Krishna
-
అహంకారాన్ని చూపిస్తారా?
బాధితుల్ని ఓదార్చాల్సిందిపోయి.. చిలకలపూడి(మచిలీపట్నం): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చాల్సింది పోయి.. రాష్ట్ర మంత్రులు అహంకారంతో వ్యవహరించడం, సంస్కారం లేని మాటలు మాట్లాడటం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన సమయంలో అహంకారాన్ని చూపిస్తారా? అని మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సెక్షన్లలో 22 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా.. పది మందితో పని చేయించడం వల్ల ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి 3.2 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18 వేల మంది కార్మికులు పనిచేయగా.. నేడు 7.2 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యమున్నా కేవలం 8 వేల మంది కార్మికులు పనిచేయిస్తున్నారని వివరించారు. అనుభవం ఉన్న కార్మికులను గత రెండేళ్లలో వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాల్సిందిపోయి.. ‘మీ ఇంట్లో వాళ్లు చనిపోయారా?’ అంటూ మంత్రి నారా లోకేశ్ అహంకారంగా మాట్లాడటం ఏమిటని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి పరిహారం ప్రకటించలేదని విమర్శించారు. 2011లో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులకు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్నే.. ఇప్పుడు యాజమాన్యం ద్వారా ఇస్తామనడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రమాదం జరిగిన గంట ల్లోనే కేంద్ర మంత్రి ఘటనా స్థలానికి రాగా.. ఒక రోజు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, అన్ని శాఖల మంత్రి నారా లోకేశ్ రావడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిదర్శనమన్నారు. ‘గతంలో కార్మిక సంఘాల సమావేశంలో తాను మాట్లాడినప్పుడు.. చెయ్యి ఎత్తకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదు. జగన్మోహన్రెడ్డి ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తే మేమే ఆపాం’ అని డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మాట్లాడారంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడిన వీడియోను పేర్ని నాని ప్రదర్శించారు. ‘స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించింది. అందువల్లే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని 2025 జనవరిలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన వీడియోను చూపించి పవన్కల్యాణ్ను పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్లాంట్ను సందర్శించావా? అని పవన్ను నిలదీశారు. నాడైనా, నేడైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని.. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పోరాటం చేస్తామని.. అధికారంలో ఉంటే ప్రైవేటీకరణకు అడ్డం పడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎంవైఎస్ జగన్ ప్రకటించిన విధంగా.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యోగం కల్పించా లని పేర్ని నాని డిమాండ్ చేశారు. మంత్రులు లోకేశ్, పవన్కల్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని పునరుద్ఘాటన -
దోష రహిత ఓటర్ల జాబితా కీలకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోష రహిత ఓటర్ల జాబితా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సర్పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్ ప్రక్రియలోని ఐదు దశలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) అందజేత, స్వీకరణ, ఫారాల డిజిటైజేషన్, పూర్తి షెడ్యూల్ తదితర అంశాలను వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. క్లయిమ్లు పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్ ప్రక్రియ చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
టీచర్లకు ముగిసిన శిక్షణ కార్యక్రమం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహించిన పునాది అభ్యాసన, సంఖ్యాత్మకత శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఒకటో తరగతి బోధించే 854 మంది ఉపాధ్యాయులకు ఏడు ప్రదేశాల్లో ఈ శిక్షణ శిబిరాన్ని వారం రోజులుగా నిర్వహించారు. విజయవాడలోని పడమట, గొల్లపూడి, మైలవరం, విస్సన్నపేట, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున 20 మండలాలకుగాను 60 మంది రిసోర్స్ పర్సన్స్ను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. వారు వారివారి ప్రదేశాల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారని వివరించారు. ప్రధానంగా విద్యార్థులకు బోధనలతో, నూతన పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలను, సామర్థ్యాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు నేర్పి తద్వారా పాఠశాలలో అమలు చేస్తారన్నారు. జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. రమేష్బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ, స్టేట్ అబ్జర్వర్ సీహెచ్ వెంకటరమణ, స్టేట్ ఎఫ్ఎల్ఎన్ కోఆర్డినేటర్లు ప్రతిష్ట కుసుమాలు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. ఎగువ నుంచి 1250 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ గాంధీనగర్ కు చెందిన గుండా కృష్ణకార్తీక్ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.చల్లపల్లి: స్థానిక లక్ష్మీపురం రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం కృష్ణా జిల్లా జేసీ ఎం. నవీన్ సందర్శించి, ఎరువుల పంపిణీపై అధికారులకు పలు సూచనలిచ్చారు. -
తల్లికి వందనానికి నిబంధనలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిబంధనలతో తల్లికి వందనం పథకానికి ఎసరు పెట్టేందుకు కసరత్తు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ లేని కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాలలు కార్మికులుగా మారకూడదనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను బడికి పంపించే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమచేసి. బాలలు అందరినీ బడిబాట పట్టిం చింది. ఆ పథకానికి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం పథకం పేరును తల్లికి వంద నంగా మార్చి అర్హుల సంఖ్యను భారీగా తగ్గిం చింది. తాజాగా ఎస్సీ విద్యార్థులకు కొత్త నిబంధనలను తీసుకొచ్చి తల్లికి వందనం పథకాన్ని వారికి దూరం చేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కొత్త ఖాతా తెరవాల్సిందే.. పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియెట్లో చేరిన ఎస్సీ విద్యార్థులు అందరనూ కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాతా తెరిచిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుందనే స్పష్టంచేశారు. విద్యార్థి కేవలం ఆధార్కార్డు, దానికి లింకై న ఫోన్ నంబర్తో బ్యాంక్ ఖాతాను తెరవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ లోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ శాఖల్లో మాత్రమే ఖాతా తెరిచి ఆ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. పాన్కార్డు కావాల్సిందే.. కొత్తగా ఖాతాను తెరిచేందుకు వెళ్తున్న విద్యార్థులను బ్యాంకర్లు పాన్ కార్డ్ కావాలని అడుగుతున్నారు. పాన్ కార్డు లేకుండా కొత్తగా ఖాతాను తెరవటానికి అవకాశం లేదని కొన్ని బ్యాంకు శాఖల్లో అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన కొన్ని జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఖాతా తెరవాలని సూచించటం, అందులోనూ మూడు నాలుగు రోజుల్లోనే ఈ తంతు పూర్తి చేసి ఆప్డేట్ చేయాలని ప్రకటించటంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా మందికి ఈ సమాచారం తెలియలేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఆధార్ లింకే సమస్య ఆధార్కార్డుకు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకులు ఖాతా తెరిచేందుకు అభ్యంతరం చెబుతున్నాయి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు కొనిచ్చే పరిస్థితి లేదు. కొత్త నిబంధనల నేపథ్యంలో ఫోన్ కొని సిమ్ కార్డు తీసుకుని, దానిని విద్యార్థి ఆధార్ కార్డుకు లింక్ చేయటం ఇప్పటికిప్పుడు పూర్తయ్యే పరిస్థితి లేదు. కొత్తగా ఫోన్ నంబర్ లింక్ చేయాలంటే ఇబ్బందులు తప్పవని, అక్షరాస్యత లేని కుటుంబాలకు ఇంకా కష్టమని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అమ్మ ఒడి పేరుతో గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఈ పథకాన్ని తల్లికి వందనం పేరు మార్చి నీరుగార్చారని విమర్శిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అని చెప్పిన కూటమి ప్రభుత్వం సుమారు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 50 వేల మంది పిల్లలకు ఈ పథకం ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు ఖాతా తెరవాలనే పేరుతో పథకంలో కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇంటర్లో చేరిన ఎస్సీ విద్యార్థులు బ్యాంక్ ఖాతా తెరవాలని ఆదేశం పాన్కార్డు లేకుండా ఖాతాను తెరవబోమంటున్న బ్యాంక్ సిబ్బంది ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకర్ల అభ్యంతరం పథకం ఎగవేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటున్న విద్యార్థి సంఘాలు తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు కొత్తగా ఖాతాలు తెరవాలని చెప్పటం ఏమిటి? అందులోనూ వారికి పాన్కార్డులు ఉండవు. ఆధార్కార్డుకు ఫోన్ లింక్ అయ్యే అవకాశాలు తక్కువ. అసలు వారికి ఫోనే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని పూర్తిగా కోతలు పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఆడుతున్న నాటకంగా కనిపిస్తోంది. ఎటువంటి ఆంక్షలు, కొత్త నిబంధనలు లేకుండా పథకాన్ని అమలు చేయాలి. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి
పెనమలూరు: తల్లులు కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కిల్కారి స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధాన మంత్రి సురక్షిత్ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమంలో భాగంగా మాతృత్వ కిల్కారి సేవలపై తల్లులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ప్రతి గర్భిణి నాలుగో నెల నుంచి బిడ్డ పుట్టిన సంవత్సరం వరకు కిల్కారి కాల్స్ ప్రతి నెలకు ఒకసారి వస్తాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ ప్రతి గర్భిణి ప్రతీ నెల 9వ తేదీన ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలన్నారు. కిల్కారి పీవో రాజు, సీహెచ్వో కుమార్, హెచ్వీ పుష్పావతి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. జి.కొండూరు: ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్తో అర్హులైన రైతులకు రాయితీపై ఎరువులు సకాలంలో అందుతాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మండల పరిధిలోని వెలగలేరు గ్రామంలో శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణంలో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఎరువుల దుకాణాలతో పాటు సహకార సొసైటీలు సైతం ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, తహసీల్దార్ రాణి, ఏఓ సూరిబాబు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన కార్యక్రమం రెండో రోజు సజావుగా కొనసాగిందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపా రు. మంగళవారం ఆయన మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. మూల్యాంకనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే లా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఓ చెప్పారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో వేద, స్మార్త విద్యలను అభ్యసించేందుకు ఆసక్తి కలిగిన బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విధిగా ఉపనయనం జరిగి, సంధ్యావందనం చేస్తూ తెలుగు చదవగలిగిన బాలురు ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. స్మార్త విద్యకు 10 నుంచి 13ఏళ్లు, వేద విద్యకు 10 నుంచి 12 ఏళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాఠశాలలో రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, అపస్తంబ పౌరోహిత్య స్మార్త విద్యను బోధిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వైద్య సదుపాయాలతో పాటు కోర్సు పూర్తి చేసి తుది పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యోగ్యతా పత్రాలతో పాటు రూ. 3లక్షలు స్టయిఫండ్ను అందిస్తారన్నారు. ఇతర వివరాలకు పోరంకిలోని దేవస్థాన వేద పాఠశాల ప్రిన్సిపాల్ను 9440136924లో సంప్రదించవచ్చన్నారు. -
పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన
గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సందర్శించారు. ఆ పాఠశాల పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న పలు భవనాల నిర్మాణ పురోగతి, ఒకేషనల్ భవన నిర్మాణం కోసం మెరక చేసిన స్థలాన్ని, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, తహసీల్దార్ బి.లోకరాజు, ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్, సాగునీటి డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, ఎంఈఓ జి.గోపాలరావు, పాఠశాల హెచ్ఎం రజిని కుమారి, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. -
క్రైస్తవ మైనారిటీలపై దాడులను అరికట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు. జస్టిస్ కె.బాలకృష్ణన్ కమిషన్పై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, ఐసీఎం చర్చ్ బిషప్ జాన్, ఎం.రాజేశ్వరరావు (ఏఐసీసీ), ప్రసాద్ రవికాంత్, మహమ్మద్ కరీముద్దీన్, శ్యామ్ సుందర్, శామ్యూల్ రాజు, రూత్ భారతి, ఆర్.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్, మెల్కీ సెదేక్ -
పవర్ లిఫ్టింగ్లో రాణిస్తున్న నితిన్ కుమార్
మచిలీపట్నంటౌన్: నగరానికి చెందిన కె. నితిన్ కుమార్ పవర్ లిఫ్టింగ్లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తున్నాడు. స్థానిక దేశాయిపేటకు చెందిన ఈ యువకుడు 17 ఏళ్ల వయసులోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల జరిగిన పలు పోటీల్లో పాల్గొని బంగారంతో పాటు పలు పతకా లను సాధించాడు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో నితిన్కుమార్ 12వ తరగతి చదువుతున్నాడు. గత ఏప్రిల్ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 93 కిలోల సబ్ జూనియర్ క్యాటగిరీ పోటీల్లో పాల్గొని టాప్ పోర్ విత్ 327.5 కిలోల బరువును ఎత్తాడు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్నూల్లోని డీఎస్ఏ అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 295 కిలోల బరువు ఎత్తి వెండి, రజిత పతకాలను సాధించాడు. ఫిబ్రవరి 8వ తేదీన గుడివాడలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో జరిగిన సెకండ్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల జిల్లా స్థాయి పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ 2025– 26 పోటీల్లో పాల్గొని సబ్ జూనియర్ 93 కిలోల విభాగంలో 250 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. అండర్ –20 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని 94 కిలోల భాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. ఏ ప్రాంతంలో జరిగిన పోటీల్లోనైనా పాల్గొని పతకాలు సాధిస్తున్న యువ క్రీడాకారుడు నితిన్ కుమార్ను నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను సాధించి మచిలీపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు 17 ఏళ్ల వయసులోనే క్రీడా నైపుణ్యం -
గ్యాస్, పెట్రో ధరలను తక్షణమే రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు, పన్నులు పెంచి ప్రజలను పీక్కుతింటున్నాయని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు పెంపుదలకు నిరసనగా రాస్తారోకో జరిగింది. పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు హైవేపై బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ధరల భారాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైవేపై అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధరలు పెంచడంలో రికార్డులు బ్రేక్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, ఇతర వామపక్షాల నేతలు మాట్లాడుతూ.. 12 సంవత్సరాలు పాలించి మోదీ రికార్డు బ్రేక్ చేయడం కాదు, పన్నులు, ధరలు పెంచడంలో రికార్డులు బద్దలు కొట్టారని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తులపై 12 ఏళ్లలో రూ.40 లక్షల కోట్లు పన్నులు వసూలు చేసిన పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి చమురు రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. రష్యా, ఇరాన్ నుంచి చౌకగా చమురు లభిస్తున్నా అధిక రేట్లకు అమెరికా చెప్పిన విధంగా కొనుగోలు చేసి దేశ ప్రజలపై భారం మోపటం గర్హనీయమన్నారు. ఎన్నికలకు ముందు అదనపు పన్నులు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు కూటమి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా పెట్రోల్పై 35 శాతం, డీజిల్పై 27శాతం పన్నులు వసూలు చేయటం అమానుషమన్నారు. వామపక్ష పార్టీల నాయకులు హరినాథ్, వెంకటేశ్వర్లు, అమర్నాథ్, డి.కాశీనాథ్, జి.కోటేశ్వరరావు, ప్రసాద్ బాబు పాల్గొన్నారు. రాస్తారోకోలో వామపక్ష పార్టీల నాయకులు -
విజయవాడ జీజీహెచ్లో రోగుల సహనానికి పరీక్ష
● ఓపీ రిజిస్ట్రేషన్, మందుల వద్ద బారులు తీరుతున్న జనాలు ● రక్త పరీక్షల వద్ద కూడా అదే పరిస్థితి ● నిత్యం ఇదే విధంగా క్యూ ఉంటున్నా పట్టించుకోని వైనం ● పెద్దాస్పత్రిపై సర్కారు నిర్లక్ష్య వైఖరి ఓపీతో కష్టాలు మొదలు.. మందుల కోసమూ అవే పాట్లు.. -
విద్యార్థుల జీవితాలతో సీబీఎస్ఈ ఆటలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సీబీఎస్ఈ తన అసమర్ధతతో దేశంలోని లక్షలాది యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ అన్నారు. సీబీఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకల తీరును ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడ సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. ఈ సందర్భంగా బందెల నాసర్జీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగి నెలరోజులు కాకుండానే సీబీఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరగటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. పరీక్ష ఫలితాల అనంతరం అనేక వేలమంది విద్యార్థులకు వారి మార్కులు చూసి సందేహం కలిగి రీవ్యాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో భాగంగా వేదాంత్ అనే విద్యార్థి తాను రాసిన జవాబు పత్రం కావాలని స్కాన్ కాపీ కోరాడన్నారు. వచ్చిన పేపర్ తాను రాసిన జవాబు పత్రమే కాదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారని చెప్పారు. సంజన, మోక్ష, హర్షిత విద్యార్థుల పేపర్లు అసలు రీవ్యాల్యుయేషన్ చేయలేదని వాపోయారు. ఈ వరుస తప్పిదాలకు నైతిక బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన కొత్త విధానంలో అనేక సాంకేతిక సమస్యలు బయటకు వచ్చాయన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, శివా, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మక్కపేట(వత్సవాయి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, పెద్దబీరవల్లి గ్రామానికి చెందిన గొర్రెముచ్చు ప్రమీళ (41) మక్కపేట సెంటర్లో ఆటో దిగింది. అనంతరం బైక్ ఎక్కి జగ్గయ్యపేట వైపు వెళ్తుండగా పంచాయతీ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో పెనుగంచిప్రోలు వైపు నుంచి వస్తున్న టిప్పర్ టైరు ఆమె తలపై ఎక్కటంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పామర్రు మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మచిటీ పట్నం మండలం బొర్రపోతుపాలెంనకు చెందిన కత్తిక శ్రీనివాసరావు(50) అదే గ్రామానికి చెందిన ముక్కు రామకృష్ణతో కలిసి బైక్పై విజయవాడకు ప్రయాణమయ్యారు. పామర్రు మండలం బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి టిప్పర్ అతి వేగంగా వచ్చి బైక్ను బలంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామకృష్ణ కాలికు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతిని పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. పామర్రు సీఐ నాగప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టిప్పర్ డ్రెయివర్ నిద్ర మత్తులో ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రెయివర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ కె.శ్రీనివాస్ తెలిపారు. నందివాడ: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని తమిరిశ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిరిశ గ్రామానికి చెందిన అలవాల నాగరాజు (36), వెంకటలక్ష్మి దంపతులు. నాగరాజు దినసరి కూలీగా జీవిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో విద్యుత్ సరఫరా జరగడంలేదని తీగలను సరిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. స్పృహలేకుండా పడవున్న నాగరాజును అతని భార్య వెంకటలక్ష్మి గమనించి బంధువుల సాంయంతో 108 అంబులెన్స్లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
గేట్వే!
