేళ్ల కాలంలో సుమారు రూ.8లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, యూపీలలోని ప్రభుత్వాలు కనీస మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే, మన రాష్ట్రంలో ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, పోటీని పెంచి దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు రద్దీ కనిపించగా, సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవార్చన వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ సమయాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసిన దేవస్థానం శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అంతరాలయ దర్శనాన్ని తిరిగి ప్రారంభించారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టేలా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసింది. భక్తులకు మంచినీటి సదుపాయంతో పాటు ఘాట్రోడ్డు, క్యూలైన్లు, లక్ష్మీ గణపతి విగ్రహం వంటి కీలక ప్రాంతాల్లో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు సేవలో పాల్గొన్నారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దర్బారు సేవ, పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకం
మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి(మచిలీపట్నం): పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాలా సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జెడ్పీ కన్వెన్షన్ హాలులో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పంచాయతీల్లో చక్కటి ఫలితాలు సాధించిన వారికి అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గ్రామ స్వరాజ్యం అంటే పారిశుద్ధ్యం, మంచినీళ్లు వంటి మౌలిక వసతులు, కల్పించడమే అన్నారు. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు.. ఇన్చార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కన్న కలలు గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలన్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖలో విశేష ప్రతిభ చూపిన ఉద్యోగులకు మంత్రి, ఇన్చార్జ్ కలెక్టర్ సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. జెడ్పీ సీఈవో, ఇన్చార్జ్ డీపీవో డాక్టర్ జె. అరుణ, డీఎల్పీవోలు రజావుల్లా, సంపత్ కుమారి, ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
మలేరియాను సమూలంగా నిర్మూలిద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మలేరియాను సమూలంగా నిర్మూలించి, మలేరియా రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ జిల్లాలో మలేరియాపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతిదేవి, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవీనాయుడు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పటమట(విజయవాడతూర్పు): అమృత్ 2.0 పనులను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డెప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్రిండికి పచువా శుక్రవారం పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని కనకదుర్గా నగర్లో నిర్మాణంలో ఉన్న ఈఎస్ఎల్ఆర్ను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఈ సత్యకుమారి, ఏపీయూ ఎఫ్ఐడీసీ ఎస్ఈ ఎన్వీ రావు, పీడీఎంసీటీం లీడర్ టి. ఆంజనేయులు, వీఎంసీ సర్కిల్–3 ఈఈ జి. సామ్రాజ్యం పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలపై యువత మక్కువ చూపడం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందవచ్చని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి (అండర్–19) రవికాంత అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం జరిగింది. అండర్–15, అండర్–19 బాయ్స్ అండ్ గరల్స్ విభాగంలో వేర్వేరుగా పోటీలను నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వైజాగ్లో మే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపికై న క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి కె.కోటేశ్వరరావు పతకాలు అందజేసి అభినందించారు. ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ వేడినీటి కాలువ వంతెనపై వెళ్తున్న కారులో అనూహ్యంగా మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న వారు కారును నిలిపేసి కిందకు దిగారు. సమీపంలో ఉన్న వాహనదారులు ఆగి ఉన్న లారీల్లోని బక్కెట్లతో కాలువలో నీటిని తీసుకొచ్చి చెలరేగిన మంటలపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. నీరు అందుబాటులో లేని ప్రదేశంలో మంటలు చెలరేగి ఉంటే కారు మొత్తం దగ్ధమై ఉండేది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి అపాయం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కారును రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
చిన్నారుల విక్రయం కేసులో మరో ముగ్గురు అరెస్టు
పెనమలూరు: చిన్నారులను విక్రయించిన కేసులో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. పెనమలూరు పోలీస్స్టేషన్లో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పెనమలూరు పీఎస్ పరిధిలో కిడ్నాప్కు గురైన 10 నెలల చిన్నారి కేసులో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నెల 22వ తేదీన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి మరో చిన్నారిని కాపాడామని తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాగా చిన్నారులను విక్రయించిన కేసులో శుక్రవారం మరో ముగ్గురు వ్యక్తులను అనెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన గండికోట ఏసుబాబు, నిడమానూరుకు చెందిన అమరాపు శారద, విజయవాడకు చెందిన ఆముదాలపల్లి సత్యమణి ఉన్నారని తెలిపారు. యనమలకుదురుకు చెందిన దేవళ్ల భవాని, గోపయ్యల కుమారుడిని ఆముదాలపల్లి సత్యమణి గుడివాడలో ఒక కుటుంబానికి విక్రయించిందని, ఆ చిన్నారిని గుర్తించి రక్షించామని చెప్పారు. ఆపరేషన్ ట్రేస్ కిడ్నాప్ అయిన చిన్నారుల కోసం ఆపరేషన్ ట్రేస్ పేరుతో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించినట్లు విచారణలో గుర్తించామని, వారిలో ముగ్గురు చిన్నారులను కాపాడామన్నారు. ఇటీవల ఆటోనగర్లో జరిగిన కిడ్నాప్లో కూడా ఆముదాలపల్లి సత్యమణి సహకారంతో ఏసుబాబు, శారద, గంటా మేరీ, కనకం పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. సత్యమణి గతంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట, విజయవాడ సమీపంలోని నున్నలో చిన్నారులను విక్రయించిన కేసుల్లో అరెస్ట్ట్ అయిందని తెలిపారు. ఈ కేసును అన్నికోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏపీ డీజీపీ, ఏలూరు రేంజ్ ఐజీపీ ఆదేశాలతో ఆపరేషన్ ట్రేస్ పేరుతో దర్యాప్తు జరుగుతుందని అన్నారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం గన్నవరం: మండలంలోని కొండపావులూరు గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... మండలంలోని గోపవరపుగూడెం గ్రామానికి చెందిన బేతపూడి వంశీకృష్ణ(23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బైక్పై వెళ్లిన వంశీకృష్ణ తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. రాత్రి సమయంలో తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో బైపాస్ రోడ్డులోని కొండపావులూరు అండర్ పాస్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పంట బోదెలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో వంశీకృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గ్రామస్తులు ఉదయం వంశీకృష్ణ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మృతుని తల్లి ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా కుటుంబ కలహాల కారణంగా భార్య గత నెల రోజులుగా పుట్టింటి వద్ద ఉంటోంది. సింగ్నగర్లో మరో గంజాయి ముఠా అరెస్ట్ అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో గంజాయి ముఠా శుక్రవారం పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ తోటవారి వీధి చివరలో గంజాయి విక్రయిస్తూ నలుగురు వ్యక్తులు గురువారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను విచారించిన పోలీసులు సింగ్నగర్ లూనాసెంటర్, లెనిన్సెంటర్ ప్రాంతాల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా తేలింది. దీంతో పోలీసులు రామానగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద దాడులు నిర్వహించగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా వారి వద్ద 5 కేజీల గంజాయి లభ్యమైంది. గత కొంతకాలం నుంచి గంజాయి విక్రయిస్తున్నట్లుగా నిందితులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు తాడేపల్లి నాగబాబు(22), బూదాల విజయ్(30), పరిటాల జోజిబాబు అలియాస్ సిద్ధు(19), దాసరి వంశీ(24), మిండాల రత్నకుమార్ అలియాస్ బొంత(19) అనే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా వారికి రిమాండ్ విధించింది. మద్యం అక్రమ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మద్యం అక్రమ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పల రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన పక్షంలో రెండు వారాల పాటు ఇంటీరియమ్ ప్రొటెక్షన్ కొనసాగించాలని సుప్రీం కోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోగా రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని ఆర్డర్లో పేర్కొంది. -
కబళిస్తున్న
కాలకూటం! ఏ.కొండూరులో విజృంభిస్తున్న కిడ్నీ భూతంతిరువూరు: ఏకొండూరు మండలంలో కిడ్నీవ్యాధి శాశ్వత నివారణకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పేదలకు అక్కరకు రావట్లేదు. కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ఇబ్రహీంపట్నం నుంచి ఏకొండూరు మండలానికి పైపులైన్ల ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లుగా నత్తనడకన సాగుతోంది. కిడ్నీ రోగాల బారిన పడిన వారికి ఏకొండూరు, తిరువూరులలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వ్యాధి నివారణకు అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవట్లేదు. నెఫ్రాలజిస్టులను నియమించి సకాలంలో చికిత్స అందిస్తే గిరిజనులు కిడ్నీ వ్యాధి కారణంగా మృత్యు ఒడిని చేరకుండా అరికట్టవచ్చని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఏకొండూరులో ఇదీ పరిస్థితి.. ప్రస్తుతం ఏకొండూరు మండలంలో 23 మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటుండగా, 2 శాతం సీరం క్రియాటిన్తో 175 మంది, 1.5 శాతం క్రియాటిన్తో 81 మంది చికిత్స పొందుతున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో సుమారు రూ.45కోట్ల వ్యయంతో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని పలు గ్రామాల కిడ్నీ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్యనగర్, కుమ్మరకుంట్ల, ఏకొండూరు, గోపాలపురం, అట్లప్రగడ, కోడూరు, మారేపల్లి, చీమలపాడు, కృష్ణారావుపాలెం, మాధ వరం, కేశ్యా తండా, ఏకొండూరు తండా, రేపూడి తండా, పెదతండా, గామా తండాలలో మూడు నెలల్లో 10కి పైగా కిడ్నీ రోగుల మరణాలు సంభవించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు? కిడ్నీ రోగాల బారిన పడకుండా ఏకొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు, తండాలకు కృష్ణా నదీ జలాలందించే పైలెట్ ప్రాజెక్టుకు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిచేసి నీరందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు ప్రకటించినప్పటికీ కార్యాచరణలో అడుగు ముందుకు పడలేదు. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులకు రక్షిత నీరందించడానికి ప్రధాన పైపులైన్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతాయో అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి సరఫరా చేస్తున్న నీరు పాత పైపులైన్ల లీకేజీతో పలుచోట్ల వృథాగా పోతోంది. అన్ని గ్రామాల్లో కొత్త పైపులైన్లు నిర్మిస్తామని గతంలో అధికారులు చెప్పినా పాత పైపులైన్లతోనే సరఫరా చేస్తున్నారు. రక్షిత మంచినీరందక కిడ్నీవ్యాధి బారిన పడిన గిరిజనులకు డయాలసిస్ చేయించడంతో పాటు సత్వర చికిత్స అందించాలి. నెఫ్రాలజిస్టును రెగ్యులర్ ప్రాతిపదికన నియమించి ఏకొండూరు ఆస్పత్రిలో వైద్యసేవలు లభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డయాలసిస్ బారిన పడిన వారికి పౌష్టికాహారం కూడా సక్రమంగా అందించాలి. – మేకల డేవిడ్, ఏకొండూరు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన ఏకొండూరు మండలానికి కృష్ణా జలాలు అందించేందుకు నిధులు కేటాయించి పనులు చేపట్టగా... గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. అధికారుల పర్యవేక్షణాలోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఏకొండూరు మండలంలో గిరిజనులు కిడ్నీవ్యాధి బారిన పడి చనిపోతున్నారు. వెంటనే పైలెట్ ప్రాజెక్టు పూర్తిచేసి అన్ని గ్రామాలకూ కృష్ణా జలాలు అందించాలి. – నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
అవినీతి ‘కొండ’!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో అతనొక దిగువస్థాయి ఉద్యోగి. కానీ ఏకంగా అవినీతి నిరోధక శాఖ అతనిపై వలపన్ని పట్టుకొని అరెస్ట్ చేసే స్థాయిలో అవినీతికి పాల్పడి సంచలనం సృష్టించిన సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ గవర్నరుపేట సర్కిల్ కార్యాలయంలో కొండపల్లి శ్రీనివాసరావు ఆఫీస్ సబార్డినేట్గా (అటెండర్గా) పని చేస్తున్నాడు. అతనిపై అనేక ఆరోపణలు వస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన వలపన్ని పట్టుకుంది. రూ.16 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అనంతరం కొండపల్లి శ్రీనివాసరావు రిమాండ్ విధించగా ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చాడు. అలాగే ఆ శాఖలో సస్పెన్షన్లో ఉన్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు.. తాజాగా కొండపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా అవినీతి నిరోధక శాఖ విచారణలో వ్యక్తమైంది. దాంతో ఆయనపై మరో కేసు నమోదు చేసి శుక్రవారం నగరంలోని శ్రీనివాసరావు ఇంటితో పాటుగా ఆయన బంధువులకు చెందిన మరో రెండు ఇళ్లలో మొత్తం మూడు ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. అందులో వెండి, బంగారంతో పాటుగా పలు, ఆస్తి పత్రాలు కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో వెలుగు చూసిన ఆస్తులలో ఒక భవనం, ఒక ఇంటి స్థలం, ఐదు బంగారు బిస్కెట్లతో కలిపి సుమారు 760 గ్రాముల బంగారం, సుమారు 7,800 గ్రాముల వెండి, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 22లక్షల నగదు నిల్వలు, కొంత మొత్తంలో చేతి నగదు, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు మోటార్ సైకిళ్లు, విలువైన గృహోపకరణాలు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నిందితుడు, ఆయన భార్య, కుమారుడి పేర్ల మీద ఉన్నాయి. ఇవన్నీ విజయవాడ నగర పరిధిలోనే ఉన్నాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. కొండపల్లి శ్రీనివాసరావును నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కృష్ణా వర్సిటీలో ప్రాంగణ ఎంపికలు
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు శుక్రవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ లాంఛనంగా ప్రారంభించారు. టాటా ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్ తదితర కంపెనీలు10కి పైగా కృష్ణా యూనివర్సిటీకి విచ్చేసి విద్యార్థులను ఎంపిక చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గతేడాది మాదిరిగా ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశం కల్పించి ఈ నెలాఖరులో అచీవర్స్ డే పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈరోజు జరిగిన ప్రాంగణ ఎంపికల్లో వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి 228 మందిని ఫైనల్ రౌండ్కి ఎంపిక చేసినట్టు వర్సిటీ ప్రాంగణ ఎంపికల డైరెక్టర్ ఆచార్య వైకే సుందర కృష్ణ తెలిపారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని మే ఒకటో తేదీన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరుగనుంది. ఒకటో తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5.55గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా సిద్ధం చేసిన పూలవాహనంపై శ్రీగంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామివార్లు కొలువై ఉండగా ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమై కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కలరా హాస్పిటల్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణవీధి మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. -
వెల లేక విలవిల!
దిగుబడీలా..తిరువూరు: ఏటా వేసవిలో మామిడి కాయల ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడే తిరువూరు డివిజన్లోని మార్కెట్లు ఈ ఏడాది దిగుబడి లేక వెలవెలబోతున్నాయి. దీర్ఘకాలంగా మామిడి తోటల సాగుతో జీవనం సాగించే రైతాంగం వాతావరణ ప్రతికూలత, ఉన్న తోటల్లో తెగుళ్లతో పూత, పిందె రాలిపోయి వాటిని కోనేవారు ముందుకు రాలేదు. తిరువూరు డివిజన్లోని ఐదు మండలాల్లో 60వేల ఎకరాల మామిడి తోటలుండగా ఈ ఏడాది 30వేల ఎకరాల్లో నామమాత్రంగా కాపు నిలిచింది. మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న బంగినపల్లి రకం మామిడికాయలు మాత్రం పూర్తిగా కనుమరుగవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, చైన్నె తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేశారు. మామిడి సీజన్లో ఎగుమతి, దిగుమతి కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో పరిస్థితి తారుమారైంది. తెగుళ్లతో నష్టాలు.. ఏటా పూత దశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉద్ధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతోపాటు ఇతర తెగుళ్ల కారణంగా మామిడికాయలు నేలరాలిపోతున్నాయి. తోతాపురి, చిన్న రసాలు, పెద్ద రసాల దిగుబడి సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో తక్కువ ధరకే అమ్మక తప్పని స్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావట్లేదు. సీజన్ మొదట్లో తోతాపురికి టన్ను రూ.25వేలు, రసాలు రూ.35వేల చొప్పున ధర పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లి రకానికి టన్ను రూ.30వేలకు పైగా ధర పలుకుతున్నా మార్కెట్లో కనిపించట్లేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాది రూపాయల ధర పలుకుతుండటంతో వెనక్కు తగ్గుతున్నారు. -
పాలీసెట్కు సర్వం సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)–2026ను శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మచిలీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలీసెట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎం. జాన్ పీటర్ తెలిపారు. శుక్రవారం ఆయన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 21 పరీక్ష కేంద్రాల్లో 5,634 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్, పెన్సిల్తో ఉదయం 9 గంటలకే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు.. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. తాగునీరు, పరిశుభ్రత సదుపాయాలు కూడా కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయడంతో పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు వైద్య, సహాయక సిబ్బందిని కేటాయించారు. జిల్లాలోని కేంద్రాలకు 21 మంది ఏఎన్ఎంలు, 21 మంది ఆశా వర్కర్లను నియమించారు. -
మహిళా రిపోర్టర్పై టీడీపీ నేత దాడి
ఇసుక అక్రమ రవాణాపై కవరేజ్కు వెళ్లిన సమయంలో ఘటన కృత్తివెన్ను: అక్రమంగా ఇసుక రవాణా తీరుపై న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన మహిళా రిపోర్టర్పై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో శుక్రవారం అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో 99 టీవీ పెడన నియోజకవర్గ రిపోర్టర్ కె.మాధవి కవరేజీ కోసం వవెళ్లారు. అక్కడ టీడీపీ నేత సూరగాని బ్రహ్మం ఆమెను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఇసుక తోలడానికి అనుమతులు ఉన్నాయా అని అడగ్గా, ‘మాకు ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చారు. మా ఇష్టం మేము తోలుకుంటాం’ అని మాట్లాడారు. వీడియో తీస్తున్న మాధవి ఫోన్ను బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. మాధవికి తోడుగా వచ్చిన మరో చానల్లో పనిచేసే ఆమె భర్త హరీష్పై సైతం దౌర్జన్యానికి తెగబడ్డాడు. ప్రాణభయంతో తిరిగి వచ్చేస్తున్న వారిని వెంబడించి దారికాచి ఫోన్లో తీసిన వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ పైడిబాబు పేర్కొన్నారు. 29న ఐవోసీఎల్ టెర్మినల్లో మాక్డ్రిల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్):జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నెల 29న జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్మినల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. జేసీ ఎస్.ఇలక్కియ శుక్రవారం రెవెన్యూ, అగ్నిమాపక, కర్మాగారాలు, పరిశ్రమలు, విద్యుత్, కాలుష్య నియంత్రణ, ఆర్ అండ్బీ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం తదితర సమన్వయ శాఖల అధికారులతో మాక్డ్రిల్ సన్నద్ధతా సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసాయన ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ స్పందన, సమన్వయం, ప్రజల రక్షణ చర్యలు అత్యంత కీలకమని తెలిపారు. మాక్ డ్రిల్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, విపత్తు నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎంవీ శివకుమార్, డీపీవో పి.లావణ్య కుమారి పాల్గొన్నారు. తృటిలో తప్పిన ప్రమాదం చల్లపల్లి: ఽదాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రక్టు అదుపుతప్పి 216 జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం పల్టీ కొట్టింది. వివరాల్లోకి వెళితే మంగళాపురంలో ధాన్యం బస్తాలను ట్రక్కులో నింపుకుని లోడును మండల పరిధిలోని వక్కలగడ్డ రైస్మిల్ వద్ద దిగుమతి చేసేందుకు ట్రాక్టర్ బయలుదేరింది. జాతీయ రహదారిపై లక్ష్మీపురం పంచాయతీ శివారు నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే ట్రాక్టర్ వెనుక ఉన్న ట్రక్కు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఘటనలో ట్రక్కులోని ధాన్యం బస్తాలు అన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మే 12,13,14 తేదీల్లో వైజాగ్లో బాక్సింగ్ పోటీలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ బాక్సింగ్ పోటీలను మే 12,13,14 తేదీల్లో నిర్వహిస్తామని శాప్ కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత క్రీడాకారులు, కోచ్లు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని శాప్ కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం నిర్వహిస్తామని గతంలో ప్రకటించామన్నారు. ఎంపికలను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, అప్డేట్స్ కోసం స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ను వీక్షించాల్సిందిగా కోరారు. -
