breaking news
Krishna
-
ప్రయాణికుడి చెంపపై కొట్టిన మహిళా కండక్టర్
తోట్లవల్లూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పట్ల మహిళా కండక్టర్ అనుచితంగా ప్రవర్తించటమే కాకుండా చొక్కా పట్టుకుని చెంప చెళ్లుమనిపించిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును గురువారం ఉదయం ఓ వ్యక్తి ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో టికెట్కు సరిపడా చిల్లర లేకుండా బస్సు ఎందుకు ఎక్కావంటూ మహిళా కండక్టర్ ప్రయాణికుడి పట్ల దురుçసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాదన జరగటంతో కనకదుర్గమ్మ కాలనీ వద్ద కండక్టర్ బస్సును నిలిపివేశారు. ప్రయాణికుడిని బస్సు నుంచి దించి, ‘నన్ను బూతులు తిడతావా’ అంటూ అతని చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ ఘటనను చూసిన పలువురు స్థానికులు నివ్వెరపోయారు. టికెట్ తీసుకునే విషయంలో ప్రయాణికుడి పొరపాటు ఉన్నప్పటికీ, అతని చొక్కా పట్టుకుని కొట్టేంత వరకు వెళ్లిన మహిళా కండక్టర్ ప్రవర్తన పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్ను ఎస్ఐ పలుసార్లు పోలీస్స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
లెవల్ నిర్వహిస్తేనే..
కోమటిగుంట లాకులు వద్ద లాకులు బిగించి ఏడు అడుగులు నీటి మట్టం నిర్వహించాలి. అప్పుడే రెగ్యులేటర్కు ఎగువన ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. పంట కాలువల షట్టర్లు తెరచుకోవటంతో పాటుగా తూములు ద్వారా పంట కాలువల్లోకీ నీరు మళ్లుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం ఆరు అడుగులు మాత్రమే ఉంది. దీంతో రెగ్యులేటర్కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కక, సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడు అడుగులు లెవల్ నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో నాట్లకు సిద్ధమవుతున్న నారుమడులు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. -
గవర్నర్కు ఘన స్వాగతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్కు విశ్వవిద్యాలయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన వర్సిటీకి చేరుకోగా.. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రూ.3.20 కోట్లతో నిర్మించిన వంటశాలను ప్రారంభించారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్ చేరుకుని స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ కార్యదర్శి హరిజవహర్లాల్, సంయుక్త కార్యదర్శి పీఎస్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల్లో నిరాశ.. స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య, విశిష్ట అతిథుల చేతుల మీదుగా పట్టాలు పొందవచ్చని ఎంతో ఆశగా వచ్చిన పీహెచ్డీ, పీజీ పట్టాదారులు నిరాశ పడ్డారు. గవర్నర్ గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ఆయన చేతుల మీదుగా అందజేశారు. మిగిలిన వారికి వర్సిటీ వీసీ, కింది స్థాయి అధికారుల చేతుల మీదుగా అందజేయడంలో వారు పెదవి విరిచారు. -
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి
హనుమాన్జంక్షన్ రూరల్: వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంనకు చెందిన కైలే జ్ఞానమణి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలం పనిచేస్తున్న జ్ఞానమణి గతంలో బాపులపాడు జెడ్పీటీసీ సభ్యు రాలిగా, మహిళా విభాగం ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా సేవలు అందించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని, మహిళల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడతానని జ్ఞానమణి తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానమణికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. స్వయం సహాయక బృందాలకు రుణ మంజూరు లేఖ పటమట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థి కంగా బలోపితం అయ్యేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కృషి చేస్తున్నాయని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ లబ్ధిదారులకు బుధవారం రుణ మంజూరులేఖను ఆయన అందించారు. ఈ సందర్భంగా తేజ్భరత్ మాట్లాడుతూ.. నగరంలో నాలుగు క్యాంటీన్లను మంజూరు చేశామని, వీటిలో కంటెయినర్ల సమీకరణ, కిచెన్ ఎక్విప్మెంట్ మొదలగు ఏర్పాటు చేయటానికి ఒక్కో క్యాంటీ న్కు రూ.14.51 లక్షలు రుణం మంజూరు చేశామని తెలిపారు. ఈ క్యాంటీన్లు జన సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పంజా సెంటర్లో భారత ఓవర్సీస్ బ్యాంక్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ పట్టణ సాధికార విభాగం ప్రాజక్ట్ అధికారి పి.వెంకటరమణ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఐదు రోజులు ముందుగానే రేషన సరుకుల పంపిణీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రేషన్షాపుల ద్వారా జూలై నెల రేషన్ను ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన రేషన్ కార్డుదారులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సంబంధిత డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
కావాలి కనికరం!
అనాధీనం..రైతులకు పట్టాలు ఇవ్వాలి.. బుడమేరు పరీవాహక ప్రాంతంలో దశాబ్దాల కాలంగా రైతులు భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు ఇవ్వకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కాలువలో ఉన్న భూమి అంటూ పట్టాలు ఇవ్వడం లేదు. ఎగువన ఇదే డ్రెయిన్లో పట్టాలు ఇచ్చి దిగువన ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయం. వెంటనే ప్రభుత్వం స్పందించి అసైన్డ్ కమిటీ ద్వారా రైతులకు పట్టాలు ఇవ్వాలి. – ఆర్సీపీ రెడ్డి, సీపీఎం నాయకుడు తీవ్రంగా నష్టపోతున్నాం.. బుడమేరు వరదలు వచ్చినప్పుడు పంట పూర్తిగా నీట మునిగి నష్టపోతున్నాం. పట్టాలు లేని కారణంగా మాకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. పట్టాలు ఇవ్వాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకుంటూనే ఉన్నాం. మా గోడు విన్న నాయకుడే లేడు. కనీసం వ్యవసాయశాఖ నుంచి వచ్చే రాయితీలు ఇవ్వడం లేదు. మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలి. – సత్యనారాయణ, రైతు ఎల్ఎన్పురం గుడివాడరూరల్: బుడమేరు పరీవాహక ప్రాంతంలోని అనాధీన భూముల్లో సాగు చేసుకునే రైతులు పట్టాలు ఇప్పించాలంటూ దశాబ్దాలుగా వేడుకుంటున్నారు. పట్టాలు లేకపోవడంతో భూములు ముంపునకు గురైనా పరిహారం రాకపోవడం, సాగుకు వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. నందివాడ మండలంలోని చేదుర్తిపాడు, ఒద్దులమెరక, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇలపర్రు గ్రామాల పరిధిలోని బుడమేరు డ్రెయిన్లో దాదాపుగా 1000 ఎకరాల వరకు అనాధీన భూమి ఉంది. ఆయా గ్రామాల పరిధిలోని నిరుపేద బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల పేద రైతులు వంశపారంపర్యంగా భూములను సాగు చేసుకుంటున్నారు. దక్కని నష్ట పరిహారం.. అనాధీన భూముల్లో సాగు చేసిన రైతులకు నష్ట పరిహారం అందించడం లేదు. ఇదే పరీవాహక ప్రాంతంలో ఎగువన విజయవాడ నుంచి బాపులపాడు మండలం వరకు పట్టాలు ఉన్న భూములకు ముంపునకు గురయ్యాయని ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అనాధీన భూముల రైతులకు పట్టాలు లేవన్న సాకుతో నష్టపరిహారం ఇవ్వలేదు. వాస్తవానికి 1950కు ముందు ఇదే ప్రాంతంలో బుడమేరు కరకట్టలు నిర్మించకముందు భూములను పంట భూములుగా పరిగణించి వరదలు వచ్చిన సమయంలో నష్టపరిహారం చెల్లించారు. జలగం వెంగళ్రావు సీఎంగా ఉన్న సమయంలో బుడమేరు ఇరువైపులా కరకట్టలు నిర్మించారు. అప్పటి నుంచి కాలువల పరిధిలో ఉన్న భూములకు నష్టపరిహారం చెల్లించేది లేదని సుప్రీంకోర్టు తీర్పును వంకగా చూపి భూములకు పట్టాలు ఇవ్వకుండా నష్టపోయినా నష్టపరిహారం చెల్లించడం లేదు. ఫలితంగా రైతులు నష్టపోతూ వస్తున్నారు. ఏటా సాగు చేస్తున్నా భూములకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేస్తున్నా అధికారులు పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదు. పంట నష్టం ఇవ్వని పక్షంలో ఈ–క్రాప్ ఎందుకు నమోదు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క రూపాయీ రాలేదు.. బుడమేరు ఆధునికీకరణ పేరిట విజయవాడ నుంచి ఇలపర్రు వరకు దాదాపుగా 5రీచ్లుగా విభజించి డ్రెయిన్ను తవ్వారు. ఆధునికీకరణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రూపంలో ప్రభుత్వం భారీగానే నిధులు మంజూరు చేసింది. ప్రాంతాలను బట్టి పట్టాలు ఉండి భూములు కోల్పోయిన రైతులకు రూ.లక్షల్లో పరిహారం చెల్లించింది. నందివాడ మండలంలోని అనాధీన భూముల రైతుల భూములు దాదాపుగా 100 ఎకరాలకు పైగా ఆధునికీకరణలో కోల్పోయారు. పట్టాలు లేకపోవడంతో రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించలేదు. తాతలు, తండ్రుల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న భూమి ఒక్కసారిగా కోల్పోవడంతో కుటుంబాలు వీధిన పడ్డాయి. నష్ట పరిహారం చెల్లించాలంటూ భూములు కోల్పోయిన రైతులు అధికారులు, పాలకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా దక్కలేదు. గతంలో 1990కు ముందు పంట నష్టపోయి పరిహారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పట్టా భూములుగా పరిగణించాలంటూ పాలకులు, అధికారులను వేడుకుంటున్నా కరుణించడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే బుడమేరు రైతులకు న్యాయం చేసి పట్టాలు ఇప్పిస్తామని గద్దెనెక్కిన నాయకులు పంట నష్టం ఇప్పించడంపై నోరు మెదపడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు.దశాబ్దాల రైతు కష్టాలు తీరేదెప్పుడో? గతేడాది బుడమేరు వరదలో పంట కోల్పోయినా పరిహారం శూన్యం ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పట్టించుకోని పాలకులు ఈ–క్రాప్ చేసినా పరిహారం దక్కడం లేదని రైతుల గగ్గోలు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి -
683 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్ –2025లో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫి కెట్ల పరిశీలన ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు–216 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో–247 మంది, ఆంధ్రా లయోల కళాశాల ఆవరణలోని కేంద్రంలో–220 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 683 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను అందజే శామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. నేటి షెడ్యూల్ ఇదీ.. ● స్పెషల్ కేటగిరీకి సంబంధించి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో ఎన్సీసీలో 40,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి నుంచి 60 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. జనరల్ కేటగిరీకి సంబంధించి మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 86,001 నుంచి 95 వేల లోపు ర్యాంకు వరకు, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 95,001 నుంచి లక్షా నలభై వేల లోపు ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. -
‘వైద్య సేవ’తో నిధులు సమకూర్చుకోవాలి
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని, ఎన్టీఆర్ వైద్య సేవ కేసులకు వైద్యం చేసి నిధులు సమకూర్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) డి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్య అధికారులకు సూ చించారు. స్థానిక సర్వజన ప్రభుత్వాస్పపత్రి, మెడి కల్ కాలేజీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ముఖ్య విభాగాలైన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఐసీసీయూ, ఎంఐసీయూ, జనరల్ వార్డు, లేబర్ వార్డులను పరిశీలించారు. ప్రతి వార్డులో వసతులు, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవల గురించి వివరంగా విచారణ చేశారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులపై సమీక్ష నిర్వహించారు. వెంటిలేటర్ పనిచేయకపోవడాన్ని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నచిన్న మరమ్మతులు చేయకపోవటంపై ఇంజినీరింగ్ విభాగం అధికారులను మందలించారు. వైద్యులు స్థానికంగా నివసించాలి మెడికల్ కాలేజీలో వైద్యులతో ఏడీఎంఈ వెంకటేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు స్థానికంగానే నివసించాలని, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటు, మౌలిక వసతుల మెరుగుదల, అవసరమైన సిబ్బంది నియామకం, పరికరాల నిర్వహణపై సమగ్ర నివేదిక సంబంధిత శాఖకు అందజేయనున్నట్లు ఏడీఎంఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఆశాలత, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నిరంజన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ టి.టి.కె.రెడ్డి, పలువురు వైద్యులు, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెంకటేశ్వరరావు ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు వార్డుల్లో వసతులు, పరిశుభ్రత, వైద్య సేవలపై సమీక్ష వెంటిలేటర్ పని తీరుపై అసంతృప్తి -
రైల్వే సమగ్రతలో టీటీఈల పాత్ర కీలకం
సీనియర్ డీసీఎం రాంబాబు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వే సమగ్రతను నిలబెట్టడంలో టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్లు (టీటీఈలు) కీలక పాత్ర పోషిస్తారని విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు పేర్కొన్నారు. విజయ వాడ డివిజన్లో టికెట్ తనిఖీ తీరుపై సీనియర్ డీసీఎం అధ్యక్షతన డీఆర్ఎం కార్యాలయంలోని కాన్పరెన్స్ హాలులో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యాప్తంగా స్క్వాడ్ ఇన్చార్జ్లు, ఎమినిటీస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీనియర్ డీసీఎం రాంబాబు మాట్లాడుతూ.. టీటీఈలు విధుల్లో అవలంబించే అంకితభావం, వృతి నైపుణ్యం, మంచి ప్రవర్తన సంస్థపై నేరుగా ప్రతిబింబిస్తాయని తెలిపారు. వారు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తు రాయితీ కోటా దుర్వినియోగం, టికెట్ లోని పేరు మార్పులు, సరైన ఐడీ కార్డులు లేకుండా ప్రయాణించే వారిని నివారించాలని ఆదేశించారు. వారు విధుల్లో ఎదుర్కోనే ఇబ్బందుల గురించి అడిగి తెలసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన టీటీలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కమర్షియల్ మేనేజర్ బి.వి.ఎన్.ఎస్.రవి ప్రసాద్, పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్, కమర్షియల్ అధికారులు పాల్గొన్నారు. -
నాట్లలోనే నీటి గోస
నీళ్లు రావటం లేదు.. మా ఉప్పలూరు, వేల్పూరు, పునాదిపాడు, కోలవెన్ను ప్రాంతాలు కోమటిగుంటకు ఎగువన ఉన్నాయి. లాకులు వద్ద ఏడు అడుగులు లెవల్ మట్టం ఉండేలా చూడాలి. అప్పుడే పంట కాలువల్లోకి నీరు చేరుతుంది. జూన్ ఆఖరు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వరి నారుమడులను బతికించుకోవటానికి కాలువలు, మురుగు కాలువల్లో ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో మళ్లిస్తున్నాం. ఎకరాకు రూ. 5 వేలు పైగా ఖర్చులు అవుతున్నాయి. మా బాధలు గుర్తించి సాగునీటి సమస్యను తీర్చాలి. – నెరుసు రమేష్, రైతు, ఉప్పలూరు కంకిపాడు: ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం ఉన్నా, సరైన లెవల్ నిర్వహణ జరగకపోవటంతో ఎగువ ప్రాంత పంట కాలువలకు నీరు ఎక్కడం లేదు. దీంతో ఆయా కాలువల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా తయారైంది. కాలువల్లో ఉన్న అడుగు బొడుగు నీటిని ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలకు మళ్లించి నారుమళ్ల సంరక్షణకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. సాగుకు సన్నద్ధం.. కంకిపాడు లాకులు పరిధిలో 35వేల ఎకరాల్లో సాగు భూమి ఉండగా కోమటిగుంట రెగ్యులేటర్ పరిధిలో 3.43లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఈ రెండు లాకులు నుంచి దిగువకు సాగునీటి సరఫరా అవుతోంది. బోర్ల సదుపాయం ఉన్న రైతులు మాత్రం నారుమడులు పోయటంతో పాటుగా, దమ్ములు పూర్తి చేసి వరి నాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కట్లు వర్ణనాతీతం.. లాకులకు ఎగువ ప్రాంత రైతులు మాత్రం సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ నీటిపై ఆధారపడి సాగుకు ఉపక్రమించే అన్నదాతలు కాలువల్లో నీరు సమృద్ధిగా లేక వరి నారుమడుల సంరక్షణ, భూములను దమ్ము చేసేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. కంకిపాడు, కోమటిగుంట రెగ్యులేటర్కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని అనేక గ్రామాల్లో పంట కాలువలు సాగునీరు లేక, జమ్మి, తూటికాడతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. అడుగుబొడుగున ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో వరి నారుమడులకు, భూముల దమ్ములకు మళ్లిస్తూ వరి నాట్లకు అతి కష్టం మీద సన్నద్ధమవుతున్న పరిస్థితి. సాగు మొదట్లోనే భారం.. ఖరీఫ్ సాగు మొదట్లోనే రైతులపై భారం మీద భారం పడుతోంది. వ్యవసాయశాఖ నుంచి విత్తనాలు పంపిణీ కూడా అరకొరగానే సాగింది. తొలకరి పలకరింపుతో పొలాలు అదును తప్పకుండా ఉండేందుకు బయటి మార్కెట్లో 30 కిలోల వరి విత్తనం బ్యాగులు రూ.1100–రూ.1200 చొప్పున కొనుగోలు చేసి వరి నారుమడులు పోసుకున్నారు. ప్రస్తుతం నారుమడులు సంరక్షించుకోవటానికి, భూములను దమ్ము చేసుకోటానికి సాగునీటికి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరం పొలం ఆయిల్ ఇంజిన్లతో తడిపేందుకు 10 గంటల సమయం పడుతోంది. ఇందుకోసం ఎకరాకు రూ. 4500 నుంచి రూ.5500 వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో ఉంటే తూములు, గండ్లు ద్వారా పొలాలకు సమృద్ధిగా నీరు అందించుకునే వాళ్లమని రైతులు వాపోతున్నారు. అవసరమైన లెవెల్ లేక తెరచుకోని పంట కాలువల గేట్లు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడుతున్న రైతులు ఖరీఫ్ ఆరంభంలోనే సాగుకు అన్నదాతల తంటాలు -
పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
అవనిగడ్డ: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్(26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్ను ఎస్ఐ పలుసార్లు పోలీస్స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
1న వైద్యులకు అవార్డుల ప్రదానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించనున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న వారికి బెస్ట్ డాక్టర్ అవార్డ్స్–2025 అందజేయనున్నారు. ఈ అవార్డులకు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదగా అందించనున్నట్లు వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. అవార్డులు అందుకుంటున్న వారిలో జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్ట్లు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి. భాస్కరనాయుడు, జనరల్ సర్జన్, డీఎంఈ–ఏపీ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం, డాక్టర్ జి.భవానీ ప్రసాద్, న్యూరో సర్జన్ డాక్టర్ కె. సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం.కృష్ణనాయక్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ శ్రీవస్తవ, డాక్టర్ ఆర్.మురళీ బాబూరావు, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ టి.భారతి ఉన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మునిసిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, మలేరియా విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రా జ్యావాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ప్రదర్శన జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లా డుతూ.. యుద్ధం ముగిసిందని కొందరు అనుకుంటున్నారని, కాల్పుల విరమణ కేవలం తాత్కాలికమేనని అన్నారు. మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అమెరికా, ఇజ్రాయిల్ తమ ఇష్టానుసారం ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ తప్ప మరే దేశం అణ్వాయుధాలే కాదు అణుశక్తి కూడా కలిగి ఉండకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ కాకున్నా అమెరికా, ఇజ్రాయిల్ భయంకర ఆయుధాలు ప్రయోగించి వందల మందిని పొట్టనబెట్టుకున్నాయని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్కు కొమ్ముకాస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి కె.కోటేశ్వరరావు, వామ పక్ష నాయకులు వై.వెంకటేశ్వరరావు, కె.వి.వి.ప్రసాద్, పెన్మత్స దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీ గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన మూడు రిలే నిరాహార దీక్ష బుధవారం ప్రారంభమైంది. దీక్షలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి పి. సాయికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పర్యాయాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గ్రామ సర్వేయర్ల హేతుబద్ధీకరణ తర్వాతే ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. బదిలీల్లో స్థానిక మండలం నిబంధనను తొలగించాలని కోరారు. ఇప్పటికే పిల్లలకు పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు బదిలీలు చేస్తే స్కూల్స్ మారడం ఇబ్బందికరంగా, ఆర్థికంగా భారంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రక్షాళన చేయాలని భావిస్తే పై క్యాడర్ నుండి కింది స్థాయి క్యాడర్ వరకూ వారి పరిధిని బట్టి స్థానిక నిబంధన వర్తింపజేయాలని కోరారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ చేసే ముందు ప్రమోషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయాలని డిమాండ్చేశారు. ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలని విజ్ఞప్తిచేశారు. అసోసియేషన్ ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ -
200 కిలోల గంజాయి పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చైన్నెకు అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ఒకకారు, మినీ గూడ్స్ వ్యాన్ను సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఈ కేసు వివరాలను బుధవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్ల డించారు. సీపీ కథనం మేరకు.. గంజాయి అక్ర మంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ కట్ట ప్రాంతంలో ఎస్ఐ భానుప్రసాద్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేసి గంజాయి బ్యాగులను గుర్తించారు. డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మినీ గూడ్స్ వ్యాన్ డ్రైవరు పోలీసుల తనిఖీలను గమనించి వాహనం ఆపి, పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల నుంచి రూ.15 లక్షల విలువగల 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖపట్నం జిల్లా తగరపు వలస, భీమునిపట్నం ప్రాంతాలకు చెందిన అండి నాగరాజు, తమిళనాడులోని ఉత్తమ పలయాన్, కక్కిసింగయన్పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగరాజును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతను మధురై ప్రాంతానికి వలస వెళ్లి ఆ ప్రాంతంలో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో విశాఖ ఏజెన్నీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలుచేసి, చైన్నెలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు తనకు తెలిసిన అనబలగన్కు విషయం చెప్పి, అతని గూడ్స్ వాహనాన్ని ప్రత్యేక అరలుతో తయారు చేయించి గంజాయి తరలిస్తున్నారు. ఇలా రెండుసార్లు పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కారు ముందు, వెనుక గూడ్స్ వాహనం వెళ్తుండగా రెండింటినీ పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్క వాహనం నుంచి 100 కిలోల చొప్పున 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు కారు, మినీ గూడ్స్ వ్యాన్ సీజ్ -
‘ప్రాజెక్ట్ కామధేను’లో పంజాబ్ డెయిరీ ప్రతినిధులు
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లిలోని ‘ప్రాజెక్టు కామధేను’ పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని పంజాబ్కు చెందిన వెర్కా మిల్క్ యూనియన్ (డెయిరీ) ప్రతినిధులు బుధవారం సందర్శించారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో పూర్తి ఆటోమేషన్ మిల్క్ ప్లాంట్గా రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ కామధేను ఫ్యాక్టరీని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సూచనల మేరకు వెర్కా డెయిరీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్లో అధునాతన మిషనరీ పనితీరును పంజాబ్ ప్రతినిధులకు ప్రాజెక్టు కామధేను ప్లాంట్ హెడ్ ఎం.సరిత వివరించారు. రోజుకు సగటున పది లక్షల లీటర్ల మిల్క్ ప్రొసెసింగ్ సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రగతిని వివరించారు. వెర్కా మిల్క్ యూనియన్ వైస్ చైర్మన్ ఉపేందర్ సింగ్, డైరెక్టర్ రమణదీప్ సింగ్, జనరల్ మేనేజర్ హర్మేందర్ సింగ్ సందు, ఇంజినీరింగ్ మేనేజర్ హజూర్ సింగ్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
జి.కొండూరు: ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా గురుకుల బాలికల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు కుంటముక్కల సాంఘి క సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షను జి.కొండూరు మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి పర్యవేక్షించారు. పాఠశాల హెచ్ఎం కె.బ్యూలా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆరో తరగతిలో ప్రవేశానికి 604 మంది విద్యార్థినులు దరఖాస్తు చేయగా 419మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఏడో తరగతిలో ప్రవేశం కోసం 513 మంది దరఖాస్తు చేయగా 425మంది, ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి 480మంది దరఖాస్తు చేయగా 460 మంది, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 472మంది దరఖాస్తు చేయగా 412మంది విద్యార్థినులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.విశ్వనాథరెడ్డికి డాక్టరేట్ ప్రదానంచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవ కార్యక్రమంలో ‘సాక్షి’ స్టేట్ బ్యూరో చీఫ్ మల్లు విశ్వనాథరెడ్డి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఆయన పలు పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయంలో వాటిని నివేదికలను అందజేసి పీహెచ్డీను సాధించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పీహెచ్డీ సర్టిఫికెట్ను గౌరవ డాక్టరేట్ ప్రధానకర్తలు మండవ ప్రభాకరరావు, ఎంఎన్వీ రవికుమార్, చలమలశెట్టి అనిల్కుమార్, యూనివర్సిటీ రెక్టార్ బసవేశ్వరరావు చేతుల మీదుగా విశ్వనాథరెడ్డి అందుకున్నారు.5న జాతీయ లోక్అదాలత్చిలకలపూడి(మచిలీ పట్నం): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదా లత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపీ తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్లు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. సంబంధిత కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్లో కేసులు సిఫార్సు చేయించుకుని సమయం వృఽథా కాకుండా చూసుకోవాలన్నారు.వైఎస్సార్ సీపీలో నియామకాలుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో నియమించారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులుగా నంబూరి రవి (జగ్గయ్యపేట), వెన్నం రత్నారావు (విజయవాడ సెంట్రల్), రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా మల్లెల వెంకట చిన్నారెడ్డి(విజయవాడ ఈస్ట్), రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శి షేక్ హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.నేటి నుంచి మహిళా సర్పంచ్లకు శిక్షణహనుమాన్జంక్షన్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, గ్రామ పరిపాలన విధానాలపై మహిళా సర్పంచ్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాపులపాడు ఇన్చార్జి ఎంపీడీవో త్రినాథ తిరుమలరావు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని మహిళా సర్పంచ్లకు గుడివాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. -
ముంపు.. ముప్పు..
బుడమేరు పరీవాహక ప్రాంతం కావడంతో తరచూ వరదలు వచ్చిన సమయంలో నష్టపోతున్నారు. ముఖ్యంగా గతేడాది సెప్టెంబర్లో సంభవించిన బుడమేరు వరద రైతుల కంట కన్నీరు మిగిల్చింది. రైతులు ఆరుగాలం శ్రమించి ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క గింజ చేతికి వచ్చిన పాపాన పోలేదు. ఇలపర్రు, కుదరవల్లి, రామాపురం రెవెన్యూ పరిధుల్లో దాదాపుగా 700ఎకరాలకు పైగా అనాధీన భూమి సాగవుతోంది. భూముల్లో వేసిన పంట పూర్తిగా నాశనం కావడంతో రైతులు నట్టేట మునిగారు. -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఆత్కూరు(గన్నవరం): పరీక్షలలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మొగల్ వహీదాబి(19) పాలిటెక్నిక్ డిప్లొమా చదివింది. అయితే సోమవారం విడుదలైన డిప్లొమా పరీక్ష ఫలితాల్లో వహీదాబి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు ఉరి బిగించుకుని వేలాడుతున్న వహీదాబిని బంధువుల సాయంతో కిందకు దించి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వహీదాబి తండ్రి ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి, సోదరుడితో కలిసి ఉంటుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతికంచికచర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం పట్టణంలో జరిగింది. ఎస్ఐ బి. రాజు కథనం మేరకు కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ సమీర్ పాషా(20) విజయవాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాసి బైక్పై ఇంటికి వస్తున్నాడు. కంచికచర్ల శ్రీ శివసాయి క్షేత్రం సమీపంలోకి రాగానే నేషనల్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చి బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో సమీర్పాష రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సమీర్పాష తండ్రి జమాలి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని అక్కకు మూడేళ్ల క్రితం వివాహమైంది.ఇసుక లారీలు సీజ్తిరువూరు: రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆ రాష్ట్ర పోలీసులు పెనుబల్లి మండలం మర్లకుంట వద్ద మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ టాస్క్ఫోర్స్ పోలీసులు సరిహద్దు గ్రామాల్లో నిఘా పెట్టి తిరువూరు నుంచి పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు ఇసుక తరలకుండా కట్టడి చేశారు. తిరువూరు శివారు తోకపల్లి మీదుగా మర్లకుంట తదితర గ్రామాలకు నిత్యం ఇసుక లారీలు వెళుతున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెండు టిప్పర్లను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు పోలీసులు సైతం మరో టిప్పరును ఇసుక తరలిస్తుండగా మల్లేల రోడ్డులో పట్టుకున్నారు.భారీగా గంజాయి పట్టివేతకృష్ణలంక(విజయవాడతూర్పు): గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యాన్లో తరలిస్తున్న గంజాయిని కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం టాటా వ్యాన్లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక టాటా వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సీజ్ చేసిన గంజాయి దాదాపు 100 కేజీల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన
ఘంటసాల: ఆయిల్ పామ్ పంటల్లో ఎలుకల ఉద్ధృతి తగ్గించుకోవడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే సూచనలు, సలహాలు రైతులు పాటించాలని కృష్ణాజిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి అన్నారు. జిల్లా ఉద్యాన శాఖ, ఉండవల్లి ఆగ్రోస్ ఎల్.ఎల్.పి. ఆధ్వర్యంలో ఘంటసాల కేవీకే సమన్వయంతో ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నివారణపై రైతులకు అవగాహన సదస్సు ఘంటసాల సత్యసాయి మినీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సమన్వయకర్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్తో పాటు అన్ని పంటల్లో ఎలుకల నివారణకు రైతులంతా సామూహికంగా చేపట్టాలన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటల్లో పోషక, నీటి యాజాన్యం, మాగాణుల్లో వేసుకున్న పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉండవల్లి ఆగ్రోస్ ఎల్.ఎల్.పి., ఎఫ్3 సంస్థలతో ఆయిల్ పామ్ పండించే రైతులకు నూరు శాతం రాయితీపై మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎకరానికి 57 మొక్కలు, హెక్టారుకు 143 మొక్కలు చొప్పున ఇస్తున్నామని, వాటిని నాటే సమయంలో మొక్కల మద్య 9 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉండవల్లి ఆగ్రోస్ డీజీఏం బి.హరికృష్ణ, 3ఎఫ్ ఆయిల్ పామ్ సీనియర్ మేనేజర్ యు.విక్రమ్రాజు, పామర్రు ఉద్యాన శాఖ అధికారి జె.కీర్తిదేవ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రేవతి తదితరులు పాల్గొన్నారు. -
షరా‘మామూలే’!
