breaking news
Krishna
-
AP: ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్గా గుర్తించారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్రావు, కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్ధనరావు గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. గోడౌన్లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేశారు. హోలోగ్రామ్ స్టిక్కర్లు , వందల కొద్దీ ఖాళీ బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్, కారిమిల్ను మిక్స్ చేసి నకిలీ మద్యాన్ని నిందితులు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత, ఏ1 జనార్థన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనార్ధన్ ఆఫ్రికా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. జనార్ధన్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని ఎక్సైజ్ సీఐ తెలిపారు.మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం తయారీ డంప్వద్ద బయటపడ్డ డైరీ ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్క జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
బుడమేరులోకి ఎన్టీటీపీఎస్ బూడిద నీరు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద నీటిని సమీపంలోని వేడినీటి కాలువ (బుడమేరు)లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ పరిణామాలతో బుడమేరు కాలువలో నీరు మొత్తం బూడిద రంగులోకి మారింది. నెలరోజులకు పైగా జూపూడి సమీపంలోని బూడిద చెరువులో లారీలకు బూడిద లోడింగ్ నిలిచిపోయింది. దీంతో చెరువు మొత్తం బూడిద నిల్వలతో నిండిపోయింది. ప్రత్యామ్నాయ మార్గంగా ఆర్డబ్ల్యూఎస్ పంపింగ్ స్కీమ్ సమీపంలో బుడమేరులోకి బూడిద నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణానదిలో చేరిన బూడిదతో నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఫిల్టరైజేషన్ లేని గ్రామాల్లో నేరుగా తాగునీటిని సరఫరా చేస్తే బూడిద నీటినే పంపిణీ చేయాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో బూడిద నీటిని తాగిన ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. నదిలోకి బూడిద నీటిని వదలడం నిలిపివేయాలని కోరుతున్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ(ఆర్.సి.పి.ఐ) రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకు వెళుతోందని, కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల శ్రమను యాజమాన్యాలకు దోచిపెట్టే విధంగా ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుచేసి యువతను ప్రోత్సహిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు దేవర నాగన్న మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, శివకోటి రాజు, వి.మంగ, సుగుణమ్మ, రియాజ్, అరుణ్ పాల్గొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ -
బందరు కాలువలో పడి యువకుడు గల్లంతు
పెనమలూరు: యనమలకుదురులో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి గల్లంతైన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్కు చెందిన ఉద్దగిరి లక్ష్మి తన ఇద్దరు కుమారులతో కలసి ఉంటోంది. పెద్ద కుమారుడు వెంకటేష్ (20) తాపీ పనులు చేస్తాడు. అతను శనివారం పనికి వెళ్లి సాయంత్రం వచ్చి బందరు కాలువ వంతెన వద్ద కూర్చున్నాడు. తల్లి లక్ష్మి కుమారుడు వెంకటేష్ను ఇంటికి రమ్మని చెప్పగా, వెంకటేష్ తల్లిని ఇంటికి వెళ్లమని తాను వెంటనే వస్తానన్నాడు. అయితే వంతెనపై కూర్చున్న వెంకటేష్ రాత్రి 9 గంటలకు ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి బందరు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది చూసిన స్థానికులు వెంకటేష్ తల్లి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి కాలువలో గాలించినా వెంకటేష్ ఆచూకీ తెలియలేదు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు రంగంలోకి దించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బందరు కాలువలో వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. ఇంకా ఆచూకీ తెలియలేదు. -
హైస్కూల్ ప్రహరీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్ రహదారికి అవతల వైపు ఉన్న హైస్కూల్ ప్రహరీ గోడను ఢీకొట్టి లోపలకు దూసుకు వెళ్లింది. అదృష్టవశాత్తు అవతల రోడ్లో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు న్యూగో ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ దాటిన తరువాత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర బస్ నిలిపి డ్రైవర్ టీ తాగారు. అనంతరం బస్ స్టార్ట్ చేసి ఒక వాహనం అడ్డుగా ఉండటంతో దాన్ని తప్పిస్తూ స్టీరింగ్ను కుడి వైపునకు తిప్పి మళ్లీ ఎడమ వైపునకు తిప్పుదామనుకునే లోపు అదుపు తప్పి అదే వైపునకు వెళ్లి సెంట్రల్ డివైడర్ పైకి ఎక్కి రోడ్డుకు అవతల ఉన్న శ్రీపోసాని నరసింహారావు చౌదరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ఢీకొంది. ఆ వేగానికి పాఠశాల లోపలకు కొంత మేర దూసుకుపోయింది. ఆ సమయంలో బస్లో ముగ్గురు ప్రయాణికులే ఉండటంతో వారికి గానీ, డ్రైవర్కు గానీ ఏమీ కాలేదు. జాతీయ రహదారి కావడంతో వాస్తవానికి ఆ సమయంలో గొల్లపూడి వైపు నుంచి వాహనాలు వస్తుంటాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
క్యూ కట్టిన వాహనాలు
కంచికచర్ల(నందిగామ): దసరా సందర్భంగా సొంతూరు బాట పట్టిన ప్రజలు ఆదివారం తిరుగు పయనమయ్యారు. సెలవులు పూర్తవటం, సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పని ప్రదేశాలకు వివిధ వాహనాల్లో బయలు దేరారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు బారులుదీరాయి. టోల్ప్లాజా వద్ద ఫాస్టాగ్ సిస్టం ఉన్నప్పటికీ, ప్లాజా వద్ద ఐదు లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ వాహనాలు రావటంతో ఆలస్యం అవుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 15 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయని టోల్ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. -
తీరు మారలేదే!
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. తిరువూరు మండల, పట్టణ టీడీపీ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే నిమిత్తం నెలరోజులుగా పనులు జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం శనివారం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన సమాచారాన్ని స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా పాల్గొంటారని ఎంపీ కార్యాలయం జారీ చేసిన కార్యక్రమ పత్రంలో పేర్కొంది. అయితే తన ప్రమేయం లేకుండా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే విముఖత చూపి వేరే కార్యక్రమాలు ఖరారు చేసుకున్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించడానికి వెళ్లిన నాయకులను సైతం ఎమ్మెల్యే పట్టించుకోలేదని సమాచారం. చివరికి ఎంపీ కేశినేని మాత్రమే కార్యాలయాన్ని ప్రారంభించారు. వారం రోజుల్లో తిరువూరు పట్టణంలోని వార్డుల్లో, రాజుగూడెం గ్రామంలో కూడా పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావు ఎంపీతో కలిసి కార్యక్రమాలకు హాజరవుతుండగా, ఎమ్మెల్యే గైర్హాజరుపై పార్టీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. తన ప్రమేయం లేకుండానే తిరువూరు నియోజక వర్గంలోని పలు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను కేటాయించడం కూడా ఎమ్మెల్యే అలకకు కారణంగా భావిస్తున్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయమేనా? తిరువూరులో ఆదివారం ప్రారంభించిన టీడీపీ కార్యాలయం విజయవాడ ఎంపీ కేశినేని క్యాంపు కార్యాలయంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యాలయాల్లో ఎంపీ సిబ్బంది నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. తారస్థాయికి ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే ఫైట్ టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొలికపూడి డుమ్మా -
సూర్యలంక తీరంలో ఇద్దరు గల్లంతు : కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది
బాపట్ల టౌన్: సూర్యలంక సముద్రతీరంలో స్నానాలు చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమిట్ల గ్రామానికి చెందిన బొద్దు శ్రీను, నల్గొండ జిల్లాకు చెందిన కత్తుల వినేష్లు తమ కుటుంబ సభ్యులతో ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఇరువురు నీటిలో మునిగారు. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమైన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లారు. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. తీరానికి వచ్చే పర్యాటకులు పోలీస్ సిబ్బంది ఆదేశాలను పాటించి, సముద్రస్నానాలు చేయాలని ఆయన సూచించారు. -
క్రమం తప్పకుండా మందులు వాడాలి..
మధుమేహులు దుష్పలితాలు రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. చాలా మంది ఒకసారి వైద్యుడు రాసిన మందులనే నెలల పాటు వాడుతుంటారు. అది మంచిది కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సుగర్లెవల్స్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మందులు పనితీరు తెలుసుకోవచ్చు. అవసరమైతే వైద్యులు మందులు మార్చడం, డోసు పెంచడం, తగ్గించడం చేస్తారు. సక్రమంగా మందులు వాడటం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్ బారిన పడకుండా చూడవచ్చు. – డాక్టర్ ఎం. శ్రీకాంత్, మధుమేహ నిపుణుడు -
పత్తి రైతు చిత్తు
●అధిక వర్షాలతో రంగు మారుతున్న పత్తి పైరు ● పూత రాలిపోయి కాపు లేక వెలవెలబోతున్న వైనం ● క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో తీవ్రంగా నష్టం ● పెట్టుబడులు కూడా రాని వైనం ఈ ఏడాది పత్తి పంట ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడులు కూడా రావు. వర్షాలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. పెరిగిన పెట్టుబడులు, కౌలుతో పత్తి రైతుకు నష్టం తప్పదు. – ఎన్.లక్ష్మీనారాయణ, మక్కపేట, వత్సవాయి మండలం వ్యవసాయాధికారులు గ్రామాలలో పర్యటించి నష్టపోయిన పత్తి పంటను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించాలి. వ్యవసాయశాఖ నివేదిక మేరకు నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలి. – కనగాల రమేష్, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వత్సవాయి/జి.కొండూరు: ఈ ఏడాది పత్తి పంట రైతులను చిత్తు చేసింది. అధిక వర్షాలకు గిడసబారి పత్తి కాయ పగిలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షాలు పడుతుండడంతో పూత రాలిపోయి, కాయలు మచ్చలు వచ్చి రాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. నష్టాల్లో ఆదుకునే క్రాప్ ఇన్సూరెన్స్ సైతం ప్రభుత్వం తొలగించడంతో నష్టాలను పూడ్చుకునే మార్గం కనిపించక పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. భారీగా పెరిగిన పెట్టుబడులు... గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు ధర రూ.20 వేల వరకు ఉండగా, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతుంది. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.7 వేలు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. లేనిపక్షంలో నష్టాలు తప్పవు. మొక్కజొన్న సాగుపై ఆశ... పత్తి పంట దెబ్బతినడంతో రెండవ పంటగా రైతులు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకుంటున్నారు. తీతకు వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండవ పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేల పైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ఈ సీజన్ కూడా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. -
ఎయిర్పోర్ట్కు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే
గన్నవరం: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ఆమరావతి పర్యటన నిమిత్తం ఆయన తిరుపతి నుంచి సాయంత్రం ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో అథవాలేకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జె.రంగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉప సంచాలకులు ఎం.రమాదేవి తదితరులు స్వాగతం పలికారు. ● నవంబర్ 8,9 తేదీల్లో నరసరావుపేటలో నిర్వహణ ● వెల్లడించిన పల్నాడు జిల్లా బాలోత్సవ్ కమిటీ సభ్యులు నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావు పేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆవరణలో నవంబరు 8,9 తేదీల్లో ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. గౌరవ సలహాదారుడు, శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.అంజిరెడ్డి, గౌస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనేలా రూపకల్పన చేసి తమ కళలను ఆవిష్కరింప చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనదలచిన ఉపాధ్యాయులు ఈనెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 98665 62260, 99498 09821 నంబర్లలో లేదా palnadubalotsavam @gmail. com మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు. -
సుగర్ అదుపులో లేకుంటే ముప్పే..
ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్స్ట్రోక్కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తోంది. రక్తనాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మెదడు రక్తప్రసరణపై ప్రభావం చూపుతాయి. మధు మేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొలెస్ట్రాల్, రక్తం పలుచబడే మందులు కూడా వైద్యుల సూచన మేరకు వాడాలి. సక్రమంగా మందులు వాడటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా స్ట్రోక్ రాకుండా చూడవచ్చు. – డాక్టర్ డి. అనీల్కుమార్ న్యూరాలజిస్ట్ ● -
ఒక్క రోజులో బెజవాడ రైల్వే డివిజన్కు రూ.5 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఒకేరోజు అత్యధిక మంది ప్రయాణికుల నిర్వహణ, ఆదాయంలో విజయవాడ డివిజన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈనెల 4న విజయవాడ డివిజన్ నుంచి ఇతర ప్రాంతాలకు 2.8 లక్షల మంది ప్రయాణికుల రవాణా ద్వారా రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. ఇది కేవలం ఒక్కరోజులో డివిజన్ సాధించిన సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ డివిజన్కు వచ్చే ప్రయాణికులతో కలుపుకొని మొత్తం 5.5 లక్షల మంది ఒక్క రోజు ప్రయాణం చేశారు. అందులో విజయవాడ స్టేషన్ నుంచి 82 లక్షల మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం ద్వారా రూ.2 కోట్లు ఆదాయం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ స్టేషన్లో దిగిన వారితో కలుపుకొని 1.7 లక్షల మంది ప్రయాణికులుగా నమోదైంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదలను సమర్థంగా నిర్వహించడానికి డివిజన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో అదనంగా 25 బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లను ప్రారంభించారు. 72 ఏటీవీఎం (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు) ఏర్పాటు, ప్రయాణికులకు సహాయం చేసేందుకు 110 ఏటీవీఎం ఫెసిలిటేటర్లను 24 గంటలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా అరుదైన రికార్డు సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
లైంగిక వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
కొమరవోలు(పామర్రు): లైంగిక వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం, కొమరవోలులో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేడపాటి ప్రవీణ్ రాజు, వసంత(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న మెరుగుమాల పవన్ రోజూ వసంతను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతూ.. రెండు రోజుల నుంచి లైంగికంగా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. శనివారం రాత్రి బాధితురాలి వద్ద పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తనను పవన్ నిత్యం లైంగికంగా వేధించడం వల్లే విషద్రావణం తాగానని చెప్పిందని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతదేహాన్ని పామర్రు–గుడివాడ జాతీయ రహదారిపై ఉంచి కుటుంబీకులు శనివారం రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ఆటో పల్టీ ఎనిమిది మందికి గాయాలు
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు భవానీమాల ధరించారు. మరో ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇద్దరు మాలధారులు దీక్ష విరమించిన అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్ములూరు టోల్ప్లాజా సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది రోడ్డుపై పడటంతో స్వల్పంగా గ్రాయపడ్డారు. వారిని ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
చేపల వేటకు వెళ్లి వృద్ధుడి దుర్మరణం
అవనిగడ్డ: మండలంలోని పులిగడ్డ పల్లెపాలెం గ్రామానికి చెందిన సింగోతు నాగూర్(60) శుక్రవారం చేపల వేట నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. స్థానిక లూప్ చానల్ వద్ద నాగూర్ మృతదేహం పంట కాలువలో పైకి తేలింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్ఐ కె.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని సందర్శించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సింగోతు నాగూర్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో సందర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పెన్షనర్లకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వేశాఖ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ పాల సుకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వేబ్రాంచ్, స్టేషన్ రోడ్డు బ్రాంచ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు లాకులు సమీపంలోని ఓ హోటల్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఆయుష్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొని పెద్ద సంఖ్యలో హాజరైన పెన్షనర్లకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వే, స్టేషన్ రోడ్డు బ్రాంచ్ల మేనేజర్లులు సుకుమార్, కోమల్ దాసరి మాట్లాడుతూ.. పెన్షనర్ల ఆరోగ్యం, ఆర్థిక భరోసాకు ఎస్బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెన్షనర్ల కోసం గతంలో లేని విధంగా 78 ఏళ్లు వరకు కూడా వారి పెన్షన్పై రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వారికి రూ.30 లక్షల ఉచిత ప్రమాదా బీమా పథకం కూడా అందుబాటులో ఉందని వివరించారు. పెన్షనర్లు ఈ సదుపాయాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, పెన్షనర్ల సంఘ నాయకులు, పెన్షనర్లు, ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక గురుకుల (మైనార్టీ బాలికల) పాఠశాలను తరలించా లని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర (బొద్దనపల్లి) గ్రామంలో పొలాల మధ్యలో ఉన్న పాత కాలేజీ భవనంలోకి తరలించాలని ఏపీఆర్ సూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య గత నెల ఐదో తేదీన ఉత్వర్వులు ఇచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏపీఆర్ స్కూల్స్ ఉన్నతాధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ గుట్టు చప్పుడు కాకుండా, విద్యార్థినుల తల్లిదండ్రులకు ముందస్తు సమా చారం ఇవ్వకుండా పాఠశాలను తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గత నెల 25వ తేదీ నుంచి స్కూల్ పేరెంట్స్ కమిటీ, పిల్లల తల్లిదండ్రులకు విషయం తెలిసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు గత నెల 28న పాఠశాల వద్దకు వచ్చి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. పాఠశాలను ఇప్పటికిప్పుడు తరలించొద్దని సంబంధిత అధికారులను కోరారు. అదే రోజు సాయంత్రం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ కూడా పేరెంట్స్తో మాట్లాడి సమస్య తెలుసు కుని పరిష్కరిస్తామని, భయపడవద్దని హామీ ఇచ్చారు. అయినా పాఠశాల తరలింపుపై నేటి వరకు సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే గురుకుల పాఠశాల గోడలకు పాఠశాలను బొద్దనపల్లికి మారుస్తున్నామంటూ పాఠశాల భవనం ఫొటోలను శుక్రవారం అంటించడం గమనార్హం. విద్యాసంవత్సరం మధ్యలో వద్దు గురుకుల పాఠశాల తరలింపుపై తమకు అభ్యంతరం లేదని, అయితే ఎన్టీఆర్ జిల్లాలోనే రవాణా వసతి, సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి తరలించా లని విద్యార్థుల తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి వారు రోజూ భవానీపురంలోని పాఠశాల వద్దకు వచ్చి, విద్యా సంవత్సరం పాఠశాలను తరలించడం అన్యాయమని వాపోతున్నారు. కనీసం ఈ విద్యాసంవత్సరం ముగిశాక పాఠశాలన తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడుతున్నారు. తమకు ఇష్టమైతే వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో పిల్లలను కొనసాగిస్తామని, లేకపోతే టీసీలు తీసుకుని వేరే పాఠశాలలో చేర్పిస్తామని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడున్న పాఠశాలకు కూతవేటు దూరంలో గొల్లపూడి పరిధిలోని హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్న భవనాన్ని ఇదే అద్దె ప్రాతిపదికపై తాము ప్రిన్సిపాల్కు చూపించామని, అక్కడికి తరలించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచించి, విద్యా సంవత్సరం పూర్తయిన తరువాత మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలపై బాధ్యత ఏదీ? పాఠశాల నగరంలో ఉంది కదా అని ఆడపిల్లలను ఇక్కడ చేర్పిస్తే, ఎటువంటి రక్షణ, భద్రత లేని మారుమూల పల్లెకు తీసుకెళ్తే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు జరగరానిదేదైనా జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించి మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైన కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ధైర్యంతో తమ కుమార్తెలను పొలాల మధ్య ఉన్న భవనంలోకి పంపగలమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లలో స్పందన లేదని వాపోతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వ నిర్ణయమని తప్పించుకోవడంపై మండిపడుతున్నారు. బాలికల మంచి కోసమే.. గురుకుల పాఠశాల తరలింపుపై ఏపీఆర్ స్కూల్స్ ఆంధ్ర, రాయలసీమ రీజియన్ల డెప్యూటీ సెక్రటరీలు సురేష్ బాబు, ఉబేదుల్లా (ఆర్డీ సీలు)ను వివరణ కోరగా.. గురుకుల పాఠశాల అంటేనే పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. బాలికల మంచి కోసమే ఈదర గ్రామానికి పాఠశాలను తరలిస్తున్నామని, పిల్లలకు అక్కడ అలవాటయితే ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. -
మునేరులో గల్లంతయిన కీర్తన మృతి
కంచికచర్ల: మండలంలోని వేములపల్లి గ్రామం వద్ద శుక్రవారం నాయనమ్మతో కలసి దుస్తులు ఉతికేందుకు వెళ్లి మునేరులో గల్లంతైన బాలిక మృతిచెందింది. మునేరులో గల్లంతయిన ఉప్పెల్లి కీర్తన (10) ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు శనివారం ఉదయం ఆరు గంటలకు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో కీర్తన మృతదేహం లభించింది. నాటు పడవ సాయంతో కీర్తన మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన తల్లి మరియమ్మ, నాయనమ్మ గుండెలవిసేలా రోదించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్ముడుదుర్రు గ్రామానికి చెందిన కీర్తన రెండో తరగతి చదువుతోంది. దసరా సెలవులను ఆదనందంగా గడిపేందుకు నాయనమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం కీర్తన నాయనమ్మ రమణతో కలసి దుస్తులు ఉతికేందుకు మునేరు వద్దకు వెళ్లింది. నీటిలో దిగి గల్లంతయిన కీర్తన శవమై కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు. మునేరులో అక్రమ తవ్వకాలే కారణం కూటమి నాయకులు వేములపల్లి వద్ద మునేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపటం వల్లే అక్కడక్కడా లోతు ఎక్కువగా ఉందని, ఇసుక తవ్విన గోతిలో పడి కీర్తన మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మునేరులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినా రెవెన్యూ, మైనింగ్, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మునేరులో అక్రమ తవ్వకాలు జరపకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పనులను వేగవంతం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సంబంధిత మునిసిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, పెడన పట్టణ ప్రాంతాల్లో పది ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు మచిలీపట్నం, ఉయ్యూరు, పెడనలో ఒక్కొక్క ఆరోగ్య కేంద్రమే పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, గుడివాడలో టెండర్ల ప్రక్రియలోనే ఉందని వివరించారు. మచిలీపట్నం నారాయణపురంలో స్థలం త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. తాడిగడప మునిసిపాలిటీలో కానూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. అమాత్ 2.0 పథకం కింద మచిలీపట్నం, గుడివాడ, పెడన, తాడిగడప మునిసిపాలిటీల్లో రూ.181.31 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తాగునీటి పైపులతో కలవకుండా చూడాలని, లీకేజీ ఉండకుండా కాంట్రాక్టర్లు వాటిని సరిగా నిర్మిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని సూచించారు. మచిలీపట్నంలో ఇంకా మిగిలిపోయిన 30 వేల టన్నుల వ్యర్థాల చెత్త బుట్టలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెడన మునిసిపాలిటీలో పది రోజుల్లో పూర్తిగా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను తొలగించిన ప్రదేశం ఆక్రమణకు గురికాకుండా నిఘా ఉంచి పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహరరావు, నజీర్, రామారావు, ప్రజారోగ్యశాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
ఉయ్యూరు: ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల ఆఽవరణలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 17వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో క్యాడెట్లకు బంకర్ బ్లాస్టింగ్, ఫీల్డ్ క్రా్ఫ్ట్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ట్, ఫైరింగ్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. 619 మంది క్యాడెట్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెప్ట్నెంట్ కల్నల్ జీసీ పాండే క్యాడెట్లకు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆపరేషన్ సింధూర్, జవాన్ల పాత్రపై అవగాహన కల్పించారు. -
● సప్త వర్ణ శోభితం
ప్రకృతి రమణీయమైనది. సాయంసంధ్య వేళల్లో ప్రకృతి అందాలను చూస్తే ఎవరైనా సరే మైమరచిపోవలసిందే. నగర జీవి బిజీ బతుకుల్లో పట్టించుకోవడం లేదు కాని...కాస్త తీరిక చేసుకుని ప్రకృతి వైపు ఓసారి కన్నేసి తిలకిస్తే అలసి సొలసిన మనసుకు ఆహ్లాదంతో పాటు మానసిక ప్రశాంతత లభించడం ఖాయం. శనివారం విజయవాడ కరకట్ట శివారులో సూర్యాస్తమ సమయాన కనిపించిన ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇబ్రహీంపట్నం: పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ షరీఫ్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌసే ఆజం చిహ్నమైన జెండాను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ ఊరేగింపు చేశారు. పండగ సందర్భంగా ఈనెల 10వ తేదీన మసీదు వద్ద భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా తెలిపారు. కార్యక్రమంలో మసీదు కమిటీ కోశాధికారి కరీముల్లా, హసన్ అహ్మద్, షేక్ దావూద్, షేక్ గోరే, అలీఖాన్, కరిముల్లా ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు -
రెడ్క్రాస్ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) కృష్ణా జిల్లా శాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఐఆర్సీఎస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీకి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ను చైర్మన్గా, సిర్విశెట్టి భాస్కర్ను వైస్ చైర్మన్గా, దాసరి రామకృష్ణ, వి.సుందర్ రామ్, జి.మెహర్ ప్రసాద్, పి.సుకుమార్, ఎన్.లీలా బ్రహ్మేంద్ర, బి.శివ విష్ణువర్ధన్, టి.వీరేంద్రనాథ్, బి.వెంకటేశ్వరరావు, బి.శంకర్నాథ్, పి.రాంప్రసాద్ సభ్యులుగా, డాక్టర్ ఎం.సూర్యశేఖర్, డాక్టర్ ఎస్.శర్మిష్ఠ, పి.వెంకట సుబ్బారావు, జె.బాబూరావులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ అబ్జర్వర్ రామచంద్ర రాజు, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, రెడ్ క్రాస్ ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, జీవిత సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
స్థిరంగా సాగుతున్న వరద ప్రవాహం
కంకిపాడు: ఏటిపాయలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం వరద తగ్గుముఖం పట్టినా ప్రవాహం అలాగే ఉంది. ప్రస్తుతం మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద ఏటిపాయ అంచులు తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. ఏటిపాయలోని లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తున్నారు. పడవలపై పొలాలకు వెళ్లి పొలం పనులు పూర్తి చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఏటిపాయ లో కొనసాగుతున్న వరద ఉధృతికి పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధిలోని ఏటిపాయ వెంబడి లంక భూముల్లోకి చేరిన వరదనీరు ఇంకా పొలాల్లోనే ఉండిపోయింది. ప్రవాహం కొనసాగుతున్న కారణంగా పొలాల్లో ఉన్న వరదనీరు ఏటిపాయకు మళ్లటం లేదు. దీంతో పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి అందుతాయో? లేదో? అన్న భయం రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రికి కొనసాగుతున్న భవానీల రద్దీ జగ్గయ్యపేట అర్బన్: కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి శనివారం జగ్గయ్యపేట సబ్ జైలును సందర్శించారు. వసతి సౌకర్యాలు, ఆహారం, భద్రత తదితర అంశాలను పరిశీలించారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల అనంతరం భవానీల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా రికార్డు స్థాయిలో భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీక్షతో ఇరుముడులను ధరించి ఇంద్ర కీలాద్రికి తరలివచ్చిన భవానీల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహా మండపం గ్రౌండ్ఫ్లోర్లో ఇరుముడి సమర్పణ కౌంటర్లు ఏర్పాటు చేసింది. కిటకిటలాడిన క్యూలైన్లు వినాయకుడి గుడి క్యూలైన్లతో పాటు కుమ్మరిపాలెం క్యూలైన్లు భవానీ భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ నేపథ్యంలో అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేసిన దేవస్థానం రూ.100, రూ.300 క్యూలైన్లలో సైతం ఉచిత దర్శనానికి అనుమతించారు. ఆదివారం కూడా భవానీల రద్దీ కొనసాగే అవకాశం ఉందని, అందువలన ఆదివారం కూడా వీఐపీ, సిఫార్సులపై వచ్చే వారికి ఎటువంటి ప్రత్యేక దర్శనాలు కల్పించలేమని ఆలయ అధికారులు ప్రకటించారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచే భవానీలు, భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉదయం 8 గంటల వరకు భవానీల తాకిడి అధికంగా కనిపించింది. భవానీల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు మినహా ఇతర మార్గాల నుంచి భక్తులు, భవానీలెవరినీ కొండపైకి అనుమతించలేదు. 9 గంటల తర్వాత కొంత మేర రద్దీ సాధారణంగా కనిపించినా, మధ్యాహ్నం తర్వాత మళ్లీ పెరిగింది. ఆదివారం సాయంత్రం నాటికి రద్దీ సాధారణ స్థితికి వస్తుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు శనివారం నుంచి రిలీవ్ అవుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఎరుపెక్కిన స్నానఘాట్లు, కెనాల్రోడ్డు అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భవానీలతో దుర్గగుడి పరిసరాలు ఎరుపెక్కాయి. ముఖ్యంగా స్నానఘాట్తో పాటు అమ్మవారి ఆలయానికి చేరుకునే క్యూలైన్ మార్గాలు, కొండ దిగువన అన్న ప్రసాద వితరణ కేంద్రం, లడ్డూ ప్రసాద కౌంటర్లు, కెనాల్రోడ్డులో ఎక్కడ చూసినా భవానీలే దర్శనమిస్తున్నారు. భవానీల రాకతో కెనాల్రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్, బీఆర్టీఎస్ రోడ్డులో సందడి వాతావరణం కనిపించింది. దసరా ఉత్సవాల అనంతరం భవానీల రద్దీ కొనసాగుతుండటంతో లడ్డూ కొరత ఏర్పడింది. ఈ దసరా ఉత్సవాలలో శనివారం నాటికి 40 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం సిబ్బంది భక్తులు, భవానీలకు అందించారు. రోజుకు సుమారు 2 లక్షల లడ్డూలను మూడు పోటులలో తయారు చేస్తుండగా, తయారు చేసిన లడ్డూలను తయారు చేసినట్లే కౌంటర్లకు పంపు తున్నారు. భవానీల నుంచి లడ్డూలకు అధిక డిమాండ్ వస్తుండటంతో భక్తులందరికీ లడ్డూలను అందించాలనే భావనతో ఒక్కొక్కరికి ఆరు లడ్డూలు ఉన్న ఒక బాక్స్ను మాత్రమే ఇస్తున్నారు. దీంతో భవానీల వెంట వచ్చిన సాధారణ భక్తులు సైతం లడ్డూల కోసం క్యూలైన్లోకి విచ్చేస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే లడ్డూల కోసం భవానీలు, భక్తులు క్యూలైన్లో వేచి ఉండటం కనిపించింది. -
అధికం... అనర్థమే!