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. నజీర్ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చేర్చించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.వివరాల మేరకు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న(శుక్రవారం) బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉంది. రాత్రి 12 గంటలకు బెంగళూరు నుంచి రావాల్సిన గవర్నర్ విమానం ఆలస్యమైంది. దీంతో, అర్ధరాత్రి రెండు గంటలకు ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు నజీర్ కడుపులో నొప్పి బాధపడ్డారు. అనంతరం, గవర్నర్ను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించినట్టు తెలిసింది. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026తోట్లవల్లూరు: తోట్లవల్లూరు పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేత గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునీతను ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషనర్ను కలిసిన వారిలో జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నర్సయ్య, రాష్ట్ర ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవ్ తదితరులు ఉన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వన్డే ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026ను ఈ నెల 26న కానూరులోని స్పాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీతో పాటు అండర్–7, 9, 11, 13, 15 బాల బాలికల విభాగంలో పోటీలు జరుగుతాయని చెప్పారు. టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే వారు ఏపీ చెస్డాట్ఓఆర్జీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 97007 75220, 92471 53387 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పట్టణాల్లోని మెప్మా విభాగంలో రిసోర్స్ పర్సన్ల మీద రోజురోజుకూ పని భారం పెరుగుతున్నా, ఐదు నెలలుగా జీతాలివ్వకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిపై.. మరోవైపు అధికారులు హెచ్చరికలు చేస్తుండం విమర్శలకు దారి తీస్తున్నాయి, పని భారం తగ్గించాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నా స్పందన లేదు. పెడన: మెప్మా (మునిసిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్)లో పని చేసే రిసోర్స్ పర్సన్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఐదు నెలలుగా జీతాల్లేక సతమతమవుతుంటే.. మరోవైపు పని చేయలేకపోతే తప్పుకోండి అంటూ అధికారులు హెచ్చరికలతో కార్పొరేషనర్లు, మునిసిపాలిటీల్లో మెప్మా విభాగంలోని రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యాక్టివ్గా లేని స్వయం సహాయక గ్రూపులు (ఎస్హెచ్జీ– సెల్ఫ్ హెల్ప్ గ్రూపు) తొలగించడానికి చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంది. పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యాన స్వయం సహాయక గ్రూపులున్నాయి. 20 నుంచి 25 గ్రూపుల బాధ్యలను ఒక ఆర్పీ చూడాలి. ఒక గ్రూపు వివరాలు, సభ్యుల వివరాలు, సమావేశాలు, తీసుకున్న రుణాలు, ప్రతి నెలా కట్టేది, తదితర వివరాలను వివిధ యాప్లలో అప్లోడ్ చేయాలి. ఒక గ్రూపు వివరాలను అప్లోడ్ చేయాలంటే సుమారు రోజున్నర లేదా రెండు రోజుల సమయం తీసుకుంటుందని ఆర్పీలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే యాప్ రూపొందించి ఒక గ్రూపు ఒకే చోట ఉండేలా, దానిలో సభ్యులు ఇతర గ్రూపుల్లో లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిధుల కొరత సాకుగా చూపి సర్కార్ ఇలాంటి ఎత్తగడ వేసిందనే విమర్శలు వస్తున్నాయి. పని భారం అధికం ప్రతి పురపాలక సంఘంలో ఆర్పీలు వారి పరిధిలోని గ్రూపులను, సభ్యులను ఆన్లైన్ చేస్తుంటారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.8వేలు, స్థానికంగా ఎస్ఎల్ఎఫ్ నుంచి రూ.2 వేలు మొత్తం రూ.10 వేలు వేతనంగా నిర్ణయించారు. మేనేజర్ యాప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సమయంలో గ్రూపుల సమావేశాల ఫొటోలు అప్లోడ్ చేయాలి. ఈ యాప్లో సక్రమంగా పూర్తి చేస్తేనే జీతాలు వస్తాయి. సర్వర్లు పని చేయక అవి పూర్తవక చాలా మంది జీతాలు పెండింగ్లో పడిపోతున్నాయనే వాదనలున్నాయి. పని భారం తగ్గించాలని కోరినా ఫలితం సున్నా ఆర్పీలపై పని భారం అధికంగా ఉండటంతో ఇటీవల ఆర్పీలంతా కలిసి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేశారు. అయినా వారి ఆవేదను ఎవరూ పట్టించుకోలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఆర్పీలకు 2027–జనాభా లెక్కల విధులు అప్పగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. వీరికి జనాభా లెక్కల విధులు అప్పగించడానికి జిల్లాలో రంగం సిద్ధమైంది. పని భారం అధికమైందని, చేయలేమని చెబుతుంటే తప్పుకో వేరే వారిని చూసుకుంటామనే సందేశాన్ని క్షేత్రస్థాయి సిబ్బందే అల్టిమేటం జారీ చేస్తుండటం విశేషం. 7ఆర్పీలకు 2027–జనాభా లెక్కలు సర్వే విధులను అప్పగించొద్దని రాష్ట్ర అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే స్థానిక సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు వారికి కూడా సెన్సెస్ విధులు అప్పగించాలని నిర్ణయించారు. నాలుగు నెలలుగా వేతనాలు రాష్ట్ర వ్యాప్తంగా అందలేదు. ఐదో నెల నడుస్తోంది. ఆర్థిక సంవత్సరం కావడంతో జాప్యమైంది. త్వరలోనే జీతాలు విడుదలవుతాయి. – డి.వి.జగదీష్, ఇన్చార్జి ఏవో, జిల్లా వెలుగు కార్యాలయం, మచిలీపట్నం ఆర్పీలకు డిసెంబరు నుంచి జీతాలు రాని పరిస్థితి. దీంతో అప్పులు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో ‘మచిలీపట్నం’లో 3,627 గ్రూపులకు 122 మంది ఆర్పీలున్నారు. ‘పెడన’లో 669 గ్రూపులకు 27 మంది, గుడివాడలో 2,431 గ్రూపులకు 91 మంది, ఉయ్యూరులో 876 గ్రూపులను 31 మంది, వైఎస్సార్ తాడిగడపలో 1,915 గ్రూపులకు 50 మంది ఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ‘జగ్గయ్య పేట’లో 1,146 గ్రూపులకు 42 మంది ఆర్పీలు, తిరువూరులో 890 గ్రూపులకు 34 మంది, నందిగామలో 1,157 గ్రూపులకు 44 మంది, కొండపల్లి పురపాలక సంఘ పరిధిలో 1,335 గ్రూపులకు 38 ఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారు. -
ఎన్టీటీపీఎస్ 8వ యూనిట్లో వంద రోజుల వేడుక
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ 8వ యూనిట్ నిర్విరామంగా వంద రోజులు పనిచేసిన సందర్భంగా శత దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వేడుకల్లో ఏపీజెన్కో డైరెక్టర్ (థర్మల్) పి.అశోక్ కుమార్రెడ్డి, చీఫ్ ఇంజినీర్ పి.శివ రామాంజనేయులు కేక్ కట్ చేసి ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ 2023లో స్టేజ్ 5 (800 మెగా వాట్స్) ప్రారంభించారన్నారు. తొలిరోజుల్లో ఆటుపోట్లు ఎదురైనా అనంతరం విద్యుత్ ఉత్పత్తిలో 100 రోజులు నిరంతరాయంగా పని చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య ఇంజినీర్లను సత్కరించారు. పర్యవేక్షక ఇంజినీర్లు ఎం.మారుతీప్రసాద్, రవికిరణ్, డి.రమణయ్య, పి.ప్రసాద్, పి.అనురాధ, ఎన్.శివప్రసాద్, వెంకటరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు రాజమండ్రి–కాకినాడ పోర్టు మధ్య రెగ్యులర్ మెమో రైలుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైలుగా నడుస్తున్న రాజమండ్రి–కాకినాడ పోర్టు (07523/07524) రైలును రెగ్యులర్ ప్యాసింజర్గా క్రమబద్ధీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి రాజమండ్రి–కాకినాడ పోర్టు (67301) మెమో రైలు, 28 నుంచి కాకినాడ పోర్టు–రాజమండ్రి (67302) రెగ్యులర్ సర్వీస్గా నడవనున్నాయి. షెడ్యూల్ ఇది రాజమండ్రి–కాకినాడ పోర్టు (67301) ప్యాసింజర్ రైలు ప్రతిరోజూ రాత్రి 10.40 గంటలకు రాజమండ్రిలో బయలుదేరుతుంది. అక్కడ నుంచి 10.56కి ద్వారంపూడి, 11.04కి అనపర్తి, 11.14కి బిక్కవోలు, 11.22కి మెడపాడు,11.32కి సామర్లకోట, 11.44కి కాకినాడ టౌన్, మధ్యరాత్రి 12.04 గంటలకు పోర్టుకు చేరుకుంటుంది. (67302) ప్యాసింజర్ ఉదయం 6.15 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరుతుంది. అక్కడ నుంచి 6.23కి కాకినాడ టౌన్, 6.38కి సామర్లకోట, 6.48కి మెడపాడు, 6.56కి బిక్కవోలు, 7.04కి అనపర్తి, 7.12కి ద్వారంపూడి, ఉదయం 8.15కి రాజమండ్రి చేరుకుంటుంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం హజ్ యాత్రికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సరైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ నేతలు విమర్శించారు. ఏటా వేలాది మంది ముస్లింలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే సందర్భంలో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం మైనార్టీ నేతలు డాక్టర్ మెహబూబ్ షేక్, సయ్యద్ అలీం, ఎండీ రిజ్వాన్ మాట్లాడుతూ విమాన, వసతి, వైద్య సేవలు, ఆహారం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వ లోపాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇది మైనార్టీల సౌకర్యాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో హజ్ యాత్రికులకు అత్యుత్తమ ఏర్పాట్లు చేసి, యాత్ర సాఫీగా సాగేలా చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉమర్, ఫజులుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గంజాయి కేసుల్లో నిరిమాండ్ ఖైదీగా ఉన్న గుంటూరు ప్రవీణ్కుమార్ను పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గురువారం రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రవీణ్కుమార్పై భవానీపురం పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. ఇతనిపై అనేక గంజాయి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రవీణ్కుమార్ను పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం రాజమండ్రి జైలుకు తరలించినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. గంజాయి కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. -
సర్వజనావస్థలు!
జిల్లా పెద్దాస్పత్రిలో రోగులు ఎక్కువ.. సేవలు తక్కువసర్వజన ఆస్పత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం బహిరంగ రహస్యమే. ఐసీయూలో వెంటిలేటర్లు లేవు, ఎంఆర్ఐ అన్నివేళలా పనిచేయదు. సిబ్బంది కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ర్యాంకుల ప్రచారం చేస్తూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. రెండేళ్ల పాటు మౌనం పాటించి, ఇప్పుడు మంత్రి హడావుడిగా తనిఖీ చేయడం కంటి తుడుపు చర్య తప్ప మరొకటి కాదు. – బూర సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా గత రెండేళ్లుగా ఆస్పత్రిలోని సమస్యలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. కంటి ఓపీ మొదటి అంతస్తులో ఉండటంతో వృద్ధులు, వికలాంగులు మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు స్థానికంగా నివసించకపోవడంతో అత్యవసర సేవలు కుంటుపడుతున్నాయి. రోగుల సహాయకుల కోసం దాతలు కట్టించిన భవనాన్ని ఇతర అవసరాలకు వాడుతుండటం బాధాకరం. – శేకుబోయిన సుబ్రహ్మణ్యం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కృష్ణా జిల్లా ●మచిలీపట్నంఅర్బన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజన, మెడికల్ కాలేజీ ఏర్పాటు తర్వాత బందరులోని సర్వజన ఆస్పత్రికి ప్రాధాన్యం పెరిగింది. అయితే గత రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రి పరిస్థితి దిగజారింది. జిల్లాలోని పేద రోగులకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆస్పత్రి సమస్యలతో కూనరిల్లుతోంది. పరికరాలు కొరత.. అరకొర సిబ్బంది.. దారుణంగా సౌకర్యాలు.. వెరసి రోగులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పెరిగిన ఓపీ.. ఆస్పత్రిలో గతంలో రోజుకు 350–400 వరకు ఉన్న ఔట్పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్లు.. జిల్లా ముఖ్య కేంద్రంలో ప్రధాన, బోధనా ఆస్పత్రి కావటంతో ఇటీవల 1,250కి పెరిగాయి. ఫలితంగా ఔట్పేషెంట్ రిజిస్ట్రేషన్లలో రాష్ట్ర స్థాయిలో సర్వజన ఆస్పత్రి మూడో స్థానానికి చేరుకుంది. అయితే ఆస్పత్రిలో సిబ్బంది నియామకాలు, మౌలిక వసతుల కల్పన, ఆధునిక పరికరాల ఏర్పాటు, పడకల సంఖ్య పెంపు వంటి కీలక చర్యలు చేపట్టకపోవడం.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సుస్పష్టం చేస్తోంది. మంత్రి హడావుడి పర్యటన.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ఆకస్మిక తనిఖీ చేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఇంతకాలం ఆస్పత్రి సమస్యలను పట్టించుకోని మంత్రి, ఒక్కసారిగా హడావుడిగా తనిఖీలు చేపట్టడాన్ని ఓపీ రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలో మూడో స్థానానికి చేరిందంటూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే స్టంట్గానే పలువురు అభివర్ణిస్తున్నారు. పెరిగిన రోగుల అవసరాలకు తగ్గట్టు వసతులు కల్పించాల్సిన బాధ్యతను మంత్రి విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిధుల కొరత.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయలేదు. గతంలో అభివృద్ధి కమిటీలు పనిచేసినప్పుడు ఆస్పత్రి అవసరాలకు అనుగుణంగా నిధులు లభించేవి. ప్రస్తుతం అత్యవసర మందులు, అభివృద్ధి పనుల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ నిధులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్లు లేవు.. ఆస్పత్రి ఐసీయూలో సదుపాయాలు పరిమితంగానే ఉన్నాయి. ఇక్కడ రెండు ఐసీయూ విభాగాలు ఉండగా, ప్రతి విభాగంలో రెండు చొప్పున మొత్తం నాలుగు వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదనంగా అనస్థీషియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉన్నప్పటికీ, వాటిలో రెండు మరమ్మతుల కారణంగా వినియోగంలో లేవు. అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ నిబంధనల ప్రకారం 24 గంటలు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పరిమితమవుతోంది. సాయంత్రం తర్వాత సిబ్బంది లేకపోవడంతో అత్యవసర రోగులకు పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. ఈ యంత్రం పాతది కావడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యాధికారుల గారడీ! ఆస్పత్రిలో విధులు నిర్వర్విస్తున్న ఉన్నత వైద్యాధికారులు, వైద్యనిపుణులు, ప్రొఫెసర్లు, వైద్యులు తదితరులలో అధిక శాతం విజయవాడ, గుంటూ రు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు ముగిసే సమయం కాకముందే, సాయంత్రం 4 గంటల నుంచే ఉమ్మడిగా ఆస్పత్రిని విడిచి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. అత్యవసర సేవలు అవసరమైన సమయంలో కూడా అందుబాటులో ఉండటం లేదు. అయితే హౌస్ రెంట్ అలవెన్స్ పొందేందుకు కొందరు అధికారులు ఆధార్ కార్డుల్లో చిరునామాలను మార్పు చేసుకుని, స్థానికులుగా చూపించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్ర స్థాయికి చేరింది. నిబంధనల ప్రకారం కనీసం 180 మంది నర్సులను నియమించాల్సి ఉండగా కేవలం 90 మందిని మాత్రమే నియమించారు. నర్సులే కాకుండా వైద్య సిబ్బంది కూడా తగిన సంఖ్యలో లేకపోవడంతో సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొందరు వైద్యులు, పరిమిత సిబ్బందితోనే ఎక్కువ రోగుల భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కీలక విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
వీఎంసీ కమిషనర్కు ప్రత్యేక అభినందన
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను వసూళ్లు చేసినందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం సాయంత్రం జయప్రకాష్ నగర్లోని స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా)లో నిర్వహించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, రాష్ట్ర స్థాయి మునిసిపల్ కమిషనర్ల వర్క్షాప్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రను సన్మానించారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఈ ఘనత వీఎంసీ సిబ్బంది సమష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాగ నరసింహారావు, విజయవాడ నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు. రామవరప్పాడు: విజయవాడరూరల్ మండలం రామవరప్పాడు వాటర్ ట్యాంక్ సమీపంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనంపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనకదుర్గానగర్లో తాండ్రిక శ్రీను(43) తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. శ్రీను మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈనెల 21న సాయంత్రం 5గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీను రెండు రోజులైనా తిరిగి రాలేదు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనంపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మద్యం మత్తులో ఈ భవనంపైకి ఎక్కి పడుకోవడంతో ఎండ దెబ్బకు మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయి రెండు రోజులు కావడంతో ఎలుకలు మృతదేహం కళ్లు, శరీర భాగాలను కరిచాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురిని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ కార్యకాలాపాలకు పాల్పడుతున్న ఉస్తేల చిన్నబాబు అలియాస్ నల్లోడు, తెల్లగడ్డ రమేష్ అలియాస్ ముట్టే మున్న, షేక్ జాన్బాషా, కూసం వెంకట దినేష్, లంకలపల్లి సాయికిరణ్ అలియాస్ దొంగసాయి, గుంటూరు ప్రవీణ్లను పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఆరుగురిని గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు వంటి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సమాజానికి హానికరమైన చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరు పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం ఒక ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించనున్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. -
రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన మొక్కజొన్న దిగుబడులను అమ్మడానికి రైతులు అవస్థ పడుతున్నారు. గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పంట చేతికొచ్చి నెల రోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైత
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: మొక్కజొన్న రైతుకు మద్దతు ధర దక్కకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట చేతికొచ్చి దాదాపు నెలరోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో మొక్కజొన్న కల్లాలు, మార్కెట్ యార్డుల్లో మగ్గుతోంది. దళారులకు అమ్మలేక, ప్రభుత్వ కనీస మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు, తాము పడుతున్న కష్టాన్ని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. రూ.153 కోట్లకు పైగా నష్ట పోతున్న రైతులు ఎన్టీఆర్ జిల్లాలో 45,500, కృష్ణాలో 18,250 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఎకరాకు సరాసరిన 30–35 క్వింటాల దిగుబడులు వచ్చాయి. మొక్క జొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్నను క్వింటాకు రూ.1600 నుంచి 1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 20.40 లక్షల క్వింటాళ్ల జొన్న దిగుబడులు వచ్చాయి. రైతులు క్వింటాకు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రూ.750 నష్టపోతున్నారు. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు రూ.153 కోట్ల మేర కోల్పోతున్నారు. మినుము, పెసర పంటలదీ అదే పరిస్థితి పంట చేతి కొచ్చే సమయంలో ధరలు పతనమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో మినుము 3.25 లక్షల ఎకరాలు, పెసర పంట 18వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మినుము పంట దిగుబడులు వస్తున్నాయి. నెలరోజుల క్రితం క్వింటాలు రూ.8,400కు మినుములను కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటా రూ.7700కు కొనుగోలు చేయడంతో రైతు క్వింటాకు రూ.700 నష్టపోతున్నారు. పెసలు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇరవై ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రభుత్వం మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకొని నష్టపోయాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకురూ.600 నుంచి 700 చొప్పున.. సరాసరిన ఎకరాకు 20వేలకు పైగా నష్టపోయాం. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. – ఉయ్యూరు మల్లారెడ్డి, రైతు, వేములపల్లి, కంచకచర్ల మండలం మాది తోట్లవల్లూరు మండలంలోని తోడేళ్ల లంక దిబ్బ గ్రామం. 5 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నాను. గతంలో కృష్ణా నది వరదలతో మినుము పూర్తిగా పాడైంది. తర్వాత మొక్క జొన్న సాగు చేస్తున్నాను. చాలా అప్పు చేశాను. ప్రస్తుతం ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు పండే అవకాశముంది. ఈ ఏడాది ఈదురు గాలులకు దిగుబడి తగ్గింది. ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నను కొనుగోలు చేయడం లేదు. దళారులకు విక్రయించి నష్టపోతున్నాం. – గంగిశెట్టి సత్యనారాయణ, తోడెళ్ల లంక దిబ్బ, తోట్లవల్లూరు, కృష్ణా -
విజయవాడ జీజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్సలు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. అజిత్సింగ్నగర్కు చెందిన రాహుల్(16) గత కొద్ది నెలలుగా శ్వాస ఆడకపోవడంతో పాటు ముక్కు నుంచి రక్తం కారడం ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్టీ ఓపీడీలో సంప్రదించగా.. ఈ నెల 13న అడ్మిట్ చేసి అన్ని రక్త పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసి ముక్కు లోపలి జువైనెల్ నాసొఫాంజియల్ ఆంజియోఫైబ్రోమా పెరుగుతుందని నిర్ధారించారు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి, మత్తు విభాగాధిపతి డాక్టర్ వినయ్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండల రావు సహకారంతో ముందుగా ఎంబోలైజేషన్ చేసి ఆ ట్యూమర్ని ఎండోస్కోప్ ద్వారా విజయవంతంగా తొలిగించారు. పేషెంట్ను ఈ నెల 22న డిశ్చార్జి చేశారు. ఇది మగ పిల్లలో కౌమారదశలో వస్తుందని హర్మోన్లు ప్రభావం వల్ల పెరుగుతుందని, అత్యంత ప్రమాదకరమని చేసి తెలిపారు, సర్జరీలో డాక్టర్ కె. రవి, డాక్టర్ అనిత, డాక్టర్ స్పందన, డాక్టర్ విజయ కృష్ణ, డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ వినయ్, డాక్టర్ పావని, డాక్టర్ వైదేహి పాల్గొన్నారు. అలాగే నగరానికే చెందిన పి. రజని(33) గత కొద్ది నెలలుగా కుడివైపు ముక్కు నుంచి నీరు కారడం వల్ల ప్రభుత్వాసుపత్రి ఈఎన్టీ ఓపీడీకి వచ్చారు. ఆమెకి కపాలం అడుగు భాగం నుంచి నీరు వస్తోంది. వైద్యులు ఇది సీఎస్ఎఫ్రినోర్హియా అని నిర్ధారించారు. ఆమెకి సీటీ, ఎంఆర్ఐ చేయించి ఎండోస్కోపీ ద్వారా కపాలం అడుగు భాగం లీకుని అరికట్టడానికి ఈ నెల 16న వివిధ రకమైన అంటుకట్టులు (తొడ భాగం కండరాల పైనుండి తీసిన పొర, కొవ్వు, ఫైబ్రిన్ సీలెంట్) వాడి ఎంతో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తిచేసి 22న డిశ్చార్జి చేశారు. -