పెనమలూరు: యనమలకుదురు ఇసుక క్వారీలో మామూళ్ల వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. టీడీపీ నేతలు హుకుంతో రెవెన్యూ అధికారులు క్వారీ గేటుకు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురు ఇసుక క్వారీని 15ఏళ్ల క్రితం రివర్ కన్జర్వేటర్ ఆదేశాలతో నదిలో ఇసుక తవ్వకాలు నిషేధించారు. అప్పటి నుంచి ఇసుక క్వారీలో తవ్వకాలు జరగటం లేదు. మధ్యలో కొందరు ఇసుక మాఫియా తవ్వకాలు చేయటంతో గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాపై పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచింది. కూటమి పాలనలో మళ్లీ మొదలు.. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధ ఇసుక క్వారీలో అక్రమం తవ్వకాలు మొదలుపెట్టారు. చట్టాన్ని, నిబంధనలు గాలికి వదిలేశారు. అధికారులు ఇదంతా చూస్తూనే ఉన్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నిషేధ ఇసుక క్వారీ పరిస్థితి ప్రమాదంగా మారింది. తవ్వకాలతో నదిలో భారీ గుంతలు ఏర్పడి నదీ పరీవాహక ప్రాంతం ప్రమాదకరంగా మారింది. గొడవేంటంటే.. ఇసుక ట్రాక్టర్కు రూ. 500 మామూలు ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయటంతో సోమవారం రాత్రి క్వారీ వద్ద గొడవ తలెత్తింది. దీనికి ట్రాక్టర్లలో ఇసుక తరలించేవారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. పోలీసులు, సొసైటీ, రెవెన్యూ సిబ్బందికి ఇప్పటికే మామూళ్లు ఇస్తున్నామని, ఇప్పుడు టీడీపీ నేతలకు కూడా మామూళ్లు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ట్రాక్టర్ యజమానులు అడ్డం తిరిగారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇసుక క్వారీ గేటుకు పోలీసుల అండదండలతో రెవెన్యూ అధికారుల చేత మంగళవారం తాళం వేయించారు. అధికారులు కళ్ల ఎదుటే నిషేధ ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. మామూళ్ల విషయంలో గొడవ జరుగుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. కేవలం టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు క్వారీకి తాళాలు వేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాక ఈ మామూళ్ల వ్యవహారం తెరపైకి రావటంతో ఈ దందాలో ఎవరెవరి పాత్ర ఉందనేది స్పష్టమయింది. చట్టం తనపని తాను చేసుకు పోతుందని కూటమి నేతలు తరచూ ఊకదంపుడు ప్రకటనలు చేస్తుంటే మరి యనమలకుదురులో చట్టం ఏమయిందో ఆ నేతలే చెప్పాల్సి ఉంది. వాటా ఇవ్వడం లేదన్న నెపంతో టీడీపీ నేతల రాద్ధాంతం యనమలకుదురు క్వారీ గేటుకు తాళం -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 155 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 142మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 196 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 493 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్ ఇలా.. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో బుధవారం నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నామని విజయసారథి చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి పాలిసెట్–2025 పరీక్షలో 1 నుంచి 40 వేల లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ అభ్యర్థులు, 1 నుంచి చివరి ర్యాంకు పొందిన విభిన్న ప్రతిభావంతుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. ● మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 68,001 నుంచి 77 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 77,001 నుంచి 86 వేల లోపు ర్యాంకు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. -
‘పట్టా’భిషేకానికి వేళాయె
ఏర్పాట్ల పరిశీలన.. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆర్. గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వర్సిటీ వీసీ రాంజీలతో కలిసి కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వంటశాల ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వర్షం పడే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. విశ్వవిద్యాలయంలోని వంటశాలను ప్రారంభించిన అనంతరం బ్యాటరీ కారులో వైఎస్సార్ పరిపాలనా భవనానికి చేరుకుని అక్కడ పోలీస్ గౌరవవందనం స్వీకరించాక వైఎస్ చాన్స్లర్ చాంబర్లో కార్యనిర్వాహక మండలి సభ్యులతో సమావేశమవుతారన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఏఎస్పీలు, ఆర్డీఓ పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవాలు బుధవారం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ కూన రాంజీ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని మధ్యాహ్నం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సమావేశం జరుగుతుందన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన వంటశాలను ప్రారంభిస్తారని తెలిపారు. గవర్నర్ నజీర్తో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. 6వ స్నాతకోత్సవానికి సంబంధించి ఎన్ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, 7వ స్నాతకోత్సవానికి సంబంధించి అమెరికాలోని అలభామ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఎన్వీ రవికుమార్, 8వ స్నాతకోత్సవానికి సంబంధించి గ్రీన్ కో గ్రూపు సీఈవో చలమలశెట్టి అనిల్కుమార్కు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు రాంజీ తెలిపారు. పలువురికి గోల్డ్మెడల్స్, పట్టాలు.. ఈ స్నాతకోత్సవాలలో 17 మంది విద్యార్థులకు 21 గోల్డ్మెడల్స్, 63మందికి పీహెచ్డీ పట్టాలతో పాటు ఇరువురు ఎంఫిల్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేస్తామని వీసీ తెలిపారు. వీరితో పాటు పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేసిన 300 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఉష, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రహ్మచారి పాల్గొన్నారు. నేడు కృష్ణా యూనివర్సిటీ 6, 7, 8 స్నాతకోత్సవాలు పాల్గొననున్న చాన్స్లర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ -
రోగం తిరగబెట్టింది!
విజయవాడ జీజీహెచ్లో స్ట్రెచర్లు, వీల్ చైర్లూ లేక రోగుల అవస్థలుపేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది విజయవాడ జీజీహెచ్ పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించడంతో అత్యుత్తమ సేవలు అందించింది. రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాస్పత్రికి రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సమస్యల జబ్బు తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా రోగంతో వచ్చే ప్రజలకు కనీస వసతులు ఆస్పత్రిలో కరువైపోయాయి. స్ట్రెచర్లు ఉండవు.. కనీసం వీల్ చైర్లు కనపడవు.. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ రకాల ఆపరేషన్లు అయి నడవలేని పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.మరోవైపు ఆస్పత్రిలో మందుల కొరత సరేసరి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెద్దాస్పత్రిలో కనీస వసతులు కల్పించి పుణ్యం కట్టుకోవాలని పలువురు రోగులు విన్నవిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ స్క్రాప్గా మారిన స్ట్రెచర్లు, వీల్ చైర్లు -
వెసులుబాటు కల్పించండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): వార్డు సచివాలయ ఉద్యోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం జీఓ జారీ (జీఓ ఎంఎస్ నంబర్ 6) చేయడం పట్ల ఏపీ గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య హర్షం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా సొంత మండలాల్లో విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు బగ్గా జగదీష్తో కలిసి మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. హేతుబద్దీకరణ ప్రక్రియ వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, మిగులు ఉద్యోగుల భవితవ్యంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము విన్నవించిన అంశాలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి సానుకూలంగా స్పందిస్తూ సొంత మండలాల్లో పని చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని అర్లయ్య పేర్కొన్నారు.నైపుణ్యాభివృద్ధితో ఆర్థిక వృద్ధి సాధ్యందిశ కమిటీ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రణాళికాబద్ధ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకమని.. ప్రతి మండలంలో స్థానిక పారిశ్రామిక అవసరాలు, అభివృద్ధికి దోహదం చేసే వనరులను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట, తిరువూరు ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను చేరుకునేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, సీపీవో వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఈవో డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, హౌసింగ్ పీడీ పి.రజనీకుమారి, డీఈవో యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కలిసిన డీఐపీఆర్ఓ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్ ): సమాచార పౌర సంబంధాల శాఖ ఎన్టీఆర్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.వి.రమణారావు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న రమణారావును ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార డైరెక్టర్ ఉత్వర్తులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న యు.సురేంద్రనాథ్ నుంచి రమణరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన సమాచార పౌరసంబంధాల శాఖలో డీఐపీఆర్ఓగా సమర్థంగా పని చేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రమణరావుకు జిల్లా లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ను కలిసిన వారిలో డీఐపీఆర్ఓ వెంట డీపీఆర్ఓ ఎస్.వి.మోహన్ రావు, డివిజనల్ పీఆర్ఓ కె.రవి, ఏవీఎస్ వి.వి.ప్రసాద్ తదితరులు ఉన్నారు.సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల వినతిచిలకలపూడి(మచిలీపట్నం): తమ సమస్యలను పరిష్కరించాలని, రేషన్లైజేషన్, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు జి.గోపీచంద్ కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ.. వార్డు సచివాలయాలకు వార్డు టు వార్డు బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, సీనియార్టీ, మెరిట్ ప్రాతిపదికన బదిలీలు నిర్వహించాలని కోరారు. రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులను ఏ డిపార్టుమెంట్లోకి తీసుకుంటారో ఇంత వరకు సమాచారం లేదని, జాబ్చార్ట్, డిపార్ట్మెంట్ పరిధి తెలియజేసి రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమ్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్నాథ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.కొండలమ్మకు రూ.31.81 లక్షల ఆదాయంగుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచిసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీ కానుకులను మంగళవారం లెక్కించారు. హుండీ కానుకల ద్వారా రూ.31,81,084 ఆదాయం సమకూరింది. మచిలీపట్నం శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సత్యప్రసాద్ బాబు పరివేక్షణలో దేవదాయ సిబ్బంది హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు. 51 రోజులకు ఈ ఆదాయం సమకూరింది. కానుకల లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.కోటిలింగాలను దర్శించుకున్న హంపీ పీఠాధిపతిముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రంలోని అమృతలింగేశ్వర స్వామిని జగద్గురు ఆదిశంకరాచార్య హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ హరిదుర్గానాగేశ్వరరావు పూర్ణకుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం అమృతలింగేశ్వర స్వామికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటిలింగాల సమీపంలోని హంపీ పీఠం మొదటి వార్షికోత్సవంలో భాగంగా వచ్చామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత ఈఓ దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, అర్చ కులు తేజ, హర్ష, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట
ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీసీపీడీసీఎల్, ఏపీ ట్రాన్స్కో ఇంజినీర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రామారావు, ప్రధాన కార్యదర్శి నాగప్రసాద్ పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. విజయవాడలో ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం మంగళవారం జరిగింది. సమ్మె నోటీసు, 1999 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీపీఎఫ్ ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఈఈల నియామకం తక్షణం చేపట్టాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఎర్న్డ్ లీవ్ ఎన్క్యాష్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో అసోసియేషన్ అసోసి యట్ ప్రెసిడెంట్ రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం లేదని ఇంజినీర్లపై అధిక పనిభారం మోపుతోందని పేర్కొన్నారు. ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని, ట్రైపార్టీ అగ్రిమెంట్ను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఇంజినీర్లకు పీఆర్సీ 2022లో తీరని అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె బాట పట్టడం తప్ప మరో మార్గంలేదని తేల్చిచెప్పారు. అనంతరం అసోసియేషన్కు విశిష్ట సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన బి.వి.నాగేశ్వర రావును సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వంశీ, ఇర్ఫాన్, కృష్ణప్రసాద్, కంపెనీ నాయకులు రాజేష్ ఖన్నా, నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం.వి.వి.రామకృష్ణ, బి.రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. మునేరు వరదల సమయంలో తువ్వకాలువకు పడిన గండ్లను నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా స్థానిక చెరువుకట్ట వద్ద నుంచి భారీ ర్యాలీగా కాలువ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తువ్వకాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో మునేరుకు భారీగా వరదలు వచ్చి తువ్వకాలువకు 50 చోట్ల గండ్లు పడగా, వాటిని పూడ్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. గండ్లు పూడ్చటానికి అంచనాలు రూపొందించామని అధికారులు, నాయకులు చెబుతున్నా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు. వరదల కారణంగా ఖరీఫ్తోపాటు రబీ పంటలను కూడా రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. గండ్లను పూడ్చకుంటే ప్రస్తుత ఖరీఫ్లో పంటల సాగు సాధ్యం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరదలకు తువ్వకాలువకు గండ్లు పడితే వెంటనే పూడ్చి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. రైతుల తరఫున వైఎస్సార్ సీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, పార్టీనాయకులు కొత్తపల్లి పెంటయ్య, పొన్నం కోటేశ్వరరావు, బూడిద నరసింహారావు, నర్రమనేని వెంకటేష్, దేరంగుల శ్రీనివాసరావు, కీసర లోకేశ్వరరావు, మెండెం రామారావు, కనగాల రమేష్, నంబూరి రవి, కనకపూడి భాస్కరరావు, చేని రాంబాబు, సర్పంచ్ బి.జ్యోతిబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. తువ్వకాలువ గండ్లను వెంటనే పూడ్చాలి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం
తాడేపల్లి రూరల్: అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ దీపక్ అన్నారు. తాడేపల్లి పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి సంసిద్ధత’పై ఎయిమ్స్ వైద్యులు, ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్చేరి, చత్తీస్గడ్కు చెందిన 30 మంది వైద్యులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ దీపక్ మాట్లా డుతూ.. విపత్తుల ముందు, ఆ తరువాత అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, డాక్టర్లు విపత్తుల ప్రమాద తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మంగళగిరి ఎయిమ్స్లోని నిర్మాణాత్మక పరికరాలు, అనుభవం కలిగిన డాక్టర్లు, మెడిసిన్, టెస్టింగ్ పరికరాలు, బ్లడ్బ్యాంక్ వంటి ఇతర వివరాలను అందజేయాలని సూచించారు. సమావే శంలో ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడీ డాక్టర్ రామమోహన్, డాక్టర్ రమ్యజ్యోతి, విపత్తుల సంస్థ అధికారులు ఆర్ఎస్ఐ మధుబాబు, జీఐఎస్ ఎక్స్పర్ట్ హరీష్, ప్రాజెక్ట్ మేనేజర్లు బస్వంత్, కిషోర్, సతీష్, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. -
వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ దాష్టీకం
ప్రధానాంశాలు ఇవీ.. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాభివృద్ధిపై చర్చించేందుకు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. అరుపులు, కేకలు, బెదిరింపులతో అలజడి సృష్టించారు. దీంతో సభలో సుమారు గంటపాటు గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. 156 అంశాలను అజెండాలో పొందుపరచగా మూడు అంశాలను కౌన్సిల్ తిరస్కరించింది. మరో రెండు అంశాలను ఆఫీస్ రిమార్కులకు పంపింది. మొత్తం 149 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేసి, ఒక అంశాన్ని ధ్రువపరచగా మరో అంశాన్ని రికార్డు చేసింది. రాద్ధాంతం చేసిన టీడీపీ కార్పొరేటర్లు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న జవహర్ ఆటోనగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ స్టోర్స్ (జమాక్) గృహ సముదాయానికి నగర పాలక సంస్థ నుంచి తాగునీరు సరఫరా చేయాలని వచ్చిన ప్రతిపాదనపై చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేశారు. ఐలా కూడా స్థానిక సంస్థేనని, ఆ సంస్థ సమస్యలను వారే పరిష్కరించుకోవాలని వైఎస్సార్ సీపీ సభ్యులు సూచించారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలనలో సైతం వీఎంసీ నీటిని ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐలా నుంచి బకాయిలు రావాలని సభ్యులు చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఓ క్రమంలో మేయర్ పోడియం వద్దకు వచ్చి మరీ కౌన్సిల్కు వ్యతిరేకంగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు. సెక్షన్ 89 ప్రకారం మేయర్ ఆదేశాలను ధిక్కరించినందుకు, సభను సజావుగా నిర్వహించేందుకు టీడీపీ సభ్యులు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణిని సస్పెండ్ చేస్తునట్లు మేయర్ భాగ్యలక్ష్మి ప్రకటించారు. వారిని సభ నుంచి వెళ్లాలని సూచించారు. వారు వెళ్లకపోవడంతో మార్షల్స్ను పిలిపించారు. అయితే మార్షల్స్పై టీడీపీ సభ్యులు బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలు ఊడతాయని, తమ ప్రభుత్వంలో విధులు ఎలా నిర్వర్తిస్తారో చూస్తామని బెదిరించారు. జమాక్ గృహ సముదాయానికి వీఎంసీ తాగునీరు సరఫరా చేయాలన్న అంశాన్ని తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానించింది. అరుపులు.. కేకలు.. బెదిరింపులతో గందరగోళం సృష్టించిన టీడీపీ కార్పొరేటర్లు ఏపీఐఐసీ కాలనీలోని జమాక్ గృహ సముదాయానికి తాగునీటి సరఫరాపై వివాదం ఐలా పరిధిలోని అంశాన్ని ఆ లోకల్ బాడీనే పరిష్కరించుకోవాలని కౌన్సిల్ సూచన కౌన్సిల్కు ఆటంకం కలిగించిన చెన్నుపాటి ఉషారాణి, ముమ్మినేని ప్రసాద్ సస్పెన్షన్ వారిని బయటకు తీసుకెళ్లేందుకు వచ్చిన మార్షల్స్పై బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్లు జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన గృహ సముదాయాల్లో 2,053 గృహాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ప్రస్తావించారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ.. ఇప్పటి వరకు 803 మంది లబ్ధిదారులను గుర్తించామని, కొంతమంది లబ్ధిదారులకు పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు సక్రమంగా లేకపోవడంతో అర్హుల జాబితాలో సీనియారిటీలో ఉన్న వారికి కేటాయింపులు చేస్తామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ఏ చర్యలు తీసుకుంటారని సభ్యులు ప్రశ్నించారు. దీనిపై డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి రెండు–మూడు రోజుల్లో కన్సల్టెన్సీకి అప్పగించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని అధికారులు బదులిచ్చారు. వీఎంసీలో అధికారుల కొరత వేధిస్తోందని, సీఎంఓహెచ్, ఎస్టేట్స్ అధికారి, కింది స్థాయిలో ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలు, ఇతర అధికారులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు సక్రమంగా చేరడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మరింతగా గ్రీనరీ అభివృద్ధి చేయాలని, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, కామన్ సైట్లలో గ్రీనరీ పెంపొందించాలని వచ్చిన అంశం ఆమోదం పొందింది. ఇటీవల వీఎంసీ కార్పొరేటర్లు దక్షిణ భారత విజ్ఞాన యాత్రలో భాగంగా కేరళలో పర్యటించారు. అక్కడి మాదిరిగా నగరంలోనూ మల్టీస్టోర్డ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించొచ్చని డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి చేసిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానం చేశారు. -
భూ సేకరణ పడక..
గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణే అడ్డంకి గడ్డమణుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173/3లో ఇద్దరు రైతుల నుంచి 48 సెంట్ల భూమిని హైవే కోసం తీసుకున్నారు. ఆ రైతులు అందుబాటులో లేరు. ఈ భూమిని నేను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. నష్ట పరిహారం కోసం అవసరమైన పత్రాలన్నీ నేనే అధికారులకు ఇచ్చాను. అయినప్పటికీ పరిహారం ఇవ్వకుండా నేను సాగు చేస్తున్న పత్తి, మునగ పైర్లును అన్యాయంగా దున్నేశారు. నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – అజ్మీరా హేమానాయక్, రైతు, గడ్డమణుగు, జి.కొండూరు మండలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ – ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే ప్యాకేజీ–3 పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణే ఈ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది. బాధిత రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు నిధులు మంజూరైనా పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. భూ సేకరణ జాప్యం కావడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి పరుగులు పెట్టించారు. అప్పట్లో జాయింట్ కలెక్టర్ సంబంధిత గ్రామాల రైతులతో చర్చించి భూ సేకరణను తుది దశకు తెచ్చారు. కూటమి అధికారంలో వచ్చాక భూసేకరణ పనులు అటకెక్కాయి. దాదాపు ఏడాదిన్నరగా భూసేకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో రహదారి పనులు ప్రారంభించ డంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికీ పలు చోట్ల భూసేకరణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. 14 గ్రామాల్లో 351 ఎకరాలు విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో అంతర్భాగంగా విజయవాడ – ఖమ్మం మధ్య ప్యాకేజీ–3కి సంబంధించి 29.70 కిలో మీటర్ల మేర రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రహదారి కోసం ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో 351 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 136 ఎకరాల భూమి సేకరించారు. ఇంకా 215 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రధానంగా రహదారి వెంబడి 22.5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. 3డీ నోటిఫికేషన్ స్థాయిలో మరో 30 ఎకరాలు ఉంది. ఈ భూములకు సంబంధించిన సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. దీనికితోడు భూసేకరణలో భూమికి సంబంధించి మార్కెట్ విలువల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితమే రూ.220 కోట్ల మేర అవార్డులు పాసైనా ఇప్పటి వరకు కేవలం రూ.65 కోట్లు మాత్రమే భూములు కోల్పోతున్న రైతులకు పంపిణీ చేశారు. డాక్యుమెంట్లు సమర్పించలేదని, ఇతర చిన్న చిన్న కారణాలతో పరిహారం పంపిణీ నిలిచిపోయింది. క్షేత్ర స్థాయిలో కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి, భూములు కోల్పోతున్న రైతులను పరిహారం పంపిణీ విషయంలో ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద భూసేకరణకు నిధుల సమస్య లేకున్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే జాతీయ రహదారి పనుల ప్రారంభంలో జాప్యానికి కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ భూసేకరణ పనులపైన దృష్టి సారించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్యాయంగా పైరు దున్నేశారు ఎన్టీఆర్ జిల్లాలో ప్యాకేజీ–3 కింద 29.70 కి.మీ. మేర జాతీయ రహదారి ఏడాదిన్నర క్రితమే రూ.230 కోట్ల అవార్డు పాసైనా బాధిత రైతులకుపంపిణీ చేసింది రూ.65 కోట్లే నత్త నడకన సాగుతున్న భూ సేకరణ పనులు కొలిక్కి రాని అసైన్డ్ భూముల వ్యవహారం గ్రీన్ ఫీల్డ్ హైవే ఇలా.. పరిహారం ఇవ్వకుండానే రహదారి పనులు మా అత్తగారు చొక్కం వెంకట్రావమ్మ పేరుతో సర్వే నంబరు 12–3లో గల 1.90 ఎకరాల్లో 60 సెంట్లు భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తీసుకున్నారు. అయితే ఈ భూమి రికార్డుల్లో చాకలి ఇనామ్గా నమోదైందని పరిహారం ఇవ్వడం లేదు. 40 సంవత్సరాలుగా ఈ భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. ఈ భూమికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి పరిహారం అందించాలి. – కొండపల్లి సత్యనారాయణ, చెర్వుమాధవరం, జి.కొండూరు మండలం విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్ (జాతీయ రహదారి) పనులను పనులను గత నెల ఏడో తేదీన ప్రారభించారు. 80 శాతం భూమి అప్పగిస్తేగానీ పనులు ప్రారంభం కావు. భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో 60 శాతం భూమిని మాత్రమే అధికారులు అప్పగించారు. దీంతో జి.కొండూరు మండలంలో కాంట్రాక్టు సంస్థ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం కంపచెట్లు తొలగింపు, భూమి చదును చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.745.83 కోట్లు. మెగా కాంట్రాక్టు సంస్థ ఈ పనులకు మే 23, 2023లో అగ్రిమెంట్ చేసుకొంది. ఈ పనులను ప్రారంభించిన రెండేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంది. 29.707 కిలోమీటర్ల రహదారిలో 1.345 కిలోమీటర్ల స్లిప్ రహదారి ఉంది. మేజర్ బ్రిడ్జి ఒకటి, మైనర్ బ్రిడ్జిలు 19, వీయూపీఎస్లు ఆరు, ఎల్వీయూపీఎస్లు ఐదు నిర్మించాల్సి ఉంది. -
అమరావతిలో మరోసారి భారీ ఎత్తున భూ సమీకరణ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయవాడ: అమరావతి కోసం కూటమి ప్రభుత్వ మళ్ళీ భూ సమీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. భూ సమీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి కోసం 54 వేల ఎకరాల భూముల సేకరణ చేపట్టిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
కర్కశపు తండ్రి కటకటాల పాలు
మైలవరం: మైలవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులను తండ్రే హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి కనబడకుండా పోయిన నిందితుడు రవిశంకర్ కటకటాల పాలయ్యాడు. మైలవరం పోలీస్ స్టేషన్లో సోమవారం సీఐ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న మైలవరంలోని మారుతీనగర్లో ఓ రేకుల షెడ్డు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తమకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తలుపులు తెరచి చూడగా ఇద్దరు చిన్నారులు వేములమడ హిరణ్య(12), వేములమడ సాయి(9) విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. వారి తండ్రి వేములమడ రవిశంకర్ చిన్నారులను హత్య చేశాడు. భార్యపై అనుమానం, పిల్లలు తనకు పుట్టలేదన్న అపోహతో ఈ హత్యలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్.. నిందితుడు రవిశంకర్, అతని భార్య చంద్రిక గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. దంపతుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడు రవిశంకర్కు భార్యపై అనుమానం ఉండటంతో ఆ పిల్లలు తనకు పుట్టారా అని పలుమార్లు భార్యను ప్రశ్నించడం, అనుమానంగా చూడటం చేస్తుండేవాడని తమ విచారణలో తేలింది. ముందుగా చిన్నారి సాయిని ఓ చీరతో ఒక గదిలో ఉరివేసి చంపాడు, తరువాత హిరణ్యను మరో గదిలో దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఇద్దరినీ ఒకే మంచంపై పడుకోబెట్టాడు. కేసు తప్పుదారి పట్టించేందుకు ఇబ్రహీంపట్నం ఫెర్రీలో సిమ్ కార్డు వదిలి వైజాగ్ పారిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హజరు పర్చనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కారు – ఆటో ఢీ : నలుగురికి గాయాలు మక్కపేట(వత్సవాయి): కారు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన సోమవారం గ్రామ శివారులో జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న కారు వత్సవాయి వైపు నుంచి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆటోల్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇసుక, బుసక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఘంటసాల: మా లంక భూముల్లో ఇసుక, బుసుక అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో–ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంలో, స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధి కోడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆర్ఎస్.నెం.176 ఏ1 నుంచి 176 ఏ80 వరకు, ఆర్ఎస్.నెం.1272లో వల్లభామాణిక్యమ్మ లంకభూమి కృష్ణానది గర్భాన ఉందన్నారు. సదరు లంక భూమిని ముదిరాజ్ కులానికి చెందిన 80 మంది నిరుపేద రైతులమైన తాము 1950 సంవత్సరానికి పూర్వం చల్లపల్లి జమిందార్ వారి నుంచి కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. గతేడాది కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా లంక భూముల్లో కొంత భాగం మట్టిపొర ఏర్పడి ఇసుక, బుసక మేట వేసిందన్నారు. మా భూముల్లో మేట వేసిన ఇసుక, బుసకను బాపట్ల జిల్లా గాజుల్లంక ప్రాంతానికి చెందిన హరిదాసు అనే వ్యక్తి మాకు తెలియకుండా సుమారు 9 ఎకరాల వరకు దొంగతనంగా ఇసుక, బుసక తవ్వకాలు చేపట్టి దోచుకున్నారని ఆరోపించారు. హరిదాసుపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని విన్నవించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్.ఉమామహేశ్వరరావు, ఎన్వీ రామరాజు, డి.బాబు ఉన్నారు. -
ముగిసిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్కు జిల్లా అధికారులు ఆదివారం సన్నద్ధమయ్యారు. అప్పటికే ఉమ్మడి కృష్ణాలో 115 మంది 2008, 150 మంది 1998 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్ల బదిలీల నిమిత్తం సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ కోసం డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉమ్మడి జిల్లా ఎంటీఎస్ టీచర్లు ఖాళీలను పూర్తి స్థాయిలో ప్రదర్శించా లంటూ ఆందోళనకు దిగిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం ఉమ్మడి కృష్ణాలోని 264 మందికి మొత్తం 644 పోస్టులు ఖాళీలు ప్రదర్శించడంతో టీచర్లు శాంతించారు. బదిలీల వెబ్ లింక్ సాయంత్రం వరకు రాకపోవడంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. పొద్దుపోయాక ప్రారంభమైన బదిలీల్లో తొలుత 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ జరిగింది. నిబంధనల మేరకు ఈ నెల 20 నాటికి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా 22వ తేదీ నాటికి మొత్తం ఉమ్మడి కృష్ణాలోని 264 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు విద్యాశాఖ పూర్తి చేసింది. అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ టీచర్ల అసహనం -
సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం
చిలకలపూడి(మచిలీపట్నం): చట్ట పరిధిలో సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి సమస్యలను ఎస్పీ ప్రత్యక్షంగా తెలుసుకుని వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యల గురించి చింతించవద్దని, మీ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్నామని వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదులను బదిలీ చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో 36 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. రక్షణ కల్పించాలని వినతి.. ● హనుమాన్జంక్షన్కు చెందిన హరి తన స్నేహితునికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చానని చెప్పాడు. అప్పు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీకి కోరాడు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
ఆక్రమణకు గురైన అమ్మవారి భూములపై సమీక్ష
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ కేదారేశ్వరపేట పరిధిలోని లోటస్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి భూములకు సంబంధించి శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ సమీక్ష జరిపారు. ఆక్రమణకు గురైన భూములలో వెలిసిన కట్టడాల క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తూ 22ఏ 1సీ నిషేధిత జాబితాలో చేర్చడంపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నగరపాలక సంస్థలతో సమన్వయం గురించి సోమవారం సాయంత్రం దేవాలయ లీజెస్, ల్యాండ్ విభాగం సిబ్బందితో సమీక్షించారు. సత్యనారాయణపురం పాత సర్వే నంబర్ 118, ఆర్ఎస్ నంబర్ 112లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూమి సంరక్షణ నిమిత్తం దేవస్థానం నుంచి ఎటువంటి కాలయాపన లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ తెలిపారు. అదే విధంగా మహామండపం దిగువ ప్రాంతంలో స్థలాభావ సమస్య పరిష్కారం కోసం ఆలయ ఇంజినీర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నూతన అన్న ప్రసాదం భవన నిర్మాణం, లడ్డూ పోటు భవన నిర్మాణ ప్రాంతాల్లో ఇంకా స్థల సేకరణపై సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి
మచిలీపట్నంటౌన్: యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఓ భాగం కావాలని కృష్నా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ యోగసభ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో సోమవారం యోగా గురువు మద్దాల చింతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మే నెల 21వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ముగిసిందన్నారు. యోగా కార్యక్రమం అధికారికంగా ముగిసినప్పటికీ యోగా సాధన మన నిత్యజీవితంలో ఓ భాగం చేసుకుని నిరంతరం కొనసాగించాలని సూచించారు. మచిలీపట్నం నగరంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో గాంధీనగర్లోనే కాకుండా చింతగుంటపాలెం, కాస్మోపాలిటన్ క్లబ్, గొడుగుపేట, శంకరమఠంలో కూడా ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
సౌత్ జోన్ హాకీ పోటీలకు పమిడిముక్కల విద్యార్థులు