గంజాయ్కిజీవనశైలిలో యోగా భాగం కావాలి సాక్షి ప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో చైన్నె, కోల్కతా హైవే గంజాయి కారిడార్గా మారింది. ఒడిశా, విశాఖ నుంచి నిత్యం గంజాయి తరలిస్తూనే ఉన్నారు. తరచూ పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో పటమట పోలీసుస్టేషన్ పరిధిలోని నిడమానూరులో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించారు. ఇందులో రూ.70లక్షల విలువైన 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడోచోట పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతూనే ఉంది. మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్)సమూలంగా నిర్మూలిస్తాం, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం.. అంటూ రెండేళ్లుగా పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ వంటివి విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడ నగరానికే పరిమితమైన ఈ విష సంస్కృతి.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీలకు కేజీలు సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులకు పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలను నివ్వెర పడేలా చేస్తోంది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి దొరకుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. గత రెండేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గంజాయి విక్రయాలు భారీగా పెరిగాయి. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 1200మందికి పైగా పాజిటివ్ రావటం గమనార్హం. దీనిని బట్టే గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. పోలీసులు డ్రగ్స్పై దండయాత్ర పేరుతో కఠిన చర్యలు తీసుకొంటున్నామని పేర్కొంటున్నా.. క్షేత్ర స్థాయిలో మూలాలను కూకటి వేళ్లతో పెకిలించడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్న స్మగ్లర్లు భారీగా పట్టుబడుతున్నా ఆగని రవాణా గ్రామాలకు విస్తరించిన గంజాయి గుప్పు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మత్తులో చిత్తవుతున్న యువత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గంజాయి అమ్మకందారులు ప్రధానంగా విద్యాసంస్థలే లక్ష్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసలైన విద్యార్థులు విచక్షణ కోల్పోయి, ఘర్షణలకు దిగుతున్నారు. గంజాయికి అలవాటు పడిన వారు చివరకు చోరీలు, చైన్స్నాచింగ్లు వంటి నేరాలకు తెగబడుతున్నారు. పేకాట, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్లకు బానిలసవుతున్నారు. ఇటీవల బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా, పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్కు బానిసలైన వారు ఉంటున్నారు. -
‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’
మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.పవన్వి పచ్చ దగాకోరు మాటలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. పచ్చి దగాకోరు మాటలే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.బాధిత కుటుంబాలకు అండగా నిలవాలినాడైనా, నేడైనా వైఎస్సార్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
కూటమి సర్కార్పై ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 28 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. కలిసొచ్చే సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం. ఉద్యమ కార్యాచరణకు అందరూ కలిసిరావాలి అని అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి భారమెలా అవుతారు?. రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు.ఆర్టీసీ ప్రైవేటీకరణపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. -
పీహెచ్సీలో డీహెచ్ తనిఖీలు
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ పద్మావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆన్లైన్ విధానం ద్వారా ఈహెచ్ఆర్, ఈ ఔషధి, ఫీల్డ్ సిబ్బంది సేవలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్నిరకాల మందులు అందుబా టులో ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. ఆస్పత్రిలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఐఓ డాక్టర్ప్రేమ్చంద్, వైద్యాధికారి సాయిలలిత, డాక్టర్ బిజిలీ శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్తికేయుడి ఆలయానికి రూ.లక్ష విరాళం మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన సీహెచ్.వెంకటరామిరెడ్డి, వాసవి దంపతులు శనివారం రూ.1,05,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధు సూదనరావుకు విరాళాన్ని అందజేశారు. చిలక లూరిపేటకు చెందిన ఎం.సి.మనోజ్, ఉమా వైష్ణవి 970 గ్రాముల వెండి నాగపడగ సమర్పించారు. ఆలయ అధికారి కిషోర్ పాల్గొన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వర్షాకాలంలో అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీ డీసీ ఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు, ఈదురుగాలులు వంటి అత్య వసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ కలెక్షన్లు, నూతనంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పనుల పురోగతి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యా దులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, పలువురు సీజీఎంలు, ఎస్ఈలు, జీఎంలు, ఈఈలు పాల్గొన్నారు. యోగా నిర్వహణకు వెస్ట్ బైపాస్ పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన సామూహికంగా యోగా నిర్వహించేందుకు వెస్ట్ బైపాస్ను వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు జిల్లా అధికారులతో కలిసి వెస్ట్బైపాస్ ప్రాంతాలను పరిశీలించారు. యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు, యోగా సాధకులు, విద్యార్థులు , వివిధ శాఖల ప్రతినిధుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, అత్యవసర సహాయక ఏర్పాట్లు, వేదిక నిర్మాణం , ప్రజల రాకపోకలకు సంబంధించిన అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరుజిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, నగర డీసీపీ కృష్ణకాంత్ పటేల్, కేజీవి సరిత తదితరులు పాల్గొన్నారు. -
సాహితీవేత్త విష్ణుప్రసాద్ గుండెపోటుతో మృతి
అవనిగడ్డ: ప్రముఖ సాహితీవేత్త, కళారత్న పురస్కార గ్రహీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడిసేవ విష్ణుప్రసాద్ (65) శనివారం గుండెపోటుతో మరణించారు. పదిహేను రోజుల క్రితం జీర్ణసంబంధిత సమస్యతో విజయవాడలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం అవనిగడ్డలోని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో విజయవాడ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆయనకు భార్య, వివాహిత కుమార్తె ఉన్నారు. దివిసీమ సాహితీ సమితి అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2018లో ఆనాటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్లో నిర్వహించిన పలు సాహిత్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ‘దివిసీమ కవుల సాహిత్య పరిశోధన’ అంశంపై పరిశోధన చేసిన ఆయన ప్రత్యేక గ్రంథాన్ని ముద్రించారు. 25కు పైగా గ్రంథాలు రచించారు. విష్ణుప్రసాద్ భౌతికఖాయాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజే శారు. పలువురు సాహితీకారులు, కవులు, కళాకారులు ఆయన మృతికి సానుభూతి తెలిపారు. పెనమలూరు: యనమలకుదురు గ్రామంలోని శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వ స్వామి వారి ఆలయంలో నిధుల గోల్మాల్ వ్యవహారంపై రెండో విడత విచారణ కొనసాగుతోంది. ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ లలిత మరో నలుగురితో ఉన్న కమిటీ సభ్యులు శనివారం రికార్డులు తనిఖీ చేశారు. గతంలో ఈవోగా పని చేసిన గంగాధరరావు హయంలో జరిగిన లావాదేవీలు, ఇతర పనులకు సంబంధించి రికార్డులు చూశారు. ఆలయంలో చాలా కాలంగా విచారణ చేసినా అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై వివరాలను భక్తులకు వెల్లడించలేదు. విచారణలో అధికారులు ఏమి గుర్తించారో చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఉపాధి కూలీలపై ఎఫ్ఏ నిర్లక్ష్యం
క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా పని బాగోలేదన్న ఫీల్డ్ అసిస్టెంట్ పెడన: ఉపాధి కూలీలకు పనులు కల్పించి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు పాలనలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పెనడ మండలం నందిగామలో జరుగుతున్న ఉపాధి పనులే ఇందుకు నిదర్శనం. వారం రోజులు పనులకు వెళ్లినా రూ.1000 కూడా కూలి రావడంలేదని కూలీలు వాపోతున్నారు. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.270 నుంచి రూ.320 నగదు వచ్చేలా పనులు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పనులు చేసిన చోట హాజరు నమోదవక ఎక్కడో దూరంగా వెళ్లి ఆన్లైన్ చేస్తుండటాన్ని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు అవకాశంగా తీసుకుని కూలీలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పనిచేసిన రోజు హాజరు తీసుకోని ఎఫ్ఏ మండలవలోని నందిగామ దళితవాడకు చెందిన ఉపాధి కూలీలు 50 మందికిపైగా శుక్రవారం పనికి వెళ్లారు. వారికి మేట్లు సుధాకర్, ప్రకాష్ పని కల్పించారు. ఆ పనిని పూర్తి చేసిన శ్రామికుల హాజరు తీసుకోవాల్సి ఫీల్డ్ అసిస్టెంట్ పోలగాని అమలేశ్వరరావు పని ప్రదేశానికి రాలేదు. సిగ్నల్ అందే చోటకు రావాలని చెప్పడంతో అంత ఎండలో రాలేమని, పనిచేసే చోట సిగ్నల్ అందుతోందని మేట్లు కూడా చెబుతున్నారని కూలీలు చెప్పినా వినిపించుకోకుండా చేసిన పని బాగోలేదని పేర్కొంటూ కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కూలీలకు ఉపాధి కల్పించకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. 06పీడీఎన్21: 06పీడీఎన్22: 06పీడీఎన్23: పనులు కల్పించకపోవడంతో ఖాళీగా ఉన్న కూలీలు 06పీడీఎన్24:బొడ్డు సుధాకర్ 06పీడీఎన్25:బొడ్డు వనజ 06పీడీఎన్26:మెండు లక్ష్మీకాంతం నందిగామ దళితవాడ వద్ద పనులు జరిగిన చోటుకు ఎఫ్ఏ వెళ్లకుండా పని బాగోలేదనే విషయంతో పాటు ఉపాధి కూలీల అటెండెన్సు పని చేసిన రోజున వేయకపోవడం, మరుసటి రోజున పనులు కల్పించకపోవడం వంటి విషయాలపై ఏపీఎంను పంపించి విచారణ చేయిస్తాం. గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుంటా. ఉపాధి కూలీలకు న్యాయం చేస్తాం. – ఎ.అరుణకుమారి, ఎంపీడీఓ, పెడన హాజరు కోసం సిగ్నల్స్ అందడం లేదనే సాకుతో తమను ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూలీలు దుయ్యబడుతున్నారు. శుక్రవారం పని చేయగా హాజరు వేయకుండా పనిచేయని రోజు హాజరు తీసుకునేందుకు ఎఫ్ఏ ప్రయత్నించడంపై కూలీలు మండిపడ్డారు. ఏ రోజు పనులకు ఆ రోజు కూలి ఇవ్వకుండా, మరుసటి రోజు పని కల్పించకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీఓ వజీర్ దృష్టికి తీసుకువెళ్లగా.. పని బాగోలేదని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారని, తనకు రావడం కుదరదని, నందమూరులో ఉన్నానని బదులిచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డుకు వెళ్లకుండా పని బాగోలేదని ఫిర్యాదు చేస్తే ఏపీఎం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
పేదలకు కూల్చివెతలు
జేసీబీలతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా శతాబ్దానికి పైగా నివాసం ఉంటున్న నిరు పేదల ఇళ్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ జేసీబీలతో రంగంలోకి దిగి బలవంతంగా నివాసాలు తొలగించేందుకు యత్నించగా పేదలు అడ్డుకున్నారు. తహసీల్దార్ సుగుణ, ఏసీపీ దామోదర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది హడావుడి చేస్తూ ఇళ్లు తొలగించ డానికి పూనుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత పేదలు, స్థానిక నాయకులు జేసీబీలను అడ్డుకోవడంతో అధికారులు చేసేదేమీ లేక ప్రస్తుతానికి వెను తిరిగారు. 100 ఏళ్లుగా పైగానే స్థిర నివాసాలు గ్రామంలోని రైవస్ కాలువ, సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో 100 సంవత్సరాలకు పైగానే నిరు పేదలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 83 గృహల్లో పేదలు నివస్తుండగా, మరో 20 మంది చిన్నపాటి దుకాణాలు ఉన్నాయి. ఇటీవల రెవెన్యూ, రైల్వే అధికారులు ఓవర్ బ్రిడ్డి నిర్మాణమంటూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రాంతంలో కొలతలు తీసుకున్నారు. రహదారికి రెండు వైపులా ఉన్న ఇళ్లను తొలగించాలని హుకుం జారీ చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సిర్థ నివాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నామని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా ఇళ్లు ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రెండు రోజులుగా ఫ్లై ఓవర్ బాధితుల పోరాట కమిటీగా ఏర్పడి ఇళ్ల తొలగింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. శనివారం ఇళ్లు కూల్చివేతకు అధికారులు రావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, మహిళా నాయకురాలు పరిమి సింధు, దండు సుబ్రహ్మణ్యరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు వెంకటేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు మద్దతు తెలిపి బాధితుల నిరసనలో పాల్గొన్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందుగానే బాధితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేశారు. -
గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంటౌన్: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా కార్యవర్గం ఏకగ్రీ వంగా ఎన్నికై ంది. నోబుల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్నికల కార్యక్రమంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘ జిల్లా చైర్మన్గా పువ్వుల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చాట్ల మేరీ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ హాజరైన ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జేఏసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఉద్యోగులకు ఇప్పటికే రావాల్సిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, అసంబద్ధమైన హేతుబద్ధీకరణ ప్రక్రియ, తాత్కాలిక డెప్యుటేషన్ల రద్దుతో పాటు ఇతర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై రానున్న కాలంలో వివిధ శాఖల సంఘాల నాయకులతో చర్చించి త్వరలోనే ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కమిటీ కో–చైర్మన్లు చేవూరి వెంకటేశ్వర్లు, బెక్కం రవితేజ, గంటా రామకృష్ణతో పాటు నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సుకుమార్, కృష్ణ చైతన్య, రాజు, క్రాంతి, హనుమంతరావు, విశ్వ, రామకష్ణ, హేమలత, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యమవుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం జెడ్పీ కన్వెన్షన్ హాల్లో మాస్టర్ ట్రైనర్ల యోగా శిక్షణ తరగతులను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి ఆయన ప్రారంభించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ యోగాను క్రమం తప్ప కుండా ఆచరిస్తే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందొచ్చన్నారు. యోగా వల్ల నాణ్యమైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడతాయని వివరించారు. మాస్టర్ ట్రైనర్లుగా ఎంపికై న వారు ముందుగా యోగా ప్రయోజనాలను స్వయంగా అనుభవించి, ఆ తరువాత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 200 మంది మాస్టర్ యోగా ట్రైనర్లకు రెండు రోజుల పాటు ఐదు సెషన్లలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం ప్రతి మాస్టర్ ట్రైనర్ తమ మండలంలో 50 మంది చొప్పున యోగాలో శిక్షణ ఇచ్చి, ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యోగా గురువులు రెబ్బా పోతన శాస్త్రి, శేష ప్రసన్న, చింతయ్య తదితరులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్వో, డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, యోగాంధ్ర కార్య క్రమ నోడల్ అధికారి, మెప్మా పీడీ సాయిబాబు, ఆయుష్ శాఖ అధికారులు డాక్టర్ భాగ్యలక్ష్మి, వాహిని, డీఈఓ యు.వి.సుబ్బారావు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ వెంకటరావు, మచిలీపట్నం నార్త్ మండలం తహసీల్దార్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఏడో తేదీ ఉదయం ఏడు గంటలకు మంగినపూడి బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 10వ తేదీ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో లారీ, ఆటో సంఘాల ప్రతినిధులతో, 16వ తేదీన ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఆగని ఇసుక తవ్వకాలు
● గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్ ● లంకపల్లి క్వారీలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత పమిడిముక్కల: దోచుకొనేవాడికి దోచుకున్నంత.. తవ్వుకొనేవారికి తవ్వుకొన్నంత ఇసుక అన్న చందంగా ఉంది మండలంలోని లంకపల్లి క్వారీలో ఇసుక పరిస్థితి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ లంకపల్లిలో అనుమతులు లేకుండా క్వారీలు నడుస్తున్నాయి. అధికారిక క్వారీలో టిప్పర్లు, అనధికారిక క్వారీలో ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. అనధికారిక క్వారీలో పాక వేసుకొని ట్రాకర్టకు సీరియల్ ఇచ్చి బాట చార్జీలు ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను బయటకు తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. -
నిత్యాసర సరుకులు కోసం వెళ్లి అనంత లోకాలకు..
కంచికచర్ల: నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువకుడు ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కంచికచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాధ్ శనివారం తెలిపిన కథనం మేరకు... మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ(28) ఓ ఐరన్ షీట్లు తయారు చేసే ప్యాబ్రిక్స్లో పని చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన అతడికి కుటుంబసభ్యులు నిత్యావసర సరుకులు తీసుకురావాలని చెప్పగా తన స్నేహితుడు షేక్ షరీప్బుడే కలసి స్కూటీపై దుకాణానికి కంచికచర్ల వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా విజయవాడ వైపు నుంచి కంచికచర్ల వైపునకు కంకరలోడుతో వస్తున్న ట్రాక్టర్ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహ్మద్రఫీ తలకు తీవ్ర గాయాలు కాగా షరీప్కు కూడా తీవ్ర గాయమయింది. రఫీని వైద్య చికిత్సకోసం ప్రవేటు వాహనం ద్వారా విజయవాడలోని గొల్లపూడి ప్రవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. షరీప్ బుడేను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. రఫీ భార్య కౌసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్కూటీని ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు -
షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సులో మంటలు
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద డ్రైవర్ పక్కన ఉండే బానెట్లో నుంచి పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. భయపడిపోయిన కొంత మంది యువకులు ఎమర్జెన్సీ ద్వారం, కిటికీల నుంచి బయటపడ్డారు. బానెట్ కింద ఉండే ఇంజిన్ వద్ద ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో పొగలు ఆ తరువాత మంటలు వచ్చి ఉంటాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. వేసవి సెలవులు ముగియనుండటంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెట్పై బంగారు వాకిలి దర్శనానికి మాత్రమే అనుమతించారు. రద్దీతో వీఐపీలు, సిఫార్సులపై వచ్చిన భక్తులకు సైతం మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో.. ఎండ తీవ్రత, వడగాడ్పుల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీటితో పాటు మజ్జిగ, లస్సీలను పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహంతో పాటు రాజగోపురం ఎదుట ట్రస్ట్ బోర్డు సభ్యుల కార్యాలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అంతే కాకుండా వాటర్ క్యాన్ల ద్వారా భక్తులు సేదతీరుతున్న చోటికే ఆలయ సిబ్బంది చేరుకుని మంచినీటిని అందించారు. పంచహారతులకు డిమాండ్.. శుక్రవారం నేపథ్యంలో అమ్మవారి పంచహారతుల సేవకు భక్తుల నుంచి డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి పంచహారతుల సేవ నిర్వహించారు. సాయంత్రం 7 గంటల తర్వాత భక్తుల రద్దీ కొనసాగింది. సెలవులు ముగియనుండటంతో భారీగా తరలివచ్చిన భక్తులు -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
పెడన: పాలనను ప్రజలకు చేరువ చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నియోజకవర్గ కేంద్రాలలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టర్ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలసి పెడన మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రత్యేక మీ కోసం కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా పెడన నియోజకవర్గంలో మూడో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించామని.. ప్రజల నుంచి మొత్తం 53 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, ఎంపీడీవో నూతలపాటి శ్రీనివాసరావు, ఆర్టీసీ పర్యవేక్షకుడు గోపాల్, విద్యుత్ శాఖ ఈఈ గోవిందరావు, మునిసిపల్ కమిషనర్ కొండయ్య, పెడన తహసీల్దార్ వహీదా, ఎంపీడీవో అరుణ, గూడూరు తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీవో శైలజ, బంటుమిల్లి ఎంపీడీవో శివప్రసాద్ దేవదాయ శాఖ ఈవో అరుణ పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● తమ గ్రామానికి ఆర్టీసీ బస్సులు తిరిగి నడపాలని కోరుతూ కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామస్తులు టి. ఆంజనేయులు, బి. సాయికుమార్, జి. రాము కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. గతంలో బందరు డిపో నుంచి గ్రామానికి ఆర్టీసీ బస్సు వస్తూ ఉండేదని, తర్వాత బస్సు నిలిపివేయడంతో మత్స్య ఉత్పత్తులను అమ్ముకునే వ్యాపారస్తులు, విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ● మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి ఆనుకుని ఒక కిలోమీటర్ దూరం లోపలికి తమ గ్రామానికి ఉన్న రహదారి గుంతల మయమై చాలా ఇబ్బందులు పడుతున్నామని రహదారి సమస్యను పరిష్కరించాలని గూడూరు మండలం తరకటూరు గ్రామపంచాయతీ పరిధిలోని తరకటూరుపాలెంకు చెందిన కేవీ రమణ, కె.కృష్ణ, పూర్ణ, నరేంద్ర అర్జీ సమర్పించారు. ● రీ సర్వే తర్వాత అందించిన పట్టాదారు పాస్ పుస్తకాలలో తమ భూమిని తక్కువగా చూపించారని, వాస్తవానికి ఉన్న భూమి ఎక్కువని దానిని సరిచేయాలని కోరుతూ పెడన మండలం జింజేరు గౌడ పాలెం గ్రామానికి చెందిన రాజులపాటి పూర్ణ, పెడన మండలం దేవరపల్లి గ్రామ వాసి జే. వరలక్ష్మి అర్జీ అందించారు. పెడన ప్రత్యేక ‘మీ కోసం’లో కలెక్టర్ డీకే బాలాజీ -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేదు. 7ఇబ్రహీంపట్నం: మూలపాడులోని బటర్ఫ్లై పార్క్లో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సాక్షి విజయవాడ: విజయవాడలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపగా.. సాయంత్రానికి అంతా చల్లబడింది. -
జిప్సం జగడం!
అలవిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా రెండేళ్లలోనే జనాగ్రహాన్ని చవిచూస్తోంది. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ నయవంచనపై బిగిసిన పిడికిళ్లు కోడూరు: మండలంలోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో వివాదాస్పదంగా మారిన జిప్సం నిల్వల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా సంఘ చైర్పర్సన్, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు, సీఈఓ తోట శ్రీకాంత్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియోలో జిప్సం అక్రమాలపై చైర్పర్సన్ మాట్లాడిన తీరు, అధికారులను బెదిరించే ధోరణి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ● ‘జిప్సాన్ని నాగాయలంక మండలం వాళ్లకు ఇచ్చేసి మనం చేతులు దులిపేసుకుందాం’ అంటూ చైర్పర్సన్ సీఈఓకు సూచించినట్లు వినిపిస్తోంది. అయితే దీనికి సీఈఓ శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ఈ విషయంలో మీరు పక్కకు తప్పుకుంటున్నారు.. ఎవరొచ్చినా నన్నే అడుగుతున్నారు’ అన్నట్లుగా ఆడియోలో ఉంది. ● కోడూరు కేడీసీసీ బ్యాంక్ సూపర్వైజర్ ఫణీంద్రబాబు విచారణకు వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘విచారణకు వచ్చిన సమయంలో పీఏసీఎస్లో ఉండే సూపర్వైజర్ను బీపీలో కొట్టేవాడిని’ అంటూ చైర్పర్సన్, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు అధికార వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. ● ‘నాగాయలంక వాళ్లు జిప్సం ఎత్తుకుపోయారని చెబుదాం.. నీకెందుకు?’ అంటూ సీఈఓకు చైర్పర్సన్ చెప్పగా.. దీనికి సీఈఓ స్పందిస్తూ ‘ఈలోపు ఎవరైనా వస్తే సమాధానం ఏమి చెప్పాలి’ అన్ని ప్రశ్నించారు. ‘అదంతా ఆర్బీకే వాళ్లు చూసుకుంటారు.. నీకేందుకు?’ అంటూ చైర్ పర్సన్ దురుసుగా మాట్లాడారు. ● అలాగే జిప్సం సరఫరాకు సంబంధించిన ఓఫామ్, ఇన్వాయిస్, రవాణా బిల్లుల గురించి సీఈఓ ప్రశ్నించగా, ‘నువ్వు పుస్తకంలో నేను చెప్పింది రాయి’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆడియోలో వినిపిస్తోంది. ‘నువ్వు అల్లరి చేయకుండా కూర్చుంటే ఏమీ ఉండదు.. నువ్వే అల్లరి చేస్తున్నావు’ అంటూ సీఈవోను హెచ్చరించిన మాటలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ● కాగా నామినేటెడ్ పోస్టులో చైర్పర్సన్ హోదా దక్కించుకొని అధికారులపై తీవ్రంగా దుర్భాషలాడిన జనసేన పిచ్చేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సహకార ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చైర్పర్సన్–సంఘ సీఈఓ మధ్య ఫోన్ సంభాషణ కలకలం వి.కొత్తపాలెం పీఏసీఎస్ అక్రమాలపై కొత్త అనుమానాలు జిప్సం వ్యవహారంపై విచారణ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. అవనిగడ్డ సబ్ డివిజన్ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి. నాగమల్లేశ్వరరావు విచారణ అధికారిగా వ్యవహరించారు. సంఘ సీఈఓ తోట శ్రీకాంత్ నుంచి వివరాలు సేకరించారు. రికార్డులు పరిశీలించి, జిప్సం నిల్వలు, పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. విచారణ అనంతరం నివేదికను డీసీసీబీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు కూడా నివేదించనున్నట్లు నాగమల్లేశ్వరరావు తెలిపారు. కేడీసీసీబీ కోడూరు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు స్వాగతం
గన్నవరం: కేంద్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్కు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడ పర్యటన నిమిత్తం ఆయన విశాఖపట్నం నుంచి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో చిరాగ్ పాశ్వాన్కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
మొక్క నాటిన హోమంత్రి.. ఆటోనగర్(విజయవాడతూర్పు): స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణలో హోం మంత్రి వి. అనిత మొక్క నాటారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా స్థానిక నోవోటెల్ హోటల్ నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫైర్ స్టేషన్ను పరిశీలించారు. అత్యవసర సేవల వివరాలను ఇక్కడి అధికారి జీవీ రామారావుతో పాటు పలువురిని ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ, అడిషినల్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు, జిల్లా అధికారి ఏవీ శంకర్రావు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర -
స్మార్ట్ పోలీసింగ్లో ప్రతిభకు ప్రశంస
లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు వేగంగా సేవలు అందిస్తూ.. స్మార్ట్ పోలీసింగ్లో ప్రతిభ చూపిన వారికి శుక్రవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ప్రశంసాపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతివారం ఇస్తున్న ర్యాంకింగ్లో 16 వారాలుగా స్మార్ట్ పోలీసింగ్లో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుండటంతో అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సైబర్ క్రైమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ నేరాలు జరగకుండా చూడటం, ఒకవేళ జరిగినా సాంకేతికత, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉపయోగించి నిందితులను వెంటనే పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డీసీపీ(అడ్మిన్) కేజివి సరిత, సైబర్ క్రైమ్ డీసీపీ కె. కృష్ణప్రసన్న, ఏసీపీ భానుప్రకాష్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: దుర్గగుడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద నవహారతుల కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి జలహారతులు ఇచ్చారు. అనంతరం నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతంలో నవహారతులు ఇచ్చారు. గతంలో కృష్ణానదిలో ఫంటు ఏర్పాటు చేసి నవహరతులు ఇచ్చేవారు. హారతులతో పాటు హారతులు తిలకించడం, ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేవారు. ఇప్పుడు నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూజారులు హారతులు ఇచ్చారు. దుర్గ గుడి ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు వెంకటనాగ కిశోర్ కుమార్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మృగశిరకార్తె ప్రవేశం సందర్భంగా ఈనెల 8, 9న ఊపిరితిత్తులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు వనమూలికలతో తయారు చేసిన చేపమందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కొండపల్లికి చెందిన మహ్మద్ మహ్మద్ ఆలీ, మహ్మద్ మసూద్ ఆలీ (జిన్నా) సంయుక్తంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పారిశ్రామిక కాలుష్యం ఈ వ్యాధులకు ప్రధాన కారణాలన్నారు. చేపమందు కోసం వచ్చేవారు ప్రాణంతో ఉన్న బురదమట్ట, కొరమేను చేపపిల్లను వెంట తెచ్చుకోవాలన్నారు. బతికున్న చేపకు వనమూలికల ఔషధం తినిపించి, రోగికి మింగిస్తామని, శాఖాహారులకు అనుపానంతో మందు ఇస్తామని వారు ఆ ప్రకటనలో తెలిపారు. -
చిన్ని చీకటి సామ్రాజ్యం.. భయం నీడలో బెజవాడ
సాక్షి,కృష్ణాజిల్లా: విజయవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మాజీ ఎంపీ నాని వరుసగా మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రస్తుత ఎంపీ చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు.నాని తన ఫేస్బుక్ పోస్టులో ‘చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ’ అంటూ ఇమేజ్ షేర్ చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం.. చిన్ని అక్రమ వసూళ్లు, ఇసుక రేషన్, సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చిన్ని రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు.నాని తన పోస్టులో కేశినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, ఆస్తి విభాగాల్లో కూడా చిన్ని జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. చివరగా, నాని ఈ అంశాలపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. -