26న కృష్ణా జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకృతి సాగుతో నేలతల్లి ఆరోగ్యం బాగుంటుందని.. ఈ సాగు విధానాలతో పాటు సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ధర్తి మాత బచావో అభియాన్ (భూ మాత పరిరక్షణ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికంగా యూరియా వినియోగం జరుగుతున్న 100 గ్రామాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ సరిత, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, జిల్లా సహకార అధికారి అనిత, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం శివ ప్రసాద్, పరిశ్రమల శాఖ ఐపీఓ రవి పాల్గొన్నారు. విజయవాడ కల్చరల్: త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు మధురంగా సాగుతున్నాయి. గురువారం జరిగిన కార్యక్రమంలో వేదాతం పల్లవి, పెందుర్తి విజయలక్ష్మి, కె. యశస్వినీదత్త, చింతలపాటి శ్రీదేవి, రాగంపూడి అమూల్య, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల విద్యార్థినుల బృందగానం, బి. సంహి త, టి. పావనిల గాత్ర యుగళం, సంగీత విద్వాంసులు వేమూరి విశ్వనాఽథ్, బీవీ దుర్గాభవానీలు త్యాగరాజ స్వామి కృతులను పలికించారు. కేఎస్ గోవిందరాజన్, సుసర్ల నందిని శ్రీనివాస్ వీణపై సహకరించారు. వృద్ధురాలిపై దాడి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యం మత్తులో వృద్ధురాలిపై దాడికి పాల్పడిన యువకుడిపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపాలెంగట్టు క్వారీ ప్రాంతంలో షేక్ మస్తాన్బీ(76) ఒంటరిగా నివసిస్తోంది. మస్తాన్ బీ ఇంటి పక్కనే తన మరిది బాజీ కుటుంబం నివాసం ఉంటోంది. బాజీ కుమారుడు మస్తాన్ బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మస్తాన్బీ ఇంటి ముందు నిల్చొని నోటికి వచ్చిన బూతులు తిట్టడంతో ఎందుకు తిడుతున్నావు.. ఇంటి లోపలకు వెళ్లవచ్చు కదా అని మందలించింది. దీంతో మస్తాన్ చేతికి అందిన ఇనుప రాడ్తో ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే చుట్టు పక్కల వారు, బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
హాబీగా పుస్తక పఠనం
కోనేరుసెంటర్: విద్యార్థులు పుస్తక పఠనాన్ని హాబీగా అలవరచుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వ విద్యాలయ సెంట్రల్ లైబ్రరీలో గురువారం నిర్వహించిన ప్రపంచ పుస్తక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖులు ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడంతో ఉన్నతస్థాయికి చేరుకున్నారన్నారు. ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తున్నా పుస్తక పఠనాన్ని దిన చర్యలో భాగంగా మలచుకోవడం అవసరమన్నారు. రిజిస్ట్రార్ ఎన్. ఉష మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో భాషా పరిజ్ఞానం చాలా ముఖ్యమన్నారు. అది పుస్తక పఠనంతో పెంచుకోగలమన్నారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే ఉత్తర భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ రమణ, కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు సహాయ ఆచార్యులు వరుణకుమారి గ్రంథాలయాల ఆవశ్యకత, పుస్తక పఠనంపై ప్రసంగించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రసంగించారు. తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగంతో పాటు అరుదైన, విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.కేయూ ఉపకులపతి ఆచార్య రాంజీ -
వన్ స్టాప్ సెంటర్లుగా పశు ఔషధి విక్రయకేంద్రాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధి విక్రయ కేంద్రాలు (పీఏవీకే) వన్ స్టాప్ సెంటర్లుగా సేవలందిస్తాయని, వెటర్నరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశువైద్యశాలల్లో పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అర్హత కలిగిన ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోపరేటివ్ సొసైటీ, రైతు ఉత్పత్తి సంఘాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావుతో పాటు సహకార, డ్రగ్ కంట్రోల్, ఆర్అండ్బీ తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్ మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని అన్ని కేడర్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సాధారణ సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సవరించిన జాబితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తమ వివరాలను సంబంధిత వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, లేదా సస్పెండ్/శాసన చర్యలలో ఉన్నవారు, ఫారిన్ సర్వీసులో ఉన్నవారు లేదా ఇతర కారణాల వల్ల సీనియారిటీ జాబితాలో పేర్లు చేరనివారు సంబంధిత ఆధారాలతో మండల లేక ఉప విద్యాశాఖాధికారి ద్వారా ఈ నెల 28లోపు మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. నిర్దేశిత గడువు అనంతరం సమర్పించే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని డీఈఓ స్పష్టం చేశారు. -
విజయవాడ కోర్టు.. ఊపిరి పీల్చుకున్న లాయర్లు
సాక్షి, విజయవాడ: విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్లో లిఫ్ట్ మొరాయించడంతో గంటన్నర పాటు న్యాయవాదులు అందులోనే ఇరుక్కుపోయారు. దీంతో, వారంతా అస్వస్థతకు గురయ్యారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ లిఫ్ట్ బ్లాక్లో న్యాయవాదులకు చేదు అనుభవం ఎదురైంది. న్యాయవాదులు లిఫ్ట్లో వెళ్తున్న సమయంలో పవర్ కట్ అయింది. దీంతో, లిఫ్ట్ ఎనిమిదో ఫ్లోర్లో ఆగిపోయింది. ఈ క్రమంలో న్యాయవాదులు గంటన్నర పాటు లిఫ్టులోనే ఇరుక్కుపోయారు. అనంతరం, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్య్కూ టీమ్ లిఫ్ట్ లోపల ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్న వారికి ఆక్సిజన్ పంపించారు. అనంతరం, లిప్ట్ నుంచి బయటకు వచ్చాక లాయర్లు ఊపిరి పీల్చుకున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
పెనుగంచిప్రోలు: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు గ్రామాల్లో ధాన్యం కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకు వెళ్లాలన్నారు. ఒకవేళ లారీలు ఆలస్యమైతే రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకు వెళ్లాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. రైతులు చెప్పిన సమస్యలపై మిల్లర్లతో మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ పోసిబాబు, తహసీల్దార్ ఎ శాంతిలక్ష్మీ, ఏఓ కె రామసుబ్బారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
నాలుగు రోజులుగా కట్టు బట్టలతోనే..
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి మక్కా యాత్రకు వెళ్లిన హాజీలు అక్కడ కట్టుబట్టలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు నాలుగు రోజుల కిందట మక్కా చేరినా వారి లగేజీ ఇంకా ఇక్కడే ఉండటంతో అక్కడ వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో 288 మంది ముస్లిం సోదరులను మక్కా పంపించింది. ఇందుకోసం మైనార్టీశాఖ మంత్రి, వివిధ మైనార్టీ విభాగాల నాయకులు గన్నవరంలో నాలుగు రోజులు పాటు నానా హడావుడి చేశారు. హాజీలతో పాటు వెళ్లాల్సిన వారి లగేజీ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. లగేజీ రాక ఇబ్బందులు పడుతున్న హాజీలు ఫోన్చేసినా అధికారులు తలో సమాధానం ఇచ్చారు. దీంతో ఇక్కడి వారి కుటుంబసభ్యులు అధికారులను నిలదీస్తే లగేజీ గన్నవరంలోనే ఉండిపోయిందని తెలిసింది. హజ్ కమిటీకి, అధికారులకు మధ్య సమన్వయలోపం వల్లే లగేజీ నాలుగు రోజులైనా మక్కాకు చేరుకోలేదని హాజీల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మక్కాలో వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోల్కతా నుంచి నేడు విమానంలో తరలింపు హాజీలను తీసుకెళ్లిన విమానయాన సంస్థకు గన్నవరం నుంచి గానీ, చైన్నె, బెంగళూరుల నుంచి గానీ కనెక్టింగ్ విమానం లేకపోవడం వల్లే లగేజీ వెళ్లలేదని తెలిసింది. కోల్కతా నుంచి తమ విమానంలో లగేజీ పంపుతామని ఆ సంస్థ ప్రతినిధులు అధికారులకు చెప్పడంతో లగేజీని గన్నవరం నుంచి మంగళవారం రాత్రి రోడ్డుమార్గాన కోల్కతాకు పంపించారు. బుధవారం రాత్రి కోల్కతా చేరుకునే ఈ లగేజీని గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుంచి విమానంలో మక్కా పంపించనున్నారు. మక్కా యాత్రకు సంబంధించి ఈ నెల 18, 19 తేదీల్లో సభ నిర్వహించి హడావుడి చేసిన కూటమి నేతలు హాజీల లగేజీ విషయాన్ని మాత్రం పట్టించుకోకపోవడం విమర్శనీయంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వతీరుపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. -
ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి శ్రేయస్కరం
గౌరంపాలెం(విస్సన్నపేట): ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మంచిదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మండలంలోని తాతకుంట్ల పంచాయతీ గౌరంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మి అనే మహిళా రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. సహజంగా పండించిన కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు తినటం వలన మీ ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపాలన్నారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో కూరగాయలు పండించుకోవటం వలన డబ్బులు ఆదా అవుతాయని, రసాయనాలు వాడని మంచి కూరగాయలు లభిస్తాయన్నారు. అనంతరం మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన గన్నీబ్యాగ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎ.కుమార్, తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఏఓ రాజ్యలక్ష్మి, పీడీఎస్ డీటీ శివనాగరాజు, ప్రకృతి వ్యవసాయం ఇన్చార్జి శ్రీనివాసరావు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
నాడు పోటీబడి..
నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడ్డాయి. ‘మన బడి నాడు–నేడు’ బడుల్లో వైఎస్ జగన్ సకల వసతులూ సమకూర్చడంతోపాటు విద్యా ప్రమాణాల పెంపునకు విశేష కృషి చేశారు. అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తో పాటు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో బోధన ఉండేలా చూశారు. ఫలితంగా నాడు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టేవారు. దీంతో కొన్ని పాఠశాలల వద్ద ‘సీట్లు లేవు’ అనే బోర్డులూ కనిపించేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి తిరగబడింది. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనను బాబు సర్కారు గాలికొదిలేసింది. విద్యాపథకాలకూ మంగళం పాడింది. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ బడుల్లో చేర్పించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపాధ్యాయులు వీధిన పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ స్కూల్లో పిల్లలను చేర్చాలని ప్రాథేయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
అన్న క్యాంటీన్కు వితరణ ఇవ్వండి
నాగాయలంక: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా త్వరితగతిన ప్రారంభించాలనే సంకల్పంతో బుధవారం ఆలయ ముఖ మండపంలో చండీహోమం నిర్వహించారు. షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత ఆలయంలో స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. తదుపరి విజయవాడ నుంచి వచ్చిన జూపూడి యశ్వంత్శర్మ నేతృత్వంలో పండితుల బృందం హోమం నిర్వహించారు. చెన్ను లక్ష్మణరావు, అద్దేప్తి శ్రీనివాసరావు, పూషడపు నిరంజనరావు జంటలతో పాటు మరో రెండు జంటలు పూజలో పీటలపై కూర్చున్నారు. ఆలయ పునఃనిర్మాణం కోసం రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ రూ.కోటిన్నర అంచనా వ్యయంతో సీజీఎఫ్ నిధులు రూ.కోటి మంజూరు చేయగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కింద రూ.50లక్షలు సమకూర్చారు. అయినా పనులు ముందుకు సాగని నేపథ్యంతో చండీహోమం తలపెట్లినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నిజామాబాద్కు చెందిన భక్తులు రూ. 17లక్షల విలువైన కాసుల హారాన్ని బుధవారం కానుకగా సమర్పించారు. నిజామాబాద్లోని ద్వారకానగర్కు చెందిన తోడుపునూరి శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు 107.500 గ్రాముల బంగారం, పచ్చలు, ఎరుపు రంగు రాళ్లతో తయారు చేయించిన కాసుల హారాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం దాతలకు వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విస్సన్నపేట: రపభుత్వ పాఠశాలల్లో గతేడాది కంటే ఈసారి 20శాతం విద్యార్థుల అడ్మిషన్లు సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈఓ ఎల్. చంద్రకళ అన్నారు. మండలంలో కొండపర్వ ఎంపీపీ(హెచ్డబ్ల్యూ) పాఠశాలను బుధవారం సందర్శించారు. ఆ పాఠశాలలో కొత్తగా 12 మంది విద్యార్థులకు డీఈఓ చేతుల మీదుగా అడ్మి షన్లు ఇచ్చారు. మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 28 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, విస్సన్నపేట జిల్లాపరిషత్ హైస్కూల్లో 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఎంఈఓ–1 శంకరరావు ఆయా పాఠశాలల హెచ్ఎం, టీచర్లు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు. 7వన్టౌన్: వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో హెల్మెట్ వాడకంపై బైకర్లకు అవగాహన కల్పించారు. తోట్లవల్లూరు: వల్లూరుపాలెంలోని సొసైటీ భూముల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటను బుధవారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పరిశీలించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై మరొకరు మండిపడుతున్నారు. ఇటీవల మచిలీపట్నంలో జనసేన నాయకుడి ఇంటి కూల్చివేత ఘటనతో టీడీపీ, జనసేన మధ్య అంతరం పెరిగింది. ప్రస్తుతం అక్కడ జరిగే కార్యక్రమాలకు జనసేన దూరంగా ఉంటోంది. ఇటీవల అవనిగడ్డలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై టీడీపీ నాయకుడి పేరు లేదని రచ్చ జరిగింది. విజయవాడ పశ్చిమంలో బీజేపీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటున్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ, జనసేన నాయకులు ఎడముఖం, పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరులో బీజేపీ, జనసేన నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో తగు ప్రాధాన్యం ఇవ్వలేదు. పెనమలూరులో బీజేపీ నేతలను కలుపుకొని పోవడం లేదు. మట్టి, ఇసుక అక్రమ వ్యాపారాల్లో స్థానిక నేతల మధ్య వాటాల్లో తేడాలు రచ్చకెక్కుతున్నాయి. మొత్తం మీద కూటమి పార్టీ నాయకుల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది. మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. బందరు కొబ్బరితోటలో జనసేన కార్యకర్త ఇంటిని అర్ధాంతరంగా కూల్చి వేయడంతో టీడీపీ, జనసేన మధ్య వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. జనసేన కార్యకర్త నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించలేదనే అక్కసుతోనే కూల్చివేశారు. టీడీపీ నేతలను వేడుకున్నా కూల్చివేత ఆపలేదని జనసేన నాయకులు ఆగ్రహించారు. దీంతో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొ నేది లేదని బాయ్కాట్ చేశారు. పెడన నియోజకవర్గంలో ఆది నుంచి జనసేనకు టీడీపీ నాయకులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాలకు జనసేన నాయకులకు సరైన సమాచారం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో గూడూరు మండలంలో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కారుకు జనసేన నేత అడ్డంగా నిలబడి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ వైఖరికి మారకపోవడంతో జనసేనకు చెందిన మరో నాయకుడు నిరాహార దీక్షకు దిగాడు. మట్టి తోలకాల్లోనూ విభేదాలు ఉన్నాయి. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి పర్యటనలకు జనసేన నాయ కులు దూరంగా ఉండి, పార్లమెంటు ముఖ్యనేత కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గన్నవరంలో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, జనసేన పార్లమెంటు ముఖ్యనేతకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాపులపాడు మండలంలో ఇంటి పన్ను పెంపు విషయంలో జనసేన నేతలు ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన జూద శిబిరాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడంపై టీడీపీ నాయకులపై జనసేన నేతలు విమర్శలు గుప్పించారు. బాపులపాడు పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవంలో సైతం పార్లమెంటు ముఖ్యనేత పేరు లేకపోవడంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. విజయవాడ సెంట్రల్లో తమకు టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రాధాన్యం ఇవ్వడంలేదని జనసేన, బీజేపీ నేతలు లోలోన రగిలిపోతున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్నవారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తమ అగ్రనేతలకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య పలు విషయాల్లో సఖ్యత కొరవడింది. పార్లమెంటు ముఖ్యనేత, టీడీపీ నేతలు చేసిన పనులను పలు సందర్భాల్లో బహిరంగంగానే బీజేపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వ్యతిరేకించారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, టీడీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. జనసేన, టీడీపీ నాయకులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి విలువ ఇవ్వడం లేదని ఇటీవల వాదోపవాదాలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికార పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని జనసేన, బీజేపీ నాయకులను ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూటమి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయి. -
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
విస్సన్నపేట: మండలంలోని లంబాడీ తండా గ్రామ పంచాయతీ బాణావతు తండాకు చెందిన వడిత్యా రాజేష్( 26)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ఉన్న ఎన్ఎీస్పీ కాలువలో మృతదేహం ద్విచక్రవానంతో పాటు పడిఉండటాన్ని బుధవారం ఉదయం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి... రాజేష్ విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో క్రికెట్ గ్రౌండ్లో పని చేస్తుంటాడు. రోజూ లాగే మంగళవారం పనికి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం కాలువలో ద్విచక్రవాహనంతో పాటు శవమై పడి ఉన్నాడని, రాజేష్ను ఎవరో చంపి కాలువ వద్ద మృతదేహాన్ని పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్స్టేషన్ వద్దకు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుని ఆందోళన చేశారు. ఇదే తరుణంలో అటుగా వెళుతున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లక్ష్మీశ ఎస్ఐ అర్జున్ రాజుతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
పోరాడుదాం..నారీశక్తిని చాటుదాం
● నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు మోసాన్ని ఎండగడదాం ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ● పెడనలో ఐదు జిల్లాల మహిళా నేతల ఆత్మీయ సమావేశం పెడన: సమస్యలపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించడానికి వైఎస్సార్ సీపీ ప్రతి మహిళా కూడా ఒక ఆదిపరాశక్తిగా మారాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా పెడనలో ఐదు జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన వైఎస్సార్ సీపీ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతి నిధులు తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం.. అనంతరం సభను ఉద్దేశించి వరుదు కల్యాణి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని, రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేద్దామన్నారు. జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో స్వయంగా చూశామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్ర బాబు నాయుడు చేస్తున్న అరాచాకాలపై ఒక చిరుతపులిలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి.. మహిళలపై చంద్రబాబుకు చిన్నచూపని, అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణియేనని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో టీడీపీ ఎంపీలు విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించారనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతా లను అనుసంధానిస్తూ పోర్టు, విమానాశ్రయం, పరిశ్రమలున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మావిగన్ను రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని వరుదు కల్యాణి అన్నారు. అమరావతి వెనుక అవినీతి నెలకొందనే విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. వరుదు కల్యాణికి తొలుత పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, హారిక దంపతులు స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. సమావేశంలో కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ డెప్యూటీ మేయర్ శీలం భారతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ పేరం త్రివేణిరెడ్డి, స్టేట్ మహిళా విభాగం సమాచార విభాగం అధ్యక్షురాలు సంపత్తి విజిత, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కందుకూరి జ్యోతి, జాయింట్ సెక్రటరీ మునుపురి హరీష్య, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి, చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామాలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పమిడిమళ్ల గీతా వసంతి, పెడన నియోజకవర్గ నాయకురాలు మైలా రత్నకుమారి, రాజులపాటి వాణి తదితరులు పాల్గొన్నారు. -
20 కిలోల గంజాయి పట్టివేత
గన్నవరం: లారీ లో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయిని బుధవారం గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చైన్నె – కోల్కతా జాతీయ రహదారిపై అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి చైన్నె వెళ్తున్న లారీలో ప్యాకింగ్ చేసిన 20 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ అలుగు సంగయ్యను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసైన సంగయ్య గంజాయి తరలింపును ఆదాయ మార్గంగా ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
క్రీడా శిక్షణ సమర్థంగా నిర్వహించాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వచ్చే నెలలో నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అత్యంత సమర్థంగా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు, ఎండీ ఎస్.భరణి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్స్ నిర్వహణ గురించి, క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడ మీలు, శాప్ లీగ్స్, క్రీడా యాప్ గురించి బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. రవి నాయుడు మాట్లాడుతూ వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను స్కూల్ గేమ్స్ విభాగం, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ శాఖల సమన్వయంతో నిర్వహించాలన్నారు. శాప్ ఎండీ భరణి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న శాప్ లీగ్స్ను జిల్లా యంత్రాంగం, స్థానిక క్రీడా సంఘాలు, విద్యాసంస్థలతో సమన్వయం చేసుకుని పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. అకాడ మీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిపుణులైన కోచ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రీడా యాప్ను మరింత సమర్థంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. శాప్ కార్యాలయ ఏఓ వెంకట రమావత్ నాయక్, క్రీడా విభాగం అధికారులు పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎండీ భరణి -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