పమిడిముక్కల: తుంకూర్(బెంగళూరు)లో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగబోయే సౌత్ జోన్ హాకీ చాంపియన్షిప్ పోటీలకు పమిడిముక్కల హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం వై.దుర్గాభవాని తెలిపారు. బాలుర విభాగంలో కౌశిక్, రఘునాథ్, రోహిత్కుమార్, జిగ్నేష్, లోకేష్బాబు, బాలికల విభాగంలో విజయలక్ష్మి, హిమబిందు, ఆరాధ్య, లక్ష్మీప్రియ, శ్రీవల్లి, దేవిశ్రీ, సాయి మహాలక్ష్మి, సాయిశ్రీ ఎంపికై నట్లు తెలిపారు. హైస్కూల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, పీడీ నారాయణను హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఎన్ఎంసీ చైర్మన్ రావూరి సుకన్య అభినందించారు.కొనసాగిన పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలనమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మూడో రోజైన సోమవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 149, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 133 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 135 మంది సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం పూర్తైంది. మొత్తం 417 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.నేటి షెడ్యూల్మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 50001 నుంచి 56 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 56001 నుంచి 62 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 62001 నుంచి 68 వేల ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు.నాట్య రాత పరీక్షలు ప్రారంభంకూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లమో రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాఽథశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీని వాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షలో 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెం డెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు.ముక్కపాడు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీగన్నవరం: ఉంగుటూరు మండలం ముక్కపాడు ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన వైద్యుల బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. డాక్టర్ అనూప్, డాక్టర్ రిచామిశ్రా బృందం ఆరోగ్య కేంద్రం రికార్డులను పరిశీలించింది. కేంద్రం పరిధిలోని గర్భిణులు, చిన్నపిల్లలు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు, వ్యాక్సినేషన్ స్టాక్ తదితర అంశాలపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సత్వర వైద్య సేవలందించాలని, చిన్నపిల్లలు, బాలింతలకు వ్యాక్సిన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఉంగుటూరు పీహెచ్సీ వైద్యాధికారి విజయ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయ వాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ పర్యవేక్షించగా అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. చల్లపల్లి విద్యార్థికి జాతీయస్థాయి గుర్తింపు చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన విద్యార్థి వేముల హేమంత్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చల్లపల్లికి చెందిన వ్యాపారి వేముల పాండురంగారావు, దీపిక దంపతుల కుమారుడు హేమంత్ విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదివి ప్రస్తుతం ఆర్టికల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2024 జూన్లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) పరీక్షల్లో కళాశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన హేమంత్ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించాడు. న్యూఢిల్లీలో సోమవారం ఐసీఎంఏఐ ఆధ్వర్యంలో 12వ నేషనల్ స్టూడెంట్ కాన్వకేషన్–2025 జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఐసీఎంఏఐ అధ్యక్షుడు బిభూతి భూషణ్ నాయక్ చేతుల మీదుగా వేముల హేమంత్ ధ్రువపత్రాన్ని, పతకాన్ని అందుకున్నాడు. -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి కోరారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందు వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని అందుకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయాలన్నారు. అనంతరం డీఆర్వో కె.చంద్రశేఖరరావు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, సీహెచ్ జయరావుతో పాటు అంగన్వాడీల సంఘం నాయకులు ఎం.నిర్మలజ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025కూటమి ప్రభుత్వం తనలాంటి విద్యార్థులెందరినో మోసగించింది. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువే ఇస్తామని ప్రగల్బాలు పలికి నేడు తనతో పాటు అర్హత ఉన్న పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము జమ చేయడం లేదు. కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. – ప్రసాద్, బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, పెనమలూరు●చిలకలపూడి(మచిలీపట్నం)/మచిలీపట్నంటౌన్: కూటమి చేస్తున్న మోసాలపై యువత, నిరుద్యోగులు కదం తొక్కారు. మోసం చేసినందుకు వారంతా పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రశ్నించారు. ఏడాది పూర్తయినా హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగభృతి పేరుతో ఒక్కొక్కొరికి రూ. 36 వేలు బకాయిలు పడింది. 2025–26 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించని సర్కారు ఏ విధంగా హామీలు అమలు చేస్తుందో తెలపాలని యువత ప్రశ్నించింది. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని యువత పోరులో నిలదీసింది. నిరుద్యోగులకు చేసిన మోసాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన యువత పోరులో నిరసన గళం విప్పింది. పార్టీ కృష్ణా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగమాల శ్రీకాళేశ్వరరావు (కాళి) అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. జగన్ వెంటే నడుద్దాం రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు వేసి టీడీపీ నేతలు వారి అవసరాలు తీర్చుకున్నారే తప్ప ప్రజల ఇక్కట్లు తీర్చలేదన్నారు. హామీలు కచ్చితంగా అమలు చేసే పార్టీలో మనం ఉన్నామని ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా జగన్ వెంటే నడుద్దామన్నారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కారే మహంతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా వేల సంఖ్యలో హాజరుకావటం చూస్తుంటే ఆయనకు ఉన్న ఆదరణ ఏమిటో తెలుస్తోందన్నారు. వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల వంశీకృష్ణారావు మాట్లాడుతూ చంద్రబాబు హామీలు నమ్మి బలైపోయామన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ కాశిం మాట్లాడుతూ జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూర్ణ సాగర్, వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు పతివాడ రాఘవరావు (చిన్నారి), పాలేటి చంటి, ఎస్టీ సెల్ నేత వీరబ్రహ్మేంద్రనాయక్, కల్చరల్ వింగ్ నేత గుమ్మడి విజయ్కుమార్, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్, వైఎస్సార్ టీయూసీ నేత తాడిశెట్టి శ్రీనివాసరావు, సోషల్ మీడియా వింగ్ చింతలపూడి లక్ష్మీనారాయణ, పబ్లిసిటీ వింగ్ అద్దేపల్లి చందు, ఇంటెలెక్చువల్ వింగ్ నితీష్చంద్ర, ఎంప్లాయీస్, పెన్షనర్స్ వింగ్ నేత తోట సీతారామాంజనేయులు, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుధాకర్బాబు (సుబ్బన్న), షేక్ అచ్చెబా, లంకా సూరిబాబు, శీలం బాబ్జి, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్ నెహ్రూ, కొలుసు హరిబాబు, తిరుమలశెట్టి ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి అనుబంధ విభాగాల నాయకులు ర్యాలీగా కలెక్టర్కు తరలివెళ్లి డీఆర్వో కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. కూటమి పాలకులు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు చూపక పోగా ఇస్తానన్న నిరుద్యోగ భృతిని సైతం మర్చిపోయారు. పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. ఫలితంగా నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నాం. కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తైనా నిరుద్యోగులను ఆదుకోకపోవడం దుర్మార్గం. – జుజ్జువరపు పృధ్వీరాజు, నిరుద్యోగి, రాజుపేటగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పని చేసిన వలంటీర్లను కూటమి పాలకులు తీవ్రంగా మోసగించారు. ఎన్నికల ముందు రాజీనామా చేసిన తనలాంటి ఎంతో మంది వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబునాయుడు నాడు ప్రకటించారు. ప్రభుత్వ పాలన ప్రారంభమై ఏడాది కాలం పూర్తయినా ఆయన వలంటీర్ల ఊసే ఎత్తడంలేదు. ఈ వ్యవస్థను కొసాగిస్తాని చెప్పి ఏడాదైనా అమలు చేయకుండా మిన్నకుండిపోయారు. – భట్రాజు కొండబాబు, మచిలీపట్నం7న్యూస్రీల్కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై నిరసన గళం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఎక్కడ? నిరుద్యోగులకు భృతి ఏది? యువతకు ఏం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ను ఎగ్గొట్టింది చంద్రబాబు కాదా? వైఎస్సార్ సీపీ యువత పోరులో ప్రశ్నించిన నేతలు -
ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ ఎన్.ప్రకాష్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియా సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ, సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలు బాగున్నాయన్నారు. బుడమేరు వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు. వరదల్లో వ్యవసాయ డ్రోన్లతో ఆహారం పంపిణీ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్పై అధికారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ బుడమేరు వరదల్లో వ్యవసాయ డ్రోన్లను ఆహారం పంపిణీకి ఉపయోగించామన్నారు. పారిశుద్ధ్య కార్యకలాపాల్లోనూ డ్రోన్లను వినియోగించినట్లు తెలిపారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, డీఎంహెచ్వో ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఏవో డీఎంఫ్ విజయకుమారి, పశు సంవర్థక అధికారి ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశంలో ఎన్డీఎంఏ అధికారుల బృందం -
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాక్షిలో ‘దందాకు అండదండలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ మళ్లీ చేస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం ఐదుగురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పోలీసు కమిషనర్కు సూచించినట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్ మెంట్ను కట్టుదిట్టం చేశామని, బియ్యం సరిహద్దులు దాట కుండా పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్లో అన్లైన్లో ఆర్ఐలు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు తనిఖీలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజలకు నిత్యావసర సరుకులను సక్రమంగా అందేలా చర్యలు తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసిన ఐదుగురిలో రేషన్ బియ్యం మాఫియా డాన్ రామచంద్రరావు పేరు ఉన్నట్లు సమాచారం. ఇతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం డీఎస్ఓ పాపారావు -
సత్వరమే అర్జీలు పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో కె.స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు 146 అర్జీలను స్వీకరించారు. అర్జీలు ఇవే ● సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్లో సొంత మండల పరిగణనలోకి తీసుకోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇందుకోసం సరైన మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియ చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డీవీ భార్గవి, యూఎన్ జ్యోతి, సత్యనారాయణ, శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. ● గూడూరు మండలం చిట్టిగూడూరు గ్రామానికి చెందిన మధిరి నాగభూషణం తన తండ్రి వెంకట్రామయ్య వీఆర్ఏగా పని చేస్తుండగా 1973లో డొంక పోరంబోకు భూమి 21 సెంట్ల భూమికి పట్టా మంజూరు చేశారని తెలిపారు. తాను కూడా వీఆర్ఏగా, అటెండరుగా పనిచేసి పదవీ విరమణ చేశానని ఎలాంటి పింఛను లేదని భూమిపై ఆధారపడి జీవిస్తున్న తనను లంకా చంద్రశీల అతని కుమారులు కలిసి భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై గూడూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. మీ కోసంలో 146 అర్జీలు స్వీకరణ డీఆర్వో చంద్రశేఖరరావు -
మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
మచిలీపట్నంటౌన్: గంజాయి, మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటోందని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.గోపి చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దిన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కృష్ణాజిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేపట్టారు. ర్యాలీలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత తప్పుదారి పట్టి మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి భవిష్యత్తును అందించడానికి కృషి చేయాలన్నారు. చిన్నారులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి గుర్తిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలి.. వ్యవస్థ పరంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని జస్టిస్ గోపి చెప్పారు. అదేవిధంగా వాటిని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ప్రతి నేరం ఘోరం వెనుక ఈ మాదకద్రవ్యాల వినియోగం ముఖ్య భూమిక పోషిస్తోందని, యుక్త వయసుకు వచ్చిన వారి పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వారిలో అనుమానాస్పద ప్రవర్తన గుర్తించినట్లయితే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించి వివరాలు రాబట్టాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తిస్తే వెంటనే వారికి అందుకు సంబంధించిన పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ముందుకు రావాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిల్వలు, వినియోగంపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతురాజు, న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోపి -
వైఎస్ జగన్పై కూటమి భారీ కుట్ర
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. జగన్ పల్నాడు పర్యటనపై తాను మాట్లాడిన వీడియోను మహేష్ సోమవారం విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్కుమార్ నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, మీడియాతో సమావేశమై కాన్వాయ్ ఉన్న ప్రైవేటు వెహికల్ ఢీ కొందని, ఆ ప్రైవేటు వాహనం నంబర్ ఇదీ అని ప్రకటించారని గుర్తుచేశారు. ఆ వాహనం ఓనర్ను పిలిపించి వాళ్లను జామీను తీసుకుని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయడం వాస్తవం కాదా, మీరు దీన్ని కాదనగలరా? అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిందని తెలియగానే.. జగన్ కాన్వాయ్ను అనుసరిస్తున్న నాయకులు లాన్ మీద ఉన్న సింగయ్యను చూసి ఆటోలోగానీ, సొంత కారులోగానీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అక్కడున్న పోలీసులను అడిగితే వాళ్లు నిరాకరించారని, 108 వాహనం ద్వారా మాత్రమే పంపిస్తామని అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ చెప్పారని పేర్కొన్నారు. దీని వల్ల అమూల్యమైన 35 నిమిషాల సమయం వృథా అయ్యిందని, నాయకుల వాహనంలో తీసుకెళ్లేందుకు అనుమతించి ఉంటే ప్రాణాలు కాపాడే వారిమని మహేష్ స్పష్టంచేశారు. మాజీ సీఎంపై కేసు నమోదు.. పోలీసుల దుందుడు చర్య వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ప్రత్తిపాడు పార్టీ ఇన్చార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి చేతనైనంత మేర పార్టీగా తమ బాధ్యతను నిర్వర్తించామని మహేష్ పేర్కొన్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి టీడీపీ పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పోతిన మహేష్ పేర్కొన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియోను వాస్తవమో కాదో తెలుసుకున్న తర్వాతే ఎస్పీ స్థాయి అధికారి కానీ పోలీసు ఉన్నతాధికారులు గానీ బయటకు వస్తారని, అలాంటి నిర్ధారణలేవీ లేకుండానే ఒక మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టడం దుందుడుకు చర్య అని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్ -
ఈవీఎంల గోడౌన్ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర పర్యవేక్షణ జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన గోడౌన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్ను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, వివిధ పార్టీల నాయకులు యేదుపాటి రామయ్య, తరుణ్ కాకాని, కె.పరమేశ్వరరావు, ఎ.నాగేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ డెప్యూటీ తహసీల్దార్ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ -
స్వీపర్ పోస్టుకు కమిషన్ డిమాండ్.. మహిళపై టీడీపీ నేత వేధింపులు
సాక్షి,కృష్ణాజిల్లా : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు మరింత బరితెగిస్తున్నారు. స్కూల్లో స్వీపర్ ఉద్యోగం ఇప్పించినందుకు కమిషన్ ఇవ్వాలంటూ మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ నీలం రమేష్ వేధింపులకు పాల్పడ్డాడు. అదేంటని ప్రశ్నించినందుకు దాడికి దిగాడు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరంలోని స్కూల్లో ఓ మహిళకు రమేష్ స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. స్వీపర్ ఉద్యోగం చేసినందుకు గాను సదరు మహిళకు వచ్చే జీతం రూ.6వేలు. అందులోనే తన కమిషన్ రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఖాతాలో ఆరు నెలల వేతనం జమైంది.ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రమేష్ తన కమిషన్ ఇవ్వాలని మహిళను వేధించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలి భర్త బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై బాధితురాలి భర్తపై రమేష్ దాడికి దిగాడు. టీడీపీ నేత రమేష్ నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు. -
రోడ్డెక్కిన కృష్ణా జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత( రోడ్డెక్కారు. ఆమెకు తీవ్ర అవమానం జరగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. నాగాయలంక మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో గ్రామపార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రసాద్ ఏమైందో తెలియదుగానీ ఒక్కసారిగా స్వర్ణలతతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరేశారు. ఆ దురుసు ప్రవర్తనతో ఆమె షాక్ తిన్నారు. అవమాన భారంతో కంటతడి పెట్టిన ఆమె రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలైన తనకే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె తన మాటల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా?. ఉప్పల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నినాదాలు చేశారామె. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు పీఎస్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పీఎస్కు వెళ్లగా.. విషయం తెలిసిన పార్టీ నేతలు కొందరు ఆమెకు సర్దిచెప్పి ఫిర్యాదు చేయించకుండానే బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
కెనరా బ్యాంక్లో అగ్నిప్రమాదం
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కోదాడ రోడ్లో ఉన్న కెనరా బ్యాంకులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ వారు గుర్తించారు. ఉదయం 5 గంట ల సమయంలో బ్యాంకు నుంచి పొగలు రావడంతో బ్యాంకు ఉన్న బిల్డింగ్పై అంతస్తులో ఉన్న వాగ్దేవి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సురేష్ అగ్నిమాపక శాఖ వారికి, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మంట లు బిల్డింగ్ మొత్తం వ్యాపించకుండా నివారించడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు గా పై అంతస్తులో ఉన్న నర్సింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో బ్యాంక్ క్యాష్ కౌంటర్లోని కంప్యూటర్, టేబుల్స్ తదితర ఫర్నీచర్, ఫ్యాన్లు కాలిపోయాయి. సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లలు సహా మహిళ ఆత్మహత్యా యత్నం కృష్ణలంక(విజయవాడతూర్పు): మనస్తాపం చెంది ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్యకు యత్నించిన మహిళను కృష్ణలంక పోలీసులు కాపాడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భవానీ పురం, ఎరుకల వారి వీధికి చెందిన జడిపట్ల లావణ్య, జ్యోతికిరణ్ భార్యాభర్తలు. వీరికి ఏడేళ్లు, నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిరణ్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా, లావణ్య సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తోంది. కిరణ్ రోజూ మద్యం తాగి వస్తుండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన లావణ్య పిల్లలతో కలిసి కృష్ణనదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణలంక పద్మావతి ఘాట్ పరి సరాల్లో కృష్ణానదిలోకి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వారించి స్టేషన్కు తరలించారు. సీఐ నాగరాజు మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చి భవానీపురం పోలీసులకు అప్పగించారు. -
క్రియా యోగాతో ఆనందకరమైన జీవితం
విజయవాడ కల్చరల్: క్రియా యోగాతో ఆనందకరమైన జీవితం పొందవచ్చని స్వామి స్మరణానందగిరి స్వామి పేర్కొన్నారు. యోగదా సత్సంగ ధ్యానకేంద్రం విజయవాడ శాఖ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని రామకోటిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఆయన భారతీయ యోగా అంశంగా ప్రసంగించారు. భారతీయ రుషులు మనకు అందించిన అద్భుతమైన ప్రక్రియ యోగా అన్నారు. భారతీయ యోగా పట్ల ప్రపంచం ఆసక్తి చూపుతోందన్నారు. దీని వల్ల శరీరంలో వస్తున్న హానికరమైన మార్పుల నుంచి విముక్తి కలుగుతోందన్నారు. జీర్ణప్రక్రియలో మార్పులు కలిగి స్వస్థత కలుగుతుందన్నారు. ధ్యాన పద్ధతులను వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలిపారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. స్మరణానంద స్వామిని కలెక్టర్ లక్ష్మీశ, హజరత్తయ్య గుప్తా సత్కరించారు. -
సీటు కోసం పాట్లు
జి.కొండూరు: నిలబడేందుకు నీడ లేక, కూర్చునేందుకు అవకాశం లేక గురుకులంలో ప్రవేశం కోసం కౌన్సెలింగ్కు వచ్చిన అభ్యర్థులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. గురుకుల బాలికల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ గురుకుల పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగింది. అయితే కౌన్సెలింగ్లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో అభ్య ర్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు నరక యాతన పడ్డారు. అందరూ ఐదో తరగతిలో ప్రవేశం కోసం వచ్చిన చిన్న వయస్సు బాలికలు కావడంతో వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలలు ఉండగా అన్ని పాఠశాలల్లో మిగిలిన వంద సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 970మంది అభ్యర్థులు, వారి వెంట తల్లిదండ్రులతో కలిపి 2వేల మందికిపైగా హాజరయ్యారు. వీరికి నిలబడేందుకు కనీసం టెంటు సౌకర్యం లేక, తినేందుకు తిండిలేక, మైకులు లేకపోవడంతో కౌన్సెలింగ్లో ఏ పేర్లు పిలుస్తున్నారో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. వంద సీట్ల కోసం అన్ని వందల మందిని కౌన్సెలింగ్కు ఎందుకు పిలిచారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా కౌన్సెలింగ్ను నిర్వహించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల హెచ్ఎం కె.బ్యూలాని వివరణ కోరగా అన్ని వసతులు కల్పించామన్నారు. తక్కువ సీట్ల కోసం ఎక్కువ మంది హాజరు కావడం వల్ల సీట్లు రాని వారు అసంతృప్తి వ్యక్తం చేశారని వివరణ ఇచ్చారు. కుంటముక్కల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ కనీస మౌలిక వసతులు లేక అభ్యర్థుల నరకయాతన వంద సీట్ల కోసం 970మంది పోటీ -
కీళ్లు కిర్రు కిర్రు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కీళ్ల సమస్యలు అధికమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో, ప్రైవేటు ఆస్పత్రిల్లో ఆర్ధోపెడిక్ వైద్యుల వద్దకు కీళ్ల సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరికి కీళ్ల అరుగుదల సమస్య ఎదురవుతోంది. ఇలాంటి వారిలో 35 ఏళ్లు వయస్సు వారు కూడా ఉండటం గమనార్హం. 40 ఏళ్లకే కీళ్ల మార్చిడి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఒకప్పుడు ఒబెసిటీ ఉన్న వారిలో, వృద్ధాప్యంలో కీళ్లు అరిగిన వారు ఉండేవారు. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు అరిగిపోతున్నాయి. కీళ్లు పూర్తిగా అరిగి నడవలేని స్థితికి చేరుకున్న వారికి కీళ్ల మార్పిడే మార్గంగా ఉంటోంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది ఎందుకు సోకుతుందో కచ్చితంగా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సోకిన వారిలో కీళ్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉంటాయి. సకాలంలో చికిత్స చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తే కీళ్లు అరుగుదలతో పాటు చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, నరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, ఊపిరితిత్తుల చుట్టూ వాపు ఏర్పడవచ్చు. ప్రస్తుతం రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మంచి వైద్యం అందుబాటులోఉంది. క్రమం తప్పకుండా మందులు వాడి అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ దీన్ని గుల్ల ఎముక (ఆస్టియో ఆర్థరైటిస్) వ్యాధి అని కూడా అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు గుల్లబారుతుంటాయి. ఆ ప్రభావంతో చిన్న దెబ్బకే విరుగుతుంటాయి. మోకీళ్లు, తుంటెకీళ్లు అరుగుదల ఏర్పడుతుంది. అలాంటి వారికి కీళ్లమార్పిడి చేయాల్సి వస్తుంది. వెన్నుముక వంకర ఏర్పడటంతో నిటారుగా నడవలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మధ్య వయస్సు వారు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే ఆర్థరైటిస్ అరుగుతున్న కీళ్లు వ్యాయామంతో అదుపులో.. జిల్లాలో 50 వేల వరకూ ఆర్థరైటిస్ రోగులుఇలాంటి వారికి రావచ్చు థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఆర్థరైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16 నుంచి 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే అందుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా ఏ రకమైనది సోకిందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. -
మా కష్టాన్ని గుర్తించి న్యాయం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మా కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని’ ఎంటీఎస్ టీచర్లు కోరారు. మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఆదివారం జరగాల్సిన ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము 1998, 2008 డీఎస్సీలో అర్హత పొంది టీచర్లుగా పని చేస్తున్నామన్నారు. తక్కువ జీతంతో చేస్తున్న తాము ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ గోడు విని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) రూ.32,470 వేతనంగా ప్రకటించి ఉమ్మడి జిల్లాలోని 265 మంది ఉపాధ్యాయులకు న్యాయం చేశారని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో దూర ప్రాంతాల్లోని ఖాళీలను మాత్రమే చూపి కౌన్సెలింగ్ నిర్వహించాలని చూస్తున్నారన్నారు. నిబంధనను తుంగలో తొక్కుతున్నారుగతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లకు తక్కువ వేతనం కాబట్టి దగ్గర ప్రాంతాల్లోనే బదిలీ చేయాలని నిబంధనగా చేసిందని దాన్ని తుంగలో తొక్కే ప్రయ్నతం చేయాలని ఇప్పటి ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. ఇతర ఉపాధ్యాయుల మాదిరిగా హెచ్ఆర్ఏ, డీఏలు లేవని ఓన్లీ టైమ్ స్కేల్లో పని చేస్తున్న తమకు నియర్ బై రెసిడెన్స్ ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ టీచర్లకు మ్యూచువల్ బదిలీలకు కూడా అవకాశం కల్పించాలన్నారు. తమలో దివ్యాంగులు కూడా ఉద్యోగులుగా చేస్తున్న వారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని యథావిధిగా పని చేస్తున్న స్థానంలోనే కొనసాగించాలని కోరారు. ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్ బాయ్కాట్ కృష్ణా డీఈఓ కార్యాలయం వద్ద నినాదాలతో నిరసన -
దందాకు అండదండలు..
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారులు, కూటమి నేతల అండదండలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఇందులో కీలక పాత్ర టీడీపీకి చెందిన నియోజక వర్గ స్థాయి నేతలు పోషిస్తున్నారు. పోలీసులు, పౌరసరఫరా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే కాకినాడ పోర్టుకు భారీగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని తెలుస్తోంది. రేషన్ షాపులు తెరిచిన వారం రోజుల్లోనే.. రేషన్ దుకాణాలను తెరిచిన వారం రోజుల్లోపే రేషన్ బియ్యం అక్రమ నిల్వలతో పట్టుబడి పలు షాపులను సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలుచోట్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం మాటలు బూటకమని తేలిపోయింది. నేరుగా రేషన్ డీలర్లే రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పాత్ర వహించడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాలో ‘రేషన్’ గ్యాంగ్ తిరువూరు, మైలవరం, నూజివీడుల్లో అక్కడి నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రామచంద్రరావు అనే వ్యక్తి రేషన్ మాఫియాని నడిపిస్తున్నారు. వీరికి తోడుగా జి.కొండూరులో నిఖిల్, గొల్లపూడిలో సురేష్ పాతపాడులో రంగా, తిరువూరులో చారి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రేషన్ మాఫియా డాన్కు కొందరు సీఐలు సహకరిస్తున్నారు. కేతన కొండలోని ఓ రైస్ మిల్లులో రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చేరడం.. చర్యలకు ఉపక్రమించడంతో, పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అక్రమాల ‘కిశోరం’ అడ్డుపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టుకు.. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నాగరాజు, వత్సవాయి మండల పరిధి లింగాల గ్రామానికి చెందిన నరసింహారావు రేషన్ మాఫియాను నడిపిస్తున్నారు. ‘నందిగామ’లో వీరులపాడు మండలానికి చెందిన హరికృష్ణ, సత్యం, చందర్లపాడులో ఇద్దరు నరసింహారావులు, మాఫియాని నడిపించడంలో కీలకంగా ఉన్నారు. నియోజక వర్గంలో కీలక బాధ్యతలు చూస్తున్న వ్యక్తి వీరికి అండగా ఉంటున్నారు. విజయవాడ అజిత్సింగ్నగర్లో కోటేశ్వరావుతోపాటు, రూరల్, జక్కంపూడికాలనీలో టీడీపీ నేతలు దందాలో పాల్గొంటున్నారు. బియ్యం విస్సన్నపేట మీదుగా కాకినాడ పోర్టుకు వెళ్తున్నాయి. ఈ నెలలో పట్టుబడిన ఘటనలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రేషన్ షాపు నంబరు 6లో రేషన్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఈ నెల 4వ తేదీన రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. వారు తనిఖీలు చేయగా 18బస్తాల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించి షాపును సీజ్ చేశారు. ● ఎ.కొండూరు మండల పరిధి కొత్తరేపూడి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 34 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు ఈ నెల 8వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం కనిపించకుండా మొక్కజొన్న విత్తనాలతో కలిపి ప్యాక్ చేసిన మిల్లు నిర్వాహకులు అధికారుల కన్నుగప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ● ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరులో రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్న నందిపాము వరప్రసాద్ అనే డీలరుపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఈ నెల 4వ తేదీన 6ఏ కేసు నమోదు చేశారు. స్టాకు రిజిస్టరు కంటే అదనంగా 162 కిలోల బియ్యం, 72 కిలోల పంచదార డీలరు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ ఈస్ట్లో ఒకరు, సెంట్రల్ ఒకరు రేషన్ మాఫియాలో ఒకరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులది హైటెక్ జీవనశైలి రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారి వద్ద ఖరీదైన ఐ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఉండటం పోలీసులనే విస్తుగొలుపుతోంది. ఈ వ్యాపారం చేస్తున్న వారు నెలకు రూ.10 నుంచి 20 లక్షల వరకూ సంపాదిస్తున్నట్టు తెలిసింది. కీలక భాగస్వాములు.. పచ్చనేతలు, పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులే! బియ్యం వాహనాలతో అక్రమాలు అంటూ కూటమి విష ప్రచారం ఈ నెలలో పలుచోట్ల రేషన్ బియ్యం పట్టివేత మిల్లులకు తరలించి అక్కడ నుంచి పాలిష్ పట్టి బియ్యం అమ్మకాలు మరికొన్ని కాకినాడ పోర్టుకు తరలించి ఇతర దేశాలకు రవాణా ఎక్కడికి తరలిస్తున్నారు కృష్ణా జిల్లాలో..ప్రభుత్వం బూటకపు మాటలు గత ప్రభుత్వం మొబైల్ వాహనాలతో ఇంటింటికీ రేషన్ ఇచ్చారు. వీటితో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేసింది. ఈ వాహనాలను తొలగించి పాత పద్ధతిలోనే డీలర్లకు బాధ్యతలు అప్పగించారు . రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే ఎండీయూ వాహనాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పింది. చిన్నపాటి కేసులతో సరి అక్రమ రవాణా ఘటనల్లో పట్టుబడిన వారు గతంలో పలుసార్లు రేషన్ బియ్యాన్ని అక్రమ సరఫరా చేసినవారే. పట్టుకున్నప్పుడలా చిన్న చిన్న కేసులు కట్టి వదిలేయడం మళ్లీ వారు అక్రమ వ్యాపారం చేయడం పరిపాటైంది. వీరిపై బలమైన కేసులు పెడితే ఇలాంటి పనులు చేయడానికి మిగిలిన వారు భయపడతారని కొంతమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా అర్ధరాత్రి, తెల్లవారు జామున రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుంటారు. ఆ సమయంలో ముందుగానే రెక్కీ నిర్వహించి తమకు అనుకూలంగా ఉన్న పోలీసులు ఉంటే వాహనాలను ముందుకు వెళ్లనిస్తారు. లేదంటే తర్వాత పంపిస్తారు. బియ్యం అక్రమ రవాణాలో పోలీసులకు ముడుపులు ముడుతున్నట్టు విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లోని మిల్లులకు తరలించి వీటిని పాలిష్పెట్టి కిలో రూ.35 నుంచి రూ.40కి బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నట్టు తెలిసింది. కార్డు దారుల నుంచి కిలో బియ్యం రూ.10 కొనుగోలు చేసి, అక్కడ నుంచి మిల్లులకు కిలో రూ.18 కి అక్రమార్కులు విక్రయిస్తున్నారు.ఈ నెల 3వ తేదీ అవనిగడ్డలో 4.50 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి చెందిన కూతాడి వెంకన్న, అవనిగడ్డకు చెందిన కోసూరు రామారావుని అరెస్ట్ చేసి వారి వాహనాల నుంచి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని రేషన్ షాపులకు పంపిన బియ్యం సీలు కూడా తీయకుండా అలాగే అక్రమ రవాణా చేయడం కొసమెరుపు. గుడివాడ బైపాస్ రోడ్డులో ఈనెల 16న అక్రమంగా తరలిస్తున్న 17క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న కొత్తపేటకు చెందిన పెద్ది రామచంద్రరావు, వ్యాన్ డ్రైవర్ యండమూరి సీతారాముడుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ రెండో రోజైన ఆదివారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 145, మాచ వరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 119 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 91 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 355 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్ ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి తెలిపారు.నేటి షెడ్యూల్ ఇదీసోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 32001 నుంచి 38 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 38001 నుంచి 44 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 44001 నుంచి 50 వేల ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు.ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శుల సంఘం ఎన్నికకంచికచర్ల: ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంఘ ఎన్నికలు గొల్లపూడి దత్త కల్యాణ మండపంలో ఆదివారం జరిగాయని ఎన్నికల అధికారి (డెప్యూటీ ఎంపీడీఓ) ఎంవీ ప్రసాద్ తెలిపారు. జిల్లా కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా ఇందుపల్లి నానిబాబు(కంచికచర్ల మండలం చెవిటికల్లు), ఉపాధ్యక్షుడు టి.సాంబశివరావు(వీరులపాడు మండలం కొనతాలపల్లి), ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరెడ్డి(జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం), జాయింట్ సెక్రటరీ పి.గోపీకృష్ణ(వత్సవాయి మండలం మక్కపేట), కోశాధికారి ఏ నరేష్(పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం), కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమణ తదితరులు పాల్గొన్నారు.నేడు దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సమీక్షఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహామండపంలోని ఏడో అంతస్తులో సమీక్ష నిర్వహిస్తారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్ప్లాన్ అమలుపై దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఆలయ ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ దుకాణాలను తరలిస్తేనే అభివృద్ధి పనులకు అటంకం లేకుండా సకాలంలో పూర్తి చేసే వీలుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.పేకాట కేసులో టీడీపీ 30వ డివిజన్ ఇన్చార్జి!మధురానగర్(విజయవాడసెంట్రల్): పేకాట కేసులో 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి కరణం వెంకటరమణను ఆదివారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకనగర్లో ఆదివారం పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి కరణం వెంకటరమణ కూడా ఉన్నారని తెలిసింది. దీంతో టీడీపీ నాయకులు ఈ కేసు నుంచి వెంకటరమణను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇదే డివిజన్కు చెందిన ఎమ్మెల్యే పీఏ.. కేసును నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
పేద, మధ్యతరగతికి కార్పొరేట్ వైద్యమే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆశయంలో తన తండ్రి డాక్టర్ ఎన్. సుబ్బారావు పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ఈ ఆస్పత్రిలో తన పిల్లలు వరుణ్, పవన్, మనోజ్ వర్షిణీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. సూర్యారావు పేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్. సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్, ఆంధ్రా యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను ఆదివారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, కామినేని శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు, యురాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల తదితరులు పాల్గొన్నారు. 24న వినియోగదారుల కమిషన్ భవనం ప్రారంభం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వినియోగదారుల కమిషన్ కార్యాలయ మొదటి అంతస్తు భవనాన్ని ఈ నెల 24వ తేదీ మంగళవారం ప్రారంభించనున్నట్లు వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి ఆదివారం తెలిపారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఎంయూడీఏ చైర్మన్ మట్టా ప్రసాద్తో పాటు సివిల్ సప్లయీస్ కమిషనర్ సౌరభ్ గౌర్తో పాటు ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు దొమ్మేటి శ్రీనివాస్ పాల్గొంటారని ఆయన తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు గవర్నర్పేటలోని సర్వోదయ ట్రస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సంఘ భవనంలో బహుమతులు అందజేశారు. ఈ నెల 19వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుల సంఘ భవనం వద్ద జరిగిన యోగా పోటీల్లో 150 మంది, చిత్రలేఖన పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆదివారం బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్వో దయ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ప్రసాద్, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, డ్రీమ్ యోగా అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు పి.రమేష్, కృష్ణాజిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఘనంగా మెడికల్ కళాశాల వార్షికోత్సవం
గన్నవరం రూరల్: నైతిక విలువలు, ధర్మం పునాధులుగా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ భారతీయం సత్యవాణి ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల 19వ వార్షికోత్సవాన్ని విద్యార్థుల కోలాహలం మద్య ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ డాక్టర్, మేజర్ ఎంవీ భీమేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవాణి మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తిలో స్థిరపడే విద్యార్థులు భారతదేశ ఔన్యత్యాన్ని, వారసత్వాన్ని, చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వైద్య రంగంలో విశేషంగా రాణిస్తున్నారని అభినందించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు క్రమశిక్షణతో ప్రగతి సాధించాలన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, ట్రెజరర్ సూర్రెడ్డి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
జగన్మాతకు జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనం జగన్మాతకు జేజేలు పలికారు. నగరంలోని దుర్గ గుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన భక్తుల సందడి సాయంత్రం వరకు కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఆదివారం ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించగా, రూ. 100 టికెట్పై రెండు క్యూలైన్లు నడిచాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పల్లకీ సేవ జరిగింది. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఆర్జిత సేవల్లో ఉభయదాతలు -