జిప్సం నిల్వల వ్యవహారంపై విచారణ
కోడూరు: మండలంలోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో అనుమతులు లేకుండా జిప్సం నిల్వలు ఉంచిన వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా నిల్వ చేసిన జిప్సంను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించాలని పీఏసీఎస్ చైర్పర్సన్, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు సొసైటీ సీఈఓపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమ జిప్సం నిల్వలను గుర్తించి సంబంధిత రికార్డుల్లో ‘స్టాప్ సేల్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని డీసీసీబీ జిల్లా అధికారులు తీవ్రంగా పరిగణించి, అవనిగడ్డ సబ్ డివిజన్ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి.నాగమల్లేశ్వరరావును విచారణ అధికారిగా నియమించారు. దీంతో గురువారం రాత్రి 9గంటల వరకు సొసైటీలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. సంఘటనకు సంబంధించిన పలు పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, జిప్సం నిల్వలకు సంబంధించిన వివరాలను నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. నీరుగార్చే ప్రయత్నం... ఇదిలా ఉండగా జిప్సం అక్రమ నిల్వల వ్యవహారంలో జరిగిన ఘటనను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సొసైటీ సీఈఓ తోట శ్రీకాంత్ను కొందరు కూటమి పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. పిచ్చేశ్వరరావు జనసేన నేత కావడంతో అధికార పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో విషయాన్ని తారుమారు చేసేందుకు విచారణ అధికారి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సంఘ పరిధిలోని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సబ్సిడీపై అందాల్సిన జిప్సంను చైర్పర్సన్ బ్లాక్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించేందుకు కేడీసీసీ బ్యాంక్ అధికారులు నిరాకరించారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుందని, నివేదికను డీసీసీబీ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. -
నూతన విధానంతో రైతులకు ప్రయోజనం
కృష్ణాజిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణిపామర్రు: ఎరువుల పంపిణీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన సర్వర్ విధానంతో రైతులకు ఎంతో ప్రయోజనం సమకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి పేర్కొన్నారు. స్థానిక బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మండపంలో జిల్లా స్థాయిలో సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ మండల అధికారులు, వీఏఏలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన ఎరువుల సరఫరా విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రైతాంగానికి కావాల్సిన ఎరువులను అందించాలన్నారు. ఎరువుల సర్వర్ విధానంతో పాటుగా ఫెర్టిలైజర్ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిని ఏ విధంగా వినియోగించాలని అనే అంశాలను వివరించారు. ప్రతి రైతు నమోదు చేసుకోవాలి.. గుంటూరు ఎరువుల వ్యవసాయ కమిషనర్ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్రికల్చర్ ఎం. ఆనంద్రావు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ యాప్లో ప్రతి రైతు నమోదు అయి ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ డీసీవో కె. చంద్రశేఖర్, జిల్లా మేనేజర్ బి. మురళీ కృష్ణ, డీడీఏ ఏ ఆనందరావు, రాష్ట్ర ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పామర్రు ఏడీఏ బి.స్వర్ణలత, ఏవో శివ నాగరాణి, జిల్లాలోని వీఏఏలు, పీఏసీఎస్ కార్యదర్శులు పాల్గొన్నారు. -
రెండేళ్ల అరాచక పాలనపై ప్రజానీకం కన్నెర్ర
దహనమవుతున్న బాండ్ల ప్రతులుచిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే సూపర్–6 పేరుతో మేనిఫెస్టోను రూపొందించి హామీలన్నీ తప్పక అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల తరఫున పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా నేపథ్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ప్రజల తరఫున పోరాటం చేసేందుకు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఎన్నికల సమయంలో చంద్ర బాబు ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను దహనం చేసి నిరసన తెలిపారు. -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పీవీపీ కృష్ణకుమార్ కుటుంబం రూ.1,00,116, విజయవాడ పటమటలంకకు చెందిన తోట మల్లికార్జునరావు, మల్లేశ్వరి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనంతో పాటు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి తదితరులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను, శేషవస్త్రాలతో దాతలను సత్కరించారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం పునఃప్రారంభం అయ్యింది. కొంతకాలంగా థియేటర్స్లో చిత్రాలు ప్రదర్శించకపోవటంతో ప్రయాణికులు నిరాశకు గురి అవుతున్న నేపథ్యంలో రవి సినిమాస్ యాజమాన్యం ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల సహకారంతో థియేటర్స్ను ఆధునికీకరించి ప్రముఖ న్యాయవాది, పారిశ్రామిక వేత్త సిరిగిరి రవీంద్ర శేఖర్ చేతుల మీదుగా ప్రారంభించింది. తొలి రోజు పెద్ది సినిమాను ప్రదర్శించింది. నిర్వాహకులు రవి మాట్లాడుతూ మల్టీప్లెక్స్లు, మాల్స్లో సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో రవి సినిమాస్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను డిజైన్ చేసిందన్నారు. అనుమతించిన కొత్త చిత్రాలకు ప్రీమియర్ షోల వరకు టికెట్ ధరలను రూ.600 నిర్ణయించామని తర్వాత నుంచి టికెట్ ధర రూ.150 ఉంటుందన్నారు. స్టూడెంట్ ఆఫర్ కింద రూ.130, కపుల్స్కు రూ.130గా టికెట్ రేట్లను నిర్ణయించామన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో డెప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారికి తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలనశాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఇన్చార్జ్ తహసీల్దార్లుగా వ్యవహరిస్తున్న ఆయా మండలాలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బి. లోకరాజు (గుడ్లవల్లేరు), బి. అంకాలు(అవనిగడ్డ), ఏఎన్ శివకుమార్రాజు(పెనమలూరు), కోట జోబాబు (బంటుమిల్లి), జీఆర్వీ భద్రరావు (గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవో) నియమించారు. కేవీవీఎన్ మల్లేశ్వరరావు (కృత్తివెన్ను), వీఎస్ఆర్కే ప్రసాద్ (గుడివాడ), కట్టా రామశివ (మచిలీపట్నం సౌత్), ఎస్. హేమంత్కుమార్ (కలెక్టర్ కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెండెంట్) నియమించారు. సి. ప్రభు కిషోర్ను కృష్ణాజిల్లా ల్యాండ్ రిఫార్మర్స్ ఆఫీసర్గా, కాగిత వీవీ చంద్రరావు(కోడూరు), ముసునూరి శ్రీహరి కలెక్టరేట్లోని మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్గా, ఎస్. భవానీని మోపిదేవి తహసీల్దార్గా, షేక్ వహీదారహమాన్ను పెడన తహసీల్దార్గా నియమించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా అండర్–23 ఉమెన్స్ క్రికెట్ జట్టులోని క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తి చేశామని కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ప్రకటనలో తెలిపారు. కెప్టెన్గా పి.రంగలక్ష్మి, సభ్యులుగా మహమ్మద్ మోహక్, మహమ్మద్ ముస్కానా, మహమ్మద్ అంజుమ్, వి.అక్షయ, ఎం.పూజిత, టి.గుణచంద్రిక, టి.నివేదిత, ఎం.సృజన, ఏ.లక్ష్మణ్ అపర్ణ, వీ.గాయత్రీదేవి, బి.పుష్ప, ఏ.రాణి, వి.వేణుమాధవి, ఎం.లేఖన, సీహెచ్ ధనశ్రీ, కె.కీర్తి, స్టాండ్బైగా ఆర్.చేతన ప్రియ, బి.స్రవంతి, జేఎన్ఎస్ఎస్ యశశ్వని, బి.తమిళికలను ఎంపిక చేశామని తెలిపారు. -
ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ప్రారంభం
మచిలీపట్నంఅర్బన్: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు, సింగిల్ టీచర్ స్కూళ్ల ఉపాధ్యాయులు, మెగా డీఎస్సీలో నియమితులైన మొత్తం 1,270 మంది ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు శిక్షణ కేంద్రాల్లో జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు. మచిలీపట్నంలోని మున్సిపల్ పార్క్ గర్ల్స్ హైస్కూల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ సుబ్బారావు సందర్శించి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి (సౌత్) శ్రీనివాస్, మండల విద్యాశాఖాధికారి–2 గురుప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు ఇందిరాదేవితో పాటు ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు చాగంటిపాటి వివేక్కు గురువారం కలెక్టర్ డీకే బాలాజీ ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పమిడిముక్కల మండలం పర్యటన నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్లోని బసవతారకం వైద్యశాలలో ఉచితంగా బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ముందుగా డోనార్ స్పెసిఫిక్ యాంటిజెన్ (డీఎస్ఏ) పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటికి అయ్యే ఖర్చు రూ.35 వేలు జిల్లా డిసిప్లీనరీ కమిటీ పరిధిలోని పెనాల్టీ రుసుము నుంచి కలెక్టర్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ ఆయన చాంబర్లో వివేక్కు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్కుమార్, పమిడిముక్కల పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ సైనా, వివేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
గుడివాడలో ‘తమ్ముళ్ల’ వీరంగం
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరుగుతుండగా వీరంగం సృష్టించారు. వైఎస్సార్ సీపీ నేతలు నిరసన కార్యక్రమానికి ముందే పోలీసు అనుమతులు తీసుకున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా చూడాలన్న వారి సూచన మేరకు కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ సీపీ ర్యాలీ జరుగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆ పార్టీ జెండాలు చేత పట్టుకుని రెండేళ్ల విజయోత్సవం అంటూ పోటీగా ర్యాలీ ప్రారంభించారు. దీంతో ఇరు పార్టీలకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు రూట్ మ్యాప్ ఇస్తే దానినీ తెలుగు తమ్ముళ్లు ఉల్లంఘించారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమం జరిగే ప్రాంతానికి దూసుకొచ్చి రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. చోద్యం చూసిన పోలీసులు.. పోలీసులు అప్రమత్తమై ఇరుపక్షాలకు నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినని టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులకు నచ్చ చెప్పి అక్కడ నుంచి పంపేశారు. టీడీపీ నాయకులు మాత్రం జ్యోతీరావ్ పూలే–సావిత్రీబాయ్ పూలే విగ్రహాలకు అప్పటికే వైఎస్సార్ సీపీ శ్రేణులు వేసిన పూలమాలలు తెంచివేసి వారు తెచ్చిన పూలమాలలను వేయడం అధికార మదానికి పరాకాష్టగా నిలిచింది. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రూ.20 లక్షల సొత్తు అపహరణ గన్నవరం: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ.20 లక్షల విలువైన సొత్తును అపహరించుకుపోయిన సంఘటనపై ఆత్కూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గన్నవరం మండలంలోని మెట్లపల్లి గ్రామానికి చెందిన వీరంకి వెంకటేశ్వరరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన బుధవారం ఇంటికి తాళం వేసి తన భార్యతో కలిసి మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో ఉంటున్న తమ కుమారై వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులకొట్టి లోపలికి చొరబడి బీరువాలోని రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను, కొంత నగదును అపహరించుకుపోయారు. చోరీ విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరావు ఆత్కూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గూడూరు: మండలంలోని ఆకులమన్నాడులో వాటర్ప్లాంట్కు నీటి కోసం వచ్చి మహిళ మెడలో బంగారు నానుతాడు తెంచుకుని పరారైన దుండగులను ఎట్టకేలకు గూడూరు పోలీసులు పట్టుకున్నారు. గత ఏప్రిల్ 19న గూడూరు మండలం ఆకులమన్నాడులోని వాటర్ప్లాంట్కు నీటి క్యాన్కోసం వచ్చిన ఇద్దరు దుండగులు వాటర్ప్లాంట్ నిర్వాహకురాలి మెడలో నానుతాడు తెంచుకుని పరారయ్యారు. దీనిపై ప్రత్యేక దృష్టిసారించిన జిల్లా ఎస్పీ వి.విద్యాసాగరనాయుడు ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు, పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ టీం ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్యప్రకాష్ భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన దేవర నాగేశ్వరరావు(30), మొగల్తూరు గ్రామానికి చెందిన నెల్లూరు సాయి దుర్గాప్రసాద్(29)లను పట్టుకున్నారు. వారి నుంచి రెండు కేసులకు సంబంధించి మొత్తం 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. విజయవాడలీగల్: పెనమలూరు మండలం, చోడవరం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మాలపాటి విజయభాస్కరరెడ్డిపై ఉన్న బెయిల్ షరతులను తొలగిస్తూ గురువారం రెండవ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి నెట్టెం రాధిక ఉత్తర్వులు జారీచేశారు. విజయభాస్కర్రెడ్డి లండన్లో ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్లపై అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగంపై 2025 నవంబరు 2వ తేదీన ఆయన్న అరెస్ట్ చేశారు. ఆయన భార్య, ముగ్గురు సంతానం లండన్లోనే ఉన్నారు. తన తండ్రి అంత్యక్రియల నిమిత్తం గత సంవత్సరం నవంబరులో చోడవరం వచ్చిన సందర్భంలో పెనమలూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరుచేస్తూ, విదేశాలకు వెళ్లకుండా షరతు విధించారు. విజయభాస్కరరెడ్డి కుటుంబసభ్యులు లండన్లో ఉన్నందున, అక్కడ వ్యాపారాలు కూడా ఉన్నందున లండన్ వెళ్లేందుకు బెయిల్ షరతులను తొలగించాలని కోరుతూ ఆయన తరఫున వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదోపవాదనల అనంతరం బెయిల్ షరతులను తొలగిస్తూ పోలీసు అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని ఆదేశాలలో పేర్కొంటూ లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అదేవిధంగా పెనమలూరు పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఎన్ఆర్ఐ మాలపాటి విజయభాస్కరరెడ్డి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేశారనే అభియోగంపై అరెస్టయిన కేసులో షరతులతో కూడిన బెయిల్ను ఆరవ అడిషనల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయ మూర్తి లెనిన్బాబు మంజూరుచేశారు. -
కాటేస్తున్న కాలుష్యం
కాలుష్యానికి కారణాలివే కాలుష్య ప్రభావ సమస్యలివే ఇవే నిదర్శనాలు ● తాడిగడపకు చెందిన 40 ఏళ్ల వెంకటేష్ గాంధీనగర్లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనంపై విధులకు వస్తుంటారు. ఇటీవల నీరసంగా ఉండటంతో పరీక్ష చేయించుకుంటే షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి ఫ్యామిలీ హిస్టరీ కూడా లేక పోవడంతో కాలుష్యమే కారణమై ఉంటుందంటున్నారు. ● భవానీపురానికి చెందిన 38 ఏళ్ల అభిలాష్ మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం బైక్పై తిరుగుతుంటారు. ఇటీవల వాసన గ్రహించలేకపోవడం, డిప్రెషన్కు లోనవుతున్నారు. కాలుష్య ప్రభావమే కారణమంటున్నారు. నివారణకు ఏమి చేయాలి? -
అర్హుల ఓట్లు పోకుండా చూడండి
మచిలీపట్నంటౌన్: అర్హులైన ఏ ఒక్కరి ఓటూ జాబితా నుంచి తొలగించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్స్(బీఎల్ఏ)లకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు గురువారం స్థానిక ఎమ్మార్ ఫంక్షన్ హాల్లో జరిగింది. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, ఆ పార్టీ రాష్ట్ర పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకర్రెడ్డి ఎస్ఐఆర్పై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పేర్నినాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న బీఎల్వోలు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ కి చెందిన బీఎల్ఏలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడి పని చేయాలన్నారు. గన్నవరం శాసనసభ్యుడు గతాన్ని మరిచి కూటమి అధినాయకుల మెప్పు కోసం విమర్శలు చేస్తున్నారని.. ప్రత్యక్ష ఎన్నికల్లో తాను ఉండనని స్పష్టం చేశారు. డీఎస్సీపై ఆధారాలు చూపగలరా.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరగలేదని బుకాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ సాక్ష్యాలను బయట పెట్టే దమ్ము ఉందా అని పేర్ని నాని సవాల్ విసిరారు. స్పోర్ట్స్ కోటాలో 65అంశాలకు సంబంధించి అమ్మకాలు జరిపిన కూటమి ప్రభుత్వం అర్హులైన డీఎస్సీ అభ్యర్థులను మోసగించిందన్నారు. వారందరూ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్న విధానం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, దారుణాలు జరిగితే నోరు మెదపని హోం మంత్రి వంగలపూడి అనిత.. సీఎం తనయుడు మంత్రి లోకేష్పై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం మీడియా ముందు ప్రత్యక్షమవుతున్నారన్నారు. ఎస్ఐఆర్పై అవగాహన సదస్సులో మాజీ మంత్రి పేర్ని నాని -
ఈదురుగాలులకు నేలకొరిగిన భారీ వృక్షం
పమిడిముక్కల: మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారిపై మంటాడ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టు విద్యుత్ స్తంభాలపై పడంటంతో అవి విరిగిపోయి, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందిన వెంటనే విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఎస్ఐ శ్రీను సిబ్బందితో వెళ్లి రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించారు. ఇదిలావుండగా మంటాడ బైపాస్లో ఓ హోర్డింగ్ నేలకొరిగింది. -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల తయారీ
గన్నవరం: మండలంలోని సూరంపల్లితో పాటు విజయవాడ కబేళాలోని అల్యూమినియం కంపెనీల్లో గురువారం భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ విజయవాడ శాఖ శాస్త్రవేత్త, సంయుక్త సంచాలకులు షణ్ముఖ శివపల్లి, ఉప సంచాలకులు డి. వివేక్వర్థన్రెడ్డి, ఎస్ఎస్ఏ ఎ. రాజే నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సూరంపల్లిలోని అల్యూమినియం కంపెనీలో బీఐఎస్ లైసెన్స్ లేకుండా, ఐఎస్ఐ మార్కు లేకుండా ప్రెజర్ కుక్కర్లు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా తయారైన వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న 7,598 కుక్కర్లను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో మరో కంపెనీ.. అదే విధంగా విజయవాడలోని కబేళా ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న మరో కంపెనీలో తనిఖీలు నిర్వహించి నకిలీ ఐఎస్ఐ మార్కు ఉన్న ప్రెజర్ కుక్కర్లు, విడి భాగాలను తయారు చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించి తయారు చేసిన 478 ప్రెజర్ కుక్కర్లు, 418 కుక్కర్ బాడీలు, మరో వంద మూతలను స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్ శాస్త్రవేత్తలు, సంయుక్త సంచాలకులు బి. రాజగోపాల్, టి. అర్జున్, కె. సాయికౌషిక్ తదితరులు పాల్గొన్నారు. సదరు కంపెనీ నిర్వాహకులపై బీఐఎస్ చట్టం 2016 ప్రకారం చట్టపరమైన చర్యలతో పాటు జారిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. -
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘నేను బియ్యం దొంగతనం చేశానని ఆరోపిస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ జరిపి నన్ను లోపల వేయండి’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. 2029 కల్లా చంద్రబాబు సర్కార్ పతనమవ్వడం ఖాయమని.. ఈ లోపు మీకు దమ్ముంటే తనను లోపల వేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఇవాళ(గురువారం) అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు), నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, హోంమంత్రి అనితపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినప్పుడు మీకు జ్ఞానం లేదా?. 382 మందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటి వరకూ 3 శాతం అన్నారు.. ఇప్పుడు 382 మంది అంటున్నారు. ఎంతమందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారో కూడా చెప్పరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘జీవోను మార్చి 29 ఆటలను 67 ఆటలకు పెంచేశారు. 40వ ఆట కింద పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్ ఆటను పెట్టారు. ఏ ఆటకు ఎవర్ని తీసుకున్నారో 9 నెలలు నుంచి చెప్పడం లేదు. మేం నిరసనలు చేశాం కాబట్టి ఇప్పుడు డేటా బయటపెడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఐఏఎస్ సంతకం లేకుండా స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎలా పెట్టారు?. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదు. బ్యాగులు, సర్టిఫికెట్లు తెస్తే ఆ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్లు. ఆటలు కేంద్రం పెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం రుజువయ్యాక చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారు..డీఎస్సీ అక్రమాల పై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పడు. లోకేష్ ఏజెంట్ల కింద సీఎం, హోంమంత్రి మాత్రం మాట్లాడేందుకు వస్తారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి మాట్లాడరు. విద్యాశాఖలో తప్పు జరిగిందని మేం అనగానే హోం మంత్రి తెరమీదకు వచ్చేశారు. డీఎస్సీలో మీరు చేసిన పాపాలు మీకు తగలకుండా ఉంటాయా?. చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పులు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తామని, ఈ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. కలెక్టరేట్లోని శ్రీఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్ష తన సర్పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాస్థాయిలో కార్యాచరణను వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లకు శిక్షణతో పాటు సన్నద్ధత కార్యకలాపాలు ఈ నెల ఐదు నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పోలింగ్ బూత్ స్థాయి బీఎల్ఓలకు అందజేసి ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకు సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను నియమించుకోవాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,792 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కొత్తగా 129 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, ఎన్నికల డీటీ గోపాల్రెడ్డి, కలెక్టరేట్ సమన్వయ విభాగం అధికారి అనుష్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.41 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు రూ.3,41,39,565 నగదు. 273 గ్రాముల బంగారం, 4.450 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 349 యూఎస్ఏ డాలర్లు, 335 నేపాల్ రూపీ, 1,390 యూఏఈ దిర్హమ్స్, 195 కెనడా డాలర్లు, 200 సౌత్ ఆఫ్రికా రాండ్లు, 100 రష్యన్ రుబీలు, 200 ఓమన్ బైంసాలు, ఐద వేల సిరియా పౌండ్లు లభించాయని వివ రించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొనగా, పోలీసులతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. ప్రభుత్వాస్పత్రి స్టోర్స్లో డీఎంఈ తనిఖీలులబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని డ్రగ్ స్టోర్స్ను బుధవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం స్టోర్స్లో స్టాక్ ఎంత ఉంది, విని యోగం ఎంత, అత్యవసర మందులు, రెండే ళ్లలో వాడిన మందుల రికార్డులు వంటి వాటిని తనిఖీ చేశారు. స్థానికంగా కొనుగోలు చేసిన మందుల వివరాలు రికార్డులను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన స్టోర్స్లో తనిఖీ చేశారు. ఆయన వెంట అడిషనల్ డీఎంఈ డాక్టర్ వి.రాధికారెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు ఉన్నారు. గతంలో కొనుగోలు చేసిన మందులు, సర్జికల్స్పై ఫిర్యాదుల రావడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు ఆస్పత్రిలో చర్చ జరిగింది. అసలు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఉన్న మందులు, అత్యవసర మందుల స్టాక్ రిజిస్టర్ను కూడా పరిశీలించారు. బందరు జీజీహెచ్లోగ్రహణ పాదాలకు చికిత్స మచిలీపట్నంఅర్బన్: స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో గ్రహణ పాదాల (క్లబ్ ఫుట్) చికిత్స అందుబాటులోకి వచ్చిందని, ఈ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ సూచించారు. ప్రపంచ గ్రహణ పాదాల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రహణ పాదాల సమస్యతో బాధపడుతున్న రోగులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం బందరు జీజీహెచ్లోనే ఈ సమస్యకు అవసరమైన చికిత్స, శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి. కిరణ్కుమార్ మాట్లాడుతూ.. గ్రహణ పాదాల శస్త్రచికిత్సలకు అవసరమైన ప్రత్యేక పరికరా లను ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షణ అధికారి డాక్టర్ భానుమూర్తి, డాక్టర్ భరత్ సింగ్, డాక్టర్ శ్రీనివాసులు, ఆర్ఎంఓ డాక్టర్ నిరంజన్, ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన వైద్యులు పాల్గొన్నారు. మూలపాడు(ఇబ్రహీంపట్నం): మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ (నగర వనం)ను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు కంచికచర్ల ఫారెస్ట్ డీఆర్వో శివప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. నగరవనంతో పాటు పరిసర అటవీ ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురు, శుక్రవారాలు సీతాకోక చిలుకల పార్క్ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులను వనంలోకి అనుమతించడం లేదని తెలిపారు. -
కన్నూమన్ను కానక..
చెలరేగుతున్న అధికార పార్టీ మట్టి మాఫియా సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అక్రమ సంపాదన కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు దిగజారారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొండలను పిండి చేసి, చెరువులను చెరబట్టి, వాగులు, వంకలు, ఏరులు, నదులు ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు తెరలేపి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అయాచితంగా వస్తున్న అక్రమ సంపాదన నేపథ్యంలోనే వారి మధ్య వివాదం మొదలైంది. వాటాల్లో తేడాలు రావడంతో పాటు అక్రమ దందాల్లో తమ పెత్తనమే సాగాలంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి వర్గం ఇలా మూడు వర్గాలుగా విడిపోయి ఒకరి గుట్టును మరొకరు సోషల్ మీడియా వేదికగా రట్టు చేస్తున్నారు. దీంతో పచ్చనేతల బాగోతం బహిరంగమైంది. అయినా వెనక్కు తగ్గని కొందరు అధికార పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులపైనే కేసులు నమోదు, అరెస్టులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా తన్నులాటే.. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీలో వర్గపోరు మొదలైంది. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గ ప్రజాప్రతినిధి వర్గంతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి వర్గం, జనసేన వర్గం మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరైన షాడో నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి చేస్తున్న కమీషన్ల దందా, మట్టి, గ్రావెల్ తవ్వకాలను ప్రశ్నిస్తూ రెడ్డిగూడెం మండలానికి చెందిన తెలుగు యువత మండల మాజీ అధ్యక్షుడు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఉయ్యూరు రమేష్రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసులు బనాయించి అరెస్టు చేయించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఏమాత్రం తీసిపోకుండా పార్లమెంటు ప్రజాప్రతినిధి మైలవరంతో పాటు, విజయవాడ రూరల్ మండలంలో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. -
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బైండోవరైన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో ఇటీవల కొంత మంది వ్యక్తుల నేర చర్యలను నియంత్రించే క్రమంలో వారిని బైండోవర్ చేయగా, వారు నిబంధనలను ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గుడివాడ టూ టౌన్, మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని ఆర్పేట, ఇనగుదురుపేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరు చొప్పున బైండోవరైన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించగా వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలకు ఉపక్రమించారని ఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిలో ఇద్దరు జరిమానాలు చెల్లించేందుకు నిరాకరించగా, వారిని జైలుకు తరలించామన్నారు. మూడో వ్యక్తి ఒప్పందం ప్రకారం రూ. 50 వేల జరిమానాను చలానా రూపంలో చెల్లించారని తెలిపారు. బైండోవర్ ప్రధాన ఉద్దేశం నేరప్రవృత్తి కలిగిన వ్యక్తుల చర్యలను నియంత్రించటంతో పాటు ప్రజల భద్ర తను కాపాడటమేనని అన్నారు. బైండోవర్లో ఉన్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడినా చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు. -
భాషల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో భాషల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అన్నారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆవో ఉర్దూ సీఖే’ సమ్మర్ క్యాంప్లో పాల్గొని కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం బుధవారం వన్టౌన్లోని ముసాఫిర్ ఖానాలో జరిగింది. ముఖ్యఅతిథి ఎన్ఎండీ ఫరూఖ్ మాట్లాడుతూ.. ఉర్దూ భాష నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ.. ఉర్దూ భాష దేశ సాంస్కృతిక వారస త్వంలో కీలక భాగమన్నారు. యువతలో ఉర్దూ భాషపై ఆసక్తి పెంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఆవో ఉర్దూ సీఖే’ కార్యక్రమాన్ని విజయవం తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు టి.డి. జనార్దన్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు అహ్మద్ షరీఫ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ గౌస్ పీర్, వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, బోర్డు సభ్యుడు మెహబూబ్ బాషా, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా తదితరులు ప్రసంగించారు. మంత్రి ఎస్ఎండీ ఫరూఖ్ -
వి.కొత్తపాలెం పీఏసీఎస్లో జిప్సం అక్రమ నిల్వలు!