లింగాల(వత్సవాయి): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని లింగాల గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. పెనుగంచిప్రోలుకు చెందిన పెనుగొండ తిరుపతిరావు (27) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం ద్విచక్ర వాహనంపై వత్సవాయి వెళ్తున్నాడు. లింగాల గ్రామ సెంటర్లోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ లారీ ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న మరో ఆర్టీసీ బస్సును బలంగా డీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో తిరుపతిరావు అక్కడిక్కడే దుర్మణం చెందాడు. మృతునికి భార్య కూతురు ఉన్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై ఎస్ఐ పి ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. లైంగిక దాడిపై పోక్సో కేసు నమోదు ఉంగుటూరు(గన్నవరం): మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బుధవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఉంగుటూరుకు చెందిన చింతపల్లి కిరణ్బాబు టైల్స్ పని చేస్తుంటాడు. ఇటీవల అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినితో చనువుగా మెలుగుతున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గోవిందు తెలిపారు. -
బాడీ బిల్డింగ్ పోటీలకు జడ్జిగా అశోక్
పెనమలూరు: ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ బాడీ బిల్డింగ్ పోటీలకు జడ్జిగా ఉమ్మడి కృష్ణాజిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ను ఎంపిక చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్– 2026 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు జడ్జిగా అశోక్ను ఎంపిక చేశామని టీఏబీబీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు వెల్లడించారు. గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం చిలకలపూడి(మచిలీపట్నం): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉయ్యూరు నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశాలలో వివిధ తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ జిల్లా అధికారి ఎం ఫణిదూర్జటి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి నూతన, బ్యాక్లాగ్ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాట్టు చెప్పారు. మూడో తరగతిలో 40, నాల్గవ తరగతిలో 40, ఐదో తరగతిలో 40, ఆరో తరగతిలో 40 సీట్లు ఉండగా ఏడో తరగతిలో 24, ఎనిమిదో తరగతిలో 27, తొమ్మిదో తరగతిలో 20 సీట్లు బ్యాక్లాగ్ ప్రవేశాలు ఉన్నాయని వివరించారు. నూతన ప్రవేశాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ప్రవేశాలు లాటరీ పద్దతిలో కమిటీలో ఆధ్వర్యంలో జరుగుతాయని, మరిన్ని వివరాలకు 9908839476, 9391601861 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అరటి కాయల లోడు లారీ బోల్తా గన్నవరం: జాతీయ రహదారి పక్కన లారీ బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు గాయపడిన సంఘటన గన్నవరం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... అరటికాయల లోడుతో లారీ జార్ఖండ్ నుంచి జంషెడ్పూర్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున లారీ స్థానిక శ్రీనివాస హేచరీస్ సమీపంలోని లారీ కాటా వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి లారీలో ఇరుక్కుపోయిన నలుగురి ని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బాలుడి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
కోనేరుసెంటర్: పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలో మరో ముగ్గురిని కృష్ణాజిల్లా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గతంలో కిడ్నాప్కు గురైన మరో బాలుడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ, అయ్యప్పనగర్కు చెందిన గండికోట గురమ్మ రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరి ముగ్గురితో పాటు మరో ఆటో డ్రైవర్ విజయవాడ సింగ్నగర్కు చెందిన కొమిర కాళి కలిసి ఈజీ మనీకి అలవాటుపడి నేరాలకు పాల్పడటం ప్రారంభించారు. అందుకోసం పిల్లలను కిడ్నాప్ చేసే పనికి పూనుకున్నారు. బిక్షాటన చేసే మహిళలు, అతి పేద కుటుంబాలకు చెందిన వలస కూలీలను టార్గెట్గా చేసుకుని వారి వద్ద ఏడాదిలోపు పిల్లలు ఉంటే మహిళలకు మాయమాటలు చెప్పి పిల్లలను కిడ్నాప్ చేసి ఇతరులకు ఆ పిల్లలను అమ్ముకోవటం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజుల క్రితం మాదాసు సుమమ్మ అనే బిక్షాటన చేసుకునే మహిళ చేతిలో పది నెలల పిల్లాడు ఉండటాన్ని గమనించిన నలుగురు కలిసి ఆమెకు పాత దుస్తులు ఇస్తామంటూ నమ్మించి ఆటోలో ఎక్కించుకుని కంకిపాడు సమీపానికి చేరుకున్న సమయంలో సుమమ్మను ఆటోలో నుంచి దింపేసి పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయారు. జరిగిన కిడ్నాప్కు సంబంధించి సుమమ్మ అదే రోజు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కిడ్నాప్ జరిగిన 24 గంటల వ్యవధిలో ఆటోడ్రైవర్ కావలి కాళిని అదుపులోకి తీసుకోవటంతో పాటు బాలుడి ఆచూకీ కనుగొన్నారు. మరో బాలుడి ఆచూకీ లభ్యం.. పిల్లలను కిడ్నాప్ ముఠాను పట్టుకున్న పోలీసులు నిందితులను విచారించగా మరో ఆసక్తికరమైన ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఇదే ముఠా గత నెలలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సంచరిస్తున్న బిహార్కు చెందిన మరో మహిళ చేతిలో ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసేందుకు పథకం పన్నారు. ఆమెకు మాయమాటలు చెప్పి భోజనం పెట్టిస్తామంటూ నమ్మించి ఆటోలో తీసుకువెళ్లారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశంలో దింపి బాలుడిని కిడ్నాప్ చేసి వేరే దంపతులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నిందితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ బాలుడిని కిడ్నాపర్ల నుంచి కొనుగోలు చేసిన దంపతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నేరస్తులైన గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ, గండికోట గురమ్మలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 80,500 స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సమావేశంలో ఏఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, స్పెషల్బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, పెనమలూరు సీఐ వెంకటరమణ, ఎస్ఐలు పాల్గొన్నారు.కిడ్నాపర్ల నుంచి మరో బాలుడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు -
ప్రజల్ని మోసగిస్తున్న చంద్రబాబు సర్కారు
పెడన: వెన్నుపోటు, విధ్వంసం వంటివే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తోందని, గత 23 నెలలుగా ఇదే విధంగా ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. బుధవారం ఆమె కృష్ణాజిల్లా పెడనలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అయ్యిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని, ఆర్ధిక విధ్వంసం, మహిళలకు రక్షణ లేకుండా చేయడం, పోలీసులను రెడ్బుక్ రాజ్యాంగానికి వినియోగిస్తూ, పోలీస్ వ్వ వస్థను ప్రజల రక్షణకు, మహిళల రక్షణకు వినియో గించలేని దుస్థితిలో పరిపాలన ఉందని దుయ్యబట్టారు. 23 నెలల్లోనే చంద్రబాబు రూ.3.56 కోట్ల అప్పులు చేసి చరిత్ర సృష్టించారన్నారని విమర్శించారు. ఈ అప్పుల ద్వారా వచ్చిన నగదు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించారు. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది.. కూటమి దారుణమైన పరిపాలన చేస్తోందని కల్యాణి ధ్వజమెత్తారు. అప్పులు చేసి సింగపూర్ వెళ్లి జల్సాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లు స్పెషల్ ఫ్లయిట్ల కోసం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని ఽపేర్కొన్నారు. నేడు మహిళలపై దాడులు పెరిగాయంటే అందుకు కారణం మద్యం, గంజాయి విక్రయాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీయే డ్రగ్స్తో దొరికితే ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, పలురువు మహిళా నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి -
నవరాగం పలికించే.. యువరాగం పులకించే
విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు త్యాగరాజస్వామి 259వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంకీర్తనా గానం మధురంగా సాగింది. బుధవారం నాటి కార్యక్రమంలో త్యాగరాజస్వామి రచించి స్వరపరచిన కీర్తనలు శోభిల్లు సప్తస్వర, హెచ్చరిక కాగా రారా, మేలుకోదయానిధి, శోభనే, లాళియూగవే, శోభనే, శోభిల్లు సప్తస్వర, నీదయదా తదితర కీర్తనలకు గాయకులు గాన ప్రతిష్ట చేశారు. యుక్తశ్రీ కచేరీతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓరుగంటి షణ్ముఖ ప్రియ, మల్లాది ఆహ్లాద్, ఆముక్త్, నయన, కీర్తన, పొన్నపల్లి రమాభగవాన్, డాక్టర్ చింతలపాటి మంజుల, బుర్రా నీలకంఠశాస్త్రి, పోపూరి గాయత్రి గౌరీనాథ్, కొండా శశిధర్(వీణ), విష్ణుబొట్ల సోదరీమణులు కీర్తనా యజ్ఞంలో పాల్గొన్నారు. బీవీఎస్ ప్రసాద్, జగన్మోహిని, కె.అరవింద్ వాద్యసహకారం అందించారు. త్యాగరాజ స్వామి, సీతా సమేత శ్రీరామచంద్రునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తి సామ్రాజ్యాన్ని చాటిన కీర్తనలు కార్యక్రమాలను ప్రారంభించిన సద్గురు సంగీత సభ కార్యదర్శి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ స్వామి సంకీర్తనలు రామభక్తి సామ్రాజ్యాన్ని చాటాయన్నారు. ఆయన రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సంస్థ నిర్వాహకులు బీవీఎస్ ప్రకాష్లు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖ కమిషనర్ను తక్షణమే తొలగించాలి
వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): హిందూత్వంపై, హిందూ దేవుళ్లపై నమ్మకం లేని ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ను తక్షణం తొలగించాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సుమారు ఐదు వేల ఎకరాల హిందూ ఆలయ భూములకు ఎన్వోసీలు జారీ చేసి నాలుగు వేల కోట్ల తక్కువ ధరకు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. ఆ దర్యాప్తు ఏమైంది? టీడీపీ ప్రభుత్వం 2024 నవంబర్లో రామచంద్రమోహన్పై త్రీమెన్ కమిటీ విచారణకు వేసిందని, నాటి నుంచి నేటి వరకు ఈ త్రీమెన్ కమిటీ ఎందుకు దర్యాప్తు కొనసాగించడం లేదో తెలియటం లేదని పోతిన మహేష్ అన్నారు. ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఆరు పోస్టులలో రెండు పోస్టులను ఏ అధికారం లేకపోయినా అడ్డదారిలో నియామకం చేశారన్నారు. జీవో–888కు ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేస్తూ, హైకోర్టులో కంటెంట్ నడుస్తున్నా లెక్కచేయకుండా ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్లు 26 మందిని, సెకండ్ గ్రేడ్ ఆఫీసర్లు 20 మందిని మొత్తం 46 మందికి అక్రమంగా ప్రమోషన్లు కల్పించారన్నారు. దాని ద్వారా సుమారు రూ.15 కోట్లు కమిషనర్, మంత్రి ఆనం పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఇదేం న్యాయం.. అవినీతి ఆరోపణలున్న తిమ్మానాయుడు, సురేష్బాబు విశ్వనాథరాజు, చక్రధరరావు వీరందరూ ఓసీ వర్గానికి చెందిన వారని, అందుకే వీరిని సస్పెండ్ చేయకుండా ప్రమోషన్లు కల్పిస్తూ కొనసాగిస్తున్నారని.. కానీ బీసీ సామాజిక వర్గాని కి చెందిన హేమలత, నాగరాజు, సీతారామయ్యలను మాత్రం సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రధాన దేవాలయాల వద్ద ఆయా భూములను మద్యం, మాంసం అమ్మే ప్రైవేట్ హోటల్స్కు కట్టబెట్టేందుకు, 33ఏళ్ల లీజు కు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. -
మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్
సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వర్మకు సీఎం చంద్రబాబు షాకిచ్చారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్ పేరుతో తన్నుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే జనసేన నేతలు వర్మపై దాడి చేస్తే.. చంద్రబాబు క్లాస్ పీకడంపై వర్మ అనుచరులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిఠాపురం పంచాయితీ చంద్రబాబుకు తలనొప్పిగా మారినట్లైంది. కడుపులో కత్తులు చంద్రబాబు సారథ్యంలో జత కట్టిన టీడీపీ, జనసేన నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. పైకి పొత్తులంటూనే కత్తులు దూసుకుంటున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన, టీడీపీ ముఖ్య నేతలు నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు. తాజాగా పట్టణంలోని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయం వద్ద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీ, బ్యానర్లపై కూడా చంద్ర బాబు ఫొటో పెట్టకపోవడంపై టీడీపీ చూజీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ఎన్ వర్మ మండిపడ్డారు.ఈ క్రమంలో ఆయనను జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నెట్టేసీ ప్రయత్నం చేశారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య ఆరుపులు, కేకలతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు బాహాబాహీకి దిగాయి. ఈసారి వర్మపై జనసేన వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దోర బాబు దూకుడు ప్రదర్శించడం చూస్తూంటే వారిద్దరి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరిందని చెప్పుకొంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన ఫొటోకు ప్రాధాన్యం ఇచ్చినా చంద్రబాబు ఫొటో కూడా పెడుతున్నామన్నది జనసేన నేతల వాదనగా ఉంది. ఏదో ఒక అంశాన్ని ఆసరాగా చేసుకుని వర్మ తరచూ రాద్దాంతం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది వర్మతో పాటు టీడీపీ నేతలు డిమాండ్గా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కావాలనే చంద్రబాబు ఫొటో పెట్టకుండా అవమానిస్తున్నారనేది వర్మ వాదన. ఒకటీ రెండు కాదు నాలుగైదు. పర్యాయాలుగా ఇలానే ఆవమానిస్తున్నారని, దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఈ సంఘటన మీదే ఆయన అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. -
ఆముదాలపల్లిలో ఎన్డీఆర్ఎఫ్ మాక్డ్రిల్
గన్నవరం: ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం జరిగింది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు పాటించాల్సిన స్వీయ సంరక్షణ పద్ధతులు, తోటివారిని కాపాడటంపై ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించింది. ప్రథమ చికిత్స, సీపీఆర్ చేసే విధానం, అగ్ని ప్రమాదాలు, తుపానులు, పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ ఇన్స్పెక్టర్ ప్రదీప్కుమార్ నేతృత్వంలోని రెస్క్యూ బృంద సభ్యులు కె.వెంకటేశ్వర్లు, జి.వెంకట్ నిర్వహించిన మాక్డ్రిల్ ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్దనరావు, తహసీల్దారు జాలాది విమలకుమారి, అగ్నిమాపక అధికారి ఎన్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డదిడ్డంగా పార్క్ చేసిన వాహనాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉన్నారా, మందులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పర్యవేక్షకులు, జనరల్ సర్జన్, ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు తప్పనిసరిగా మచిలీపట్నంలోనే నివసించేలా సూపరింటెండెంట్ చూడాలన్నారు. సిబ్బంది కొరతపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లీలా ప్రసాద్, ఆర్ఎంఓ నిరంజన్ కుమార్, సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన మండలంలోని ఉల్లిపాలెంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని పోలీసు అధికారులు మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామికి అవనిగడ్డ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ పూజలు చేశారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ ఆయనను దుశ్శాలువాలతో సత్కరించారు. ఆలయంలో జరుగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వస్తున్న ప్రముఖులు, భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య ఉన్నారు. తైక్వాండో జట్ల ఎంపిక వీరులపాడు: మండలంలోని పొన్నవరం శివారులో ఉన్న అంతర్జాతీయ ఏకత్వ పాఠశాలలో కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జట్ల ఎంపికలు జరి గాయి. ఎంపికై న క్రీడాకారులు తిరుపతిలో జరిగే ఐదో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు బస్సే నాగప్రసాద్ తెలిపారు. ఈ ఎంపికలకు ఏకత్వా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మనోజ్ అమరనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ దండు రత్నకాంత్, ఏకత్వ పాఠశాల వ్యాయామ విద్యా విభాగధిపతి విజయ్ కుమార్ గోగులమూడి, పీఈటీ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలికలకు పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించా లని వర్క్షాప్లో వక్తలు పేర్కొన్నారు. మంగళవారం గవర్నర్పేటలోని ఇరిగేషన్ కాంపౌండ్లో రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, వసతి గృహాల బాలికల భద్రతా మార్గదర్శకాలు, సురక్షిత మౌలిక వసతులపై జిల్లా స్థాయి వర్క్షాప్ జరి గింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, హాస్టల్ వార్డెన్లు, కస్తూరిబా గాంధీజీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ ప్రతి పాఠశాల నందు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098, కంప్లైంట్ బాక్స్ ఉండాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళికలతో ఉపాధ్యాయులు పని చేస్తున్నారని వివరించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో సమగ్ర శిక్ష ద్వారా బాలికల భద్రత, మౌలిక సదుపాయాలను క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయుల సహకా రంతో పర్యవేక్షిస్తున్నారన్నారు. విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసవి మాట్లా డుతూ.. అన్ని పాఠశాలల్లో బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. క్రాఫ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ తంబీ, వై.జాన్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం. రాజేశ్వరరావు, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతి, నోడల్ ఆఫీసర్ సీహెచ్ సాయి గీత తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి వర్క్షాప్లో వక్తలు -
ఆటో పల్టీ.. మహిళా కూలీ దుర్మరణం
నందిగామరూరల్: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో పల్టీ కొట్టిన ఘటనలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురు గాయాలైన ఘటన నందిగామ మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన 20 మంది వ్యవ్యసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామశివారులో మిర్చి కోతకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం సమయంలో స్వగ్రామం వస్తుండగా రామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కాల్వ మలుపు వద్ద టైరు పేలి ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్.నాగమణి (42)కి తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.వి.ఎల్. నాయుడు తెలిపారు. -
ఆపద నుంచి ఆలైవ్ రిడ్లీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల జాతి సరికొత్తగా ఊపిరి పోసుకుంటోంది. అటవీశాఖ, అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఫలించి ఈ జాతి వృద్ధిబాట పట్టింది. ఈ జాతి తాబేళ్లు పెట్టిన గుడ్లను సేకరించి, హేచరీల్లో పిల్లలను చేయించి వాటిని తిరిగి సముద్రంలోకి వదులుతూ ఆ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. అవనిగడ్డ డివిజన్లో ఐదు చోట్ల హేచరీలను ఏర్పాటు చేసి ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షిస్తుండగా, ఈ సంవత్సరం మచిలీపట్నం డివిజన్లో మరో రెండుచోట్ల హేచరీలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, నెల్లూరు, కావలి, బాపట్ల ప్రాంతాల్లో సైతం ఈ జాతి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో నాలుగు లక్షల గుడ్లు సేకరించి పిల్లలను సముద్రంలోకి వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జన్మించిన చోటకే వచ్చి గుడ్లు పెట్టే తాబేలు లెపిడోచెలిస్ ఒలివాసియా అనే సాంకేతిక నామంతో పిలిచే అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అట్లాంటిక్, ఫసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. ఈ జాతి మన దేశంలో బంగాళా ఖాతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఆడ తాబేలు జన్మించిన తరువాత ఎక్కడ నుంచి సముద్రంలోకి వెళ్తుందో అక్కడ నుంచి 9 వేల కిలో మీటర్లు ప్రయాణించి తిరిగి అదే ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడుతుంది. ఆలివ్ రిడ్లీ తాబేలు ఏటా డిసెంబర్ నుంచి మే మధ్య కాలంలో సముద్రం ఒడ్డుకు వచ్చి రాత్రివేళలో 60 నుంచి 150 వరకూ గుడ్లు పెడుతుంది. నచ్చిన ప్రాంతంలో ఇసుకలో అడుగు నుంచి రెండడుగుల లోతులో గుంత తీసి అందులో గుడ్లు పెడుతుంది. అనంతరం గుడ్లను ఇసుకతో కప్పేసి, పది నిమిషాలు అక్కడే ఉండి తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. ఉష్ణోగ్రతలను బట్ట్టి ఆడ, మగ తాబేలు ఇసుక బొరియల్లో గుడ్లు పెట్టి వెళ్లాక ఉష్ణోగ్రతలను బట్టే ఆడ, మగ నిర్ధారణ అవుతుంది. 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుడ్డు నుంచి బయటకు వస్తే మగ, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య అయితే ఆడ తాబేలు అవుతుంది. అటవీ శాఖ సిబ్బంది గుడ్లను సేకరించి హేచరీలకు తరలిస్తారు. ఇక్కడ కూడా వాటికి సరిపడా ఉష్ణోగ్రతలను కొనసాగించి గుడ్లు బయటకు వచ్చాక సముద్రంలోకి వదులుతారు. ఈ అరుదైన తాబేళ్లను సంరక్షించేందుకు 2010లో అటవీశాఖ తొలిసారిగా అవనిగడ్డ డివిజన్లో రెండు చోట్ల హేచరీలను ఏర్పాటు చేసింది. తొలి ఏడాది రెండు వేల గుడ్లతో ప్రారంభమైన సేకరణ ఏటా పెరుగుతోంది. గతంలో పాలకాయతిప్ప, సంగమేశ్వరం, గుల్లలమోద లైట్హౌస్, ఐలాండ్, జింకపాలెంలో ఈ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఉండేవి. ఈ ఏడాది మచిలీ పట్నం డివిజన్లో మంగినపూడి, పల్లెతుమ్మలపాలెంలో హేచరీలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 542 తాబేళ్ల నుంచి 60,838 గుడ్లను సేకరించి హేచరీల్లో భద్రపరచి 53,769 పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాది 655 తాబేళ్ల నుంచి 76,475 గుడ్లను సేకరించి ఇప్పటి వరకూ 39,647 పిల్లలను సముద్రంలోకి పంపించారు. ఈ ఏడాది 70 వేల పిల్లలను వదలాలన్నది లక్ష్యం. మార్చి నెలాఖరున ప్రారంభమైన ఈ ప్రక్రియ మే నెలాఖరు వరకూ కొనసాగుతుంది. ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు పెట్టిన తరువాత అడవి నక్కలు, అడవి పందుల నుంచి ప్రమాదం ఉంటుంది. తాబేలు గుడ్లు పెట్టే వరకూ ఆ పరిసరాల్లో నక్కలు, పందులు పొంచివుంటాయి. తాబేలు గుడ్డు పెట్టి వెళ్లాక వాటిని తినేస్తాయి. ఈ గుడ్లను కాపాడి సేకరించేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. వారు రాత్రి వేళల్లో సంచరిస్తూ తాబేళ్ల అడుగు జాడల ఆధారంగా గుడ్లను సేకరించి హేచరీలకు చేరుస్తారు. సముద్ర నీటిలో ఉండే ఈ రకం తాబేలు ప్రతి మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి బయటకు వచ్చి గాలి తీసుకుని లోపలకు వెళ్తాయి. చేపల వేటకు ఉపయోగించే గిల్, ట్రాల్, ఘోస్ట్ వలలు వీటి పాలిట యమ పాశాలవుతున్నాయి. మరికొన్ని బోట్లుకు ఉండే పదునైన వస్తువులు తగిలి మరణిస్తున్నాయి. చేపల వేట సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అరుదైన ఈ జాతిని కాపాడిన వారవుతారని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సముద్రంలో ఉండే మలినాలు, వర్థాలు, పాచి, నాచును ఆహారంగా తీసుకుని మత్స్య సంపద వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహద పడే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. -
ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్
ఘంటసాల: గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం అజరామరమని కృష్ణాజిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామ్లక్ష్మణ్ పేర్కొన్నారు. ఘంటసాల గ్రామంలో మధుర గాయకుడు వెంకటేశ్వరరావు నిర్వహించిన పాటల కచేరీకి 60 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో ఏడాది పాటు నిర్వహించే ఆరు దశాబ్దాల ఉత్సవాలను రామ్ లక్ష్మణ్ మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కళాసమితి అధ్యక్షుడు కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో రామ్ లక్ష్మణ్ ప్రసంగించారు. తెలుగు పాటకు వన్నె తెచ్చిన ఘంటసాల కృష్ణాజిల్లా వాసి కావడం మన అదృష్టమన్నారు. ఆయనను చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహుదూర్ గండపెండేరంతో గౌరవించడం, గ్రామస్తులు అంబారీపై ఊరేగించడం విశేషమన్నారు. కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఘంటసాల వంశస్తుల అర్చకత్వం చేసిన శ్రీ జలదీశ్వరాలయంలో ఈ ఉత్సవాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల చరిత్రతో కూడిన శ్రీ జలదీశ్వర స్వామి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి ఫణి హరిప్రసాద్, పీఏసీఏస్ చైర్మన్ బండి పరాత్పరరావు, వేమూరి గోపాలకృష్ణ, కొండపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: పాత వస్తువుల సేకరణకు గ్రీన్షాప్లు ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ పేర్కొ న్నారు. గంగూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఆయన ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి గ్రీన్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గంగూరు గ్రామంలో మోడల్గా గ్రీన్షాప్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులు వారి వద్ద ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్, ఇనుము, పేపర్, అట్టపెట్టెలు, స్టీల్, అల్యూమినియం, గాజు బాటిల్స్ ఉంటే గ్రీన్షాపునకు తీసుకు వచ్చి విక్రయించాలన్నారు. దీనికిగాను వస్తువుల విలువకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ, కంకిపాడు ఎంపీపీ రాజ్యలక్ష్మి, గ్రామ ప్రత్యేకాధికారి ఓంకార్, ఎంపీడీవో శ్రీనివాసరావగు, టీడీపీ నాయకుడు కోయా ఆనంద్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి బంగారం చోరీ చేసిన ఘటనల్లో ఇద్దరు నేరస్తులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 216 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీస్స్టేషన్లో ఏడీసీపీ ఎం.రాజారావు ఈ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కొండపల్లికి చెందిన ఇట్టా గోపీనాథ్ (25), దుంప రాంబాబు (25) మరో ఇద్దరితో కలిసి జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఎ.కొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నంలో రెండు చోట్ల, తెలంగాణ రాష్ట్రం చందుగొండ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీల్లో రూ.32 లక్షల విలువైన 216 గ్రాముల బంగారం చోరీ చేశారు. విజయవాడ వన్టౌన్ ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న గోపీనాథ్, రాంబాబును సీఐ కిషోర్బాబు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు చేసిన నేరాలను అంగీకరించారు. వీరితో పాటు చోరీల్లో పాల్గొన్న ఇద్దరు పరారీలో ఉన్నారు. 216 గ్రాముల బంగారం స్వాధీనంఇట్టా గోపీనాథ్ పదో తరగతి వరకూ చదవి ఆ తర్వాత కొంతకాలం ఆటో నడిపి అనంతరం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ దుంప రాంబాబు, దుంప సంపత్, చీమశెట్టి గోపికృష్ణ స్నేహితులయ్యారు. వారంతా మద్యం, పేకాట, కోడిపందేలు వంటి వ్యసనాలకు బానిసల య్యారు. డబ్బులు సరిపోక చోరీలు మొదలు పెట్టారు. రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడేవారు. గతంలో పలు కేసుల్లో అరెస్టయి జైలుకి వెళ్లొచ్చారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొమ్ము రికవరీ చేసిన సీసీఎస్ పోలీసులను పోలీస్ కమిషన్ ఎస్.వి.రాజశేఖరబాబు అభినందించారు. -
‘పని బంద్’ పేరిట కార్మికుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) విజయ వాడ కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులు పని బంద్ పేరిట ధర్నా నిర్వహించారు. నగర అధ్యక్షుడు టి.ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మునిగిపోయారన్నారు. రోడ్లు ఊడ్చే కార్మికులకు జీతాలు లేక పస్తులు ఉంటే.. ప్రభుత్వం మాత్రం పండుగ చేసుకుంటుందన్నారు. బడా కాంట్రాక్టర్లకు పని చేయకముందే మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారని, పనిచేసిన కార్మికులకు నెల తర్వాత కూడా జీతం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జీతాల కోసం మునిసిపల్ కార్మికులు ఆందోళన చేస్తుండగా.. మున్సిపల్ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనలో ఉండడం గర్హనీయమన్నారు. మార్చి నెల జీతాలు ఇవ్వలేదు.. ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ అండ్ ఫెడరేషన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల 21వ తేదీన వచ్చినా మార్చి నెల జీతాలు ఇవ్వలేదన్నారు. ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. విజయవాడ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. మునిసిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నగర ప్రధాన కార్యదర్శి ఎస్. జ్యోతిబాసు, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. తిరుపతమ్మ, నగర ఉపాధ్యక్షురాలు ఎం.బుజ్జమ్మ, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మునిసిపల్ వర్కర్ల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ -
సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల ధర్నా
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పీఆర్టీయూ ఏపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిబోయిన శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పీఆర్టీయూ ఏపీ) ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పెద్దిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పీఆ ర్టీయూ ఏపీ దశలవారీ ఉద్యమ కార్యక్రమాలను రూపొందించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25నవ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడ్తామని ప్రకటించారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఏపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జకియా సుల్తానా, జిల్లా కార్యదర్శి మనోహర్, నాయకులు బాబ్జి, మానేపల్లి శ్రీను, ఈశ్వరరావు, హరిచరణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ మంగళవారం బాబు సర్కార్ అప్పు.. రూ.4,600 కోట్లు
సాక్షి, విజయవాడ: దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో రికార్డులు నమోదు చేసిన ఆయన మళ్లీ భారీ అప్పు చేశారు. ఈ మంగళవారం(ఏప్రిల్ 21వ తేదీ) రూ.4,600 కోట్లు అప్పు తెచ్చారు.గడిచిన 23 నెలల్లో మొత్తం అప్పులు రూ.3,56,655 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రూ.9,000 కోట్లు, ఈ నెల 7వ తేదీన రూ.4,400 కోట్లు అప్పు చేశారు.ఘోర పాలనా వైఫల్యంతో అప్పుల రికార్డు నెలకొల్పిన చంద్రబాబు రూ.1,98,564 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ కింద రూ.1,10,704 కోట్లు, రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు చేశారు.ఇలా దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా చంద్రబాబు రికార్డులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 60 నెలల్లో రూ.3,32,000 కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు కేవలం 23 నెలల్లోనే రూ.3,56,655 కోట్ల అప్పులు చేయడం గమనార్హం. -
పాలిసెట్కు ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)–2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డీఆర్వో మాట్లాడుతూ ఏప్రిల్ 25వ తేదీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో 5,634 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా విజిలెన్స్, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ పీటర్, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ రవీంద్రబాబు, జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కారు ఢీకొని జింక మృతి పెనుగంచిప్రోలు: కారు ఢీకొని జింక మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి జాతీయ రహదారిపై వేదాద్రి వైపు వెళ్తున్న కారు కొణకంచి క్రాస్రోడ్స్ వద్ద పొలాల్లో నుంచి అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న జింకను ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడికే మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే ఫారెస్ట్ జగ్గయ్యపేట సెక్షన్ ఆఫీసర్ కె. రవివర్మ, వీఆర్ఓ పి. శ్రీను, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు హైవే మొబైల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలొదిలిన జింకను రోడ్డు పక్కకు తెచ్చారు. వారందరి సమక్షంలో నవాబుపేట పశువైద్యాధికారి శంకర్నాయక్ జింకకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం జేసీబీతో గుంత తీయించి ఖననం చేశారు. ముగిసిన కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా జరుగుతున్న కొండపల్లి ఖిల్లా, కొండ పల్లి బొమ్మల పండుగ సోమవారం రాత్రి ముగిసింది. మూడురోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల ప్రదర్శన, కళాకారుల ర్యాలీ ప్రదర్శనలతో పట్టణంలో ఉల్లాసాన్ని నింపాయి. ముంగిపు కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పూర్వం శ్రీ కృష్ణదేవరాయులు కాలంలో వీధుల్లో రత్నాలు రాసుల్లా పోసి అమ్మేవారని, నేడు కొండపల్లి బొమ్మలను రత్నాల్లా వీధుల్లో అమ్ముతున్నారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు దేశానికి నిజ మైన వారసత్వ సంపద అన్నారు. కొండపల్లి బొమ్మల పోటీల్లో విజేతలుగా నిలిచిన శంకర్, గౌస్ బాషా, షేక్ ఖాజాకు వరుసగా రూ.30వేలు, రూ. 20వేలు, రూ. 10వేలను బహుమతులుగా అందజేశారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. అప్పు చేయడమే సంపద సృష్టా? గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా అంటూ జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 3.50లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు పూర్తిగా అటకెక్కాయని, తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని కూటమి పాలకులను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని జై భీమ్ భారత్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడున్నర కోట్లు అప్పులు చేసిందని, ఇందుకు గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెస్తూ మంగళవారం ప్రభుత్వంగా కూటమి మిగిలిపోయిందన్నారు. మావిగన్ ఓ మంచి ప్రతిపాదన ప్రతిపక్షనేత చేసిన మావిగన్ ప్రతిపాదనను ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. అమరావతిలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలు రావడానికి వీల్లేదా అని ప్రశ్నించారు. వాళ్లేమైన అంటరాని వాళ్లా అని నిలదీశారు. -
త్యాగరాజ స్వామికి స్వరనీరాజనం
విజయవాడ కల్చరల్: శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు కళాకారులు త్యాగరాజస్వామికి స్వరనీరాజనాలు అర్పించారు. అన్త్వతమణి గాత్ర కచ్చేరీ శ్రావ్యంగా సాగింది. ఓరుగంటి సాయి వశిష్ట, కె.దుర్గాగాయత్రి, కె.లక్ష్మీవెంకట సత్యవల్లి, వావిలాల వేంకట రఘునామ ప్రణద, బొమ్మరాజు రఘనాథరావు, ఎం.చంద్రశేఖర్, కస్తూరి గోపాలరావు, కందుర్తి లక్ష్మీనరసమ్మ, తుషార పూర్ణవల్లి తదితరులు త్యాగరాజ స్వామి కృతులను వీనుల విందుగా ఆలపంచారు. సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎన్.సీహెచ్. బుచ్చయ్యా చార్యులు త్యాగరాజ మార్గం అంశంగా ప్రసంగించారు. నందకుమార్, చావలి శ్రీనివాస్, కె.జగన్మోహిని, కందుల అనిల్కుమార్ వాద్య సహకారం అందించారు. వెడలెను కోదండపాణి, రామ నామము జన్మరక్షణ మంత్రము, ఇక కావలసినది ఏమి, రామ ననుబ్రోవరా తదితర కీర్తనలు అలరించాయి. వారం రోజులపాటు నిర్వహించే త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలను సంస్థ అధ్యక్షుడు బి.వి.ఎస్.ప్రకాష్ ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, సభ్యులు గాయత్రీ గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
ఉపాధి హామీ పథకంపై నీలినీడలు మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద కార్మికులు రోడ్డున పడ్డారని.. ఉపాధి హామీ పథకంపై నీలినీడలు అలుముకున్నాయని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక విజయవాడ సత్యనారాయణపురం భగత్సింగ్ రోడ్డులోని యూనియన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చి, ‘జీరామ్ జీ’ పథకాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. 2025–26 సంవత్సరానికి గానూ పనిదినాలు ఏకంగా 57.6 శాతానికి తగ్గించటం విచాకరమన్నారు. 2024–25లో 24.52 కోట్ల పనిదినాలు ఉంటే, ప్రస్తుత ఏడాదికి అవి 18.59 కోట్లకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాజకీయం.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి సుమారు 1,200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, నిజమైన కార్మికులకు పని కల్పించకుండా, కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకే డబ్బులు చెల్లిస్తున్నారని గౌతంరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 80వేల మంది వికలాంగ కార్మికులకు లబ్ధి చేకూరగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ సంఖ్య 66వేలకు పడిపోయిందని అన్నారు. దర్శన టికెట్ల దందాపై సీఎంఓకి ఫిర్యాదు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో దర్శన టికెట్ల వ్యవహారం రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. గతంలో దర్శన టికెట్లను జిరాక్స్ కాపీలు తీసి అమ్మవారి దర్శనాలు చేయించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట దేవస్థాన ప్రోటోకాల్ దర్శనాలలో రూ. 500 టికెట్లను పదే పదే వినియోగిస్తున్న వ్యవహారం ఈవో దృష్టికి వచ్చింది. అయితే తాజాగా ఓ భక్తుడు తన స్నేహితులైన మరో ముగ్గురితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. తనకు పరిచయం ఉన్న దేవస్థాన రిటైర్డ్ ఉద్యోగి సహకారంతో ప్రోటోకాల్ దర్శనం చేయించాలని కోరాడు. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తులు సదరు భక్తుడి నుంచి రూ. వెయ్యి వసూలు చేశారు. ఆలయంలోని అవుట్సోర్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అటెండర్కు ఈ బాధ్యత అప్పగించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆ భక్తుడి నుంచి మరో వెయ్యి రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు భక్తుడు సీఎంఓలో పరిచయం ఉన్న వ్యక్తి సాయంతో ఈ వ్యవహారాలపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయ ఈవోను సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో కింది స్థాయిలో ఉన్న అటెండర్పై ఈవో వేటు వేసినట్లు సమాచారం. ఆలయంలో దర్శన టికెట్ల దందాలో కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భాగస్వాములై ఉండటంతో ఇది కొనసాగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
లిఫ్ట్.. ప్రైవేటుకు గిఫ్ట్!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోనుంది. రైతుల్లో అనైక్యతతో పాటు పలు ఇతర కారణాల వల్ల ఇప్పటికే సగానికి పైగా పథకాలు పనిచేయడం లేదు. కొన్ని పథకాలు ఏకంగా మూలన పడ్డాయి. ప్రైవేటుకు అప్పగిస్తే విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు సాగు చేసే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా మెట్ట ప్రాంతం. కృష్ణానదితో పాటు కట్టలేరు, మునేరు, వైరాయేరు, పాలేరు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మెట్ట ప్రాంత రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు, భూములను సాగులోకి తెచ్చేందుకు ఆయా యేర్లపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. జిల్లాలో చిన్నవి, పెద్దవి మొత్తం 118 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 1,13,511 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాలను నిర్వహించేది. తర్వాత కాలంలో నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించి నీటిపారుదల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణ చేస్తోంది. రైతు నిర్వహణలోకి రావడంతో ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. రైతుల మధ్య విభేదాలు, రాజకీయాల కారణంగా సక్రమంగా నిర్వహించడం లేదు. ఫలితంగా ఒక్కొక్కటి మూతపడుతూ వస్తున్నాయి. తరచూ మోటార్లు రిపేర్లు, పైపులు దెబ్బతినడం తదితర కారణాలతో సామర్థ్యాన్ని కోల్పోయాయి. పనిచేయని పథకాలు.. ఎన్టీఆర్ జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాల్లో 45 మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటి కింద మాత్రమే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 46 పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల రైతుల మధ్య విభేదాలు, రాజకీయ పార్టీల ప్రమేయంతో ఉద్దేశపూర్వకంగా తాళం వేసి ఉంచారు. ఆయకట్టు పరిధిలోని ఒక్కోరైతు ఎకరాకు వెయ్యి రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు సక్రమంగా వసూలు కాకపోవడం, మరమ్మతులు వచ్చినపుడు సకాలంలో చేయించకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. 20 పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. 7 పథకాలను పూర్తిగా మూసివేశారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఎత్తిపోతల పథకాలను ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారం నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులైతే దోపిడీకి ఆస్కారం ఉంటుంది. పంటలు సాగు చేసే వారిలో కౌలుదారులే ఉన్నారు. నీటి తీరువా పెంచితే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. జిల్లాలోని పథకాలకు మరమ్మతులు చేపట్టి పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కట్టలేరుపై జయంతి గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం గత రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ పైపులైన్లు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. పూర్తి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే నిర్వహిస్తే మేలు. – జి. కృష్ణారెడ్డి, రైతు, జయంతి ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం సరికాదు. ఈ నిర్ణయం కౌలు రైతులకు ఎక్కువ నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే అవకాశం ఉంది. దోపిడీ పెరిగిపోతుంది. కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వం ఏం చేస్తుంది? పథకాల నిర్వహణలో ప్రభుత్వ బాధ్యత లేదా? ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. – పి. జమలయ్య, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. లబ్బీపేట: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం విజయవాడ బందరు రోడ్డులో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు. ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. 7 -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక భద్రత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సందర్భంగా సోమవారం భద్రత ఏర్పాట్లు చేశారు. గత వారం నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తనకు పరిహారం అందలేదంటూ కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్లో కారం చల్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పీజీఆర్ఎస్ నిర్వహించే పింగళి వెంకయ్య సమావేశ మందిరం ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మహిళలను తనిఖీలు చేసేందుకు కేబిన్ ఏర్పాటు చేశారు. పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్లోనూ అదనంగా పోలీసు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఒకరిద్దరూ పోలీసు కానిస్టేబుళ్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యులను తనిఖీ చేయడమా! సీఎం, పీఎం వంటి నాయకుల సభలు, సమావేశాలు, ఇతర వీఐపీలు వచ్చిన సమయంలో తనిఖీలు చేసిన విధంగా కలెక్టరేట్లో పీజీఆర్ ఎస్కు వచ్చే వారిని తనిఖీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో వృద్ధురాలు కారం చల్లిందో.. ఆ పరిస్థితి తలెత్తకుండా చూస్తే సరిపోయేదని, అలా కాకుండా అర్జీలు సమర్పించేందుకు వచ్చే సామాన్యులను మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు పార్టీ నాయకులతో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వేచ్ఛగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించే అవకాశం ఉండాలని, ఏదో అనుకోని సంఘటన జరిగితే ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 25 నుంచి వేసవి శిక్షణ శిబిరం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఈ నెల 25 నుంచి మే 25వ తేదీ వరకు తమ కళాశాల ఆవరణలో బ్యాడ్మింటన్, యోగా, జిమ్, ఏరోబిక్స్ అంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. స్థానిక కళాశాల ఆవరణలో కోచింగ్ క్యాంప్ వివరాలతో ముద్రించిన కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు 63041 90057, 99599 59530లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
గానగంధర్వుడి కచేరీకి 60 ఏళ్లు