నేడు యువత పోరు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత జీవితాలతో కూటమి చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 23న నిర్వహించనున్న ‘యువత పోరు’ పోస్టర్ను ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. సోమవారం ఉదయం 10 నుంచి విజయవాడ అలంకార్సెంటర్లోని ధర్నా చౌక్లో యువత పోరు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు సర్కార్పై నిరసన గళంనిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు యువత పోరు ఏర్పాటు చేశారన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, అనుబంధ విభాగాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకూ నిరసనలు తెలియజేద్దామని పిలుపునిచ్చారు. యువత పోరు కార్యక్రమం అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఏడాది పాలనలో నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందన్నారు. వలంటీర్లు, ఎండీయూ వాహనాల నిర్వాహకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు , పార్టీ ఇన్చార్జిలతో కలిసి యువత పోరుకు సమాయత్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. మచిలీపట్నంలో.. చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యాన జిల్లా కేంద్రమైన మచిలీ పట్నంలో యువత పోరు కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపి తర్వాత కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్లో నిరసన కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత -
రక్తదానంతో ప్రాణం నిలబడుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య అని, ఇది అనేక మంది రోగులకు నూతన జీవనాన్ని అందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గాయాలు, శస్త్ర చికిత్సలు, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, కాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం అత్యవసరం అవుతుందని, రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. నగరంలో వీకేఆర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి రోటరీ బ్లడ్ బ్యాంకును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయభాస్కర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రక్తం కొనుగోలు, కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. విజయవాడలో రెడ్క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ వంటి సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు ప్రఫుల్, రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు సహాయ గవర్నర్ డాక్టర్ హర్ష, కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటర్లు, దుకాణాల్లో ఈవో తనిఖీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవస్థాన కౌంటర్లతో పాటు దుకాణాల్లో ధరల బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై రద్దీ నేపథ్యంలో ఈవో శీనానాయక్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. తొలుత ఓం టర్నింగ్ వద్ద ఉన్న పొంగలి షెడ్డును తనిఖీ చేసి, గతంలో గుర్తించిన లోపాలను సరి చేశారా లేదా అని పరిశీలించారు. అనంతరం దేవస్థానం కొబ్బరి కాయల కౌంటర్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. రోజు వారి అమ్మకాలు, భక్తుల అభిప్రాయ సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులతో మాట్లాడి.. లగేజీ, చెప్పుల స్టాండ్ వద్ద ఈవో భక్తులతో మాట్లాడారు. కౌంటర్లలో అధిక రుసుం వసూలు చేయరాదని, భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం టోల్గేట్ వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లో నీటి నాణ్యతను పరీక్షించారు. కనకదుర్గనగర్లో దుకాణాల వద్ద ధరల బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసే భక్తులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవో వెంట అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సాహంగా స్నాతకోత్సవం
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ 24వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ డాక్టర్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమాన అవకాశాలు, సామాజిక చలనశీలతను నిర్ధారించడానికి నాణ్యమైన విద్య శాశ్వత సాధనాల్లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అది అందించడంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ముందుందని కొనియాడారు. ఈ స్నాతకోత్సవంలో 1,165 మంది విద్యార్థులు హాజరై ప్రొవిజనల్ సర్టిఫికెట్లను ముఖ్య అతిథి ఎన్.వి.రమణ చేతుల మీదుగా ఆయా విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకుల సమక్షంలో అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థినులు వరుసగా కొమ్ము సుప్రియ (9.65), గంజి స్నేహలత (9.52), ఈలపర్తి ప్రియాంక (9.51) అకడమిక్ టాపర్స్గా నిలవడం విశేషం. 33మంది విద్యార్థులు ఆనర్స్ డిగ్రీ పూర్తి చేయగా, 17మంది విద్యార్థులు మైనర్స్ డిగ్రీ పూర్తి చేసి అదనంగా 18క్రెడిట్స్ సాధించారు. అన్నింట్లో ముందంజ.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ మాట్లాడుతూ విద్యా సంబంధిత విషయాలలోనే కాకుండా క్రీడా విభాగంలో సహితం కళాశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు. 25మంది విద్యార్థులు యూనివర్సిటీ బ్లూస్గా జేఎన్టీయూకే కాకినాడకు ప్రాతినిధ్యం వహించి, అంతర్ విశ్వ విద్యాలయం, అంతర్ రాష్ట్ర టోర్నమెంట్లలో పాల్గొని అనేకానేక పతకాలు, ట్రోఫీలు గెలుచుకున్నారని చెప్పారు. అంతర్ కళాశాలల అథ్లెటిక్స్లలో 17బంగారు పతకాలు, 10వెండి పతకాలు, 4రజత పతకాలు సాధించారన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్యార్థిని కె.అనిత రికార్డు స్థాయిలో అత్యధికంగా 253 పాయింట్లు సాధించి బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్గా నిలవడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ముందుగా కళాశాల ఎన్ఎస్ఎస్ బ్యాండ్ బృందం, ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి ఎన్.వి.రమణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయనను కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ముసునూరి శ్రీనివాసరావు, సెక్రటరీ– కరస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణ, కో సెక్రటరీ – కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితరులు జ్ఞాపికను అందించి, దుశ్శాలువాతో సత్కరించి సన్మాన పత్రాన్ని సమర్పించారు. -
చెరువుల్లో పూడికతీత చేపట్టాలి
ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య విజయవాడరూరల్: చెరువుల్లో పూడిక తీత పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ పొలాలు మెరక చేసుకునేందుకు చెరువుల ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులకు మాత్రమే మట్టిని తీసుకొనే అవకాశం కల్పించాలన్నారు. చెరువుల్లో మట్టి అక్రమ విక్రయాలకు గురికాకుండా ఉండాలన్నారు. ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెట్టండి.. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో 39 ఎత్తిపోతల పథకాలున్నాయని వాటిల్లో ప్రధానమైన వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.15 కోట్లను మంజూరు చేశారని, అయితే ఇంత వరకు మరమ్మతుల పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. ఆ ఎత్తిపోతల పథకం పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయని మరమ్మతుల పనులు యుద్ధప్రాతిపదికన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పోలంపల్లి ఆనకట్ట మరమ్మతుల పనులు, మునేరుపై ఎత్తిపోతల పథకం పనులు కూడా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదని గుర్తు చేశారు. -
ఏ రకమో గుర్తించడం ముఖ్యం
ఆర్థరైటిస్ 12 రకాలు ఉన్నాయి. వాటిలో రోగికి ఏ రకమైన ఆర్థరైటిస్ సోకిందో తెలుసుకుని మందులు వాడాల్సి ఉంటుంది. కొందరికి ఆరునెలలు, ఏడాది పాటు మందులు వాడితే తగ్గిపోతుంది. మరికొందరు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. లక్షణాలను తొలిదశలో గుర్తించి మందులు వాడితే దుష్పలితాలు లేకుండా చూడవచ్చు. కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు కీళ్లు పట్టేసినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలి. –డాక్టర్ ఎన్.కావ్యాదేవి, రుమటాలజిస్ట్, విజయవాడ● -
మద్యం మత్తులో దారుణ హత్య
జగ్గయ్యపేట అర్బన్: మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట సీఐ కార్యాలయంలో సీఐ పి.వెంకటేశ్వర్లు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని క్రిస్టియన్పేటకు చెందిన అభిమళ్ల వెంకయ్య (32) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇనుము సామగ్రి లోడింగ్కు కూడా వెళ్తుంటాడు. మద్యం అలవాటున్న వెంకయ్యకు విలియంపేటకు చెందిన అల్లూరి కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పట్టణంలోని ఓ వైన్షాపు వద్ద వారిద్దరూ మద్యం తాగారు. ఆ మత్తులో గొడవ పడ్డారు. వెంకయ్యను ఎలాగైనా చంపుతానని అల్లూరి కృష్ణ బెదిరించాడు. అక్కడ ఉన్నవారు ఇద్దరినీ విడదీసి పంపించేశారు. ఆ తరువాత ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పట్టణంలోని రైతుబజారు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వెనుక ఒంటరిగా ఉన్న వెంకయ్యపై కృష్ణ రాయితో దాడిచేసి పారిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంక య్య మృతిచెందాడు. వెంకయ్య తల్లి మణి పట్టణ పోలీస్స్టేషన్కు వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద తన కుమారుడు చనిపోయి ఉన్నాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకయ్య మృతదేహం పక్కన అతనిపై దాడికి వాడిన రాయి కూడా ఉంది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి అల్లూరి కృష్ణను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పేట ఎస్ఐ జి.రాజు, చిల్లకల్లు ఎస్ఐ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పీఆర్సీ కమిషన్ను నియమించండి
ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని పెండింగ్ డీఏలు, పాత బకాయిలను చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవి కోరారు. నగరంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే ట్రైనింగ్స్ పెట్టి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయటం సరికాదన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షితులయ్యేలా విద్యావిధానాలను రూపొందించాలన్నారు. ఆన్లైన్ పనులతో పాటు బోధనా సమయాన్ని హరించకుండా చూడాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ. దస్తగిరి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్ల బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లంకేష్, గౌరవాధ్యక్షుడు ఎం. రామబ్రహ్మం, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్థరైటిస్లో కీళ్ల అరుగుదల
రుమటాయిడ్, సోరియాసిస్ ఆర్థరైటిస్ లాంటి ఇన్ప్లమేటరీ డిసీజ్ కారణంగా తుంటి, మోకీళ్ల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. మధ్య వయసులోనే కీళ్లు అరిగి వస్తున్నారు. అలాంటి వారికి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. మోకీలు మార్పిడికి రోబోటిక్ సర్జరీలు చేస్తున్నాం. టోటల్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలు ఎక్కువగా చేస్తున్నాం. వందశాతం సక్సెస్రేటుతో కీళ్ల మార్పిడి చేస్తున్నాం. 20 నుంచి 80 ఏళ్ల వయస్సు వాళ్ల వరకు వస్తున్నారు. –డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి
మైలవరం(కృష్ణా): భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకున్న తండ్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మైలవరంలోని మారుతీనగర్లో నివసించే వేములవాడ రవిశంకర్, చంద్రిక దంపతులకు కుమార్తె లక్ష్మీహిరణ్య(9), కుమారుడు లీలాసాయి నృసింహ (7) ఉన్నారు. వారిద్దరూ జి.కొండూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ ఐదు, మూడో తరగతులు చదువుతున్నారు. రవిశంకర్, చంద్రక నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బహ్రెయిన్ వెళ్లింది. మొదటి నుంచి భార్య తీరుపై రవిశంకర్కు అనుమానం ఉంది. భార్య బహ్రెయిన్ వెళ్లినప్పటి నుంచి పిల్లలను చంపేందుకు రవిశంకర్ పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టిన రోజున పిల్లలు ఇద్దరిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. పథకం ప్రకారం ‘నీకు చాలా అన్యాయం చేశాను చంద్రిక’ అంటూ పిల్లలు ఇద్దరినీ చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. అనంతరం పిల్లలు ఇద్దరినీ హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 12న రవిశంకర్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా మనవడు, మనవరాలు బెడ్పై విగతజీవుల్లా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు రవిశంకర్ ఇంట్లో అతను చంద్రికకు రాసిన లేఖ దొరికింది. దీంతో రవిశంకర్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. రవిశంకర్ ఫోన్ సిగ్నల్ చివరిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద లభించడంతో రెండు రోజులపాటు రవిశంకర్ ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణానదిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ రవిశంకర్ ఆచూకీ లభించకపోవడంతో బతికే ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.ఫోన్ సిగ్నల్ ఆధారంగా..ఇద్దరు బిడ్డలను హత్య చేసిన అనంతరం రవిశంకర్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకొని అక్కడి సిమ్తో పాటు సెల్ఫోన్ను పడేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలు చేసిన సెల్ నుంచి మైలవరంలో ఒకరికి ఇటీవల ఫోన్ చేయడాన్ని పోలీసులు గుర్తించి, ఫోన్ సిగ్నల్ను ట్రాక్చేసి రవిశంకర్ ఆచూకీని కనిపెట్టారు. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తలదాచుకున్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం తరలించి విచారణ చేపట్టారు. ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చి దానిలో పురుగుమందు కలిపి ఇద్దరు బిడ్డలకు బలవంతంగా తినిపించి, వారిద్దరూ స్పృహ కోల్పోయే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమా చారం. నిందితుడిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. -
గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ఉయ్యూరు: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్ పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఈ నెల 25న జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనపై ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరవుతారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. విజయవాడ నుంచి యూనివర్సిటీ వరకూ గవర్నర్ నజీర్ పర్యటనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రహదారులపై గుంతలు పూడ్చి సరిచేయాలని, వసతులు, సౌకర్యాలు, భద్రతా చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ.. ప్రముఖులు పర్యటించే రహదారుల వెంబడి గ్రీన్ చానల్ ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గీతాంజలి శర్మ, కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ, డీఆర్వో చంద్రశేఖర్రావు, యూనివర్సిటీ రిజిస్ట్రారు ఉష, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి షాహిద్ బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, డీపీఓ అరుణ, డీఈఓ పి.వి.జె.రామారావు, ఆర్డీఓలు స్వాతి, హెలా షారోన్ పాల్గొన్నారు. -
కన్న తండ్రే కాలయముడు!
మైలవరం: భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకున్న తండ్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మైలవరంలోని మారుతీనగర్లో నివసించే వేములవాడ రవిశంకర్, చంద్రిక దంపతులకు కుమార్తె లక్ష్మీహిరణ్య(9), కుమారుడు లీలాసాయి నృసింహ (7) ఉన్నారు. వారిద్దరూ జి.కొండూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ ఐదు, మూడో తరగతులు చదువుతున్నారు. రవిశంకర్, చంద్రక నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బహ్రెయిన్ వెళ్లింది. మొదటి నుంచి భార్య తీరుపై రవిశంకర్కు అనుమానం ఉంది. భార్య బహ్రెయిన్ వెళ్లినప్పటి నుంచి పిల్లలను చంపేందుకు రవిశంకర్ పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టిన రోజున పిల్లలు ఇద్దరిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. పథకం ప్రకారం ‘నీకు చాలా అన్యాయం చేశాను చంద్రిక’ అంటూ పిల్లలు ఇద్దరినీ చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. అనంతరం పిల్లలు ఇద్దరినీ హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 12న రవిశంకర్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా మనవడు, మనవరాలు బెడ్పై విగతజీవుల్లా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు రవిశంకర్ ఇంట్లో అతను చంద్రికకు రాసిన లేఖ దొరికింది. దీంతో రవిశంకర్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. రవిశంకర్ ఫోన్ సిగ్నల్ చివరిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద లభించడంతో రెండు రోజులపాటు రవిశంకర్ ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణానదిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ రవిశంకర్ ఆచూకీ లభించకపోవడంతో బతికే ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. ఇద్దరు బిడ్డలను హత్య చేసిన అనంతరం రవిశంకర్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకొని అక్కడి సిమ్తో పాటు సెల్ఫోన్ను పడేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలు చేసిన సెల్ నుంచి మైలవరంలో ఒకరికి ఇటీవల ఫోన్ చేయడాన్ని పోలీసులు గుర్తించి, ఫోన్ సిగ్నల్ను ట్రాక్చేసి రవిశంకర్ ఆచూకీని కనిపెట్టారు. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తలదాచుకున్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం తరలించి విచారణ చేపట్టారు. ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చి దానిలో పురుగుమందు కలిపి ఇద్దరు బిడ్డలకు బలవంతంగా తినిపించి, వారిద్దరూ స్పృహ కోల్పోయే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమా చారం. నిందితుడిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను కడతేర్చిన రవిశంకర్ ఈ నెల 12న సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన విశాఖపట్నంలో పోలీసులకు చిక్కిన నిందితుడు రవిశంకర్ -
విలీనం కాదు... వినాశకరం
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చర్యల ఫలితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 150 పాఠశాలలకు పైగా కుదించటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా స్థానిక చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఉన్న వ్యవస్థను దిగజార్చటంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 9 రకాలుగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కూటమి ప్రభుత్వం 2025–26 విద్యాసంవత్సరం నుంచి తొమ్మిది రకాల పాఠశాలలతో పాటు క్లస్టర్ అకడమిక్ టీచర్ల విధానాన్ని తీసుకువచ్చింది. జీఓ–117ను ప్రభుత్వం రద్దు చేసి, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ చేసింది. దీంతో ఇప్పటివరకు ఊరిబడిలో చదువుతున్న విద్యార్థులు దూరంగా ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మార్చే ఆలోచనలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా చదువు మధ్యలో మానేసే పిల్లల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. పాఠశాలలను నేరుగా ఎత్తేయకుండా, భారంగా నడిచేలా ప్రభుత్వం కుట్ర చేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత పాఠశాలల్లో ఉపాధ్యాయులను బదిలీలతో కొంతవరకు సర్దుబాటు చేసినా కొన్ని అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వలేకపోయారు. మరో పక్క మినిమం టైమ్ స్కేల్(ఎంటీఎస్) ఉపాధ్యాయుల బదిలీలు చేయవలసి ఉంది. 10 శాతం పోస్టులు 2025 డీఎస్సీ అభ్యర్థులతో నింపాల్సిఉంది. ఉపాధ్యాయుల కొరతతో పాఠశాలల్లో బోధన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. కొత్త జీవోల వల్ల నష్టాలు గతంలో ప్రైమరీ స్కూల్స్ను ఫౌండేషన్ స్కూల్స్గా మారుస్తామంటే ప్రైమరీ స్కూల్ వ్యవస్థ దెబ్బ తింటుందని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 246 స్కూల్స్ను ఫౌండేషన్ స్కూల్స్గా మార్చింది. వాటిలో గతంలో 20 మంది విద్యార్థుల వరకు సింగిల్ టీచర్ ఉంటే, ఇప్పుడు 30 మంది విద్యార్థులకు పెంచేశారు. ఈ నిర్ణయం కారణంగా దాదాపు 99 శాతం ఫౌండేషన్ స్కూల్స్లో సింగిల్ టీచర్లే ఉండే ప్రమాదం ఉంది. గతంలో దాదాపు 1,131 ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిని ముక్కలు చేశారు. 929 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గా కొనసాగిస్తూ, 69 డౌన్ గ్రేడ్ చేస్తూ బేసిక్ ప్రైమరీ, 30 డౌన్ గ్రేడ్ చేస్తూ మోడల్ ప్రైమరీ, 9 హైస్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్, 44 హైస్కూల్స్ లోనే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటూ మార్చేశారు. బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 20 మంది విద్యార్థులకి సింగిల్ టీచర్, 60 మంది వరకు ఇద్దరు టీచర్ల విధానం తీసుకొచ్చారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో 60 మంది వరకు నలుగురు టీచర్లను కేటాయించారు. హైస్కూల్స్లో ఏర్పాటు చేసే ప్రైమరీ స్కూల్స్ లో 10 మందికి ఒక ఎస్జీటీ, 30 మందికి రెండో ఎస్జీటీ ఇస్తామని నిబంధన పెట్టారు. అడ్డగోలు నిర్ణయాలు ప్రైమరీ స్కూల్స్కి స్కూల్ అసిస్టెంట్లను తీసుకురాకూడదనే నిబంధన ఉన్నా, బీఈడీ చేసిన స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా తీసుకున్నారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో ఎస్జీటీలకు ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉండదు. యూపీ స్కూల్స్ విలీనంపై ప్రజాగ్రహం మూడు నాలుగు దశాబ్దాలుగా ఉన్న స్కూళ్లను మార్పు చేయటంపై నిరసన ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర ఎంఈవో కార్యాలయాల ఎదుట తల్లిదండ్రుల ధర్నాలు సబ్జెక్ట్ టీచర్లు లేక ఇబ్బందులు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పూర్తిగా రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినా ఉమ్మడి కృష్ణాలో సుమారు 103 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కొనసాగేలా, 59 హైస్కూల్స్/అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గా మారుస్తూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో 6, 7, 8 తరగతులకు 10 మందికి ఒక సబ్జెక్ట్ టీచర్ని, అది కూడా హిందీ లేదా తెలుగుకు ఇచ్చారు. ముఖ్యంగా గణితం సబ్జెక్ట్ టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు గురికావాల్సి ఉంటుంది. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
పటమట(విజయవాడతూర్పు): భవిష్యత్ తరాలకు డ్రగ్స్ రహిత సమాజాన్ని అందించాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ టీం సీఐ టి.ధనుంజయ్ పేర్కొన్నారు. నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించు కుని శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐ ధనుంజయ్ మాట్లాడుతూ.. యువత, విద్యా ర్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ విక్రయాల గురంచి తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా 1972 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబీ జోసెఫ్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలతో బతుకు దుర్భరం చేసుకోవద్దని సూచించారు. ర్యాలీలో పట మట త్రివేణి కళాశాల నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారాన్ని నిర్వహించి డగ్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతనం డ్రగ్సకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్బాబు, త్రివేణి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పుష్పలత, ఈగల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.వీరాంజనేయులు, నవజీవన్ బాల భవన్ జోనల్ కోఆర్డినేటర్లు జ్యోతి చంద్రిక, నజ్మా, కె.ప్రియాంక, జాకబ్ రాజు, బి.రమేష్, దేవమణి, డి.వెంకటేశ్వరావు, లీలావతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మండుటెండలో కటిక నేలపై విద్యార్థుల యోగాసనాలు
ఇబ్రహీంపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్సిస్ రికార్డు సృష్టి స్తామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో యోగా కార్యక్రమాల నిర్వహణకు ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఇబ్రహీంపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు కటిక నేలపై కూర్చుని యోగాసనాలు వేయాల్సి వచ్చింది. ఉదయం పది గంటల సమయంలో ఎర్రటి ఎండలో ఆసనాలు వేయలేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా వేయకుండా కంకరుతో కూడిన కటిక నేలపై విద్యార్థినులతో ఆసనాలు వేయించడం గమనార్హం. వర్గీకరణ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ నిబంధనలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటికే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో నూతన నిబంధనలు అమలు చేయాలన్నారు. నూతన నిబంధనలను అమలు చేయకుండా వర్గీకరణ చేశామని ప్రభుత్వం చెప్పుకున్నా మాదిగలకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఇకపై జరిగే నియామకాల్లో వర్గీకరణ నిబంధనలు అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎ.వి.కృష్ణ, మందా నాగమల్లేశ్వరరావు, చెట్టే సుజన రావు, వనం నాగేశ్వరరావు, విజయ్, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. కోడూరు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ చిలకలపూడి(మచిలీపట్నం): అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు పంచాయతీ ఇంచార్జి కార్యదర్శి బి. శేషగిరిరావును సస్పెండ్ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శేషగిరిరావు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, పీజీఆర్ఎస్లో గ్రామానికి చెందిన రాజనాల భాస్కరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని డీపీఓను ఆదేశించారు. దీంతో కోడూరు మండలం ఈఓపీఆర్డీ రేవతి విచారణ జరిపారు. ఈ విచారణలో రూ.34.62 లక్షల నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారించారు. ఆమె ఇచ్చిన నివేదిక మేరకు కలెక్టర్ బాలాజీ కార్యదర్శి శేషగిరిరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. -
4న విద్యుత్ చార్జీలపై పోరుబాట
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జూలై నాలుగో తేదీన పోరుబాట నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. పోరుబాటలో భాగంగా ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆ రోజు నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీభవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోరుబాట వాల్ పోస్టర్ను కాశీనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సర్దుబాటు చార్జీలు, సర్చార్జీలు, వడ్డీలు ఇలా వివిధ రూపాల్లో ప్రజలపై కూటమి ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. పోరుబాటలో భాగంగా సోమవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి, సంకాల సేకరణ చేపడతామన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగులగొట్టాలని ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ పిలుపు మేరకే తాము పోరుబాట చేపట్టామన్నారు. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ, తూర్పు సిటీ కమిటీల పార్టీ కార్యదర్శులు బోయి సత్యబాబు, పి.కృష్ణ పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం మొదలైంది. ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలన చేసేందుకు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవరణలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని పాలిసెట్ ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 63 మంది, లయోల కళాశాలలో 85 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో 58 మంది చొప్పున మొత్తం 206 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శనివారం పూర్తి చేశామన్నారు. పాలిసెట్లో 380వ ర్యాంకు పొందిన ఎం.సహస్ర చౌదరి సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని ఆమెను ఎం. విజయసారథికి అందజేశారు. నేటి షెడ్యూల్ ఇదీ.. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 15,001 నుంచి 21 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 21001 నుంచి 26500వ ర్యాంకు వరకు, లయోల కళాశాల ఆవరణలోని కేంద్రంలో 26501 నంచి 32 వేల ర్యాంకు పొందిన అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలిస్తామని కన్వీనర్ విజయసారథి తెలిపారు. గన్నవరంలో.. గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నుంచి పాలిసెట్ అభ్యర్థులకు కౌన్సె లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పాలిసెట్ కౌన్సెలింగ్ను కోఆర్డినేటర్ వి.వి.కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం తొలిరోజు జరిగిన కౌన్సెలింగ్లో 40 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 37 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారని కోఆర్డినేటర్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు వరకు జరిగే కౌన్సెలింగ్ను పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి
కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టరేట్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణంలో సమతుల్యత జరగాలంటే పచ్చదనం పెంపుదల చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ వారి ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో కె.స్వాతి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ డీఎస్సీగా షణ్ముగ వడివేల్ బాధ్యతల స్వీకారం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ (డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్)గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 2014 బ్యాచ్కు చెందిన షణ్ముగ వడివేల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడుకు చెందిన ఆయన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతరం 2014లో సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఆఫీసర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాల తన కెరీర్లో భారతీయ రైల్వేలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈశాన్య సరిహద్దు రైల్వేలోని టిన్సుకియా డివిజన్లో డీఎస్సీగా, ఉత్తర రైల్వేలోని మొరాదాబాద్ డివిజన్లో సీనియర్ డీఎస్సీగా, దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్లో సెక్యూరిటీ కమిషనర్గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్పీఎఫ్ అధికారులు, పలు బ్రాంచ్ల అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. వీఎంసీ సబార్టినేటర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక పటమట(విజయవాడతూర్పు):విజయవాడ నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆఫీస్ సబార్డినేటర్స్ కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలు వద్ద జరిగిన ఈ ఎన్నికల్లో శీలం కరుణ అధ్యక్షులుగా ఎన్నికర్యారు. ఉపాధ్యక్షులుగా పీవీ లోకేశ్వరరావు, కార్యదర్శిగా పీవీ ఆనంద్ హనుమాన్, సహాయ కార్యదర్శిగా డి. దుర్గమ్మ, కోశాధికారిగా కె. ఫణి భరత్ ఎన్నికయ్యారు. -
చెవిరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా.. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్ను సిట్ అధికారులు కొడితే మణిపాల్లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్గా చూపించారు’ అని తెలిపారు. -
ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న కేంద్రం వద్ద లైవ్ సైడ్ స్క్రీన్ పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే యోగా చేసే వారిపై స్కీన్ పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు.. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో యోగా సందర్భంగా అరకొరగా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగా చేసేందుకు స్టేడియంకు వచ్చిన వారికి కావాల్సిన మొత్తంలో మ్యాట్స్ ఇవ్వకపోవడంతో వాటి కోసం అందరూ ఎగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారికి చెదరగొట్టారు.ఇదిలా ఉండగా.. విశాఖలో యోగా డే సందర్భంగా ప్రమాదం తప్పింది. యోగా డే వేడుకల కోసం ప్రజలను తరలిస్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హనుమంతువాక విశాలాక్షి నగర్ వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారంతా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. -
బై..పాస్ అయ్యేదెన్నడో!
విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పనులు దాదాపు పూర్తయినా ప్రారంభం మరింత ఆలస్యమవుతోంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్య కారణంగా పలుచోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం చూపడంతో ఏడాదిగా పనులు అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం అలసత్వం వదిలి వెస్ట్ బైపాస్ ప్రారంభానికి చొరవ చూపాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: వెస్ట్ బైపాస్ రహ దారిని అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా పనులు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు, విజయవాడ ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి అలసత్వం తోడైందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరింత ఆలస్యం గత ప్రభుత్వ హయంలో.. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు చేసిన కుట్రే నేడు శాపమైంది. ఆ చిక్కుముడే ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఆశించిన ప్రజల కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. మరింత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం, ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారులు చిత్త శుద్ధితో పనులను పూర్తి చేసేందుకు కృషి చేయక పోవడంతో జాప్యం జరుగుతోంది. టవర్ల మార్పిడి వెనక అక్రమాలు! అయితే వీటి మార్పిడికి విజయవాడ ఆర్వో కార్యాలయం అధికారులు రూ.32.58 కోట్లు అంచనాలు వేశారు. మూతబడిన సంస్థకు సూపర్వైజేషన్కు చార్జీల కింద రూ.50 లక్షల పైగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో మూత పడిన ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి వెనుక భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రైతులను ఇబ్బంది పెడుతున్న వ్యవహారంలో ఎన్హెచ్ఏ, రాధా టీఎంటీ, పాత ల్యాంకో యాజమాన్యాల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి చొరవ చూపటం లేదు. ఆ ప్రాంతంలో టవర్లు మార్చితే, తమ పొలాలు పోతాయనే ఉద్దేశంతో రైతులు అడ్డుకుని టవర్ల ఎత్తు పెంచితే సరిపోతుందనే వాదనకు వారు తెర లేపారు. ప్రభుత్వం తలొగ్గి టవర్ల ఎత్తు పెంపునకు నిర్ణయం తీసుకున్నా.. కోర్టులో ఉన్న కేసు ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. దీనికి పరిష్కారం చూపడంలో ప్రభుత్వంతోపాటు, ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఈ బైపాస్ పనులు పూర్తి అయితే , విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బైపాస్ అందుబాటులోకి వస్తే విజయవాడ–విశాఖపట్నం, విశాఖపట్నం–విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఉదాహరణకు చినఅవుటుపల్లినుంచి వారధి వరకు ప్రయాణం చేయాలంటే గంటనుంచి గంటన్నర సమయం పడుతోంది. ఇదే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తే కేవలం 15 నిముషాలలోపే చేరుకొనే అవకాశం ఉంది. దీనికితోడు విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వ హయంలో డీపీఆర్ సిద్ధం చేసిన తూర్పు బైపాస్ రోడ్డు పనులకు కూటమి ప్రభుత్వం మోకాలు అడ్డుపెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు సాకుగా చూపి దీనికి మంగళం పాడింది. గత ప్రభుత్వ హయాంలో.. గత ప్రభుత్వ హయంలోనే 98 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి . కేవలం ప్యాకేజి –3 కింద చిన అవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి సంబంధించి కేవలం 300 మీటర్ల మేర మాత్రమే మిగిలింది. 2024 జనవరిలో ప్రజలకు బైపాస్ను అందుబాటులోకి తెచ్చే యత్నం చేసింది. టవర్ల షిఫ్టింగ్ , సాంకేతిక సమస్యలను సాకుగా చూపి, టీటీపీ నేతలే రైతుల ముసుగులో పనులను అడ్డుకున్నారు. రూ.1,148కోట్లతో , పనులను మెగా సంస్థ ఫిబ్రవరి 2021లో చేపట్టింది. ఈ రహదారి కోసం 14 గ్రామాల్లో భూసేకరణ చేశారు. కృష్ణా జిల్లాలో వెదురుపావులూరు, రామచంద్రాపురం, కొండపావులూరు, బీబీ గూడెం, గన్నవరం, చిన్న అవుటుపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపల్లి, జక్కంపూడి, అంబాపురం, పి.నైనవరం, పాతపాడు, కెవీ కండ్రిక, నున్న గ్రామాల పరిధిలో మొత్తం 188.92 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికోసం రూ.416.60 కోట్లు ఖర్చు చేశారు. వెస్ట్ బైపాస్ ప్రారంభమెప్పుడో! చినఅవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర బైపాస్ 98 శాతానికి పైగా పనులు పూర్తి గత ప్రభుత్వంలో రోడ్డు పనులుప్రారంభం కాకుండా కుట్ర కొలిక్కి రాని ల్యాంకో టవర్ల సమస్య పట్టించుకోని ప్రభుత్వం ల్యాంకో ట్రాన్స్మిషన్ల టవర్ల ప్రధానంగా బైపాస్ రోడ్డుకు మధ్యలో హై ఓల్టేజీ విద్యుత్తు లైన్లు వెళుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఒకచోట, ఎన్టీఆర్ జిల్లాలో 12 చోట్ల ఏపీ ట్రాన్స్కో, ల్యాంకో, పవర్గ్రిడ్కు సంబంధించిన విద్యుత్ లైన్లను మార్చాలింది. ఇందులో గత ప్రభుత్వం చొరవ చూపటంతో కోర్టు కేసులను అధిగమించి రూ.15 కోటత్లో ఏపీ ట్రాన్స్కో, పవర్ గ్రిడ్ విద్యుత్ లైన్లను మార్చారు. అయితే ప్రస్తుతం 300 మీటర్లు జక్కంపూడి, గొల్లపూడి మధ్య ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి సమస్య జటిలంగా మారింది. ల్యాంకో చెందిన ట్రాన్స్ మిషన్కు సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిటీ నుంచి లైసెన్సు లేదు. ఈ లైసెన్సు లేని సంస్థకు చెందిన టవర్లను మార్చే అధికారం ఎన్హెచ్ఏకు లేదు. -
మా స్కూలు మాకు కావాలి!