సమస్యలు ఇలా... లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమిలా.. అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి. – డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలకు తూట్లు పొడిచారంటూ చంద్రబాబు, పవన్, లోకేష్లపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలిపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చారు.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు.. ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగారు.మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది?. ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల ప్రమాద బీమా చేస్తామన్నారు, చేశారా?. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారా?. ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు.చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండని చంద్రబాబు చెప్పాడు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తామన్నారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారు. వైఎస్ జగన్, ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారు.చంద్రబాబు దెబ్బకు ఆటోవాళ్లంతా రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగం చేసిన చంద్రబాబు, పవన్ను నిలదీశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు వేశామని చంద్రబాబు చెబుతున్నాడు. భూ ప్రపంచం మీద తనే ఆటో డ్రైవర్లను ఆదుకున్నానని బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు స్పీచ్ దెబ్బకు ఆటో డ్రైవర్లకు చెవుల వెంట రక్తం ఒక్కటే తక్కువ. ఆటో వాళ్ల కోసం యాప్ పెడతా.. కంట్రోల్ రూమ్ పెడతానంటున్నాడు. ఆటో, క్యాబ్, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు తీరు సినిమాలో బ్రహ్మానందం క్యామెడీ సీన్లా ఉంది...వాహనమిత్ర పథకం ప్రారంభించింది వైఎస్ జగన్. పాదయాత్రలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ల సమస్యలు స్వయంగా విన్నారు. తమకు ఏడాదికి పది వేలైనా ఇవ్వమని ఆటో డ్రైవర్లు అడిగారు. సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటున్న వారికి 10 వేలు ఇస్తామని ఏలూరు వేదికగా ప్రకటించారు. జగన్ సీఎం అయిన వెంటనే 2 లక్షల 36 వేల మందికి వాహనమిత్ర ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కూడా వైఎస్ జగన్ 2 లక్షల 75 వేల మందికి వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు కేవలం 14 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం చాలా చెప్పాడు..డ్రైవర్లను ఓనర్లు చేసేస్తామన్నాడు. బ్యాడ్జి కలిగిన ప్రతీ ఆటో, ట్యాక్సి డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15 వేలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పినట్లు ప్రతి డ్రైవర్కి రూ.15 వేలు ఇచ్చారా?. ఏ ఒక్క ఆటో డ్రైవర్కైనా 4 లక్షల రుణం ఇప్పించారా? ఆటో డ్రైవర్లకు బీమా కల్పించారా?. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు .. చేశారా?. చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?. 15 వేలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెడతారా?. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని లోకేష్ యువగళంలో చెప్పారు. ఈ రెండేళ్లలో లైసెన్సులున్న వాళ్లు పెరగరా?బ్యాడ్జి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఈ రోజు మోసం.. దగా చేసి పండుగ చేసుకోమంటున్నారు. వైఎస్ జగన్ ఒక్క షరతు కూడా పెట్టకుండా వాహనమిత్ర ఇచ్చారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ మీ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు?. ఇప్పుడు ఏం చేశారు?. ఈ రోజు జరిగింది ఆటో డ్రైవర్ల సేవ కాదు.. దగా. మీ మామ ఎన్టీఆర్కు ఏం చేశారో.. ఆటో డ్రైవర్లకు కూడా అదే చేశారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.రోడ్లన్నీ వేసేశామంటున్న చంద్రబాబుకు ఇదే నా సవాల్. ఆటో ఎక్కి రండి.. బందరు వస్తారా..? అవనిగడ్డ వస్తారా?. కైకలూరు వస్తారా?. గుడివాడ వస్తారా?. ఆటోలో రండి గోతులున్న రోడ్లు మీకు చూపిస్తాం. ఆటోలో ప్రయాణించిన మీరు బందరు ఆసుపత్రిలో చేరడం ఖాయం. లోకేష్ సిగ్గు లేకుండా మహిళా ఆటోడ్రైవర్లతో బూతులు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆటో డ్రైవర్లందరినీ వంచన చేశారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న విజయవాడలో సభతో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పాదయాత్ర ముగియనుంది. ఏపీలో రోజురోజుకీ రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతోందని చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.తమ భూమి ఉంటుందో ఊడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందంటూ శోభనాద్రీశ్వరరావు దుయ్యబట్టారు. లక్షలాది ఎకరాలు నయా జమీందారులకు కట్టబెడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలుకి అప్పగించారు. రూ. 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక చిదంబర రహస్యం ఏంటి?. లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఆంధ్రా ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని మహాదేవ్ అన్నారు. అక్టోబర్ 8న ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస నుంచి ప్రారంభం ప్రారంభం కానుందని.. ప్రతీ చోటా హ్యూమన్ రైట్స్కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని మహాదేవ్ వెల్లడించారు. -
బోర్డు నియామకం.. వివాదాస్పదం
● దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్గా రేపూడికి చెందిన తరిగొప్పల పార్వతి ● కోడలి హత్య కేసులో కొడుకు, భర్తతో కలిసి జైలుకెళ్లొచ్చిన పార్వతి ● నిందితులకు పదవులు ఎలా ఇస్తారంటూ మృతురాలి తల్లిదండ్రుల ఆగ్రహం జి.కొండూరు: ప్రఖ్యాతిగాంచిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి బోర్డు నియామకం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా చిన్న చిన్న దేవాలయాల కమిటీల నియామకంలోనే జాగ్రత్తలు పాటించే తరుణంలో కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి ఏర్పాటులో హత్య కేసు నిందితులకు చోటు కల్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడలి హత్య కేసులో భర్త, కొడుకుతో కలిసి జైలుకెళ్లి వచ్చిన మహిళకు బోర్డు డైరెక్టర్ పదవి కట్టబెట్టడంపై బాధిత కుటుంబంతో పాటు సొంత పార్టీ నేతలు, దుర్గమ్మ భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హత్య కేసు నిందితురాలు డైరెక్టరా? ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండల పరిధి రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల పార్వతిని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి బోర్డులో డైరెక్టర్గా నియమించారు. అయితే తరిగొప్పల పార్వతి ఆమె భర్త తరిగొప్పల హుస్సేన్, కొడుకు సీతారామరాజు 2022లో ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చారు. వివరాలలోకి వెళ్తే.. తిరువూరుకు చెందిన వేముల గుర్నాథం, వేముల భాగ్యలక్ష్మి కుమార్తె వేముల అభినవ్య(20)ని ఏ.కొండూరు మండల పరిధి రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల పార్వతి, హుస్సేన్ల కుమారుడు సీతారామారాజుకి ఇచ్చి ఆగస్టు 13వ తేదీ, 2020లో వివాహం జరిపించారు. అయితే సీతారామారాజు అనకాపల్లిలో నివాసం ఉంటూ తునిలోని ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో వివాహం అయిన తర్వాత భార్య అభినవ్యను కూడా తన వెంట తీసుకెళ్లి అనకాపల్లిలో ఉంచాడు. అయితే అక్టోబర్ 10, 2022లో అభినవ్య హత్యకు గురైంది. అప్పటికే కొంతకాలంగా వరకట్నం కోసం అభినవ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉండడంతో అభినవ్య మామ తరిగొప్పల హుస్సేన్, అత్త పార్వతి, భర్త సీతారామారాజులు కలిసి హత్య చేశారని అభినవ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏ1గా సీతారామారాజు, ఏ2గా హుస్సేన్, ఏ3గా పార్వతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 90 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. డబ్బులతో రాజీ చేసేందుకు ప్రయత్నాలు.. కోడలి హత్య కేసులో నిందితులుగా ఉన్న తరిగొప్పల పార్వతి, ఆమె భర్త హుస్సేన్లు కేసు నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులకు డబ్బులు ఇస్తామంటూ బేరసారాలు మొదలు పెట్టారని సమాచారం. నిందితులు ఇస్తామంటున్న డబ్బుకు బాధిత కుటుంబ సభ్యులు లొంగకపోవడంతో పాటు నిందితురాలికి పదవి ఇవ్వడంపై మీడియా మందుకు వచ్చి తమ గోడును వినిపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని క్రూరంగా కొట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కోడలిని హత్య చేసి జైలుకెళ్లిన పార్వతికి దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్ పదవి ఇవ్వడం అంటే మా కూతురి ఆత్మ క్షోభిస్తుంది. ఆ కేసులో ఇంకా తీర్పు రాలేదు. ఇటువంటి సమయంలో నేరస్తురాలికి ప్రముఖ దుర్గగుడి లో పాల మండలి డైరెక్టర్ పదవి ఇవ్వడం అంటే ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతుంది. పార్వతిని డైరెక్టర్ పదవి నుంచి వెంటనే తొలగిస్తే మా కూతురు ఆత్మ శాంతిస్తుంది. – వేముల గుర్నాథం, భాగ్యలక్ష్మి, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా -
సెలవులకొచ్చి మునేరులో పడి గల్లంతు!
వేములపల్లి(కంచికచర్ల): దసరా సెలవుల్లో నాయనమ్మ, ఇతర బంధువులతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మునేటిలో పడి గల్లంతయిన ఘటన కంచికచర్ల మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి ముసలయ్య అలియాస్ వెంకట్రావు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముసలయ్య మరణానంతరం అతని భార్య మరియమ్మ తన ఇద్దరు పిల్లలతో పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో నివాసముంటోంది. పెద్ద కుమార్తె కీర్తన(10) నాల్గవ తరగతి చదువుతోంది. రెండవ కుమార్తె సుసన్న అలియాస్ ప్రియదర్శిని రెండవ తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావటంతో తల్లి మరియమ్మ తన పెద్ద కుమార్తెను వేములపల్లి గ్రామంలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంచి గుమ్మడిదుర్రు గ్రామానికి తిరిగి వెళ్లింది. దుస్తులు ఉతికేందుకు శుక్రవారం నాయనమ్మ రమణమ్మతో కలసి మునేరుకు వెళ్లిన కీర్తన ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయింది. రమణమ్మ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మునేరులో వెతికారు. అయినా కీర్తన ఆచూకీ తెలియలేదు. చీకటి పడటంతో వెతుకులాట ఆపారు. రెవెన్యూ, పోలీసు అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు వేములపల్లి గ్రామంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ఉదయం 11 గంటలకు మునేరులో గల్లంతయినా రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, లేదా ఎస్టీఆర్ఎఫ్ బృందానికి తెలియజేయకపోవటంతో వారు వెతికేందుకు గ్రామానికి రాలేదని, ఇందుకు పూర్తిగా రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. -
దుర్గమ్మ రాకతో పులకించిన కృష్ణాతీరం
హంసవాహన సేవ కోసం ఆది దంపతులు దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ప్రారంభమవగా.. ఆలయ అధికారులు ఆదిదంపతుల పల్లకీకి భుజం పట్టగా, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల కోలాట నృత్యాల మధ్య దుర్గాఘాట్కు బయలుదేరింది. దుర్గాఘాట్కు చేరుకున్న ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో హాంస వాహనంపైకి కేవలం 25 మందిని మాత్రమే అనుమతించారు. అనంతరం హంసవాహనంపై అధిష్టించిన ఆదిదంపతులను త్రిలోక సంచారానికి గుర్తుగా మూడు పర్యాయాలు హంస వాహనాన్ని ముందుకు వెనక్కి నడిపించారు. -
హమ్మయ్య.. దసరా ముగిసింది!
వన్టౌన్(విజయవాడపశ్చిమ)/లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది. గత నెల 22 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు కొనసాగాయి. కొనసాగుతున్న భవానీల రాక దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో చాలా మంది భక్తులు భవానీదీక్షలను స్వీకరించి, దీక్షా విరమణకు అమ్మవారి సన్నిధికి తరలివస్తారు. దాంతో గడిచిన రెండు రోజులుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి అధికంగా భవానీ దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి తరలివస్తున్నారు. భవానీల రాకతో శుక్రవారం సైతం రద్దీ కొనసాగింది. మరో రెండు రోజుల పాటు భవానీల రాక కొనసాగనుంది. కూటమి నేతల హడావుడితో ఇక్కట్ల పాలైన భక్తులు ఈ ఏడాది కూటమి నాయకులు అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంపైన తమ ప్రతాపాన్ని చూపించారు. ఎటువంటి పాసులు లేకున్నా దర్శనానికి రావటం, అధికార యంత్రాంగంతో ఘర్షణకు దిగటంతో ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల సమస్యలు తలెత్తాయి. కొంతమంది మంత్రుల పీఏలు సైతం ఆలయంలో పోలీసు అధికారులను దుర్భాషలాడి ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్నాయి. జంబో ఉత్సవ కమిటీతో సమస్యలు దసరా ఉత్సవాల సందర్భంగా కూటమి ప్రభుత్వం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి జంబో ఉత్సవ కమిటీని నియమించింది. సుమారుగా 96 మందితో నియమించిన ఈ ఉత్సవ కమిటీ ఆలయ ప్రాంగణంలో అధికారులకు తలనొప్పిగా మారారని ఉన్నతాధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చివరి రోజు ట్రాఫిక్తో భక్తుల అష్టకష్టాలు దసరా పండుగ రోజు విజయవాడ నగరంలో ట్రాఫిక్ అష్టదిగ్బంధనం అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎంజీ రోడ్డులో డైవర్షన్తో పాటు, కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం రాజీవ్గాంధీ పార్కు వద్ద, గొల్లపూడి ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. బందరు రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ ఉదయం మారథాన్ నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకూ రాకపోకలకు అనుమతించలేదు. దీంతో బందరు రోడ్డుకు ఇరువైపుల నివాసాలు ఉన్న వారు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సాయంత్రం కళాకారులతో కార్నివాల్ నిర్వహించడంతో మధ్యాహ్నం 4 గంటల నుంచి ట్రాఫిక్ను నిలిపివేశారు. ట్రాఫిక్ను డైవర్డ్ చేయడంతో ఆయా రోడ్లలో వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా మదర్థెరిస్సా విగ్రహం సమీపంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులు సైతం ట్రాఫిక్తో ఇబ్బంది పడ్డారు. కూటమి నేతలు ఆర్భాటంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలకు, ఉత్సవాలకు చాలా సమస్యలు సృష్టించింది. ప్రధానంగా ఆలయానికి సమీపంలో పున్నమి ఘాట్ వద్ద ఒక ప్రధాన వేదికను ఏర్పాటు చేయటంతో అటుగా భక్తుల రాకపోకలకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మంత్రులు ఇతర వీవీఐపీల రాకపోకలతో పోలీసులు గంటల తరబడి వాహనాలను మళ్లించటం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పర్యటనలతో... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంజీరోడ్డులో నిర్వహించిన కార్నివాల్తో పాటు, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పాల్గొన్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ను నిలిపివేయడంతో భవానీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం వద్ద భవానీలు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. బస్టాండ్ అవుట్గేట్ వరకూ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు చంద్రబాబు రాకతో, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో గొల్లపూడి వద్ద ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. -
చెత్త ఇస్తే సరుకులు ఇస్తాం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పొడి చెత్తను తీసుకొచ్చిన వారికి బదులుగా నిత్యవసర సరుకులు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని కోనేరు సెంటర్లో మంత్రి రవీంద్ర కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గురువారం స్వచ్ఛ రథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథం వాహనాలను ప్రారంభించామన్నారు. వ్యర్థాలను సేకరించేందుకు కృష్ణాజిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు స్వచ్ఛ రథాలను కేటాయించామని తెలిపారు. వీటి ద్వారా ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు వంటి పొడి చెత్తను సేకరిస్తారన్నారు. పొడి చెత్తను సేకరించి అందించిన వారికి స్వచ్ఛ రథం వాహనం దగ్గర దానికి సమానమైన నిత్యావసర సరుకులు అందిస్తారన్నారు. చెత్తను తరలించేందుకు ఉన్న రెండు కంపాక్టర్లకు అదనంగా మరో కంపాక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందని, వీటి ద్వారా జిల్లాలోని చెత్తను ఎప్పటికప్పుడు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఏడు స్వచ్ఛ రథాలను ప్రారంభించామని, వీటి ద్వారా గ్రామాల్లో గృహాల వద్ద వృథాగా పేరుకుపోయిన ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు, అట్ట పెట్టెలు, గాజు సీసాలు తదితర పొడి చెత్తను సేకరించి స్వచ్ఛ రథం వద్ద అందిస్తే దానికి సమానమైన కందిపప్పు, మినప గుళ్లు, పేస్టు, షాంపూ, కొబ్బరి నూనె, సబ్బులు, పెన్నులు, ఉల్లిపాయలు తదితర నిత్యవసర వస్తువులను అందిస్తారన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందడంతో పాటు పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి, జెడ్పీ డెప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోయ నాగమణి, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న భవానీల రద్దీ..
ఉత్సవాలలో 11వ రోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులు దర్శనమిచ్చారు. గురువారం తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం రెండు గంటల నుంచి భవానీలు, భక్తులను అనుమతించారు. చివరి రోజున రికార్డు స్థాయిలో భవానీలు తరలివచ్చారు. ఆయా కంపార్టుమెంట్లు, క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకునేందుకు 5 గంటలకు పైగా సమయం పట్టింది. ఉదయం పూర్ణాహుతి అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించారు. గురువారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీల తాకిడితో కొండపైకి అన్ని వీఐపీ వాహనాలను, వీఐపీ ప్రవేశ మార్గాలను ఆలయ అధికారులు మూసివేశారు. కేవలం డ్యూటీ పాస్లు ఉన్న వారిని మాత్రమే ఘాట్రోడ్డు మీదగా నడుచుకుంటూ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. శుక్రవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఉత్సవాల ఏర్పాట్లు మరో రెండు రోజులు కొనసాగిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. -
పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పద్ధతుల్లో భూసర్వే
కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పద్ధతులను అనుసరించి భూ సర్వే చేసి సంబంధిత రికార్డులను సజావుగా రూపొందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో పట్టణ సర్వే – నక్షా కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ భూ సంబంధ రికార్డు సర్వే ద్వారా పట్టణ ప్రణాళిక బలోపేతం చేసేందుకు సంసిద్ధం కావాలన్నారు. ఈ సర్వే ద్వారా పౌరులకు శాశ్వత భూ హక్కు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కమిటీలో జాయింట్ కలెక్టర్తో పాటు మునిసిపల్ కమిషనర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, డీపీవో, సర్వే ఏడీ సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ జిల్లాస్థాయిలో సర్వే ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తుందని, క్షేత్ర స్థాయిలో సర్వే కార్యక్రమాల పనితీరును పర్యవేక్షిస్తుందని వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరిస్తుందన్నారు. సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ సునీత, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
అధికారులకు కలెక్టర్ ఆదేశం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తో కలిసి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు అప్రమత్తంగా ఉండి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లో పంట కోత స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. పంట చేతికొచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకుని ట్రక్ షీట్ జనరేట్ చేసుకున్న తరువాతే మిల్లర్ల వద్దకు వెళ్లాలన్నారు. దళారులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు సృష్టించే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు అమ్మకుండా ధైర్యం చెప్పాలన్నారు. ఈ–పంట నమోదు 90 శాతం పూర్తయిందని నూరు శాతం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించి ధాన్యం సేకరణ, తేమశాతం కొలతలు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని మిల్లులను తనిఖీ చేసి తేమ శాతం కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. ధాన్యం సేకరణకు వినియోగించేందుకు 200 వాహనాలను సిద్ధం చేసి నమోదు చేయాలని ఇంకా మరిన్ని వాహనాలను వెంటనే నమోదు చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో గోనెసంచుల కొరత ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని సూచించారు. మిల్లుల నుంచి సీఎంఆర్ డెలివరీ పటిష్టంగా చేయాలని సూచించారు. ధాన్యం బస్తాల రవాణాకు హమాలీల కొరత రాకుండా చూడాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి.శివరామప్రసాద్, డీఎస్వో మోహనబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, డీసీవో చంద్రశేఖరరెడ్డి, జిల్లా రవాణాధికారి ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టు
మైలవరం: జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అంతర్ కళాశాలల కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇళ్ళ రవి శుక్రవారం తెలిపారు. గత వారం స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ పురుషుల అంతర్ కళాశాల కబడ్డీ పోటీల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపిక చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం జట్టు కర్నాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్లావిలో ఈ నెల 4 నుంచి 7 వరకు నిర్వహించే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో పాల్గొంటుందన్నారు. ఈ పోటీలను నాక్ ఔట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టుకు మేనేజర్గా మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామిని, కోచ్గా నలంద కళాశాలకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును, టీమ్ కెప్టెన్గా శ్యామ్ కుమార్ను నియమించినట్టు తెలిపారు. జట్టు సభ్యులుగా విజయ వ్యాయామ కళాశాల నుంచి శ్యామ్కుమార్, సాయి ప్రసన్న, వెంకటేశ్వర్లు, సిద్ధార్థ కళాశాల నుంచి మహేష్, మధు, ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి శామ్యూల్ రాజ్, కిరణ్, కేబీఎన్ కళాశాల నుంచి ఫిరోజ్, తేజ, ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అజయ్బాబు, నలంద కళాశాల నుంచి యశ్వంత్ కుమార్, ఏజీఎస్జీఎస్ కళాశాల నుంచి గోపీచంద్, వికాస్ కళాశాల నుంచి వెంకటేశ్వరరావు, లయోలా కళాశాల నుంచి మహేష్ ఎంపికయ్యారన్నారు. -
చెడుగుడు పోటీ విజేత నెల్లూరు పల్లాలమ్మ జట్టు
పెడన: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పెడన మండలం లంకలకలువగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీల్లో విజేతగా నెల్లూరు జిల్లాకు చెందిన పల్లాలమ్మ జట్టు విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్స్లో ఏలూరు జిల్లా వేమవరప్పాడు జట్టు, పల్లాలమ్మ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో పల్లాలమ్మ జట్టు విజయం సాధించింది. గత నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిగా రూ.20వేలను కొనకళ్ల బ్రదర్స్ వారి తండ్రి గణపతి పేరు మీద అందజేశారు. ద్వితీయ బహుమతిని మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పేరు మీద ఆయన తనయుడు, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రూ.15వేలను అందజేశారు. తృతీయ బహుమతి రూ.10వేలను నెల్లూరు గణేష్ టీం గెలుచుకోగా పుల్లేటి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు ఆ నగదును అందజేశారు. నాలుగో బహుమతిని లంకలకలువగుంట గ్రామ జట్టు రూ.5వేలు గెలుచుకుంది. పోటీలను ముత్యాల వెంకటస్వామి(ఏసుబాబు), మాజీ సర్పంచులు కట్టా సూర్యచంద్రరావు, కాగిత సత్యప్రసాద్ పర్యవేక్షించారు. -
ఎన్సీఆర్బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ నివేదికలోని వాస్తవాలను కూడా చంద్రబాబు కోసం వక్రీకరించే దుస్థితికి ఎల్లో మీడియా దిగజారిందని, ఆ నివేదికను ఉటంకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను అచ్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించి, విత్తనం నుంచి విక్రయం వరకు వారికి అండగా నిలబడటం వల్ల గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.వ్యవసాయం దండగ అని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, కడగండ్లు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తక్షణం ఆదుకున్న మానవత్వం వైఎస్ జగన్ది అయితే, వారి కుటుంబాలను గాలికి వదిలేసిన రాక్షసత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి, రైతులను డిస్ట్రస్ నుంచి తప్పించడానికి వైఎస్ జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ వ్యవసాయంలో సంక్షోభాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుని కాపాడేందుకు ఎల్లోమీడియా ఇవాళ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంది. 2023లో ఎన్సీఆర్బీ డేటాను తీసుకుని, చిలువలు పలవలు చేసి, వక్రీకరించి తప్పడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది.ఆత్మహత్య చేసుకున్న రైతులు.. మద్యం తాగి చనిపోయారన్న చంద్రబాబువైఎస్సార్సీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూ యజమానులైన రైతులు 309 మంది ఉండగా, కౌలు రైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో అవి 917కు తగ్గాయి.2023లో ఏడాదిలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 925. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు? రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి, వారి కుటుంబాలను కాపాడ్డానికి ఏ రోజు కూడా చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనా కాలంలో కాని, ఇవాళ కాని ముందుకు రావడం లేదన్నసంగతి తెలిసిందే. 2014-19 మధ్య రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వారంతా వ్యక్తిగత సమస్యలతోనూ, మద్యం తాగి చనిపోయినట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రైతుల పట్ల, వారి కష్టాల పట్ల చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఈ సారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. ఆయా కుటుంబాల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయంధాన్యం దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి సహా ప్రస్తుతం ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులు ఊబిలో కూరుకు పోయారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టారు, ఇ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలను నీరుగార్చారు. సీఎం యాప్ను తీసేశారు. ఈ పరిస్థితులన్నీ రైతులను తీవ్ర నిరాశాజనక వాతావరణం లోకి నెట్టేశాయి. పరిస్థితులను తట్టుకోలేక వారు బలవ్మనరణాలకు పాల్పడుతుంటే.. కనీసం ఆ కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం జాలి కూడా చూపడంలేదు.కానీ వైఎస్ జగన్ రైతులకు ప్రతి చోటా చేదోడు వాదోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని గొప్ప విదానాలు తీసుకువచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన అహర్నిశలు పని చేశారు. వైయస్సార్సీపీ పరిపాలనాకాలంలో 1794 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారందరికీ కూడా పరిహారం చెల్లించారు.ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలియగానే.. వెంటనే జిల్లా కలెక్టర్ను పంపి, ఆ కుటుంబాలకు బాసటగా నిలిచి, 48 గంటల్లోపే ఆ కుటుంబాలకు సహాయం అందించిన ఘటనలు కోకొల్లలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధానాన్ని తీసేశారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడ్డం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? అంతేకాదు 2014-19 మధ్య పునర్విచారణ జరిపి, 474 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందేలా చేశారు. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగింది. ఇలా దాదాపుగా రూ.117 కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పట్ల 'బాబు' నిర్లక్ష్యం2014-19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను కాపాడేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అరకొరగా ఆయా కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారంఅనేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్నిఅప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇది ఏరకంగా బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది.వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలు దారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించింది. జగన్మోహన్రెడ్డిగారు అత్యంత మానవతావాదిగా వారికి సహాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు రైతుల పట్ల, వారి కుటుంబాల పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరిస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు పరిపాలనా విధానం ప్రధాన కారణం. వ్యవసాయ రంగంలో ఆయన సృష్టించిన సంక్షోభమే దీనికి కారణం. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతుల ఉసురు పోసుకున్నారు.వైఎస్ జగన్ ఇదే నిధితో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నారు. మరి రైతు ద్రోహి ఎవరు? ఉచిత పంటల బీమాను జగన్ పెడితే, చంద్రబాబు దాన్ని రద్దు చేశారు. గత ఏడాది అందాల్సిన పంటల బీమా ఇప్పటి వరకూ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా.. నష్టాల గణనే లేకుండా పోయింది. వందల మంది రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం మీద వార్తలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబును జాకీలు పెట్టి లేపే పనిని ఎల్లో మీడియా మానుకుంటే మంచిది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తగ్గిన నేరాలుఇక ఎన్సీఆర్బీ డేటా విషయాని కొస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన విషయం చాలా స్పష్టంగా డేటాలో కనిపించింది. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు తగ్గాయని ఎన్ఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసుల 1,88,997 కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి, 2023లో 1,53,867 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి ఏటా తగ్గుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే 2020, 21, 22 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుకుంటా వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి. 2023లో 30,436కు పరిమితం అయ్యాయి. నేరాలకు పాల్పడే వారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో వైయస్సార్సీపీ హయాంలో గట్టిగా కృషి జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్దేశిచిన ఛార్జిషీటు దాఖలకు పెట్టిన గడువు 60 రోజులు అయితే, నమోదైన కేసుల్లో 91.6 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసి రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.శాంతిభద్రతల నిర్వహణ, కేసులు దర్యాప్తు, విచారణ, తర్వాత న్యాయ ప్రక్రియలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం ఇది. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా... 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. 2023లో హత్యలు 922. అంటే హత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మహిళల పై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం వైఎస్ జగన్ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయారంటూ మహిళలు, అమ్మాయిలు, బాలికల విషయంలో నమోదైన కేసుల్లో 85.7 శాతం రికవరీ 2023లో ఉంది. దేశంలో 54 శాతం మాత్రమే. దేశంలోనే రాష్ట్రం పనితీరు బాగున్నట్టుగా నివేదిక పేర్కొంది.ఎన్నికలకు ముందు 39 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయినట్టుగా ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఎన్సీఆర్బీ రిపోర్టు కొట్టి పారేసింది. పైగా వైఎస్సార్సీపీ హయాంలో ఫిర్యాదు చేయడానికీ, వాటిపై కేసుల నమోదుకూ, విచారణకూ పగడ్బందీ వ్యవస్థలు ఉండేవి. వీటి నమోదు ద్వారా నంబర్లు పెరుగుతాయని, తద్వారా కేసులు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉన్నప్పటికీ, వివిధ సంస్కరణలతో రిపోర్టింగ్ విధానాన్ని బలోపేతం చేశారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మెరుగ్గా పనిచేసినప్పటికీ వక్రీకరణలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. -