ఘంటసాల: తెలుగు పాటల్లోని మాధుర్యాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి, వాటికి ఖ్యాతి, వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి, మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతటి మహా గాయకుడు ఘంటసాల గ్రామంలో గాన కచేరీ చేసి మంగళవారం నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ మంగళవారం నుంచి 2027 ఏప్రిల్ 21 వరకు ఏడాది పాటు జరిగే ఆరు దశాబ్దాల వేడుకలు నిర్వహించనున్నారు. ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలపార్వతీ జలదీశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను కృష్ణాజిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామలక్ష్మణ్ ప్రారంభించనున్నారు. 60 ఏళ్ల క్రితం.. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే హరికథలతో పాటు ఘంటసాల వారి మధుర గానామృతాన్ని ఘంటసాల ప్రాంత ప్రజలకు అందించాలని 60 ఏళ్ల కిందట నాటి గ్రామ పెద్దలు నిర్ణయించారు. వెంకటేశ్వరరావును సంప్రదించడం, ఆయన సమ్మతించడం వెనువెంటనే జరిగిపోయాయి. గ్రామానికి వచ్చిన గాన గంధర్వుడిని గ్రామస్తులు ఏనుగు అంబారీపై ఊరేగించారు. ఘంటసాలకు చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బంగారు గండపెండేరం తొడిగారు. అనంతరం ఘంటసాల మూడు గంటలకు పైగా ఏకబిగిన కచేరీని నిర్వహించి శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించారు. ఆ కచేరీకి ఆరు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఘంటసాల వంశీయులైన స్థానిక విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఘంటసాల విజయలక్ష్మి, ఆమె సోదరి ఘంటసాల మాధవీలతకు చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ మనవడు యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ చేతులు మీదగా ఈ నెల 25వ తేదీన స్వర్ణ పతాకాలు, రజిత కంకణాలు బహూకరించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల కృష్ణ మోహన్ తెలిపారు. -
వేదఘోషతో పులకించిన ఉల్లిపాలెం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం గ్రామం వేదఘోషతో పులకించింది. గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. సోమవారం ఉదయం ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల అనంతరం తిరుచ్చిపై ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికలో స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త, అష్టాక్షరీ పీఠాధిపతి త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ పర్యవేక్షణలో రుత్వికులు పంచరామ ఆగమశాస్త్రబద్ధంగా హోమాలను ప్రారంభించారు. 13 యాగశాలల్లోని 108 హోమ గుండాల ద్వారా 250 మంది రుత్వికులు ఈ మహా యజ్ఞానాన్ని నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా యాగశాల వద్ద నెలకొల్పారు. భక్తులకు కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఇష్టి హోమగుండాల వద్ద భక్తులు హోమక్రతువులు నిర్వహించారు. రుత్వికుల మంత్రోచ్చరణ నడుమ మహాలక్ష్మి ఇష్టి హోమాలను కూడా వైభవోపేతంగా జరిపారు. విజయవాడ, నల్గొండ, హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించారు. అక్షయతృతీయ పూజలు ఆలయంలోని రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు రుత్వికులు అక్షయ తృతీయ పూజలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవార్లకు వివిధ రకాల బంగారు, గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడి 11 అడుగుల ఏకశిలా మూలమూర్తికి వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలను అలంకరించారు. మహిళలతో సామూహిక కుంకుమార్చన, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. దివిసీమ చరిత్రలోనే జరుగుతున్న అతిపెద్ద మహాయజ్ఞంలో వివిధ పీఠాలకు చెందిన స్వామిజీలు పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీతో పాటు కర్నూలకు చెందిన త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామిజీ, కర్నాటకలోని మేల్కోటకు చెందిన త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామిజీ, భీమవరా నికి చెందిన రంగరామానుజ జీయర్ స్వామిజీ, హైదరాబాద్కు చెందిన త్రిదండి దేవనాథ రామా నుజ జీయర్ స్వామిజీ పాల్గొన్నారు. ఈ యజ్ఞంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం రెండు వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వమించారు. ఈ నెల 29వరకు ప్రతి రోజు హోమాలు జరుగుతాయని అష్టాక్షరీ స్వామిజీ చెప్పారు. వైభవంగా సాగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞం మహాలక్ష్మి ఇష్టి యజ్ఞంలో అశేషంగా పాల్గొన్న భక్తజనం కనుల పండువగా శ్రీమన్నారాయణుడి అలంకారం -
విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవములు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై నిర్వహించిన ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయాలని, తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మూత్ర పిండ వ్యాధుల సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్సీ) ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ టి.గాయత్రీదేవికి వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం సోమవారం వినతిపత్రం అంద జేసింది. నీటి కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల్లో ఖనిజ లవణాలు, భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నందున, వెంటనే శుద్ధి చేసిన ఉపరితల జలాలను పైపుల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గ్రామాల్లోని అన్ని ఆర్వో ప్లాంట్లు రోజుకు 24 గంటలూ పని చేసేలా చూడాలని, సాంకేతిక కారణాలతో ప్లాంట్లు నిలిచిపోవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సదుపాయాలతో పాటు, వ్యాధి మూలాలను అరికట్టేందుకు శాసీ్త్రయమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. స్వచ్ఛమైన తాగునీరందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, కలుషిత నీరు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయడమేనని అన్నారు. ఎ.కొండూరు, మార్కా పురం ప్రజల ప్రాణాలు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తనుబుద్ధి శేఖర్రెడ్డి ఉన్నారు. కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై ఆడిట్ నివేదికలు బహిర్గతం చేయాలి ఏపీడీడబ్ల్యూఎస్సీకి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ బృందం -
ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం
మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ అధికా రులు ప్రభుత్వ ఉత్తర్వులను ఇష్టానుసారం వక్రీకరిస్తూ ఉద్యోగుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్రీనివాసరావు, పి.నాగరాజు ఆరోపించారు. కలెక్టరేట్లోని మీ–కోసం సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర్కు వారు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నంంబరు 01/పీహెచ్సీ/2025 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీలో ఈ–అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు (ఈయూపీహెచ్సీ) సేవలు అందించిన ల్యాబ్ టెక్నీషియన్ల సర్వీస్ వెయిటేజ్ మార్కులను కావాలనే పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈయూపీహెచ్సీల్లో పనిచేసిన ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కేటగిరీకి చెందరని అధికారులు చెబుతున్న వాదన అసత్యమని స్పష్టం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద ప్రభుత్వమే వారి సేవలను వినియోగించుకుందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నియామకాలు జరిగాయని గుర్తుచేశారు. వారి పనితీరును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షించారని పేర్కొన్నారు. అదే అధికారులు సర్వీస్ సర్టిఫికెట్లు జారీ చేసి ఇప్పుడు మాట మార్చడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్కోసారి ఒక్కో జీఓ గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ నంబరు 1/2024లో జీఓ నంబరు 573ని అడ్డుపెట్టుకుని సర్వీస్ వెయిటేజ్ మార్కులను నిరాకరించారని, తాజాగా నోటిఫికేషన్ నంనంబరు 1/పీహెచ్సీ/2025లో జీఓ ఆర్టీ నంబరు 301ని చూపుతూ మళ్లీ అదే విధంగా కొనసాగిస్తున్నారని శ్రీనివాసరావు, నాగ రాజు ఆరోపించారు. ఒక్కోసారి ఒక్కో జీఓను చూపుతూ అభ్యర్థులను తిరస్కరించడం పరిపాలనా అవ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే విధమైన సేవలు చేసిన ఇతర ల్యాబ్ టెక్నీషియన్లకు మాత్రం సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇచ్చి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఇదే నిబంధన అమలవుతోందని గుర్తు చేశారు. కేవలం ఈయూపీహెచ్సీ ఉద్యోగులపైనే వివక్ష చూపడం పక్షపాత ధోరణేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా మాయంపై అనుమానాలు అత్యంత ఆందోళన కలిగించే అంశంగా, కృష్ణాజిల్లా అధికారిక వెబ్సైట్లో 2021 నుంచి 2024 వరకు డీఎస్సీ నియామకాల డేటా మాయమవడంపై శ్రీనివాసరావు, నాగరాజు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో మాత్రం పూర్తి సమాచారం అందుబాటులో ఉండటం గమనార్హమని పేర్కొన్నారు. సమాచారం తొలగింపులో ఏదో దురుద్దేశం ఉన్నట్టుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి, ఈయూపీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్లకు సర్వీస్ వెయిటేజ్ మార్కులు మంజూరు చేసి సమాన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బందరు శాఖ అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఈయూపీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్లకు అన్యాయం డేటా తొలగింపుతో అధికారులపై అనుమానాలు జిల్లా రెవెన్యూ అధికారికి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిర్యాదు -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి దాత గోసాలకు చెందిన ఎం. శ్రీనివాసరావు, పార్వ తీ దంపతులు సోమవారం రూ. 1,00,008 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. దుర్గమ్మ నిత్యాన్నదానానికి.. హైదరాబాద్ ఈసీఐఎల్కు చెందిన కొండూరి సమన్విత కుటుంబం దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి అమ్మవారి నిత్యాన్న దానానికి రూ. 1,01,116ల విరాళాన్ని అందజేసింది. వీరిని కూడా అధికారులు ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. -
ఇరిగేషన్ అధికారులపై తెలుగు తమ్ముళ్ల వీరంగం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తూరు తాడేపల్లి పరిధిలోని పోలవరం కాలువ వద్ద మట్టిని తరలిస్తున్న తెలుగు తమ్ముళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన తమనే అడ్డుకుంటారా అంటూ వారు అధికారులపై వీరంగం చేశారు. కొత్తూరు తాడేపల్లి సమీపంలో పోలవరం కాల్వ ఆర్ఎంసీ కెనాల్ మట్టిని కొంతకాలంగా అధికార పార్టీ నాయకులు రేయింబవళ్లు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అక్రమ తవ్వకాలపై విషయంపై లోకాయుక్త నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదివారం రాత్రి ఈ మట్టి తరలిస్తున్న ప్రాంతానికి ఇరిగేషన్ ఈఈ సుభాని, ఇతర అధికారులు చేరుకుని రెండు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి లారీలలో తరలించడాన్ని గమనించి అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు వీరంగం వేశారు. ఈ సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకున్నా అధికార పార్టీ నాయకులు శాంతించలేదు. అధికారులకు చేతనైంది చేసుకోండంటూ రెచ్చిపోయారు. పొక్లెయిన్లు, లారీలను సీజ్ చేయాలని పోలీసులకు ఇరిగేషన్ అధికారులు సూచించారు. దీంతో రెండు పొక్లెయిన్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కొండలరావు పేర్కొన్నారు. తమ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో అధికార పార్టీ నాయకులు కొత్తపేట పోలీస్స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు తమకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని సీఐ పేర్కొనడం గమనార్హం. -
మతం పేరిట హక్కులు కాలరాయడం దుర్మార్గం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కేవలం మతం పేరుతో కాలరాయడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ దేశంలో అగ్రవర్ణాల వర్గాల వారు మతం మారి నప్పుడు వారి కుల హోదా, సామాజిక గుర్తింపు మారడం లేదని, కేవలం దళితులు మతం మారినప్పుడే ఎస్సీ హోదా రద్దు చేయడం ముమ్మాటికీ వివక్ష, రాజ్యాంగ విరుద్ధమైన చర్యని స్పష్టంచేశారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే, 75 ఏళ్లుగా ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్, కుమార పిళ్లై, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, సచార్, దేశముఖ్ వంటి అన్ని కమిషన్లు మతం మారినా దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదు, వారిపై అంటరానితనం కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశాయని గుర్తుచేశారు. ఈ శాసీ్త్రయ నివేదికలను పక్కన పెట్టి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును సాకుగా చూపి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25 కల్పించిన సమానత్వానికి, మత స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్లు శ్రీధర్ మాదిగ, ఏటుకూరి విజయ మాదిగ, గుండాల ఆనంద్ మాదిగ, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కనకపుటి వెంకటరత్నం మాదిగ, ప్రసాద్ మాదిగ, అర్బన్ నాయకులు మాతంగి సంజయ్ మాదిగ, గద్దల కొండ మాదిగ, బద్దేటి రాజు మాదిగ, ఆదామ్ మాదిగ, పేరుపొగు బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ -
డ్రోన్లు, రోబోల రూపకల్పన
గన్నవరం: ప్రభుత్వ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఐదుగురు యువతీ యువకులు ఉన్నత ఉద్యోగ అవకాశాలను పక్కన పెట్టి స్వశక్తితో ఎదిగేందుకు గన్నవరం కేంద్రంగా లారా ఇన్నోవేషన్ సంస్థను ప్రారంభించారు. భారత రక్షణ రంగం, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా డ్రోన్లు, రోబోల డిజైన్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. స్థానిక రాయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని సోమవారం ఎండీ బి.చరణ్, సీఈఓ కె. మౌళీనాథ్ ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే పరిశోధనలు.. ఈ సందర్భంగా సంస్థ ఎండీ చరణ్ మాట్లాడుతూ తామంతా శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లోనే ఇగ్నైటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి సోషల్ సర్వీస్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయమైన తామంతా కలిసి గత రెండేళ్లుగా డ్రోన్ల ప్రొపెలర్లు, రోబోల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరిపినట్లు చెప్పారు. ఈ అనుభవంతో డిజైన్ అండ్ డెవలప్మెంట్ హై ట్రస్ట్ డ్రోన్ ప్రొపెల్లర్స్, రోబోటిక్ రూపకల్పన ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు వివరించారు. భవిష్యత్లో భారత మిలటరీ, వ్యవసాయ రంగానికి అవసరమైన డ్రోన్ ప్రొపెల్లర్స్, రోబోటిక్ టెక్నాలజీని అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సంస్థ ప్రతినిధులు జి. ప్రసూన, జి. సంధ్య, పి. విష్ణువర్థన్, స్థానిక పారిశ్రామికవేత్త అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అన్న క్యాంటీన్లో సీఎం దంపతుల అల్పాహారం
పటమట (విజయవాడ తూర్పు): సీఎం చంద్రబాబు తన 76వ జన్మదినం సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్లో సోమవారం సతీసమేతంగా అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాల్సిన స్థితిలో రూ.5కే ప్రభుత్వం మంచి ఆహారాన్ని అంది స్తోందన్నారు. ఈ క్యాంటీన్లకు ఇస్కాన్ ఫౌండేషన్ రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేస్తోందని కొనియాడారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని తన భార్య భువనేశ్వరి అందించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలివ్వాలని కోరారు. మరోవైపు మీడియాతో సీఎం మాట్లాడుతుండగా ఆయన వెంట ఉన్న ఎన్ఎస్జీ కమాండో నందలాల్ షా ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రోమి శ్రీసాయికి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోడూరు: కోడూరుకు చెందిన కోటగిరి రోమి శ్రీసాయి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కైవసం చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రోమి శ్రీసాయికి ఇటవల నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు రికార్డు సర్టిఫికెట్ను అందించారు. 2007వ సంవత్సరంలో రోమి శ్రీసాయి నేషనల్ చైల్డ్ అవార్డు, దుర్గి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఢిల్లీలో జరిగిన ఆలిండియా మల్టీ లింగ్వెల్ ప్రోగ్రామ్లో తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఆమె మూడు ముక్కలాట, నా బంగారు తల్లి నవలలు రచించి ప్రచురించారు. బహుముఖ రంగాల్లో ప్రతిభ చూప డంతో ఆమెకు నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. రోమి శ్రీసాయిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సత్కరించి అభినందించారు. దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మి యాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆలయ అర్చకులు సోమ వారం మహాలక్ష్మి యాగం నిర్వహించారు. తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మహాలక్ష్మి యాగాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. లోక కల్యాణార్థం, భక్తుల సౌభాగ్యం కోసం దేవస్థానమే ఈ యాగాన్ని జరిపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని ఆరాధించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనధాన్యాలకు లోటు ఉండదని భక్తుల నమ్మకమని అర్చకులు పేర్కొన్నారు. యాగం అనంతరం నిర్వహించిన మహా పూర్ణాహుతిలో ఆలయ ఈఓ శీనానాయక్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నిందితుల రిమాండ్ పొడిగింపు విజయవాడ లీగల్: పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 11 మంది నిందితుల రిమాండ్ సోమ వారం ముగిసింది. దీంతో పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వారిని వర్చువల్గా హాజరు పరిచారు. వచ్చే నెల నాలుగో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి బి.రాధారాణి ఆదేశాలు జారీ చేశారు. -
నగ‘ధగ’లు
విజయవాడలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఆదివారం అక్షయ తృతీయ నేపథ్యంలో అందరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మంచి ఆదాయముంటుందని ప్రజల నమ్మకం. ఆ విశ్వాసానికి అనుగుణంగా విభిన్న మోడల్స్, వివిధ ఆఫర్లతో జ్యూవెలరీ దుకాణదారులు వినియోగదారులను ఆకర్షించారు. దీంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివవచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. వేకువజామున నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు ఉదయం 7గంటల తర్వాత ప్రారంభమయ్యే శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. వీఐపీలకు, ప్రముఖులతో పాటు రూ.300 టికెట్ కలిగిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఘాట్రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ప్రాంగణంలో చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అందజేసింది. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వాహనాల పార్కింగ్పై దృష్టి.. వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో దేవస్థాన అధికారులు కొండపైకి అనుమతించే వాహనాల విషయంలో సెక్యూరిటీ, పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కుమ్మరిపాలెం నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు రోడ్డుకు ఇరువైపులా భక్తుల కార్లు, ఇతర వాహనాలను నిలుపుకొనేందుకు అనుమతినిచ్చారు. మరో వైపున కొండపైకి వచ్చే ద్విచక్ర వాహనాలను ఓం టర్నింగ్ వరకు మాత్రమే అనుమతించారు. వీఐపీల వాహనాలను ఓం టర్నింగ్ వద్ద నిలుపుదల చేసి బ్యాటరీ వాహనాలపై సమాచార కేంద్రానికి చేర్చారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ ఘాట్రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, చలివేంద్రాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సదుపాయాల కల్పనపై సూచనలు తీసుకున్నారు. -
విజయవాడ జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని పలు వార్డులను ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఆకస్మికంగా సందర్శించారు. సెలవు దినం రోజున తనిఖీలకు రావడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వార్డుల్లో ఉండాల్సిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోగులు, అటెండెంట్స్తో మాట్లాడారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. సెలవు రోజున కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, విధుల్లో అలసత్వం పనికిరాదని సూచించారు. వైద్యులు సైతం రౌండ్స్ వేయాలన్నారు. అదే సమయంలో రోగులకు పెడుతున్న డైట్ను పరిశీలించారు. ఆయన వెంట సివిల్సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ వై. పద్మావతి కూడా ఉన్నారు. విజయవాడ కల్చరల్: శాంతి, సహనం, సౌభ్రాతృత్వం ప్రపంచానికి శ్రీ రామరక్ష అని సంగీత విద్వాంసుడు డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ అన్నారు. కంచికామకోటిపీఠం, లబ్బీపేట శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన 24గంటల నాదోపాసన మహాయజ్ఞం ఆదివారం ముగిసింది. లోకనాథ శర్మ మాట్లాడుతూ 40ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో సంగీత విద్వాంసుల సహకారంతో నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ఇన్చార్జి ఆర్. రామ్మోహనరావు ఆధ్వర్యంలో లోకనాథ శర్మను సత్కరించారు. నాదయజ్ఞంలో బెంగళూరు నుంచి వచ్చిన మున్నంగి(పరమాత్ముని) వెంకట రమ్య తోపాటు చిన్నారులు వై. యమున, ఎం. శేషుబాబు, వెంకట రఘువర్మ, ప్రసాద్, మల్లాది ఆహ్లాద్, ఆముక్త, తమన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో 870 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారిని నిర్వాహకులు పట్టించుకోకపోవడం గమనార్హం. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామానికి చెందిన తుంగల తారక రామ సుమారు కిలో వెండితో చేసిన నాగపడగను ఆదివారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు స్వామివారి వెండి పడగను అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ వెస్ట్ బైపాస్లో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ఏలూరు వైపు వెళ్లే వెస్ట్ బైపాస్ రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆదివారం తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లే వాహనాలు గొల్లపూడి వై జంక్షన్, అట్కిన్సన్ స్కూల్ సెంటర్, ఊర్మిళా నగర్, కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్, పాముల కాలువ మార్గం మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కాలని సూచించారు. నగరంలోకి ప్రవేశించే వాహనదారులు సైతం ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని కోరారు. వాహనదారులు పోలీసుల సూచనలు, డైవర్షన్ బోర్డులను గమనించాలన్నారు. -
కార్మిక వైద్యం.. నామమాత్రం!