చిలకలపూడి(మచిలీపట్నం): తమ గ్రామంలో ఉన్న పాఠశాలను అక్కడే కొనసాగించాలని గుడ్లవల్లేరు మండలం కౌతవరం హరిజనవాడకు చెందిన గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం వారు మచిలీపట్నంలో డీఈవో పీవీజే రామారావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 117 ను అనుసరించి తమ గ్రామంలోని పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతులను రద్దు చేసి కిలోమీటరు దూరంలో ఉన్న కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారని తెలిపారు. ఆ పాఠశాలకు వెళ్లే రహదారి ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని, అంతేకాకుండా గుడివాడ – మచిలీపట్నం రహదారి దాటాల్సి ఉన్నందున విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఇరువురు పిల్లలు ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో ఉన్న పాఠశాలలోనే 3, 4, 5 తరగతులను పునరుద్ధరించాలని వారు అభ్యర్థించారు. రెండున్నర కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామ శివారు ఆనందపురంలో ఎప్పటి నుంచో మండల పరిషత్ పాఠశాల నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రెండున్నర కిలోమీటర్లు దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లమంటున్నారని టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ కంభం రమేష్బాబు తెలిపారు. తమ గ్రామంలోని పాఠశాలలో ప్రస్తుతం 14 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడిని నియమించారని, అయితే ఇంకో ఉపాధ్యాయుడిని నియమించి ఇక్కడే కొనసాగిస్తే గ్రామంలో మరికొంత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్నారు. పాఠశాలను మూసివేస్తే ఉయ్యూరు, ఆకునూరు, గండిగుంట వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారని ఆయన డీఈవోకు వివరించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉన్న పాఠశాలలోనే మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యను బోధించాలని కోరారు. ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన విన్నవించారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోంది డీఈవో పీవీజే రామారావుకు గోడు వెళ్లబుచ్చుకున్న గ్రామస్తులు -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
అధికారులకు కలెక్టర్ ఆదేశం చిలకలపూడి(మచిలీపట్నం): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం సాయంత్రం రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించిన బృందం సమస్యను పరిష్కరించిన అనంతరం కూడా అదే బృందం పర్యటించి అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక అందజేయాలన్నారు. 2025 మే నెలలో జిల్లాలో మొత్తం 69 రోడ్డు ప్రమాదాలు సంభవించగా వాటిలో 38 మరణాలు, 80 మంది గాయాలపాలయ్యారన్నారు. జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. కానూరు నుంచి పెనమలూరు వరకు ఉన్న జాతీయ రహదారి డివైడర్పై రెయిలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర జంక్షన్లు, హైవే నుంచి సర్వీసు రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందజేసి మరణాల సంఖ్య తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రవాణాధికారి మనీష, జాతీయ రహదారుల పీడీ విద్యాసాగర్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శర్మిష్ట, ఆర్టీసీ డీఎం పెద్దిరాజు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చల్లపల్లి: ఊక లోడు తో వస్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండు స్కూటీలు, ఒక బైకు, ఒక మినీ లారీ దెబ్బతిన్నాయి. చివరకు లారీ రెండు ఇళ్ల మధ్య ఉన్న సందు లోకి దూసుకుపోయి ఆగింది. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అవనిగడ్డకు చెందిన ఈ లారీ రేపల్లె మండలం పేటేరులోని ఒక రైసు మిల్లులో ఊక నింపుకొని పులిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా గుడివాడకు వెళ్లేందుకు బయలుదేరింది. చల్లపల్లిలోని పాగోలు రోడ్డువద్ద గల బ్రహంగారి గుడి వద్దకు రాగానే ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పాములా దూసుకురావడం ప్రారంభించింది. తొలుత ఒక మినీట్రాన్స్పోర్టు వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టగా, ఆ వ్యాను ఛాసిస్ ముందుకు జరిగి ఇంజన్ను నొక్కటంతో అది నడిరోడ్డు మీదే ఆగిపోయింది. తర్వాత ఊకలారీ పాత ఇనుపసామాను కొట్టు వద్ద పనిచేస్తున్న వ్యక్తిపైకి దూసుకురాగా, అతను గమనించి పక్కకు తప్పుకోగా లారీ అక్కడ ఉన్న ఒక స్కూటీని ఢీకొట్టి రెండు ఇళ్ల మధ్య ఉన్న సందులోకి దూసుకుపోయి ఆగింది. అక్కడ ఉన్న ఒక స్కూటీ, బైక్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. పక్కన ఉన్న షెడ్డు పాక్షికంగా దెబ్బతింది. కరెంటు స్తంభానికి ఉన్న సర్వీసు వైర్లు తెగిపడ్డాయి. ఇంత బీభత్సం సృష్టించినా ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఊక లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రెవెన్యూ శాఖ సేవలు వెలకట్టలేనివి
చిలకలపూడి(మచిలీపట్నం) : రెవెన్యూశాఖ అందించే సేవలు వెలకట్టలేనివని, అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ వరదలు, తుపానుల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సేవలు అందించేది రెవెన్యూ విభాగమేనన్నారు. ఏ ప్రభుత్వంలో పనిచేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డీకె బాలాజీ, ఎస్పీ గంగాధరరావు తదితరులు మాట్లాడుతూ రెవెన్యూ సేవలను కొనియాడారు. అనంతరం రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఉద్యోగుల వారసులు 64 మందికి కారుణ్య నియామక పత్రాలు అంద జేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో కె.స్వాతి, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయకుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ వీరాంజనేయప్రసాద్, ఎంవీ శ్యామ్నాఽథ్, పేటేటి సత్యనారాయణ, రిటైర్డ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎవరి దారి వారిదే... రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి ఎవరి దారి వారిదే లాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి ఎంపీ బాలశౌరి హాజరయ్యారు. ఆయన ప్రసంగం పూర్తయిన తరువాత వెళ్లిపోయారు. తరువాత మంత్రి కొల్లు రవీంద్ర కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన మసులా బీచ్ ఫెస్టివల్ నాలుగురోజుల కార్యక్రమాల్లో కూడా ఎంపీ బాలశౌరి ఎక్కడా లేకపోవటంతో వీరిరువురి మధ్య అంతరం పెరిగిందని టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఆర్టీసీ ప్రయాణికుల అగచాట్లు
ఆటోనగర్(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులను విశాఖపట్నానికి మళ్లించడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా సిటీ, లైన్ సర్వీసులు సరిపడా రాకపోవడంతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. నిత్యం మచిలీపట్నం,పామర్రు, ఉయ్యూరు, కంకిపాడుతోపాటు పలు గ్రామాల నుంచి పనులకు వస్తుంటారు. కేవలం నాన్స్టాప్ బస్సులను మాత్రమే ఆర్టీసీ అధికారులు నడపడంతో మిగతా గ్రామాల నుంచి విజయవాడకు ప్రయాణికులు రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఆటోనగర్ బస్టెర్మినల్ వద్ద వివిధ గ్రామాలకు వెళ్లడానికి ప్రయాణికులు నిలువ కాళ్లపై ఎదురు చూడాల్సి వచ్చింది. గంటకు ఒక బస్సో... గంటన్నరకు మరొక సిటీ బస్సు రావడంపై ఇంటికి ఎలా వెళ్లాలో అర్థంకాక తలపట్టుకున్నారు. మచిలీపట్నం. గుడివాడ, కై కలూరు, భీమవరానికి మాత్రమే నాన్స్టాప్ బస్సులను అరకొరగానే నడిపారు.రెండో రోజూ అరకొర బస్సులతో సరి -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యదాన నిమిత్తం శుక్రవారం రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. ఘంటసాల మండలం తూర్పులంకపల్లికి చెందిన వీరమాచనేని ప్రతాప్కుమార్, రోజా పావని దంపతులు వారి కుమార్తె థాన్వి పేరుమీద రూ. 54 వేల విలువైన కూరగాయల కటింగ్ మిషన్, నిత్యాన్నదాన పథకానికి మరో రూ. 46,116 విరాళంగా అందజేశారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం విరాళాన్ని చెక్కు రూపంలో సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదననరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. టీటీఈ నిజాయతీ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): నిబద్ధతతో ఉండేవారు నీతినిజాయతీతో ఉంటారు. దీనికి నిదర్శనం టీటీఈ అవినాష్. వివరాల్లోకి వెళ్తే అతను విజయవాడ డివిజన్ కమర్షియల్ విభాగంలో టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్). రైలులో ప్రయాణికులు మర్చిపోయిన బంగారం, నగదు కలిగిన బ్యాగును గుర్తించి ఆర్పీ ఎఫ్ సిబ్బంది సహకారంతో శుక్రవారం వాటి యజమానులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. విజయవాడలో టీటీఈగా చేస్తున్న అవినాష్ గౌతమి ఎక్స్ప్రెస్లో రాయనపాడు నుంచి కాకినాడ టౌన్ మధ్యలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఏ3 కోచ్లో 35వ నంబర్ బెర్త్ కింద గుర్తు తెలియని లగేజీని గుర్తించాడు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించి వారు వచ్చిన తర్వాత ప్రయాణికుల సమక్షంలో బ్యాగును తెరచి చూడగా అందులో రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 37 వేల నగదు లభ్యమైంది. వీటితో పాటు ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు ఉండటంతో బ్యాగు యజమానులను గుర్తించి ఆర్పీఎఫ్ పోలీసుల సమక్షంలో వారికి అప్పగించారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం రాంబాబు.. అవినాష్ నిజాయతీని ప్రశంసించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి హనుమాన్జంక్షన్ రూరల్: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఈగల్ చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలోని మోహన్ స్పిన్టెక్స్ కర్మాగారంలో ‘నో డ్రగ్స్ నో టెంక్షన్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాదకద్రవ్యాల నియంత్రణపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయిని సమూలంగా నిర్మూలించాలని పిలుపు నిచ్చారు. గంజాయిపై ఎలాంటి సమాచారమైన ఈగల్ టీంకు ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వాలని ఐజీ కోరారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, హనుమాన్జంక్షన్ ఎస్ఐ–2 నరసింహమూర్తి పాల్గొన్నారు. ఒంటి కాలిపై వినూత్న నిరసన మచిలీపట్నంటౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ బందరు నవకళ సెంటర్లో శుక్రవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ(న్యూ) వంటి కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు ఒంటికాలిపై నిల్చుని వినూత్న నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రపు పోలి నాయుడు మాట్లాడుతూ కార్మికుల పనిగంటలను ఎనిమిది నుంచి పది గంటల వరకు పెంచడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకు వామపక్షాల ఐక్య పోరాటాలే ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. ఏఐటీయూఎఫ్ నేత వెంకటరామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తానా అంటే తందానా అన్నట్టుగా వ్యవహరించడాన్నీ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, మండల కార్యదర్శి చిరువోలు జయరావు, ఏఐటీయూసీ నాయకులు ఒంటిపులి లక్ష్మణరావు, ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యోగా.. వారసత్వ సంపదలో కలికితురాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతీయ వారసత్వ సంపదలో యోగా కలికితురాయి అని వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి ఎలీసా రేనాల్డ్స్ అన్నారు. కృష్ణా నదిలో ‘యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా’ ఈవెంట్ను నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. ఇటీవల కృష్ణా నదిలో నిర్వహించిన ‘యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా’ ఈవెంట్లో పడవలపై వేలాదిమంది యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి ఫ్రాన్స్కు చెందిన ఎలీసా రేనాల్డ్స్.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేనాల్డ్స్ మాట్లాడుతూ భారతదేశం యోగాసనాలతో ప్రపంచానికి అమూల్యమైన బహుమతి ఇచ్చిందన్నారు. యోగా వంటి ఆరోగ్య విధానం బృహత్తర రికార్డులకే పరిమితం కాకూడదని, అందరూ తప్పక ఆచరించాలని ఎలీసా రేనాల్డ్స్ సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ టీమ్ ఎన్టీఆర్ కృషి.. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు అందరి సహకారంతోనే వరల్డ్ రికార్డు సాధించగలిగామన్నారు. కార్యక్రమంలో లంకా దినకరన్, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, సబ్కలెక్టర్ కె.చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి (ఫ్రాన్స్)ఎలీసా రేనాల్డ్స్ -
కూటమి ఎమ్మెల్యేపై టీడీపీ నేతల ఫైర్
అవనిగడ్డ: కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల తీరుపై స్థానిక టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలనే కుట్రలను సాగనివ్వమని హెచ్చరించారు. ‘‘మీరు ఏం చేసినా ఊరుకుంటారనుకుంటున్నారేమో.. ప్రజలు కన్నెర్ర జేస్తారు.. తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది’’ అంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. కోడూరు మండలంలో 13 పంచాయతీల టీడీపీ గ్రామకమిటీ ఎన్నికల తీరుపై గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. కోడూరు మండల సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు బత్తిన దాస్ ఈ కార్యక్రమానికి విచ్చేయగా ఆయన ముందే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడడం గమనార్హం. అధికారంలో ఉన్నా ఏం చేయలేకపోతున్నాం: టీడీపీ మండల అధ్యక్షుడు బండే పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాస రావు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారని, అది ఎన్నటికీ జరగదని, పార్టీని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారని అన్నారు. పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి లెటర్ ఇవ్వమంటే ఇవ్వరని, పదవుల్లో టీడీపీ, జనసేనకు ఫిప్టీ ఫిప్టీ అనే సూత్రాన్ని పాటించడం లేదని, గ్రామాల్లో ఒక్క కార్యకర్తకు పనిచేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండ లంలో మొత్తం 70 సీసీ రోడ్లు వేస్తే ఒక్క రోడ్డు కూడా టీడీపీ నాయకుడు, కార్యకర్తకు ఇవ్వలేదని, ఇదేం న్యాయమని నిలదీశారు. అవసరమైతే మన సమస్యలు చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గరకో, లోకేష్ దగ్గరకో వెళదామని, పనిచేసే కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. మండల స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకూ జరిగే బదిలీలన్నీ ఎమ్మెల్యే కుటుంబ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. రాజాబాబు ఏమన్నా తోపా? ఏదైనా అంటే జనసేన నాయకుడు రాజా బాబుకు చెబుతామంటున్నారని, రాజా బాబు ఏమన్నా తోపా అని వి.కొత్తపాలెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడు మండి పడ్డారు. తామందరం లేకుండా రాజాబాబు వచ్చారా... ఎన్నికలప్పుడు కాళ్లూ, గడ్డాలు పట్టుకున్నారని, మీరు లేకపోతే దిక్కులేదన్నారని, అప్పుడేమో ఇళ్లకు వచ్చి బతిమ లాడారని.. ఇప్పుడేమో లెక్కచేయడం లేదని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు రాజా, అల్లుడు అశ్వినికుమార్ని ఉద్దేశించి ఓ టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిపెట్టుకో... ప్రజలు కన్నెర్ర చేసే రోజు దగ్గరలోనే ఉంది ముసుగులు వేసుకునే నాయకుడు ఒక్కో ముసుగు తీసి పార్టీలు మారుతున్నాడని, మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎదురు చెప్పేవారు లేరనుకుంటున్నారా అంటూ బడేవారిపాలెంకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న కార్యకర్తలెవరికీ న్యాయం జరగడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నామో, అధికార పక్షంలో ఉన్నామో అర్ధంకాని దుస్ధితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పనులు చేసే ఎమ్మార్వోలు, అధికారులు, పోలీసులను ఎమ్మెల్యే బదిలీ చేయిస్తున్నారని, మీరు చేసే దురాగాతాలను రాసిపెట్టుకోవాలని, ప్రజలు కన్నెర్ర జేసే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. కంగుతిన్న పరిశీలకుడు బత్తిన... స్థానిక జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడటంతో సమావేశానికి విచ్చేసిన మండల పరిశీలకుడు బత్తిన దాసు కంగుతిన్నారు. మండలంలో ఉన్న ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పి బుజ్జగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు మండిపడ్డ తీరు కూటమి పార్టీలు జనసేన, టీడీపీ మధ్య మరింత అగ్గి రాజేసినట్టయింది. కోడూరు టీడీపీ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు మండలంలో 70, 80 సీసీ రోడ్లు వేస్తే ఒక్కటీ టీడీపీ వారికి ఇవ్వలేదు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ టీడీపీ మండల అధ్యక్షుడు బండే -
భయంతో హత్య చేసిన మైనర్ బాలుడు
గుడ్లవల్లేరు: నాలుగు గోడల మధ్య కట్టేసి కొడితే... పిల్లి అయినా పులి అవుతుందన్న చందంగా... ఒక పాత నేరస్తుడిని ఒక మైనర్ బాలుడు హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా బయట పడింది. తనతో పాటు తన వారిని పాత నేరస్తుడు అస్తమానం వేధిస్తున్నాడన్న భయంతో ఒక మైనర్ బాలుడు ఆ పాత నేరస్తుడిని హత్య చేసిన సంఘటన గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ శివారు పసుభొట్లపాలెంలో జరిగింది. గుడ్లవల్లేరు పోలీస్స్టేషన్లో శుక్రవారం గుడివాడ సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు, గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య చేసిన నిందితుడితో పాటు దాచిన వ్యక్తుల్ని ప్రదర్శించారు. పోలీసుల కథనం మేరకు ఈ నెల 17న ఉదయం 7 గంటల సమయంలో పసుభొట్లపాలెంలోని దళితవాడలో చిన్నం వసంతరావు ఇంటికి ఎదురుగా సిమెంట్ రోడ్డు పక్కగా పంట బోదె గట్టుపై ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. మృతుడు పాతనేరస్తుడు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా... అదే గ్రామానికి చెందిన రేమల్లి వెంకట్రావు(45) అలియాస్ ముసలిగా గుర్తించారు. తల, ముఖంపై ఎవరో బలమైన ఆయుధంతో కొట్టి చంపి ఉంటారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేని క్లిష్టమైన ఈ కేసును సీఐ సోమేశ్వరరావు, ఎస్.ఐ సత్యనారాయణ ఛేదించారు. చనిపోయిన వెంకట్రావుతో పాటు ఒక మైనర్ బాలుడు అత్యంత స్నేహంగా ఉండేవాడు. అదే గ్రామంలో పదవ తరగతి వరకు చదివిన ఆ బాలుడు చదువు అబ్బక చెడు అలవాట్లకు లోనయ్యాడు. వెంకట్రావుతో పాటు ఆ బాలుడు పనులకు వెళుతూ ఉండేవారు. వచ్చిన డబ్బులతో మద్యం తాగి తిరుగుతూ స్నేహంగా మెలిగేవారు. మద్యం ఇప్పించమని తరచుగా వేధింపులు ఈ బాలుడిని వెంకట్రావు మందు ఇప్పించమని అస్తమానం వేధించేవాడు. ఇప్పించకపోతే చంపుతానని బెదిరించేవాడు. గతంలో వెంకట్రావు చేసిన హత్యను ఆ బాలుడికి కథలు కథలుగా చెప్పి భయ భ్రాంతులకు గురిచేస్తూ బెదిరించేవాడు. ఆ భయంతో వెంకట్రావు ఏం చెప్పినా...ఆ బాలుడు తప్పనిసరై చేసేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఇద్దరూ పనికి వెళ్లి వచ్చారు. వేర్వేరు చోట్ల, విడివిడిగా ఎవరు మందు వాళ్లు తాగారు. అనంతరం ఆ బాలుడు తనకు అన్నయ్య వరుసైన చిన్నం విజయకుమార్ అలియాస్ సుబ్బు అనే వ్యక్తి ఇంటిలో మరొక బాలుడితో కలిసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో వెంకట్రావు ఆ బాలుడు పడుకున్న ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి యజమాని విజయకుమార్ భార్య బత్తుల కావ్యశ్రీ తలుపు తీయకుండానే లేడని లోపలి నుంచే సమాధానం చెప్పింది. కొద్దిసేపటి తర్వాత వెంకట్రావు మళ్లీ ఆ ఇంటికి వెళ్లి ఆ బాలుడు కావాలంటూ వేధించసాగాడు. కావ్యశ్రీ మళ్లీ తలుపు తీయకుండానే బాలుడు ఇక్కడ లేడని చెప్పింది. అప్పుడు ఆమెను అబద్ధం చెబుతున్నావని వెంకట్రావు తిట్టాడు. వాడిని ఎందుకు దాస్తున్నావని అసభ్యపదజాలంతో దూషించాడు. వాడి సంగతి, నీ సంగతి తేలుస్తానంటూ తిట్టాడు. అతనితో ఎప్పటికైనా తనకు ప్రాణగండమని.. ఇదంతా లోపలి నుంచి గమనిస్తున్న ఆ బాలుడు వెంకట్రావు బతికి ఉంటే ఎప్పటికైనా తన ప్రాణానికి ప్రమాదం తప్పదనే భయంతో పక్కనే ఉన్న బలమైన ఇనుప రాడ్డును తీసుకుని వెంకట్రావు వెనుకే వెళ్లాడు. పక్కనే ఉన్న మరో బాలుడు ఆపుతున్నా ఆగలేదు. వెంకట్రావు తలపై బలంగా రెండు, మూడు సార్లు కొట్టగా వెంకట్రావు అక్కడే పడిపోయాడు. ఆ రాత్రి సమయంలో అప్పుడే పనికి వెళ్లి తిరిగి వచ్చిన విజయకుమార్ పడిపోయిన వెంకట్రావును పరిశీలించగా చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి కావ్యశ్రీకి, విజయకుమార్ తల్లి జయకు వెంకట్రావు చనిపోయాడని చెప్పారు. ఏమీ జరగనట్టుగానే ఆ రాత్రి వాళ్లు పడుకున్నారు. ఉదయాన్నే కావ్యశ్రీ ఇనుప రాడ్డును ఎవరికీ అనుమానం రాకుండా తీసుకుని వెళ్లి, వాళ్ల అమ్మమ్మ ఇంట్లోని నీళ్ల బావిలో పడవేసింది. విజయకుమార్, జయ కూడా నేరాన్ని ఎవరికీ చెప్పకుండా దాచారు. పోలీసులు తమ పద్ధతిలో కేసు దర్యాప్తు చేసి హత్య కేసును ఛేదించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 7.30 గంటలకు నేరం చేసిన వారితో పాటు నేరం దాచిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, దుస్తులను సీజ్ చేశారు. అనుమానాస్పద మృతిని హత్యగా కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టుకు అప్పగించారు. పసుభొట్లపాలెం హత్య కేసును ఛేదించిన పోలీసులు -
డీసీఎంఎస్ చైర్మన్గా రామకృష్ణ బాధ్యతల స్వీకారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్గా బండి రామకృష్ణ శుక్రవారం విజయవాడ సూర్యారావుపేటలోని డీసీఎంఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. డీసీఎంఎస్ పరిధిలో ఉన్న భూములు, గిడ్డంగులు, మూల నిధులు, రావాల్సిన నిధుల గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం పని చేస్తుందని, అన్నదాతకు మేలు చేసే విధంగా సొసైటీని తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అతి తక్కువ ధరకు లభ్యమయ్యేలా సొసైటీ పరిధిలో నూతన దుకాణాలను 15 రోజుల్లో ఏర్పాటు చేసి అన్నదాతకు మేలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బిజినెస్ మేనేజర్ యు.వి.ప్రసాద్ రావు, మేనేజర్ ఆర్. రమేశ్ బాబు, వి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మెరుగైన సేవలు అందించాలి
మచిలీపట్నంటౌన్:కృష్ణా జిల్లా సహకార మార్కిటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి రామకృష్ణ ఆ సంస్థ ద్వారా జిల్లాలోని రైతులకు మెరుగైన సేవలు అదించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. డీసీఎంఎస్ చైర్మన్గా నగరానికి చెందిన బండి రామకృష్ణ బుధవారం రాత్రి ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు సేవలందంచేందుకు ఈ పదవి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఇచ్చిన ఈ బాధ్యతల్ని కష్టపడి పని చేస్తూ రైతులకు సేవలు అందిస్తానని చెప్పారు. అనంతరం రామకృష్ణను పలువురు శాలువాలు, పూల మాలలు, బొకేలతో సత్కరించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావ్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, బీసీ సంఘ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, మార్కెట్యార్డ్ చైర్మన్ కుంచే నాని, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా ఆస్పత్రి మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీసీఎంఎస్ చైర్మన్గా బండి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ -
జీవన విధానంలో యోగా ఒక భాగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రాకు తొలి అడుగు యోగాంధ్ర అని చెప్పారు. 30 రోజులుగా జిల్లాలో గ్రామగ్రామాన, పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని పేర్కొన్నారు. ఒత్తిడిని మన జీవితంలోకి అడుగుపెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతిరోజూ యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.రమేష్, ఫిజికల్ డైరెక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
రాజధానిలో మొక్కలకు డ్రోన్లతో వర్మీవాష్
తాడికొండ: రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు, మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర పూల మొక్కలకు డ్రోన్ల ద్వారా వర్మీవాష్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని చెప్పారు. ప్రధానంగా ఈ పద్ధతిలో డ్రోన్ల ద్వారా జరిగే ప్రక్రియలో మొక్క పైనుంచి కింది భాగం వరకు పోషకాలు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా పూలు అందంగా పూయడంతో పాటు రహదారులు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పారు. -
జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం
పెనమలూరు:విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డుపై గంగూరు సెంటర్లో గురువారం లారీ–కారు బీభత్సం సృష్టించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. గంగూరు సెంటర్లో ఉదయం క్వారీ డస్టు లోడ్తో విజయవాడ నుంచి కంకిపాడు వైపునకు వెళుతున్న లారీని గంగూరు సెంటర్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఓవర్ టేక్ చేసింది. ఈ లోగా కారుకు మరో వాహనం ఎదురుగా అడ్డు రావటంతో కారు ఒక్కసారిగి లారీ ముందుకు వచ్చి తగిలింది. దీంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో లారీ అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపైనే పల్టీ కొట్టింది. లారీలో ఉన్న డస్టు రోడ్డు పై పడింది. కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. అయితే ప్రమాద స్థలంలో ఆ సమయంలో ఎవ్వరూ లేక పోవటంతో ప్రాణ నష్టం జరగలేదు. లారీ ఒక్కసారిగా రోడ్డు పై పల్టీ కొట్టడంతో గంగూరు సెంటర్లో ఉన్న జనాలు తీవ్ర ఆందోళన చెందారు. డివైడర్ మధ్యలో ఉన సిగ్నెల్ లైట్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకోని క్రేన్తో రోడ్డు పై పడిన వాహనాలను తొలగించారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: సుపరిపాలన– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ తేజ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నవీన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ, డీటీ వసంతరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వం విఫలం
వరి విత్తనాల సరఫరాలోతోట్లవల్లూరు: రైతులకు వరి విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ విమర్శించారు. మండలంలోని గరికపర్రులో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి విత్తనాలు దొరకడం లేదని, బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు కై లే దృష్టికి తీసుకువచ్చారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని అనిల్కుమార్ గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల పేరు మార్చడమే కాకుండా వాటిని రైతులకు సేవలందించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. విత్తనాలు దొరకక రైతులు వ్యాపారులు, రైస్మిల్లర్లను ఆశ్రయించే పరిస్థితులు దాపురించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతుల అవసరాలకు తగినట్లుగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని అనిల్కుమార్ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ కళ్లం శివారెడ్డి, సర్పంచ్లు బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్, నాయకులు నడకుదురు రాజేంద్ర, చింతలపూడి గవాస్కర్రాజు, చింతలపూడి సుబ్బారావు, మైనేని వేమూరి కృష్ణబాబు, తారాచంద్, బోలెం చంటి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ -
జిల్లాలోని 4,470 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు
చిలకలపూడి(మచిలీపట్నం):అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4,470 ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీన యోగా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో యోగా కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడిగడప, ఉయ్యూరు మునిసిపాల్టీల్లో, బంటుమిల్లి, మొవ్వ, నాగాయలంక మండలాల్లో శిక్షణా తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తామని అక్కడ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా అదే రోజు నిర్వహించాల్సి ఉన్నందున యోగా కార్యక్రమం పూర్తయిన తరువాత పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పారు. మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛాంధ్ర పై యోగా, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలన్నారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, డీఈవో పీవీజె రామారావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నిమ్మకూరు(పామర్రు): యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధించవచ్చని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. ఫణి ధూర్జటి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం గురుకుల పాఠశాల, కళాశాల, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని చెప్పారు. ప్రతి రోజూ వ్యాయామం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. యోగ గురువు ముదిగొండ శాస్త్రి ఆధ్వర్యంలో స్వల్ప, సులభతర, వ్యాయామం, భ్రమర కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో నిర్వహించిన ఈ యోగ శిక్షణలో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం ప్రముఖులను ఎస్వైఎల్ఎన్ ఆచార్యులు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కన్వీనర్ తురగా ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ తాండవ శిక్షణ, అన్నదాన కమిటీ సభ్యులు ఎ. నెలబాలుడులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.జ్యోతి, ఎంఈఓ – 2 గుమ్మడి పద్మవాణి, పాఠశాల హెచ్ఎం ఎం.లక్ష్మీలత, గ్రామసర్పంచ్ పి. దుర్గా శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎం.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి ధూర్జటి -
మోపిదేవిలో కలెక్టర్ బాలాజీ పర్యటన
మోపిదేవి: మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం తనిఖీలు నిర్వహించారు. మోపిదేవి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. బాత్రూముల డోర్లు పర్మినెంట్గా ఉండేవి ఏర్పాటు చేయాలని, త్వరితగతిన భవన నిర్మాణం పూర్తిచేయాలని అదికారులకు సూచించారు. రావివారిపాలెంలో పీహెచ్సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మందుల విభాగాన్ని, ప్రయోగశాలను తనిఖీ చేశారు. గదులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ దుర్గావాణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పాముకాటుకు విరుగుడు మందు, రాబిస్ వ్యాధి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపురంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి భూ రీ సర్వేపై గ్రామస్తులతో మాట్లాడారు. 11/1 కాలువ చివరలో పూర్తిగా పూడుకు పోయినందున కాలువ చివరి భూములకు నీరు అందడం లేదని పలువురు రైతులు కలెక్టర్కు తెలిపారు. స్థానిక జెడ్పీపాఠశాల, ఆంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం కలిగిన ఆహారం అందించాలని ఆదేశించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, అదనపు డీఎంహెచ్వో వెంకటరావు, తహసీల్దార్ శ్రీవిద్య, ఎంపీడీవో స్వర్ణభారతి, సీహెచ్సీ డాక్టర్లు అనిల్కుమార్, లక్ష్మీనాఽథ్, వార్డెన్ నాగలక్ష్మీ, మాజీ సర్పంచ్ అబ్బూరి నాంచారయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్య‘యోగా’న్ని వదలొద్దు
కలెక్టర్ డీకే బాలాజీ మోపిదేవి: యోగాతో జీవిత కాలం ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మండల కేంద్రం మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్న తనం నుంచి యోగా అలవాటు చేసుకోవడం వల్ల జీవితకాలం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల దేహం రబ్బరు మాదిరి వంగే గుణం ఉంటుందని తద్వారా ఆరోగ్య ప్రయాజనాలు చేకూరుతాయని వివరించారు. జిల్లా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే యోగాను జీవనశైలిలో తప్పని సరిగా భాగం చేసుకోవాలన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన.. తొలుత ప్రత్యేక యోగా శిక్షకులు రెబ్బా శాస్త్రి నమస్కార ముద్ర ప్రార్థన గీతంతో ప్రారంభించి యోగాసనాలు వేయించి ప్రతిజ్ఞ చేయించారు. యార్లగడ్డ విద్యార్థులు యోగా విన్యాసాలతో చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు, కృష్ణాజిల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. రాంజీ, మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, డీఎస్పీ విద్యశ్రీ, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పర్యాటకశాఖ అధికారి జి. రామ లక్ష్మణరావు, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘దూర విద్య’తో ఆదరువు
మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సార్వత్రిక చదువులకు ఆదరణ తగ్గింది. 2024–25 అడ్మిషన్లు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో కోర్సుల నిర్వహణకు 65 కేంద్రాలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ కలిపి 2022–23లో 7,388 మంది చేరగా, 2023–24లో 8,945 మంది, 2024–25లో 7,020 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే అడ్మిషన్లు గతేడాది తగ్గాయి. అడ్మిషన్ల కోసం తత్కాల్ అవకాశం ఇచ్చినా ఏ మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఓపెన్ విద్యకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గతేడాది తగ్గుముఖం పట్టిన ఓపెన్ విద్య అడ్మిషన్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని, విద్యార్థులు సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. రెగ్యులర్ కోర్సులతో సమానం.. అనివార్య కారణాలతో చదువులు మధ్యలోనే ఆపేసినవారు.. ఉద్యోగోన్నతుల కోసం, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, నాల్గో తరగతి ఉద్యోగులు ఎక్కువగా ఓపెన్ విద్యలో చేరతారు. రెగ్యులర్గా పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివి ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు కూడా సార్వత్రిక విద్యవైపు మొగ్గు చూపుతారు. రెగ్యులర్ కోర్సులతో సమాన గుర్తింపు ఉన్నందున ఓపెన్ టెన్త్, ఇంటర్ కూడా విద్యార్థుల నుంచి క్రేజ్ ఉంది. అయితే గతేడాది విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గింది. విద్యాశాఖపై పెత్తనం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖపై పెత్తనం మొదలైంది. కొంతమంది కార్పొరేట్ పెద్దలు సార్వత్రిక (ఓపెన్) విద్యను వ్యాపారం చేశారు. తరగతుల నిర్వహణ సవ్యంగా సాగలేదన్న విమర్శలూ ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. రెగ్యులర్ కోర్సులకు దీటుగా సార్వత్రిక విద్యను సైతం పటిష్టం చేసేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. కేంద్రాల్లో తరగతుల నిర్వహణకు కూడా నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకటించింది. ఏపీ ఓపెన్ స్కూల్ నుంచి స్టడీ సెంటర్లుగా గుర్తింపు ఉన్న ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఏడాదిలో తప్పనిసరిగా 30 థియరీ తరగతులు, ఇంటర్మీడియెట్ కోర్సు వారికి అదనంగా 20 ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేలా షెడ్యూల్ చేసింది. పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు అందేలా చర్యలు గత ప్రభుత్వం తీసుకుంది. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల వివరాలు.. విద్యాసంవత్సరం పదో తరగతి ఇంటర్మీడియెట్ 2022–23 2,226 5,162 2023–24 2,986 5,959 2024–25 2,223 4,797 ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.. ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంట ర్మీడియెట్ కోర్సులలో ప్రవేశాలకు జూన్ 12వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించాం. జూలై 30తో దరఖాస్తులు స్వీకరణ ముగుస్తోంది. నిర్దేశిత ఫీజుతో పాటు అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు జూలై 31వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో ఆగస్టు 1వ తేదీ నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. – ఎం. డేవిడ్ రాజు, అసిస్టెంట్ కమిషనర్, పబ్లిక్ పరీక్షలు సద్వినియోగం చేసుకుంటే ఉన్నతికి సోపానం రెగ్యులర్ కోర్సులతో సమానంగా ఓపెన్ టెన్త్, ఇంటర్కు గుర్తింపు ఏటికేడు తగ్గుతున్న అడ్మిషన్లు కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలంటున్న విద్యావేత్తలు రెండు జిల్లాల్లో 65 కేంద్రాల్లో కోర్సుల నిర్వహణ జూలై 30వరకూ దరఖాస్తులకు అవకాశం -
రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం
కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేశామని డిజిటల్ మాధ్యమాల ద్వారా రైతులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. బ్యాంకు కార్యాలయంలో పీఏసీఎస్ సిబ్బందికి కంప్యూటరీకరణపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలు కంప్యూటరీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ సేవా కార్యక్రమాలు సహకార సంఘాలకు అనుసంధానించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో మీ–సేవా ద్వారా రైతులకు ఎన్నోరకాల సేవలను అందించేవారన్నారు. ప్రస్తుతం రైతులకు 1బీ, అడంగల్ వంటి భూ సంబంధిత పత్రాలను భవిష్యత్తులో సహకార సంఘాల ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కేడీసీసీబీ సీఈవో ఎ. శ్యామ్మనోహర్, జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, ఆప్కాబ్ ఏజీఎం అశోక్, డీపీడీఎంజీ పవన్కుమార్, పి. జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు పొలం పనులకు రావటం చాలా కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలు, రోటోవేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ భూమ్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ టెల్లర్స్ వంటి యంత్ర పరికరాలను 50 శాతం రాయితీతో అందజేస్తోందన్నారు. ముందస్తు రాయితీపై పనిముట్లను ఆగ్రో సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. తన పొలంలో పని పూర్తయిన తరువాత ఇతర రైతులకు కూడా అద్దెకు ఇచ్చుకోవచ్చన్నారు. తొలుత వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 121 మంది రైతులకు రూ. 4.10 కోట్ల విలువ చేసే యంత్ర పరికరాలకు సంబంధించి రూ. 1.90 కోట్ల రాయితీ చెక్కును రైతులకు అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు, ఏడీ మణిధర్, ఏవోలు పలువురు రైతులు పాల్గొన్నారు. డ్రోన్లను వినియోగించండి.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి మోపిదేవి మండలానికి చెందిన రైతు గ్రూపునకు రూ.10లక్షలు విలువ చేసే డ్రోన్లను 80 శాతం సబ్సిడీతో అందజేశారు. రసాయనాలు వెదజల్లాలంటే ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని డ్రోన్ల ద్వారా కేవలం రూ. 200 మాత్రమే ఖర్చవుతుందన్నారు. జిల్లాలో 32 రైతు సంఘాలకు డ్రోన్లు మంజూరు చేశామని 15 సంఘాలు మాత్రమే ముందుకు వచ్చాయన్నారు. -
నీటిపై ఆసనం.. ఆరోగ్యదాయకం
నాగాయలంక: యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని స్థానిక శ్రీపాద క్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన జలయోగా విజయవంతంగా ముగిసింది. తొలుత కలెక్టర్ డీకే బాలాజీ కృష్ణవేణి విగ్రహానికి, శ్రీరామలింగేశ్వరస్వామికి పూజలు చేసి, గాలిలోకి బెలూన్లు వదిలి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దివిసీమ, ప్రధానంగా నాగాయలంక ప్రాంతాన్ని పర్యాటక, జలక్రీడల అభ్యున్నతితో దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈవెంట్లో విజయవాడ తదితర పాంతాల నుంచి ఈతలో నిష్ణాతులైన 150మందికి పైగా ఈ జలయోగాలో ప్రాతినిధ్యం వహించారు. విజయవాడలోని అమరావతి వాకర్స్, ఈత మిత్రులు, ఫిషరీస్ పాలిటెక్నిక్ విద్యార్థులు పర్యవేక్షణలో నదిలో యోగా కొనసాగింది. రెవెన్యూ, ఆయుష్ విభాగం, మత్స్యశాఖ, పోలీసులు, పంచాయతీ వర్గాలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు.. నదిలో జరిగిన యోగాలో చంద్ర నమస్కారాలు, శవాసనాలు, పద్మాసనాలు, ప్లవర్ ఆకృతిలో ఆసనాలను అభ్యాసకులు అద్భుతంగా ప్రదర్శించారు. 50ఏళ్లు పైబడిన కడవకొల్లు లలిత, దివ్యాంగుడు తలశిల రాము, ఏడేళ్ల బాలిక నిత్యశ్రీ ప్రియ ప్రదర్శించిన ఆసనాలు వీక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆసనాలను ఆద్యంతం తిలకించారు. అనంతరం నాగాయలంక జలయోగా ప్రదర్శన తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు అయినట్లు ఆ సంస్థ నిర్వాహకుడు సీహెచ్ వెంకటాచారి ప్రకటించారు. అందుకు సంబంచి మెమెంటో, పత్రాలను కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మకు అందజేశారు. నాగాయలంకలో ఉత్సాహంగా జల యోగా ప్రారంభించిన కృష్ణా కలెక్టర్ బాలాజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు -
కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి
ఏఐఎస్ఎఫ్ నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సాగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) బుధవారం నిరసన వ్యక్తం చేసింది. ఎంజీ రోడ్డులో ఇందిరా టవర్స్ వద్ద ఓ కార్పొరేట్ కళాశాల వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్లు మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, దుస్తులు వంటివి కూడా విక్రయం చేస్తున్నారన్నారు. నోట్ పుస్తకాలు సైతం విక్రయాలు జరపడమేంటని ప్రశ్నించారు. అనంతరం మాచవరం పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘం నేతలపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, వారిని ఈడ్చుకుంటూ వెళ్లి జీపు ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ కార్పొరేట్ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న తమపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు వీధి రౌడీల్లా విద్యార్థి సంఘ నాయకుల పట్ల వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసుస్టేషన్లో ఉన్న విద్యార్థి సంఘ నాయకులను సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు పరామర్శించారు. సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్లో గల్లంతై ఆటోడ్రైవర్ మృతి
కోనేరుసెంటర్: మంగినపూడిబీచ్లో గల్లంతై ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనపై బందరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలం పేజేండ్ర గ్రామానికి చెందిన షేక్ జిలాని (30) ఆటో నడుపుతుంటాడు. బుధవారం గుడ్లవల్లేరు నుంచి జిలానీ కుటుంబంతో పాటు ఇతర బంధువులు అంతా కలిసి విహారయాత్రకు మంగినపూడి బీచ్కు వెళ్లారు. అందరూ అలల మధ్య స్నానాలు చేస్తుండగా జిలాని ఒక్కసారిగా అలల మధ్య చిక్కుకుని కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు బిగ్గరగా కేకలు వేయడంతో బీచ్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. మరుకొద్ది సేపటికి జిలాని శవమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ నాగరాజు సంఘటనాస్థలానికి చేరుకుని బంధువుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
‘తల్లికి వందనం’ నగదు విషయంలో భార్యభర్తల మధ్య గొడవ కోనేరుసెంటర్: బందరు మండలం పెదపట్నం గ్రామానికి సమీపంలో బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముదినేపల్లికి చెందిన సీహెచ్ గణేష్ (34) కూలి పనులు చేస్తుంటాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇద్దరు పిల్లలకు నగదు జమ చేసింది. అయితే పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి వచ్చిన డబ్బును ఇంట్లో అవసరాలకు వినియోగిద్దామని గణేష్ చెప్పగా అందుకు భార్య అంగీకరించలేదు. తన పిల్లలను ప్రైవేటు స్కూలులోనే చేర్పించి చదివిద్దామని చెప్పటంతో ఇరువురి మధ్య వివాదం రేగింది. వీరి వివాదం తారస్థాయికి చేరటంతో గణేష్ బుధవారం బైక్పై పెదపట్నంకు సమీపంలోని బీచ్కు వచ్చి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు గానీ గణేష్ బీచ్కు సమీపంలో ఉన్న పైపులను గుద్దుకుని పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఒంటిపై గాయాలు లేవు.. అయితే గణేష్ పైపులను గుద్దుకున్న కారణంగా చనిపోయనట్లయితే బలమైన గాయాలు ఉండాలి కానీ ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవటంతో మృతుడు ప్రాణాలు తీసుకునేందుకు ఏదైనా పురుగుల మందు సేవించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు ఆయన చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కప్తానుపాలెం(మోపిదేవి): మండల పరిధిలోని పెదప్రోలు శివారు కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కిలపర్తి దినేష్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన కిలపర్తి కీర్తిరాజు కుమార్డు దినేష్ వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. మెటీరియల్ కోసం గుడివాడ వెళ్లి ఆ వస్తువులతో ద్విచక్రవానంపై పులిగడ్డ వస్తున్నాడు. మార్గమధ్యలో రేణిగుంట నుంచి మామిడి లోడుతో అన్నవరం వెళుతున్న లారీ కప్తానుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న దినేష్ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొని సుమారు 20 మీటర్లకుపైగా రోడ్డుపై లాక్కుపోయింది. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి, వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. -
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా శివరామప్రసాద్
చిలకలపూడి(మచిలీపట్నం): పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా టి.శివరామప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా మేనేజర్గా పనిచేసిన శిరీష బదిలీ అయ్యారు. ఆ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్గా పని చేస్తున్న శివరామప్రసాద్ను కృష్ణాజిల్లాకు నియమించారు. ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దుర్గమ్మ సేవలో కేంద్ర సాధికార కమిటీ సభ్యులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర సాధికార కమిటీ సభ్యులు, శాసనసభ ఉప సభాపతి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, జెఆర్.భట్, సునీల్ లిమాయేలను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర సాధికార కమిటీతో పాటు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కమిటీ సభ్యులతో పాటు అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఈ నెల 29వ తేదీన తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ శ్రీభాగ్య నగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. తొలుత ఆలయ దుర్గగుడి ఈవో శీనానాయక్ను కలిసి ఉత్సవం నిర్వహణ గురించి వివరించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది 29న సుమారు 500 మందితో అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నట్లు కమిటీ అధ్యక్షుడు జి.రాఘవేందర్ తెలిపారు. 29వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు దుర్గగుడి దేవస్థానం తరఫున జూలై 18న అమ్మవార్లకు సారె సమర్పించేందుకు విచ్చేయాలని కోరారు. జనగణనతో పాటే కులగణన హర్షణీయం లబ్బీపేట(విజయవాడతూర్పు): జనగణనతో పాటే కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న గజిట్ విడుదల చేయడం హర్షణీయమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. విజయవాడలోని తమ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో జనగణనతో పాటే కులగణన చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రూపాల్లో ఉద్యమాలు, నిరసనలు చేసినట్లు తెలిపారు. ఆ ఫలితంగా నేడు కులగణన చేసేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా కచ్చితంగా తెలిసేలా వెనుకబడిన తరగతులకు చెందిన జాతీయ స్థాయిలోని 3,746 కులాలు, రాష్ట్రంలోని 139 కులాలకు చెందిన వారందరూ తమ జనాభా వివరాలతో పాటు కులాల వివరాలు కూడా తెలియజేయాలన్నారు. అప్పుడే బీసీ కులాల జనాభా ఎంత ఉందో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ ఉద్యోగుల విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెప్పాడ చందు, పునుగుపాటి శ్రీనివాస్, నాయకులు వాకా వెంకటేశ్వరరావు, తెన్నేటి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయండిక్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష చిలకలపూడి(మచిలీపట్నం): యోగాంధ్ర కార్యక్రమం పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు ద్వారా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చాలా మండలాల్లో ఇంకా యోగా శిక్షణ తరగతులు, యోగా నిర్వహించే వేదికలు సిద్ధం చేయటంలో వెనుకబడి ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 7,72,508 మందికి గాను 3,01,107 మందికి మాత్రమే యోగా శిక్షణ తరగతులు నిర్వహించారని, మిగిలిన వారికి కూడా వెంటనే శిక్షణ పూర్తి చేయాలన్నారు. యోగా ట్రైనర్లకు ప్రతిభ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ రెండు వారాలుగా టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండటం సరైందికాదన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో చంద్రశేఖరరావు, జిల్లా ఆయుష్ అధికారి జావెద్ఖాన్, యోగాంధ్ర జిల్లా సమన్వయ అధికారి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం
శరీరంలో వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేసే ఇన్బిల్ట్ మిషన్లు కిడ్నీలు. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అశ్రద్ధ వహిస్తే అసలుకే ఎసరు తెస్తుంది. నేటి సమాజంలో ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రసాయనాలు వాడిన పండ్లు, ఇతర ఆహార పదార్ధాలు, అతిగా పెయిన్ కిల్లర్స్ వాడకం కిడ్నీలకు ప్రధాన శత్రువులు. వీటిని పరిహరిస్తే మన కిడ్నీలు సురక్షితంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకులు పరుగుల జీవనం... ఆధునిక జీవనశైలి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఎ.కొండూరు ప్రాంతంలోనే కాక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శరీరంలో అత్యంత కీలకమైన సూపర్ ఆర్గాన్స్గా పిలిచే కిడ్నీల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. అదుపులేని మధుమేహం, అధిక బరువు, ఆహారంలో పెస్టిసైడ్స్ అవశేషాలు వంటి వాటితో కిడ్నీలకు హాని కలుగుతుంది. కిడ్నీలు 2/3 వంతు డ్యామేజీ అయ్యేంత వరకూ గుర్తించలేక పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, వ్యాధులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు తరచూ చేయించుకోవాలని సూచిస్తున్నారు. జీవనశైలితో జిల్లాలో పెరిగిన కిడ్నీ వ్యాధులు ఆహారంలో పెస్టిసైడ్స్ అవశేషాలతో కిడ్నీలపై ప్రభావం తరచూ నొప్పి నివారణ మందులు వాడడం ఒక కారణమే ముందస్తు చర్యలతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు -
అమ్మేద్దాం!
తవ్వేద్దాం..ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా మట్టి దందా మైలవరం మండల పరిధి పొందుగల ఎర్ర చెరువులో గ్రావెల్ తవ్వకాలు జి.కొండూరు: అధికారమే అండగా టీడీపీ నాయకులు చెరువులపై ఎగబడుతున్నారు. పదుల సంఖ్యలో పొక్లెయిన్లు, వందల సంఖ్యలో ట్రాక్టర్లతో చెరువులను గుల్ల చేస్తున్నారు. రైతుల పేరుతో పొలాలకు మెరక కోసం అంటూ అనుమతులు పొందుతూ.. చెరువులలో మట్టి, గ్రావెల్ని ఇటుక బట్టీలు, వెంచర్లకు తరలించి రూ.కోట్లు బొక్కేస్తున్నారు. వారం రోజులుగా చెరువులు, రహదారులు దుమ్ము లేచిపోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే అక్రమ సొమ్ము ఒకరిద్దరే తింటే ఎలా? తమకూ వాటా కావాలంటూ కూటమిలోనే వేరే వర్గపు నేతలు గలాటా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు. మారిపోతున్న భౌతిక స్వరూపం.. చెరువులలో మట్టి, గ్రావెల్ తవ్వకాల కోసం ఇష్టారాజ్యంగా చెరువుల వాలును బట్టి కాకుండా చెరువులో మట్టిని తవ్వేందుకు ఎక్కడ సులువుగా ఉంటే అక్కడ భారీ గొయ్యిలు పెట్టి తవ్వేస్తున్నారు. దీని వల్ల చెరువుల భౌతిక స్వరూపాలే మారిపోతున్నాయి. ఈ భారీ గొయ్యిల వల్ల చెరువులో ఉన్న నీరు తూములలోకి వచ్చే అవకాశం లేక రైతులు సాగునీటి ఎద్దడి వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలకు ఆదాయం నిల్.. చెరువులలో మట్టిని, గ్రావెల్ని యథేచ్ఛగా తరలించి ఒకరిద్దరు అధికార పార్టీ నాయకులు బాగుపడడం తప్ప ఆయా గ్రామాలకు ఒరిగేదేమీ లేదు. అదే గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి మట్టి తరలింపునకు ప్రతి క్యూబిక్ మీటరుకు ఇంత అని లెక్క కట్టి గ్రామ పంచాయతీలకు చెల్లించేలా జీవో విడుదల చేస్తే నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అయితే గ్రామ పంచాయతీల సర్పంచ్లు అధికంగా వైఎస్సార్ సీపీకి చెందిన వారే ఉండడంతో ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్ర చెరువులో ఎగబడ్డారు... మైలవరం మండల పరిధి పొందుగల ఎర్ర చెరువులో గ్రావెల్ లభ్యత ఎక్కువగా ఉండడంతో అక్కడి టీడీపీ నాయకులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. గత వారం రోజులుగా తవ్వకాలు జరుపుతూ పరిసర ప్రాంతాలలోని ఇళ్ల స్థలాలు, వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టరు ట్రక్కు గ్రావెల్ని రూ.1200కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులకు సమాచారం అందించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తవ్వకాలు ఇలా.. ● తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కొండపర్వ చెరువులో తవ్వకాలు జరిపారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలం కొణకంచి చెరువు నుంచి బండిపాలెం వెంచర్లకు గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో మట్టిని తరలిస్తున్నారు. ● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం కంచికచర్ల, గొట్టిముక్కల, పేరకలపాడు, వీరులపాడు మండల పరిధిలోని జుజ్జూరు, పెద్దాపురం గ్రామాల్లోని చెరువులలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ● మైలవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండల పరిధిలో కొత్తూరు, మైలవరం మండలం పొందుగల, చంద్రాల, బొర్రగూడెం, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి. కొండూరు మండలం చిన్ననందిగామ, కుంటముక్కల, కోడూరు, వెల్లటూరు, ఆత్కూరు, చెవుటూరు, మునగపాడు, కవులూరు గ్రామాల్లోని చెరువుల్లో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేదు.. చెరువులను చెరబడుతున్న పచ్చ నేతలు పొలాలకు మెరక కోసం అంటూ రైతుల పేరుతో అనుమతులు వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం కోట్ల రూపాయల మట్టి తరలిపోతున్నా కన్నెత్తి చూడని అధికారులు గ్రామ పంచాయతీలకు దక్కని ఆదాయం అడ్డగోలుగా తవ్వితే అనర్థమే.. చెరువులలో నిబంధనల మేరక పూడికతీసి మట్టిని రైతుల అవసరాలకు మాత్రమే తరలించాలి. అలా కాకుండా ఇష్టా రాజ్యంగా పది అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని అమ్ముకోవడం వల్ల ఒకరిద్దరే బాగుపడతారు. ఇలా తవ్వకాలు జరపడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. చెరువులో నీరు ఉన్నప్పటికీ భారీ గోతుల వల్ల నీరు తూములలోకి రాకపోవడంతో సాగునీటి ఎద్దడి సమయంలో రైతులు నష్టపోతారు. అంతేకాక చెరువులో దిగినప్పుడు మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. – పీవీ ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రేయింబగళ్లు చెరువులలో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క చెరువు నుంచి రోజుకి 2 నుంచి 3వేల ట్రాక్టరు ట్రక్కులు అంటే రోజుకి 7వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తరలిపోతోంది. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.1200 వరకు వసూలు చేస్తుండగా ట్రాక్టరు, పొక్లెయిన్ల కిరాయి పోను రోజుకి రూ.15లక్షల నుంచి రూ. 20లక్షల వరకు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే పోటీతో వేగంగా నడుపుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
‘తల్లికి వందనం’ పేరుతో మోసం
కంచికచర్ల: తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్ మండిపడ్డారు. కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా గోపీ నాయక్ మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పథకం అమలులో ఆంక్షల పేరిట తల్లులను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ ఏడాది ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గొప్పలు చెప్పి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వద్ద వసూలు చేసిన నగదును విద్యా సంస్థల అభివృద్ధికి ఉపయోగిస్తుందా అని ప్రశ్నించారు. అసంబద్ధ నిబంధనల పేరుతో విద్యార్థుల సంఖ్యను కుదింపు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. జీఓ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు షేక్ ఖజు, తులసి, వరలక్ష్మి, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్ -
హెచ్ఐవీ బాధితులు మనోధైర్యంతో జీవించాలి
గాంధీనగర్/మధురానగర్(విజయవాడసెంట్రల్): హెచ్ఐవీ బాధితులు మనోధైర్యంతో జీవించాలని ఎన్టీఆర్ జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జూపూడి ఉషారాణి సూచించారు. బావాజిపేట లోని నవజీవన్ బాల భవన్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు మంగళవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తయారీపై అవగాహన కల్పించారు. ఉషారాణి మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. నవజీవన్ బాలభవన్ ప్రతి నెలా పౌష్టికాహారం అందజేయడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, విద్యార్థులను చదివించడం, సూక్ష్మ, మధ్యతరగతి వ్యాపారాలు ఏర్పాటుచేసుకోవడానికి సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. నవజీవన్ బాల భవన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫాదర్ అంతయ్య మాట్లా డుతూ.. హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు ప్రతి నెలా పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వారి కుటుంబాల్లోని బాల బాలికల చదువుకు సహాయం చేయడం ద్వారా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శాంసన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవ జీవన్ బాల భవన్ అడ్మిస్ట్రేటర్ ఫాదర్ మర్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్ బాబు, జోనల్ కోఆర్డినేటర్లు జాకబ్ రాజు, నజ్మా, ప్రియాంక, దేవ మణి, వెంకటేశ్వరావు, రమేష్, జ్యోతిచంద్రిక, వలంటీర్లు హైమావతి, దుర్గ, రాణి, హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితులు పాల్గొన్నారు.ఏఎంహెచ్ఓ జూపూడి ఉషారాణి -
జీఎస్టీ కచ్చితంగా వసూలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కచ్చితంగా వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఐ.హేమతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సమన్వయ సమావేశాశం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వాణిజ్య శాఖ వసూలు చేసే రెవెన్యూ ద్వారానే ప్రజలకు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుతో పాటు ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పన్నులు సరిగా వసూలు చేయకపోతే ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో వస్తు సేవల పన్ను, వృత్తి పన్ను సక్రమంగా వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ ఎగవేతదారుల జాబితాను వాణిజ్య పన్నులశాఖ అధికారులు అందిస్తారని, ఆ జాబితా మేరకు తహసీల్దార్లు తమ పరిధిలో వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని బ్యాంకులకు ఈ జాబితాను అందజేస్తామని, వారు కూడా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి పన్ను బకాయిలు వసూలు చేసేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో 177 ప్రభుత్వ శాఖలు ఉండగా కేవలం 84 శాఖలు మాత్రమే జీఎస్టీ, టీఎస్ ఫైలింగ్ జరుగుతోందని, మిగిలిన శాఖల్లో కూడా ఫైలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ప్రతి నెలా వృత్తి పన్ను వసూలు చేయాలన్నారు. మునిసిపాల్టీలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వృత్తి పన్ను చెల్లించాల్సి ఉంద న్నారు. వాణిజ్య పన్నులశాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో అన్ని విధాల చేయూతను అందించి పన్నులు సక్రమంగా వసూలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గనులు, భూగర్భ వనరులుపై జీఎస్టీ వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గనులు, భూగర్భ వనరులు అక్రమంగా రవాణా కాకుండా నిరోధించాలని స్పష్టంచేశారు. ప్రతి పంచా యతీ కార్యదర్శి ఇకపై ప్రతి నెలా పదో తేదీలోగా జీఎస్టీ, టీడీఎస్ ఫైలింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఇందుకోసం వాణిజ్య పన్నులశాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, హౌసింగ్ పీడీ వెంకట్రావు, ఎల్డీఎం సి.రవీంద్రరెడ్డి, బందరు ఆర్డీఓ కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
యోగాసనాలతో నూతనోత్సాహం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాసనాలతో ప్రతి ఒక్కరూ నూతనోత్సహం పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్టీఎస్రోడ్డులోని యోగాస్ట్రీట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 202, వాకర్స్ క్లబ్, జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. యోగ సాధనతో శరీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంత జీవితం గడపొచ్చని సూచించారు. జిల్లాలో పది లక్షల మంది యోగా సాధన చేయాలన్న లక్ష్యంతో గ్రామ, మండల, పట్టణల్లో నిత్యం యోగాపై శిక్షణ ఇస్తున్నామన్నారు. వాకర్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ టి.హనుమంతరావు మాట్లాడుతూ.. పతంజలి మహర్షి అందించిన గొప్ప వరమే యోగ అని పేర్కొన్నారు. సర్వరోగ నివారణకు తోడ్పడే యోగా ఆచరిస్తే ఆరోగ్యంగా జీవించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి జె.శివ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేమూరి బాబు రావు, మోతుకూరి వెంకటేశ్వరరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 202 పూర్వపు గవర్నర్ అమర్నాథ్, గవర్నర్ ఎ.విజయలక్ష్మి, కార్యదర్శి పి.పుష్పలత, కోశాధికారి టి.బాలాజీ, జేసీఐ ప్రతినిధులు కె. రాజేంద్రరెడ్డి, కె.గణేష్బాబు, జె.స్వాతి, దత్తాత్రేయ యోగా క్లబ్ ప్రతినిధులు డి.తిరుపతిరాజు, రఘు స్వామిజీ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
చోరీ కేసుల్లో నలుగురు నిందితుల అరెస్టు
గన్నవరం: వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు నిందితులను ఆత్కూరు పోలీసులు మంగళవారం అదుపు లోకి తీసుకుని ఐదు బైక్లు, విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉంగుటూరు మండలం పొట్టిపాడులో మే నెల మూడో తేదీ తెల్లవారుజామున ఇంటిలో నిద్రిస్తున్న బాణాల సుభాషిణి మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ కె.వి.ఎన్.ఎన్. సత్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేపట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చోరీకి పాల్పడింది జంగారెడ్డిగూడెం శివారు వేగవరం గ్రామానికి చెందిన పారేపల్లి శేషు, పోలవరపు నాగదుర్గాప్రసాద్, దుగ్గిరాల శివరామకృష్ణగా గుర్తించారు. ప్రధాన నిందితుడు శేషును మంగళ వారం అరెస్టుచేసి, అతని వద్ద బంగారు గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు కొవ్వూరులో జరిగిన ఓ చోరీ కేసులో పట్టుబడి జైలులో రిమాండ్లో ఉన్నారు. మరో ముగ్గురి అరెస్టు ఇటీవల ఆత్కూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న బైక్ చోరీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఆత్కూరు పోలీసులు పొట్టిపాడు టోల్గేట్ వద్ద బైక్పై వెళ్తున్న ఏలూరుకు చెందిన దత్తి నవీన్, భీమవరానికి చెందిన గుత్తుల రవికుమార్, సాయిశ్రీరామ్ను అనుమానితులుగా గుర్తించి అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచార ణలో వారు బైక్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. పెదపాడు, కై కలూరు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించినట్లుగా ఒప్పుకున్నారు. పోలీసులు వారి వద్ద నాలుగు బైక్లు, బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఇప్పటికే పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులను ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సురేస్ చావా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పెనుగంచిప్రోలు ఆలయ ఉద్యోగులకు మెమోలు
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసిన శ్రీతిరుపతమ్మవారి ఆలయం విధులు నిర్వర్తిస్తున్న 27 మందికి పైగా ఉద్యోగులు, అర్చకులు, పురోహితులకు ఈఓ కిషోర్కుమార్ మంగళవారం మెమోలు జారీ చేశారు. ఈ నెల 13న ఉద్యోగుల రహస్య భేటీ అని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరిగిందని, 14వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఈఓ అనుమతి లేకుండా బాధ్యత కలిగిన ఉద్యోగులు సమావేశం నిర్వహించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయినందున మెమోలు జారీ చేసినట్లుగా ఈఓ పేర్కొన్నారు. మెమో అందిన ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టచేశారు. అయితే దీనికి సంబం ధించి ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి సమావేశం నిర్వహించామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి ఆలయ అర్చకులు, పురోహితులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈఓ, ఉద్యోగులు, అర్చకులు, పురోహితుల మధ్య గతంలో ఎన్నడూ ఇంత వ్యతిరేకత లేదని గ్రామస్తులతో పాటు భక్తులు పేర్కొంటున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించటంతో పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్న ఉన్న తరుణంలో ఆలయంలో నెలకొన్న సంక్షోభంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఈ విషయంలో స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. బైక్పై విన్యాసాలు.. యువకుడిపై కేసు కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన మోహన్ప్రసాద్, ఉయ్యాల సురేష్ ఇద్దరు స్నేహితులు. మోహన్ప్రసాద్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఓ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని బైక్ను కొన్ని రోజుల క్రితం సురేష్ తీసుకెళ్లి వెనుక మరో యువకుడిని ఎక్కించుకుని అర్ధరాత్రి కృష్ణలంక జాతీయ రహదారిపై విన్యా సాలు చేశాడు. బైక్ ముందు చక్రాన్ని పైకి లేపి వెనుక చక్రంపై నడిపిస్తూ విన్యాసాలు చేసి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. వాటిని ఎవరో ప్రయాణికులు వీడియో తీసి ఇన్స్టా గ్రామ్లో పోస్ట్చేశారు. ఆ విన్యాసాలను ఇన్స్టా గ్రామ్లో ఈ నెల 15న మోహన్ప్రసాద్ చూశాడు. తన బైక్తోనే విన్యాసాలు చేశాడని గుర్తించాడు. గంటలో తీసుకొస్తానని చెప్పి తన బైక్ను తీసుకెళ్లి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పద మృతి గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం శివారు పసుభొట్లపాలెంలో ట్రాక్టర్ డ్రైవర్ రేమల్లి వెంకట్రావు(45) అలియాస్ ముసలోడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శత్రువుల చేతి లో వెంకట్రావు హత్యకు గురయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం గ్రామంలోని రోడ్డు పక్కన గాయాలతో వెంకట్రావు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుడ్లవల్లేరు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు చేపట్టే పనిలో ఉండగా, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ పరిస్థితిని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమేశ్వరరావు, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతు డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి బంధువులను వైఎస్సార్ సీపీ నాయకులు మండలి హనుమంతరావు, నాగు, రాజు, ప్రసాద్ పరామర్శించారు. -