కోడూరు: మండలం లోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీ ఎస్)లో భారీగా అక్రమ జిప్సం నిల్వలు బయటపడ్డాయి. ఎలాంటి ఇన్వాయిస్, ఓఫామ్, రవాణా పత్రాలు లేకుండా సుమారు 300 కట్టల జిప్సంను గోడౌన్లో నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో తేలింది. సొసైటీ చైర్పర్సన్, జనసేన నాయకుడు రేపల్లె పిచ్చేశ్వరరావు బ్లాక్ మార్కెట్ నుంచి తెప్పించిన జిప్సంను రైతులకు విక్రయించాలని సొసైటీ సీఈఓ తోట శ్రీకాంత్పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించలేనని సీఈఓ నిరాకరించడంతో చైర్పర్సన్ పిచ్చేశ్వరరావు ఆయనపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీఈఓ జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు కోడూరు కృష్ణా బ్యాంక్ సూపర్వైజర్ ఫణీంద్రబాబు విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా చైర్పర్సన్ స్పందించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. ‘నా పీఏసీఎస్కు వచ్చి విచారణ చేయడానికి నువ్వు ఎవరు’ అంటూ సూపర్వైజర్పై కూడా చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనిఖీలు చేసిన వ్యవసాయ అధికారులు విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికా రులు వి.కొత్తపాలెం పీఏసీఎస్ గోదామును బుధవారం తనిఖీ చేశారు. ఏఓ శ్రీధర్ నేతృత్వంలో వీఏఏలు జిప్సం నిల్వలను పరిశీలించారు. ఎలాంటి రికార్డులు లేని 300 కట్టల జిప్సం నిల్వలు బయటపడటంతో వాటి విక్రయాలపై ‘స్టాప్ సేల్’ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో సంబంధిత ఓఫామ్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఓ తెలిపారు. జిప్సం నిల్వలు ఉన్న గోదాముకు తాళాలు వేసి విక్రయాలు జరపరాద్దంటూ నోటీసు అంటించారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ జిప్సం స్థానంలో అక్రమంగా తెచ్చిన జిప్సం విక్రయించే ప్రయత్నాలు చేసేందుకు పూనుకున్న చైర్పర్సన్, జనసేన నాయకుడు పిచ్చేశ్వరరావు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టు ద్వారా పదవి దక్కించుకొని చైర్పర్సన్ ఇలాంటి అక్రమలకు పాల్పడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. -
ప్రముఖ తెలుగు యూట్యూబర్ నందు కుటుంబంపై కేసు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్ఐ బీ. రాజు తెలిపారు.నందూస్ వరల్డ్ యూట్యూబ్ ప్రయాణం నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం.ఆరోపణల్ని ఖండించిన నందన తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు. -
దుర్గమ్మ ఆలయానికి రూ. 2.25లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పెనమలూరుకు చెందిన కిలారు రామ్మోహనరావు కుటుంబం మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన రామ్మోహనరావు తన భార్య విశాలక్ష్మి పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.1.25లక్షలు, మల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ. 50వేలు, గోసంరక్షణ పథకానికి రూ. 50వేలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి దాతలు వెండి కిరీటాన్ని మంగళవారం సమర్పించారు. ఉండ్రపూడికి చెందిన మేకా శ్రీహరి రావు, నున్న రాంబాబు మనవడు మేకా అర్జున్ సాన్విక్ స్వామివారికి 975 గ్రాముల బరువుగల వెండి కిరీటం సమర్పించారు. కిరీటం విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. దాతలకు శేష వస్త్రాలను అందించి సత్కరించారు. అలాగే దేవిరెడ్డి సుదర్శన్రెడ్డి హైమావతి దంపతులు, తోట సుధారాణి, జువ్వనపూడి శోభన్రాజు, కోటేశ్వరమ్మ దంపతులు కలిసి స్వామివారికి 25 కేజీల పులిహోరను ప్రసాదంగా అందజేశారని ఈవో పీవీఎన్వీ ప్రసాదరావు తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యూత్ టైమ్ బ్యాంక్ పేరుతో రోగులకు విద్యార్థులు అందిస్తున్న సేవలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యూత్ టైం బ్యాంక్ ద్వారా యువత తమ సమయాన్ని సమాజానికి అంకితం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా సేవలు విస్తరించాలంటూ యువజన సంక్షేమ శాఖ జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి కొల్లేటి రమేష్ను ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆర్ఎంవో తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎల్నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణకు సంబంధించిన పుస్తకాన్ని కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. 2026– 27 సంవత్సరంలో వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ పంటలను ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, పరిష్కార మార్గాలను పుస్తకంలో ప్రచురించినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిని వ్యవసాయశాఖ సిబ్బంది, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జ్యోతి రమణి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్.మణిధర్ ఉన్నారు. -
కలలు విరిసే.. కనులు మెరిసే
వైద్య విద్యార్థుల్లో స్నాతకోత్సాహంలబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 29, 30వ వార్షిక స్నాతకోత్సవాన్ని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూనివర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్ పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. తొలుత రాష్ట్ర గవర్నర్ చేతుల మీదగా 29వ స్నాతకోత్సవంలో ఐదుగురికి, 30వ స్నాతకోత్సవంలో నలుగురికి డాక్టరేట్స్ ప్రదానం చేశారు. అలాగే సూపర్స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి 29వ స్నాతకోత్సవంలో ఆరుగురికి, 30వ స్నాతకోత్సవంలో ఐదుగురికి గవర్నర్ చేతుల మీదగా గోల్డ్మెడల్స్ అందజేశారు. ఒక్కడికే ఎనిమిది గోల్డ్ మెడల్స్.. అతిథులు, వీసీ డాక్టర్ పి. చంధ్రశేఖర్లు 29వ స్నాతకోత్సవంలో 62, 30వ స్నాతకోత్సవంలో 61 గోల్డ్మెడల్స్ ప్రదానం చేశారు. కాకినాడకు చెందిన సాయి అనిరుథ్ అత్యధికంగా 8 గోల్డ్మెడల్స్ అందుకోగా, కర్నూలుకు చెందిన పెరిగెల నమ్రత 6 బంగారు పతకాలు అందుకున్నారు. తిరుపతికి చెందిన ఆయుర్వేద విద్యార్థిని ఆర్ఎస్వీ సరిత రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ అందుకోగా, విజయవాడకు చెందిన ఆయుర్వేద విద్యార్థిని సీహెచ్ తులసీ అర్చన లక్ష్మి రెండు గోల్డ్, మూడు సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. గుంటూరుకు చెందిన కవలలు ఐ.సుమన, ఐ.సంజన స్నాతకోత్సవాలలో ఒక్కొక్కరు రెండు బంగారు పతకాలు సాధిండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీడీఎస్ చదువుతున్న ఈ ఇద్దరు ప్రతిష్టాత్మకమైన పీఎఫ్ఏ ఇంటర్నేషనల్ అవార్డు, డాక్టర్ ఆర్ అహ్మద్ నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రసుతం ఎండీఎస్ చదువుతున్న వీరు పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.హెల్త్ యూనివర్సిటీ 29, 30వ స్నాతకోత్సవాల్లో 123 మందికి మెడల్స్ సాయి అనిరుథ్కు 8, నమ్రతకు 6 గోల్డ్ మెడల్స్ పలువురికి డాక్టరేట్ల ప్రదానం -
అక్టోబర్ 15 వరకూ ఇసుక తవ్వకాలపై నిషేధం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయటంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు, జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణాజిల్లా పరిధిలోని కృష్ణానదిలో జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొరత లేకుండా చర్యలు.. వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 9 ఇసుక కేంద్రాల్లో (స్టాక్ యార్డులు) సుమారు 10లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన ఇసుకను 24 గంటల పాటు స్టాక్ యార్డుల నుంచి ఏజెన్సీల ద్వారా సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్టాక్ యార్డు ద్వారా టన్ను ఇసుకకు రూ. 155 చొప్పున ఏజెన్సీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. భూ గర్భవనరులశాఖ ఏడీ కొండారెడ్డి, డీపీవో ధనలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ సోమశేఖర్, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ.. డీగ్రేడ్!
అస్తవ్యస్తంగా ఉన్నత విద్యా వ్యవస్థవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో సాధారణ డిగ్రీ విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. సాధారణంగా విద్యా సంవత్సరం అనగానే జూన్ మాసంలో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ మాసాంతానికి పూర్తి కావటం పరిపాటి. కానీ 2025–2026 డిగ్రీ కోర్సులో చేరిన మొదటి ఏడాది విద్యార్థుల విద్యా సంవత్సరం జూన్ వచ్చినా పూర్తి కాకపోవటంతో గందరగోళంగా మారింది. గడిచిన విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర సాధారణ డిగ్రీ మొదటి సంవత్సరం చేరిన వారు సెమిస్టర్ విధానంలో ఇప్పటి వరకూ తమ కోర్సు తొలి ఏడాదిలో కావాల్సిన సెమిస్టర్లు పూర్తికాకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కృష్ణా వర్సిటీలో మరీ దారుణం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతుంటాయి. వర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి తదనుగుణంగా అందులో పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష జరిగే తేదీను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జూన్ 27 నుంచి సుమారుగా సెకండ్ సెమిస్టర్ థియరీ పరీక్షలు ఉండవచ్చని, ఏప్రిల్ 20వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే థియరీ పరీక్షలు ముగిసిన తరువాత ప్రాక్టికల్స్ సైతం ఉంటాయని ఆ షెడ్యూల్లో ప్రకటించింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం నిర్ధిష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం. అంటే జూన్, జూలై మాసాంతం వరకూ ఈ పరీక్షలు జరిగినా, ద్వితీయ ఏడాది విద్యాసంవత్సరం ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ మాసాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. డిసెంబర్ వరకూ అడ్మిషన్లు.. గడిచిన రెండు మూడేళ్లుగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను డిసెంబర్ వరకూ కొనసాగించటంతో ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే మాసంలో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఆ దిశగా సకాలంలో చర్యలు చేపట్టకపోవటంతో ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇంజినీరింగ్ తదితర ఇతర కోర్సుల అడ్మిషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత సాధారణ డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించటం, డిసెంబర్ వరకూ అడ్మిషన్లను నిర్వహించటంతో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. దయనీయంగా అధ్యాపకుల పరిస్థితి విద్యా సంవత్సరం ఏటా సకాలంలో పూర్తికాకపోవటంతో అధ్యాపకుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సెకండ్ సెమిస్టర్ పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్లో జరగకపోవటంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు మేలోనూ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. విశ్వవిద్యాలయం సెలవులు ప్రకటించినా అటానమస్ కళాశాలలు మాత్రం పని చేస్తుండటంతో అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయం ప్రకటించిన షెడ్యూల్ అనుసరించాల్సిన అటానమస్ కళాశాలలు తమకు వాటితో సంబంధం లేదంటూ ఇష్టారాజ్యంగా తరగతుల నిర్వహణ చేస్తుండటంతో మంచి వేసవిలోనూ విద్యార్థులు, అధ్యాపకులు తరగతులకు హాజరుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సరిదిద్దాలి.. కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితులతో విద్యా సంవత్సరంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రెండుమూడేళ్లు మాత్రం ఇబ్బందులు తతెత్తి విద్యాసంవత్సరం ఆలస్యమైంది. అయితే ఆ పరిస్థితుల నుంచి బయట పడినప్పటికీ ఇతర కోర్సుల సీట్లు నిండిన తరువాత సాధారణ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటిస్తుంది. దాంతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇప్పటికైనా దిగజారు తున్న పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ సరిదిద్దాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక అటానమస్ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలలన్నీ ఉన్నత విద్యామండలి ఆదేశాలకు అనుగుణంగా సొంతంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుంటాయి. అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని అటానమస్ కళాశాల్లోనూ దాదాపుగా సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాలేదు. ఆ కళాశాలలన్నీ జూన్ లేదా జూలై మాసాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నాయి. దాంతో ఏ విద్యాసంవత్సరంలో తాము ఉన్నామో అర్థం కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. -
‘సర్’ తో అప్రమత్తంగా ఉండాలి
గుడివాడ టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) విషయంలో అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. మంగళవారం స్థానిక కె– కన్వెన్షన్లో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ సర్ పేరుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి దొడ్డిదారిన అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన నియోజకవర్గంలో సర్ పేరుతో 45వేల ఓట్లు తొలగించడంతో ఆయన ఓటమి పాలయ్యారన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ 15 ఏళ్లు నిరవధికంగా ముఖ్యమంత్రిగా చేశారని, ఆమె పక్క నియోజకవర్గం నుంచి అక్కడకు వచ్చి పోటీచేసిన వ్యక్తిపై ఓటమి పాలవడం గమనార్హమని అన్నారు. అక్కడ సైతం సర్ పేరుతో సుమారు 50వేలు పైబడి ఓట్లు తొలగించడమే కారణంగా కనిపిస్తోందని చెప్పారు. రానున్న పంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో సర్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్ఓలు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులు దీనిని ఒక చాలెంజ్గా తీసుకుని దృష్టి పెట్టాలన్నారు. మ్యాపింగ్ చేయించాలి.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ సర్ పరిశీలనలో ఓటర్ లిస్ట్లో మ్యాపింగ్ అయిన వారి పేర్లు తొలగించాలంటే సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం మన వద్ద ఉన్న సమాచారం మేరకు సుమారు 50 వేల నుంచి 60వేల మంది మ్యాపింగ్ కావలసి ఉందన్నారు. ఓటరుగా నమోదై మ్యాపింగ్ చెయ్యకపోతే తొలగింపును ప్రశ్నించడానికి అవకాశం ఉండదన్నారు. ప్రతి కార్యకర్త ఓటరు జాబితాను పరిశీలించి ఇంటింటికీ తిరిగి మ్యాపింగ్ కాని వారిని మ్యాపింగ్ చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ వారు మీ ఓట్లు తొలగిస్తారు తమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారని, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, బీఎల్ఓలతో సహా అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంటారని, అలాంటప్పుడు వైఎస్సార్ సీపీ వారు ఓట్లు తొలగిస్తారని అనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో సర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఇన్చార్జ్ వరికూటి అశోక్బాబు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవీ నారాయణరెడ్డి, మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకుడు దుడ్డు చిన్నా, యువ నాయకుడు కొడాలి అర్జునరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.గుడివాడ నియోజకవర్గ బూత్ కన్వీనర్లు, నేతల సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని -
సజావుగా ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం సజావుగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం, ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్షల్లో గణితం, భారతీయ సంస్కృతి–వారసత్వం, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షల్లో రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు మచిలీపట్నం పరిధిలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు నమోదైన 1,190మంది విద్యార్థుల్లో 773 మంది హాజరుకాగా, 417 మంది గైర్హాజరయ్యారని, హాజరు 64.96 శాతం నమోదైందని చెప్పారు. ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్షలకు నమోదైన 411 మంది విద్యార్థుల్లో 335మంది హాజరు కాగా, 76 మంది గైర్హాజరయ్యారన్నారు. హాజరు 81.51 శాతం నమోదైందని చెప్పారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు నమోదైన 638 మందిలో 541 మంది హాజరు కాగా, 97 మంది గైర్హాజరయ్యారని, హాజరు 84.80 శాతం నమోదైనట్లు డీఈఓ సుబ్బారావు తెలిపారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 38 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల కన్వీనర్ ఎస్. సరళ కుమారి తెలిపారు. పరీక్షకు 4,314 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 3,836 మంది హాజరయ్యారని, 477 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. హాజరు 88.68శాతం నమోదైందన్నారు. ఈ పరీక్షకు సెట్ నంబర్–2 ప్రశ్నపత్రాన్ని వినియోగించినట్లు తెలిపారు. రెండో ఏడాది విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కెమిస్ట్రీ–2 పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు 1,886 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 1,204 మంది హాజరయ్యారని, 681 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. హాజరు 64 శాతం నమోదైందన్నారు. -
దుబారాలో దూసుకుపోతున్న బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబారాలో ప్రభుత్వం దూసుకుపోతూ జాతీయ మీడియాలో ప్రచారానికి నిధులు విడుదల చేసింది. జాతీయ మీడియా పొగడ్తల కోసం రూ. 45 లక్షలు ఖర్చు పెట్టింది.ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారానికి 45 లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇండియా టుడే, ది వీక్, ఔట్లుక్, బిజినెస్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో ప్రచార ప్రకటనలతో పాటు ఫీచర్ ఆర్టికల్స్ ప్రచురించినందుకు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. -
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
గూడూరు: విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్ రంగబాబు కోరారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ ద్వారా గూడూరు హైస్కూల్లో నిర్వహిస్తున్న వేసవి హాకీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జరి గింది. ఈ సందర్భంగా మచిలీపట్నం– గూడూరు మండలం బాల, బాలికల జట్ల హాకీ పోటీలు గూడూరు హైస్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మి, గూడూరు హకీ క్లబ్ అధ్యక్షుడు మొటేపల్లి రత్నారావుతో కలిసి జెడ్పీటీసీ సభ్యుడు సురేష్ రంగబాబు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ గూడూరు హాకీ క్లబ్ ఆధ్వర్యాన జాతీయ క్రీడ హాకీని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నిబద్ధతతో వేసవి హాకీ శిబిరాన్ని కొనసాగించిన జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ మత్తి అరుణ, హాకీ కోచ్ హరికృష్ణను ఆయన అభినందించారు. గూడూరు హాకీ క్లబ్ అధ్యక్షుడు మోటేపల్లి రత్నారావు మాట్లాడుతూ గూడూరు హైస్కూల్ పరిధిలో హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి తమ క్లబ్ కృషి చేస్తుందన్నారు. డీఎస్డీఓ ఝాన్సీ లక్ష్మి, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి మత్తి అరుణ, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, కోచ్ శ్రవణం హరికృష్ణ, గూడూరు హాకీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎంఏ సలీమ్, సెక్రటరీ పెనుగొండ శ్రీనివాసరావు, బేగ్, స్టేట్ వెటరన్ అథ్లెట్ తోట విజయ్కుమారి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మచిలీపట్నం మండలం మధ్య జరిగిన హాకీ పోటీల్లో బాలిక విభాగంలో గూడూరు.. బాలుర విభాగంలో మచిలీపట్నం జట్లు విజయం సాధించాయి. విజేతలకు శిక్షణ పొందిన క్రీడా కారులకు రత్నారావు ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం చేశారు. -
ఆర్టీజీఎస్తో మిస్సింగ్ కేసు ఛేదన
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) ఉపయోగించి అదృశ్యమైన ఓ వ్యక్తి ఆచూకీని అజిత్సింగ్నగర్ పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న నల్లమిల్లి యోహాన్ (40) గత నెల 20వ తేదీ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో క్రైమ్ నంబర్ 157/2026 గా కేసు నమోదు చేసిన పోలీసులు తమ ప్రత్యేక బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆ తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. అనంతరం యోహాన్ ఫొటోను ఆర్టీజీఎస్ వ్యవస్థలో అప్లోడ్ చేయగా ఏలూరు జిల్లా కామవరపుకోట పరిసర ప్రాంతంలోని కెమెరాల్లో అదృశ్యమైన అతను కనిపించినట్లు అలర్ట్ అందింది. దీంతో పోలీసు బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. తప్పిపోయిన వ్యక్తిని గుర్తించి క్షేమంగా నగరానికి తీసుకువచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. -
కారుపై అకస్మాత్తుగా విరిగిపడిన భారీ వృక్షం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రయాణిస్తున్న ఒక కారుపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగిపడిన సంఘటన ఆదివారం సాయంత్రం విద్యాధరపురంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురం సితార జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వైపు వెళుతున్న ఏపీ 39డబ్ల్యూఎన్ 4335 నంబర్ గల వెర్టిగ కారు చెరువు సెంటర్ సమీపంలో రోడ్ పక్కనే ఉన్న చిన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి కొన్నేళ్లనాటి పురాతన భారీ వృక్షం ఒక్క సారిగా విరిగి కారుపై పడింది. దీంతో స్థానికులతోపాటు వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు భవానీపురం పోలీసులకు, నగరపాలక సంస్థ అధికారులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన వచ్చిన వారు స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని అతికష్టంపై బయటకు తీశారు. స్వల్ప గాయాలతో బయటపడిన అతనికి ప్రాథమిక చికిత్స చేయించారు. పోలీసుల సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట రాజీవ్ కాలనీకి చెందిన కొక్కిలిగడ్డ రాజశేఖర్ (45) ట్రావెల్స్ కారు నడుపుతూ ర్యాపిడో నిమిత్తం విజయవాడకు వచ్చారు. ప్యాసింజర్ను దింపేసి తిరిగి తాడేపల్లి వెళిపోతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారు డ్రైవ్ చేస్తున్న రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారుపై పడింది పెద్ద వృక్షం కావడంతో కారుకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార జంక్షన్కు వెళ్లే ఈ అంబేడ్కర్ రోడ్లో నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్
కంచికచర్ల: అమ్మవారి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు వచ్చి తిరిగి బైక్పై ప్రయాణిస్తుండగా కంచికచర్ల మండలం సమీపంలోకి రాగానే బైక్.. డివైడర్ను ఢీకొనగా ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలైన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారి పాలెం గ్రామం నుంచి బంధువులు, కుటుంబసభ్యులు 15మంది టాటాఏస్ వాహనం ద్వారా పెనుగంచిప్రోలులో కొలువైఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మను దర్శించుకుని, మొక్కలు తీర్చుకునేందుకు వచ్చారు. వారిలో మిగిలిన ఇద్దరు యువకులు బైక్పై వచ్చారు. మొక్కులు తీర్చుకుని తిరిగి వారి స్వగ్రామానికి బయలుదేరారు. ఆ ఇద్దరు వ్యక్తులు బైక్పై బయలుదేరారు. కంచికచర్ల మండలం పరిటాలలోని నక్కలంపేట రోడ్డు సమీపంలోకి రాగానే వారు నడుపుతున్న బైక్ జాతీయ రహదారి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న శాంతిరాజు, రాజుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది గాయపడ్డవారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
లారీ బోల్తా
తప్పిన పెనుప్రమాదం మధురానగర్(విజయవాడసెంట్రల్): రామవరప్పాడు నుంచి కండ్రిక వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశావత్తూ బోల్తాపడింది. ఘటనలో అదృష్టవశావత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ 05 టీఎఫ్ 1839 లారీ రామవరప్పాడు మొదటి ఫ్లైఓవర్ ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇన్ హోటల్ బ్యాక్సైడ్ పుట్ఫాత్ మీదుగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. లారీ పెద్ద శబ్దం చేస్తూ బోల్తాపడింది. అదృష్టవశావత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ సాయంతో లారీను తొలగించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో లారీ బోల్తాపడటంపై స్థానికులు, వాహనచోదకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
నేడు పోలీస్ పీజీఆర్ఎస్
కృష్ణా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని ఈ నెల ఒకటో తేదీ సోమవారం యఽథావిధిగా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని, ఫిర్యాదుదారులు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం కోరుతూ అర్జీలు అందజేయవచ్చన్నారు. మీ కోసంలో అందిన ప్రతి అర్జీపై విచారణ జరిపించి చట్ట పరిధిలో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జగ్గయ్యపేట(ధర్మవరపాడు తండా): గ్రామంలోని రామ్ కో సిమెంట్ కర్మాగారంలో కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మంచిర్యాల జిల్లాకు చెందిన దాసరి శ్యామ్ (37) కర్మాగారంలోని ప్యాకింగ్ ప్లాంట్ సెక్షన్లో 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా చేస్తున్నాడు. ఈ క్రమంలో విధులకు హాజరై పని చేస్తుండగా ప్లాంట్ లోని సిమెంట్ బస్తాలు తయారై బెల్ట్ ద్వారా బయటికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా బెల్టు తెగి అతనిపై పడగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఫ్యాక్టరీలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందాడని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. పరిశ్రమల శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేస్తున్నారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లబ్బీపేట/గుణదల(విజయవాడతూర్పు): రామ్చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం సోమవారం నగరంలో జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు. ఈవెంట్కు వివిధ కేటగిరీల్లో ఇప్పటికే పాస్లు మంజూరు చేశారు. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ ఏర్పాట్లను సెంట్రల్ ఏసీపీ దామోదరరావు సిబ్బందితో పరిశీలించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం నిర్వహించిన కీ బోర్డు సంగీత వాయిద్య బృందంలో విజయవాడకు చెందిన చిన్నారికి స్థానం లభించింది. నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మైఖల్ డేవిడ్ మందా ఫిబ్రవరిలో హైదరాబాద్లో జోరాస్ట్రియన్ క్లబ్లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో కీబోర్డ్ సంగీత వాయిద్య పోటీల్లో పాల్గొన్నాడు. 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు హాజరై ఏకంగా గంట సమయం వరకు ఆగకుండా ప్రదర్శన చేశారు. 777 మంది ఎంపిక కాగా ఈ ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో స్థానం లభించింది. ఈ సందర్భంగా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అధినేత అగస్టిన్ దండింగి చేతుల సర్టిఫికెట్ ప్రదానోత్సం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్లో జరిగింది. మైఖల్ డేవిడ్ మందా సర్టిఫికెట్ను అందుకున్నారు. తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని తెలిపారు. -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అస్వస్ధతకు గురైన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండమోడు – పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపునకు బేబీ చిప్స్తో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనాన్ని నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి 50 మంది ప్రయాణికులతో గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుంచి మొక్కు తీర్చుకోవడం కోసం దామరచర్ల గ్రామం గండి మైసమ్మ దేవాలయానికి ప్రయాణమైన భక్తుల డీసీఎం లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ వాహనం ముందు క్యాబిన్ ధ్వంసమై క్యాబిన్లో కూర్చున్న ఓర్చు వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు విరగ్గా, ఓర్చు యేసురాజుకు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చు రమణమ్మకు ఛాతీలో నొప్పి అధికమై అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాళ్లు విరిగిన వెంకటేశ్వర్లు, యేసురాజులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఇది ఇలా ఉంటే డీసీఎం లారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఇరువాహనాల డ్రైవర్లు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇరువురికి తీవ్ర గాయాలు -
ఎట్టకేలకు అవ్వకు పింఛన్!