షెడ్డుల్లో ఎన్నాళ్లీ ‘తాత్కాలిక’ సేవలు?లబ్బీపేట(విజయవాడతూర్పు): గుణదలలో అధునాతన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. రెండేళ్ల కిందట శిథిలమైన భవనాలను తొలగించారు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన షెడ్డుల్లోనే ఓపీ సేవలు అందిస్తున్నారు. శిథిలమైన భవనాలు తొలగించిన స్థానంలో కొత్తగా అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించాల్సి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది ఈఎస్ఐ చందా దారులకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైనా క్లిష్టతరమైన సమస్యతో వచ్చిన వారికి ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. 5.80 లక్షల మందికి పెద్దదిక్కు.. విజయవాడలో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి నాలుగు ఉమ్మడి జిల్లాలోని సుమారు 5.8లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఆయా జిల్లాలోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. అత్యవసర వైద్యం అవసరమైన వాళ్లు నేరుగా వస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం రెండేళ్లుగా తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో నాణ్యమైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్ థియేటర్లలో సర్జికల్ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించలేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఈఎస్ఐ చందాదారులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. కలగానే సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి.. విజయవాడలో ఐదు దశాబ్దాల కిందట ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. గతంలో ఏదైనా సూపర్స్పెషాలిటీ సేవలు అవసరమైతే హైదరాబాద్ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడే అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేస్తామని దశాబ్దం కిందట నాటి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. అధునాతన వ్యాధి నిర్ధారణ పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఏదైనా సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే ప్రైవేటుకు పంపుతున్నారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు నాణ్యమైన వైద్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కావాలని పోరాటాలు చేసి సాధించుకున్న చందాదారులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది చందాదారులకు వైద్య సేవలు తాత్కాలిక భవనాల్లో అందించడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే అధునాతన భవనాలు నిర్మించి, వాటిలో సూపర్స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి తేవాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
దమ్జాయ్!
గల్లీ గల్లీలో అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్) సమూలంగా నిర్మూలిస్తాం.. ఉక్కుపాదం మోపుతాం.. అంటూ పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడకే పరిమితమైన ఈ విష‘మత్తు’ ఇప్పుడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అక్కడ సైతం గంజాయికి బానిసలైన యువత ఉంటున్నారు. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీల మొత్తంలో సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులు పట్టుకున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలు నివ్వెర పడేలా చేసింది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి పట్టుబడుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. మత్తులో యువత చిత్తు.. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొండపల్లి తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే అనుమానంతో యువతకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 25 మందికి పాజిటివ్ వచ్చింది. జగ్గయ్యపేటలో నిర్వహించిన పరీక్షల్లో 31 మందికి పాజిటివ్ వచ్చింది. అంతేకాదు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 15 మంది వరకూ పాజిటివ్ వచ్చింది. మైకంలో నేరాలు.. గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్కు బానిసలైన వారు ఉంటున్నారు. బెట్టింగ్స్కు పాల్పడే వారిలో సైతం డ్రగ్స్ బానిసలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఏదైనా నేరంలో అరెస్టు చేసిన వారికి పోలీసులు తొలుత డ్రగ్ పరీక్షలు చేయిస్తున్నారు. ఘోర వైఫల్యం.. జిల్లా స్థాయిలో డ్రగ్స్పై దండయాత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. వాటి అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేయడం, వాటి మూలాలను కూకటి వేళ్లతో పెకలించడంలో పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే గంజాయి గ్రామాలను సైతం సరఫరా అవుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా:కృష్ణా జిల్లా: గతేడాది డిసెంబర్ 26వ తేదీన పెద్ద అవుటుప ల్లి వద్ద 180 కేజీలు దొరికింది. -
సెలవుపై వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సెలవుపై వెళ్లారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వ్యక్తిగత కారణాల నిమిత్తం సెలవు పెట్టారు. తిరిగి ఆయన ఈ నెల 27వ తేదీ సోమవారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు ఇన్చార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అన్నదాన పథకానికి హైదరాబాద్ మణికొండ అల్కాపురానికి చెందిన కేపీ ఆశ కుటుంబం రూ. 1,01,116, గుంటూరు కొత్తపేటకు చెందిన ఎం. సాంబశివరావు కుటుంబం రూ. 1,01,116, కాకినాడకు చెందిన వి. సూర్యనారాయణమూర్తి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఆర్. వెంకటేష్, అరుంధతి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
కిడ్నీ వ్యాధితో మహిళ మృతి
ఎ.కొండూరు: మండల పరిధిలోని చైతన్యనగర్ తండాకు చెందిన భూక్యా తిరిపి (65)కిడ్నీ వ్యాధితో బాధపడూతూ ఆదివారం మృతి చెందారు. గత ఐదేళ్లుగా వ్యాధితో పోరాడుతున్న ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ తుదిశ్వాస విడిచారు. తిరిపి మృతిపట్ల సీపీఎం నాయకులు జెట్టి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పానెం ఆనందరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తిరిపి వైద్యం కోసం ఐదేళ్లలో రూ.5 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ఏడుగురు సంతానం ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే ఆకుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలో కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికీ కృష్ణా జలాలు సరఫరా చేయడంతో పాటు బాధితులకు ఉచిత మందులు, పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
స్కేటింగ్ పోటీల్లో పతకాలు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): తైవాన్లోని హ్సిన్చూ నగరంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు జరిగిన 2026 ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ అంతర్జాతీయ పోటీల్లో నగరానికి చెందిన చిన్నారి కె.దియశ్రీ (11) పలు విభాగాల్లో పతకాలు సాధించింది. కపుల్ డాన్స్ క్యాడెట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్, పెయిర్ స్కేటింగ్ క్యాడెట్ విభాగంలో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ సాధించడంతో పాటుగా సోలో డాన్స్ ఎస్పోయిర్ గరల్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దియశ్రీ నగరంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. స్కేటింగ్ క్రీడతో పాటుగా సాంప్రదాయ నృత్యంలో కూడా దియశ్రీ శిక్షణ పొందుతోంది. స్కేటింగ్ కోచ్ పంచాడ సత్యనారాయణ, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు స్కేటింగ్ క్రీడాకారులు దియశ్రీకి అభినందనలు తెలిపారు. చల్లపల్లి: పేలుడు ఘటనలో గాయపడి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం చల్లపల్లి ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు ఆదివారం డిశ్చార్జి అయ్యారు. గత నెల 31న చల్లపల్లి పోలీస్టేషన్లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా పెట్టెలో నుంచి కిందికి జారి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎస్ఐ దుర్గాంజనేయులుతో పాటు కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, జీపు డ్రైవర్ నాగరాజులు తీవ్రంగా గాయపడటంతో వారిని గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా చికిత్స అనంతరం 18 రోజుల తరువాత ఎస్ఐ దుర్గాంజనేయులు డిశ్చార్జి అయ్యి ఆదివారం చల్లపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరూ ఇంకా చికిత్స పొందుతున్నారు. సోమ, మంగళవారాల్లో దుర్గాంజనేయులు స్టేషన్ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. హనుమాన్జంక్షన్రూరల్: చైన్నె – కోల్కత్తా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన బాపులపాడు మండలం వీరవల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో హైవేపై గుర్తు తెలియని వృద్ధుడిని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. పటమట(విజయవాడతూర్పు): పటమట భారతీనగర్లోని పార్క్ ఐరిస్ హోటల్లో బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పటమట, టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి హైదరాబాద్కు చెందిన బుకీ డూడ్ గణేష్, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన ఆపరేటర్ పితాని ప్రసాద్ పాటు కానూరుకు చెందిన తోట శ్రీనివాసరావు, తాడిగడప డొంకరోడ్డుకు చెందిన పసుపులేటి రంగబాబును అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకుని పటమట పీఎస్కు తరలించారు. -
ఆకట్టుకున్న కళాకారుల ర్యాలీ
రెండో రోజు కొనసాగిన కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పండుగలో రెండోరోజు ఆదివారం వినూత్న రీతిలో కార్యక్రమాలు జరిగాయి. బొమ్మల ప్రదర్శన, బొమ్మల కొలువు, బొమ్మల దర్బార్ నిర్వహించా రు. బొమ్మల ఉత్పత్తి కళాకారులకు తెల్లపొనికి చెట్లు పెంపకం చేపట్టాల్సిన కార్యాచరణపై అటవీశాఖ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారులు జానపద, కూచిపూడి నృత్యాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మల ఆటలతో ఆకట్టుకున్నారు. ఏటా నిర్వహించాలి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల పండుగ ఏటా నిర్వహించేలా చూస్తామన్నారు. హస్తకళల వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మూడురోజుల పండుగ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ కళా రంగాలకు చెందిన కళాకారులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణలతో నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. -
న్యూడ్ కాల్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
తెనాలిరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనురాధ, మహమ్మద్ షహనాజ్లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్లైన్ వేదికగా ఓ యాప్లో ’స్ట్రిప్ టాక్’ పేరిట ఉన్న పోర్టల్లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడుతున్నారు. యాప్ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్ డౌన్లోడ్ చేయడంలో సహకరించిన అనురాధ కుమారుడు హేమంత్ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనురాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్ వివరాలు తెలుసుకుందని, అనురాధ, ఆమె కుమారుడు హేమంత్ సాయి యాప్ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేయడంతో హేమంత్ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనురాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని, వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనురాధకు షహనాజ్ పరిచయం కావడంతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనురాధ తిరిగి తెనాలి చేరటం, ఈ తంతు ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ చెప్పారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాలలో వాస్తవం లేదని, కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు. ఎస్ఐ నక్కా ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): సమాజ సేవ చేయాలనే భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని సిద్ధార్థ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొల్లి ప్రశాంతి చెప్పారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ను స్థానిక హోటల్లో ఆదివారం అందజేశారు. ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చదువు కోవడానికి డబ్బు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నార్త్ సౌత్ ఫౌండేషన్ వారు ప్రతి ఏడాది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందచేయడం అభినందనీయమన్నారు. గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పుట్టగుంట సతీష్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదని, సహాయం చేసే గుణం ఉంటే చాలని అన్నారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చలసాని మల్లిఖార్జునరావు, విజయవాడ చాప్టర్ కో–ఆర్డినేటర్ సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లోని 700 మంది విద్యార్థులకు ఒక కోటి 76 లక్షల రూపాయలను విలువైన స్కాలర్షిప్లను అందించామన్నారు. ఈ రోజు 50 మంది విద్యార్థులకు రూ.15 లక్షల విలువైన స్కాలర్షిప్లను అందజేశామని చెప్పారు. ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సత్తారు బాబూరావు, లయన్స్ పాస్ట్ డిస్ట్రీక్ట్ గవర్నర్ కంకణాల శ్రీనివాసరావు, ఆంధ్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతబాబు కామినేని, ఆంధ్రా లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బాలాజీ భానుతో పాటు స్కాలర్ షిప్ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆత్మలకు భూ హక్కులు
జి.కొండూరు: రెవెన్యూ అధికారుల ఒంటెత్తు పోకడ రైతులకు తలనొప్పిగా మారింది. సమగ్ర భూ రీ సర్వే పేరుతో తప్పుల తడకగా రికార్డులను తయారు చేయడంతో దశాబ్దాల క్రితం మరణించిన వ్యక్తుల ఆత్మలకు సైతం భూ హక్కులు లభించాయి. ఎవరి భూమి ఎవరి పేరు మీదకు మారిందో కూడా అర్థంకాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు తాము తాయారు చేసిన రికార్డుల ప్రకారమే పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామంటూ అధికారులు సిద్ధమయ్యారు. జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో ఉన్న భూ రికార్డుల అన్నీ తారుమారు కావడం రెవెన్యూ అధికారుల వైఫల్యానికి అద్దంపడుతోంది. తప్పుల తడకగా రికార్డులు జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామంలో 1,524 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. అందులో ప్రభుత్వ భూమి పోనూ 1,254 ఎకరాల వరకు రైతుల పేరిట పట్టా భూమి ఉంది. అయితే ఈ గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కొందరు రైతులు పాల్గొనలేదు. రీసర్వే పూర్తయిన వెంటనే ఎల్పీఎం నంబర్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎల్పీఎం నంబర్లను మూడేళ్ల వరకు ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు రూపొందించిన రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తులు, అసలు గ్రామానికే సంబంధం లేని వ్యక్తుల పేరిట భూములు ఉన్నాయి. భూమి ఉన్న రైతుకు లేనట్లు, భూమి లేని రైతుకు ఉన్నట్లు, ఒక రైతు భూమికి మరొక రైతును హక్కుదారుడిగా చూపుతూ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసర్వే జరిగిన అనంతరం ఈ రెండేళ్లలో మూడు వందలకుపైగా భూ ఖాతాల్లో భూమి క్రయవిక్రయాలు జరిగాయి. వందకుపైగా భూ ఖాతాల్లో భూ యజమానులు చనిపోగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డులను మార్చి ఇదే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ చనిపోయిన వ్యక్తుల పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు రికార్డులను తయారు చేశారు. క్రయవిక్రయాలు జరిగిన భూమికి కొనుగోలు చేసిన వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తయితే పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేసిన రెవెన్యూ అధికారులు, ఇప్పుడు భూమిని విక్రయించిన రైతుల పేర్లతోనే పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన రికార్డుల ప్రకారం భూమి కొలతల్లో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మరో వైపు క్రయవిక్రయాలు జరిగిన భూ ఖాతాల్లోనూ సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామంలో ప్రస్తుత రికార్డుల ప్రకారం 600 వరకు భూ ఖాతాలు ఉన్నాయి. 580కిపైగా భూ ఖాతాలు తప్పుల తడకగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి బహిష్కరించారు. గ్రామంలో రీ సర్వే మళ్లీ జరిపించి రికార్డులను సరి చేయాలని కోరారు. మా గ్రామంలో నాకు ఖాతా నంబరు 95లో 8.5 ఎకరాలు భూమి ఉంది. అయితే ప్రస్తుతం 7.22 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రస్తుత రికార్డుల్లో చూపుతున్నారు. అంతే మొత్తం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రీసర్వే జరిపి వాస్తవంగా ఉన్న భూమిని నా పేరున రికార్డుల్లో ఎక్కించాలి. – కాటంనేని లక్ష్మీపతిరావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం నా భర్త కనగాల వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం మరణించారు. ఆయన పేరుమీద ఉన్న 6.32 ఎకరాల భూమిని నా పేరు మీదకు బదలాయించారు. అయితే ఇప్పుడు నా పేరుతో భూ ఖాతా నంబరు 15లో 2.79 ఎకరాలను తగ్గించి 3.53 ఎకరాలు మాత్రమే ఉందని పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మిగిలిన భూమిని ఎవరికి రాశారో చెప్పాలి. – కనగాల పద్మావతి, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం -
ఫాం పాండ్పనుల పరిశీలన
పెడన: మండలంలోని మడక గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులతో చేపట్టిన కోనేటి గుంత (ఫాం పాండ్) తవ్వకం పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పది సూత్రాల కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర, నీటి భద్రత చాలా ముఖ్యమైనవన్నారు. కోనేటి గుంతల తవ్వడం, సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. పంట కాలువలు, చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెడనలో వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్, జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్కు ఐఎస్వో సర్టిఫికెట్ -
ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ముమ్మరంగా ఎన్యూమరేషన్
గుల్లలమోద(నాగాయలంక): మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల చేపల వేట నిషేధ కాల భృతి కోసం చేపట్టిన బోట్ల ఎన్యూమరేషన్ కార్యక్రమం అవనిగడ్డ నియోజకవర్గంలోని 11 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో (నాగాయలంకలో 10, కోడూరులో ఒకటి) శనివారం ముమ్మరంగా నిర్వహించారు. వివిధ బృందాలుగా ఏర్పడిన అధికారులు, సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచే నాగాయలంక, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి, జింకపాలెం, ఏసుపురం, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ, సొర్ల గొంది, పాత ఉపకాలి, పాలకాయతిప్ప (కోడూరు మండలం) సెంటర్లలో మొత్తం 1,329 మోటారు బోట్లు, 22 సంప్రదాయ నావల ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. గుడివాడ మత్స్యశాఖ ఉప సంచాలకురాలు ఎ.ఉషాకిరణ్ పర్యవేక్షణలో నావల గణన చేశారు. సంబంధిత పూర్తి వివరాల నివేదికలను జిల్లా మత్స్య శాఖ కార్యాలయానికి సమర్పిస్తామని స్థానిక ఎఫ్డీఓ వానపల్లి సత్యనారాయణ చెప్పారు. జిల్లా కార్యాలయం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎఫ్టీఐ ప్రిన్సిపాల్ వి.రమణరావు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ డి.సోమశేఖర్, ఎఫ్డీఓ నాగభద్రరావు తదితరులు సహకరించారు. వి.కొత్తపాలెం(కోడూరు): మండల పరిధిలోని వి.కొత్తపాలెం వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కె.చాణక్య శనివారం పట్టుకున్నారు. బియ్యం అక్రమ రవాణా విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా వేకనూరుకు చెందిన భోగాది కరుణకుమార్ అశోక్ లేలాండ్ ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వి.కొత్తపాలెంలోని ఆంజనేయస్వామి గుడివద్ద పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
కిడ్నాప్ కేసు సుఖాంతం
బాలుడిని తల్లికి అప్పగించిన ఎస్పీ కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాలుడు ఆచూకీ కనుగొని తల్లి చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ విద్యాసాగర్నాయుడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాదాసు సుమమ్మ ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం తన పది నెలల కుమారుడిని వెంటబెట్టుకుని విజయవాడ ఆటోనగర్కు భిక్షాటనకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఆమె వద్దకు వెళ్లి తమ వద్ద పాత బట్టలు ఉన్నాయని, వాడుకోవటానికి ఇస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. కంకిపాడు ఫ్లై ఓవర్ సమీపంలో ఆమెను దించి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమె సమీపంలోని పెనమలూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో సీఐ జేవీ రమణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సీసీ పుటేజీలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలుడి కోసం గాలించారు. 24 గంటల్లో నిందితుల్లో ఒకరైన కొమిరి కాళి (ఆటోడ్రైవర్)ను పెనమలూరులో పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో బాలుడిని కొనుగోలు చేసిన మచిలీపట్నానికి చెందిన గంజాల వెంకటనాగ శ్రీనివాసరావు, షేక్ రెహనాను అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే ఒప్పందం.. ఆటోడ్రైవర్ కాళీతో పాటు మరో నలుగురు ఇదే తరహాలో అనేక నేరాలకు పాల్పడుతూ రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పది నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు లక్షన్నరకు విక్రయించారు. గతంలో శ్రీనివాసరావు, రెహనాలు పిల్లాడి కోసం వీరిని మూడు నెలల క్రితం సంప్రదించగా నిందితులు ఈ పనికి పూనుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో చేధించిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం
ఇబ్రహీంపట్నం: కొండపల్లి బొమ్మలు, కొండపల్లి ఖిల్లా మన వారసత్వ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల పండగ (సాంస్కృతిక వారసత్వ ఉత్సవం)ను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. అనంతరం కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలు బొమ్మల స్టాళ్లను సందర్శించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో బొమ్మల పండగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల తయారీలో నైపుణ్యత, సృజనాత్మక తతో నూతన ఆవిష్కరణలు చేసే వారిలో పది మందికి వచ్చే ఏడాది ఇదే రోజున రూ.50 వేలు చొప్పున రూ.5లక్షలు బహూకరిస్తామని ప్రకటించారు. ఉదయం ఖిల్లాపైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోప్లతో ర్యాప్లింగ్ వాక్ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధికారుల వైఫల్యం వేడుకల నిర్వహణలో మునిసిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. కలెక్టర్ వేదిక ఎక్కినా ప్రజలు లేకపోవడంతో అస హనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, రీజనల్ డైరెక్టర్ వై.వి.ప్రసన్న, డీఈఓ ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. -