7 లక్షల క్యూసెక్కులు వస్తున్న వరద నీరు
కంచికచర్ల: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణానదికి మంగళవారం 7లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు అంటున్నారు. కంచికచర్ల మండలం కొత్తపేట, గనిఆత్కూరు, మున్నలూరు, కునికెనపాడు, చెవిటికల్లు గ్రామాల్లోని పంట పొలాల్లోకి కృష్ణానది వరదనీరు చేరుతోంది. రాత్రికి ఇంకా వరద నీరు పెరిగే అవకాశాలు ఉన్నాయని డెప్యూటీ తహసీల్దార్ వి.మానస తెలిపారు. ఇప్పటికే నదీతీర ప్రాంత ప్రజలు కృష్ణానదిలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ సిబ్బందిని నదీతీర గ్రామాల వద్ద కాపలా ఉంచామని చెప్పారు. కృష్ణానది తీర గ్రామాల సమీపంలో రైతులు సాగుచేసిన మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలన్నీ నీట మునిగాయి. సుమారు 100 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లంక భూముల్లో ఉన్న రైతులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీటీ తెలిపారు. -
ఎడ్లంకలో పర్యటించిన జాయింట్ కలెక్టర్
అవనిగడ్డ: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీవో కె.స్వాతి మంగళవారం పాత ఎడ్లంక గ్రామంలో పర్యటించారు. కోతకు గురైన ప్రాంతం, కొట్టుకుపోయిన నివాసాలను పరిశీలించారు. అనంతరం నదిలో కొట్టుకుపోయిన ఇళ్ల యజమానులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామని, గ్రామంలోనే స్థలాలు ఇస్తామని చెప్పగా గ్రామస్తులు నిరాకరించారు. నదీ ప్రవాహం తీవ్రంగా ఉందని, భవిష్యత్తులో గ్రామం పూర్తిగా కనుమరుగవుతుందని గ్రామంలోని నివాసాలు ఇచ్చినా... ఇక్కడ తాము ఉండమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం గ్రామస్తులు అందరికీ అండగా ఉంటుందని పూర్తిస్థాయిలో గ్రామానికి రక్షణ కల్పిస్తుందని, అప్పటివరకూ నివాసాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా గ్రామంలోని రిహాబిటేషన్ కింద వసతి ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలోని పరిస్థితులను కలెక్టర్కు వివరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రవితేజ, అవనిగడ్డ తహసీల్దార్ కె.నాగేశ్వరరావు, పలువురు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మె ఉధృతం
మచిలీపట్నం అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి తెలిపారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా కుదింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లాలోని పీహెచ్సీలలో వైద్య సేవలను వైద్యులు బహిష్కరించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామన్నారు. వైద్యులు 20 శాతం పీజీ ఇన్ సర్వీస్ కోటా అన్ని క్లినికల్ స్పెషాలిటీలకూ వర్తించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్స్, ఉద్యోగోన్నతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పలువురు పీహెచ్సీ వైద్యులు మాట్లాడుతూ గతంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం ఇన్ సర్వీస్ కోటా ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్లో 30 శాతానికి తగ్గించిందని తెలిపారు. గతేడాది వైద్యుల ఆందోళనల తర్వాత క్లినికల్ కోర్సుల్లో 20 శాతం వరకు పెంచి, ఈ విద్యా సంవత్సరానికి మళ్లీ కోటాను 15 శాతానికి తగ్గించడంతో సమ్మె చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.బాలాజీ (కపిలేశ్వరపురం పీహెచ్సీ), డాక్టర్ స్ఫూర్తి (రామాపురం పీహెచ్సీ), డాక్టర్ రాజా (పెనమలూరు పీహెచ్సీ), డాక్టర్ చంద్రిక (ఉప్పులూరు పీహెచ్సీ), డాక్టర్ పర్వేజ్ (పెడన పీహెచ్సీ), డాక్టర్ తేజ( మోటూరు పీహెచ్సీ), డీఎంహెచ్ఓ కార్యాలయం డాక్టర్లు అరుణ్ కుమార్, నిరీక్షణ, అవనిగడ్డ పి.పి యూనిట్ డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి గ్రామీణ వైద్య సేవలకు బ్రేక్ -
సోషల్ మీడియా పోస్టుల నెపంతో 9 మందిపై కేసు
కంచికచర్ల: సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పోస్టులు పెట్టా రంటూ పోలీసులు కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన 9 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు రైతులు కాగా, ఒకరు జేసీబీ ఆపరేటర్, మరో ఇద్దరు యువకులు చైన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ సీపీలో చురుకై న కార్యకర్తలు. అక్రమ అరెస్ట్ల విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు మంగలపూడి కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు నాయకులు రాయల నరసింహారావు, ఎస్సీ సెల్ నాయకులు ముప్పాళ్ల శివాజీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు వేమవరపు పురుషోత్తం తదితరులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం తెల్ల వారుజామున ఆందోళన చేశారు. ఆందోళన విషయం కంచికచర్ల, చందర్లపాడు ఎస్ఐలు విశ్వనాఽథ్, ధర్మరాజు రూరల్ సీఐ చవాన్కు సమాచారం అందించగా ఆయన హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వచ్చారు. నాయకులను స్టేషన్లోకి పిలిచి ఆందోళన విరమించాలని కోరారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, తమకు సహకరించాలని సీఐ కోరారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళన విరమించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిని నందిగామ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 9 మందిపై అక్రమంగా కేసు నమోదు... మండలంలోని మోగులూరు గ్రామానికి చెందిన 9 మందిని సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయకులను కించపర్చారనే ఫిర్యాదు మేరకు అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో బండి ఽశ్రీనివాసరావు, కాశిబోయిన భిక్షాలయ్య, బండి రామారావు, బండి నాగశివరావు, రాయల త్రిశాంక్, యర్రగుంట వెంకటేశ్వరరావు, షేక్ మహ్మద్ ఆరీఫ్, షేక్ జాన్సైదా, బండి మురళీ చౌదరి ఉన్నారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు -
బందరుకోట, గిలకలదిండి అభివృద్ధికి కృషి
మచిలీపట్నంటౌన్: నగరంలోని బందరుకోట, గిలకలదిండి ప్రాంతాల్లో దశలవారీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 21వ డివిజన్ బందరుకోట శ్రీ కోదండరామస్వామి, హనుమాన్ టెంపుల్ సమీపంలో రూ.30 లక్షలతో మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, 20వ డివిజన్ గిలకలదిండిలో రూ. 10 లక్షల వ్యయంతో ఓవర్హెడ్ ఆవరణకు ప్రహరీ నిర్మాణం పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోర్టు నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన, రహదారుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. బందరుకోటలో మరో ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ మెంబరు లంకే నారాయణప్రసాద్, మునిసిపల్ మాజీ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, గిలకలదిండి, బందరు కోట టీడీపీ ఇన్చార్జ్లు రమేష్, అనిల్, నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, ప్రభుత్వాసుపత్రి మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అవనిగడ్డలో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలి
అవనిగడ్డ: పాత ఎడ్లంకలో వరద ఉధృతికి ఇళ్లు కోల్పోయిన బాధితులకు అవనిగడ్డలో నివేశన స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్యెల్యే సింహాద్రి రమేష్బాబు డిమాండ్ చేశారు. వరద ఉధృతికి ఇళ్లు పడిపోయిన ప్రాంతాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, ఇళ్లు కోల్పోయిన బాధితులు మాట్లాడుతూ గ్రామంలో తాము ఉండలేమని, తమకు అవనిగడ్డలో ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇళ్లు నిర్మించేలా చేస్తే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతామని మొర పెట్టుకున్నారు. వరద వల్ల తమ గ్రామం తీవ్రంగా కోతకు గురవుతోందని, ఎప్పుడు ఎవరి ఇల్లు నీటిలో మునిగిపోతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పారు. తమ గ్రామానికి రివిట్మెంట్ వద్దు ఇంకేమీ వద్దని, తమకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించేలా చూడాలని వేడుకున్నారు. అందుకు సింహాద్రి స్పందిస్తూ గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రెండు సంవత్సరాల నుంచి ఎడ్లంక గ్రామం తీవ్రంగా కోతకు గురవుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు చింతలపూడి బాలభాస్కరరావు, గ్రామ కన్వీనర్ నలకుర్తి రమేష్, పార్టీ నాయకులు గరికపాటి కృష్ణారావు, కొండవీటి రాంప్రసాద్, అవనిగడ్డ రంగనాథ్, సైకం నాగరాజు, సైకం లంకేశ్వరరావు, మునిపల్లి ప్రభాకర్, ముసలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మాజీ ఎమ్యెల్యే సింహాద్రి రమేష్బాబు -
నడిరోడ్డుపై టీడీపీ నేతల బాహాబాహీ
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టీడీపీలో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. రెండు రోజుల క్రితం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ మంగళవారం వెలుగుచూసింది. ఓ రహదారి మరమ్మతుల అంశంపై సర్పంచ్ సర్నాల గంగారత్నం భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ, గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసయ్య వారి వారి అనుచరులతో ఘర్షణకు దిగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈనెల 28న గూడవల్లి నరసయ్య గ్రామంలోని బీఎంపీఎస్ రోడ్డులో మనుషులను పురమాయించి రహదారిపై గోతులను పూడ్పించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ ఘటనా స్థలానికి వెళ్లి మీరెవరు పనులు చేయించడానికని ప్రశ్నించాడు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీ రోడ్డులో పనులు ఎలా చేయిస్తారని నిలదీశాడు. సుమారు రూ.82లక్షలతో ఈ రహదారి అభివృద్ధికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించామన్నారు. రహదారిపై గోతులు పడి అధ్వానంగా మారినా పంచాయతీ పట్టించుకోనందునే తాము పనులు చేయిస్తున్నామని గూడవల్లి నరసయ్య బదులిచ్చారు. మాటా మాటా పెరిగి బాలాజీ, నరసయ్య మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నువ్వు ఎంతంటే నువ్వు ఎంతంటూ దూషించుకున్నారు. గొడవ కాస్తా పెద్దదవడంతో ఇరు వర్గాల అనుచరులు ఒకరినొకరు తోసుకుంటూ నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. దీంతో స్థానికులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఒకే పార్టీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ కాస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి వెళ్లడంతో పార్టీ పరువు బజారు కీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సర్పంచ్, ఏఎంసీ చైర్మన్ వర్గీయుల మధ్య తోపులాట -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి అన్నారు. నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆరవ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్ షిప్–2025–26 పోటీలను మంగళవారం ఆమె పరిశీలించారు. మెప్మా డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ నగరంలో ఓ వైపు దసరా ఉత్సవాలు, మరో వైపు జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరుగుతుండడంతో నగరానికి రెట్టింపు కళ వచ్చిందన్నారు. సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకుడు బిక్షమయ్య గురూజీ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విజేతలకు అతిథులు పతకాలు అందజేసి అభినందించారు. విజేతల వివరాలు.. సీనియర్ పురుషులు బాడీ ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్సీబీ)ప్రథమ, రాజేష్కుమార్ సోని (మధ్యప్రదేశ్) ద్వితీయ, దిలీప్కుమార్ (బీహార్) తృతీయ బహుమతులు పొందారు. జూనియర్ పురుషుల హ్యాండ్ బ్యాలెన్స్ వ్యక్తిగత విభాగంలో ఆయుష్ భౌమిక్ (పశ్చిమ బెంగాల్), రితిక్ బిష్ణోయ్ (రాజస్థాన్), బి.మనోజ్ (తమిళనాడు), బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో రాజ్ రాజోల్ (మధ్యప్రదేశ్), సౌనవ హజ్రా (సీఎస్ఎసీసీఈ), చందన్ శర్మ (బీహార్), జూనియర్ మహిళల బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో అనిక రాణా (ఉత్తరప్రదేశ్), ఎస్.హేమమాలిని (తమిళనాడు), అమృత సర్గులె (మహారాష్ట్ర), ఆర్టిస్టిక్ వ్యక్తిగత విభాగంలో రుద్రాక్షి భావె, రియా (మహారాష్ట్ర), రీత్ శ్రీవత్సవ్ (ఢిల్లీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు గెలుపొందారు.శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి -
పాపం.. భవానీద్వీపం!
● భవానీ ద్వీపానికి దెబ్బ మీద దెబ్బ ● ద్వీపంలోకి ప్రవేశించిన వరద నీరు ● వృథాగా మారిన పునరుద్ధరణ పనులుభవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన భవానీ ద్వీపంపై ప్రకృతి పగబట్టిందా అంటే.. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గత ఏడాది ఆగస్ట్లో సంభవించిన వరద సందర్భంగా తీవ్రంగా (దాదాపు రూ.10 కోట్ల మేర అధికారుల అంచనా) నష్ట పోయిన భవానీ ద్వీపంలో పునరుద్ధరణ పనులు చేపట్టటంతో ఇప్పుడిప్పుడే పర్యాటకులు తిరిగి వస్తున్నారు. రిసార్ట్స్ బుకింగ్, రెస్టారెంట్, అడ్వంచర్ గేమ్స్, మిర్రర్ ఇమేజ్ వంటి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మళ్లీ వరద ఉధృతి పెరిగి సుమారు ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజికి చేరింది. దీంతో భవానీ ద్వీపానికి మళ్లీ వరద తాకిడి తగిలింది. సోమవారం నాటికే వరద నీరు ద్వీపంలోకి చేరి అతలాకుతలం చేసింది. పునరుద్ధరణ పనులు వృథాయేనా! గత ఏడాది వరద కారణంగా ధ్వంసమైన ద్వీపానికి దెబ్బమీద దెబ్బ తగలటంతో చేసిన పునరుద్ధరణ పనులన్నీ వృథాయేనా అని పర్యాటక శాఖ అధికా రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మళ్లీ వచ్చిన వరద పోటుతో ఈనగాచి నక్కల పాలైన విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, వరదలు వెంటాడుతుంటే ఎప్పటికి కోలుకుంటాం..పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎప్పటికి సిద్ధం చేయగలమని మథనపడుతున్నారు. హరిత బెరం పార్క్ (పున్నమి హోటల్) పరిస్థితి అలానే ఉండటం గమనార్హం. దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తారని, తద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చని ఎదురు చూసిన పర్యాటక శాఖ వారికి నిరాశే ఎదురయింది. -
వేద మంత్రోచ్చరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది వేద పండితులు హాజరయ్యారు. మహామండపం ఆరో అంత స్తులో నిర్వహించిన సభ ప్రారంభానికి ముందు వేద పండితుల వేద మంత్రోచ్చరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దుర్గగుడి ఈఓ శీనానాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. -
9వ రోజు ఆదాయం రూ.40.12 లక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పిచ్చుక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తురకపాలెంలో మరణించిన వారంతా గ్రామంలో కంకర క్వారీల్లో పనిచేసేవారని తెలిపారు. అక్కడి ప్రజలు తాగే నీటిని చైన్నె ల్యాబ్కు పంపించగా నీటి కాలుష్యాన్ని ధ్రువీకరించిందన్నారు. ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల వితంతు మహిళలకు ఉద్యోగ భరోసా కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సభ్యులు అన్సారీ, వెంకట్, సతీష్, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు కె.ఎం.సుభాన్, లక్ష్మణరావు, బాషా, సలాం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించగా మొదటి స్థానం చిత్తూరు జిల్లా జట్టు దక్కించుకుందని న్యూ గుడివాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నమనేని పూర్ణ వీరయ్య(బాబ్జి) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రా పురం జట్టు రెండో స్థానం, ఎస్ఆర్ఎంఏపీ అమరావతి జట్టు మూడో స్థానంలో నిలిచా యని వివరించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, జీవితకాల సభ్యులు, కోచ్లు పాల్గొన్నారు. గన్నవరం రూరల్: ఓ వ్యక్తి అవయవదానంతో నలుగురికి పునర్జన్మ లభించింది. గన్నవరం మండలం చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని మెడికల్ కళా శాల బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మొవ్వ ప్రదీప్కుమార్(46) గత నెల 25వ తేదీన వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న అతనికి 29వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అవయవ దానం చేసేందుకు ప్రదీప్కుమార్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. హాస్పిటల్లోని జీవన్ధాన్ ప్రక్రియ ద్వారా లివర్, కిడ్నీలు రెండు, లంగ్స్ను రాష్ట్రంతో పాటు తెలంగాణ పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రదీప్ కుమార్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను జీఎస్టీ –2.0తో తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు లభిస్తున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లో సోమవారం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రత్నాచార్యులు ముద్రించిన వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు తక్కువ ధరకే లభిస్తాయని, ఆ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గిందని. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2.5 శాతం తగ్గింపుతో పరికరాలను అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, కే ఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి పాల్గొన్నారు. రవాణాశాఖ అవగాహన ర్యాలీ జీఎస్టీ ధరల తగ్గింపుపై రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ –2.0 ద్వారా వాహనాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయని, వీటిని వినియోగ దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, జిల్లా రవాణాధికారి యూఎన్ఎస్ శ్రీనివాసరావు, కమర్షియల్ డెప్యూటీ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
‘మీకోసం’కు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే!
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలతో మీకోసం కార్యక్రమానికి అర్జీదారులు వస్తుంటారని ఇందుకోసం అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. మీకోసం కార్యక్రమం నిర్వహణ అనంతరం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారం పట్ల ఆయన సమీక్ష నిర్వహిస్తూ పోలీస్శాఖ నుంచి ఎక్కువగా పరిష్కరించాల్సిన అర్జీలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి అధికారి శనివారం ఆయా శాఖల పరంగా మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి అదేరోజు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గడువు దాటిన అర్జీలు ఉంటే సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మీకోసం కార్య క్రమానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో ఎం.రాధికను ఆదేశించారు. రెవెన్యూ తదితర శాఖలు ముఖ్యంగా జిల్లా ప్రగతికి ఎంతో తోడ్పాటును అందిస్తాయని, అయితే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి శాఖ ఆయా శాఖల పరంగా జీఎస్టీకి సంబంధించిన వస్తువులు ఎంత మేరకు ధరలు తగ్గాయో, ఎంత మేరకు పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ప్రయోజనకరంగా ఉందో తప్పనిసరిగా ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా నుంచి క్షేత్రస్థాయి వరకు జీఎస్టీ చాంపియన్ పేరుతో ప్రతిభ చూపేందుకు ప్రభు త్వం మార్గదర్శకాలు నిర్దేశించిందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో జిల్లా ను అగ్రగామిగా నిలపాలన్నారు. దసరా నుంచి దీపావళి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించిందన్నారు. సచివాలయ స్థాయిలో కూడా సిబ్బంది కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
మంత్రి కొల్లు రవీంద్ర మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగ సాధనను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్షిప్–2025–26లో పతకాలు పొందిన పలు విభాగాల క్రీడాకారులకు మంత్రి రవీంద్ర సోమవారం పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ఒలింపిక్స్లో ప్రవేశపెడితే భారత్కు తప్పకుండా పతకాలు వస్తాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకష్ణ ప్రసాద్ ,ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. విజేతల వివరాలు... హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్) ప్రథమ, ఆష్మా దాస్ (పశ్చిమ బెంగాల్) ద్వితీయ, పంపం దేవి (గోవా)తృతీయ స్థానంలో నిలిచారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్ సీబీ), వినాయక్ ఎం. కొంగి (కర్ణాటక), తన్మే అధికారి (ఉత్తరా ఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవాటేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బీహార్), శీతల బైస్య (అసొం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళ్ళై (తమిళనాడు), బీరేంద్రకుమార్ యాదవ్ (హరియాణ), రాహుల్ శాండోర్ (మహారాష్ట్ర) ఒక్కో విభాగంలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పెనమలూరు: గంగూరు వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ చౌదరిపేటకు చెందిన వీరంకి పరమేశ్వరి తన అత్త సరస్వతిని స్కూటర్పై ఎక్కించుకుని ఆదివారం సాయంత్రం కానూరులో బావమరిది ఇంటికి వస్తుండగా గంగూరు వద్ద వెనుక నుంచి వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ పైనుంచి కిందకు పడిన మహిళలు ఇద్దరికీ గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. -
కృష్ణమ్మ కన్నెర్ర
ఏటిపాయకు భారీగా వచ్చిన వరద లంక గ్రామాలను చుట్టుముట్టింది. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో నివాసం ఉంటున్న వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామాల్లోని నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బ లంక, వల్లూరుపాలెం శివారు రావిచెట్టు లంక, పాములలంక, తుమ్మలపచ్చిక లంక, చాగంటిపాడు శివారు పిల్లివానిలంక, దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక, ఐలూరు శివారు కనిగిరిలంక, ములకల లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. కాసరనేనివారిపాలెం వద్ద నీట మునిగిన శివాలయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంకిపాడు: ప్రకాశం బ్యారేజ్కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండు రోజులుగా బ్యారేజ్కు వరద ఉద్ధృతి అంత కంతకూ పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలివేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. వరద కారణంగా నది పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి.. ఏడిపిస్తున్న ఏటిపాయ.. పెనమలూరు, పామర్రు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. గతేడాది సెప్టెంబర్ ఏటిపాయకు వరద భారీగా రావటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరలా ఈ ఏడాది సెప్టెంబర్లోనే వరద ముంచుకురావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రోజులు వరదనీరు పంట పొలంలో నిలిచిపోతే పంటలు కుళ్లిపోయే ఆస్కారం ఉందని వాపోతున్నారు. అయ్యో ఎడ్లంక.. దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి వరదచొచ్చుకొచ్చింది. దీంతో రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక్కడి పలు నివాసాల్లోకి సైతం నీరు చేరటంతో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో నివాసితులు సామాన్లను తరలించి భద్రపర్చుకుంటున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డ మండలంలోని పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విస్తృతంగా పర్యటించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. పులిగడ్డ, పల్లెపాలెం ప్రాంతాల్లో వరదను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి
గుమ్మడిదుర్రు(పెనుగంచిప్రోలు): జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని గుమ్మడిదుర్రు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నరసింహశెట్టి పద్మావతి(37) గత నాలుగు రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ స్థానిక ఆర్ఎంపీల వద్ద చికిత్స పొందు తోంది. ప్లేట్లెట్స్ తగ్గి పరిస్థితి విషమించటంతో ఆదివారం నందిగామ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతురాలి భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జ్వరాలు ప్రబల కుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
సమ్మెలోకి పీహెచ్సీ వైద్యులు
మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ప్రకటించింది. ఈ నెల 26 వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పీహెచ్సీల డాక్టర్లు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరు బాలాజీ, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావులకు సంఘం తరఫున జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు సమ్మె చేపట్టారు. పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం సర్వీస్ వైద్యుల పీజీ కోటాను తగ్గించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లు ఉండగా, వాటిని 15 శాతానికి తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు లభిస్తుంటే, 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పని చేస్తున్న డాక్టర్లు ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీ సర్లుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 పీహెచ్సీలు, 14 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న సమయంలో సమ్మె ప్రారంభం కావడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వైద్యుల డిమాండ్లు వైద్యుల ప్రధాన డిమాండ్లలో పీజీ కోటాను పునరుద్ధరించడం, టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వడం, చంద్రన్న సంచార చికిత్స పథకానికి ప్రత్యేక భృతి కేటాయించడం ఉన్నాయి. అదనంగా అర్బన్, నేటివిటీ కౌన్సెలింగ్ గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో కార్యక్రమాలు, వరదలు, విపత్తుల సమయంలోనూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఉద్యోగోన్నతులు అందకపోవడం వైద్యులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జాయిన్ అయినప్పుడు ఉన్న అదే కేడర్లో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని పీహెచ్సీ వైద్యులు ఆరోపిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో అర్చకుడి మృతి
తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థాన అర్చకుడు దీవి వేణుగోపాలాచార్యులు(55) ఆదివారం రాత్రి అదృశ్యమై గ్రామ శివారులోని అనురాధ వాగులో సోమవారం మధ్యాహ్నం శవమై తేలారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేణుగోపాలాచార్యులు ఆలయం మూసివేసిన తదుపరి ఇంటికి రాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం గాలించారు. అనురాధ వాగు వంతెనపై ద్విచక్ర వాహనం, సెల్ఫోన్, ఆలయ తాళంచెవులు ఉండటంతో గ్రామస్తులు వాగులో గాలించి ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన భార్య కరుణశ్రీ ఉపాధ్యాయినిగా పనిచేస్తుండగా, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గంపలగూడెం ఎస్ఐ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి సోమవారం(సెప్టెంబర్ 29) బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. మద్యం అక్రమ కేసులో జులై 19వ తేదీన మిథున్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్రెడ్డికి ఇవాళ ఏసీబీ కోర్టు రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు బెయిల్ మంజూరుతో మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు. 👉ఇదీ చదవండి: పరాకాష్టకు బాబు భేతాళ కుట్రజూలై 19వ తేదీ(శనివారం) ఎంపీ మిథున్రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఆరోజు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. -
ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్ ముందు వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు.వైఎస్సార్సీపీ నేత అక్రమ అరెస్ట్పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. -
లయ తప్పుతున్న లబ్ డబ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె స్పందన అదుపు తప్పుతోంది. యుక్త వయస్సులోనే గుండెపోటు మరణాలను చూస్తున్నాం. కారణం ఏదైనా... ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి మరణించే వారిని ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణాలో ప్రతిఏటా ఐదు వేల మందికి పైగానే గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో మరణాలు సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతిఏటా ఒక నినాదంతో సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డేను జరుపుకొంటున్నాం. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్. ప్రతి గుండె స్పందన కీలకమని, గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, చెకప్లను ఆలస్యం చేయొద్దని, గుండె సంబంధిత సమస్యల హెచ్చరిక సంకేతాలపై అప్రమత్తంగా ఉండాలనేది ఈ నినాదం అర్ధం. యువతలో గుండెపోటు ప్రస్తుతం యువత గుండెపోటుకు గురవడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. యువత గుండెపోటుతో మరణిస్తే ఆ ప్రభావం కుటుంబంపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మూడు మరణాల్లో గుండెపోటు మరణం ఒకటిగా నమోదవుతోంది. అన్ని రకాల క్యాన్సర్ల కంటే గుండెపోటు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు మరణాల్లో 80 శాతం నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇలా చేయాలి... ● క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ● వత్తిడిని తగ్గించుకోవాలి. ● ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ● ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ●బీఎంఐ 18.5–25 మధ్య ఉండేలా చూసుకోవాలి. ● ప్యాక్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్ఫుడ్, రెడ్మీట్ తీసుకోకుండా ఉండటం మంచిది. ● ఆహారంలో ఉప్పును తగ్గించాలి. వ్యాధులను ఇలా అదుపులో ఉంచుకోవాలి ● మధుమేహం ఉన్న వారు హెచ్బీఏ1సీ 6.5 లోపు ఉండేలా చూసుకోవాలి. హెచ్బీఏ1సీ ఒక శాతం పెరిగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ 11 శాతం ఉంటుంది. ● మధుమేహం, కిడ్నీ జబ్బులు ఉన్న వారు బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. మామూలు వ్యక్తులకు 130/80 ఉండొచ్చు. ● మధుమేహుల్లో ఎన్డీఎల్ కొలస్ట్రాల్ 50 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధారణ వ్యక్తుల్లో 100 లోపు ఉండొచ్చు. జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కొలస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి మధుమేహం ఉండగా, ప్రతి పది సెకన్లకు ఇద్దరు మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అదుపులో లేని వారిలో 75 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహులు సైలెంట్ హార్ట్ ఎటాక్కు గురవడం వలన గుండెపోటు వచ్చినట్లు కూడా తెలియదు. మధుమేహుల్లో 25 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్కు దారితీయొచ్చు. ప్రీ డయాబెటీస్ ఉన్న వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉన్న వారికి గుండె పెరగడం వంటి సమస్యతో పాటు గుండెపోటుకు గురవుతున్నారు. మెటబాలిజం సిండ్రోమ్ కూడా గుండెపోటుకు కారణమే. నేడు వరల్డ్ హార్ట్ డే.. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్ మీ గుండె స్పందన తెలుసుకోండి రెగ్యులర్గా గుండె చెకప్ చేయించుకోండి గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం యువకులే జీవనశైలి వ్యాధులే కారణం అంటున్న వైద్యులు ఛాతీలో నొప్పిని అశ్రద్ద చేయొద్దు ప్రతి ఏటా ఉమ్మడి కృష్ణాలో ఆరు వేల మందికి పైగా గుండెపోటుకు గురవుతున్నట్లు అంచనా -
పాఠశాల విద్యపై మంత్రి చూపే శ్రద్ధ ఇదేనా?