ఇసుక తవ్వకాల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు
పెనమలూరు: మండలంలోని చోడవరం ఇసుక క్వారీలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో నీరు ఉన్నా కొత్త టెక్నాలజీ సాయంతో పాతాళం నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. 15 అడుగులకు పైగా లోతున ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో భూగర్భ జలాలు పడిపోతాయని స్థానికులు వాపోతున్నారు. గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం రుతుపవనాల సమయంలో నదుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. అయితే అక్రమార్కులు చోడవరం క్వారీలో జేసీబీలు, పొక్లెయిన్ల పెద్ద సంఖ్యలో దించి 15 అడుగుల పైగా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇసుక దోపిడీకి కొత్త విధానం చోడవరం క్వారీలో భారీ తవ్వకాలతో లారీలు రాకపోకలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో అక్ర మార్కులు కొత్త సాంకేతికతను వాడుతున్నారు. బో ట్ల తీసుకొచ్చి, వాటికి యంత్రాలు అమర్చి పైపుల ద్వారా నీటి అడుగు నుంచి ఇసుక తవ్వకాలను మొదలు పెట్టారు. నదిలో నీటి అడుగున ఉన్న ఇసుకను పైపుల ద్వారా తోడుతున్నారు. పైపుల నుంచి ఇసుక నేరుగా వచ్చి గట్టుపై పడుతోంది. బోట్లు, యంత్రాలతో రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గట్లపై పడిన ఇసుకను పొక్లెయిన్లతో లారీల్లో లోడుచేసి తరలిస్తున్నారు. చోడవరం ఇసుక క్వారీలో కొత్త టెక్నాలజీ వినియోగం బోట్లతో 15 అడుగులకు పైగా లోతుగా తవ్వకాలు గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనలు పట్టించుకోని మాఫియా -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పెనమలూరు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రొత్సాహం కల్పిస్తామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కానూరు అన్నే కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక వేత్తలకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పారిశ్రామిక సదస్సు నిర్వహిస్తామన్నారు. జిల్లాను పరిశ్రమల హబ్గా మార్చడానికి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పూర్తి సహకారం.. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దటానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటుకు స్థలం, ఇతర అనుమతులు ఇవ్వటానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పారిశ్రామిక వేత్తలతో పలు సమస్యలపై చర్చించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఆర్డీఓ బీఎస్ హేళాషారూన్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆషారాణి, ఎల్డీఎంసీ అధికారి రవీంద్రరెడ్డి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.భాస్కరరావు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్ పర్సన్ వి.నాగలక్ష్మి, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. -
గృహనిర్మాణాలు వేగవంతం కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో గృహనిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గృహ నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహనిర్మాణ పురోగతి సంతృప్త స్థాయిలో లేదని కాంట్రాక్టర్లు, లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. 15 రోజుల క్రితం గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించి అధికారులకు లక్ష్యాలు నిర్ధేశించినప్పటికీ చాలా మండలాల్లో అనుకున్న స్థాయిలో పురోగతి లేదన్నారు. జూలై మొదటి వారంలో తిరిగి మరలా సమీక్షిస్తానని, ఈలోగా వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, డీటీడబ్ల్యూవో ఫణిదూర్జటి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఎస్వో వి. పార్వతి తదితరులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా క్యాడర్ ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నిర్వహించినట్లు కృష్ణాజిల్లా, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ శర్మిష్ఠ తెలిపారు. జిల్లా స్థాయి పోస్టులైన ఎంపీహెచ్ఏ(ఎఫ్), ఎంపీహెచ్ఏ(ఎం), జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2, డ్రైవర్లు, అటెండర్లు, క్లాస్–4 ఉద్యోగులు ఐదేళ్లకుపైగా ఒకే చోట పనిచేసిన 46 మంది, ఐదేళ్ల లోపు ఒకే చోట పనిచేసిన 20 మందిని బదిలీ చేశామన్నారు. జిల్లా క్యాడర్లను జూమ్ కౌన్సెలింగ్ ద్వారా కోరిన ఆప్షన్ మేరకు బదిలీ ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. చోడవరం ఇసుక ర్యాంప్నకు గండి పెనమలూరు: చోడవరం ఇసుక ర్యాంప్నకు మంగళవారం అధికారులు గండి కొట్టించారు. చోడవరం గ్రామ పరిధిలో కృష్ణానది నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. దీనిపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘పండగ చేసుకుంటున్న తమ్ముళ్లు’ కథనంపై కలెక్టర్ స్పందించారు. జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అక్టోబర్ 15వ తేదీ వరకు జిల్లా పరిధిలో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయరాదని ప్రకటించారు. ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే చోడవరం ఇసుక క్వారీలో రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి లారీల్లో తరలిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను మండల అధికారులు, పోలీసులు అమలు చేయలేదు. ‘సాక్షి’లో కథనం రావటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చోడవరం ఇసుక క్వారీ ర్యాంప్నకు గండి కొట్టించారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రచారం మైలవరం: ఒత్తిడి లేని విద్య, విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తోందని డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను తెలిపారు. మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ వీధుల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా యూనియన్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచా రం నిర్వహిస్తూ, బడిబాట కరపత్రాలు మంగళవారం పంపిణీ చేశారు. రాష్ట్ర శాఖ మహిళా కార్యదర్శి కే.వీ.ఎల్. నాంచారమ్మ, ఎన్టీఆర్ జిల్లా శాఖ అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఖరీఫ్.. అవస్థలమయం
● ఆది నుంచే ఆటుపోట్లు ● నారుమడులను సిద్ధం చేస్తున్న రైతులు కంకిపాడు: ఆటుపోట్లు అధిగమిస్తూ రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తనాలతో మొదలైన సమస్య, సాగునీటి కటకటతో అవస్థలమయంగా తయారైంది. సాగు ఆరంభంలోనే ఇబ్బందులు పడుతూ సాగుకు ఉపక్రమించాల్సిన దుస్థితి నెలకొంది. నారుమడులు సిద్ధం చేస్తూ... కృష్ణాజిల్లా పరిధిలో తొలకరి వర్షాల రాకతో రైతులు ఖరీఫ్ సాగు పనులు ఆరంభించారు. భూములను దుక్కులు దున్ని, దమ్ములు చేసుకున్నారు. వరి నారుమడి పెంచేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ ప్రాంతంలో పూర్వ పంట తాలూకా వ్యర్థాలను తొలగించి దమ్ము చేయించారు. ఈ ఏడాది బయటి మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు 30 కిలోలు బస్తా సమంగా ధర ఉంది. దీంతో బయటి మార్కెట్లో రూ. 1100 చొప్పున వెచ్చించి విత్తనాలను సమకూర్చుకున్నారు. ప్రభుత్వం నుంచి విత్తనాల సరఫరా సకాలంలో జరగకపోవటంతో పొలాలు అదును తప్పకుండా ఉండేందుకు బయటి మార్కెట్ను ఆశ్రయించాల్సి వచ్చింది. బోర్లు ఉన్న భూముల్లో.. బోర్లు సదుపాయం ఉన్న భూముల్లో రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. ఎంటీయూ, బీపీటీ, ఇతర సాధారణ రకాలను రైతులు ఎంపిక చేసుకుని నారుమడులు పోశారు. ప్రస్తుతం నారుమడులు నాట్లకు సిద్ధమవుతున్నాయి. నారుమడితోపాటుగా వెదజల్లే పద్ధతిలోనూ రైతులు విత్తనాలను చల్లుకుని సాగుకు ఉపక్రమించారు. నారుమడి సిద్ధమవుతుండటంతో భూమిని దమ్ము చేయించి వరి నాట్లకు సన్నద్ధం చేసుకుంటున్నారు. సాగునీటిపై ఆందోళన.. గత ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికే కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసింది. చివరి భూములకు సాగునీరు సమృద్ధిగా చేరటంతో రైతులు సాగుపై ఆందోళన చెందలేదు. కానీ ఈ దఫా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 15కే ఖరీఫ్కు సాగునీటిని విడుదల చేసినా కాలువ చివరి భూములకు నీరు చేరుతుందన్న ఆశ లేకుండా పోయింది. ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు ఎక్కడ చూసినా వ్యర్థాలు, గుర్రపుడెక్క, తూటుకాడతో నిండిపోయి ఉన్నాయి. తూటుకాడ తొలగించి సాగునీటిని అందేలా చేస్తే సాగుకు ఆటంకం లేకుండా ఉండేది. కానీ తూడు తొలగింపు పనులు ప్రహసనంగా సాగుతున్నాయి. సాగునీటిని విడుదల చేస్తూ, మరో వైపు కాలువల్లో తూటుకాడ, గుర్రపుడెక్క నివారణకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయిస్తున్నారు. నీటి తడి వల్ల తూటుకాడ నశించే అవకాశం ఉండదని, తిరిగి జీవం పోసుకుని సమస్య యథాతథంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్బందులను అధిగమిస్తూ ఆశాభావ దృక్పథంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
విజయవాడలీగల్: బీబీఏ న్యాయవాది జెట్టి ప్రణీత్ కుమార్పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారులు వ్యవహరించిన తీరు సరికాదని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేషన్ సీఐ, కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనకు నిరసనగా మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు నివేదికను సమర్పించారు. అనంతరం ఏకే బాషా మాట్లాడుతూ ఈ నెల 8న ప్రణీత్కుమార్ సొంత విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్లారని, అక్కడ పోలీసులు అతనిపట్ల అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సుంకర కృష్ణమూర్తి, నరహరిశెట్టి నరసింహారావు, బీబీఏ గవర్నింగ్ బాడీ సభ్యుడు, ట్రెజరర్ ముద్దాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వివాహితను నవవధువుగా చెప్పి మోసం
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): వివాహమై పిల్లవాడు ఉన్న యువతిని పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి లక్షలు దండుకొని మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కర్నాటక కొప్పుల్ జిల్లాకు చెందిన జి.దుర్గాప్రసాద్ (34) వివాహం కాకపోవడంతో స్థానికంగా ఉన్న మ్యారేజీ బ్యూరోకి చెందిన శ్రీదేవి అనే మహిళ ద్వారా రాజమండ్రి, విజయవాడలోని మధ్యవర్తులను ఆశ్రయించాడు. వారు విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని పరిచయం చేశారు. విజయవాడకు చెందిన తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావు కృష్ణలంకకు చెందిన పల్లవి అలియాస్ ఆమని అనే యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడ కృష్ణలంకలోని ఒక హోటల్లో పెళ్లి చూపులు తతంగం జరిపించారు. అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే రూ.2.70 లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం మరో రూ.18 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు పార్వతి అనే మహిళకు రూ.50 వేలు ఇచ్చారు. ఈ నెల ఐదున దుర్గగుడిలో వివాహం జరిగింది. కర్నాటక వెళ్లి ఏడో తేదీన వరుడి ఇంటి వద్ద రిసెప్షన్ జరుపుకొన్నారు. పల్లవి వెంట కర్నాటక వెళ్లిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద రూ.50 వేలు తీసుకుని అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తరువాత పల్లవి తనకు అంతకు ముందే వివాహమైందని, ఒక బాబు కూడా ఉన్నట్లుగా చెప్పింది. దాంతో దుర్గాప్రసాద్ తాను మోసపోయినట్లు గుర్తించి తన కుటుంబ సభ్యులకు వివరించాడు. పల్లవిని తీసుకొని ఈ నెల 14వ తేదీన విజయవాడ బస్టాండ్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేయటమే కాకుండా తన నుంచి రూ.2.88 లక్షల నగదును సైతం కాజేశారని వాపోయాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు దుర్గాప్రసాద్ను వన్టౌన్ పోలీసుస్టేషన్కు పంపించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అవగాహన లేకుండా చర్యలొద్దు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో చాలా మంది అధికారులు అవగాహన లోపంతో అర్జీల పరిష్కారం తప్పుగా చేస్తున్నారని, ఇకనైనా దానిని సరిదిద్దుకుని సరైన పద్ధతిలో వాటిని పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ పి. సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినీ సింగ్, ఆర్డీవో కె. స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వ పాలసీ ప్రకారం త్వరలో మంజూరవుతుందని చెప్పటంతో పాటు పరిష్కార పోర్టల్లో లబ్ధి పొందినట్లుగా చెబుతున్నారని ఇది చాలా తప్పన్నారు. అర్జీదారులు పరిష్కారం పొందకుండానే పరిష్కారం పొందినట్లు చూపటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కాకుండా త్వరలోనే లబ్ధి పొందుతారని సమాధానం ఇవ్వాలన్నారు. సంబంధిత అధికారి అర్జీదారులతో తప్పనిసరిగా మర్యాదగా మాట్లాడి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో మొత్తం 133 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన మత్తి కృష్ణారావు తన పొలం రీ–సర్వే నంబర్ 605–1, 22–1లోని 17 సెంట్లు, భార్యకు సంబంధించిన ఏడు సెంట్లను కృష్ణానది కరకట్ట వెడల్పు చేసి రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే తనకు రావాల్సిన నష్టపరిహారం సరిహద్దు రైతులకు ఇచ్చారని అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ●జిల్లా పరిధిలోని బుడమేరు చంద్రయ్య డ్రెయిన్, ఐనంపూడి తదితర డ్రెయిన్లలో పూడిక తీయించాలని కొన్నేళ్లుగా ఈ డ్రెయిన్లలో పూడికతీయకపోవటం వల్ల తుపాను సంభవించినప్పుడు, భారీ వర్షాలు పడినప్పుడు వివిధ దశల్లో ఉన్న పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. అలాగే ఆరుగాలం పండించిన పంటకు రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు. ●చల్లపల్లి మండలం తాలిపేట గ్రామానికి చెందిన తప్పిరి సుబ్బారావు దివ్యాంగుడు. కాగా తనకు మూడు చక్రాల వాహనం లేదని ఇతరుల వాహనంలో వచ్చానని, తనకు బ్యాటరీ మూడు చక్రాల సైకిల్ను ఇప్పించాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. వికలాంగుల సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడి వెంటనే బ్యాటరీ వాహనాన్ని ఆ దివ్యాంగుడికి కలెక్టర్ అందజేశారు. సరైన పద్ధతిలో సమస్యలు పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ బాలాజీ మీ కోసంలో ప్రజల నుంచి 133 అర్జీలు స్వీకరణ -
శ్రీభ్రమర హోమ్స్ నూతన వెంచర్ ప్రారంభం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):శ్రీ భ్రమర హోమ్స్ సంస్థ విజయవాడ నగరానికి సమీపంలోని ఆకునూరు దగ్గర శ్రీ భ్రమర హోమ్స్ పేరుతో కొత్త ప్రాజెక్టుకు ప్రారంభించారు. స్థానిక బెంజ్సర్కిల్ సమీపంలోని ఒక ఫంక్షన్ హల్లో శ్రీ భ్రమర హోమ్స్ గ్రాండ్ ప్రీ–లాంచ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శ్రీ భ్రమర హోమ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గళ్ళా రామచంద్రరావు ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో పాటు వంద శాతం క్లియర్ టైటిల్, పక్కా వాస్తుతో అందరికీ అందుబాటుగా ఉండేలా వీటిని ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దామని చెప్పారు. శ్రీ భ్రమర చేపట్టిన ప్రాజెక్టు ‘శ్రీ భ్రమర హోమ్స్’లో విల్లాస్, విల్లా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మారం చంద్రశేఖర్, ఎంఎస్ రాజు, ఎంపీకే లక్ష్మీపతి రాజు, శైలారెడ్డి కోట, యడ్లపల్లి మురళీకృష్ణ, రావెల గోపాలకృష్ణ, గుండేటి శివ, గుండా సుబ్బారావు, జమిలి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత గుడివాడరూరల్: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని పట్టుకున్నామని తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు సోమవారం తెలిపారు. మల్లాయపాలెం సమీపంలోని బైపాస్రోడ్డులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో మినీ వ్యాన్ను తనిఖీ చేశామని చెప్పారు. 34 బస్తాల్లో తరలిస్తున్న 1700 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బియ్యంతో పాటు, వాహనాన్ని సీజ్ చేశామని పేర్కొన్నారు. పామర్రుకు చెందిన వ్యాన్ డ్రైవర్ యండమూరి సీతారాముడును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్తపేటకు చెందిన పెద్ది రామచంద్రరరావు అదుపులోకి తీసుకున్నామని వివరించారు. రేషన్ కొనుగోలు చేసి వ్యాపారం చేసే వ్యవహారంలో ప్రధాన నిందితుడైన పెద్ది అర్జునరావును ఇంకా అదుపులోకి తీసుకోలేదని, వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రేషన్ వ్యాపారం చేసే నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడం వల్ల పోలీసులపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కొత్తపేట వాసులు పేర్కొంటున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీకోసం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాల్లో సోమవారం జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో అందిన అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని చెప్పారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 42 అర్జీలు అందినట్లు తెలిపారు. -
వడి బియ్యంకు కిలో రూ.21.05
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు సమర్పించే వడి బియ్యంకు కిలో రూ. 21.05 చొప్పున చెల్లించేందుకు కాంట్రాక్టర్కు ముందుకు వచ్చారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వడి బియ్యం, నూనె డబ్బాల బహిరంగ వేలం పక్రియ సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించారు. ఏసీ రంగారావు పర్యవేక్షణలో ఏఈవోలు ఎన్. రమేష్బాబు, వెంకటరెడ్డి వేలం పక్రియ నిర్వహించారు. ముగ్గురు కాంట్రాక్టర్లు వేలంలో పాల్గొన్నారు. వడిబియ్యంకు ప్రథమ ధరావతుగా రూ. 50 వేలు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండకు చెందిన ఎన్.సంతోష్ వడిబియ్యంకు కిలోకు రూ.21.05 చొప్పున చెల్లింపుకు పాట దక్కించుకున్నారు. ఇక నూనె డబ్బాలను పిఠాపురానికి చెందిన చిన్న అప్పారావు డబ్బా ఒక్కింటికి రూ. 25–25లు చెల్లించేలా పాట దక్కించుకున్నారు. టెండర్ పక్రియలో లీజెస్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి ఎయిర్పోర్ట్(గన్నవరం):సమాజంలో రక్తదాన ఆవశ్యకతను ప్రతిఒక్కరు గుర్తించాలని విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్. లక్ష్మీకాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విమానాశ్రయంలో సోమవారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రారంభిచడంతో పాటు స్వయంగా ఆయన రక్తదానం చేసి మిగిలిన ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అపదలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సొసైటీ జిల్లా చైర్మన్ బాలాజీ తెలిపారు. ముఖ్యంగా రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. మొత్తం 33 మంది ఎయిర్పోర్ట్ ఉద్యోగులు రక్తదానం చేసినట్లు సొసైటీ జిల్లా కార్యదర్శి భవిరి శంకర్నాథ్ తెలిపారు. ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ కార్యదర్శి శ్రీహరి, సొసైటీ కోశాధికారి కె.రామ్బాలాజీ, గన్నవరం శాఖ చైర్మన్ చిన్ని మాధవి, రెడ్క్రాస్ ప్రతినిధులు డాక్టర్ ఎం.విజయకుమార్, ఎం. ప్రభాకరచౌదరి, డాక్టర్ అంజనీకుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి చర్యలు
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి అంశాలు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, క్లయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం జూన్ 14 నాటికి మార్పులు, చేర్పులు చేపట్టిన అనంతరం జిల్లాలో 15,41,283 మంది ఓటర్లు ఉన్నారని వీరిలో 7,46,647మంది పురుషులు, 7,94,586 మంది మహిళలు, 50 మంది ఇతరులు ఉన్నారన్నారు. పోలింగ్ బూత్ వివరాలు తెలిపే చిరునామాలో కులాల పేర్లతో కూడిన పదాలను వాడకుండా చూడాలని అదే విధంగా ఎన్నికలకు సంబంధించిన పత్రాల్లో కొన్ని ఆంగ్ల పదాలను తెలుగుభాషలో తర్జుమా చేసే క్రమంలో సరైన పదాలను వినియోగించాలని పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. డీఆర్వో చంద్రశేఖరరావు, ఆర్వీడో స్వాతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పీవీ గజేంద్రరావు, దిలీప్కుమార్, కొడాలి శర్మ, ఎస్. బాలాజీ పాల్గొన్నారు. -
నిధులు నీళ్ల పాలేనా?
అవనిగడ్డ: పంట కాలువకు సాగునీరు వదిలిన తరువాత పనులు చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ చోద్యం చూసిన ప్రజాప్రతినిధులు కాలువకు నీరొదిలిన తరువాత పనులు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రూ.2.25 కోట్లు నిధులు నీటిపాలేనా అని నిలదీస్తున్నారు. నియోజకవర్గంలో కేఈబీ కెనాల్తో పాటు అన్ని పంట కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు కోసం ఈ ఏడాది రూ.2.25 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నెలరోజుల క్రితం ప్రకటించారు. వీటికి సంబంధించి కొన్నిచోట్ల మాత్రమే పనులు ప్రారంభించారు. ఇంకా కొన్నిచోట్ల పనులు మొదలుపెట్టలేదు. నెలరోజుల క్రితం ప్రకటించినా పనులు పూర్తి చేయకుండా పంట కాలువలకు సాగునీటిని విడుదల చేసిన తరువాత పనులు చేయడంపై దివిసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టాకు పూజలు చేసి సాగునీరు వదిలారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో పాటు గన్నవరం, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సోమవారం దివిసీమలోని ప్రధాన పంటకాలువలు, డ్రెయిన్లలో కలుపు మందు పిచికారీ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాల్గొని పనులు పరిశీలించారు. ఇన్నాళ్లూ పనులు చేపట్టకుండా పంట కాలువకు సాగునీరు వదిలిన తరువాత హడావిడిగా పనులు చేయడం పట్ల దివిసీమ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటకాలువకు సాగునీరు వచ్చేలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయినా సాగునీరు వచ్చేలోపు పనులు పూర్తి చేయించలేకపోయారు. దీనికితోడు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో తూతూ మంత్రంగా పనులు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడానికి మినహా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కొంతమంది రైతులు పెదవి విరుస్తున్నారు. ఇంకా కొన్నిచోట్ల ప్రారంభం కాని పనులు.. నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ఇంకా కొన్నిచోట్ల పనులు ప్రారంభించలేదు. ఈ మండలాల్లో డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపడెక్కను తొలగించాల్సి ఉంది. లేదంటే కొద్ది పాటి వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఇలా పనులు చేయక పోవడం వల్ల చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో నాట్లు వేసిన పొలాలు ముంపునకు గురై రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం పనులు పూర్తి కాకపోవడంతో పంట పొలాలకు ముంపు మప్పు పొంచి ఉంది. సాగునీరొదిలాక పంటకాలువ పనులు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల సోమవారం పలుచోట్ల పంట కాలువల్లో కలుపు మందు పిచికారీ -
కక్షపూరిత విధ్వంసం
మచిలీపట్నంటౌన్: కూటమి ఏడాది పాలనలో బందరులో అభివృద్ధి ఏమోగానీ కక్షసాధింపు చర్యలు, పేదల ఇళ్లు, బడ్డీకొట్లు కూల్చటం, టార్గెటెడ్గా అక్రమ కేసులు పెట్టడం వంటి చర్యలకే పాలకులు ప్రాధాన్యమిచ్చారు. నగరంలో మట్టి మాఫియా అడ్డగోలు దోపిడీని కొనసాగిస్తోంది. మండల పరిధిలోని కూటమి నాయకులు మంత్రి కొల్లు రవీంద్ర ఆశీస్సులతో అందినకాడికి దోచుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. రెవెన్యూ, పోలీస్, కార్పొరేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారులనే పాలకులు ఆయుధాలుగా చేసుకుని వారి కక్షపూరిత పాలనను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముంపు సమస్య తీరేదెప్పుడో? బందరులో ముంపు సమస్య పరిష్కారానికి పక్కా డ్రెయిన్లను నిర్మిస్తామని పాలకులు ఇచ్చిన హామీని బూచిగా చూపి నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్ల మార్జిన్లో ఉన్న బడ్డీలను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. అలాగే ఎస్బీఐ మెయిన్బ్రాంచ్ వెనుక రోడ్డులో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సైతం మంత్రి కక్ష సాధింపుతో తొలగించారు. అయితే డ్రెయిన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఏడాది కాలంలో ఒక్క పైసాకూడా తేలేదు. మన వాళ్లకే అంతా.. నగర పాలక సంస్థలో వైఎస్సార్ సీపీ పాలకవర్గం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర ఎంఎంసీ పాలనను తన చేతులోకి తీసుకుని అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు పనులు చేయొద్దని కమిషనర్ను ఆదేశించటంతో ఆయన ఏకపక్షంగా పని చేసుకుంటూ పోతున్నారు. వీధి దీపాల నిర్వహణ కూడా టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ నిర్వహిస్తూ డివిజన్లలో వీధిదీపాలు వెలగకపోయినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బిల్లులు చేయించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులతో కక్షసాధింపు.. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్నినాని కుటుంబంపై కక్ష సాధింపుతో మంత్రి కొల్లు రవీంద్ర పావుల కదుపుతున్నారు. గోడౌన్లో సిబ్బంది తప్పిదానికి ఆయన సతీమణిపై కేసులు బనాయించారు. తాజాగా అక్రమ ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ ఆయన కుమారుడిపై కేసులు పెట్టే కుటిల యత్నాలను నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. కుమ్మరిగూడెంలో పేదలు నిర్మించుకున్న 200 గృహాలను ఒకేరోజు నేలమట్టం చేసిన పాలకులు(ఫైల్) బందరులో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా పేదల ఇళ్లను కూల్చిన కూటమి పెద్దలు ఫుడ్కోర్టు, పేదల బడ్డీలు తొలగింపు పేర్నినాని కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు కక్షసాధింపుతో ఉద్యోగుల తొలగింపు.. కూటమి పాలనలో ఎంఎంసీ పరిధిలో పని చేస్తున్న పలు విభాగాల సిబ్బందిని, కార్మికులను వైఎస్సార్ సీపీకి అనుకూలం అనే ముద్ర వేసి తొలగించారు. కూటమి నాయకుల ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ వీరిని తొలగించి వీరి స్థానంలో కూటమి నాయకుల సిఫార్సులతో కొత్తవారిని నియమించారు. ఎంఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లను, మెప్మా విభాగంలో పని చేస్తున్న దాదాపు 15 మంది ఆర్పీలను, దాదాపు 15 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. నోరు తెరిస్తే చాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంతా విధ్వంసం జరిగిందని విమర్శించే కూటమి పాలకులు ఈ ఏడాది కాలంలో మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన పాలనను ఏమనాలో వారే బదులిస్తే బావుంటుందని ప్రజలు కోరుతున్నారు. పనులన్నీ కీలకనేత బినామీకే.. నగరపాలకసంస్థలో పనులన్నీంటినీ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర బినామీగా విమర్శలెదుర్కొంటున్న కన్నా ప్రసాద్ అనే కాంట్రాక్టర్తో నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నది నిజమా.. కాదా? అని ఇటీవల మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. రూ. 5లక్షల కన్నా పైబడిన పనులకు పాలకవర్గం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కమిషనర్ బాపిరాజు ఎంఎంసీ జనరల్ ఫండ్ నిధులతో ఏ పనినైనా రూ. 4 నుంచి రూ. 4.50లక్షలుగా విభజించి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్ కన్నా ప్రసాద్తో చేయిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి. -
రేపు పామర్రులో జాబ్మేళా
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన పామర్రులో జాబ్మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 18వ తేదీ పామర్రులోని ఆరేపల్లి కల్యాణ మండపంలో ఈ జాబ్మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. హెటిరో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బజాబ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, టాటా క్యాపిటల్, వరుణ్ మోటార్స్, అపోలో ఫార్మసీ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాల కోసం పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు గల యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికై న వారికి మంచి వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినీసింగ్, ఆర్డీవో కె. స్వాతి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్కుమార్, ఉపాధి కల్పనశాఖాధికారి డి. విక్టర్బాబు పాల్గొన్నారు. -
ఫణికుమార్ మృతదేహం లభ్యం
శ్రీకాకుళం(ఘంటసాల):కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఒక్కగానొక్క కుమారుడు కృష్ణానదిలో గల్లంతుకాగా సోమవారం లభ్యమైన మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణానదిలో గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న ఆత్కూరి ఫణి కుమార్ ఆదివారం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతయ్యాడు. ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి ఎస్ఆర్డీఎఫ్ బృందాలతో కృష్ణానదిని జల్లెడపట్టగా సోమవారం సాయంత్రంఫణి కుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుని భౌతికకాయాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఒడ్డుకు చేర్చగా తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ పర్యవేక్షణలో వీఆర్వో డి.గోపి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడు తండ్రి ధర్మరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
మనమిత్ర వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, ఇతర సేవల కోసం మనమిత్ర వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహ మండలి సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులకు సంబంధించి ఆయాశాఖల వద్దకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. సముద్రనాచు పెంపకానికి సంబంధించి ప్రాజెక్టు ఏర్పాటుకోసం మత్స్యకార మహిళలను సమకూర్చాలని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పారిశ్రామికవేత్త కనకదుర్గ కలెక్టర్ను కోరారు. అలాగే వ్యర్ధ, కాటన్ దుస్తులతో పర్యావరణ రహిత సంచులు, పరీక్ష ఫ్యాడ్లు, సెల్ఫోన్ స్టాండ్లు తదితర వస్తువులు తయారుచేస్తున్నామని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని డీఆర్డీఏ పీడీ కు కలెక్టర్ సూచించారు. పోతేపల్లి జ్యూయలరీ పార్కులో తాగునీటి వసతి, డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ను జ్యూయలరీ పార్కు ప్రతినిధులు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పైప్లైన్ ఏర్పాటు చేసి తక్షణమే నీటి వసతి కల్పనకు కృషి చేయాలన్నారు. గుడివాడలోని ఆటోనగర్లో చెల్లింపు పద్ధతిలో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు, కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, డీపీవో జె అరుణ, మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 3.50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు నెలలో 3.50 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సోమవారం సాయంత్రం మొక్కల పెంపకంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 2.51 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. వాటన్నింటిని సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. జిల్లాలో ఇంకా 3.50 లక్షల మొక్కలను వివిధ పాఠశాలలు, వసతిగృహాలు, గ్రామపంచాయతీల్లో నాటేందుకు ప్రణాళికను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నగరంతో పాటు అన్ని పట్టణాల పరిధిలో ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్యాదవ్, డీఎఫ్వో సునీత, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీపీవో జె.అరుణ, డీఈవో పీవీజె రామారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
పేదల ఇళ్లపై కూటమి గద్దలు..