పెడన: కన్నబిడ్డ ఆదరణకు నోచుకోక.. సర్కారు సాయం చేతికందక.. పరాయి పంచన కూలిపోయిన పాకలో, ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న అవ్వకు అధికారులు ఎట్టకేలకు పింఛన్ మంజూరు చేశారు. ‘సాక్షి’లో ఏప్రిల్ 14న ‘కన్న బిడ్డ కాఠిన్యం.. బాబు పాలనలో దౌర్భాగ్యం’ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించారు. పెడన మండలం చోడవరం గ్రామానికి చెందిన లింగం రంగమ్మ(87)ను కుమారుడు పట్టించుకోకపోవడంతో సోదరి కుమారుడు నేలకొండపల్లిలో ఉంచి కొన్నాళ్లు చూశారు. ఆ తరువాత ఆమె పింఛన్ కూడా రాకపోవడంతో పట్టించుకోలేదు. మూడు నెలలుగా ఎవరూ చూడకపోవడంతో గాలివాన వచ్చి పడిపోయిన పాకలో ఆ వృద్ధురాలు జీవచ్ఛవంలా ఉంటోంది. పరిసర ప్రాంతాల వారు గమనించి ఏప్రిల్ 13న మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోని రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. కారణం ఇదే.. వేలిముద్రలు సరిగ్గా పడటం లేదని, ఐరిష్ కూడా పడకపోవడంతో పింఛన్ నిలిచిపోయిందనే విషయం గుర్తించారు. ఇన్చార్జి తహసీల్దార్ కె.అనిల్కుమార్, సీఐ నాగేంద్రప్రసాద్, ఎంపీడీఓ అరుణకుమారి కుటుంబ సభ్యులను పలుమార్లు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. పింఛన్ వచ్చేలా చూస్తామని, వృద్ధురాలి ఆలనాపాలనా చూడాలని సూచించారు. చోడవరంలో రంగమ్మకు ప్రత్యేకంగా ఒక పాకను నిర్మించి అందులో ఉంచి మంచీచెడ్డా చూసేలా ఒప్పించారు. వృద్ధురాలికి వేలిముద్రలతో సంబంధం లేకుండా పింఛన్ ఇచ్చేలా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు చేపట్టడంతో ఆమెకు మే నెల పింఛన్ను ఎంపీడీఓ ఎ.అరుణకుమారి స్వయంగా వెళ్లి అందించారు. -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని గతంలో తాను చెప్పినప్పటికీ ఇంత వరకు ఏ ఒక్క అధికారి పంపలేదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్తో పాటు డెప్యూటీ కలెక్టర్ బి. నారాయణ, డీఎస్పీ జి. శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కావాల్సిన నిధుల వివరాలకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అంగన్వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన నివేదికలు అసంపూర్తిగా ఉన్నాయని ఇలా అయితే చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగంపై నమ్మకంతో అర్జీలు సమర్పిస్తున్నారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం ప్రతి అధికారి బాధ్యతన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం చోటు చేసుకోకుండా చూడాలన్నారు. మీకోసంలో అధికారులు 138 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● తనకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారని.. పిల్లలకు పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్కార్డులు లేవని, దీని వల్ల వారు చదువులు, సంక్షేమ పథ కాలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నా రని తమపై దయ ఉంచి వాటిని మంజూరు చేయాలని మచిలీపట్నం నగరంలోని 50వ డివిజన్కు చెందిన టి. నాంచారమ్మ కలెక్టర్కు విన్నవించుకున్నారు. ● తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని కుమారుడికి వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక భర్త పురుగుమందు తాగి చనిపోయాడని, ప్రస్తుతం ఆడపిల్లలకు ప్రమాదవశాత్తూ కన్ను పోయిందని, ఈ వైద్య ఖర్చుల కోసం ఆర్థికసాయం చేయాలని, అంతేకాకుండా ఒంటరి మహిళ పింఛన్, ఇళ్ల స్థలం మంజూరు చేయాలని గుడివాడ పట్టణంలోని 1వ వార్డుకు చెందిన గుడుమూరి శ్రీదేవి అర్జీ ఇచ్చారు. ● తన కుమారుడు గోగులమూడి విజయ్ కుమార్ 90 శాతం అంగవైకల్యం ఉందని.. ప్రస్తుతం వస్తున్న రూ.6 వేలు పింఛన్కు బదులుగా రూ.15 మంజూరు చేసి ఆదుకోవాలని, వీల్ చైర్ మంజూరు చేయాలని గుడివాడ మండలం మోటూరుకు చెందిన జి. మరియమ్మ అర్జీ ఇచ్చారు. -
కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా జ్యోతిరమణి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా కె. జ్యోతిరమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన ఎన్. పద్మావతి శనివారం ఉద్యోగవిరమణ చేశారు. ఈ స్థానంలో కృష్ణాజిల్లా వనరుల కేంద్రం డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్గా ఇటీవల బదిలీ అయిన రమణిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. -
యువఝరి.. రణభేరి!
దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక నిరసన కార్యక్రమం జరిగింది. నగరంలోని లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ర్యాలీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చౌక్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు శ్రేణులు ర్యాలీగా బయలుదేరటంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు అందరినీ పంపేది లేదని, ముఖ్యమైన నాయకులు పది మంది వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలని చెప్పటంతో కొద్దిసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ముఖ్యమైన నాయకులను కలెక్టరేట్లోకి అనుమతించారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేసి, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కలెక్టర్కు నాయకులు వివరించారు. కార్యక్రమంలో మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్సలార్దాదా, నగర పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్బాబు (సుబ్బన్న), వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, శ్రీరాం చిన్నా, గాజుల భగవాన్, చిటికిన నాగేశ్వరరావు, గూడవల్లి నాగరాజు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి అరిగే హేమంత్ నాయుడు, ఉపాధ్యక్షుడు జె. మణికంఠ, జిల్లా విద్యార్థి విభాగం ప్రధానకార్యదర్శి వీరయ్య, గన్నవరం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. రవి, గుడ్లవల్లేరు మండల యువజన అధ్యక్షుడు జి. రవి, గుడివాడ టౌన్ యువజన అధ్యక్షుడు అడపా హర్ష, అవనిగడ్డ యువజన విభాగం అధ్యక్షుడు చింతలపూడి భాస్కరరావు, పామర్రు యువజన విభాగం అధ్యక్షుడు భగవత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారం మెగా... ఫలితం దగా..
మచిలీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) మాట్లాడుతూ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు, లేని కంపెనీలు తెచ్చినట్లు ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. మెగా డీఎస్సీని గొప్పగా ప్రచారం చేస్తూ.. వాస్తవంలో అభ్యర్థుల మెరిట్ దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. అన్ని శాఖల మంత్రి నారా లోకేష్కు క్యాష్ తప్ప ఇంకేమీ పట్టడం లేదని విమర్శించారు. అధికారం వచ్చిందని ఏదైనా చేయవచ్చని అనుకుంటే అది భ్రమేనని హెచ్చరించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో లక్షల వలంటీర్, సచివాలయ ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చామని గుర్తు చేశారు. విద్యాశాఖ ఉద్యోగాల్లో కొనుగోలు – అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెరిట్ లిస్టు ప్రదర్శించాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని కూడా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. -
బయోగ్యాస్ సరఫరాకు పాయింట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో వంటగ్యాస్ అవసరమైన ప్రాంతాల్లో బయో గ్యాస్లైన్ వేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి సోమవారం పరిశీలించారు. అందులో భాగంగా రోగులు, డ్యూటీ వైద్యులకు ఆహారం సిద్ధం చేసే డైట్ క్యాంటీన్, వైద్య విద్యార్థుల యూజీ, పీజీ హాస్టల్స్, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్లలో డైట్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలో బయోగ్యాస్ లైన్ ఉన్నందున, ఆస్పత్రిలో అవసరమైన ప్రాంతాలకు సరఫరా లైన్ వేసేందుకు పాయింట్లు గుర్తించారు. తొలుత ఆస్పత్రి, హాస్టల్స్కు బయోగ్యాస్ లైన్ వేసిన తర్వాత, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు హోటల్స్, కాఫీ స్టాల్స్కు కూడా సరఫరా చేసేందుకు ఆస్పత్రి అధికారులతో చర్చించారు. ఆమె వెంట అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) జె. లక్ష్మీకుమారి తదితరులు ఉన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అమలవుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసే సమయంలో కనీసం అరగంట సమయం కేటాయించి ఒక వీధిని ఎంపిక చేసుకుని అక్కడ కనిపించే వ్యర్థాలను తొలగించేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, అధికారుల భాగస్వామ్యం తదితర అంశాలపై అధికారులకు వివరించారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈగా పి. హరిబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా పనిచేసిన రవీంద్రబాబు శనివారం ఉద్యోగవిరమణ చేశారు. ఈ స్థానంలో గుణదల ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం ఈఈగా పనిచేస్తున్న పి. హరిబాబును ఉద్యోగోన్నతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈగా నియమించింది. దీంతో ఆయన సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్లో కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్నారు. తిరువూరు పీఎస్ ఎదుట బాలిక కుటుంబం ఆత్మహత్యాయత్నం తిరువూరు: బాలికతో సచివాలయ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు స్పందించకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు సోమవారం తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కొమ్మిరెడ్డిపల్లిలోని సచివాలయ ఉద్యోగి బంకా మధు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గతనెల 17న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ, అక్క సోమవారం రాత్రి తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులను పోలీసులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు ఎస్ఐ శాతకర్ణి కేసు నమోదు చేయకుండా నిందితుడికి కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర సంగమం వద్ద 5వ తేదీ నుంచి ప్రారంభించే కృష్ణమ్మ హారతుల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్కు చేరుకున్న అధికారులు ఏర్పాట్ల గురించి చర్చించారు. సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన సామగ్రిని భద్రపరుచుకునేందుకు తగినన్ని ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. -
మెరిట్ లిస్టు విడుదల చేయాలి..
పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనగాని చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మోసాల కారణంగా యువతకు ఉద్యోగాలపై నమ్మకం కోల్పోయిందన్నారు. వెంటనే డీఎస్సీ మెరిట్ లిస్టును బహిర్గతం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మెరిట్లిస్ట్ బహిర్గతం చేయకుండా కావాలనే అధికారులతో తప్పుడు సమాచారం ఇప్పిస్తున్నారని, దీని వల్ల డీఎస్సీ అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
నారా లోకేశ్కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు: పేర్ని నాని
విజయవాడ: కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విద్యాశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్నీ గుట్టుగానే జరుగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి. కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి. ఆన్లైన్లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి. చదువు రానివాడు చూసినా అర్ధమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చట్టం ఎంత కష్టంగా ఉంటుందో డీఎస్సీ కూడా అలాగే ఉంది.నారా లోకేశ్కి తప్ప డీఎస్సీ గురించి ఎవరికీ తెలియదు. స్పోర్ట్స్ కోటా తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి చెబుతాడు. సమాచార శాఖ హక్కు చట్టం ప్రకారం స్పార్ట్స్ కోటాలో కొన్ని ప్రశ్నలు అడిగాం. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో రిక్యూట్ మెంట్ కింద ఎంతమందిని తీశారు? ఎంత పర్సెంట్ కి ఎన్ని పోస్టులు తీశారు? ఏ జీవో, ఏ సర్క్యూలర్ కింద పోస్టులు తీశారు? 16 వేల పోస్టుల్లో ఎన్ని పోస్టులు తీసుకున్నారు? జిల్లాలో ఏ కేటగిరీ కింద పోస్టులు తీసుకున్నారు. అర్హతకి ఆధారాలు ఏంటీ? సెలక్షన్ ప్రోసిజర్ ఎంటీ? జిల్లా మెరిట్ లిస్ట్, పైనల్ లిస్ట్ కావాలి. స్పోర్ట్స్ కేటగిరీలో వివరాలు అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరి కింద సెలక్షన్ ఆధారాలు అడిగాం? సెలక్షన్ కమిటీ వివరాలు అడిగాం. స్పోర్ట్ కోటా కింద ఎంతమందిని రిజెక్ట్ చేశారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? వంటివి అడిగాం. అభ్యర్థనలు ఏంటీ? అనే కూడా వివరాలు అడిగాం.. డీఎస్సీలో రిక్యూట్ మెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు, ఇతర వివరాలు అడిగాం. సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సిన బాద్యత ప్రభుత్వానిది. టెట్ పేపర్ ఎవరు తయారు చేశారు? ఏ ప్రాతిపదికనా వాళ్లను నియమించారు? వాళ్ల సహయకులు ఎవరు అనేది అడిగాం? పైనల్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారా? వాళ్ల పేర్లు ఇవ్వాలని అడిగాం. 16 అంశాల మీద ఆర్టీఐ వేశాం. చంద్రబాబు, లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో రెచ్చిపోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. పాత స్పోర్ట్ కోటా జీవో మార్పు చేసి 29 నుండి 67గా ఎందుకు మార్పు చేశారు? రెండు శాతం నుండి 3శాతం వరకు ఎందుకు పెంచారు?పరీక్ష పూర్తి అయిన తరువాత ఎందుకు జీవో మార్పు చేశారు. యువగళంలో పాల్గొని, లోకేశ్తో నడిచిన వాళ్లకు హెరిటెజ్ లో ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉద్యోగాలు ఇచ్చేశారు. దొడ్డి దారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. నిజం నిలకడగానే తెలుస్తుంది.. డీఎస్సీలో తప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబుకు, లోకేశ్కు దమ్ములేదు. మమ్మల్ని తిట్టే టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బయటపెట్టండి. విద్యాశాఖ మంత్రి శాఖను పక్కన పెట్టి.. తప్పుడు పనులకు ప్రయారిటీ ఇస్తున్నారు. కూటమి నేతల పాపాల చిట్టా.. చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో కూకట్పల్లి సీటు హరికృష్ణ కూతురుకు ఇచ్చే బదులు రాజ్యసభ సీటు ఇవ్వండి. డబ్బున్న వాళ్లకే ఇస్తారా? డబ్బులేని నందమూరి ప్యామిలీని వాడుకొని వదిలేస్తారా?’’ అని నిలదీశారు. -
మొండి బతుకులు.. తొండి ఆటలు!
ఎదురుమొండి ప్రజల ఆశల వారధిపై సర్కారు తీరిది! అవనిగడ్డ: ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాకుండా పాలకులు అడ్డుపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఎదురుమొండి వారధిని గత ప్రభుత్వం మంజూరు చేయించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల దీవుల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రాత్రివేళలో ఏదైనా అత్యవసరమైతే పడవ దాటి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివిసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో బండి కోళ్లంక వద్ద కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపగా కూటమి ప్రభుత్వంలో దీని ఊసేలేదు. ఎందుకంత కక్ష.. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవుల్లో మూడు పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడి దీవుల్లో పదివేల మంది నివాసం ఉంటున్నారు. వీరందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ఈ దీవులకు వెళ్లాలంటే రహదారి సౌకర్యం లేదు. ఫంటు లేదంటే పడవపై కృష్ణానది పాయను దాటి వెళ్లాల్సిందే. అర్ధరాత్రి ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైనా, పురిటి నొప్పులు వచ్చినా పడవదాటి రావాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి దీవుల ప్రజలకు రహదారి మార్గం కల్పించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో మాట్లాడి వారధిని మంజూరు చేయించారు. రూ.109 కోట్లు నాబార్డు నిధులతో ఏటిమొగ – ఎదురుమొండి మధ్య వారధిని నిర్మించేందుకు 2022 ఏప్రిల్ 13న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీవో 101ని జారీ చేసింది. ఈ వారధి నిర్మాణానికి ఓ ప్రజాప్రతినిధి అడ్డుపడటం, ఇంతలో ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వం వారధి నిర్మాణ పనులు చేపట్టలేక పోయింది. వారధి కోసం దీక్షకు సన్నద్ధం.. ఎదురుమొండి వారధి నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సన్నద్ధమవుతున్నారు. దీవుల ప్రజలను సమీకరించి వారధి కోసం వైఎస్సార్ సీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. అధికారంలోకి వస్తే ఎదురుమొండి వారధిని నిర్మిస్తామని కూటమి నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులిద్దరూ జనసేన నేతలే కావడం గమనార్హం. అయినా అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఎదురుమొండి వారధి గురించి పట్టించుకోకపోవడం పట్ల దీవుల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తే హైజాక్ చేయడం, తన తండ్రి పేరు పెట్టుకోవడం ప్రస్తుత ఎమ్మెల్యేకు కొత్తేమీ కాదు. గతంలో పులిగడ్డ – పెనుమూడి వారధి విషయంలో ఇదే చేశారు. ఇప్పుడు ఎదురుమొండి వారధిని నిర్మించి మీ ఇష్టం వచ్చిన వారి పెట్టుకోండి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ వారఽధి నిర్మాణాన్ని అడ్డుకుని దీవుల ప్రజలకు అన్యాయం చేయొద్దు. – సింహాద్రి రమేష్బాబు, మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డఎదురుమొండి దీవులకు వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో వారధి కోసం రూ.109 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అధికారంలోకి వస్తే ఎదురుమొండికి వారధిని నిర్మిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వారధి ఊసేలేదు. ప్రభుత్వం స్పందించి వారధి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. – నాయుడు వెంకటేశ్వరరావు, ఎదురుమొండి -
రైల్వే ఉద్యోగుల కనీస వేతనం పెంచాలి
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైల్వే అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఉద్యోగులకు కనీస వేతనం రూ.69వేలుగా ఉండాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) జాతీయ అధ్యక్షుడు మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మే 19న హైదరాబాద్కు వచ్చిన వేతన సంఘ ప్రతినిధులకు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, ఫిట్మెంట్ 3.83 శాతంగా ఉండాలని, కనీస వేతనం రూ.69వేలుగా నిర్ణయించాలని, అదే విధంగా ఇంటి అద్దె అలవెన్సులు మార్చాలని, ఇంక్రి మెంట్ పెంపు ఐదు శాతం ఉండాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే ఉద్యోగులు, కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు అందజేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోండి
వత్సవాయి: ఆయా పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి డీఎంఎఫ్ విజయకుమారి సూచించారు. ఆదివారం మండల కేంద్రం వత్సవాయిలోని విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నమ్మకమైన షాపులో నాణ్యమైన విత్తనాలను తీసుకుని సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన తరువాత తప్పకుండా రశీదులు తీసుకుని వాటి మీద బ్యాచ్ నంబర్ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. తీసుకున్న రశీదులను పంట పూర్తమ్యే వరకు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని తెలిపారు. ఒకవేళ విత్తనాలలో లోపం ఉన్నట్లయితే సదరు రశీదుతో షాపుల మీద కేసు పెట్టుకునే అవకాశం ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో జి. సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ), గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్టెచ్చర్ బేరర్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాపై అభ్యంతరాలను జూన్ 1 నుంచి 3 వరకూ స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. మెరిట్ జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ ntr.ap.gov.inలో పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అర కిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ.1.36లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఉత్సాహంగా క్రికెట్ టోర్నీతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా.. ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. బహుమతి ప్రదానోత్సవానికి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరై గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిచారు. ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్ పాల్గొన్నారు. -
వెంటిలేటర్పై వైద్యారోగ్యం!