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘విద్యాశాఖ మంత్రిగా దాన్ని వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న నారా లోకేష్ గారూ..పాఠశాల విద్యపై మీరు చూపే శ్రద్ధ ఇదేనా’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో గత నాలుగేళ్లుగా ఉన్న ఏపీ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలికలు)ను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం పరిధిలోని పొలాల మధ్యగల మూతబడిన కాలేజీ భవనంలోకి తరలించటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ లతోపాటు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల(శ్రీకాకుళం నుంచి నెల్లూరు)కు చెందిన మైనార్టీ బాలికలు చదువుకుంటున్న ఈ గురుకుల పాఠశాల యాజమాన్యం, కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల భద్రతతో మారుమూల ప్రాంతానికి తరలించటం బాధాకరం అన్నారు. పేరెంట్స్ కమిటీని సంప్రదించి ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాల్సిన కనీస బాధ్యత విద్యా శాఖ అధికారులకు లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయవాడ ఉత్సవ్ పేరుతో బిజీబిజీగా ఉండటంతో విద్యార్థినుల తల్లిదండ్రుల ఘోష పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే చదివించండి లేదా టీసీలు తీసుకుని పొమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం బాధాకరమన్నారు. విద్యార్థినుల జీవితాలతో ఆడుకుంటున్నారు విద్యా సంవత్సరం మధ్యలో అర్ధంతరంగా స్కూల్ను తరలించటం విద్యార్థినుల జీవితాలతో ఆడుకోవడమేనని వెలంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉంది.. పూర్తి రక్షణ ఉంటుదని పిల్లలను ఇక్కడ చదివిస్తుంటే, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో స్కూల్ పెడితే వైద్యం, ఇతర సహాయం కావాలంటే పట్టించుకునే వారెవరని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు స్కూల్ను ఇక్కడే ఉంచాలని, లేదంటే తల్లిదండ్రులను పిలిచి మీటింగ్ పెట్టి వారికి అభ్యంతరం లేదని చెబితే తప్ప మార్చటానికి వీలు లేదని వెలంపల్లి స్పష్టం చేశారు. స్కూల్ మార్చాల్సివస్తే తల్లిదండ్రులకు ఎందుకు తెలియపరచరు? ఇదేనా ఆడపిల్లల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించేది? మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల తరలింపుపై మాజీ మంత్రి వెలంపల్లి ఆగ్రహం -
కృష్ణమ్మ ఉగ్రరూపం
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండటంతో మండలంలోని నదీ పరివాహక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 7లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల నుంచి విడుదల చేయటంతో నది పరీవాహక గ్రామామైన రావిరాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టుముట్టిన వరద.. కృష్ణానది ఒడ్డున ఉన్న రావిరాల గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఆ ఒడ్డున ఉన్న గృహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నది ఒడ్డున నివాసం ఉంటున్న ప్రజలను పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చారు. ముక్త్యాల వద్ద కోటిలింగ హరిహర మహాక్షేత్రం సమీపంలోని చంద్రమ్మకయ్య ఉద్ధృతంగా ప్రవహించడంతో జగ్గయ్యపేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఆదివారం రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో బ్యారేజీకు 6,50,389క్యూసెక్కుల వరద వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేశారు. మిగిలిన 10,652 క్యూసెక్కులు పంట కాలువలకు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 15.9 అడుగులకు చేరుకుంది. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025భక్తి భావం.. జన ప్రవాహం 7చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ నంబరు 1100కు కాల్ చేసి అర్జీ నమోదు, దాని స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులకు దసరా సెలవుల నేపథ్యంలో అందరూ సొంతూరు బాట పట్టారు. దీంతో ఆదివారం విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. కోనేరుసెంటర్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయు డు అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సిబ్బందికి యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.7దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి భక్తజనం పోటెత్తారు. ఆలయ పరిసరాలతో పాటుగా పాతబస్తీలోని ప్రధాన వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి పది గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వారందరినీ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ ప్రాంతం వైపు అధికారులు మళ్లించారు. రద్దీ కారణంగా తొక్కిసలాట లేకుండా బ్లాక్లుగా భక్తులను విడదీస్తూ ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 12గంటల సమయంలో వారిని వినాయకునిగుడి వద్ద ఉన్న క్యూలైన్లలోకి అనుమతించారు. ఆలయ పరిసరాలతో పాటుగా బయట వైపు భక్తులెవరిని ఉంచకుండా వినాయకునిగుడి వైపునకు మళ్లించారు. – వన్టౌన్(విజయవాడపశ్చిమ) -
బీచ్లో గల్లంతైన వ్యక్తి – కాపాడిన పోలీసులు
కోనేరుసెంటర్: మంగినపూడి బీచ్లో ఓ వ్యక్తి గల్లంతు కాగా ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులు అతన్ని కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి గిలకలదిండి మైరెన్ ఎస్ఐ చంద్రబోస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన హర్ప్రీత్సింగ్ గన్నవరంలోని హెచ్పీఎల్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం ఆంధ్ర వచ్చాడు. అతనితో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న మరో ముగ్గురు స్నేహితులు విహారయాత్రకని బీచ్కు వచ్చారు. ఉదయం అంతా బీచ్లో స్నానాలు చేసిన స్నేహితులు మధ్యాహ్నం భోజనాలు చేసి మరలా స్నానానికి సముద్రంలోకి వెళ్లారు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా హర్ప్రీత్సింగ్ ఒక్కసారిగా అలల మధ్య చిక్కుకుపోయాడు. నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులను పిలిచారు. అదే సమయంలో విధుల్లో ఉన్న హోంగార్డు నాంచారయ్య, రూరల్ పీఎస్ కానిస్టేబుల్ హరికృష్ణ కలిసి హర్ప్రీత్సింగ్ను కాపాడేందుకు లైఫ్జాకెట్లు ధరించి సముద్రంలోకి పరుగులు పెట్టి ఎట్టకేలకు ప్రాణాలతో అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించినట్లు మైరెన్ ఎస్ఐ చంద్రబోస్ తెలిపారు. బాధితుడు క్షేమంగా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇక తాడోపేడో!
సాక్షి టాస్క్ ఫోర్స్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం ఏంటని, ఎమ్మెల్యే వర్గం భగ్గుమంటోంది. దీంతో ఇటీవల బహిరంగంగానే ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ కమిటీలు, ఇతర పదవులు నియోజకవర్గంలోని నాయకుల కార్యకర్తల ప్రమేయం లేకుండా నడుస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కనీసం వార్డు కమిటీల నియామకంలో కూడా సంప్రదించలేదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది. పైకి బాగానే ఉంటున్నా.. ఎమ్మెల్యే, ఎంపీ పైకి చెట్ట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం కత్తులు దూసుకొంటున్నారు. తిరువూరు టీడీపీలో ఎమ్మెల్యేకు సమాంతరంగా, ఎంపీ ఓ వర్గాన్ని ప్రోత్సహించటంతోపాటు, వారికి షెల్టర్గా ఎంపీ కార్యాలయం మారటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎస్సీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కావడంతోనే, ఎంపీ కర్ర పెత్తనం చేస్తున్నారని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకుండా, ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీల్డ్ కవర్లలో పదవులు కేటాయించి పంపిచటం ఏంటని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అవినీతిలోనూ అంతా ఆయనే.. అవినీతి దందాల విషయంలో పార్లమెంట్ ముఖ్యనేతదే పైచెయ్యిగా మారింది. రేషన్ బియ్యం మాఫియా చేసే వ్యక్తిని, తన కార్యాలయంలోనే ఉంచుకొని రేషన్ బియ్యం, నెలవారీ మామూళ్లు దండుకోవటాన్ని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో పెద్దవరం చెక్పోస్టు నుంచి తెలంగాణకు బియ్యం రవాణా చేస్తున్నది పార్లమెంట్ ముఖ్యనేత అనుచరులేనని, ఎమ్మెల్యే వర్గీయులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. తిరువూరులో గంజాయి మాఫియాకు పార్లమెంట్ ముఖ్యనేత వత్తాసు పలుకుతున్నారనే భావన ఎమ్మెల్యే వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని పార్టీ పదవులు, దేవాలయాల చైర్మన్ పదవులు పార్లమెంట్ ముఖ్యనేత బేరం పెట్టి అమ్ముకున్నారని, ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్ ముఖ్యనేత ఓ ఎన్ఆర్ఐతో డబ్బులు ఖర్చు పెట్టించి, గెలిచాక కరివేపాకులా తీసి వేశారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మొత్తం మీద ఎమ్మెల్యే వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతోంది. తిరువూరు టీడీపీలో తారస్థాయికి విభేదాలు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ పెత్తనంపై ఆగ్రహం ఎవరి మాట వినాలో తెలియక ఇరుకున పడుతున్న అధికారులు పార్టీ, నామినేటేడ్ పదవులకు సీల్డ్ కవర్లో పేర్లు పంపడంపై రగిలిపోతున్న ఎమ్మెల్యే వర్గీయులు -
మచిలీపట్నంలో మహిళ ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నం మండలం పెదయాదర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబంపై ఆదివారం జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారు. అవమానం తట్టుకోలేని టీడీపీ కార్యకర్త భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మ హత్యకు ప్రయత్నించింది. వివరాలిలా ఉన్నాయి. పెదయాదర గ్రామానికి చెందిన పంచాయతీ చెరువును అభివృద్ధి చేసేందుకు ఆ ఊరి సర్పంచ్తో పాటు ఇతర పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే చెరువు అభివృద్ధి పనుల పేరుతో రూ.లక్షల ఖరీదు చేసే అక్కడి మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తుంగల నరసింహారావు గ్రామ సర్పంచ్, జనసేన నాయకుడు గల్లా తిమోతీకి మధ్య అనేక మార్లు వాదన జరిగింది. కళ్లెదుట జరుగుతున్న అవినీతిని భరించలేని నరసింహారావుతో పాటు గ్రామానికి చెందిన మరి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కలిసి మీ–కోసంలో జనసేన నాయకుల అవి నీతిపై కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో గల్లా తిమోతీ అవినీతి అక్రమాలపై టీడీపీ కార్యకర్త నరసింహారావు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. తెలుగుతమ్ముడి ఇంటిపై దాడి నరసింహారావు వేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి తిమోతీతో పాటు మరి కొంతమంది పంచాయతీ సభ్యులకు నోటీసులు అందాయి. దీంతో తిమోతీ ఆదేశాల మేరకు అతని అనుచరులైన శేషాద్రి వాసుపవన్, గల్లా లక్ష్మణ, కంచర్లపల్లి కోదండరామారావు ఆదివారం నరసింహారావుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం నరసింహారావు ఇంట్లో లేని సమయం చూసి అతని భార్య సత్యవతితో జనసేన నాయకులు గొడవకు దిగారు. ఇంట్లో తన భర్త లేడని చెబుతున్నా వినకుండా నరసింహారావుతో పాటు అతని భార్యను నానా మాటలతో అవమానించారు. సత్యవతిపై దాడి చేసేందుకు సైతం తెగించారు. అవమానాన్ని తట్టుకోలేని సత్యవతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసు పత్రికి తరలించటంతో సత్యవతి ప్రాణాలతో బయటపడింది. బందరు రూరల్ పోలీసులు బాధితురాలు సత్యవతి నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. జనసేన నాయకుల బెదిరింపులే కారణం బాధితురాలు టీడీపీ కార్యకర్త భార్య -
వైఎస్సార్ సీపీలో చేరిన వైఎస్సార్ కాలనీ మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన పలువురు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలనీకి చెందిన పెద్ది రాంబాయిమ్మ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు తెలుగు దేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ జోగి రమేష్ నివాసంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన మహిళలను ఆయన సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్, ఎంపీటీసీలు కొరగంజి సత్యనారాయణ, షేక్ సైదాబీ వలీ, కాలనీ నాయకులు నక్కా ప్రభుదాస్, మారపాక రాంబాబు, కుంభా నాగరాజు, ముళ్ల లాజర్, టీఎల్ రాజు, ఎస్కే షరీఫ్, గద్దల లాజర్, విన్నపాల రంగారావు, చల్లా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలు జోగి రమేష్ను సత్కరించారు. -
అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై అక్టోబర్ ఏడో తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సుందరయ్య, డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ధర్నా పోస్టర్, ఆవిష్కరణ, జిల్లా స్థాయి సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అప్లోడ్, డౌన్లోడ్, బయోమెట్రిక్, మెగా పీటీఎం, యోగాంధ్ర, పరీక్షలు బుక్స్లో రాయటం, గ్రీన్ పాస్పోర్ట్ తదితర కార్యక్రమాలు బోధనా సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఆటంకాలుగా మారాయన్నారు. బోధనకు సమయం ఇవ్వాలని బోధనేతర కార్యక్రమాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 10 లోపు బోధనేతర పనులు తగ్గించకపోతే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరణకు పిలుపునిస్తామని నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎ.సుందరయ్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు, డీఏలు, పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి అంశాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజు మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి
వయస్సు 40 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటితే సీటీ కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఒక్కోసారి ఈసీజీ నార్మల్ వచ్చినా గుండెపోటు రావచ్చు. చాలా మందికి గుండెపోటు గ్యాస్ నొప్పిలానే ఉంటుంది. ఛాతీలో వచ్చిన నొప్పిని అశ్రద్ధ చేయకుండా, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. ప్రీ డయాబెటీస్ ఉన్న వారు కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ట్, సెంటినీ విజయవాడ ● -
అవనిగడ్డలో డయేరియా కలకలం
అవనిగడ్డ: నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలోని పలు ప్రాంతాల్లో డయేరియా ప్రబలింది. 7, 8 వార్డుల్లో 8 మందికి పైగా డయేరియా రావడంతో అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో డయేరియా సోకినట్లు రోగులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రహదారుల పక్కనే చెత్తకుప్పల నిల్వలతో పాటు, మురుగునీరు ప్రవహిస్తోందని ఈ ప్రాంత ప్రజలు చెప్పారు. అయినా నిన్నటి వరకు ఈ వార్డుల్లో ఎక్కడా పారిశుద్ధ్య చర్యలు తీసుకున్నది లేవని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఇంటింటా సర్వే నిర్వహించి డయేరియాకు కారణాలను తెలుసుకోవాల్సి ఉండగా అలాంటి చర్యలేవీ చేపట్టలేదు. దీనిపై వేకనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రియాజ్ను వివరణ కోరగా డయేరియా కేసులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఆదివారం ఉదయం క్లోరినేషన్ చేయించామన్నారు. అయితే పంచాయతీ నుంచి సరఫరా చేసే నీటి ద్వారానే డయేరియా వ్యాపించి ఉంటుందని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తాగు నీటిని నాణ్యత పరీక్షలకు పంపినట్లు తెలిపారు. డయారియా సోకిన ఇద్దరిని విజయవాడకు తరలించినట్లు చెప్పారు. పంచాయతీ సర్పంచ్ గొరుముచ్చు ఉమా, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించి, క్లోరినేషన్ చేయించారు. మండల పరిధిలోని పాత ఎడ్లంక గ్రామానికి చెందిన ముగ్గురు డయేరియాకు గురై వైద్య శాలలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్యశాల సిబ్బంది తెలిపారు. ఒకపక్క కృష్ణా నదికి వరద తీవ్రత ఉధృతంగా వస్తుండగా మరోవైపు అవనిగడ్డలో డయేరియా వార్త కలకలం సృష్టిం చింది. అధికారులు స్పందించి మిగిలిన ప్రాంతాలకు డయేరియా సోకకుండా తగు చర్యలు తీసుకోవదంతో పాటు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 7 ,8 వార్డుల్లో 8 మందికి డయేరియా -
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు కంచికచర్ల: వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొనగా ఒక వ్యక్తి మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ ఘటన కంచికచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న కారు కంచికచర్ల ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్కు చెందిన వట్టికూటి చలపతిరావు(45) అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడకు చెందిన కారు డ్రైవర్ విశ్వనాథపల్లి గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ముగిసిన కబడ్డీ పోటీలు
మైలవరం:లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్శిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోటీలు నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళ రవి తెలిపారు. లీగ్ మ్యాచ్లలో గెలిచిన విజయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొదటి స్థానంలో ఉండగా, రెండు విజయాలతో ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో స్థానం, ఒక విజయంతో పీబీ సిద్ధార్థ కళాశాల విజయవాడ మూడో స్థానం, కేబీఎన్ కళాశాల నాలుగో స్థానాన్ని పొందాయని చెప్పారు. ఈ టోర్నమెంట్ నుంచి సౌత్ ఇండియా దక్షిణ భారత పురుషుల అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపిక చేస్తామని సెక్రటరీ టోర్నమెంట్ అర్గనైజర్ మేజర్ మన్నే స్వామి తెలిపారు. సౌత్ ఇండియా పోటీలను కర్ణాటకలోని బెల్గావ్ నందు రాణి చెన్నమ్మ యూనివర్శిటీలో వచ్చే నెల 4నుంచి 7 వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కబడ్డీ సెలక్షన్ కమిటీ మెంబర్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి ఇతర కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొంటారన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న చత్తీస్ఘడ్ వాసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు చత్తీస్ఘడ్ నుంచి భక్తులు విచ్చేశారు. సుమారు 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక వాహనంపై విజయవాడకు విచ్చేసి వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తమ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి తాము పండించిన పలు పండ్లను అందచేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఏటా పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి వస్తుంటామని చెప్పారు. అమ్మవారి దయతో తామంతా ఏ ఇబ్బంది లేకుండా సుఖసంతోషాలతో ఉంటున్నామని పేర్కొన్నారు. దర్శనం అనంతరం కొండపై ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. తమ గ్రామానికి చెందిన వారితో పాటు బంధువులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందచేస్తామన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
– కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం):పరిసరాలను శుభ్రంగా ఉంచటంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శనివారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో బందరు డివిజన్ పరిధిలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్టు, యూనిఫాంను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు. అలాంటి వారి సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వ్యర్ధాలను తొలగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణించిన, శాశ్వత వైకల్యాలకు గురైన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు రూ.10 లక్షల విలువైన బీమా సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోయ నాగమణి, జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణ, అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ–పంట నమోదు పూర్తి చేయండి చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో ఈ–పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో పలు అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు పంటలు కోల్పోతే నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు, ధాన్యం కొనుగోలు వంటి వాటికి ఈ–పంట నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆలస్యం లేకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్, తల్లికి వందనం పథకాల నగదు జమ కాని లబ్ధిదారుల సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. బ్యాంకు ఖాతాను తెరవటం, బ్యాంకు ఎకౌంట్కు ఆధార్ అనుసంధానం చేయటంపై లబ్ధిదారులకు వివరించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఆదివారం నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 6వ జూనియర్, సీనియర్–సీ విభాగాల నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2025–26 నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాసన భారత్, ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూనియర్స్ (14 నుంచి 18 ఏళ్లు), సీనియర్–సీ (45 నుంచి 55 ఏళ్లు) వారు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. బాల బాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూపు, ట్రెడిషనల్ స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్, సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ ఈవెంట్లతో పాటు సీనియర్–సి విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, స్పెసిఫికేషన్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, యోగాసన భారత్ స్పోర్ట్స్ ప్రతినిధి శ్రేయస్ మార్కండేయ, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.రామకృష్ణ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. -
భూమిలో సారం లేకపోవడమే నష్టాలకు కారణం
మక్కపేట(వత్సవాయి):తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయంకు ప్రభుత్వాలు చేయూతనందించాలని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎం.రవికిషోర్ తెలిపారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫాం గుంటూరు సామాజిక విజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంపై రైతు సదస్సు– వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానురాను వ్యవసాయం అనేది తీవ్ర సంక్షభంలోకి వెళ్తుందని చెప్పారు. వ్యవసాయంలో నష్టాలు రావడానికి ముఖ్య కారణం భూమిలో సారం లేకపోవడమేనని చెప్పారు. గతంలో వ్యవసాయంతో పాటు పాడి పుష్కలంగా ఉండేదని తెలిపారు. దీంతో పశువుల ఎరువును పొలాలకు తోలడం వల్ల భూమిలో సారం పెరిగి పెట్టుబడులు తగ్గడంతోపాటు దిగుబడులు పెరిగాయన్నారు. కానీ ప్రస్తుతం పల్లె ప్రాంతాల్లోనూ పాడి లేకపోవడం వల్ల పశువుల వ్యర్థాలను పొలాలకు చల్లే వారే లేకుండా పోయారని పేర్కొన్నారు. పైగా రసాయనిక ఎరువులు వాడడంవల్ల భూమి చౌడుబారిపోతుందని వెల్లడించారు. దీంతో ఎంత పెట్టుబడులు పెట్టినా దిగుబడులు లేకుండా పోయాయన్నారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. పంట వేయడానికి కనీసం 40 రోజులు మందుగా పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులు, జనుము, పిల్లిపెసలు వంటివి చల్లుకుని దుక్కిలో కలియదున్నుకుంటే మంచిదని స్పష్టం చేశారు. వైరస్లు రాకుండా ఉండడానికి వేపనూనెను పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. అనంతరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన వ్యవసాయ ప్రదర్శన తిలకించారు. కార్యక్రమంలో గృహవిజ్ఞాన శాస్త్రవేత్త ఆర్.ప్రభావతి, సర్పంచ్ మల్లెల శివప్రసాద్, సొసైటీ అధ్యక్షులు సత్తి బేతోలు, కట్టా కోటయ్య,దశరథరామారావు, శర్మ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎం.రవికిషోర్ -
సామాన్య భక్తులకే పెద్దపీట
●అమ్మ దర్శనంలో ఇబ్బందులు లేకుండా చర్యలు ●జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లబ్బీపేట(విజయవాడతూర్పు):దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. అందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా శనివారం జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశాతో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు సామాన్య ప్రజలు ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారు, వారికి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను పరిశీలించారు. సామాన్య భక్తులు లాగా వినాయక టెంపుల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నడుచుకుంటూ పర్యవేక్షించారు. అంతరాలయం, శివాలయం ఏరియా, మహామండపం, లిఫ్ట్ మార్గం, అన్నదానం, ప్రసాదం తయారు చేసే ఏరియాలను, కనకదుర్గా నగర్, ప్రసాదం కౌంటర్లు, రథం సెంటర్, వినాయక టెంపుల్, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు అనధికారికంగా లిఫ్ట్ మార్గం ద్వారా దర్శనాలకు తీసుకువెళుతున్నారనే సమాచారం మేరకు లిఫ్ట్ మార్గాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. అన్నదానం జరిగే ప్రదేశం వద్ద భక్తులను ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం క్యూలైన్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆదేశించారు. వారి వెంట ఎస్పీ గంగాథర్, పశ్చిమజోన్ ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ తదితరులు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
కోనేరుసెంటర్: విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చిలకలపూడికి చెందిన చలమలశెట్టి డూకేశ్వరరావు, నాగలలిత భార్యభర్తలు. డూకేశ్వరరావు రోల్డుగోల్డు వ్యాపారం చేస్తుంటాడు. వీరికి అక్షయ్వేణు(14)అనే కొడుకు ఉన్నాడు. భీమవరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న అక్షయ్వేణు దసరా సెలవులకు రెండురోజుల కిందట ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం డాబాపైకి వెళ్లిన అక్షయ్ ఎంతకీ కిందికి రాలేదు. అదే సమయంలో తండ్రి డూకేశ్వరరావు బయటికి నుంచి ఇంటికి వచ్చాడు. కొడుకు మేడ పిట్టగోడపై వాలి ఉండటాన్ని గమనించి కిందకు రమ్మని పిలిచాడు. అయినా పలుకకపోవడంతో వెంటనే మేడపైకి వెళ్లి తట్టి చూడగా విద్యుత్ షాక్ కొట్టినట్లు అనిపించింది. దీంతో కిందకి వచ్చి మెయిన్ ఆఫ్ చేసి మరలా మేడపైకి వెళ్లి అక్షయ్ను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది అప్పటికే అక్షయ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం అక్షయ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పేర్ని నాని, కిట్టు సందర్శన.. అక్షయ్ మరణవార్త తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), బందరు నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్షయ్ భౌతికకాయాన్ని సందర్శించారు. బాలుడి తండ్రి డూకేశ్వరరావుకు ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆసుపత్రి వద్ద ఉన్నారు. అక్షయ్ అకాలమరణం బాధిత కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. డూకేశ్వరరావు కుటుంబానికి ధైర్యం చెప్పి ఆయా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సహాయంగా ఉండాలని స్థానిక నాయకులకు సూచించారు. -
లక్షమందికి రుణాలివ్వడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాల్మనీ, అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు తమసంస్థ తరఫున అతితక్కువ వడ్డీతో రుణాలిచ్చి చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గోదావరి–కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ (జీకె) లిమిటెడ్ చైర్మన్ మేడూరి జీవన్ వెంకట్రావ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా లక్ష మంది చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శివారులోని సీఎ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఆసంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూ.83.60 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నామని, అందులో రూ.59.41 కోట్లు మేర రుణాలను ఇచ్చి లాభాల బాటలో అడుగుపెట్టామని తెలిపారు. సంస్థ ప్రారంభించిన ఐదేళ్లలో రూ.100కోట్లను డిపాజిట్లుగా సేకరించగా, రూ.70 కోట్లకుపైగా రుణాలను అందించినట్లు చెప్పారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 23 బ్రాంచిలలో 12,788 మంది ఖాతాదారులు, ఏడుగురు డైరెక్టర్లు, 1600 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. భవిష్యత్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో 131 బ్రాంచీలను ఏర్పాటు చేస్తామన్నారు. ధర్మ నిధి ఇన్కం స్కీమ్ ద్వారా ఆలయాలు, చర్చిలు, మసీదులు, వృద్ధ, అనాధ ఆశ్రమాలు వంటి స్వచ్చంద సేవా సంస్థల నిర్వాహకుల నుంచి సేకరించే డిపాజిట్లపై 14.4 శాతం వడ్డీ అందించున్నట్లు తెలిపారు. సమావేశంలో సొసైటీ జనరల్ సెక్రటరీ పూర్ణిమ దామెర్ల, డైరెక్టర్లు, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేడూరి జీవన్వెంకట్రావ్ -
జర్నలిస్టులకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు : జిల్లా ఎస్పీ
కోనేరుసెంటర్: జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొంది అన్ని అర్హతలు కలిగిన జర్నలిస్టులకు కృష్ణాజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అందజేసేందుకు నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు శుక్రవారం తెలిపారు. జిల్లా పోలీస్శాఖ–మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు చేరువగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఈ ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అందజేస్తామన్నారు. మీడియా పేరుతో తప్పుడు కార్డులు చూపించి మోసాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారి ఆట కట్టించేందుకు ఇదో అవకాశమని చెప్పారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయంపై పలు జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి తెలిపారు. ఆందోళనలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.వెంకట్రావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీప్తి మాట్లాడుతూ ఆందోళనలో భాగంగా శుక్రవారం ఆన్లైన్ రిపోర్టింగ్ సేవలు బంద్ చేశామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అక్టోబరు 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక నిరాహారదీక్షలు చేస్తామని వివరించారు. జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ విజయకుమార్, కోశాధికారి డాక్టర్ బి.అరుణ్కుమార్, ఈసీ మెంబర్లు డాక్టర్ సూర్య, డాక్టర్ నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు. -