బందరులోని 41వ డివిజన్ కుమ్మరిగూడెం ప్రాంతంలోని పేద ప్రజలకు గత పాలకులు దాదాపు 200 స్థలాలు ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పేదలు అప్పులు చేసి మరీ రేకుల షెడ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు ఈ స్థలం అవసరమని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో కార్పొరేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పేదలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ గృహాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు. అదే డివిజన్లోని రాజీవ్నగర్లో ఓ ప్రైవేటు స్థలంలో రేకులషెడ్లు, పూరిళ్లు నిర్మించుకుని 30 ఏళ్లకు పైబడి ఉంటున్న పేదల గృహాలను కమిషనర్ బాపిరాజు కూల్చేప్రయత్నం చేశారు. రెండు ఇళ్లను పూర్తిగా కూల్చేశారు. -
ఇద్దరు యువకులు దుర్మరణం
మధురానగర్(విజయవాడసెంట్రల్):రామవరప్పాడు రింగ్ సెంటర్ ఇన్ హోటల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడకు చెందిన తుమ్మాటి తనుష్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. తనుష్కుమార్ బాబాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో బాబాయిని చూసేందుకు విజయవాడ వచ్చిన తనుష్కుమార్ తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 11.30 గంటలకు రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా ద్విచక్రవాహనంపై వచ్చిన మాదాల ఏసు (20) ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తనుష్కుమార్, ఏసులను 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాబాయిని చూడటానికి వచ్చిన తనుష్కుమార్ తిరిగి రాని లోకాలకు వెళ్లడంపై కుటుంబ సభ్యులు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడిపెట్టించాయి. -
19న యోగాసన, చిత్రలేఖన పోటీలు
విజయవాడస్పోర్ట్స్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి యోగాసన పోటీలు, యోగాసనాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.మురళీకృష్ణ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చేతుల మీదుగా కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ మేరకు సర్వోదయ ట్రస్ట్, కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ పేటలోని బందర్ లాకులు వద్ద ఉన్న సర్వోదయ ట్రస్ట్, కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘ భవనంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆ రోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాసనా పోటీలు, పది నుంచి 12:00 వరకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. పోటీల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు 9441119909(యోగా), 9502944913 (చిత్రలేఖనం) నంబర్లను సంప్రదించి ముందస్తుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడంతోపాటు పాల్గొన్న వారికి పార్టిసిపేషన్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని వివరించారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్వోదయ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ అంటూ తప్పుడు ప్రచారం..
సాక్షి,కృష్ణాజిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి దిగింది. 2019 నాటి కేసులో పేర్నినానికి మచిలీపట్నం కోర్టు ఆరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని తేటతెల్లమైంది. ఓ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాల్సిన పేర్నినానిని..మరుసటి వాయిదాకు హాజరవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఏముందో చూడకుండా అరెస్ట్ వారెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఎల్లోమీడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘తల్లికి వందనం.. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకున్నాడు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైఎస్సార్ కార్పొరేటర్ విజయవాడలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాము. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి.చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. -
తల్లులకు ఆంక్షల పోటు
ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అప్పుడు నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ప్రచారం చేసి ఇప్పుడు రూ.13 వేలు మాత్రమే వేస్తున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలో అర్హులైన వేలాది మందిని అనర్హులుగా ప్రకటించారు. గతంలో అమ్మ ఒడి తీసుకున్న కుటుంబాలన్నిటికీ ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వాలి. – వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత ●కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది తల్లులను పలు కారణాల పేరుతో అనర్హులుగా ప్రకటించి ఎగ్గొడుతోందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి సంబంధించి తాము అధికారంలోకి వస్తే ప్రతి పిల్లవాడికి అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడి చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే వేలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచింది.అడుగడుగునా మోసం.. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి అడుగడుగునా మోసం చేస్తోంది. తాజాగా తల్లికి వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి మొండి చెయ్యి చూపుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కేవలం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే 50 వేల మంది వరకూ గతంలో తీసుకున్న తల్లులకు అనర్హులుగా ప్రకటించారు. లేనిపోని ఆంక్షలతో తల్లులందరినీ అనర్హులుగా ప్రకటించటం సరికాదు. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ, ఎన్టీఆర్ జిల్లా వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పలు కారణాలు చూపుతూ వేలాది మందికి ఈ పథకాన్ని ఎగవేసేందుకు పాలకులు కుట్ర చేశారని విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించి ఆదాయం ఉంటే వారికి ఈ పథకం వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉంటే వారికి సైతం ఈ పథకం వర్తించదు. అలాగే గత ఏడాది పది, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఈ పథకంలో చూపటం లేదని ఆయా లబ్ధిదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ పథకంలో పేర్లు కనిపించటం లేదని పలువురు వాపోతున్నారు. అదే విధంగా ఐటీ రిటర్న్ పేరుతో చాలా మందిని దీనిలో అనర్హులుగా ప్రకటిస్తూ జాబితాలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాము ఐటీ చెల్లించటం లేదని వారంతా వివరిస్తున్నారు. రెండు జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. రెండు జిల్లాల్లో కలిపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023లో 3,00,120మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదును వేశారు. ఆ క్రమంలో కృష్ణా జిల్లాలో 1,29,533 మంది తల్లులకు, ఎన్టీఆర్ జిల్లాలో 1,70,587 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నివేదికల ప్రకారం రెండు జిల్లాల్లో 2,53,457 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ అయ్యేటట్లుగా నిధులను విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణా జిల్లాలో 1,11,458 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 1,41,999 మంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. అంటే రెండు జిల్లాల వ్యాప్తంగా 46,663 మంది తల్లులకు ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 18,075 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 28,588 మందికి మొండి చెయ్యి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. రూ.2వేలు కోత.. గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేల నగదును జమ చేసినప్పుడు కూటమి నేతలు చాలా దారుణంగా మాట్లాడారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఆ రెండువేలను పాఠశాలల మరుగుదొడ్లు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించి నిధులను విడుదల చేసింది. వాటిని సక్రమంగా వినియోగిచింది. ఎన్నికల సమయంలో ‘నీకు 15 వేలు, నీకు15 వేలు’ అంటూ కూటమి నేతలు తెగ హడావుడి చేశారు. కానీ అధికారంలోకి వచ్చి, ఏడాది ముగిసిన తరువాత అదే రూ.13 వేలు వేసి మిగిలిన రెండు వేలను పాఠశాలల అభివృద్ధి పేరుతో పక్కదారి పట్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆ రెండు వేలను ఏ ఖాతాలో వేస్తున్నారో స్పష్టత లేదని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా 2023లో 2025లో తగ్గిన సంఖ్య తల్లుల సంఖ్య తల్లుల సంఖ్యకృష్ణాజిల్లా 1,29,533 1,11,458 18,075 ఎన్టీఆర్ జిల్లా 1,70,587 1,41,999 28,588 మొత్తం 3,00,120 2,53,457 46,663 ‘తల్లికి వందనం’లో ఆంక్షల పేరుతో వేలాది మంది అనర్హులుగా ప్రకటన గత ప్రభుత్వంలో 3,00,120 మంది తల్లులకు పథకాన్ని వర్తింపజేసిన వైనం ఇప్పుడు 2,53,457 మందికి మాత్రమే పరిమితం చేసిన కూటమి సర్కార్ లోకేష్, చంద్రబాబు ప్రకటనలపై మండిపడుతున్న విద్యార్థుల తల్లులు గతంలో తీసుకున్న తమకూ పథకాన్ని వర్తింపజేయాలంటున్న తల్లులు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 46,663 మంది తల్లులకు ఎగనామంఅర్హుల జాబితా చూసి షాక్..వరుసగా రెండో ఏడాది .. నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు డిగ్రీ, రెండో బాబు ఇంటర్మీడియెట్. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి ఏటేటా అందింది. గతేడాది నుంచే తల్లికి వందనం ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇంటర్మీడియెట్కు వెళ్లాడు. వివరాలు అప్లోడ్ చేయాలంటున్నారు. రెండు సంవత్సరాల పాటు తల్లికి వందనం పోయినట్టే. మళ్లీ ఎప్పుడు పిల్లల చదువులకు సొమ్ము అందుతుందో అర్థం కాని పరిస్థితి. – తోకల ఉమాదేవి, కోలవెన్ను వార్డు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలను అధికారులు ప్రకటించారు. అయితే గతంలో అమ్మ ఒడి పథకం తీసుకున్న వారి పేర్లు ప్రస్తుత జాబితాల్లో అనర్హులుగా కనపడుతుండటంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ తాము తీసుకున్న ఈ పథకం ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటూ మండి పడుతున్నారు. సచివాలయాల సిబ్బంది మీ పేరు మీద కారు ఉందని, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని, స్థలం నమోదైందని పలు అంశాలను వివరిస్తున్నారు. అయితే తమకు వారు చెబుతున్నవి ఏమీ లేవంటూ వాపోతున్నారు. -
డ్రగ్స్తో యువతకు అపాయం
నార్కోటిక్స్ విభాగం ఐజీ రవికృష్ణ లబ్బీపేట(విజయవాడతూర్పు): మాదక ద్రవ్యాలతో యువత అపాయంలో పడుతున్నారని నార్కోటిక్స్ విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్కాన్ విజయవాడ, ఎర్త్ హీరోస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం డ్రగ్ ఎడిక్షన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ వాక్థాన్ కొనసాగింది. విద్యార్థులు, యువత, వలంటీర్లు, భక్తులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సమాజానికి వ్యసన వ్యతిరేక సందేశాన్ని ఇవ్వడంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యసనాన్ని ఎదుర్కోవాలన్నారు. డ్రగ్స్పై టోల్ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించవచ్చని, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. మరో అతిఽథి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో నష్టాన్ని కలిగించే మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుంటున్నారన్నారు. ఈ తరుణంలో ఇస్కాన్, ఎర్త్ హీరోస్ వంటి సంస్థలు సమాజంలో చైతన్యవంతమైన ఉద్యమాలు చేస్తూ యువతను సన్మార్గంలో నడిపించడంలో కీలకంగా నిలుస్తున్నాయన్నారు. ఇస్కాన్ విజయవాడ అధ్యక్షుడు ఏఏ చక్రధారి దాస్ మాట్లాడుతూ యువతను భక్తిమార్గం ద్వారా వ్యసనాల నుంచి విముక్తి కలిగించే మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈగిల్ యూనిట్ ఎస్సీ నాగేష్బాబు, ఎర్త్ హీరోస్ ఫౌండర్ హాసిని రెడ్డి, నవీన్, దుర్గాప్రసాద్, ఎర్త్హీరోస్ విజయవాడ చాప్టర్ ప్రతినిధులు భాన్సీనాయుడు, చంద్రిక తదితరులు పాల్గొన్నారు. -
ఐక్య ఉద్యమానికి కార్యాచరణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శాతవాహన కళాశాలకు చెందిన భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వీ.సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆ కళాశాల పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ అధ్యాపకుల సమావేశం (గెట్ టూ గెదర్) విశాలాంధ్ర పత్రిక కార్యాలయం ఆవరణలో ఆదివారం జరిగింది. వి.సాంబిరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పు పేరుతో కళాశాల భవనాలను కూల్చివేసిన వారే భవనాలను నిర్మించాలన్నారు. కళాశాల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే పరిరక్షణ కమిటీ తరఫున కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటం చేసైనా కళాశాలను రక్షించుకోవాలన్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలు అందజేయడంతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.. కమిటీ కో–కన్వీనర్ డి.విష్ణువర్థన్ మాట్లాడుతూ రాత్రి వేళ భవనాలను కూల్చి వేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ కో– కన్వీనర్స్ ఎం.అరుణ్కుమార్, ఎన్.సాంబశివరావు, పూర్వ విద్యార్థులు బైపూడి నాగేశ్వరరావు, సైనుద్దీన్, శ్రీనివాసరావు, కిరణ్, విద్యార్థి సంఘాల నాయకులు రవిచంద్ర, రాజేష్, షణ్ముఖ్తో పాటుగా రిటైర్డ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ సమావేశంలో నిర్ణయం -
ఆధారాలుంటే చూపించండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రాజకీయంగా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తీవ్రంగా ఖండించారు.మచిలీపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్ని కిట్టు మాట్లాడారు. బందరు పోర్టును మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ లబ్ధి కోసం గోగిలేరుకు అమ్మేశాడంటూ కొల్లు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పేర్ని నాని బందరుపోర్టును గోగిలేరుకు తరలించేందుకు సంతకం చేశారనేందుకు ఏవైనా సాక్ష్యాలు ఉంటే ప్రజల ఎదుట పెట్టాలని సవాల్ చేశారు. పేర్నిని డిస్క్వాలిఫై చేయాలంటూ మంత్రి మాట్లాడటం చూస్తుంటే జాలి కలుగు తోందన్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారా? 2018లో బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాటలు మరిచిపోయారా అంటూ కిట్టు ఎద్దేవా చేశారు. రాజకీయ సన్యాసం తీసుకోకుండా ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని పోటీ చేశారని ప్రశ్నించారు. పనుల్లో పర్సంటేజీల కుటుంబం ఎవరిదో ప్రజలే చెబుతారన్నారు. ఎన్నికలు మరో నెల రోజులు ఉన్నాయనగా 2018 ఫిబ్రవరి 8వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని బందరు తీసుకువచ్చి హడావుడిగా టెంకాయలు కొట్టించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కోర్టును ఆశ్రయిస్తే తప్పేంటి.. అన్యాయం జరిగితే న్యాయం కోసం ఎవరైనా ఆశ్రయించేది కోర్టునే అన్న విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తెలుసుకోవాలని పేర్ని కిట్టు అన్నారు. ఆ నాడు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తే ఇంటి వెనుక గోడ దూకి ఎందుకు పారిపోయారని నిలదీశారు. బందరు నుంచి పారిపోయి తునిలో పోలీసులకు చిక్కిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఆనాడు బెయిల్ను కోర్టు నుంచి కాకుండా నారా చంద్రబాబునాయుడు నుంచి తెచ్చుకున్నారా అని ప్రశ్నించా చేశారు. తన తండ్రి పేర్ని నాని తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాల్లోని మహిళలను తీసుకురావటం దుర్మార్గమన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని మంత్రి రవీంద్ర గుర్తుంచుకోవాలన్నారు. తమ రోజు అంటూ వచ్చాక ఆ రోజు తానేంటో.. తనకు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఏంటో కచ్చితంగా చూపిస్తానంటూ మంత్రిని హెచ్చరించారు. మంత్రి కొల్లు రవీంద్రపై మండిపడిన వైఎస్సార్ సీపీ మచిలీపట్నం ఇన్చార్జ్ పేర్ని కిట్టు -
భక్తిశ్రద్ధలతో గుడారం, మద్దిరావమ్మ సంబరం
భావదేవరపల్లి(నాగాయలంక): పూర్వీకుల నూరేళ్ల అచ్చమైన మత సామరస్యానికి ప్రతీక.. మండలంలోని భావదేవరపల్లి గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర. మహోత్సవాల్లో ఇందుకు తార్కాణంగా శనివారం రాత్రి మత సమ్మిళిత ఆధ్యాత్మిక వైచిత్యాన్ని ప్రదర్శించారు. గ్రామంలో మూడేళ్లకొకసారి నిర్వహించే గ్రామదేవత ఉర్వేళమ్మ జాతరకు ముందుగా పూర్వీకుల సంప్రదాయం రీత్యా మదార్ సాహెబ్ గుడారం సంబరం జరిగింది. గ్రామంలో మదార్ సాహెబ్ జెండా ఊరేగింపు తర్వాత పెదగుడు మోటుకు చెందిన మత పెద్ద మదీనాకృష్ణ ఆధ్వర్యంలో గుడారం వద్దకు చేరుకున్నాక భక్తులు మదార్ సాహెబ్కు మూడేసి చొప్పున రొట్టెలు, గంధపు ఉండలు, చుట్టలు, జెండాలు, చిల్లర నాణేలు సమర్పించారు. అనంతరం గ్రామస్తులు దీపజ్యోతుల అలంకారంతో కూడిన వేడి నైవేద్యాలతో భారీ ఊరేగింపుగా ఉర్వేళమ్మ ఆలయం సమీపంలోని మద్దిరావమ్మ స్థావరానికి తరలివెళ్లి వాటిని సమ ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాత్రి వేళ మద్దిరావమ్మ సంప్రదాయ కథను పంబలోళ్లు గానం చేయగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఆసక్తిగా విన్నారు. ధర్మకర్త భోగాది విశ్వేశ్వరరావు, సర్పంచ్ మండలి ఉదయభాస్కర్, ముమ్మారెడ్డి వెంకట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఐదుకోట్ల మంది ప్రజలను మభ్యపెట్టి అఽధికారంలోకి వచ్చాక, మేనిఫెస్టోను అమలు చేయకుండా గాలికొదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై 120 పేజీలతో ముద్రించిన పుస్తకాన్ని ఆదివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో కలిసి వేణుగోపాలరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరెడ్డి మాట్లా డుతూ.. 2019 వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో ఎలా అమలైందో, కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు గమనించారన్నారు. దేవినేని అవినాష్ నాయకత్వంలో జిల్లాలో అనేక పోరాటాలు చేస్తామని చెప్పారు. చైతన్యవంతులను చేస్తాంవచ్చేది వైఎస్సార్ సీపీనే అని కూటమి ప్రభుత్వానికి, అధికారులకు అర్థమైందన్నారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. కూటమి పిచ్చి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా రెడ్బుక్ పాలన సాగిస్తోందని విమర్శించారు. పరిపాలన ఎలా ఉందో, ప్రజలను ఎలా మోసం చేసిందో ఈ పుస్తకం రూపంలో ప్రజల దగ్గరికి తీసుకొచ్చామన్నారు. వరదలు వచ్చి విజయవాడ మునిగితే ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. తల్లికి వందనాన్ని 30 లక్షల మందికి ఎగ్గొటారని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి రెడ్బుక్ చూపించి భయపెడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామని, కూటమి నాయకులు ఏ సవాల్ విసిరినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు వెన్నుపోటుమాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాల్సిన సమయం వచ్చిందన్నారు. కూటమి మోసపూరిత హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఈ పుస్తకాన్ని తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ మాట్లా డుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి కార్యాలయంలో మేనిఫెస్టో పెడితే, కూటమి మాత్రం రాష్ట్రం అంతా ఓ రెడ్బుక్ రాజ్యాంగం సాగిస్తోందన్నారు. వారిచ్చిన 153 హామీలు ఊసే లేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారన్నారు. జగ్గయ్యపేట పార్టీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయంతోనే అరకొరగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ప్రజల అండగా వైఎస్సార్ సీపీ కూటమి ప్రభుత్వ మెడలు వంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ, నేత నాగేంద్రపుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలను నమ్మించి మోసం చేశారు కూటమి మేనిఫెస్టోను గాలికి వదిలేశారు చంద్రబాబు అంటే మోసం.. జగన్ అంటే నమ్మకం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగల వేణుగోపాలరెడ్డి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై పుస్తకావిష్కరణ -
బలమైన వస్తువుతో కొట్టిన భార్య
చల్లపల్లి: బలమైన వస్తువుతో భార్య కొట్టడంతో మతిస్థిమితంలేని భర్త మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి నారాయణరావునగర్లో చోటుచేసుకుంది. విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో ఘటన ఒక రోజు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. చల్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన బోలెం శ్రీనివాసరావు(45)కు చిట్టూర్పు గ్రామానికి చెందిన మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో శ్రీనివాసరావు తలకు బలమైన దెబ్బతగలటంతో మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటికే గర్భణి అయిన మంగమ్మ శ్రీనివాసరావును వదిలి వెల్లిపోయింది. అప్పటి నుంచి శ్రీనివాసరావు దేవరకోటలోని తండ్రి గురునాథప్రసాద్ ఇంటివద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా మంగమ్మ కొడుకు కార్తీక్ను వెంటబెట్టుకుని ఐదు నెలల క్రితం దేవరకోటకు వచ్చింది. తాను కొంత కాలంగా చల్లపల్లి నారాయణరావునగర్లో ఉంటున్నానని భర్త శ్రీనివాసరావు కావాలని ఆయనతోనే ఉంటామని నమ్మబలికింది. మామ గురునాథప్రసాద్ వారిద్దరినీ దేవరకోటలోనే అక్కడే ఉండనిచ్చారు. అక్కడ ఒక నెల ఉన్న తర్వాత నాలుగు నెలల క్రితం మంగమ్మభర్త శ్రీనివాసరావును తీసుకుని చల్లపల్లి నారాయణరావునగర్ కాలనీలో తాను ఉంటున్న ఇంటికి వచ్చేసింది. మంగమ్మ రోజువారీ పనికి వెళుతుండగా కొడుకు కార్తీక్ కూలిపనులకు వెళ్లివస్తుంటాడు. మతిస్థిమితంలేని శ్రీనివాసరావు ఇంటి వద్దే ఉంటున్నాడు. భర్త శరీరంపై గాయాలు చూపించి.. ఇలా ఉండగా శనివారం ఉదయం మంగమ్మ తన భర్త శ్రీనివాసరావును తీసుకుని స్థానిక పోలీస్టేషన్కు వెళ్లింది. శ్రీనివాసరావు వంటిపై గాయాలు చూపించి తన భర్తను మామ, మరిది ఇద్దరూ కలిసి కొట్టారని వారిని మందలించాలని కోరింది. అదేరోజు సాయంత్రం 5గంటల సమయంలో మంగమ్మ పోలీసులకు ఫోన్ చేసి తన భర్త అన్నం తింటూ చనిపోయాడని తెలిపింది. పైళ్లెన కొత్తలో కూడా..రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా మంగమ్మ తరచూ శ్రీనివాసరావును కొడుతుంటుందని 20 ఏళ్ల క్రితం పైళ్లెన కొత్తలో కూడా ఆమె కొట్టడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని తేలిందని చెప్పారు. నాలుగు నెలల నుంచి కూడా అడపాదడపా మంగమ్మ శ్రీనివాసరావును కొడుతోందని ఈ కోవలోనే శనివారం కూడా ఆమె బలమైన వస్తువుతో శ్రీనివాసరావు తలపై కొట్టగా అతను పడిపోయి మరణించినట్లు చెప్పారు. మృతుడు తండ్రి గురునాథ్ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి శ్రీనివాసరావు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ కె.ఈశ్వరరావు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మతిస్థిమితం లేదని భర్త మృతి కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఘటన -
‘లజ్జబండ’ను దాటుతూ జారిపడి..
పెడన: కుమార్తెను చూడాలనే ఆతృతతో ఎప్పుడు వెళ్లే దగ్గర దారిలోనే లజ్జబండను దాటుతూ తండ్రి.. తెట్టుపై నుంచి జారి పడికనిపించకుండా పోయిన ఘటనపై పెడన పీఎస్లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెడన మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన మురాలా బాలచంద్రరావు(57) తన కుమార్తె రాజులపాటి పుష్పకుమారిని చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం బయల్దేరాడు. అడ్డరోడ్డులోని లజ్జబండ డ్రెయిన్ను దాటేందుకు వీలుగా రెండు పక్కల తాడు కట్టి తెట్టుపై డ్రెయిన్ దాటే సమయంలో తెట్టుపై నుంచి జారీ డ్రెయిన్లో పడిపోయాడు. తండ్రి ఎప్పుడో వచ్చేస్తానని రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీశారు. ఆయన బయల్దేరినట్లు తెలియడంతో డ్రెయిన్లో పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి సిబ్బందితో డ్రెయిన్లో గాలింపు మొదలు పెట్టారు. తల్లి, ముగ్గురు చిన్నారులు అదృశ్యంగుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు చెందిన దేవరపల్లి జయలక్ష్మి(35) అనే మహిళ తన పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణకు ఆమె భర్త దేవరపల్లి రాజు ఫిర్యాదు చేశారని ఆదివారం తెలిపారు. తన పిల్లలు ప్రణవి(9), విద్యశ్రీ(7), వందన(6)ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన జయలక్ష్మి ఆచూకీ ఇంతవరకు తెలియలేదన్నారు. పై ఫొటోల్లో ఉన్న వ్యక్తుల ఆచూకీ తెలిస్తే 9550593568(దేవరపల్లి రాజు) లేదా గుడ్లవల్లేరు పోలీస్స్టేషన్(9440796432)కు తెలియజేయాలని ఎస్.ఐ సత్యనారాయణ కోరారు. -
కాలువలకు సాగునీరు విడుదల
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల తర్వాత రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300 మొత్తంగా 1000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రైతులు సకాలంలో పంటలను వేసి తుపానుల నుంచి రక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాగు నీటి వినియోగ దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య కంకిపాడు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై స్థానిక పీఎస్లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పునాదిపాడు ఎస్సీ కాలనీకి చెందిన కొప్పులు ముత్తయ్య (45) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సుమారు పదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. ముత్తయ్య మనోవేదన చెందుతూ మద్యానికి అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడ్డుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించే సరికి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కృష్ణలో పడి యువకుడి గల్లంతు శ్రీకాకుళంలో ఘటన శ్రీకాకుళం(ఘంటసాల): బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి యువకుడు గల్లంతైన ఘటన ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘంటసాల ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ఆత్కూరి ధర్మరాజు కుమారుడు ఫణి కుమార్ (25) ఆదివారం సాయంత్రం కృష్ణానది వైపు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా)కు తెలిపి గ్రామస్తులతో కలసి ఘటనా స్థలానికి వెళ్లి వెదికారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పడవలు, స్థానికులతో కృష్ణానదిలో వెదుకులాట ప్రారంభించడంతో పాటు ఎస్డీఆర్ఎఫ్కు సమాచారమిచ్చారు. శ్రీకాకుళం వీఆర్వో డి.గోపి సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని విషయాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రిక్షా లాగుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రికి ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న ఫణి కుమార్ అందరితో కలివిడి ఉంటారని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఆటోలో వెళ్తూ రోడ్డుపై పడి వ్యక్తి మృతి కంచికచర్ల: ఓ వ్యక్తి ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలూ మృతిచెందిన ఘటన కంచికచర్లలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన గుడిసె నరసింహారావు(31) అనే వ్యక్తి కీసరలో ఆటో ఎక్కి కంచికచర్ల బయలుదేరారు. ఆటోలో మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. నరసింహారావు ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కంచికచర్ల కంచిలమ్మ చెరువుకట్ట సమీపంలో రాగానే ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సాగుకు తూటు గండం
కృష్ణాజిల్లాఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025u8లో కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా... రేషన్ షాపుల్లో నో స్టాక్చదువుల గుడులపై పచ్చ దందా దొంగలున్నారు జాగ్రత్త! ఏఈపీఎస్ తరహా సైబర్ నేరాలు విజయవాడలో పునరావృతం అయ్యాయి. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు రామవరప్పాడు/గుణదల: మహిళలకు రక్షణ కల్పనలో ప్రభుత్వం విఫలమైందని మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. విజయవాడలో శనివారం కూటమి పాలనపై చర్చా వేదిక జరిగింది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సాగుకు తూటుకాడ పెను సమస్యగా మారింది. పంట కాలువలు, ఇరిగేషన్ డ్రెయిన్లను తూటుకాడ, గుర్రపుడెక్క ఆక్రమించి సాగునీటి ప్రవాహానికి ఆటంకంగా నిలిచాయి. కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీయకపోవడం, తూటు, గుర్రపు డెక్క దట్టంగా అల్లుకుపోవడంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు చేరడం కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాలువలకు మరమ్మతులు చేపట్టకుండానే సాగునీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. ‘సాగునీటి విడుదలపై సందిగ్ధం’ శీర్షికన ఈ నెల పదో తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు ఈ నెల 15వ తేదీ (ఆదివారం) వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగులో రైతులకు కష్టాలు తప్పేలా లేవు. కాలువల నిర్వహణ పనుల్లో జాప్యం కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయ కట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువల నిర్వహణ పనులకు నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోకుండా జాప్యం చేసింది. మే నెలలో పనుల మంజూరు చేసింది. రూ.10 లక్షల పనులను నామినేషన్పైన నీటి సంఘాలకు కట్టబెట్టే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికీ కొన్ని చోట్ల డిస్ట్రి బ్యూటరీ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ల మధ్య ఒప్పందం కుదరక పనులు ప్రారంభం కాలేదు. కాలువలకు నీరు విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు చేరటం కష్టమని నీటి పారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 24 టీఎంసీలకు పైగా జలాలు ఉన్నా సాగునీటి విడుదలలో జరిగిన జాప్యంపై రైతులు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్వానంగా కాలువలు, డ్రెయిన్లు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని రామవరప్పాడు, పెరికీడు మధ్య 47 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే కాలువ అధ్వానంగా ఉంది. బుడమేరు గండ్లకు మరమ్మతులు పూర్తి కాలేదు. పెడన నియోజకవర్గంలో చెన్నూరు డ్రెయిన్లో పూడిక తీయలేదు, మరమ్మతులు జరగలేదు. పనులు చేయకుండా నీటి విడుదలపై టీడీపీ ప్రజా ప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బందరు ప్రధాన కాలువ తూటికాడ, గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయింది. గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల పరిధిలో కొద్ది పాటి వర్షాలకే డ్రెయిన్లు ఉప్పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో డ్రెయిన్ల పూడిక తీయకపోవడంతో అధ్వానంగా మారాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాలి, మోటూరు ఎల్ఎస్ మేజర డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. లజ్జ బండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకోడు, వన్నేరు, ముస్తాఫాకోడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకోడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూటు దట్టంగా అల్లుకున్నాయి. కాలువ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆయకట్టు ఆయకట్టు (ఎకరాల్లో) (ఎకరాల్లో) బందరు 1.51 లక్షలు – కేఈబీ 1.38 లక్షలు – ఏలూరు 0.56 లక్షలు 1,332 రైవస్ 2.17 లక్షలు 425 మొత్తం 5.62 లక్షలు 1,757 Iన్యూస్రీల్25 నుంచి వెబ్ ఆప్షన్లు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని కన్వీనర్ విజయసారథి తెలిపారు. 25వ తేదీన ఎన్సీసీ, విభిన్న ప్రతిభావంతులు, 26, 27 తేదీల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, 28వ తేదీన క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జూలై ఒకటో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. జూలై మూడో తేదీన సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తామని విజయసారథి ప్రకటించారు. 20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ 21వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన 25 నుంచి స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ –2025 జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలిసెట్లో ర్యాంకులు పొందిన విద్యార్థులు 20వ తేదీ నుంచి ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించా లని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన వారి సర్టిఫికెట్లను ఈ నెల 21వ తేదీ నుంచి పరిశీలిస్తామని తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 21 నుంచి 28వ తేదీ వరకు రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. పూడిక తీయకపోతే కష్టంతూటు, గుర్రపు డెక్కతో నిండిన కాలువలు పంట కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రధానంగా బందరు, రైవస్, కేఈబీ, ఏలూరు కాలువలు తూటికాడ, గుర్రపు డెక్కతో నిండిపోయాయి. పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు అక్కడక్కడా కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు, మెయింటినెన్స్ కోసం రూ.26.03 కోట్ల విలువైన 650 పనులను మంజూరు చేశారు. ఈ పనులు చాలాచోట్ల మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో కాలువలకు సాగు నీరు విడుదల చేస్తే నిర్వహణ పనులు జరిగే అవకాశం ఉండదు. పనులు చేయకుండానే నిధులను స్వాహా చేసే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తూటు, గుర్రపుడెక్క కారణంగా సాగునీరు దిగువకు ప్రవహించేందుకు ఆటంకాలు తప్పవు. ఆయకట్టుకు చివరి భూములకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురిస్తే డ్రెయిన్లు పొంగి పొలాలు నీటమునిగే ప్రమాదం ఉంది. దీంతో ఈ ఏడాది తమకు కష్టాలు, కడగండ్లు తప్పేలాలేవని రైతులు వాపోతున్నారు.కాలువలు అధ్వానం కాలువలు అధ్వానంగా ఉన్నాయి. నేడో, రేపో నీరు వదులుతామని అంటున్నారు. కాలువల్లో ఎక్కడ చూసినా తూటు, గుర్రపుడెక్కే కనిపిస్తున్నాయి. కాలువల్లో పూడికతీత తీయాల్సి ఉంది. అప్పుడే శివారు భూములకు సాగు నీరు అందుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గుర్రపు డెక్క, తూటుకాడపై ఇప్పుడు హడావిడిగా మందులు పిచికారీ చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. – వి.మరియదాసు, కౌలురైతు, గొడవర్రు నేడు కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల ఆయకట్టు తూటుకాడ, గుర్రపుడెక్క, పూడికతో కాలువలు, డ్రెయిన్లు అస్తవ్యస్తం ఆయకట్టు చివరి భూములకు సాగు నీరుచేరడం కష్టమే.. చిన్న వర్షానికే డ్రెయిన్లు పొంగి నీట మునుగుతున్న పంట పొలాలు నిధులు మంజూరైనా ముందుకు సాగని కాలువల మరమ్మతులు కేఈబీ కెనాల్ మొత్తం మట్టిమేటతో పూడిపోయింది. మట్టిమేటను తొలగించకుండా సాగు నీరు వదిలినా రైతులకు ప్రయోజనం ఉండదు. గత సంవత్సరం నాగాయలంక, కోడూరు పంట కాలువలకు సరిగా సాగునీందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగునీటి విడుదలలో వంతుల వారీ విధానంతో ఫలితం లేదు. ఈ సంవత్సరం అంతకంటే దారుణంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సాగుచేయాలంటే భయంగా ఉంది. – బీసాబత్తిన ప్రసాద్, డీసీ మాజీ చైర్మన్, నాగాయలంక