కాలువలు.. కడగండ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సర్కార్ తీరుతో కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో రైతులకు కడగండ్లు తప్పడం లేదు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా దానికనుగుణంగా కాలువల నిర్వహణపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదు. కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పనులకు అనుమతులు మంజూరు చేయలేదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సరాసరిన నియోజకవర్గానికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లతో అంటే దాదాపు రూ.38కోట్లతో ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పనులు త్వరితగతిన చేయకుంటే తర్వాత కాలువకు నీరు విడుదల చేస్తే పనులు చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత పనులు మంజూరైనా పనులు చేయకుండా మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం ఉంది. వర్షాలు వస్తే డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టుకు నీరు అందని దుస్థితి నెలకొంటుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అధ్వానంగా కాలువలు ప్రధానంగా చంద్రయ్య డ్రెయిన్లో పనులకు రూ.22కోట్లు, కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులకు రూ.11కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు పనులు చేయకపోతే వర్షాకాలంలో చేయలంటే ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో పూడిక తీయక పోవడంతో అధ్వానంగా మారి పంట పొలాలు మునుగుతున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలో లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి.. కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా.. కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షల – ఎకరాలు కేఈబీ 1.38 – ఏలూరు 0.56 1,332 వేల ఎకరాలు రైవస్ 2.17 425 మొత్తం 5.62 లక్షల 1,757 వేల ఎకరాలు ఎకరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, డ్రెయినేజీ విభాగం, స్పెషల్ డివిజన్లో 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లు మంజూరు చేశారు. కాలువలకు నీటి విడుదల తర్వాతే పనులు మంజూరు చేయడంతో, నీటి సంఘాల అధ్యక్షులు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై నామ మాత్రంగా పనులు చేపట్టి, మమ అనిపించారు. -
దర్గా భూములనూ వదలని టీడీపీ నేతలు
పామర్రు: టీడీపీ నేతలకు కాదేదీ ఆక్రమణలకు అన్నర్హం అన్న చందంగా పామర్రు టీడీపీ నేతల తీరు ఉన్న దని, చివరికి దర్గా భూములను కూడా వదలకుండా తమ అవసరాలకు వాడుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. స్థానికంగా చల్లపల్లి రోడ్డులో దర్గా భూములను ఆక్రమించుకుని వేసిన అక్రమ వెంచర్లను ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ చల్లపల్లి రోడ్డులోని దర్గా భూమికి అవతల పక్కన స్థానిక టీడీపీ నేత కుదరపల్లి ప్రవీణ్ తన తండ్రి పేర సర్వే నంబరు 4378లో 4.25 ఎకరాలు, గణేష్కు సంబంధించిన నాలుగు ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఇచ్చారు. కూటమి నేతల భూమికి, స్థానిక పామర్రు– చల్లపల్లి రోడ్డుకు మధ్యలో దర్గా భూమి ఉందన్నారు. ఇది వారి రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి అటంకంగా మారిందని తెలిపారు. దీంతో దర్గా భూమిలో సుమారు 50 సెంట్లను 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. దర్గా నిర్వహణ కోసం ఎవరో దాతలు ఇచ్చిన భూమిని టీడీపీ నేతలు ఏవిధంగా ఆక్రమించుకుంటారని ప్రశ్నించారు. 99 ఏళ్లకు లీజుకు తీసుకుని దానిలో రియల్ ఎస్టేట్ కోసం 40 అడుగుల రోడ్డుని వేయటం అన్యాయం కాదాని ప్రశ్నించారు. మట్టి తోలకాలతో కోట్లు గడించారు.. మండల పరిధిలో నిబంధనలకు తిలోదాలు ఇచ్చిన అడ్డగోలుగా మట్టిని తెగనమ్ముకున్న మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. నేను పామర్రులో ఓ ఇల్లు కట్టుకుంటే నాపై బురద చల్లడం నా కుటుంబ సభ్యులపై అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. కూటమినేతల తప్పులను ఎత్తి చూపటం వాటిని స్థానిక ప్రజలకు తెలియజేయటమే ఒక ప్రతిపక్ష నాయకునిగా మా పని అన్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం.. ఈ వక్ఫ్ బోర్డు భూమిని తిరిగి కూటమి నేతల వద్ద నుంచి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మూల్పూరి హరీష, నామా వెంకటేశ్వరరావు, గవాస్కరరాజు, ఎంపీపీలు డి. అశోక్కుమార్, గోగం సురేష్, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు పి.రత్నకుమారి, మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, రాజులపాటి రాఘవరావు, గోళ్ల సోమేశ్వరరావు, నాయకులు లంకపల్లి సురేష్, డి.బాల వెంకటేశ్వరరెడ్డి, సజ్జా సుబ్రమణ్యం, డీడీ ప్రసాద్, టౌన్ అధ్యక్షులు సురేష్రెడ్డి, రాఘవరెడ్డి తదితర ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికుల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు
గన్నవరం: హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో హాజ్ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హజ్ యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయలను ఆయన పర్యవేక్షించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి 335 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. వీరిలో తొలి విడతలో శనివారం 160 మంది, ఆదివారం రెండో విడతలో 175 మంది వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో హజ్ యాత్రు వెళ్తున్న వారిలో 50 శాతం మహిళలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా ఇక్కడికి చేరుకున్న సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులకు ప్రత్యేక వసతి, భోజనం, వైద్య సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ షేక్ హాసన్బాషా, కమిటీ సీఈఓ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికుల వసతి కల్పిస్తున్న ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. -
ట్రాక్టర్ బోల్తా పడి
కూలీ మృతి తాళ్లూరు(వత్సవాయి): ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో మహిళా కూలీ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ట్రాక్టర్పై వచ్చారు. మధ్యాహ్నం సమయంలో తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వేల్పుల అన్నపూర్ణమ్మ(65) అక్కడికక్కడే మరణించగా ట్రాక్టర్ డ్రైవర్ కాళ్ల మాధవరావు, బిట్రా రాధలకు గాయాలవడంతో వారిని మధిరలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర తరలించారు. -
‘కృష్ణా’ రాజకీయాల్లో నెహ్రూ ఒక బ్రాండ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) 9వ వర్ధంతిని పురస్కరించుకొని గుణదలలోని ఆయన ఘాట్ వద్ద శుక్రవారం ఆయన తనయుడు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసేవారని, నెహ్రూ వారసుడిగా అవినాష్ రాజకీయాల్లో తన ఒరవడిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ జెండా పట్టుకొని ప్రజల పక్షాన నిలిచారన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను నమ్మిన వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా నెహ్రూ చూసుకున్నారన్నారు. నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రితో సాన్నిహిత్యంగా ఉన్న వారందరూ వచ్చి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు కై లే అనిల్కుమార్, మొండితోక జగన్మోహనరావు, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాయకుడు నెహ్రూ: పేర్ని నాని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ ఉమ్మడి కృష్ణాలో ప్రజానాయకుడిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్నినాని అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)9వ వర్ధంతిని పురస్కరించుకుని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని విధాల అండగా నిలిచారని, విజయవాడ రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒకపేజీని నెహ్రూ సృష్టించుకున్నారని కొనియాడారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అలాగే మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్లో లంకా అబ్బినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి -
ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్తో అగ్ని ప్రమాదాల నివారణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అమరావతి రాజధాని ప్రాంతంలో హైరేంజ్ బిల్డింగ్స్ రానున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లానింగ్ రూపొందించనున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీపీ వెంకటరమణ చెప్పారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలోని హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటుగా తమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో త్వరలో 23 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా ఎన్నికై న వి.కాంతారావు, కార్యదర్శి వైవీ దుర్గారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ బి.ఉమామహేశ్వరరావు, ప్రాంతీయ డైరెక్టర్ శివరామకృష్ణన్, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాఖీ దీపక్తో పాటుగా సభ్యులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు. -
పేర్నినానిని కలిసిన రజక సంఘం నేతలు
పెనమలూరు: కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్నినానిని ఆ పార్టీ రజక సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మచిలీపట్నంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ రజక, బీసీ సంఘాల నేతలు పేర్ని నానిని కలిసి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు. రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టిపల్లి పూర్ణరజక, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ రజక విభాగం అధ్యక్షుడు లింగాల శోభన్బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఓలేటి అరవింద్, నాయకులు సత్తెనపల్లి శ్రీను, తాడేపల్లి సుబ్బారావు, పత్తికాయల శివ తదితరులు పాల్గొన్నారు. -
మేళాతో ప్రోత్సాహం
కళా వైభవం.. నేటి నుంచి కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ సుమారు 500 ఏళ్లకు పైగా విరాజిల్లుతోంది. అలాంటి కళా వైభవాన్ని భావితరాలకు అందించాలని కొండపల్లి బొమ్మల పండుగ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవాన్ని పుస్కరించుకొని శనివారం నుంచి 20వరకు వేడుకలకు ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న బొమ్మల మేళా కళాకారులకు చేయూతనిస్తోందనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బొమ్మల వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే బొమ్మల వేడుకలను బొమ్మల తయారీ కళాకారులతో పాటు ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం.. కొండపల్లి ఖిల్లా కోటను రెడ్డిరాజుల వంశానికి చెందిన ప్రోలాయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించే సమయంలో భవనాలపై చూడముచ్చటైన డిజైన్లు అద్దేందుకు రాజస్థాన్కు చెందిన రాజవంశీకులు ఇక్కడకు వలస వచ్చారు. రాజభవనాలపై డిజైన్(నగిషీలు)లు వేస్తూ రాజులు ఇచ్చే భరణాలతో జీవితాలు గడిపేవారు. కొందరు ఆ సమయంలోనే బొమ్మల తయారీ పరిశ్రమ కొండ కింద కొండపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం బ్రిటీష్ వారి పాలనలో బొమ్మల తయారీ పరిశ్రమను విస్తరించుకుని వారి జీవనభృతిని ఏర్పాటు చేసుకున్నారు. కొండపల్లి పరిధిలోని చుట్టుపక్కల అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలు ఇక్కడ తయారు చేసేవారు. రాజస్థాన్ కళాకారుల నుంచి ఈ ప్రాంతానికి చెందిన వారు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాల వారు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. అట్టహాసంగా ఏర్పాట్లు.. బహుమతుల ప్రదానం.. కొండపల్లి బొమ్మల తయారీలో కళాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఫిబ్రవరి 3నుంచి మార్చి 8 వరకు నిర్వహించిన బొమ్మల పోటీల్లో కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలను ఎక్స్పీరియన్స్ సెంటర్కు చేర్చారు. వేడుకలు ముగింపు రోజున న్యాయ నిర్ణేతల ప్రకటించిన విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు. సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కోసం వేడుక ఈ ఏడాది జరగడం కళాకారుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ వేడుకలతో రెట్టింపు ఉత్సాహంతో కళాకారులు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తారు. సుమారు 20ఏళ్లుగా నా కుటుంబం అత్యంత నైపుణ్యంతో బొమ్మల తయారీ పరిశ్రమ నడుపుతున్నాం. అనేక అవార్డులు కూడా వరించాయి. – కూరెళ్ల వెంకటాచారి, బొమ్మల కళాకారుడు, కొండపల్లి -
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
కంకిపాడు: పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. కంకిపాడు పోలీసుస్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసుస్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం రాత్రి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. నిర్మాణ పరమైన అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని విభాగాలకు అధునాతన వసతులు సమకూరాలని సూచించారు. పోలీసుస్టేషన్ నిర్మాణ పనుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్లను ప్రత్యేకంగా అభినందించారు. హనుమాన్జంక్షన్ రూరల్: పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పారిశ్రామికవాడలో శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యం అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ మోడల్ ఇండ్రస్టీయల్ ఎస్టేట్ను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు, చోరీల నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ మహిళా ఉద్యోగులు, కార్మికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ ఎల్.రమణ, వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ పాల్గొన్నారు. నందిగామ రూరల్: జిల్లాలో 35,945 మంది రైతులతో 42,088 ఎకరాలలో సాగు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కంచల గ్రామంలోని తత్వవనంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ముందుగా మామిడి తోటలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తర్వాత పీఎండీఎస్ (ప్రీ–మాన్ సూన్ డ్రై సోయింగ్) విత్తనాలు, విత్తన గుళికల తయారీని తెలుసుకుని ఐదు ఎకరాలలో విత్తనాలు నాటడాన్ని ప్రారంభించారు. ఆర్డీవో పోశిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ ఎక్స్అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్లాల్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హరిజవహర్లాల్ను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తులో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణపై పలు సూచనలు చేశారు. తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు ఆయన విరాళాన్ని అందజేశారు. -
హార్బర్లను ప్రైవేటుకు అప్పగించే కుట్రలను అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ విభాగం జాయింట్ సెక్రటరీ రంగారావు కంకిపాడు: జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పెనమలూరు మండలం గంగూరు చేపల కుండీల సెంటరులోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.ఝాన్సీలక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ శాప్ లీగ్స్లో భాగంగా జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్, జిల్లా క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. అండర్ 15–అండర్19 బాల బాలికలు టోర్నమెంట్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టోర్నమెంట్ ప్రారంభిస్తారని వివరించారు. చిలకలపూడి(మచిలీపట్నం): దొంగతనాలను ప్రవృత్తిగా చేసుకున్న ఆరేపల్లి దుర్గారావుపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ను అమలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 70కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న 38 సంవత్సరాల ఆరేపల్లి దుర్గారావుపై కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఈ యాక్ట్ను అమలు చేశారు. గత కొంతకాలంగా వివిధ దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతూ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్న ఈ నిందితుడిపై సమగ్ర విచారణ నిర్వహించారు. పలు కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవించినప్పటికీ తన నేర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దుర్గారావు నేర నివేదికను కలెక్టర్ డీకే బాలాజీకు పంపగా నిజనిర్ధారణ కావడంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చల్లపల్లి: క్రికెట్ బెట్టింగులు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చల్లపల్లి ఇన్చార్జి ఎస్ఐ పి.గౌతమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగులు ఆడేవారిపై, నిర్వహించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. చల్లపల్లిలోని పలు ప్రాంతాలకు చెందిన ఎస్.హుస్సేన్, కె.రాజా, ఎం.శంకర్ప్రసాద్, ఎం.బ్రహ్మం, టి.సత్యనారాయణలతోపాటు మెరకనపల్లికి చెందిన సీహెచ్ వెంకట సురేష్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.2500 నగదును, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలిపారు. -
సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు అంటూ హామీలు ఇచ్చారు. కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. నేరుగా పేదలను కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి పేదలను ఆదుకోవాలి. – కామరాజ్ హరీష్, ప్రధాన కార్యదర్శి, బీసీఎస్ఎఫ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, అర్హులు అందరికీ లబ్ధి చేకూరుస్తామని గొప్పల డప్పు కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించలేదు. పెన్షన్ వస్తూ భర్త చనిపోయిన వారికి స్పౌజ్ కేసు కింద ప్రభుత్వం పింఛనుకు అవకాశం కల్పించి చేతులు దులుపుకొంది. కొత్త పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేద్దామని వెళ్లిన వారికి రిసెప్షన్లో చేదు అనుభవం ఎదురవుతోంది. పింఛన్ మాటెత్తగానే అసలు అర్జీలు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. పక్షవాతంతోనో, ప్రమాదాల్లో, ఇతర కారణాలతో కాళ్లు పోయి మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. మందులు, ఆహారం కూడా సమకూర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు పింఛన్లు మంజూరు కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఎంతో ఆర్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2,36, 237 పెన్షన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో 2,26, 775 పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పింఛన్లలో కోత వేసింది. అమలుకు నోచని 50 ఏళ్లకే పింఛన్ హామీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈ రెండేళ్లలో యాభై ఏళ్లు దాటిన వారు సామాజిక భద్రత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా బడ్జెట్లో పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా కొత్త పింఛన్ల మంజూరు లేనట్లేనని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హాకర్లు, పేదల బాగోగులు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు దీపావళి పండుగ రోజు బీసెంట్ రోడ్డులో పర్యటించారు. దుర్గారావు అనే వ్యక్తికి పింఛన్, ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఇది జరిగి నెలలు గడస్తున్నా దుర్గారావుకు పింఛన్ మంజూరు కాలేదు. తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్ మంజూరు చేయా లంటూ అధికారుల చుట్టూ ఆనాటి ఫొటోలను చూపినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తనకు చంద్రబాబు రూపంలో కొండంత అండ దొరికిందని సంబర పడ్డానని, అయితే ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయడంలేదని, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని దుర్గారావు వాపోయారు. దుర్గారావు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టి కృషి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో గురువారం ‘పీఎం–రాహత్’ పథకం అమలు–ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలతో గాయపడే వారికి తక్షణం ఉన్నత వైద్యాన్ని అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పీఎం రాహత్ పథకం క్షతగాత్రులకు ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోగా ఉచితంగా రూ.1.5 లక్షల వైద్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 656 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలో కనీసం 1,500 ఆస్పత్రుల్లో పీఎం–రాహత్ కింద వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధంపై అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు (రోడ్డు సేఫ్టీ) నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బోస్, ఆషా అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో డిసీజ్ మానిటరింగ్ కేంద్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల సాధన కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ర్యాంకింగ్ రావడం వల్ల వైద్య కళాశాలలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రూ.6 కోట్లతో ఏర్పాటు కాబోతున్న డీఎండీసీ (డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్) కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ లాన్సెట్ వంటి అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో రాష్ట్ర వైద్యుల పరిశోధన పత్రాలు ప్రచురితం జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్, లక్ష్మీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
యనమలకుదురు ఆలయ అర్చకులకు బెయిల్
పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఈవో ఎన్.భవాని, అర్చకులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్య స్వాహా చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అర్చకులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. ఈవో ఎన్.భవాని ముందస్తు బెయిల్ తీసుకోగా మిగతా ముగ్గురు అరెస్టు కావటంతో అవనిగడ్డ జైలుకు వెళ్లారు. ఇద్దరు అర్చకులు, ఒక ఉద్యోగికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవో, అర్చకులు సస్పెన్షన్లో ఉన్నారు. విచారణ పూర్తి ఆలయంలో జరిగిన అవినీతిపై గత కొద్ది రోజులుగా ఐదుగురితో కూడిన కమిటీ చేసిన విచారణ పూర్తైంది. ఆలయంలో రికార్డులు తనిఖీ చేశారు. విచారణ నివేదికను ఎండోమెంట్ కమిషనర్కు సమర్పిస్తారు. అయితే ఆలయంలో ఆభరణాలపై భక్తుల సమక్షంలో బహిరంగ విచారణ చేయాల్సి ఉంది. స్వామివారి ఆభరణాలు ఉన్నాయా... స్వాహా చేశారా అనే విషయం తేలాలి. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఫిర్యాదు గన్నవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గురువారం స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను అనధికారికంగా రికార్డు చేయడంతో పాటు ఆడియో, వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అసభ్యకరంగా చిత్రీకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం గన్నవరం: సూరంపల్లి శివారు రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం... పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఇల్లూరి జగదీష్(27) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన జగదీష్ బుధవారం బైక్పై హనుమాన్ జంక్షన్లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి కానూరు వస్తుండగా బైపాస్ రోడ్డులో రామచంద్రపురం వద్ద టోల్గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