‘విజయ’ అవుట్లెట్లలో డ్వాక్రా ఉత్పత్తుల విక్రయం
హనుమాన్జంక్షన్ రూరల్: మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ‘విజయ’ బ్రాండ్ పేరిట విక్రయించేందుకు కార్యాచరణ చేపట్టామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. స్థానిక విజయవాడరోడ్డులోని కాకాని భవనంలో చలసాని అధ్యక్షతన 35వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేయడంతోపాటు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. 2018–19లో పాల సేకరణ 6.04 కోట్ల లీటర్లు కాగా, ప్రస్తుతం 10.29 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొన్నారు. వార్షిక టర్నోవర్ రూ.716 కోట్ల నుంచి 69 శాతం వృద్ధితో రూ.1,211 కోట్లను సాధించామని తెలిపారు. యూనియన్ స్థూల లాభం రూ.84 కోట్ల నుంచి 80 శాతం వృద్ధితో రూ.151 కోట్లకు చేరుకుందని వివరించారు. యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పాలకవర్గ సభ్యులు, పాల సహకార సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉండటం అందరి బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాధితులకు అండగా నిలవడంతోపాటు వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత అన్నారు. విజయవాడ హనుమాన్పేట ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్స్టాప్ సెంటర్ను శుక్రవారం ఆమె సందర్శించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్ పనితీరును సమీక్షించారు. సెంటర్లోని కౌన్సెలింగ్ గదులు, వైద్య సదుపాయాలు, తాత్కాలిక వసతి గదులను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. సెంటర్ సిబ్బంది స్వప్న, డబ్ల్యూఎస్ఐ ప్రేమలత ఇతర సిబ్బందితో సమావేశమై బాధితులకు అందుతున్న సాయం, కేసుల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఈ సంధర్భంగా ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వినీత పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత -
కోల్కతా టు మచిలీపట్నం
మచిలీపట్నంటౌన్: దసరా ఉత్సవాల సందర్భంగా కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శతాబ్దకాలంగా ఓ అరుదైన ఆచారం కొనసాగుతోంది. ఇప్పటికీ బందరువాసులు భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తుండటం గమనార్హం. ఆ ఆచారాన్ని పాటిస్తే తమకు సకలశుభాలు కలుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం.శక్తిపటాల ఊరేగింపునకు ప్రసిద్ధి..మచిలీపట్నం దసరా శక్తిపటాల ఊరేగింపునకు పెట్టింది పేరు. విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల తర్వాత అంత పెద్దఎత్తున దసరా వేడుకలు బందరులోనే నిర్వహిస్తారు. శక్తిపటాల ఊరేగింపు విషయానికి వస్తే కోల్కతా తర్వాత అంతస్థాయిలో నిర్వహించేది కూడా మచిలీపట్నంలోనే. ఈ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు దాదాసింగ్ దశాబ్దాల క్రితం కోల్కతాలోని కాళీకామాత చిత్రపటాన్ని నగరంలోని ఈడేపల్లి సెంటర్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు. చిన్న తాటాకుల పందిరి కింద ఏర్పాటు చేసిన కాళికామాత గుడి, నేడు దేవాలయంగా రూపాంతరం చెందింది. నాటి నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. శక్తిపటాల ప్రదర్శనను మచిలీపట్నానికి పరిచయం చేసింది ఆయనే.పండుగ రోజుల్లో మనిషికి శక్తివేషం వేసి వెదురు కర్రలతో తయారుచేసిన దుర్గామాత శక్తి పటానికి కాగితాలు అంటించి దుర్గామాత బొమ్మవేసి రంగులు అద్ది, అతని వీపునకు కడతారు. శక్తిపటాన్ని కట్టుకున్న వ్యక్తి పురవీధుల్లో ఊరేగుతుండగా డప్పులు, తీన్మార్ వాయిద్యాల మోతల నడుమ నృత్యం చేస్తూ భక్తులు అతనిని అనుసరిస్తుంటారు. శక్తిపటం కట్టుకున్న వ్యక్తిని దుర్గామాత ఆవహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలా ఊరేగుతున్న శక్తిపటాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. నల్లని దుస్తులతో ఒక చేతిలో చురకత్తి, రెండో చేతిలో ఆరడగుల శక్తిపటాన్ని భుజానకెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తిభావాలను చాటుతుంది. ముందువైపు కాళీకామాత, వెనుక ఆంజనేయస్వామి చిత్రాలతో రూపొందించిన పటం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. దసరా సందర్భంగా పలువురు పెద్దపులి, ఇతర వేషధారణలతో నగరంలో సంచరిస్తూ దసరా ఉత్సవానికి మరింత శోభను తెస్తుంటారు.సకుటుంబ సపరివారంగా వీక్షణం..గతంలో మచిలీపట్నంలోని శక్తిగుడి, గొడుగుపేట గాయత్రీమాత ఆలయం ఆధ్వర్యంలో ఈ శక్తి పటాల ప్రదర్శనలు జరిగేవి. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు శక్తిపటాలు ఎత్తుకుంటున్నారు. రుద్రభూమిలో తెల్లవారుజామున పూజలు చేసి శక్తిపటాన్ని ఎత్తుకునే వ్యక్తి ఉపవాస దీక్షను స్వీకరిస్తారు. చిన్నాపెద్దా తేడాలేకుండా వారి స్ధాయిని బట్టి శక్తిపటాలను తయారు చేసి ప్రస్తుతం నగరంలో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు స్ధానికులతోపాటు వారి బంధువులు, భక్తులు అధికసంఖ్యలో నగరానికి తరలివస్తుంటారు.కోనేరు సెంటర్లో ప్రత్యేక ప్రదర్శన..శక్తి పటాన్ని ఎత్తుకునే వ్యక్తులు ముఖానికి కాళీకామాత ముఖచిత్రాన్ని కరాళంగా ధరిస్తారు. ఉదయం ఉపవాస దీక్షతో మొదలయ్యే ప్రదర్శన సాయంత్రం వరకూ కొనసాగుతుంది. శక్తిపటాన్ని ధరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. మచిలీపట్నంలోని పలు దేవాలయాల్లో శక్తిపటాలను ఉంచి పూజలు చేస్తారు. విజయదశమి (దసరా)నాటి రాత్రి ఆయా ప్రాంతాల నుంచి శక్తిపటాలు ఊరేగింపుగా బయలుదేరి తెల్లవారుజాము సమయానికి ప్రధానకూడలి కోనేరు సెంటర్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని శక్తి పటాలు కోనేరుసెంటరుకు చేరిన దృశ్యాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలిస్తుండటంతో ఆ ప్రాంతమంతా కోలహలంగా మారుతుంది. శక్తిపటాలు కోనేరు సెంటర్కు చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. -
నృత్యరూపకం
నయన మనోహరం.. విజయవాడ కల్చరల్: దసరా మహోత్సవాల సందర్భంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం (సిద్ధార్థ అకాడమీ అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీ కళావేదికపై శుక్రవారం ప్రదర్శించిన మహాకాళి నృత్యరూపకం నయన మనోహరంగా సాగింది. హైదరాబాద్ ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ అనూరాధ బృందం ప్రదర్శించిన రూపకం ఆసక్తికరంగా సాగింది. దేవీభాగవతం, దేవీ సప్తశతి ఆధారంగా కథను రూపొందించారు.అనూరాధ జొన్నలగడ్డ, నృత్యపర్యవేక్షణలో కాత్యాయని, అపర్ణ, వైష్ణవి, అనూషా తదితరులు నృత్యాలను అభినయించారు. నాట్యాచార్యుడు, వేదాంతం రాధేశ్యాం. డాక్టర్ చింతా రవి బాలకృష్ణ కళాపీఠం నిర్వాహకులు లలిత్నారాయణ ,వెల్లంకి నాగభూషణరావు, బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు. -
దుర్గమ్మ సేవలో శాసన మండలి చైర్మన్
వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని, పకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలు, పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కబడ్డీ పోటీలు ప్రారంభం మైలవరం: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని 12 కళాశాలలోని విద్యార్థులు పాల్గొంటున్నట్లు కళాశాల పీడీ మేజర్ మన్నే స్వామి తెలిపారు. మొదటి రోజు ఈ పోటీలను లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అప్పారావు ప్రారంభించారు. డాక్టర లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి మాట్లాడుతూ నాకవుట్ పద్ధతి పోటీలు నిర్వహించామని, దీనిలో కేబీఎన్ కళాశాల, సిద్ధార్థ కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, విజయ కళాశాల లీగ్ దశకు అర్హత సాధించాయని తెలిపారు. నాట్యాచార్య పిళ్లాకు ప్రతిష్టాత్మక పురస్కారం విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రనాట్య రూప శిల్పి నటరాజ రామకృష్ణ పురస్కారం లభించింది. 2024 సంవత్సరానికి గానూ తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఉమామహేశ్వరపాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ గురువారం హైదరాబాద్లో జరిగిన సభలో అవార్డ్తోపాటు నగదు బహుమతిని విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలిదండ్ల నిత్యానందరావు, తెలంగాణ ఉన్నత విద్యాకార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్ ఎస్. భూపతిరావు చేతులమీదుగా అందజేశారని పేర్కొన్నారు. -
బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ిసనీ హీరో చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనాలని, తక్షణమే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ, కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దేవినేని అవినాష్ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం విజయవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మంచి చేసిన వారిని తూలనాడటం బాల కృష్ణకు అలవాటేనన్నారు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి.. మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ అన్నారు. సభలో లేని వ్యక్తినే కాకుండా, అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా తూలనాడారన్నారు. చిరంజీవిని కించపరిచేలా మాట్లాడినా.. కనీసం ఖండించలేని స్థితిలో జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుచేటన్నారు. గౌరవం పోయింది.. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే తమకు దైవ సమానమని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా బాలకృష్ణపై ఉన్న గౌరవం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పోయిందన్నారు. రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనపైనా దుర్భాషలాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బాలకృష్ణది సైకో బుద్ధి, సైకో ఆలోచనలు: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్టీఆర్, బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలా? అని ప్రశ్నించారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైందా?. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ పెట్టాలి. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొడిగితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడు. సైకో బుద్దులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే. అఖండ సినిమాకు సాయం చేయమని సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పారు.సొంత అన్నలా చిరంజీవిని వైఎస్ జగన్ చూసుకున్నారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది. చిరంజీవి తక్షణం స్పందించడాన్ని వైఎస్సార్సీపీ స్వాగతిస్తుంది. మీ కాళ్ల దగ్గరకు సినిమా వాళ్లు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాం నాటి జీవోనే కూటమి పాలకులు కొనసాగిస్తున్నారు. సినిమా పేదోడికి దగ్గరగా ఉండాలని ఆరోజు మీటింగ్లో వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్సార్ సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేది. చంద్రబాబు హయంలో క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు ఆగిపోయాయని బాలయ్య చెప్పారు.గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత..వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత. కైకలూరు సమస్యల గురించి ఏనాడూ కామినేని శ్రీనివాస్ మాట్లాడరు. సినిమాలు, సినిమా రేట్లు, సినిమా మనుషుల గురించి కామినేని మాట్లాడతారు. కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విచక్షణ, ఇంగితజ్ఞానం లేకుండా కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. మంత్రి పదవి కోసం కామినేని పచ్చి పాపపు మాటలు మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడి రైతులకు నష్ట పరిహారం కింద నాలుగు పైసలు ఇచ్చారా?.ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు..మెరిట్ లిస్టు ప్రకటించకుండా నియామక పత్రాలు ఎలా ఇస్తారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకూ 1998 డీఎస్సీకి దిక్కుందా?. డీఎస్సీ ప్రశ్నాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అంటే హంగూ, ఆర్భాటం, హడావుడి ఉంటుంది. అలాగే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఏమైంది?. కూటమి పాలకులు హెలికాప్టర్లు, విమానాల్లో ఉంటారు.. ప్రజలు ఎవరిని అడగాలి అని ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీ ప్రశాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు. -
పర్యాటకుల పులకింత..
బంగాళాఖాతం –కృష్ణానది సంగమ తీరంలో లైట్హౌస్ మడ అడవుల సోయగం నదీ తీరాన రామలింగేశ్వర మండపం ప్రకృతి పలకరింపు.. ●ఆహ్లాదంగా నాగాయలంక తీరం● సూర్యాస్తమయం సందర్శకులకు నిత్య వసంతం ●పెరుగుతున్న పర్యాటకులు నాగాయలంక: మండలంలోని తీర ప్రాంతం పర్యాటకులకు పులకింత కలిగిస్తుంది. ప్రకృతి రమణీయత మధ్య సందర్శకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక అనుభూతికి, ఆహ్లాదకర సందర్శనకు దక్షిణ బంగాళాఖాతం, పశ్చిమ కృష్ణా పరీవాహక తీర ప్రాంతం నిత్యం సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. దివిసీమ ద్వీపంతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండు దీవులు (ఎదురుమొండి– ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈ ప్రాంత పర్యాటక ఔన్నత్యానికి భరోసా ఇస్తున్నాయి. నిత్యం ఆహ్లాదకరం చేకూరుస్తూ కృష్ణానది, నౌకా దిక్సూచి లైట్హౌస్, స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్, నవలంక పర్యాటక వేదికలయ్యాయి. గ్రామ పంచాయతీ సహకారంతో స్వచ్ఛ నాగాయలంక సొసైటీ టీమ్ సఫలం కావడంతో స్వచ్ఛతా పర్యాటకానికి ఎనలేని ప్రాచుర్యం చేకూరింది. 2016 పుష్కరాల తర్వాత ఈ ఘాట్ను సంరక్షించడంలో స్వచ్ఛ సేవా కార్యకర్తలు కీలకపాత్ర వహించటంతో క్రమేణా సందర్శకుల రాకకు ప్రాధాన్యం పెరిగింది. సందర్శకులు కృష్ణానదిలో బోటు షికారు చేసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రైవేటు బోట్లను కిరాయికి మాట్లాడుకుని సరదాగా నదిలోకి సమీపంలోని నవలంకలోకి వెళ్లి రౌండ్స్ కొడుతున్నారు. ఈ 17 ఎకరాల ఐలెండ్ను ఆధునిక ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు సైతం వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో ప్రతి నిత్యం కనిపించే సూర్యాస్తమయ విభిన్న దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడం పరిపాటిగా మారింది. దృష్టి పెట్టని పర్యాటక శాఖ.... ఇంతగా పర్యాటక వైచిత్యం కనిపిస్తున్నా సంబంధి పర్యాటకశాఖ మాత్రం ఇటువైపు దృష్టి పెట్టడంలేదు. పర్యాటక శాఖ రూ.1.25 కోట్లతో ఫుడ్ కోర్టు భవనాన్ని 90 శాతం పూర్తి చేసినప్పటికీ నిర్వహణ విస్మరించి టీడీపీ నాయకులకు అప్పగించడం గమనార్హం. అన్ని జాగ్రత్తలతో పర్యాటక శాఖ ఇక్కడ బోటు షికారు పాయింట్ నిర్వహిస్తే మంచి ఆదరణ అభిస్తుందని సందర్శకులు అంటున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నెలకొల్పిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ జలక్రీడల శిక్షణ చాలాకాలంగా ఆగిపోయింది. సందర్శకుల దిక్సూచిగా కూడా అలరిస్తున్న మరో పర్యాటక సువర్ణావకాశం కృష్ణా సాగర సంగమ తీరంలో ఆకర్షించేది కేంద్ర నౌకాయాన శాఖకు చెందిన నాగాయలంక లైట్హౌస్. కృషానది దక్షిణ పాయ నాగాయలంక దిగువున మరో మూడు పాయలుగా చీలిక ఏర్పడి సాగర సంగమం చెందే సమీపంలో ఈ దీప స్తంభం విశేషంగా అలరిస్తుంది. సొర్లగొంది, గుల్లలమోద నుంచి సముద్ర పాయల్లో బోట్లపై ప్రయాణిస్తే లైట్హౌస్ పరిసరాల్లో విస్తరించిన వేలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవచ్చు. దశాబ్దాల కలగా కృష్ణానదిపై తలపెట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం జరిగితే రెండు దీవుల నడుమ ఉన్న ఈప్రాంతం అలరించే పర్యాటక ప్రదేశంగా మారడంలో అతిశయోక్తి ఉండదు. -
తప్పిన ఘోర ప్రమాదం
కొండ రాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పామర్రు:విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిలో స్థానిక జాలయ్య మిల్లు వద్ద కొండరాళ్లతో వెళ్తున్న లారీ జోరు వానలో బోల్తా పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు కొండ రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ స్థానిక జాలయ్య మిల్లు వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న వర్షపు నీటిని తప్పింబోయి రోడ్డు మధ్యలోకి వచ్చింది. ఈ క్రమంలో కారును తప్పించబోయి లారీని ఎడమవైపునకు తిప్పడంతో లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న పెద్ద పెద్ద కొండరాళ్లు అన్ని చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో ఎక్కువగా వాహనాలు రాకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జోరు వానలో సైతం కొండ రాళ్లను డోజర్తో పక్కకు తొలగించి ట్రాఫిక్ను ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో క్లియర్ చేయించారు. బోల్తా పడిన లారీని క్రేన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ సంఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చల్లపల్లి:మండల పరిధిలోని మాజేరులో పుట్టకు వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యకి మృతదేహం లభ్యమైన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం బాడీని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడు బంధువులు గురువారం వచ్చి మృతి చెందిన వ్యక్తిని గుర్తించారు. ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామానికి చెందిన గుబిలి సుబ్రహ్మణ్యం అని ఇంటి పట్టున ఉండకుండా తరచూ ఊర్లు తిరుగుతాడని తెలుపగా పోస్టుమార్టం అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. పామర్రు:పామర్రు–చల్లపల్లి రహదారిలో రెండు బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పామర్రు గ్రామ శివారు శ్యామలాపురానికి చెందిన తలగల ప్రసాద్ (43) మోటార్ సైకిల్పై బయలు దేరి వస్తుండగా, ఎదురుగా వస్తున్న మరొక బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తికి గాయాలవ్వడంతో వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. -
పరిసరాల శుభ్రతలో భాగస్వామ్యం
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోనేరుసెంటర్: ప్రజలంతా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ గ్రామాలు, పట్టణాల్లో జరిగే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా గురువారం మచిలీపట్నం మండలంలోని ఎస్.ఎన్.గొల్లపాలెంతో పాటు గూడూరులో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ గొల్లపాలెంలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. గ్రామ చెరువు దగ్గర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్, అధికారులు, సిబ్బంది గ్రామస్తులతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో జిల్లాలోని చెత్తకుప్పలను తొలగించి పరిశుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆ ప్రాంతాల్లో చెత్త వేయకుండా గ్రామస్తులందరికీ అవగాహన కల్పించడంతో పాటు పర్యవేక్షణ ఉంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 300 వరకు చెత్తకుప్పలను గుర్తించామని వచ్చే అక్టోబర్ 2వ తేదీ నాటికి వీటన్నిటిని పరిశుభ్రం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఆయన గూడూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో చెత్త తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కుంచె నాని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలం నాగమణి, డివిజనల్ పంచాయతీ అధికారి రజావుల్లా, ఎంపీడీవో వెంకటేష్, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదికి పెరిగిన వరద ప్రవాహం
ఇబ్రహీంపట్నం:ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వరదనీరు వచ్చి చేరడంతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. 3.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగటంతో ఇబ్రహీంపట్నం మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా చినలంక, పెదలంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పడవలను ఆశ్రయించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ రేవు వద్దకు చేరుతున్నారు. ఆర్డీఓ కావూరి చైతన్య ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం, ఫెర్రీ, చినలంక గ్రామాల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రవాహం అధికంగా ఉన్నందున నాటు పడవలు వాడవద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పడు సమాచారం అందించాలని రెవిన్యూ, మున్సిపల్ అఽధికారులను ఆదేశించారు. అవసరమైతే ట్రక్ టెర్మినల్ వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రక్ టెర్మినల్ వద్ద గతంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ గదులు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తహసీల్ధార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పామర్రు:అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం మాజీ మంత్రి పేర్రి నానికి కాల్ చేయటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ పెద్ద సైకో అని ధ్వజమెత్తారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వస్తే వారి సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టి సైకోలా ప్రవర్తించింది బాలకృష్ణనే అన్నారు. వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికీ లేదన్నారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. శాసనసభలో హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు శాసన సభ నిర్వహిస్తున్నారా లేక మాజీ ముఖ్యమంత్రిని విమర్శించడానికి నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి, సూపర్సిక్స్ను సూపర్ ప్లాప్ చేసి వాటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టారన్నారు. సభలో ఎలా వ్యవహరించాలో బాలకృష్ణ తెలుసుకోవాలన్నారు. -
దీనదయాళ్ స్ఫూర్తితో వైద్య శిబిరాలు
నున్న(విజయవాడరూరల్): మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నున్న గ్రామంలో గురువారం నిర్వహించిన స్వాస్ధనారి ససక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని చెప్పారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధుల నేపథ్యంలో నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక దశలో వాటిని గుర్తిస్తే నివారణ సులభంగా ఉంటుందన్నారు. వైద్య శిబిరాల్లో 14 రకాల వైద్య పరీక్షలు చేస్తారని, ఇప్పటి వరకు 16,500 వైద్య శిబిరాల్లో 34 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయించామని వెల్లడించారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు మునగ ఆకు తీసుకోవాలని తెలిపారు. తొలుత పండిట్ దీన్ దయాళ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ నిర్మల గ్లోరీ, డాక్టర్ శిరీష, డాక్టర్ మోతిబాబు,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ , వైద్య సిబ్బంది నున్న సొసైటీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.నూతన వరి వంగడాలను పరిశీలించిన శాస్త్రవేత్తలుఅవనిగడ్డ:ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఘంటసాల కృషి వి/్ఙాన కేంద్రం, కృష్ణా జిల్లా కేవీకే శాస్త్రవేత్తల బృందం అవనిగడ్డలో చిరుపొట్ట దశలో ఉన్న వరి వంగడాలను (బీపీటీ 3284 ఆర్జిఎల్ –7034) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృషి వి/్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ డి.సుధారాణి రైతులకు పలు సూచనలు చేశారు. నూతన వరి వంగడాల వల్ల ఖర్చులు తగ్గించుకుని దిగుబడి పెంచుకోవచ్చన్నారు. జిల్లా వనరుల కేంద్రం మచిలీపట్నం, ఘంటసాల, కృషి వి/్ఞాన కేంద్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీడీవో జ్యోతి రమణి, అవనిగడ్డ ఏడీ జయప్రద, శ్రీనివాస్, కృషి వి/్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు రేవతి, వెంకటలక్ష్మి, ఏఓ పద్మజ, సంజీవ్, హారిక, అవనిగడ్డ సబ్ డివిజన్ వీఏఏలు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న
ఇసుక మాఫియా మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, ఫెర్రీ వద్ద నదిలో ఇసుక తవ్వుతూ కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. భారీసైజు పడవల్లో డ్రెడ్జింగ్ యంత్రాలు బిగించి ఇసుక తోడేస్తున్నారు. ఒడ్డుకు చేరిన ఇసుక మ్యాన్యువల్ క్రేన్ల ద్వారా ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారు. 20 పడవల ద్వారా కృష్ణానది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిపి కృష్ణమ్మకు గర్భశోకం మిగుల్చుతున్నారు. 20 పడవల ద్వారా వచ్చిన ఇసుకను 18 మ్యాన్యువల్ క్రేన్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. పడవల యజమానులు క్రేన్, తాము ఆక్రమించిన స్థలానికి నెలకు రూ.3 లక్షల అద్దె డిమాండ్ చేస్తున్నారంటే ఫెర్రీ రేవులో ఇసుకకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
కాత్యాయనీదేవిగా కరుణించిన దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి గురువారం భక్తులు పోటెత్తారు. కాత్యాయనీదేవిగా కరు ణించిన జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పిల్లాపాపలతో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లతోపాటు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, పూజలు, నివేదన అనంతరం భక్తులను దర్శనా నికి అనుమతించారు. పదేళ్ల తర్వాత దుర్గమ్మను కాత్యాయనీదేవిగా అలంకరించడంతో అమ్మను దర్శించుకోవాలనే తపనతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అన్ని క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనానికి మూడు నుంచి మూడున్నర గంటల సమయం పట్టింది. రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులతో పాటు ఉచిత దర్శనానికి విచ్చేసిన వారిని సైతం ఒకే క్యూలైన్లోకి అనుమతిఇస్తున్నారని, దీంతో తమకు మరింత ఆలస్యం అవుతుందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండ దిగువన టోల్గేట్ వద్ద భక్తులు గుంపులు గుంపు లుగా చేరి క్యూలైన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.వీఐపీ టైం స్లాట్ మార్పులతో గందరగోళంఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు నిర్ణయించిన వీఐపీ టైం స్లాట్లో మార్పులు చేస్తున్నట్లు బుధవారం రాత్రి ఆలయ అధికారులు అకస్మాత్తుగా ప్రకటించారు. ఉదయం ఐదు నుంచి ఆరు, మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు, రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు వీఐపీలకు కేటాయించారు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రముఖులు, వీఐపీలు ఈ మార్పులు తెలియక గురువారం ఉదయం ఏడు గంటలకు ఆలయానికి చేరుకున్నారు. సమయం ముగిసిందని వారిని దర్శనానికి అనుమతించకపోవడంతో గందరగోళం నెలకుంది. మరో వైపు సేవా బృందం సభ్యురాలైన బొడ్డు నాగలక్ష్మి వీఐపీ గేట్ వద్ద బైఠాయించారు. తమ బంధువులను దర్శనానికి తీసుకెళ్తూ తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఘాట్రోడ్డుపై ట్రాఫిక్ జామ్మధ్యాహ్నం మూడు గంటల నుంచి వీఐపీ టైం స్లాట్ ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అమ్మవారి దర్శనానికి సొంత వాహనాల్లో కొండపైకి చేరుకునేందుకు బారులు తీరారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాల్లో ఘాట్రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓం టర్నింగ్ నుంచి కొండ దిగువన గాలిగోపురం వరకు కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి. దిగువన గాలి గోపురం నుంచి హెడ్ వాటర్ వర్కు వరకు, హెడ్ వాటర్ వర్క్స్ నుంచి దుర్గాఘాట్ వరకు కార్లు, ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. కొన్ని వాహనాలకు ఒక సారి వినియోగించేలా పాస్లు జారీ చేయగా, అవి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండపైకి, కిందకు తిరుగుతూ అనధికార వీఐపీలను చేరవేస్తున్నాయని దేవస్థాన సిబ్బందే బహిరంగంగా పేర్కొంటున్నారు.మహామండపం లిఫ్టు, మెట్ల మార్గాలకు తాళాలుఅమ్మవారి ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరగడంతో కొండపైకి చేరుకునే మార్గాలను పోలీసులు మూసివేశారు. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గాలకు తాళాలు వేయడంతో ఆలయంలో మధ్యాహ్నం నుంచి విధులకు హాజరు కావాల్సిన వారు గేట్ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరో వైపు కుమ్మరిపాలెం సెంటర్లో డ్యూటీ పాస్లు ఉన్న ఆలయ సిబ్బందిని, మేళం సిబ్బందిని దుర్గగుడి వైపు అనుమతించలేదు. పాస్లు ఉన్నా సరే కొండ చుట్టూ తిరిగి వెళ్లాలని పోలీసులు స్పష్టం చేయడంతో వారు ఇబ్బందిపడ్డారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.సర్వ దర్శనం క్యూలైన్లో కలెక్టర్, ఎంపీకాత్యాయనీదేవి అలంకారంలో దుర్గమ్మను పలువురు గురువారం దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కెనాల్రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి సర్వ దర్శనం క్యూలైన్లో నడిచి ఆలయానికి విచ్చేశారు. మార్గమధ్యలో క్యూలైన్లో వస్తున్న భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆలయానికి వచ్చేసరికి వీఐపీ టైం స్లాట్ ముగియడంతో బంగారు వాకిలి ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. ఆయన గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు.ఆది దంపతుల నగరోత్సవందసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిదంపతుల నగరోత్సవం వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకీపై శ్రీ గంగాపార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారు అధిరోహించారు. ఆది దంపతులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్ కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల కోలాట నృత్యాలతో ఆది దంపతుల ఊరే గింపు ఇంద్రకీలాద్రి పరిసరాల్లో సాగింది.దుర్గగుడిపై నేడుశుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి అమ్మవారి దర్శనంఉదయం ఆరు గంటలకు ప్రత్యేక ఖడ్గమాలార్చనఉదయం ఏడు గంటలకు ప్రత్యేక కుంకుమార్చనఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనసాయంత్రం 5 గంటలకు శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తిరాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం -
కృష్ణమ్మ విలవిల.. కాసులు గలగల
నదీగర్భాన్ని తోడేస్తున్న ఇసుకాసురులు వాల్టా చట్టానికి తూట్లు ఇసుక తవ్వకాల నిబంధనలు గాలికి రోజుకు రూ.లక్షల్లో సంపాదన కృష్ణానది నుంచి తవ్విన ఇసుకను రోజుకు 500 ట్రాక్టర్లు అక్రమ మార్గాన తరలించి రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఒక్కొక ట్రాక్టర్ లోడింగ్కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాదారుల నుంచి మునిసిపాలిటీ ఆశీలు టెండర్ దారులు ట్రాక్టర్కు రూ.100 లెక్కన వసూలు చేస్తూ అక్రమ సంపాదనలో భాగమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలు అరికట్టాల్సిన వారే అక్రమ వసూళ్లకు పాల్బడటం విడ్డూరంగా ఉంది. ఇసుక రవాణాకు ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండ టంతో మైనింగ్ రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్ ఏడీ వీరాస్వామి ఆరు నెలల క్రితం ఇదే ఇసుక రేవులో దాడిచేసి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్లు, 10 పడవలను సీజ్ చేసి డ్రైవర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా తిరిగి యథేచ్చగా ఇసుక రవాణాతో అక్రమ సంపాదనకు తెరతీశారు. -
కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది. -
థియేటర్లో జనసేన నాయకుడిపై టీడీపీ శ్రేణులు దాడి
కృష్ణాజిల్లా: జిల్లాలోని గుడివాడలో ఓజీ సినిమా ప్రదర్శన సందర్భంగా జనసేన నాయకుడు, గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గతరాత్రి ఓజీ సినిమా ప్రదర్శన సమయంలో G3 థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా హాల్లో మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకుల్ని.. థియేటర్లో మద్యం సేవించొద్దంటూ మురళీకృష్ణ కోరాడు. ఆడవాళ్లు ఉన్నారని, మద్యం సేవించడం కరెక్ట్ కాదని మురళీకృష్ణ అన్నాడు. దాంతో మద్యం మత్తులో ఉన్న టీడీపీ నాయకులు.. మురళీకృష్ణపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.టిడిపి నేతల పై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మురళీకృష్ణ. తన స్నేహితుల వల్లే ఈరోజు తాను ప్రాణాలతో ఉన్నానని మురళీకృష్ణ అంటున్నాడు. -
గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం
కంచికచర్ల: ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో పడి ఆదివారం గల్లంతయిన యువకుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం సోమవారం బయటకు తీశారు. ఎస్ఐ పి.విశ్వనాథం కథనం మేరకు కంచికచర్ల నేషనల్ హైవే సమీపంలో ఎగువన కురిసిన వర్షాలకు ఆదివారం నల్లవాగు పొంగి పొర్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో మండలంలోని బత్తినపాడు గ్రామానికి చెందిన కామా శ్రీనివాసరావు(35) కంచికచర్ల నుంచి స్వగ్రామమైన బత్తినపాడుకు బైక్పై బయలుదేరాడు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా బైక్ను వేగంగా వాగులో నడిపాడు. దీంతో బైక్తో సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెతుకులాట ప్రారంభించారు. బైక్ మాత్రమే దొరికింది. గల్లంతయిన శ్రీనివాసరావు ఆచూకీ తెలియలేదు. ఈ విషయం గురించి ఎన్డీఆర్ఎప్ బృందానికి సమాచారం అందించగా వారు సోమవారం ఉదయం 6 గంటల నుంచి నల్లవాగులో వెతుకులాట ప్రారంభించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు గల్లంతయిన శ్రీనివాసరావు మృతదేహాన్ని కనుగొన్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసిన బంధువులు, కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య ఉన్నారు. పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అసెంబ్లీలో నూతన కౌలు చట్టం ఆమోదించాలి
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రదర్శన, ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన కౌలు రైతు చట్టం తీసుకువచ్చి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని, అన్నదాత సుఖీభవ ప్రతి కౌలురైతుకూ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన, ధర్నా జరిగింది. కౌలు రైతులు రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన చేశారు. ధర్నా చౌక్లో రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకుడు బి.బలరాం, రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణ్ణయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి పేషీలో వినతిపత్రం సమర్పించారు. -
బూడిద పోరుబాటకు మంత్రి వ్యాఖ్యలు దన్ను
ఇబ్రహీంపట్నం: ఇటీవల ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్రమ బూడిద డంపింగ్, కాలుష్యం నివారణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. బూడిద అక్రమ నిల్వలు, రవాణా, కాలుష్యం, ప్రజల ఆరోగ్యం, లారీ ఓనర్ల ఇబ్బందులపై మాజీ మంత్రి జోగి రమేష్ పోరుబాట పట్టి కార్యకర్తలతో కలసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సోమవారం బూడిదపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈ ప్రాంత సమస్యలపై లేవనెత్తిన అంశాలు కూడా ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ బూడిద పోరుబాటలో భాగంగా వెల్లడించిన కాలుష్యం, ప్రజల ఇబ్బందులనే ప్రస్తావించారనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. అవసరమైతే బూడిద టెండర్ నగదు రూ.2.8 కోట్లు తన సొంత డబ్బులు చెల్లిస్తానని చెప్పడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండపల్లి మున్సిపాలిటీలో చిరు వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేయొద్దని, వారి ద్వారా రావాల్సిన ఆశీలు పైకం తన సొంత డబ్బులు మున్సిపాలిటీకి చెల్లిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ నగదు చెల్లించకుండా మున్సిపాలిటీ ఆశీల ప్రక్రియనే రద్దు చేయించారనే అపప్రథ ఆయన మూటగట్టుకున్నారు. బూడిద విషయంలో ఎమ్మెల్యే వసంత లేవనెత్తిన అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పైగా ఎన్టీటీపీఎస్ చెరువు నుంచి బూడిద రవాణా, జాతీయ రహదారి పక్కన బూడిద డంపింగ్ యార్డుల వలన గ్రామాల్లో కాలుష్యం పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బూడిద పోరుబాటకు మంత్రి రవికుమార్ బలం చేకూర్చారనే చర్చ ఈ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి జాతీయ రహదారి పక్కన అక్రమ బూడిద డంపింగ్ల వలనే కాలుష్యం పెరిగిందని, అందువలనే ఏపీ జెన్కో బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు టెండర్ ద్వారా అప్పగించిందని ఇటీవల కాలంలో జోగి రమేష్ అక్రమ బూడిద పోరుబాట ద్వారా పదేపదే వెల్లడించిన విషయం తెలిసిందే. -
టిప్పర్ను ఢీకొని పాస్టర్ ప్రేమ్ రాజ్ దుర్మరణం
ఘంటసాల: మండలం లోని లంకపల్లి జాతీయ రహదారిపై టిప్పర్ను ఢీకొని మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో పాస్టర్గా పని చేస్తున్న కె.సుబ్బారావు (ప్రేమ్ రాజ్)(41) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, సేకరించిన వివరాల మేరకు ఆదివారం రాత్రి చల్లపల్లి వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ మరమ్మతులకు గురి కావడంతో లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై నిలిపివేశారు. పాస్టర్ ప్రేమ్రాజ్ తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా మోర్తోట గ్రామంలోని చర్చిలో ఆదివారం రాత్రి ప్రార్థన ముగించుకుని బుద్దాలపాలెంకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. లంకపల్లి గ్రామం వద్ద చీకట్లో ఉన్న టిప్పర్ను గమనించిక వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రేమ్రాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారు ముగ్గురిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ప్రేమ్రాజ్ మృతి చెందినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివిసీమ పరిసర ప్రాంతాల పాస్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రేమ్ రాజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బుద్దాలపాలెంలో పాస్టర్ ప్రేమ్రాజ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. పెడన: పెడన–గుడివాడ జాతీయ రహదారిలో ఉన్న పల్లోటి ఇంగ్లిష్ మీడియం హైస్కూలు వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనదారుడు విద్యార్థుల సైకిళ్లను ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల మేరకు పట్టణానికి చెందిన జల్లూరి గిరిష్, గుత్తి లోహిత్, షేక్ మతీన్, మహమ్మద్ ముదాసిర్ పదో తరగతి చదువుతున్నారు. స్పెషల్ క్లాసులు అనంతరం రాత్రి 8 గంటల సమయంలో నలుగురు నాలుగు సైకిళ్లపై పెడన వైపుగా బయల్దేరారు. పల్లోటి కాలనీ నుంచి ద్విచక్రవాహనంపై యార్లగడ్డ వీరబాబు మద్యం తాగి లైటు లేని ద్విచక్ర వాహనంపై వస్తూ వీరిని ఢీకొట్టి కింద పడిపోయాడు. గిరిష్ కాలికి తీవ్ర గాయం కాగా మిగిలిన ముగ్గురు విద్యార్థులకు కూడా కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వీరబాబుకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్కూలు ఉపాధ్యాయు లు పెడనలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. పెడన పోలీసులు వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎస్ఎఫ్ఐ డిమాండ్ మచిలీపట్నంఅర్బన్: దసరా సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమంలో ఈమేరకు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమరం మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాల సందర్భంగా అధికారికంగా సెలవులు ప్రకటించిందని, అయితే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు బషీమ్, మండల కార్యదర్శి ప్రదీప్, జైకర్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి బదిలీ
ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం డీసీవోగా నియామకం గన్నవరంరూరల్: మండలంలోని వీరపనేని గూడెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా కో ఆర్డినేటర్ ఆఫీసర్(డీసీవో)గా బదిలీ అయ్యారు. 2023లో ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన ఆమె వీరపనేనిగూడెం గురుకుల పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత, 10వ తరగతిలో విద్యార్థులు 500 మార్కులు పైబడి సాధించారు. పదవ తరగతిలో నూరు శాతం, జూనియర్ ఇంటర్లో నూరు శాతం, సీనియర్ ఇంటర్లో 97 శాతం ఉత్తీర్ణతతో పాటు, అత్యధిక మార్కుల సాధన ఆమె కృషికి నిదర్శనం. జిల్లాలో గురుకులాన్ని మొదటి స్థానంలో ఉంచారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరఫున హాజరయ్యారు. బెంగళూరు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ లీడర్షిప్పై ఆమె చేసిన ఉపన్యాసం మేధావులను ఆకట్టుకుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు భాగం చేయాలని చేసిన సూచనలు సమగ్ర శిక్షలో స్వీకరించటం ఆమె ప్రతిభకు నిదర్శనం. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రిన్సిపాల్గా, అవార్డులు, రివార్డులు ప్రభుత్వం నుంచి ఆమె స్వీకరించారు. ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా డీసీవోగా బాధ్యతలు చేపడుతున్న యశోదలక్ష్మిని పలు సంస్థలు అభినందించాయి. పామర్రు: ఉమ్మడి కృష్ణాజిల్లా ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పామర్రు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారని హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు అన్నారు. స్థానిక హైస్కూల్లో విజేతలైన విద్యార్థులను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పోటీలలో ఏడు మెడల్స్ను విద్యార్థులు సాధించారన్నారు. విజయశ్రీ స్వర్ణ పతకం సాధించగా, శ్యామ్, పవన్కుమార్ రజత పతకాలు సాధించారని, హారిక, ఆశ్లేషిత, శర్మిక, త్రివేణి, రచన కాంస్య పతకాలు సాధించారని అన్నారు. విజేతలైన విద్యార్థులకు, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ జి.మురళిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్ల పరిశీలన
విమానాశ్రయం(గన్నవరం): ఈ నెల 24వ తేదీన ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విజయవాడ పర్యటన సందర్భంగా సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సీఆర్పీఎఫ్ డీఐజీ కమలేష్ సింగ్ నేతృత్వంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, రాష్ట్ర ఇంటిలిజెన్స్ భద్రతా విభాగం డీఐజీ హఫీజ్, కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని కమలేష్ సింగ్ సూచించారు. ఉపరాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు విభాగంతో కేంద్ర భద్రతా దళాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, బాంబ్, డాగ్ స్క్వాడ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఉపరాష్ట్రపతి ఈ నెల 24న సాయంత్రం 4.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గం ద్వారా ఐదు గంటలకు విజయవాడ చేరుకుని శ్రీకనకదుర్గమ్మను దర్శించుకుంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం పున్నమి ఘాట్ను సందర్శించిన తర్వాత 7.20 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకుని తిరుపతి బయలుదేరి వెళ్తారని చెప్పారు. విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పోలీసు గౌరవ వందనం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. సదరు మార్గంలో రహదారిపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.ఎల్.కె.రెడ్డి, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మబీర్ జకర్, అసిస్టెంట్ కమాండెంట్ తేజ్ బహదూర్, డీపీఓ డాక్టర్ జె.అరుణ, డీఎస్ఓ మోహన్బాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మృతదేహంతో ఎస్టీల నిరసన
పెడన: చనిపోయినా ఆరడుగుల స్థలం దొరక్క రాష్ట్రంలో ఇప్పటికీ షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఎదుర్కొంటున్న సమస్యకు ఈ ఘటన అద్దం పడుతోంది. పెడన మండలం నందిగామ గ్రామంలో ఎస్టీ యానాదులకు చెందిన ఈగ రాంబాబు (76) ఆదివారం ఉదయం చనిపోయారు. రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. అయితే గ్రామంలో ఉన్న ఏడు శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి ఆయా సామాజిక వర్గాలల వారు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మృతదేహంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన చేపట్టారు. ఆధార్ సహా తగిన గుర్తింపు కార్డులు ఉన్నా, తమ సమస్యలను పరిష్కరించే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏకసిరి వెంకటేశ్వరరావు సహా పలువురు సంఘ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎం.ఫణిధూర్జటి, పెడన ఇన్చార్జ్ తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ ఎ.అరుణకుమారి హుటాహుటిన నందిగామకు చేరుకుని శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించినా ఫలితం కనబడలేదు. అయితే చివరకు రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి స్థలం ఇచ్చేందుకు పెద్ద మనసుతో ఒక రైతు ముందుకు రావడంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారమైంది. కలెక్టర్కు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం శూన్యం ఇటీవల శ్మశానం కోసం స్థలం కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశామని ఈగ రాంబాబు కుటుంబసభ్యులు సహా పలువురు తెలిపారు. అయినా ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎస్టీలు తమ ఆందోళనను విరమించారు. -
రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో కేసులకు సత్వర పరిష్కారం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దీర్ఘకాలికంగా పరిష్కారం కాని రైల్వే సంబంధిత వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అమరావతి బెంచ్ సభ్యురాలు (జ్యుడిషియల్) డాక్టర్ ఆర్.సత్యభామ అన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో గుంటూరులో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సత్యభామ మాట్లాడుతూ రైల్వే బాధితులకు పరిష్కారాలను వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 31 ప్రతిపాదిత కేసులను ఎంపిక చేసి వాటిలోని బాధితులకు రైల్వే సంబంధిత క్లెయిమ్స్, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా కేసులు వేగవంతమైన పరిష్కారంతో పాటు చట్టపరమైన పక్రియను తగ్గించడం, బాధితులకు అనుకూలమైన పరిష్కారం లభిస్తుందన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నిర్వహించే లోక్ అదాలత్ సేవలను రైల్వే సంబంధిత బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం జరిగిన లోక్ అదాలత్లో అమరావతి బెంచ్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్, డెప్యూటీ సీసీఎం బాలాజీ కిరణ్ కార్యకలాపాలను పర్యవేక్షించారు. -
బంతి పూల సోయగం
పెనుగంచిప్రోలు: బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా మహిళలు బతుకమ్మ ఆటలు విశేషంగా ఆడుతున్నారు. ఈ పండుగకు పూలే కీలకం కావటంతో రైతులు పూలసాగుపై దృష్టి పెడుతున్నారు. అయితే స్థానికంగా పూలు లభించకపోతే ధరలు పెరుగుతాయి. ఇటీవల కొందరు రైతులు సంప్రదాయ పంటలైన మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేసి నష్టపోవటంతో పూల సాగును చేపట్టారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు బంతిపూల సాగు చేపట్టి లాభాలు అందుకుంటున్నారు. వాణిజ్య పంటలకు బదులుగా... వాణిజ్య పంటల సాగుకు అధిక పెట్టుబడులు, పలు రకాల తెగుళ్ల తో పాటు వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పూలు, కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వీటి ద్వారా తక్కువ పెట్టు బడితో పాటు తక్కువ సమయంలో పంట చేతి కొస్తుండటంతో రైతులు పూల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఆదాయం వస్తుందనే నమ్మకం... ప్రస్తుతం బతుకమ్మ ఉత్సవాలు, దీపావళి రానుండటంతో పూలకు మంచి గిరాకీ ఉంటుందనే ఆశ ఉందని రైతులు అంటున్నారు. నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలంలో పెనుగంచిప్రోలు, కొళ్లికూళ్ల, కొ.పొన్నవరం గ్రామాలతో పాటు వత్సవాయి మండలంలోని వత్సవాయి, మక్కపేటతో పాటు పలు గ్రామాల్లో రైతులు బంతిపూల సాగు చేస్తున్నారు. నారు నాటిన రెండు నెలల్లో పూలు కోతకు వస్తాయని, రెండు నెలల వరకు ఎకరానికి రోజుకు క్వింటా పూలు వస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒకటి, రెండు కిలోలు అయితే కిలో రూ.70 నుంచి రూ.80కు తోట దగ్గరే విక్రయిస్తున్నామని, 50 కిలోలు పైన అయితే కిలో రూ.50 నుంచి రూ.60కు ఇస్తున్నామని రైతులు తెలిపారు. ఈ బతుకమ్మ సీజన్లో మంచి ఆదాయం వస్తుందని పక్క గ్రామాల నుంచి కూడా పూల కోసం వస్తారని అంటున్నారు. రైతులకు ప్రభుత్వం నారు సరఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బంతి పూల సాగు రైతుకు మరింత లాభసాటిగా ఉంటుంది. ప్రకృతి సహకరిస్తే రోజుకు ఎకరానికి క్వింటా దిగుబడి వస్తుంది. ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోంది. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. నాలుగు ఎకరాల్లో బంతి పూల సాగు చేశాను. కొందరు పొలం వద్దే పూలు కొంటుండగా, మిగతా పూలు మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముతున్నాను. –గుడిమెట్ల శంకర్, రైతు, పెనుగంచిప్రోలు -
ఆధునిక సాంకేతికతతో పటిష్ట బందోబస్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఆయన బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్యూలైన్లు, భక్తుల రద్దీ వంటి అంశాలను పరిశీలించారు. డీసీపీ కె.జి.వి.సరిత క్యూలైన్లను పరిశీలించి పోలీసు అధికారులు, దుర్గగుడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. ఎంతో వ్యయప్రయాసలు పడుతూ వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే సదుద్దేశంతో పోలీస్ సేవాదళ్ను ఏర్పాటు చేశామన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తగు ఆదేశాల జారీ చేశారు. పున్నమీ ఘాట్లో ఉత్సవాలకు సైతం ఉపరాష్ట్రపతి వెళ్లిన దృష్ట్యా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. -
ఆశలు.. కన్నీటి పాలు!
కంకిపాడు: సీజన్ ఏదైనా రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు చితికిపోతున్నారు. తాజాగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అరటి రైతులకు అపార నష్టం మిగిల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలమట్టం కావటంతో అన్నదాతలు భారీగా నష్టపోయారు. ప్రాథమికంగా పంట నష్టం నమోదు అంచనాల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. వెన్నువిరిగిన అరటి రైతు.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో అరటి సాగు జరుగుతోంది. ప్రధానంగా కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు లంక గ్రామా లు, కరకట్ట వెంబడి గ్రామాల్లో అరటి సాగవుతోంది. కూర అరటి, తినే అరటి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట గెలల మీద ఉంది. అదును రాగానే గెలలు కోసి మార్కెట్కు తరలించేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడి న భారీ వర్షం కురిసింది. దీని ప్రభావంతో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. చేతికొచ్చిన పంట నేలవాలి గెలలు దెబ్బతినటంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రాథమిక అంచనాల్లో అధికారులు.. అరటి పంట దెబ్బతినటంతో జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పంట నష్టం వివరాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. కోత దశలో ఉన్న పంట దెబ్బతినటంతో తమను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోలుకోని దెబ్బతో విలవిల.. వరుసగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయారు. నష్టాన్ని అధిగమించి, తిరిగి సాగు చేపట్టిన రైతులకు వరుసగా ముంచుకొస్తున్న విపత్తులతో నష్టం జరుగుతోంది. మే నెలలో అకాల వర్షానికి కృష్ణాజిల్లాలో వివిధ రకాల పంటలు 92.40హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 127 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి అరటి తోటలకు నష్టం జరిగింది. అధికారులు మొక్కుబడిగా పంట నష్టం వివరాలను నమోదు చేయకుండా పూర్తి స్థాయిలో పంట నష్టం నమోదు చేసి తమను ఆదుకోవాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతుంది. 80 సెంట్ల విస్తీర్ణంలో అరటి తోట సాగు చేస్తున్నా. మొన్న కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన అరటి చెట్లు విరిగిపోయాయి. భారీగా నష్టం వాటిల్లింది. పంట నష్టం నమోదు చేపట్టి నష్టపోయిన అరటి రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. పరిహారం అందించి భరోసా కల్పించాలి. – తిమ్మారెడ్డి, రైతు, ప్రొద్దుటూరు అంచనాలు నమోదు చేస్తున్నాం.. భారీ వర్షం, ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. కోత దశలో పంటకు నష్టం జరిగింది. అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి సమర్థంగా నివేదిస్తాం. – జె.జ్యోతి, ఉద్యానశాఖ అధికారి, కృష్ణాజిల్లా -
కృష్ణా వర్సిటీ ఆర్చరీ టీమ్ ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల ఆర్చరీ పోటీలు నగరంలోని శాతవాహన కళాశాల ఆవరణలోని మైదానంలో బుధవారం జరిగాయి. పలు కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం వర్సిటీ ఆర్చరీ టీమ్ సభ్యులను ఎంపిక చేశారు. బి.ప్రియవైష్ణవీ, జీవీ శాయి మునింధర్ రెడ్డి, ఎం.జయేంద్ర నాయుడు, వి.రాఘవకృష్ణ, వి.వంశీ, కె.భరత్కుమార్, వి.అనిల్కుమార్ కృష్ణా టీమ్కు ఎంపికయ్యారు. అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఆర్చరీ పోటీల్లో ఈ సభ్యులు కృష్ణా వర్సిటీ తరఫున పాల్గొంటారని పోటీల నిర్వాహకుడు బీహెచ్ సంగీతరావు చెప్పారు. ఎన్నికై న క్రీడాకారులను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ, కై కలూరులోని వైవీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శివనాగ రాజుతో పాటు శాతవాహన కళాశాల అధ్యాపకులు అభినందించారు.పీహెచ్సీ వైద్యుల సమ్మె నోటీసులబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అందు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసినికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారి ప్రధాన డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. ఇన్–సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50% ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలని, నోషనల్ ఇన్క్రిమెంట్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ. 5000 అలవెన్స్ చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. నేటివిటీ – అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను పరిష్కరించాలన్నారు. తమ నిరసన ప్రజలపై కాదని, ప్రభుత్వంపై మాత్రమేనని, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో పనిచేశామని, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.నగరాల యువజన సంఘ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గూడేల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గుడేల శ్రీనివాసరావు (దుబాయ్ శ్రీను), ప్రధాన కార్యదర్శిగా పిళ్లా ఆనందకుమార్ ఎన్నికై నట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా అడ్డూరి జానకి మల్లేశ్వరరావు, కార్యదర్శిగా గూడేల అశోక్, నగర అధ్యక్షుడిగా తొత్తడి ఫణి తేజ్, కార్యదర్శిగా రాయన సునీల్ కుమార్లను నియమించామని తెలిపారు. నూతనంగా ఎన్నికై న కమిటీ అధ్యక్ష, కార్యదర్శులకు కన్వీనర్ శ్రీ తమ్మిన హరిబాబు, గౌరవ సలహాదారులు మజ్జి శ్రీనివాసరావు, కో కన్వీనర్లు మరుపిళ్ల దేవీప్రసాద్, పోతిన రమేష్, లీగల్ అడ్వైజర్ జగుపిళ్ల భాను ప్రతాప్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. -
మినీ వ్యాన్ ఢీకొని ఒకరి మృతి
గన్నవరం: మండలంలోని కేసరపల్లి వద్ద చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నేపాల్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి (35) కేసరపల్లిలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఫ్లై ఓవర్ దాటిన తర్వాత రోడ్డు దాటుతున్న అతడిని విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్యూలు కిటకిట
దర్శనం కటకట శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. అమ్మను దర్శించుకునేందుకు బుధవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు, భవానీలకు ప్రత్యేక క్యూలైన్లు లేకపోవడంతో సర్వదర్శనం క్యూలైన్ కిటకిటలాడింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్ ఎంతకూ ముందుకు కదలకపోవడంతో నిలబడలేక పలువురు భక్తులు నేలపై కూర్చుండిపోయారు. మరోవైపు రద్దీ, ఉక్కపోత కారణంగా చిన్నపిల్లలు అల్లాడారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఎడ్లంకలో మరో నాలుగు ఇళ్లు ఏటిపాలు
అవనిగడ్డ: మండలంలోని పాత ఎడ్లంక గ్రామస్తులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. వరద ఉధృతికి ఎప్పుడు ఏ ఇల్లు కృష్ణా నదిలో కలిసిపోతుందోనని భయాందోళనకు గురవుతు న్నారు. ఈ ఏడాది పలు సార్లు వచ్చిన వరదలకు తిరుపతమ్మ ఆలయంతో పాటు నాలుగిళ్లు కొట్టుకు పోయాయి. మునిపల్లి వెంకట నాగేశ్వరరావు, మునిపల్లి గణేష్ కుమార్, మునిపల్లి రాజేంద్రప్రసాద్, పెమ్మడి మాధవి, పెమ్మడి లక్ష్మికి చెందన మరో నాలుగు ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో పలుసార్లు వచ్చిన వరదలకు గ్రామం చుట్టూ గట్టు భారీగా కోతకు గురైంది. మూడు ఎకరాల వరకు భూభాగం కృష్ణా నదిలో కలిసిపోయింది. ఇప్పటి వరకూ ఇళ్లు కోల్పోయిన వారికి వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయ లేదని బాధితులు ఆరోపించారు. -
కానూరులో గంజాయి పట్టివేత
పెనమలూరు/ఉయ్యూరు: పెనమలూరు మండలం కానూరులో గంజాయి నిల్వ ఉంచిన ఇంటిపై ఉయ్యూరు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.శేషగిరిరావు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. 14 కిలోల 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరులో రెండంతస్తుల భవనంలో గంజాయి ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని సీఐ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని పానెం రామమోహన్రావు, యలమంచిలి మురళీకృష్ణప్రసాద్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్త్స్జ్ సిబ్బంది నంది కేశవరావు, వేణుగోపాలరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల కుటుంబాలకు పెను శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. ఉచిత బస్సు వల్ల ఆటోలకు కిరాయిలు తగ్గిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సింగ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ పసుపులేటి సుబ్బారావు(23) మృతదేహాన్ని సీపీఎం, సీఐటీయూ నాయకులు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. అత్యధిక మంది ఆటో కార్మికులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేసుకున్నారని, ఉచిత బస్సుల వల్ల కిరాయిలు లేక అప్పులు తీర్చే పరిస్థితిలేక ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రుణా లకు అధిక వడ్డీలు వేయటం ఫైనాన్స్ కంపెనీలకు పరిపాటిగా మారిందని, వడ్డీలు కట్టకపోతే ఆటోలను లాకెళ్లి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రూ.45 వేల అప్పునకు రూ.55 వేల వడ్డీ వేసి రూ.లక్ష చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీలు వేధించడం వల్లే సుబ్బా రావు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ఆటో కార్మికుల ఇబ్బందులను గుర్తించాలని, వాహన మిత్ర పథకం ద్వారా రూ.25 వేల సాయం అందించాలని కోరారు. సీఐటీయూ నాయకుడు కె.దుర్గారావు, ఆటో కార్మిక సంఘం నాయకులు దుర్గావలి, కోటయ్య, జి.వి.రెడ్డి, పీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి సేవలు అందిస్తా..