విజయవాడ జీజీహెచ్లో ఒక్క నెలలోనే 570 మరణాలుఅమ్మో.. పెద్దాస్పత్రి అంటున్న రోగులులబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్వజన ఆస్పత్రిలో డెత్రేట్ పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు రోజుకు 12 నుంచి 15 వరకూ మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు అవి 20కి పెరిగాయి. అంతేకాదు ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు నమోదు కాగా, ఎండలు అధికంగా ఉన్న ఒక్కరోజే 42 మరణాలు సంభవించాయి. ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు దిగజారుతున్నాయనేందుకు ఇవే నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణులైన వైద్యులు ఉన్నా, మెరుగైన వైద్యం అందించేందుకు కనీస సౌకర్యాలు కొరవడినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సౌకర్యాల లేమితోనేనా? ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర సమయంలో ప్రాణ వాయువు అందించే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు వెంటిలేటర్లు 80 వరకూ ఉండేవి, వాటిలో చాలా వరకూ పాడైపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం 35 వరకూ ఉన్నాయి. వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎంపీ నిధుల నుంచి నాలుగు వెంటిలేటర్లు అందజేశారు. వాటిని ట్రామాకేర్ వార్డులో ఏర్పాటు చేశారు. ఇంకా ఐసీయూల్లో తీవ్ర మైన కొరత ఉంది. ప్రాణాపాయంతో వచ్చిన వారిని ఉంచేందుకు వెంటిలేటర్లు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తుతోంది. ఎక్కువ మరణాలు సంభవించడానికి అది కూడా ఒక కారణమనే అనుమానాలు ఉన్నాయి. గతంలో ఖరీదైన అత్యవసర ఇంజెక్షన్స్ను ముందుగానే కొనుగోలు చేసి ఉంచేవారు. ఇప్పుడు అవి అవసరమైనప్పుడు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొంత జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా డెత్రేట్ పెరగడానికి అనేక కారణాలున్నట్లు అంచనా వేస్తున్నారు. పర్యవేక్షణాలేమి కూడా.. ఆస్పత్రిలో వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగి ప్రాణాలు పోతున్నాయని చెప్పినా, వార్డుల్లో ఉండే సిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కనీసం కుర్చీలో నుంచి రోగి వద్దకు వచ్చే పరిస్థితి కూడా సిబ్బందిలో కనిపించడం లేదు. మరోవైపు కొందరు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపైనే మక్కువ చూపుతున్నారు. మొక్కుబడిగా రావడం. ఎఫ్ఆర్ఎస్ వేయడం, వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కూడా రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇప్పటికై నా అధికారులు, వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీతనం వచ్చేలా చూడాలనే డిమాండ్ పెరుగుతోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టని సర్కారు ఒక్క రోజే 42మంది మృతిప్రభుత్వాస్పత్రిలో రోగులు పిట్టల్లా రాలుతున్నారు. 2026లో జనవరిలో 523, ఫిబ్రవరిలో 524, మార్చిలో 417, ఏప్రిల్లో 484, మేలో 570 మరణాలు అధికారికంగా నమోదయ్యాయి. అంతేకాదు మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు రోజుల్లో ఒకరోజు 42 మరణాలు నమోదు కాగా, మరోరోజు 39 మరణాలు, ఇంకోరోజు 36 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకూ 570 మరణాలు సంభవించాయి. అందుకు ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రతలుగా చెబుతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అంతేకాదు ఆస్పత్రికి వచ్చేసరికే మరణించిన వారు మరో 15 నుంచి 20 మంది ఉంటారని అంచనా. ఈ బ్రాట్ డెత్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదు కావు. పేదలకు పెద్దన్నలా సేవలందించాల్సిన ప్రభుత్వాస్పత్రికి పెద్ద రోగం వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే బాగుపడతాం అనే నమ్మకం ప్రజల్లో క్రమంగా సన్నగిల్లుతోంది. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో సేవలు సక్రమంగా అందడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అందుకు ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకుంటున్న మరణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు సంభవించడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. వైద్య రంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేది ఎక్కువగా పేద ప్రజలే. వారికి నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని రెండేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలి. – దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ -
గుట్కా, ఖైనీకి యువత దూరంగా ఉండాలి
నో టుబాకో డే ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశలబ్బీపేట(విజయవాడతూర్పు): ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసి, పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ టీమ్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని ప్రధాన అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. యువతే లక్ష్యం.. యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ అన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లోని అక్రమ పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ టుబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ రాష్ట్ర అధికారులు డాక్టర్ గీతాపద్మజ, డాక్టర్ సౌజన్యలక్ష్మిలతో పాటు రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతీదేవి పాల్గొన్నారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారు జామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆది దంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం -
బండికోళ్లంక బ్యారేజ్కు ఇంకెన్నాళ్లు?
సముద్రం నీరు పాలకాయతిప్ప నుంచి ఘంట సాల మండలం పాపవినాశం వరకూ చొచ్చుకొచ్చింది. దీనివల్ల భూగర్భ జలాలు ఉప్పునీటి కయ్యలుగా మారిపోతున్నాయి. మూడు పంటలు పండే భూములున్నా సక్రమంగా సాగునీరందక పోవడంతో రెండు పంటలు సరిగా పండించలేని దుస్థితి. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు మోపిదేవి మండలం బండికోళ్లంక వద్ద కృష్ణా నదిపై చెక్ డ్యాం నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు గత ప్రభుత్వంలో పలుసార్లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. దీంతో ఆయన పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని పంపించగా చెక్డ్యాం అయితే భవిష్యత్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో బ్యారేజ్కు ప్రతిపాదించారు. మొదటిగా రూ.1,134 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, తరువాత రూ.2,224 కోట్లకు పెంచి పంపించారు. ఈలోగా ఎన్నికలు రావడంతో ముందుకు సాగలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఊసే లేదు. -
గుప్పు.. గుప్పు ప్రాణాలకు ముప్పు
లబ్బీపేట(విజయవాడతూర్పు): టీనేజ్లో సిగిరెట్ వెలిగించిన క్షణం ఆనందంగా ఉన్నట్లు అనిపించినా అదే పొగ నిశ్శబ్దంగా శరీరంలో ప్రమాదాన్ని పెంచుతుంది. సరదా సరదా సిగిరెట్ అంటూ మొదలై వ్యాధులు బారిన పడి ప్రాణాలు విడిచే పరిస్థితి ఎదురవుతోంది. విద్యార్ధి దశలోనే ధూమపానం, గంజాయి వంటి వాటికి భానిసలుగా మారుతున్న వారు అధికంగానే ఉంటున్నారు. అలాంటి వారిలోతీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఇ– సిగరెట్లు కూడా ప్రమాదకరమేనని వైద్యులు చెపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదనే నిబంధన ఉన్నా, దానిని బుట్టదాఖలు చేసేశారు. దీంతో పొగతాగేవారితో పాటు,పీల్చేవాళ్లు కూడా వ్యాధుల భారినపడుతున్నారు. ఈ ఏడాది మేగ 31వ తేదీ నో టుబాకో డే సందర్భంగా పొగాకు ఉత్పత్తుల సంస్థలు వివిధ రూపాల్లో యువతను ఆకర్షించే ప్రయత్నాలపై అవగాహన కలిగించాలని నినాదంతో నిర్వహించనున్నారు. ఏటా పెరుగుతున్న బాధితులు పొగ త్రాగడం ప్రాణాంతకమని ఎంత ప్రచారం చేస్తున్నా ధూమపానానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య ఎక్కువుగానే ఉంటోంది. ఇంటర్మీడియెట్, పాఠశాల స్థాయిలోనే నేడు సిగరెట్లు తాగడానికి అలవాటు పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. ఇటీవల ఇ– సిగరెట్లు పేరుతో మాదక ద్రవ్యాలు సైతం విక్రయాలు జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు నకిలీ సిగరెట్లు సైతం మార్కెట్లోవిజృంభిస్తున్నాయి. ధూమపానంతో వచ్చే అనర్థాలివి ఇలా మానొచ్చు -
అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం):మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్లతో కలిసి సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ మంగినపూడి తీర ప్రాంతంలో రిసార్టుల ఏర్పాటు, 84 ఎకరాలలో పీతల పెంపకం, శాసినిధులతో తాళ్లపాలెం వంతెన నిర్మాణం, తదితర భూ కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ పరిధిలో గల వివిధ రకాల భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో రూ.13 కోట్లతో చేపట్టిన అంతర్గత మురుగునీటి వ్యవస్థ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సాసి, భవ్య పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా త్వరలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, వినియోగంపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావు, సర్వే భూ రికార్డుల ఏడీ లక్ష్మణ్ బాబు, తహసిల్దారు నాగభూషణం, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్టు
కంకిపాడు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను కంకిపాడు పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ ఘటన వివరాలను వెల్లడించారు. కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామం పామాయిల్ తోట సమీపంలో ఆరుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతంపై దాడి చేశారు. దాడిలో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఆరు కిలోలు గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా (ప్రస్తుత నివాసం ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ గుంటవాడ పంచాయతీ, గులాబీ గూడా గ్రామం) చింతపల్లి క్యాంపు సీలీరుకు చెందిన కిముడు శంకర్ అలియాస్ డుల్బో, కంకిపాడు మండలం జగన్నాధపురంకు చెందిన వడ్డీ క్రాంతి రఘురామ్, మాదాసువారిపాలెంకు చెందిన గుడిసేవ జ్యోతి ప్రకాష్, గొడవర్రుకు చెందిన గండ్రపు సతీష్, పచ్చిగళ్ల నాని, ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన బొర్రా చందు ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ డీ.సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. కేసు విచారణలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్ఐ సందీప్, కానిస్టేబుళ్లు బాజీ, పీఎస్ఎన్ మూర్తి, పీ.సత్యనారాయణ, హెచ్జీ మొరార్జీలను అభినందిస్తూ పారితోషికం అందించారు. -
పిచ్చికుక్క దాడిలో 10 మందికి తీవ్ర గాయాలు
వీరులపాడు: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో శుక్రవారం రాత్రి కుక్క దాడిలో మహిళ, నాలుగేళ్ల బాలునితో పాటు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన దేవరకొండ సుబ్బయ్య, లింగాల చరణ్ రేవంత్, మాదాల రాజు నరేంద్ర, కలకొండ వెంకట నరసమ్మ, మిటికల నాగరత్నం, విడియాల రేవంత్ అరుణ్, నీలం శోభనాద్రి, తమ్మిశెట్టి బూదమ్మ, షేక్ వలి, మన్యం వరలక్ష్మీలను మండలంలోని అల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పంచాయతీ, వైద్యారోగ్య శాఖాధికారులు, సిబ్బంది బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పిచ్చి కుక్కలను నియంత్రించాలని పలుమార్లు పంచాయతీ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం: ఒంటరి మహిళ హత్య కేసులో నిందితులైన ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల సమాచారం ప్రకారం... దావాజిగూడెం రోడ్డులోని జీకెఆర్ పారడైజ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కాజ రజితకుమారి ఈ నెల 24వ తేదీరాత్రి హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు ఆమెను హత్య చేసిన పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు అజయ్కుమార్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇరువురు నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం సుష్మ, అజయ్కుమార్ను రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్జైలుకు తరలించారు. కంచికచర్ల: జాతీయ రహదారిపై కంకరలోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకొనటంతో ట్రాక్టర్ డ్రైవర్కు తీవ్ర గాయాలైన టన మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ రాతి క్వారీల నుంచి కంకరను లోడింగ్ చేసుకుని నేషనల్ హైవేకు ట్రాక్టర్ చేరింది. అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లుతున్న ప్రవేటు బస్సు వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ పల్టీకొట్టగా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకటనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి ఏ ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఈ–సిగరెట్ హానికరమే
ధూమపానం చేసేవారిలో మందులు పనిచేయని పరిస్థితి ఉంటుంది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతుంటారు. కొందరు ధూమపానం మానేందుకు ఈ– సిగరెట్తాగుతున్నారు. అది కూడా హానికరమే. దానిలో కూడా నికోటిన్ ఉండటంతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. సిగరెట్ తాగేవ్యక్తి వదిలిన పొగ పీల్చిన వారికి (సెకండ్ హ్యాండ్ స్మోక్) గది, కారు వంటి వాటిలో స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగ గోడలకు పట్టి , ఆ తర్వాత అక్కడకు వచ్చిన వారికి(థర్డ్ హ్యాండ్ స్మోక్) వ్యాధులు సోకుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారు. క్యాన్సర్ బాధితుల్లో 27 శాతం మందికి పొగాకుఉత్పత్తులే కారణం. అంతేకాదు మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ధూమపానం చేస్తే మందులు వాడినా అదుపులోకి రావడం కష్టంగా మారతుంది. –ఎస్.వి.శివప్రసాద్రెడ్డి, ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్, సెంటినీసిటి -
విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలో గురువారం రాత్రి విజయవాడ కొత్తపేట ప్రాంతంలో వీచిన బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్తు వైరు తెగి పడి ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్ట కరమని విద్యుత్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం సాక్షిలో ‘విద్యుత్తు తీగలు.. మృత్యు ఘాతాలు’ శీర్షికతో ప్రచురితమైన కథనం విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనలో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర విచాణ నిర్వహించి, బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకొంటామని ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) హనమయ్య తెలిపారు. భవిషత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు లైన్లు, స్తంభాలు, ఇతర విద్యుత్తు పరికరాల స్థితిగతులను క్షుణంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. -
జూన్ నుంచి అందుబాటులోకి అన్నదాన, లడ్డూపోటు భవనాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గమ్మ సన్నిధిలో నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులను జూన్ నెల నుంచి వినియోగించాలని ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ నిర్ణయించారు. దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ‘సాక్షి’ ఈ నెల 14న ‘నత్తేనయం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో చేపట్టిన అభి వృద్ధి పనుల ఆలస్యం, భక్తుల ఇబ్బందులను ఈ కథనం కళ్లకు కట్టినట్లు వివరిం చింది. శనివారం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం జరగగా ఆలయ చైర్మన్, ఈవో ఈ కథనంలో వెల్లడించిన దుర్గగుడి అభివృద్ధి పనులపైనే ప్రధానంగా చర్చించారు. గత ఏడాది దసరా ఉత్సవాలు, భవానీ దీక్ష విరమణల సమయంలోనే అన్నదానం, లడ్డూపోటు భవనాల పనులు తుది దశకు చేరుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆలయ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం అన్నదాన భవనం వెలుపల తుది పనులు జరుగుతున్నాయని, మరో పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున జూలై 15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం కానుండటంతో అప్పటిలోగా అన్నదానాన్ని నూతన భవనంలోకి తరలించేలా చూడాలని సూచించారు. సారె సమర్పించిన ప్రతిఒక్కరికి అన్న ప్రసాదం ప్రస్తుతం మహా మండపం రెండో అంతస్తులో రోజూ సుమారు 5 వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తుండగా, నూతన అన్నదాన భవనంలో పది వేల మందికి అందించేలా నిర్మాణం జరిగింది. సారె సమర్పించిన ప్రతి ఒక్కరికీ అన్న ప్రసాదం అందాలంటే నూతన భవనంలోనే సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో వైపున లడ్డూ పోటు దాదాపు పూర్తి కాగా ఆ భవనంలో కూడా లడ్డూ తయారీకి అవసరమైన గ్యాస్ పొయ్యిలు, ఇతర మిషనరీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఉత్సవాల సమయంలో లడ్డూలను కనకదుర్గ నగర్లోని ప్రసాదాల కౌంటర్లోకి తరలించడం పెద్ద సమస్యవుతోంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తే ఆ ఇబ్బంది తొలగుతుంది. దేవస్థాన కాటేజీ ప్రతిపాదనలు సిద్ధం దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం అర్జున వీధిలో నూతన కాటేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాధా కృష్ణ పేర్కొన్నారు. కనకదుర్గనగర్, అర్జున వీధిల్లో ఉన్న షెడ్డుతో పాటు పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని తీసుకుని దేవస్థానం నూతన కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేసిందన్నారు. రెండో ఘాట్ రోడ్డు పనులు కూడ త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. దుర్గమ్మకు చెందిన ఆస్తులు, పొలాలు, భూములను రక్షించేందుకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ట్రస్ట్ బోర్డులో మొత్తం 25 అంశాలు చర్చకు వచ్చాయి. -
పారిశ్రామికవేత్తలు ‘కౌశలం’లో నమోదు చేసుకోవాలి
పెనమలూరు: పారిశ్రామికవేత్తలు కౌశలం పోర్టల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కానూరు సిద్ధార్థ కాలేజీలో శనివారం కౌశలం పోర్టల్పై అవగాహన కార్యక్రమం నిర్వ హించి పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి జరిగింది. కౌశలం పోర్టల్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశల్లో మానవవనరుల కొరత ఉన్నట్లు తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. ఉద్యోగ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేయటానికి ముందుకు రావటంలేదన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కౌశలం రూపొందించిందన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని కౌశలం ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ అన్నారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): మాదక ద్రవ్యాల మత్తులో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదని, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమన్వయం సమావేశం శనివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలను వివరించారు. జిల్లాలో గుర్తించిన సుమారు 150 హాట్స్పాట్ల్లో కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. 1972 టోల్ఫ్రీ నంబరును ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ చెల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.ఫణి ధూర్జటి, డీఈవో చంద్రకళ, ఈగల్ అధికారులు ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
సాగరతీరం అల్లకల్లోలం
తీరం గేట్లను మూసివేసిన అటవీ అధికారులు కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజులుగా అలల ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. పౌర్ణమి ఘడియలు కావడంతో సముద్రుడి భీకర హోరుతో తీరప్రాంతం ప్రతిధ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గేట్లు మూసే ఉంటాయని అటవీ రేంజర్ ఎస్వీకే కుమార్ తెలిపారు. -
తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.91.95 లక్షలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.91.95 లక్షలకు పైగా నగదును కానుకలు, మొక్కు బడిగా సమర్పించారు. వీటిని శనివారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 60 రోజులకు ఆలయంలో మొత్తం హుండీల్లోని కానుకలు లెక్కించగా నగదు రూపంలో రూ.91,95,850, మిశ్రమ బంగారం 25 గ్రాములు, వెండి 380 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ డాలర్లు 123, లండన్ పౌండ్స్ 30, బ్రెజిల్ 20 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ 6 లిబియా దినార్స్ వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఈఓ, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు చుంచు రమేష్బాబు, గ్రూప్ టెంపుల్స్ ఈఓలు సీహెచ్ జయప్రకాష్, బీవీ సుబ్బారావు పర్యవేక్షించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ (మెన్ అండ్ ఉమెన్) చాంపియన్షిప్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఒంగోలు శారద కాలేజ్ ఆఫ్ ఫిజియో థెరపీకీ చెందిన విద్యార్థి ఎం.రమేష్ను ఎంపిక చేశామని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ త్రిమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 120 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగం పోటీల్లో రమేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలు చైన్నెలో వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ టి.సాయిసుఽధీర్, అధ్యాపకులు.. రమేష్ను శనివారం యూనివర్సిటీ ఆవరణలో అభినందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలతో ఆరోగ్యం, ఐక్యతాభావం పెంపొందుతాయని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందిన వారు క్యాంపులు ముగిసిన తర్వాత కూడా ఆయా క్రీడల్లో శిక్షణను కొనసాగించాలని సూచించారు. ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) డైరెక్టర్ సంతోష్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ జిల్లా అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రతినిధులు దుర్గారావు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ మోసాలపై సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడమే ఎన్టీఆర్ పోలీస్ ఖాకీ స్టూడియో లక్ష్యమని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగక ముందే ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్కు ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శనివారం ముగిసింది. సీపీ మాట్లాడుతూ శిక్షణ పొందిన సిబ్బంది సైబర్ నేరాలు, వివిధ ఆన్లైన్ మోసాలు, ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా జరిగే మోసాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేలా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కిడ్నీ వ్యాధితో ఒకరు మృతి
ఎ.కొండూరు: మండలంలోని చీమలపాడు గ్రామానికి చెందిన జంపని పిచ్చియ్య (45) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. వ్యవ సాయ పనులు చేసుకుంటూ జీవించే అత నికి భార్య పిచ్చమ్మ, 20 ఏళ్ల కుమారుడు సాయికుమార్, 18 ఏళ్ల కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. పిచ్చయ్య ఎనిమిది ఏళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. పిచ్చియ్యకు డయాలసిస్ చేయిస్తూ కాపాడుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం కోసం ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంత మయ్యారు. ఇంటి పెద్దను కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, జెట్టి వెంకటేశ్వరరావు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో జలజీవన్ మిషన్ ద్వారా అందించే కృష్ణా జలాలను పంచాయతీతో సంబంధం లేకుండా సరఫరా చేయా లని, కిడ్నీవ్యాధి గ్రస్తులకు పోషకఆహారం అందించాలని, కొండూరులోనే కిడ్నీ ఆస్పత్రి నిర్మించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరారు. -
విద్యుత్ తీగలే.. యమపాశాలై..
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిపమిడిముక్కల: విద్యుత్ షాక్కు గురై ఇంటర్ విద్యార్థిని ముళ్లపూడి అంకిత(17) మృతి చెందిన ఘటన శుక్రవారం లంకపల్లిలో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన అంకిత స్నానం చేసేందుకు లంకపల్లి మెయిన్ పాఠశాల వద్ద పంపు వద్దకు నీటి కోసం వెళ్లింది. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పంపుపై చెట్టు కొమ్మలు, విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. ఇది గమనించని అంకిత నీరు పట్టేందుకు ప్రయత్నించగా.. తెగిపడిన వైర్లలో విద్యుత్ ప్రవహించడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కర్రలతో విద్యుత్ వైర్లను పక్కకు జరిపి చూడగా అప్పటికే అంకిత మృతి చెందింది. దీంతో అంకిత తల్లిదండ్రులు ఇశ్రాయేలు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూలీపనులు చేసుకొంటూ కుమార్తెను చదివించుకొంటున్నామని ఆవేదన చెందారు. అంకిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సమాచారం అందిన వెంటనే ఎన్ఐ బి.శ్రీను, విద్యుత్ ఏడీ సుందరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు ఏడీ సుందరరావును కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. పెనమలూరులో మరో యువకుడు మృతి పెనమలూరు: చెత్త సేకరించి అమ్ముకునే యువకుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పటమట జేడీనగర్కు చెందిన ఏసురాణి, కొండయ్యలకు ముగ్గురు పిల్లలు. వారి కుమారుడు చల్లా శ్రీను(17)తో కలిసి చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం ఏసురాణి, కొండయ్య చెత్త సేకరణ కొసం రామవరప్పాడుకు వెళ్లగా శ్రీను కానూరు కొత్త ఆటోనగర్కు వచ్చాడు. అయితే మధ్యాహ్నం 12గంటలకు చెత్త కొట్టు యజమాని ఏసురాణికి ఫోన్ చేసి కొత్త ఆటోనగర్ రెండో లైన్లో కరెంట్ ఆఫీస్ పక్కన శ్రీను చనిపోయి ఉన్నాడని సమాచారం తెలపటంతో ఘటనా స్థలం వద్దకు ఏసురాణి, భర్త కొండయ్య వెళ్లారు. డ్రెయినేజీలో విద్యుత్ తీగలు పడి ఉండగా ప్రమాదవశాత్తూ శ్రీను విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఏసురాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోర్టుకు వెళ్లమంటున్నారు
నా సర్టిఫికెట్లను పరిశీలించారు. మూడు కౌన్సెలింగ్లు చేశారు. నాలుగు రోజుల తరువాత రిజక్టెడ్ లిస్ట్ వచ్చింది. అందులో నా పేరు లేకపోవడంతో కమిషనర్ ఆఫీస్లో భరోసా ఇచ్చారు. ఫైనల్ లిస్ట్లో నా పేరు లేకపోవడంతో షాకయ్యాను. నాది 190వ ర్యాంకు. నా స్థానంలో 600వ ర్యాంక్ వచ్చిన (స్పోర్ట్స్ కోటా కింద) వ్యక్తికి పోస్ట్ ఇచ్చారు. అడిగితే కోర్టులో కేసు వేసుకోమన్నారు. పోస్టులు అమ్ముడుపోయా యని అనుమానంగా ఉంది. చదువుకు విలువ ఉందా లేక జీరో ర్యాంక్ అయినా స్పోర్ట్స్కు విలువు ఉందా అన్నది అర్థం కావడం లేదు. – కె.రాణి, ఆగిరిపల్లి -
నేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం శనివారం ఉదయం 10గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగనుంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు హాజరుకానున్నారు. 31న గిరి ప్రదక్షిణ.. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ 31వ తేదీన జరగనుందని వైదిక కమిటీ పేర్కొంది. 31వ తేదీ తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 3న కానుకల లెక్కింపు.. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకలు, ముడుపులు, మొక్కబడులను జూన్ 3వ తేదీన లెక్కించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపును దేవస్థానం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడంతో పాటు ఆలయ అధికారులు, పోలీసు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. -
మహిళా సంఘాలకు రూ.7 కోట్ల రుణాలు పంపిణీ
హనుమాన్జంక్షన్ రూరల్: మహిళా సంఘాల ద్వారా పొదుపు, పరస్పర సహకారం, ఉపాధి అవకాశాల సృష్టితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హరహరనాఽథ్ అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలోని ఏపీ గ్రామీణ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రూ.7 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ జె.జుమ్మిలాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.6.50 కోట్లు, పశుసంవర్థక రుణాలు రూ.30 లక్షలు, లఖ్ పతి దీదీ పథకం కింద రూ.20 లక్షల రుణాలను ఆయన చేతుల మీదగా పంపిణీ చేశారు. మహిళా సంఘాలు రుణాలు పొంది విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హర హరనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ జె.జుమ్మిలాల్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి మార్గాలను విస్తరించటం ద్వారా మరింత ఆర్థిక పరిపుష్టి సాధించగలరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గుడివాడ రీజనల్ మేనేజర్ కె.ఆంజనేయులు మాట్లాడుతూ రిటైల్, ఎంఎస్ఎంఈ, విద్యా, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందని చెప్పారు. డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ మధు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, బ్యాంకు వీర వల్లి బ్రాంచ్ మేనేజర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో హోంగార్డు మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జానీ గురువారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో భార్యతో కలిసి తన సొంత ఆటోలో బయటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఉండగా భారీ గాలులతో వర్షం ప్రారంభమైంది. వర్షం నీరు ప్రవహిస్తుండగా తాను విధులు నిర్వహించే కొత్తపేట స్టేషన్ వద్దకు చేరుకునే సరికి నీటి ఉద్ధృతికి ఆటో నిలిచిపోయింది. కిందకు దిగి ఆటోను నెట్టేందుకు ప్రయత్నించాడు. గాలీవానకు తెగి నీటిలో పడిన కరెంటు తీగ తాకడంతో జానీ అక్కడికక్కడే కింద పడిపోయాడు. అక్కడే ఉన్న వారు వెంటనే మరో ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెలంపల్లి పరామర్శ.. మృతుని భౌతిక కాయాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
జలవనరుల సంరక్షణతో భవిష్యత్ తరాలకు భద్రత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మూలపాడు(ఇబ్రహీంపట్నం): జలవనరుల సంరక్షణ రాబోయే తరాలకు నీటి భద్రత కల్పిస్తుందని, ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని మూలపాడు చెరువులో జరుగుతున్న జలధార పనులను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తాను కూడా పలుగు పారపట్టి చెరువు పనిలో భాగస్వామిగా మారి ఉపాధి శ్రామికులను ప్రోత్సహించారు. శ్రామికులతో కలిసి భోజనం చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువుల అభివృద్ధికి చర్యలు.. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్ధికి దశల వారీగా పనులు చేపడుతున్నామని తెలిపారు. వీటి పూర్తిస్థాయి సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం వీటి సామర్థ్యం 5.5 టీఎంసీలు మాత్రమే అన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చెరువులను పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న చెరువులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జిల్లాలో జలధార కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ.87 కోట్లతో 1,300 పనులను గుర్తించామన్నారు. డ్వామా పీడీ ఎ.రాము, డీఎఫ్వో జి. సతీష్, ఎంపీడీవో డి.శకుంతల, ఏపీవో ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
జౌళి రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి
కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హనుమాన్జంక్షన్ రూరల్: జౌళి పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మోహన్ స్పిన్టెక్స్ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, మోహన్ స్పిన్టెక్స్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లవల్లి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఏపీలో విస్తృత అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్లో జౌళి పరిశ్రమ రంగంలో ఎదిగేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జౌళి రంగానికి రూ.10,860 కోట్లు మేర ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించిందన్నారు. ఈ ప్రొత్సాహాకాల్లో ఏపీ అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్ స్పిన్టెక్స్ పరిశ్రమ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అక్కడ ఉన్న పుంగనూరు ఆవులు, దూడలను పరిశీలించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ సభ్య కార్యదర్శి శివకుమార్, డైరెక్టర్ గిరీష, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నీరబ్కుమార్, కేంద్ర జౌళి కార్పోరేషన్ గుంటూరు డివిజన్ డెప్యూటీ డైరెక్టర్ ధనశేఖరన్, చేనేత, జౌళి శాఖ ఏడీలు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే!
కోనేరుసెంటర్: గన్నవరంలో కలకలం రేపిన ఒంటరి మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. శుక్రవారం కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు ఒంటరిగా ఫ్లాట్లో.. గన్నవరం దావాజీగూడెంకు సమీపంలోని జీకేఆర్ పారడైజ్ అపార్ట్మెంట్లోని ప్లాట్ నంబర్ 401లో కాజ రజిత (55) అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. భర్త ఇటీవల చనిపోవటంతో కాలక్షేపానికి చీటీల వ్యాపారంతో పాటు పిండి మర నడుపుకొంటూ కాలం గడుపుతోంది. ఆమె ఇద్దరు కుమార్తెలు కాగా.. ఇరువురు అమెరికాలో ఉంటున్నారు. అడ్డుగా ఉందని.. గన్నవరం మండలం శ్రీనగర్కాలనీకి చెందిన పోలవరపు సుష్మ మృతురాలి వద్ద చీటీలు వేస్తూ ఉంటుంది. రజిత నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తితో సుష్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతన్ని కలిసేందుకు తరచూ అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉండేది. దీనిని గమనించిన రజిత సుష్మను మందలిస్తూ వస్తోంది. దీంతో సుష్మ రజితను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని, తన కుమారుడు పోలవరపు అజయ్కుమార్ సాయం తీసుకుంది. అజయ్కుమార్ గతంలో అనేక నేరాలకు పాల్పడటంతో అతనిపై ఉయ్యూరు పోలీస్స్టేషన్లో సస్పెక్ట్షీట్ ఉంది. ఈ నెల 24వ తేదీ రాత్రి రజిత ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు. అమెరికాలోని కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతున్న రజిత ఫోన్ కట్ చేసి, తలుపులు తెరవగా తల్లీకొడుకులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. చీటీల విషయమై మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమెను దిండితో బలంగా నొక్కి హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు 390 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 1,60,000 నగదును అపహరించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా.. అమెరికాలోని కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతూ కట్ చేసిన రజిత ఎంత సేపటికీ కుమార్తెకు తిరిగి ఫోన్ చేయలేదు. కుమార్తె ఎన్ని సార్లు ఫోన్ చేసి తీయలేదు. మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లి చూడగా రజిత శవమై కనిపించింది. దీంతో పనిమనిషి సమీపంలోని రజిత బంధువులు గన్నవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఆమెది హత్యగా భావించి తల్లీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం తల్లీకొడుకులు గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ ఎల్. రమేష్, ఎస్ఐలు కె. శ్రీధర్, ఎం. నాగరాజు, ఎన్. ప్రశాంతిలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
లక్ష్యం స్వచ్ఛాంధ్ర.. అందుకే సీబీజీ ప్లాంట్లు
రాష్ట్ర మంత్రి నారాయణ ఇబ్రహీంపట్నం: స్థానిక ఖిల్లా రోడ్డులో ఉన్న కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్తో కలసి శుక్రవారం పరిశీలించారు. సుస్థిర వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులలో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే ఉన్న ప్లాంట్ను పునరుద్ధరీకరణకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.59.85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి యూనిట్ రోజుకు 25 టన్నుల సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్ల సంయుక్త ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 125 టన్నులుగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో నూతన ప్లాంట్కు రూ.12.60 కోట్లు ఖర్చవుతుందని ఇబ్రహీంపట్నం ప్లాంట్ ఆధునికీకరణకు రూ.9.45కోట్లు అవుతుందని అంచనా వేశారు. -
ఫొటో జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్ –2026 టర్మ్ ఎండ్ పరీక్షలు జూన్ ఒకటి నుంచి జూలై 21వ తేదీ వరకు జరుగుతాయని ఇగ్నో విజయవాడ ప్రాంతీయకేంద్రం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇవి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, అనంతపురంలో ఉంటాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులు అందరికీ హాల్ టికెట్లను ఇగ్నో వెబ్ సైట్లో ఇప్పటికే అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అభ్యర్థులు హాల్ టికెట్లనుని ఇగ్నో విశ్వవిద్యాలయపు సమర్త్ స్టూడెంట్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హై స్కూల్ ప్రాంగణంలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించొచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణాలు బలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని ఫోన్లు చేస్తే అధికారులు స్పందించడం లేదన్నారు. ఆ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయన్నారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు ఎస్ఈ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నిర్లక్ష్యమే కారణం.. అవినాష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హోంగార్డు జానీ చనిపోయారన్నారు. అలాగే ఈట్స్ట్రీట్లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్, గ్యాస్, వాటర్ పేరిట దందా చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తుల జనరేటర్ దందా కారణంగా ఈట్ స్ట్రీట్లో సూర్యప్రకాష్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు చెరో రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో అప్రకటిత విద్యుత్ కోత కొనసాగుతోందన్నారు. కొండ ప్రాంతాలు, కరకట్ట ప్రాంతాలు, కాలనీల్లో రాత్రి 9 గంటలకు విద్యుత్ నిలిచిపోతే మరుసటి రోజు ఉదయం 6గంటలకు సరఫరా ఇస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పెద్దలు, అధికారులు బుద్ది తెచ్చుకుని ప్రజానీకానికి మంచి చేయాలన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. లోపించిన జవాబుదారీతనం.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్యుత్ శాఖ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారులు విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారని, కానీ సమయం, సందర్భం లేకుండా రెండు, మూడు గంటల పాటు అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ కోతలు పెడుతున్నారన్నారు. నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. జవాబుదారీ తనం లోపించిందన్నారు. గాలి వానలకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలే.. మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొద్దిపాటి గాలివానకే విజయవాడ నగరంలో అతలాకుతలం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఒక్కరోజే రెండు నిండు ప్రాణాలు బలైపోయాయన్నారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ హత్యలేనన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. -
సజావుగా సప్లిమెంటరీ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు ఎటువంటి మాల్ప్రాక్టీస్ ఘటనలు లేకుండా సజావుగా పూర్తయ్యాయని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. ఎస్ఎస్సీ సప్లిమెంటరీ గణితం, ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ శాస్త్ర–సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షలతో పాటు ఇంటర్మీడియెట్ భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం/పౌర శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించినట్లు పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 3 ఏసీజీఈ బృందాలు విధులు నిర్వర్తించగా, మొత్తం 22 పరీక్ష కేంద్రాలను (15 ఎస్ఎస్సీ, 4 ఓపెన్ ఎస్ఎస్సీ, 3 ఓపెన్ ఇంటర్) తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,787మంది విద్యార్థులు నమోదు కాగా, 1,297మంది హాజరయ్యారని, 490 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలో హాజరు శాతం 72.58గా నమోదైందన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్షలకు 374 మంది విద్యార్థులు నమోదు కాగా, 290 మంది హాజరై 84 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 77.54గా ఉందని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 527 మంది విద్యార్థులు నమోదు కాగా, 416 మంది హాజరై 111 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 78.94గా నమోదైనట్లు డీఈఓ తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 7,529 మంది హాజరు.. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 8,338మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 7,529మంది హాజరై, 809 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. -
డీఎస్సీ పోస్టులు.. రూ.లక్షలు
కృష్ణాజిల్లాశనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026 నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, లోకేష్ ● డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించే దమ్ముందా? ● మోసాలపై వైఎస్సార్ సీపీ నేతలు అవినాష్, వెలంపల్లి, విష్ణు ఆగ్రహం ● లోకేష్ను తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ ● డీఎస్సీలో అవకతవకలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన భవానీపురం(విజయవాడపశ్చిమ): మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేశా రని, ఒక్కొక్క పోస్టును రూ.లక్షలకు అమ్ముకున్నా రని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, మెరిట్ లిస్ట్ దాపరికం, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించే దమ్ము ఉందా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వివిధ అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేశామని చెబుతున్న చంద్ర బాబు ప్రభుత్వం డీఎస్సీపై అదే పని చేసే ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. డీఎస్సీ పోస్టులను రూ.లక్షలకు విక్రయించి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మోసం, వంచనకు కేరాఫ్ అడ్రస్సని మండిపడ్డారు. డీఎస్సీలో అనేక అవకతవకలకు పాల్పడటం ద్వారా విద్యా వ్యవస్థను దిగజార్చిన లోకేష్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ–2025లో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రం ఎదురుగాగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజ రైన డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. డీఎస్సీలో పోస్టులను రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు విక్రయించా రని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులను విక్రయించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు సర్కారేనని పేర్కొన్నారు. మహానాడులో ఆత్మ స్తుతి, పర నింద తప్ప చెప్పుకొనేందుకు చేసిన ఒక్క మంచి పనీ లేదని ఎద్దేవాచేశారు. అబద్ధపు ప్రచారాలు మానుకుని సూపర్ సిక్స్ – సూపర్ సెవెన్ హామీలను అమలు చేయాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పరీక్ష రాసేవాడికే పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం దారుణమని హైకోర్ట్ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేశారు. డీఎస్సీపై ఎవరైనా మాట్లాడితే లీగల్గా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ప్రకటించడం సిగ్గు చేటన్నారు. మహానాడులో చేసిన తీర్మానాలన్నీ రేండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్, సెవన్ హామీల వంటివేనని ఎద్దేవా చేశారు. 2న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవాలు 7వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీ – 2025లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్కామ్ జరిగిందని, కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకుండానే పోటీ పరీక్షలు నిర్వహించడం అందులో ఒకటని అన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసికూడా పోస్ట్లు ఎందుకు ఇవ్వలేదని, స్పోర్ట్స్ కోటాలోని 421 పోస్ట్లను టెట్, బీఈడీ అర్హత లేనివారికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కృష్ణాజిల్లా టాపర్ నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదంటేనే జరిగిన అవినీతి అర్థం అవుతోందన్నారు. జిల్లా అధ్యక్షుడు కోమల్ సాయి మాట్లా డుతూ.. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవినీతిపై పోరాటాలు సాగిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేసరి శివారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్రెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల అధ్యక్షులు ఎం.సురేష్, లక్ష్మారెడ్డి, నవీన్, నరేందర్, నందకుమార్ రెడ్డి, పలువురు డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మను ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్కుమార్ సిన్హా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కు గన్నవరం విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో డీఎస్పీ హోదాలో పనిచేస్తూ అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ పొందిన పలువురు శుక్రవారం సీపీ రాజశేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లా డుతూ.. గత ఏడాది నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని విమర్శించారు. మెరిట్ లిస్ట్లను దాచేయడమే కాకుండా టాపర్ వివరాలను తొలగించడం వంటి అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఒక్కొక్క పోస్ట్ను రూ.15 లక్షల చొప్పున బేరం కుదుర్చుకుంది టీడీపీ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. అంతా పారదర్శకమని చెప్పుకొనే చంద్రబాబు డీఎస్సీపై శేతపత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థకు మాయని మచ్చ తెచ్చిన మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఒకటో తేదీ నుంచి యోగా ఉత్సవాలు
పెనమలూరు: కానూరులో యోగా శక్తి సాధనసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కానూరు అశోక్నగర్ ఇండియన్ ఓం కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వైద్య కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ముఖ్యంగా నొప్పులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయవాడ, పిఠాపురం, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు 9000347369కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మాకాల సత్యనారాయణ సూచించారు. గంపలగూడెం: మండలంలోని గాదెవారిగూడెం గ్రామానికి చెందిన రావూరి వెంకమ్మ(80) వడ దెబ్బకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకమ్మ గురువారం భానుడి తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద మృతదేహం ఉన్నట్లు వన్టౌన్ పోలీసులకు సమాచారమందింది. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కనపడలేదు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో 2025–26లో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సత్కరించి పురస్కారాలను అందజేశారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి హాజరై మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి, ఇంట ర్మీయెట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి సాధించిన 165 మంది రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను, 132 మంది హాస్టల్ విద్యార్థులను సన్మానించామని తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకుని తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలుతోపాటు వరుసగా రూ.20వేలు, 15వేలు, 10 వేలు చెప్పున నగదు బహుమతులు అందజేశారు. అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో విశేష కృషి చేసిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ ఎస్డబ్ల్యూర్ఈఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్యవేణి పాల్గొన్నారు. -
దోచుకొచ్చి.. దొరల్లా అమ్మేస్తున్నారు!
సాక్షి, టాస్క్ఫోర్స్: దొంగ బంగారం కొనుగోలుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కేంద్రంగా మారింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగుతోంది. కొందరు స్థానిక వ్యాపారులు ఈ దొంగ బంగారాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. భారీగా బంగారం వ్యాపారం.. రాష్ట్ర స్థాయిలోనే జగ్గయ్యపేటలో బంగారం, వెండి వస్తువులు తయారీ, కొనుగోళ్లకు ఎంతో ప్రసిద్ధి. వందేళ్లుగా ఇక్కడ క్రయ విక్రయాలు కోట్ల రూపాయల్లో జరుగుతాయి. పట్టణంలో 95కి పైగా బంగారు, వెండి దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు బంగారం మూడు కేజీలు, వెండి 5 నుంచి 10 కేజీల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. ప్రతి నెలలో 25 రోజుల పాటు 80 నుంచి 100 కేజీల బంగారం, వెండి 100 నుంచి 200 కేజీల వ్యాపార అమ్మకాలు జరుగుతాయి. దీంతో దుకాణాలు నిత్యం వినియెగదారులతో కళకళలాడతాయి. దొంగలకు పేట అడ్డా.. తెలంగాణకు సరిహద్దుగా జగ్గయ్యపేట ప్రాంతం ఉండటంతో దొంగలు దోచుకున్న బంగారాన్ని అమ్ముకునేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోదాడ, సూర్యా పేట, హుజుర్నగర్, మల్లారెడ్డిగూడెం, ఏపీలోని గుంటూరు, పల్నాడుజిల్లా పరిధిలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, నరసరావుపేట, ప్రాంతాల్లో అపహరించిన బంగారం వస్తువులను ఈ ప్రాంతంలోని కొన్ని బంగారు దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతినెల సూమారు 500 గ్రాముల నుంచి కిలో వరకు అపహరించిన బంగారు వస్తువులను అమ్మకాలు చేస్తుంటారు. ఇందుకు యజమానులు కూడా సంబంధించిన బిల్లులను కూడా చూడకుండా వస్తువులను కొనుగోలు చేసి వాటికి బదులుగా నగదును చెల్లిస్తున్నారు. మఫ్టీలో పోలీసులు.. పేట పట్టణానికి పోలీసులు అధికంగా రికవరీ కోసం వస్తున్నారు. ప్రతినెలలో కనీసం 10 నుంచి 15 సార్లు దొంగతనానికి గురైన బంగారాన్ని రికవరీ చేసేందుకు నల్గొండ, గుంటూరు, దాచేపల్లి మిర్యాలగూడకు చెందిన పాలీసులు మఫ్టీలో దుకాణాల వద్దకు బంగారం అమ్మిన వ్యక్తులను తీసుకుని వస్తుంటారు. నామమాత్రంగా రికవరీలు.. గడిచిన రెండేళ్లలో ఏపీ–తెలంగాణ పోలీసులు నామమాత్రంగా రికవరీలు చేస్తున్నారు. 2025లో ఏప్రిల్లో కోదాడలో 100గ్రాముల బంగారం అపహరించిన కేసులో పోలీసులు పట్టణంలోని ఓ దుకాణంలో విక్రయించగా అపహరించిన దొంగ సమాచారం మేరకు యజమానిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది నేల కొండపల్లిలో మూడు తులాల బంగారాన్ని ఓ దుకాణంలో రికవరీ చేశారు. తాజాగా ఈ నెల 19న పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వచ్చి ఓ దుకాణంలో 100గ్రాముల బంగారం రికవరీ చేసేందుకు దొంగను బేడీలతో దుకాణానికి తీసుకువచ్చి విచారించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు.. జగ్గయ్యపేటలో కోట్లాది రుపాయల బంగారు క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇక్కడ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? అందుకు సంబంధించిన రికార్డులు, అనుమతులు ఉన్నయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దొంగ బంగారం కొనుగోలుకు కేంద్రంగా జగ్గయ్యపేట నేరగాళ్లకు సహకరిస్తున్న కొందరు వ్యాపారులు రాష్ట్ర సరిహద్దు కావడంతో యథేచ్ఛగా దందా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా రికవరీ కేసులు పట్టణంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతుండటంతో యజమానులకు, దొంగలకు మధ్య బలమైన బంధం ఉందనే విమర్శలు వస్తున్నాయి. రికవరీకి పోలీసులు దుకాణాలకు వస్తే కొందరు వర్తక సంఘ నాయకులు వారితో మాట్లాడి, సెటిల్మెంట్ చేసి పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేసుకోవడం, కేసును క్లోజ్ చేయడం వరకూ పోలీసులు పరిమితం అవుతుండగా.. బంగారం కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. -
చదరంగంతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపు
ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చదరంగంఆడటం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ చెప్పారు. హరియాణాకు చెందిన గ్రాండ్మాస్టర్ హిమాన్షు శర్మ ఆధ్వర్యంలో గుణదలలోని నెక్ట్స్జెన్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న జరుగుతున్న ఫ్రీ చెస్ కోచింగ్ క్యాంప్ను రవికృష్ణ గురువారం సందర్శించారు. హిమాన్షుతో కలిసి కొద్దిసేపు చెస్ ఆడారు. చెస్ ఆటలో నెక్ట్స్ లెవల్కు వెళ్ళడానికి ఇలాంటి క్యాంపులు దోహదం చేస్తాయని రవికృష్ణ చెప్పారు. ఉచితంగా క్యాంప్ నిర్వహిస్తున్న చెస్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శుక్రవారం విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గోగినేని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఖమ్మం నుంచి విజయవాడ వస్తూన్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని గుర్తించిన విధుల్లోని సిబ్బంది విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంత హెడ్కానిస్టేబుల్ రాజా సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై మెరున్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాల్సిందిగా కోరారు. గృహోపకరణాలు అగ్నికి ఆహుతి జగ్గయ్యపేట అర్బన్: విద్యుత్ శాఖ వైఫల్యం కారణంగా హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో అగ్ని ప్రమాదం జరిగి రూ.4 లక్షల విలువైన గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణంలో గురువారం జరిగింది. స్థానిక బలుసుపాడు రోడ్లోని శ్రీకనకదుర్గమ్మ ఆలయం ఆర్చ్ ఎదురుగా ఉన్న గోనుగుంట్ల ధనుంజయ గృహంలో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పడకగదిలో నిద్రిస్తున్న ధనుంజయ తండ్రి మీద నిప్పులు పడి బట్టలు కాలిపోవడంతో తేరుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏసీ, టీవీ, కబోర్డులు, కరెంట్ వైరింగ్, కరెంట్ సామాన్లు పూర్తిగా దగ్దం అయి, గోడలు ధ్వంసం అయ్యాయి. కరెంట్ హై వోల్టేజ్ వలన ప్రమాదం జరిగిందని గుర్తించే లోగా నష్టం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. -
పెట్రోల్, డీజిల్పై అదనపు వ్యాట్, సెస్లను రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్లపై వసూలు చేస్తున్న అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్మెంట్ సెస్లను తక్షణమే రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.సాంబిరెడ్డి, ఎం.వి.ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు మెమొరాండాలను ఈ మెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా ఆదేశించిందని రష్యా వద్ద చౌకగా లభించే ఆయిల్ను కొనకపోవడం, 2002లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేయటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజల్ ధరలు పెరగటానికి ప్రధాన కారణాలని అన్నారు. ప్రభుత్వరంగంలోని ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయని వాటి వార్షిక నివేదికలు తెలియజేస్తున్నాయని, అయినా నష్టాలలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు కారణమవుతున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజల్లపై పన్నులు, సెస్లు, డివిడెండ్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు రూ.7.57లక్షల కోట్లు చేరుతున్నాయని, అందులో కేంద్ర ఖజానాకు రూ.4.24లక్షల కోట్లు, రాష్ట్ర ఖజానాకు రూ.3.33 లక్షల కోట్లు చేరుతున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ ఉందని, అదనపు వ్యాట్ పెట్రోల్పై లీటరుకు రూ.4, డీజిల్పై రూ.3.07, రోడ్డు డెవలప్మెంట్ సెస్ పేరుతో లీటరుకు ఒక రూపాయి, దానిపై మరల వ్యాట్ వసూలు చేస్తున్నారని, వీటి ద్వారా ఏటా సుమారు రు.25 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరుతుందన్నారు. వీటిలో కొంత తగ్గించినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లపై ఉన్న అదనపు వ్యాట్ను, రోడ్డు డెవలప్మెంట్ సెస్ను పూర్తిగా రద్దుచేయాలని,పెట్రోల్, డీజిల్లపై వసూలు చేస్తున్న 31శాతం, 22.5శాతం వ్యాట్ను కనీసం 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధిస్తున్న పన్నులను కొంతమేరైనా తగ్గించటం, నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోశాధికారి వి.సుందర రామరాజు, పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు పాల్గొన్నారు. నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ -
కుట్రలను తిప్పి కొట్టండి
జాబితాలను సరిచూడండి.. ● వైఎస్సార్ సీపీ బీఎల్ఏలతో మాజీ మంత్రి పేర్ని నాని ● పామర్రులో ఎస్ఐఆర్, జాబితా మ్యాపింగ్పై అవగాహన పామర్రు: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్(బీఎల్ఏ) తన పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్వో)ల నుంచి మ్యాపింగ్ కాని లిస్టులను తీసుకుని, ఈనెల 30 తేదీ నాటికి వాటిని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ ఇంతకు ముందే టీడీపీ నేతలు తమ వారికి మ్యాపింగ్ చేశారని, మిగిలిన 35శాతం మాత్రమే బీఎల్వోల వద్ద మ్యాపింగ్ కాకుండా లిస్టులో ఉందని అన్నారు. ఈ లిస్టులను ప్రతి బీఎల్ఏలు తీసుకుని దానిలో ఉన్న పార్టీ సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరుల పేర్లను కూడా తీసుకుని వాటికి కూడా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇది చాలా కీలకమన్నారు. పామర్రులోని 243 బూత్లలోని బీఎల్ఏలకు వారికి సంబంధించిన బీఎల్వోల ఫోన్ నంబర్లు, పేరులను మీకు అందజేస్తామని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హైబ్రీడ్ మీటింగ్లను ఏర్పాటు చేసి, రెండు రోజుల పాటు ‘జయము జయము లోకేష్’ అంటూ భజన చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి గురించి కాని రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదని విమర్శించారు. ● రాష్ట్ర పోలింగ్ బూత్ వింగ్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను డిజిటల్ స్క్రీన్పై వివరించామని తెలిపారు. గతంలో 2002లో స్పెషల్ సమ్మర్ రివిజన్ సర్వే నిర్వహించారని, ప్రస్తుతం 2025డేటా ఆధారంగా ఈ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారని, బీఎల్ఏలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలన్నారు. ● ఎస్ఐఆర్ జోన్ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాల్లోని ఓట్ల పోకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ● పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నియోజకవర్గంలో ఏవిధమైన అభివృద్ధి చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సైకిల్పై తిరుగు తూ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. పామర్రు నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ తిరుపతిరావు, పామర్రు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్, జెడ్పీటీసీ జొన్నల రామ్మోహన్రావు, నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, యలమంచిలి గణేష్బాబు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, గోగం సురేష్, బూత్ వింగ్ అధ్యక్షుడు సమ్మెట ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, కొడమంచిలి మహేష్, పామర్రు పట్టణ అధ్యక్షుడు నందిపాటి సురేష్రెడ్డి, ట్రేడ్ యూని యన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు ఆళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహానాడుకు రండి.. చీరలు అందుకోండి
టీడీపీ నేతల వ్యూహం భవానీపురం(వియవాడపశ్చిమ): మాయ మాటలు, తాయిలాల పంపిణీతో ప్రజలను ఆకట్టుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు టీడీపీ నేతలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ మీటింగ్లకు జనాల్ని ఎలా రప్పించుకునేందుకు సకల విద్యలు ప్రయోగిస్తున్నారు. ఇదే ఆనవాయితీ గురువారం మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామ పార్టీ నాయకులు కూడా కొనసాగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజులపాటు గొల్లపూడిలోని పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు జనాలను రప్పించేందుకు స్థానిక నేతలు మీటింగ్కు హాజరయ్యే వారికి రూ.300, బిర్యానీ, మహిళలకు చీరల పంపిణీ ఉంటుందని ప్రచారం చేసి రప్పించారు. జీజీహెచ్లో ఎంఆర్డీ విభాగం ప్రారంభం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ గురువారం ప్రారంభించారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. -
పరిహారం వచ్చాకే పనులు ప్రారంభించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నార్త్ మండలం పొట్లపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపూడి గ్రామ దళిత, పేద రైతుల పొలాల్లో ముందస్తు సమాచారం లేకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇవ్వటం పట్ల మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా ఉంటానన్నారు. 1994–95లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాంతంలోని దళిత, పేద కుటుంబాలకు జీవనాధారంగా తలొక ఎకరం భూమి పట్టాలు ఇచ్చిందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ పేదల కలలను నిజం చేస్తూ పట్టా భూములన్నింటికి సర్వ హక్కులతో కూడిన ప్రైవేటు ఆస్తులుగా (ప్రీ హోల్డ్) మార్చటం జరిగిందన్నారు. కాని నేడు మచిలీపట్నం పోర్టు అవసరాల పేరుతో ఆ భూములను నిలువునా ముంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని ఆరోపించారు. హైటెక్ విద్యుత్ లైన్లతో భూమి విలువ పతనం... ఈ హైటెక్ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వచ్చి పొలాల మధ్యలో హెవీ విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ చేయటంపై రైతులు కన్నీరు, మున్నీరవుతున్నారన్నారు. లైన్ల ఏర్పాటు వల్ల భూమి విలువ శూన్యంగా మారుతుందని, భవిష్యత్తులో ఆ భూమిని ఎవరు కొనలేరని కనీసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికిరాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ ఎకరం భూమే జీవనాధారమని దీనిని కూడా కోల్పోతే వారి బతుకులు అంధకారమవుతాయన్నారు. అత్యుత్తమ పరిహారం అందించాలి... విద్యుత్లైన్ల ఏర్పాటు కోసం పూర్తి భూసేకరణ జరపాలని, విద్యుత్ టవర్లు వేసి వదిలేయటం కుదరదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఆలైన్లు వెళ్లే పొలాలను ప్రభుత్వం కొనుగోలు చేసి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రైతులు సంతోషపడేలా అత్యుత్తమ పరిహారాన్ని అందించాలని కోరారు. రైతులు చిరునవ్వుతో భూములను అప్పగించేలా నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులను ప్రారంభించాలని సూచించారు. పేద రైతుల పొలాల్లో బలవంతంగా పనులు చేపడితే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమాచారం లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు తగదు బలవంతంగా పనులు చేపడితే ఊరుకోబోం రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి పేర్ని నాని -
రారు.. రానని అనరు!