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టిసారించి, జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ అన్నారు. జాయింట్ కలెక్టర్గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ తాను 2019 బ్యాచ్కు చెందినవాడినని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన ప్రజాసమస్యలు, భూ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఎటు వంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం పనిచేస్తానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల సహకారంతో ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. తాను తిరుపతి జిల్లాకు చెందిన వాడినని, తన విద్యాభాస్యం అక్కడే జరిగిందన్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా శిక్షణ పొంది మొదటిగా సత్యసాయి జిల్లా పెనుగొండ సబ్కలెక్టర్గా పనిచేశానన్నారు. అనంతరం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళ్లి అక్కడ పనిచేసిన అనంతరం ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా అమరావతికి వచ్చానన్నారు. అక్కడి నుంచి కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారని, జేసీగా రెండోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు. మర్యాదపూర్వకంగా.. అనంతరం జేసీ నవీన్ కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్లో కలిసి మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ నవీన్ను డీఆర్వో చంద్రశేఖరరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి. శివరామప్రసాద్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, ఆర్డీవో కె. స్వాతి, డీఎస్వో మోహనరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, కలెక్టరేట్ ఏవో రాధిక, సిబ్బంది కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
అభయ ప్రదాయిని
అన్న ప్రసాదిని..అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు.. ఎవరు ఆకలితో అలమటిస్తున్నా వారికి సాయం చేయమని చెబుతుంటారు.. అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికే భిక్షను ప్రసాదించిన అమృత మూర్తి అన్నపూర్ణాదేవి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు ఆ ఆది దేవత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో అక్షయపాత్ర ధరించి, ఆదిభిక్షువుకు అన్నాన్ని ప్రసాదిస్తున్న అవతారంలో కొలువైన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి భక్తులు ఆనందంతో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇల ప్రకాశం.. ఇంద్ర వైభోగం.. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న ప్రకాశం బ్యారేజీ, దుర్గమ్మ కొండ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచ హారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ.. తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు అమ్మవారి దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. వీఐపీ క్యూలైన్లోకి.. సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్, మీడి యా పాయింట్ల వద్ద పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో అమ్మవారి దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు. అన్నదాన భవనంలో తనిఖీలు.. అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్కలెక్టర్ ఎస్. ఇలక్కియ తనిఖీలు నిర్వహించారు. మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ. 31.08లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ల విక్రయం ద్వారా రూ.11.89లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, ఇతర సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది భక్తులు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
పమిడిముక్కల: ఆ దంపతుల అన్యోన్యతను చూసి విధికి కన్నుకుంట్టిందో ఏమో రోడ్డు ప్రమాదం రూపంలో వారిని విడదీసింది. భార్యను బలితీసు కుని భర్తకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమదం విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై పమిడిముక్కల మండలంలోని తాడంకి గ్రామం వద్ద బుధవారం జరిగింది. మచిలీపట్నం మండలం మేకవానిపాలెం పంచాయతీ పరిధిలోని సీతయ్యనగర్కు చెందిన వీరంకి నాగమల్లేశ్వరరావు, నాగలక్ష్మి(42) దంపతులు. వారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహ మైంది. రెండో కుమార్తె బ్యాంక్ ఉద్యోగం చేస్తుండగా, మూడో కుమార్తె చదువుకుంటోంది. నాగమల్లేశ్వరరావుకు లారీ ఉంది. లారీకి అవసరమైన టైర్లు కొనుగోలు చేసేందుకు అతను భార్య నాగలక్ష్మితో కలిసి బైక్పై విజయవాడ బయలు దేరారు. తాడంకి సమీపంలో ఎదురుగా వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఒక్కసారిగా కుడి వైపునకు తిరిగింది. దీంతో ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో నాగమల్లేశ్వరరావు దంపతులు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పింది. బైక్ వెనుక కూర్చున్న నాగలక్ష్మి రోడ్డుపై పడిపోయింది. ఆమె తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే భార్య మృతిచెందడంతో నాగమల్లేశ్వరరావు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ బి.శ్రీను ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. నాగలక్ష్మి మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కిట్టు సందర్శించి నివాళులర్పించారు. నాగమల్లేశ్వరరావును పరామర్శించారు. -
కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
గుడివాడ టౌన్: ఆడుకుంటున్న ఏడే ఏళ్ల బాలుడిపై కుక్క దాడికి తెగబడిన ఘటన గుడివాడ పట్టణంలో బుధవారం జరిగింది. స్థానిక లీలామహల్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో బాలుడు సైకిల్పై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వస్తున్న కొందరు వ్యక్తులు దీనిని గమనించి కుక్కను తరిమి బాలుడిని రక్షించారు. వీధి కుక్కల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు మునిసిపల్ కమిషనర్ను కోరారు. కృత్తివెన్ను: గ్రామంలోని ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ తెలగంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు (58) దుర్మరణం చెందారు. పాలకొల్లు నుంచి బంటుమిల్లి వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి రమణను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. రమణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. మండల పరిసర గ్రామాల్లో పేద ప్రజలకు డబ్బులు డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకుని వైద్యం చేయడంలో రమణకు మంచి పేరు ఉంది. ఆయన మరణవార్త తెలుసుకుని మండలం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. గూడూరు:ేస్నహితులతో కలసి మంగళవారం స్నానం చేసేందుకు జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో దిగి గల్లంతైన వెలుపూడి జీవన్కుమార్ (12) బుధవారం శవమై తేలాడు. మంగ ళవారం రాత్రి నుంచి తల్లిదండ్రులతో పాటుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం తెల్లవారుజామున మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై రామరాజుపాలెం వంతెన కింద కట్టిన వలకు జీవన్కుమార్ మృతదేహం చిక్కింది. పోలీసులు శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం చేయించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కళ్లెదుట ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లవాడు విగతజీవిగా మారడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. గూడూరు ఏఎస్ఐ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేఎల్యూ ప్రొఫెసర్లకు ప్రపంచ శాస్త్రవేత్తలుగా గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలుగా కేఎల్యూ ప్రొఫెసర్లకు గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎల్సెవియర్ డేటాబేస్ విడుదల చేసిన జాబితాలో 20 మంది కేఎల్ యూ ప్రొఫెసర్లు ఉన్నారు. తమ అధ్యాపక బృందంలో 20 మంది ప్రపంచంలోని అత్యున్నత రెండు శాతం శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందారని ప్రకటించడానికి గర్వంగా ఉందని కేఎల్యూ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 44 ఏళ్లుగా ఉన్నత విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోందన్నారు. తమ అధ్యాపకుల శ్రమ, కృషి, పరిశోధనలపై ఉన్న నిబద్ధత వల్లే ఈ గౌరవం దక్కిందన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతామన్నారు. కెరీర్లో ఉత్తమ ర్యాంకింగ్ను సాధించినందుకు డాక్టర్ బి.టి.పి.మాధవ్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ రాగిణి సింగ్, డాక్టర్ గంధర్బా స్వైన్, డాక్టర్ ఎం.జానకి రామయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ హసనే అహమ్మద్, డాక్టర్ ఎస్.షణ్ముగన్, డాక్టర్ జియా ఉర్ రెహమాన్, డాక్టర్ డి.వెంకటరత్నం, డాక్టర్ అర్పిత్ జైన్, డాక్టర్ చల్లా సంతోష్, డాక్టర్ మొహమూద, డాక్టర్ అతుల్ కుమార్, డాక్టర్ ఎస్.ఆర్.ఆర్.రెడ్డి, డాక్టర్ బి.ఉషారాణి, డాక్టర్ ప్రియారంజన్ సమల్, డాక్టర్ అతుల్ భట్టాడ్ను టాప్టూ జాబితాలో ప్రకటించిన సందర్భంగా అభినందించారు. యాంటెన్నాలు, బయోసెన్సార్లు, అయానోస్పిరిక్ సింటిలేషన్లు, థర్మల్ ఇమేజింగ్ రంగాల్లో వారి మార్గదర్శక ఆవిష్కరణలతో కేఎల్యూ స్కోపస్ రీసెర్చ్ డిస్కవరీ ద్వారా ప్రత్యేక గుర్తింపుతో దేశంలో మొదటి స్థానం, ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో తమ అధ్యాపక సభ్యులు నిలిచినందుకు గర్వంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్డీ డీన్ డాక్టర్ బి.టి.పి.మాధవ్, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు
తిరువూరు: గంపలగూడెం మండలం ఊటుకూరులో బుధవారం ప్రైవేటు డీలర్ వద్ద నుంచి అక్రమంగా యూరియా తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. మినీ వ్యానులో యూరియా బస్తాలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు గమనించి వ్యాను నిలిపివేయించారు. ఒక్కొక్క రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తున్న వ్యవసాయశాఖ ఇప్పుడు కొందరు రైతుల పేరుతో ఐదు బస్తాలు చొప్పున ఇచ్చినట్లు వారు ఆరోపించారు. ఊటుకూరు ప్రాంతంలో రైతులు ఖరీఫ్ వరిపైర్లకు యూరియా సరఫరా లేక ఇబ్బంది పడుతుంటే దొడ్డిదారిని ఇతర గ్రామాలకు తరలించడంపై వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆలపాటి ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే అక్రమంగా యూరియా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా యూరియా కోసం పగలూ రాత్రీ సొసైటీల వద్ద రైతులు పడిగాపులు పడుతుంటే ఒక కట్టకు మించి ఇవ్వని అధికారులు కొందరు ప్రముఖులకు ఎక్కువ మొత్తంలో యూరియా అందించడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. -
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిపివేత
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశ) నిర్ణయించింది. రూ. 670 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.రూ.670 కోట్లు చెల్లిస్తేనే మేం చర్చలకు వెళతామని లేకపోతే చర్చలకు వెళ్లేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ‘‘మిగిలిన 2 వేల కోట్ల బకాయిల పై కార్యాచరణ ఇవ్వాలని.. అక్టోబర్ 10 లోగా మా సమస్యలన్నీ తీర్చాలి. మా సమస్యలు తీర్చకపోతే అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలన్నింటినీ పూర్తిగా ఆపేస్తాం. ప్యాకేజీలలో కచ్చితంగా మార్పులు చేయాలి...ప్యాకేజీలకు ఒక కచ్చితమైన సిస్టమ్ను పెట్టాలి. ఇన్స్యూరెన్స్ స్కీమ్కు వెళ్లే ముందు కచ్చితంగా మా బకాయిలు తీర్చాలి. ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్లాలి. బీమా ఆధారిత యూనివర్శల్ హెల్త్ ప్రోగ్రామ్కు రూపకల్పన చేయడంలో మమ్మల్ని భాగస్వామ్యుల్ని చేయాలి’’ అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. -
Durga Temple: క్యూలోనే కనిపిస్తున్న దేవుడు!
ఇంద్రకీలాద్రిపై భక్తులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. అమ్మవారి దర్శనం సంగతి అటుంచితే.. క్యూలోనే గంటల తరబడి నిరీక్షించి నీరసించిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వారి తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దసరా ఉత్సవాల్లో సాధారణ భక్తులే తమ ప్రాధాన్యమంటూ ఊదరగొట్టిన నాయకులు, ఆలయ, జిల్లా అధికారుల మాటలు నీటి మూటలే అయ్యాయి. వీఐపీ దర్శనాల పేరుతో అడ్డదారిన అడ్డగోలుగా దర్శనాలకు పంపుతుండటంతో క్యూలోనే భక్తులు తిప్పలు పడుతున్నారు. ఉక్కపోత వాతావరణంతో గాలి కూడా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం ఇలాగే పలువురు సొమ్మసిల్లి పడిపోగా.. వారిని పోలీసులు భూజాలపై మోసుకొని వెళ్లి, వైద్య శిబిరంలో అత్యవసర చికిత్స అందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంబో సేవా కమిటీ సభ్యులు కూడా భక్తుల సేవలో కాకుండా తమకు సంబంధించిన వారికి దర్శనం చేయించే పనిలో నిమగ్నమవడంతో సాధారణ భక్తులు నరకం చూస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి
జగ్గయ్యపేట అర్బన్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. కాగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.12 లక్షలకు సెటిల్మెంట్ చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని విలియంపేటకు చెందిన గర్భిణి అయిన జరుగుమల్లి జాయ్(28)కు నెలలు నిండటంతో ప్రసవం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జాయిన్ అయ్యారు.కాగా రాత్రి సమయంలో వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో జాయ్తో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మృతిచెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.12లక్షల సెటిల్మెంట్కు మృతురాలి కుటుంబ సభ్యులను ఒప్పంచారని తెలుస్తోంది. మృతురాలికి భర్త వంశీ, ఏడేళ్ల కూతురు ఉంది. పర్యవేక్షణ లేకనే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో మందులను ఉపయోగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కనుల పండువగా నగరోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువ జాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలో భక్తుల రద్దీ కొనసాగింది. అయితే రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అను మతించారు. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీ చక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు. వీఐపీ దర్శనాలకు బ్రేక్ తొలి రోజు ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్ పడింది. ప్రొటోకాల్ ఉన్న వారిని సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారానే ఆలయంలోకి అనుమతించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పదార్థాల నాణ్యతను పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతా యని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామ న్నారు. ప్రస్తుతం కనకదుర్గనగర్లో పది కౌంటర్లు ఉండగా, అక్కడ మరో రెండు కౌంటర్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్తో పాటు రథం సెంటర్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటర్లకు లడ్డూలు రవాణా చేసే తరుణంలో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి ప్రసాదం కేంద్ర సహాయ అధికారి ఎం.ఎస్.ఎల్.శ్రీనివాస్ తీసుకెళ్లారు. అన్న ప్రసాద వితరణను పరిశీలించిన కలెక్టర్ భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నగరోత్సవంలో దుర్గామల్లేశ్వర స్వామివార్లు రెండో రోజు ఆదాయం రూ.25.48లక్షలు వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. దసరా ఉత్సవాల్లో రెండో రోజున దేవస్థానానికి రూ.25.48 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. రూ.300 టికెట్ల విక్రయం ద్వారా రూ.8.99 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.3.16 లక్షలు, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1.86 లక్షలు, ఆరు లడ్డూల ప్రత్యేక ప్యాక్ల ద్వారా రూ.9.66 లక్షలు, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ల ద్వారా రూ.69 వేలు, ఇతర సేవా టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం లభించిందని వివరించారు. రెండో రోజు సాయంత్రం ఐదు గంటలకు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 19,629 మందికి అన్న ప్రసాదం అందజేశామని తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మంగళవారం సాయంత్రం మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, ఘాట్రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవం పరిసమాప్తమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో నగరోత్సవం ఆద్యంతం భక్తిభావనతో సాగింది. -
కాలువలో స్నానానికి దిగిన బాలుడు గల్లంతు
గూడూరు: దసరా సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి కాలువలో స్నానానికి దిగిన విద్యార్థి గల్లంతైన ఘటన మంగళవారం గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన వెలిపూడి జీవన్కుమార్(12) గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో స్నానానికి దిగారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెళ్లిన జీవన్ కుమార్ పొద్దుపోయే వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు సావిత్రి, విజయ్లు స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. వారిచ్చిన సమాచారంతో జొన్నలరేవు దగ్గర గాలించగా జీవన్కుమార్ టీషర్టు, చెప్పులు లభించాయి. దీంతో కాలువ వెంబడి గాలించినా అతని ఆచూకీ దొరకకపోవడంతో గూడూరు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్ఐ స్వామేలు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఎలాంటి ఫలితం లేదని ఏఎస్ఐ వెల్లడించారు. -
పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ
పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు లబ్బీపేట(విజయవాడతూర్పు): పటమట పోలీసు స్టేషన్లో పరిధిలో చోరీ కేసులో రిమాండులో ఉన్న బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్రెడ్డి అలియాస్ రాజు అలియాస్ బయ్యపురెడ్డి పోలీసుల నుంచి తప్పించుకోగా, వెతికి పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏఆర్ఏడీసీపీ కుంబా కోటేశ్వరరావు నేతృత్వంలో ఆ బృందాలు కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రభాకర్ను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అసలేం జరిగిందంటే.. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ రాజమండ్రి జైలులో రిమాండు ముద్దాయిగా ఉన్నాడు. విజయవాడ కోర్టులో సోమవారం వాయిదా ఉండటంతో తీసుకు వచ్చారు. తిరిగి తీసుకెళ్తున్న సమయంలో దేవరపల్లి గ్రామ శివారులో ఎస్కార్ట్గా ఉన్న పోలీసుల కళ్లుగప్పి రాత్రి 7.30 గంటల సమయంలో ముద్దాయి పరారయ్యాడు. దీంతో నగర పోలీసులకు ఎస్కార్ట్గా వెళ్లిన పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సస్పెన్షన్.. చోరీ కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్ను విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ కె. సుగుణాకరరావు, కేజే షడ్రక్లను సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి ముద్దాయి తప్పించుకుపోవడానికి కారణమైనట్లు సీపీ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. వివరాల సేకరణ.. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం ఇలా పలు ప్రాంతాల్లో నివశించాడు. ఒంటరిగా వెళ్లి పట్టపగలు ఇళ్లలో చోరీ చేయడంలో నిష్ణాతుడైన ప్రభాకర్.. హైదరాబాద్, నెల్లూరు, చైన్నె, కాకినాడల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య ఉండగా.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విశాఖపట్నం, చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలు, ఫోన్నంబర్లను పోలీసులు సేకరించారు. వారిలో ఎవరితో టచ్లో ఉన్నాడో దృష్టి సారించారు. అంతేకాక ఇటీవల ప్రభాకర్తో సన్నిహితంగా ఉండే మరో మహిళతో కచ్చితంగా మాట్లాడి ఉంటాడని భావించి ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. కాగా ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఆచూకీ తెలిసినవారు రిజర్వ్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్కు 94407 96482కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
నదీ జలాలు చంద్రబాబు ఆస్తి కాదు
ఏబీ వెంకటేశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి. మా ప్రాజెక్టులను మేము కట్టుకుంటాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి చంద్రబాబుకు హక్కులేదు. ఇది చంద్రబాబు సొంత ఆస్తి కాదు. రాష్ట్ర ప్రజలందరి నీటి హక్కుల సమస్య’’ అని ఆలోచనాపరుల వేదిక సభ్యుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు అన్నారు. ఎగువనున్న తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆయన మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తూ ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్ర బాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల నీటి వాటాను వినియోగించుకోవడంలోనూ ప్రభుత్వం విఫల మైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 34ను చూపి రాయలసీమ ప్రజలను బెదరగొట్టి బనకచర్ల ప్రాజెక్టు అనే గుదిబండను ఏపీ మెడకు చుట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆలోచనాపరుల వేదిక సభ్యులు టి.లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీప్రసాద్ పాల్గొన్నారు. -
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
ఉయ్యూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరు ప్రధాన సెంటరులో కుటుంబ సభ్యులు, సహచరులు మంగళవారం రాస్తారోకో చేశారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయరహదారిపై గండిగుంట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొని విన్నకోట శ్రీరాములు (55) మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుని కుటుంబానికి ఆర్థికపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, కార్మికులు ఉయ్యూరు సెంటరులో ఆందోళనకు దిగారు. రూ. 15 లక్షలు పరిహారం కారు యజమాని నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో సెంటరులో ట్రాఫిక్ స్తంభించింది. సీఐ టీవీవీ రామారావు, రూరల్ ఎస్ఐ సురేష్బాబు ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపారు. చట్టప్రకారం కేసు నమోదుచేసి కారును సీజ్ చేశామన్నారు. మృతునికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనకారులపై ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు గానూ కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
కృష్ణానదిలో బాలుడు గల్లంతు
కృష్ణలంక(విజయవాడతూర్పు): సరదాగా కృష్ణానదిలోకి ఈతకు దిగిన ఓ బాలుడు వరద ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతిఘాట్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. సేకరించిన వివరాల మేరకు కృష్ణలంక, 21వ డివిజన్లోని వల్లూరివారి వీధిలో నివాసం ఉంటున్న చొప్పవరపు ప్రసాద్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య గీత, ఒక కుమార్తె, ఒక కుమారుడు సాయి సందీప్(14) ఉన్నారు. సందీప్ ఐదో నంబర్ రూట్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్కు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో సందీప్ మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఒక స్నేహితుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణానది ఒడ్డున ఉన్న మర్వాడీ శివాలయం పరిసరాల్లోని పద్మావతి ఘాట్లోకి వెళ్లాడు. ఘాట్ మెట్లపై ధర్మాకోల్ పెట్టెను గమనించి దానితో నదిలోకి దిగి సరదాగా ఈతకొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతటా సందీప్ ధర్మాకోల్ పెట్టెను తీసుకుని నదిలోకి దిగి సరదాగా ఈత కొడుతుండగా పెట్టె జారిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అతను ఒడ్డుకు చేరుకోలేక నీటిలో మునిగి గల్లంతయ్యాడు. లభించని ఆచూకీ.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. నదిలో గల్లంతయ్యాడన్న విషయాన్ని తెలుసుకున్న బాలుడి కుటుంబంలో, ఆ వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణానది ఒడ్డుకు చేరుకున్న తల్లిదండ్రులు గల్లంతైన కుమారుడు కనిపించకపోవడంతో బోరున విలపించారు. -
జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా జిల్లాలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, సాంప్రదాయ జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టలన్నారు. కేవలం సబ్సిడీ రాయితీల కోసం కాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు తీసుకుని, వారి మెరుగైన జీవనప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. పొలాల్లో ఐదు నుంచి పది సెంట్ల స్థలంలో కొరమేను సాగు చేపట్టి అధిక లాభాలు పొందొచ్చని, ఇందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, ఆసక్తి కలిగిన వారిని గుర్తించాలని ఎంపీడీఓ, మత్స్యశాఖ అధికారులకు సూచించారు. తీరప్రాంత మండలాల్లో పీతల సాగు, సముద్రనాచు పెంపకం, డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయ సేవలు అందించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ, ఏపీఎంఐపీ పీడీలు హరిహరనాథ్, ఎస్.వి.రత్నాచార్యులు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి, పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.చిననరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీ షేక్ షాహిద్బాబు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదంపై ప్రజల్లో పెరిగిన అవగాహన
ఆయుష్ విభాగం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల్లో ఆయుర్వేదం పట్ల అవగాహన పెరిగిందని ఆయుష్ విభాగం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి అన్నారు. మంగళవారం బీఆర్టీఎస్ రోడ్డులో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని 3కే రన్ జరిగింది. బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల ట్రాఫిక్ సిగ్నల్ నుంచి ఘంటసాల కళాశాల జంక్షన్ వరకు సాగింది. ఈ రన్లో ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ‘ప్రజల కోసం – ప్రకృతి కోసం ఆయుర్వేదం’ థీమ్తో 3కే రన్ నిర్వహించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నల్లు ధరణి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయుర్వేదంపై మరింత ప్రచారం కల్పించాలన్నారు. రన్లో పాల్గొన్న వారికి సాయి సంజీవి హెర్బల్స్ – డ్రై ఫ్రూట్స్ బహుమతులను అందజేశారు. అనంతరం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విజయవాడలోని గాయత్రి ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జెర్సీలని అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్, శారద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేశ్వర శర్మ, రాష్ట్ర విశ్వాయుర్వేద పరిషత్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ సాహితీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రదర్శనకే సరి.. ప్రేక్షకులేరి మరి..!
విజయవాడ కల్చరల్: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేపట్టిన విజయవాడ ఉత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు స్పందన కరువైంది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం, దుర్గాపురంలోని సంగీత కళాశాలలో మంగళవారం నృత్యప్రదర్శన, సంగీత కచేరి, హరికథలు ప్రదర్శించారు. అయితే ఈ రెండు కేంద్రాల వద్ద ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చినా, ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. సంగీత కళాశాలలో పట్టుమని 50 మంది ప్రేక్షకులు కూడా లేరు. సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహణ బాధ్యతలను టీడీపీ నాయకుడు వర్ల రామయ్య, తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ పొగడపాటి తేజస్వి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులకు అప్పగించారు. వారు కనీసం కళాకారులకు మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. ఉత్సవ్ నిర్వాహకులకు తెలుగు ఆవశ్యకతపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్షింతలు వేసినా ఇప్పటికీ కార్యక్రమాల బోర్డు ఆంగ్లంలోనే ఉండటం గమనార్హం. -
వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి
రూ. 12 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం! జగ్గయ్యపేట అర్బన్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. కాగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.12 లక్షలకు సెటిల్మెంట్ చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని విలియంపేటకు చెందిన గర్భిణి అయిన జరుగుమల్లి జాయ్(28)కు నెలలు నిండటంతో ప్రసవం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జాయిన్ అయ్యారు. కాగా రాత్రి సమయంలో వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో జాయ్తో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.12లక్షల సెటిల్మెంట్కు మృతురాలి కుటుంబ సభ్యులను ఒప్పంచారని తెలుస్తోంది. మృతురాలికి భర్త వంశీ, ఏడేళ్ల కూతురు ఉంది. పర్యవేక్షణ లేకనే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో మందులను ఉపయోగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
లెక్కలేనితనం!
●జి.కొండూరు: పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనిక వ్యర్థాలను కనీస మానవత్వం మరిచి పంట కాలువల్లో, చెరువుల్లో విడుదల చేస్తున్న ఘటనలు ఇటీవల ఎన్నో జరిగాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ వరుస కథనాలను సైతం ప్రచురించింది. స్పందించిన పోలీసులు వ్యర్థాలను పారబోస్తున్న సెప్టిక్ ట్యాంకును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఏ కంపెనీ నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి పారబోస్తున్నారో కూడా వాహన యజమాని ఒప్పుకున్నాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నమూనాలను తీసుకెళ్లారు. ఇరవై రోజులు గడిచినా నమూనాల ఫలితాలు పోలీసులకు చేరలేదు. ఎటువంటి రిపోర్టు రాకపోవడంతో జామీన్ తీసుకొని సెప్టిక్ ట్యాంకును పోలీసులు వదిలేశారు. మరలా వ్యర్థాల విడుదల మొదలైంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు గ్రామ శివారులోని పంట కాలువలో మరలా రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే పరిశ్రమలకు వరంలా మారింది. దశాబ్దాలుగా ఉన్న వ్యర్థాల సమస్యను మేనేజ్ చేస్తూ వస్తున్న స్థానిక ఐడీఏలోని పరిశ్రమలు, తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కొత్త కొత్త మార్గాలలో.. కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమలు రసాయనిక విడుదలలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షం పడినప్పుడు తొమ్మండ్రవాగులోకి విడుదల చేస్తున్నారు. లేదంటే సెప్టిక్ ట్యాంకుల ద్వారా శివారు గ్రామాల్లో పంట కాల్వలు, చెరువులలో పారబోస్తున్నారు. వీటిపై వివాదం తలెత్తినప్పుడు కంపెనీల్లోనే మండించి ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నారు. ఇలా ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నారని సమీప గ్రామమైన కట్టబడిపాలెం గ్రామ ప్రజలు ఇటీవల నిరసన తెలపడంతో మరలా పంట కాల్వల్లో పారబోయడం ప్రారంభించారు. మొదట వ్యర్థాలను కాలువల్లో, చెరువుల్లో పారబోసేది తాము కాదని కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమల యజమానులు బుకాయించినప్పటికీ సెప్టిక్ ట్యాంకు పట్టుబడటంతో చేసేదిలేక దొరికిన దొంగల్లా కొన్ని రోజులు సైలెంటుగా ఉండిపోయారు. మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. పంట కాలువల్లో ఆగని కెమికల్ వ్యర్థాల డంపింగ్ హెచ్.ముత్యాలంపాడు గ్రామ శివారులోని ప్రధాన కాల్వలో ప్రస్తుతం రసాయనిక వ్యర్థాలను విడుదల చేయడం వల్ల నీటి ప్రవాహానికి ఈ వ్యర్థాలు సమీపంలోని వరిపైరులోకి చేరుతున్నాయి. ఈ క్రమంలో వరిపైరు రంగుమారి పాడైపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వ్యర్థాలు కలిసిన నీటిలో దిగి కలుపుతీత, ఎరువులు చల్లడం, మందు పిచికారీ వంటి పనులు చేస్తే ఎలర్జీల బారిన పడతామని రైతులు వాపోతున్నారు. వరి పైరులోకి వ్యర్థాలు.. -
ఇంద్రకీలాద్రి పరిసరాల్లో చెప్పులతో సంచారం
ఇంద్రకీలాద్రి(విజయవాడ): దసరా ఉత్సవ వేళ ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఆలయ, ఉపాలయాల పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు మంగళవారం కాళ్లకు చెప్పులు వేసుకుని తిరిగారు. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే దారిలో నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, పక్కనే శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు కుంకుమార్చన నిర్వహించే ప్రాంగణం, వెనుక వైపు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. నటరాజస్వామి వారి ఆలయం నుంచి ముగ్గురు వ్యక్తులు నేరుగా కుంకుమార్చన ప్రాంగణం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాల మీదగా లక్ష్మీ గణపతి ప్రాంగణం వైపు చెప్పులతో పరుగులు తీశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి చెప్పులతో రాకుండా ఘాట్రోడ్డులోని పలు చోట్ల దేవస్థానం స్టాండ్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఆలయ పరిసరాల్లోకి చెప్పులు వేసుకొని రావడమే కాకుండా తాఫీగా పరిసరాల్లో తిరుగుతూ కనిపించారు. ఇటువంటి వారిపై దేవస్థాన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
సిఫార్సులకే ప్రాధాన్యం!
సామాన్య భక్తులకు తప్పని పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీలకు ప్రత్యేక టైం స్లాట్ కేటాయించిన అధికారులు, దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు. సోమవారం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ఆరంభమైన కొద్ది గంటలలోనే ప్రముఖులు, సిఫార్సులపై వచ్చే వారు నేరుగా కొండపైకి చేరుకున్నారు. దీంతో చిన్న గాలిగోపురం, స్కానింగ్ పాయింట్తో పాటు సీఎం గేటు వద్ద వందల సంఖ్యలో భక్తులు వేచి ఉండటం కనిపించింది. ప్రముఖుల సిఫార్సుతో వచ్చిన వారు సైతం నేరుగా స్కానింగ్ పాయింట్ వద్ద ఉన్న వీవీఐపీ గేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. సీపీ ఆదేశాలు బేఖాతర్.. మరో వైపు పోలీసు సిబ్బంది యూనిఫారంలో దర్శనాలు చేయిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. అయితే పోలీసు సిబ్బంది సాధారణంగా కనిపించే యూనిఫారం, సఫారీని వదిలి సివిల్ డ్రస్పై దర్శనాలకు రావడం కనిపించింది. పదే పదే వస్తున్న సివిల్ పోలీసు సిబ్బందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా గేట్లను తీసి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. రూ.300, రూ.100 టికెటు క్యూలైన్లు ఖాళీగా దర్శనమివ్వడంతో సిఫార్సులపై వచ్చే వారిని ఆ క్యూలైన్లోకి మళ్లించాలని ఏడీసీపీ జి.రామకృష్ణ ఎన్ని సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తాము ఫలానా వాళ్ల తాలుకా అంటూ నేరుగా సీఎం గేటు వైపు నుంచే ఆలయానికి చేరుకుంటామని పట్టుబట్టారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తామని చెప్పిన దేవస్థాన అధికారులు ఉత్సవాల తొలి రోజే అది అమలు కానిదని తేల్చి చెప్పేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, వారి బంధుగణం వచ్చిన ప్రతి సారి అంతరాలయానికి పంపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్ ఎంట్రీ కార్ పాస్లు.. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆలయ అధికారులు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఉత్సవాలలో వీఐపీలకు దేవస్థానమే వాహనాలను ఏర్పాటు చేస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యమైన అధికారులకు వారి సొంత వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. అయితే ఈ ఏడాది దేవస్థాన అధికారులు, పోలీసులు సింగిల్ ఎంట్రీ కార్ పాస్లను జారీ చేశారు. ఈ కార్ పాస్ ఉన్న కార్లను ఓం టర్నింగ్ వరకు అనుమతించడంతో అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సంగీత దర్శకుడు మణిశర్మకు చేదు అనుభవం ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, టీవీ నటుడు ఆటో రాంప్రసాద్ అమ్మవారిని దర్శించుకునేందుకు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అయితే ఆ సమయంలో వీఐపీ టైం స్లాట్ లేదని చెప్పాల్సి ఉండగా, వారిని నేరుగా దర్శనానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సీఎం గేటు వద్ద పెద్ద ఎత్తున భక్తులు దర్శనం కోసం వేచి ఉండటంతో వారు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున మణిశర్మ వచ్చారనే విషయం ఆలయ సిబ్బందికి చెప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయ అనుచరులు నేరుగా సీఎం గేటు వద్దకు తీసుకెళ్లారు. దీంతో మణిశర్మకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. చివరకు సీఎం గేటు తాళాలు తీసిన తర్వాతే భక్తులతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. -
నయనానందకరం.. నగరోత్సవం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా.. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ.300 క్యూలైన్లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57మంది, కుంకుమార్చనకు 18మంది రుసుం చెల్లించి ఆన్లైన్లో పూజను వీక్షించారు. ఏర్పాట్ల పరిశీలన..ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. తొలుత కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో చర్చించారు. అనంతరం నూతన అన్నదాన భవనంలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న ప్రసాదం స్వీకరించారు. తొలి రోజు రూ.22 లక్షల ఆదాయం ఉత్సవాల తొలి రోజు సాయంత్రం ఐదున్నర గంటల సమయానికి 47,418మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పలు సేవలు, దర్శన టికెట్ల ద్వారా రూ.22,72,214 ఆదాయం వచ్చిందన్నారు. ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యా లతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. -
దద్దరిల్లిన ధర్నా చౌక్
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు, వీఆర్ఏలు రోడ్డెక్కారు. బందరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించలేదన్నారు. వీఆర్ఏలకు ప్రస్తుతం గౌరవ వేతనం కేవలం రూ. 11వేలు మాత్రమే అందుతోందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ఆరేళ్లుగా జీతభత్యాలు పెరగకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం, కార్యదర్శి చాట్లు రమేష్, ఉపాధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు, జ్యోతి, కె. మహేష్, పి. వీర వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికుల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద నున్న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. గెలవకముందు విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. జీపీఎఫ్ పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బి. శ్రీనివాసరావు, కన్వీనర్ వి. అంకబాబు, ఎల్. రామ్మోహన్రావు, పి. డేవిడ్ రాజు, ఎ. రాంబాబు, ఎస్. శ్రీనివాసరావు, డి. నాగరాజు, రామోజీ, లైన్మెన్ జొన్నలగడ్డ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు, వీఆర్ఏల ధర్నా -
అర్జీలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
డీఆర్వో చంద్రశేఖరరావు చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’లో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె. స్వాతి, హౌసింగ్ ఇన్చార్జ్ పీడీ పోతురాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నిర్లక్ష్యం వద్దు.. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయానికి పరిష్కరించాలన్నారు. ఐ గాట్ కర్మ యోగి ఆన్లైన్ కోర్సులను పూర్తి చేయటంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరమైతే దానికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మొత్తం 133 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ●ప్రభుత్వం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా ప్రతినిధి లింగం రవికిరణ్, నల్లమోతు ఆంజనేయులు విన్నవించారు. అప్పులు తెచ్చి తాము అధికారులు చెప్పిన విధంగా నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తున్నా ఏళ్ల తరబడి బిల్లులు రావడం లేదన్నారు. అధికారులు దీనిపై దృష్టిసారించి వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు. ●కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, పుప్పాల నరసింహారావు అర్జీ ఇచ్చారు. అమెరికా 50 శాతానికి పైగా సుంకాలు విధించటం వల్ల రైతులు టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 50 వేల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని చర్యలు తీసుకోవాలని కోరారు. -
దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ రఘునందన్రావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ రఘునందన్రావు దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనానాయక్, వేదపండితులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో అనితకు చేదు అనుభవం
విజయవాడ: విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గుట్టపై దుర్గమ్మ ఇవాళ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా.. అమ్మవారిని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి , వంగలపూడి అనిత , ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు.అయితే.. ఇంద్రకీలాద్రి గుట్టపై తోలిరోజే వసతులపై హోం మంత్రి అనితను నిలదీసిన భక్తులు, చిన్న పిల్లలతో వచ్చేవారికి ప్రత్యేక క్యూలైన్ లేదని భక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు, దుర్గగుడిని రాజకీయ కేంద్రంగా మారిందని ఎన్నడూ లేని విధంగా 96 మందితో డబుల్ జంబో సేవా కమిటీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సేవా కమిటీని నింపేసిన కూటమి ప్రభుత్వం.96 మందితో సేవా కమిటీ ఎర్పాటుపై అలయ వర్గాల్లో విస్మయం -
దుర్గమ్మ సేవలో త్రివిక్రమ్ శ్రీనివాస్
ఇంద్రకీలాద్రి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikiram Srinivas) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం నాడు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. భార్య సౌజన్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. త్రివిక్రమ్ కుటుంబసభ్యుల పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
కృష్ణానదికి మళ్లీ వరద
ఆందోళనలో కరకట్ట వాసులు కంచికచర్ల: బాలికపై బ్లేడ్తో దాడి చేసి గాయపర్చిన ఘటనకు సంబందించి ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.విశ్వనాఽథ్ ఆదివారం తెలిపారు. అంబేద్కర్నగర్కు చెందిన బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీకి చెందిన యువకుడు బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శనివారం రాత్రి వెళ్లి బ్లేడుతో దాడి చేసి గాయపర్చాడు. ఆ యువకుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధిని వికేంద్రీకరించాలని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయనగరంలో జరిగిన జేవీవీ 18వ రాష్ట్ర మహాసభలలో చేసిన తీర్మానాలపై ఆదివారం రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విజయనగరంలో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని పరిరక్షించి స్మారక కేంద్రంగా మార్చాలని, ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, ఆయన పేరుతో విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్ట పరచి టీచింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని తీర్మానం చేశామన్నారు. జేవీవీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దార్ల బుజ్జిబాబు, రాజశేఖర్, గౌరు నాయుడు, శోభన్ కుమార్, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు -
బాలుతో ప్రయాణం మధుర జ్ఞాపకం
విజయవాడ కల్చరల్: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో ప్రయాణం తన జీవిత గతినే మార్చిందని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. రాగలహరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఆశీష్ స్టూడియోలో ఆదివారం సినీ నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు బాల సుబ్రహ్మణ్యం సంస్మరణసభ, సినీ సంగీత విభావరి, సినీ, టీవీ నటుడు శుభలేకసుధాకర్కు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శుభలేక సుధాకర్ మాట్లాడుతూ బాలుతో ప్రయాణం ఓ మధురజ్ఞాపకం అని చెప్పారు. ఆయన వద్దే క్రమశిక్షణ, నిజాయతీ నేర్చుకున్నానని తెలిపారు. బాలు పేరుతో పురస్కారం అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని విషయం అన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు మల్లాది స్వాతి మాట్లాడుతూ బాలు మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు అన్నారు. గాయని కామేశ్వరి, న్యాయవాది ముష్టి శ్రీనివాస్, మీరాకుమార్, చింతకాయల చిట్టిబాబు పాల్గొన్నారు. నిర్వాహకులు శుభలేక సుధాకర్ను సత్కరించారు. అయ్యప్పన్ ఆధ్వర్యంలో గాయనీ గాయకులు పలు చిత్ర గీతాలను ఆలపించారు. -
పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలకం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం కీలకమని, ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితంలో మొక్కలు నాటాలని విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. ‘స్వచ్చతా హీ సేవా–2025’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ డివిజన్ వ్యాప్తంగా 41 ప్రాంతాలలో మొక్కల పెంపకంపై డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా పలు రైల్వేస్టేషన్లు, కాలనీలు, హాస్పిటల్స్, హెల్త్ యూనిట్లతో పాటు విజయవాడలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్, డిజిల్ లోకో షెడ్, కోచింగ్ డిపో, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ మొక్కలు నాటడం కేవలం పర్యావరణ పరిరక్షణే కాదని, అది మన ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. ఈ రోజు నాటిన మొక్క భవిష్యత్తులో పరిశుభ్రమైన, పచ్చని ఆహ్లాదకర, ఆరోగ్యవంతమైన సామాజం వైపు అడుగును సూచిస్తుందన్నారు. నాటిన ప్రతి మొక్కను రైల్వే సిబ్బంది పర్యవేక్షించాలని, తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు బ్రాంచ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.డీఆర్ఎం మోహిత్ సోనాకియా -
షార్ట్ ఫిల్మ్ల ద్వారా పరిచయం శుభపరిణామం
కృష్ణలంక(విజయవాడతూర్పు):కొత్త ఆలోచనలు, ఆశలతో ఎంతో మంది కళాకారులు షార్ట్ ఫిల్మ్ల ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావడం శుభపరిణామమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్భీమన అన్నారు. మహాకవి గురజాడ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలుగు షార్ట్ ఫిల్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా–పెద్ద సందేశం పేరుతో జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్, ప్రైవేట్ పాటల వీడియోలు, రీల్స్ పోటీలు నిర్వహించారు. షార్ట్ఫిల్మ్ పోటీలను అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు యడ్ల పార్థసారథి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్భీమన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త తరానికి ప్రోత్సాహమిస్తూ షార్ట్ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. తనతో పాటు చాలామంది నటీనటులు, దర్శకులు షార్ట్ ఫిల్మ్ల ద్వారానే సినీపరిశ్రమకు పరిచయం అయ్యామన్నారు. మరింత మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకులు, సంగీత దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు ఉపయోగపడతాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 15 షార్ట్ ఫిల్మ్లు, 31 రీల్స్, 9 ప్రైవేట్ పాటల వీడియోలను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వీరశంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఆదిత్య, ప్రజా వైద్యశాల వైద్యుడు డాక్టర్ మాకినేని కిరణ్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి కొండలరావు, ఎం.బి.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, డి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా రైల్వే ఉద్యోగుల పిల్లలకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ నెల 14, 21 తేదీల్లో విజయవాడ, సామర్లకోట, తుని, ఏలూరు, రాయనపాడు, తెనాలి, ఒంగోలు, భీమవరం, మచిలీపట్నంలో నిర్వహించిన పోటీల్లో 400 మంది ఉద్యోగుల పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైషన్ అధ్యక్షురాలు వర్షా సోనాకియా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లోని ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. అలానే కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలకు రైల్వే అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ స్వప్న వరుణ్, జాయింట్ సెక్రటరీ వాసంతిక, కృష్ణ చైతన్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
యూరియా.. యాతన
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన నువ్వుల శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు చేస్తున్నారు. ఈ సీజన్లో ఎంటీయూ 1318 రకం వరి పంట సాగు చేశారు. తొలి విడతలో అతికష్టమ్మీద మూడు కట్టల యూరియా మాత్రమే దొరికింది. రోజుల తరబడి పడిగాపులు కాసినా రెండో విడతలో నిరాశే మిగిలంది. దీంతో చేసేది లేక అధిక ఖర్చు అయినా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అదే యూరియా దొరికితే ఎకరాకు రెండు కట్టల చొప్పున రూ.533తో సరిపోయేది. కాంప్లెక్స్ ఎరువులు వాడుతుండటంతో రూ.3 వేల దాకా ఖర్చు అవుతోంది. అంటే దాదాపు ఆరు రెట్లు అదనపు భారం పడింది. పైగా ఒక్కో సొసైటీలో ఒక్కో ధర. లోడింగ్, రవాణా ఖర్చులు దీనికి అదనం. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయితే ప్రస్తుతం రూ.8 వేలకు పైగా ధారపోయాల్సి వస్తోందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు.ఎన్టీఆర్ జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన రైతు మైనేని దుర్గాప్రసాద్ 17 ఎకరాలు కౌలుకు తీసుకొని 1318 వరి వేశారు. రెండో విడతగా కట్ట యూరియా కోసం నాలుగుసార్లు పనులు మానుకుని వచ్చినా మీ టోకెన్ నెంబర్ రాలేదంటూ తిప్పి పంపిస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా రూ.300 నుంచి రూ.500 దాకా అడుగుతున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు పురుగుల మందులు అంటగడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో చేసేది లేక 20ః20 వేశాడు. ఈ ప్రభుత్వం అదునుకు యూరియా కూడా అందించలేకపోతోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆక్రోశిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈసారి దిగుబడులు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.సాక్షి, అమరావతి: ఒకపక్క యూరియా కరువు.. మరోవైపు ఏ పంటకూ మద్దతు ధరలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా అరకట్ట దొరకడం గగనంగా మారింది. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది. అటు పెట్టుబడి సాయం అందక.. ఇటు ఉచిత పంటల బీమాకు దూరమై రైతన్నలు అల్లాడుతున్నారు. పంట నష్టపోతే కనీసం కరువు సాయం కూడా అందని దుస్థితి నెలకొంది. వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న తరుణంలో రెండో విడతగా ఇవ్వాల్సిన యూరియా కోసం కటకటలాడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో యూరియా కోసం తమ అగచాట్లను అన్నదాతలు మొర పెట్టుకున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడుతూ గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు.పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు..గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కియోస్క్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తమ కళ్లాలకు సరఫరా చేసేవారు. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్తో పాటు రవాణా ఖర్చుల రూపంలో బస్తాకు రూ.20–50 వరకు ఆదా అయ్యేది. ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ విత్తనాలు, యూరియా కోసం ఎక్కడా క్యూలైన్లు కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత యూరియా దొరికేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదిగా పరిస్థితి మారిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాకు మంగళం పాడారు. సబ్సిడీ విత్తనాలకూ కోత పెట్టారు. మరోవైపు ఎరువుల సరఫరాను సొసైటీలకు పరిమితం చేశారు. దీంతో ఎరువుల కోసం సీజన్లో పొలం పనులు మానుకుని మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 రోజుల పాటు పొలం పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తేగానీ అరకట్ట దొరకడం గగనమైపోయింది. టీడీపీ కూటమి నేతల సిఫార్సు మేరకు సరఫరా జరుగుతుండటంతో సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీసీ ఆర్సీ కార్డులున్న వారు సైతం యూరియా దొరక్క ప్రైవేటు వ్యాపారుల వద్ద నిలువు దోపిడికి గురవుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో నూటికి 70–80 శాతం మంది కౌలు రైతులే. వీరంతా రెండో విడతలో కూడా యూరియా దొరక్క యాతన అనుభవిస్తున్నారు. బాపట్ల జిల్లా ఆవులవారిపాలెంలో యూరియా కోసం రైతుల పడిగాపులు (ఫైల్) పక్కదారి పట్టిన యూరియా..వ్యవసాయ సీజన్లో 10 శాతానికి మించి పనులు సాగని జూన్, జూలైలోనే దాదాపు 35 శాతం యూరియా అమ్మకాలు జరగడం చూస్తే అదంతా నల్ల బజారుకు చేరిపోయిందని అర్ధమౌతుంది. డిమాండ్ సాకుగా చేసుకుని టీడీపీనేతలు యూరియాను అధికధరలకు అమ్ముకున్నారు. వరి పొలాలకు యూరియా ఇవ్వాల్సిన తరుణంలో సర్కారు చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున నిల్వలు పక్కదారి పట్టినా కళ్లప్పగించి చూసింది. దీంతో కట్ట యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా సరఫరాలో అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టే వరకు చంద్రబాబు సర్కారు మేలుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదునుకు యూరియా దొరక్క రైతులు ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా కట్ట రూ.266.50 కాగా సొసైటీల్లోనే రూ. 25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500 వరకు గుంజుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బస్తా రూ.600–700 వరకు పిండుతున్నట్లు రైతులు చెబుతున్నారు. బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అవసరం లేని పురుగు మందులను అంటగడుతుండడంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సొసైటీలను పరిశీలించగా చాలా చోట్ల యూరియా నిల్వలే లేవు. డిమాండ్కు సరిపడా లేక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి.అదునుకు అందకపోతే..శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాతో పాటు ఉత్తర కోస్తాలో ఎకరాకు 75–80 కేజీలు యూరియా అవసరం. గిరిజన ప్రాంతాల్లో 55–69 కిలోలు వినియోగించాలి. వర్షాధార ప్రాంతాల్లో మూడు విడతల్లో 100–125 కేజీలు, నీటిపారుదల ప్రాంతాల్లో నాలుగు విడతల్లో 80–90 కిలోల చొప్పున పంటలకు యూరియా వేస్తారు. వర్షాధార ప్రాంతాల్లో విత్తే సమయంలో తొలి విడతగా, 30–35 రోజుల మధ్య రెండో విడత, మిగిలింది 50–55 రోజుల మధ్య వేస్తారు. నీటిపారుదల ప్రాంతాల్లో నాట్లు వేసిన 7–10 రోజుల్లో తొలి విడత, 25–30 రోజుల్లో 2వ విడత, 45–50 రోజుల మధ్య మూడో విడత, చివరగా 60–65 రోజుల మధ్య నాలుగో విడత యూరియా అవసరం ఉంటుంది. తొలిదశలో యూరియాతో పాటు డీఏపీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. రెండో విడతలో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 20–25 కేజీలు వేస్తారు. చివరి రెండు దశల్లో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. మూడో దశకు యూరియా అందకపోతే పంట ఏపుగా ఎదగదు. దుబ్బులో పిలకలు తగ్గిపోతాయి. చివరి దశలో యూరియా అదునుకు ఇవ్వకుంటే కంకి సైజు తగ్గిపోవడం, గింజ బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 3, 4వ దశల్లో నత్రజని అందకపోతే దిగుబడి గణనీయంగా 5–10 బస్తాల వరకు తగ్గిపోతుంది.రెండో దశలోనూ కటకట..ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది. కృష్ణా డెల్టా పరిధిలో ఎకరాకు దాదాపు రెండు బస్తాల యూరియా వాడతారు. రెండో విడతలోనూ మెజార్టీ రైతులకు యూరియా అందకపోవడంతో చేసేది లేక కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువు (20ః20)లో 20 శాతం మాత్రమే నత్రజని, 20 శాతం ఫాస్పేట్ ఉంటాయి. తీవ్ర కొరత కారణంగా రెండు మూడు విడతల్లో 20 కేజీల చొప్పున వేయాల్సిన యూరియాకు బదులుగా 20ః20 కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో ఉండే నత్రజని కోసం దాదాపు 60 కేజీల కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 20 కేజీల యూరియాకు రూ.135 ఖర్చవుతుండగా, 60 కేజీల కాంప్లెక్స్ కోసం దాదాపు రూ.1,600 వరకు వెచ్చించాల్సిన అగత్యం తలెత్తింది. ఈ లెక్కన 2–3 విడతల్లో 45 కేజీల యూరియా బస్తాకు కేవలం రూ.266.50 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల దాదాపు రూ.3,200 వ్యయం అయింది. అంటే ఐదారు రెట్లు అదనంగా రైతుల నెత్తిన భారం పడింది. అయినప్పటికీ పంట ఎదుగుదల కానరాక ఈసారి దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కనీసం ఎకరాకు 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరియా కోసం తోపులాట..తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్దకు పోటెత్తారు. పోలీసులు తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకోగా మూడు గంటల పాటు రైతులు పడిగాపులు కాశారు. క్యూలైన్లు ఏర్పాటు చేసేలోపే పీఏసీఎస్ సిబ్బంది టోకెన్ల పంపిణీ ప్రారంభించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు, సహకార సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారికి సిఫారసు చేశారు.శ్రీకాకుళం జిల్లా మజ్జిలిపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారునాకు సొంతంగా అరకెరం భూమి ఉంది. కౌలుకు ఏడెకరాలు తీసుకొని ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసా. యూరియా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందిపడ్డాను. యూరియా దొరక్క కాంప్లెక్స్ వాడుతున్నాం. సొసైటీలో ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వడం లేదు. ఇది ఏ మూలకు సరిపోతుంది. ఊర్లో పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. మాలాంటి బక్క రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు..బహిరంగ మార్కెట్లో యూరియా దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అదును యూరియా కూడా అందించడం ఈ ప్రభుత్వం చేతకావడం లేదు. – తెన్నేటి శ్రీనివాసనాయక్, తెన్నేరు, కృష్ణా జిల్లాఅరకట్ట ఏ మూలకు సరిపోతుందిఆరుకట్టలు. పురుషోత్తపట్నం నుంచి మంతెన తీసుకెళ్తున్నారు.ఎకరాకు అరకట్ట ఇచ్చారు. చాలడం లేదు. 33 ఎకరాల సొంత భూమి భూమి ఉంది. ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తే..ఆరు కట్టలు ఇచ్చారు. మూడు విడతల్లో కట్ట వెయ్యాలి. కానీ అరకట్టే ఇస్తున్నారు. అమ్మోనియా వేస్తునాం.– కిరణ్..పురుషోత్తçపట్నం, కృష్ణా జిల్లాఅందరికీ సరిపెట్టాలంటున్నారు20 ఎకరాలు..10 కట్టలు ఇచ్చారు. ఒక కోటా వేసాం. అధిక వర్షాలకు పంట మునిగిపోయింది. పంట పోయింది. మళ్లీ నాట్లు వేసాం. రెండో విడతలో యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నాం. ఎకరాకు అరకట్ట ఇస్తున్నారు,. చాలా ఇబ్బంది ఉంది. అడిగితే అందరికి సరిపెట్టాలి కదా అంటున్నారు.2వేలకు పైగా అదనంగా ఖర్చు 15 ఎకరాల్లో వరి వేశా. 11 కట్టలిచ్చారు. పైగా సొసైటీలోనే కట్ట రూ.270 తీసుకుంటున్నారు. రెండో విడత యూరియా దొరక్క 20ః20 వేసాం. బస్తాకు రూ.1350 చొప్పున రెండు బస్తాలు వేయాల్సి వచ్చింది. దాదాపు 2వేలకుపైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.– పిన్నబోయిన కొండలరావు, కృష్ణా జిల్లారైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలిలా..⇒ కేంద్రంతో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. దీన్ని తుంగలో తొక్కి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లతో సరిపెట్టారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు.⇒ ఎన్నడూ లేని విధంగా గడిచిన 15 నెలల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికీ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.⇒ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత పంటల బీమా పథకం కింద 2023–24 సీజన్కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు కంపెనీలకు చెల్లించలేదు. ఫలితంగా ఆ సీజన్లో కరువు, వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు.⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్–2024–25 ఉచిత పంటల బీమా పథకం కింద రైతుల తరపున చెల్లించాల్సిన రూ.833.92 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు.⇒ రబీ–2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేసిన ఫసల్ బీమా కోసం ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయలేదు. ఈ కారణంగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా బీమా పరిహారం నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది.⇒ 2023–24 సీజన్కు సంబంధించి ఎన్నికల కోడ్తో పాటు వివిధ సాంకేతిక కారణాలతో 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు.⇒ సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 2024 సీజన్లో 6.31లక్షల మందికి జమ చేయాల్సిన రూ.132 కోట్లు నేటికీ జమ చేయలేదు.⇒ 2024–25 సీజన్లో వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4.50 లక్షల మందికి చెల్లించాల్సిన మరో రూ.650 కోట్లు ఇప్పటికీ జమ చేయలేదు. ఈ విధంగా దాదాపు రూ.23,584 కోట్లు కూటమి సర్కారు రైతులకు ఎగ్గొట్టింది.మద్దతు ధర కరువు..సీజన్ ఆరంభంలోనే ధరల పతనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరులో మాసూళ్లకు వచ్చిన సన్నరకాలకే మద్దతు ధర కరువైంది. మద్దతు ధర ప్రకారం పుట్టికి (850 కేజీలు) రూ.19,720 దక్కాల్సి ఉండగా రూ.14వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. అదీ కూడా కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ పంటకూ కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఉల్లి కిలో 50 పైసలకు పడిపోయింది. జీ–9 రకం అరటి టన్ను రూ.4–6 వేలకు పడిపోగా చీని (బత్తాయి) ధర టన్ను రూ.6–12వేలకు పతనమైంది. ఉల్లి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటా రూ.1,200 చొప్పున తమ వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే వారిని మభ్యపుచ్చేందుకు హెక్టార్కు రూ.50 వేల సాయం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రెండో విడతలో 7 లక్షల మందికి కోతపెట్టింది. ఉచిత పంటల బీమాను అటకెక్కించి బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపింది. ఏడాదిగా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం ఎగ్గొట్టడంతో రైతులకు దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. సున్నా వడ్డీ రాయితీకి చాప చుట్టేసింది.గత ప్రభుత్వం ఆదుకుంది ఇలా..వైఎస్సార్సీపీ హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.60 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాదు.. ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకుంది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఇలా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అండగా నిలిచింది. -
యువ పరిశోధకులు కొత్త ఆలోచనలతో ముందుకురావాలి
పెనమలూరు: యువ పరిశోధకులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి కూనా రాంజీ అన్నారు. గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం జాతీయ స్థాయిలో ఇన్నోవేటివ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో సవాళ్లను ఎదుర్కొవటానికి పరిశోధనలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు చదివితే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చాటిన వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కాలేజీ డైరెక్టర్ డీఆర్కేఆర్ రవిప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కడియాల రవి, డీన్లు ఆర్.సత్యప్రసాద్, రాజేష్ గోగినేని, ఈడూకేర్ ప్రతినిధులు పి.వెంకట రమేష్, సంతోష్, కోఆర్డినేటర్ డాక్టర్ కోనేరు సౌమ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.