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ముస్లింలు ప్రత్యేక నమాజ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులతో పాటు, ఖాళీ ప్రాంగణాల్లో సామూహిక ఈద్ నమాజ్ నిర్వహించారు. త్యాగం, విధేయత, దాతృత్వం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను ఈ పర్వదినం ప్రపంచానికి తెలియజేస్తోందని ముస్లిం పెద్దలు వివరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన సామూహిక ఈద్ నమాజ్లను చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆలయాల పరిపాలనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆలయాల పరిరక్షణతో పాటుగా నిత్యం జరిగే వైదిక కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన వసతులు.. ఇలా ఆయా దేవుని సన్నిధిని పర్యవేక్షించాల్సిన దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు వాటిని పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వాటి ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులను అధికార పార్టీ నేతలకు అందించే కార్యక్రమంలో మాత్రం బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అధికారులు తమకిష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. వారంలో ఒక్కరోజూ రారు.. ఉమ్మడి జిల్లాలో చాలా మంది కార్యనిర్వహణాధికారులకు ఒకటి, రెండు లేదా ఇంకా ఎక్కువ ఆలయాల బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. వారివారి లాబీయింగ్తో పాటుగా రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో వీలైనన్ని ఎక్కువ ఆలయాల బాధ్యతలు చూస్తుంటారు. అయితే వారంలో ఒక రోజైనా ఆయా ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. కనీసం ముఖ్యమైన రోజుల్లోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆయా ఆలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ నెల మొత్తం మీద మూడు నాలుగు రోజులు కూడా ఆయా ఆలయాలకు వెళ్లని అధికారులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఒక్క ఆలయంలో విధులు నిర్వహిస్తున్నా, నాలుగైదు రోజులకు ఒకసారి కూడా అక్కడ కనిపించని వారు చాలా మంది ఉన్నారని పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. వారికే కీలక బాధ్యతలు.. ఆరోపణలు ఉన్న వారికి ఏసీ కార్యాలయంలో బాధ్యతలు సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై ఇతర ఆలయాలు సత్రాల నుంచి వచ్చిన అధికారులపై పలు ఆరోపణలు ఉన్నట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలు మాయం చేసిన వారు, భూముల విక్రయించటం, హుండీ చోరీ తదితర ఆరోపణలు ఉన్న వ్యక్తులు సహాయ కమిషనర్ కార్యాలయంలో ఎలా విధులు నిర్వర్తిస్తారని దేవదాయ శాఖ ఉద్యోగులు సైతం ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల ఆస్తులకు సంబంధించి అధికార పార్టీ నేతలకు సహాయ మందించే లక్ష్యంతో కొంతమంది పని చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దేవదాయ శాఖకు చెందిన వివిధ స్థాయిల్లోని అధికారుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూముల వ్యవహారంతో పాటుగా గుడివాడలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం స్వామి వారి కిరీటం అంశంపై అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పైకి కనిపించే అంశాలు కొన్ని మాత్రమే అని ముడుపులతో చాలా విషయాలు బయటకు రాకుండా అధికారులు తొక్కిపెడుతున్నారని ఉద్యోగులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం విధానాల ఫలితంగానే దేవదాయ శాఖ అధికారులు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలకు సంబంధించి పని చేస్తున్న అధికారులు ఒక చోట జీతం తీసుకుంటూ మరో చోట పని చేయటంపై భక్తులు మండి పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో లక్ష్మీనారాయణశెట్టి సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. జిల్లాలోని వేలాది ఆలయాల పర్యవేక్షణకు సంబంధించిన విధులను నిర్వర్తించాల్సిన ఆయన.. పెద్ద అవుటుపల్లి గ్రూప్ టెంపుల్స్కు కార్యనిర్వహణాధికారిగా సైతం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సత్యనారాయణపురం శివాలయంలో బి. గంగాధర్ గ్రేడ్–2 కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. ఆయనే జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా డెప్యూటేషన్పై పని చేస్తున్నారు. జి.కొండూరు గ్రూప్ టెంపుల్స్కు గ్రేడ్–2 కార్యనిర్వహణాధికారిగా కె. నాగరాజు కొనసాగుతున్నారు. నాగరాజు ఆ బాధ్యతలతో పాటుగా సహాయ కమిషనర్ కార్యాలయంలోనూ డెప్యూటేషన్పై పని చేస్తున్నారు. పాతబస్తీలోని చల్లంరాజు వారి సత్రం కార్యనిర్వహణాధికారిగా సుబ్బారెడ్డి పని చేస్తున్నారు. ఆయన సైతం సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే రీతిలో చాలా మంది తమతమ ఆలయాలు, సత్రాల నిర్వహణను వదిలేసి సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై పని చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారంలో ఒక్కరోజూ ఆలయాలకు రాని వైనం గాడి తప్పుతోన్న పాలన ఇటీవల పలు ఆలయాల్లో ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు -
ఘాట్ రోడ్డు మరమ్మతులు వాయిదా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్రోడ్డు మరమ్మతు పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో కార్మికులు పని చేయడం కష్టతరమని, అదే సమయంలో రోడ్డు రిపేరు పనులకు ఉపయోగించే రసాయనాల మిక్సింగ్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్అండ్బీ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆర్అండ్బీ విభాగం అఽధికారులు ఘాట్రోడ్డును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండటంతో రోడ్డు పగుళ్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఘాట్రోడ్డు మరమ్మతు పనులను నిలిపివేసి, భక్తుల రాకపోకలతో పాటు వాహనాల రాకపోకలకు అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఘాట్రోడ్డుపైకి భక్తుల రాకపోకలను అనుమతిస్తారు. 5 నుంచి సంగమం వద్ద పవిత్ర హారతులు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ నదీ హారతులను జూన్ 5వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. సంగమం వద్ద హారతులను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని దుర్గగుడి ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నవహారతులను శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలను ఇవ్వాలని వైదిక కమిటీని కోరారు. -
పనుల్లో నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం
కంకిపాడు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు ప్రహసనంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఈ కారణంగా రూ.కోట్ల నిధులు వెచ్చించినా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి గానూ 31.54 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 3.09 లక్షల జాబ్కార్డులు ఉండగా 1.40 మంది కార్డుదారులను ఉపాధి పనులకు వచ్చే వారిగా గుర్తించారు. ఈ ఏడాది 1.22 లక్షల మందితో ఉపాధి హామీ అధికారులు ఇండెంట్ పెట్టారు. 1.77 లక్షల పనులను గుర్తించగా, 198 పనులు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకు గానూ ఈ ఏడాది మే నెల 5వ తేదీ వరకూ వేతనాలు చెల్లింపులు జరిగాయి. రూ 70.86 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు చెల్లింపులు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అస్తవ్యస్తంగా పనులు... లక్ష్యం భారీగా నిర్దేశించుకున్నా ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధి పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఈ సీజన్లో పంట బోదెల తవ్వకాలు, చెరువుల పూడికతీత పనులను చేపట్టారు. ఉద్యానశాఖ పనులకు కార్యాచరణ రూపొందించారు. అయితే రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ సీజన్లో పంట బోదెల తవ్వకాలు చేపట్టారు. నిర్దేశిత లోతు, వెడల్పున తవ్వకాలు చేపడుతున్నారు. కానీ పనులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా సాగటం లేదు. బోదెల తవ్వకంలో వచ్చిన మట్టిని కూలీలు బోదెల గట్లపైన పడేయాలి. కానీ కూలీలు బోదె అంచులు లోపలి వైపునే మట్టిని పడేస్తున్నారు. కొన్ని చోట్ల నేలను పారలతో చెక్కుకుంటూ, కాలువ అంచులను సైతం నిర్దేశిత లోతు కనిపించేలా చెక్కుతూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. ఉపాధి పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కూలీలు, మేట్ల పనితీరుపై పర్యవేక్షణ కొరవడటంతో పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. కాలువలకు నీరు విడుదల చేసిన సమయంలో కాలువల అంచుల్లో మట్టి కరిగి బోదెలు పూడుకుపోయే పరిస్థితి నెలకొంది. తద్వారా కాలువ చివరి భూములకు సాగునీరు చేరాలనే లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఉపాధి పనులు నిర్వహించినా మట్టి గట్ల మీద వేయకుండా పనులు చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకే పని రెండు సార్లు.. గతంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో తనిఖీ బృందాలు ఒకే కాలువ పూడికతీత రెండు పర్యాయాలు చేపట్టారని, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ అనేక సభల్లో సమస్య లేవనెత్తారు. దీనికి ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారుల నుంచి సొమ్ము రికవరీ చర్యలూ తీసుకున్నారు. దీన్ని బట్టి అధికారుల పనితీరు క్షేత్రస్థాయిలో ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రహసనంగా ఉపాధి హామీ పనులు రూ.కోట్ల నిధులు వెచ్చించినా నిష్ప్రయోజనం సాగునీటి సరఫరా సమయంలో తిరిగి యథాస్థితికి కాలువలు ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగకపోతే అధికారులుపై చర్యలు ఉంటాయి. నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. పనుల్లో లోపాలు తలెత్తితే సహించేది లేదు. ఉపాధి పనులు ఉపయుక్తంగా సాగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. శివప్రసాద్ యాదవ్, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు విడిచిన టన విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చల్ల ఏసుబాబు, నాగలక్ష్మి దంపతులు వైఎస్సార్ కాలనీలో బ్లాక్ నంబర్ 240 ఎఫ్ఎఫ్ 2లో నివసిస్తున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పెద్ద కుమార్తె చల్లా మాధవి (5) ఇతర పిల్లలతో ఆడుకుంటూ కాలనీలోని రోడ్డుకు అవతల ఉన్న బ్లాక్ నంబర్ 224 వద్దకు వెళ్లింది. అక్కడ చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ బార్ వద్ద ఆడుకుంటుంది. ఆ సమయంలో విద్యుత్ బాక్స్లో ఏర్పాటు చేసిన వైర్లు చేతికి తగలటంతో కరెంట్ షాక్ కొట్టి చిన్నారి చనిపోయింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి భోరున విలపించారు. రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఎం డిమాండ్.. విషయం తెలుసుకుని కాలనీకి చేరుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోయి సత్యబాబు మాట్లాడుతూ రక్షణ లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ బార్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు మార్లు ఫిర్యాదు చేశామని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వలనే చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి విద్యుత శాఖ రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈవీ నారాయణ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.సూరిబాబు, కె.రవి, జి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
కానూరు సబ్స్టేషన్ అప్గ్రేడ్నకు చర్యలు
పెనమలూరు: కానూరు కొత్తఆటోనగర్ సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేయటానికి ఏపీసీడీసీఎల్ చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి ఆమోదించారని ఈఈ ఆపరేషన్స్ పి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎండీ పుల్లారెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వీఎస్ఎన్.మూర్తి ఆటోనగర్ సబ్స్టేషన్ను పరిశీలించారన్నారు. ఈ ఈ హరిబాబు వివరాలు తెలుపుతూ కానూరు ఆటోనగర్ 33/11 కేవీ సబ్స్టేషన్ పై విపరీతంగా లోడ్ పడుతున్నందున సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకోని రూ 125 కోట్లతో కానూరు ఆటోనగర్ సబ్స్టేషన్ను 132 కేవీ సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేస్తామన్నారు. దీంతో గంగూరులో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్పై లోడ్ గణనీయంగా తగ్గుతుందన్నారు. పెనమలూరు, పోరంకి, తాడిగడప తదితర ప్రాంతా లోడ్ తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని వివరించారు. కాగా పెదపులిపాక కరకట్ట దిగువున 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించటానికి అధికారులు స్థలం పరిశీలించారు.పెదపులిపాక, యనమలకుదుఉఉ గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయటానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ హనుమయ్య, విద్యుత్ శాఖ డీఈలు,ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి విరాళం
విజయవాడరూరల్: జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్లగణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్)కార్యక్రమం అత్యంత పారదర్శకంగా బాధ్యతాయుతంగా జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన సిబ్బంది ఇంటింటికి వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో, దోషరహితంగా డేటాను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ముగింపు దశలో ఉన్నందున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గ్రామీణ స్థాయి నుంచి యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి టాటా స్టీల్ లిమిటెడ్ వంటి సంస్థల సహకారం అందించడం మంచి పరిణామమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ చెప్పారు. నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో శాప్ లీగ్స్కు సంబంధించిన టాటా స్టీల్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.భరణీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ ఫుట్బాల్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు జంషెడ్పూర్లోని టాటా ఫుట్బాల్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు టాటా స్టీల్ లిమిటెడ్తో శాప్ భాగస్వామ్యం కుదుర్చుకుందన్నారు. టాటా స్టీల్ లిమిటెడ్ స్పోర్ట్స్ చీఫ్ ముకుల్ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో నైపుణ్యాలకు పదును పెట్టేందుకు తమ సంస్థ శాప్తో భాగస్వామ్యం అయ్యిందన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు హామీలు గుప్పించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేత్తడం లేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ విమర్శించారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ నగర మహాసభ గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆర్. కనకారావు, కె. రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ముందుగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం జెండాను రామకృష్ణ ఎగురవేశారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.రమణ, జీఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల పాలిట శాపంలా మారిన జీవో నంబర్ 20ను రద్దు చేయాలన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులుగా టి. శ్రీను, ఆర్. కనకారావు, గౌరవాధ్యక్షులుగా ఎం. రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా భాస్కర్, సహాయ కార్యదర్శిగా ఎన్. శ్రీను, కోశాధికారిగా కె. నాని ఎన్నికయ్యారు. వీరితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
కారు భైక్ ఢీ.. యువకుడు దుర్మరణం
ఎ.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురంలో గురువారం ఉదయం చోటు చేసు కుంది. సేకరించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం పెనుబల్లి మండలం సూరయ్యబంజర గ్రామానికి చెందిన మాలావతు నాగు (26)కు భార్య, కుమారుడు ఉన్నారు. నాగు గురువారం రేపూడి గ్రామం నుంచి బయలుదేరి సూరయ్య బంజరు వెళ్తున్న క్రమంలో మణుగూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో నాగు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో జరిగింది.. దగా డీఎస్సీ: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్...బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
ప్రభుత్వమే ఆ పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
ఆధునిరాకరణ
అవుట్ఫాల్ స్లూయిస్లఅవుట్ఫాల్ స్లూయిస్ల ఆధునికీకరణకు సంబంధించి గత ఏడాది ప్రతిపాదనలు పంపించాం. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులూ రాలేదు. ఈ ఏడాది తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు మాత్రమే నిధులు మంజూరు అయ్యాయి. – బాబూ నాయక్, డ్రెయినేజీ డీఈ, చల్లపల్లి స్థానిక శాసనసభ్యుడు బుద్ధప్రసాద్కు రైతులను పట్టించుకునే తీరిక లేదు. నియోజకవర్గానికి ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పుడూ వీటిని పట్టించుకోలేదు. గత మా పాలనలో వీటి గురించి ప్రతిరోజూ విమర్శించే ఆయన ఇప్పుడు ఎందుకు నోరుమెదపరు. డెప్యూటీ సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రైతులు ఎవరికి చెప్పుకోవాలి. – సింహాద్రి రమేష్బాబు, మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ అవనిగడ్డ: కృష్ణాజిల్లాలో ఎనిమిదిచోట్ల అవుట్ఫాల్ స్లూయిస్లు శిథిలావస్థకు చేరాయి. వీటిని ఆధునికీకరిస్తేనే పంటపొలాలకు ముంపు ముప్పు నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. స్లూయిస్లను ఆధునికీకరిస్తా మని గత ఏడాది అక్టోబర్లో డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆధునికీకరణకు రూ.50 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించి పంపించారు. అయితే నిధులు మాత్రం మంజూరు కాలేదు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదీ అవుట్ఫాల్ స్లూయిస్ల ఆధునికీకరణ లేనట్టేనని రైతులు వాపోతున్నారు. కనీస మరమ్మతులకు నోచుకోక పోవడంతో పలుచోట్ల సముద్రం నీరు పొలాల్లోకి చొచ్చుకొస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులే స్వచ్ఛం దంగా చందాలు సేకరించి మరమ్మతులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 42 ఏళ్ల క్రితం స్లూయిస్ల నిర్మాణం అధిక వర్షాలు కురిసినప్పుడు పంటపొలాల్లోని నీరు సముద్రంలోకి వెళ్లేలా, సముద్రం నీరు గ్రామాల్లోకి చొచ్చుకు రాకుండా ఉండేందుకు 42 సంవత్సరాల క్రితం నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో ఎనిమిదిచోట్ల సముద్రపు మొగ వద్ద అవుట్ఫాల్ స్లూయిస్లు నిర్మించారు. ప్రస్తుతం ఇవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎక్కడా పనిచేయడం లేదు. ఈ ప్రాంతాల్లో ఉన్న అవుట్ఫాల్ స్లూయిస్ల మొత్తాన్ని ఆధునికీకరించి రైతులకు ముంపు ముప్పు లేకుండా చేస్తామని గత ఏడాది అక్టోబర్లో డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి రూ.50 కోట్లకు అంచనాలు పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ ఏడాది అవుట్ఫాల్ స్లూయిస్ల ఆధునికీకరణ లేనట్టేనని రైతులు పెదవి విరుస్తున్నారు. డెప్యూటీ సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేక పోతే ఎలా పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్లకు గత సంవత్సరం ఫైబర్ గేట్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని సరిగా బిగించలేదు. కింద ఉన్న గోతులు పూడ్చక పోవ డంతో గత ఏడాది పంటపొలాలు మునిగిపోయాయి. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక రైతులందం కలసి మూడు లక్షల రూపాయలు చందాలు వేసుకుని కాంక్రీట్ పనులు చేసుకున్నాం. – కంచర్లపల్లి సుధాకర్, రైతు, కోడూరు జిల్లాలో ఉన్న ఎనిమిది అవుట్ఫాల్ స్లూయిస్ల పరిధిలో మొత్తం 85 వేల ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. స్లూయిస్లు అన్నీ శిథిలమవడంతో అధిక వర్షాలు కురిస్తే మురుగు నీరు దిగువకు పోయే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని పంటపొలాలకు ముంపు ముప్పు పొంచిఉంది. కోడూరులో ఉన్న అవుట్ఫాల్ స్లూయిస్ పూర్తిగా దెబ్బతినడంతో గత ఏడాది రబ్బరు గేట్లు బిగించారు. ఇవి సక్రమంగా పనిచేయక పోవడంతో వేసిన వారం రోజులకే సముద్రం నీరు పంటపొలాలను ముంచెత్తింది. 1500 ఎకరాలు నీట మునగడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పట్టించుకో పోవడంతో ఈ ఆయకట్టు పరిధిలోని రైతులు రూ.3 లక్షల చందాలు వేసుకుని మరమ్మతు చేయించుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అవుట్ ఫాల్ స్లూయిస్ లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం
● ఉడతను నోట కరచుకొని చెట్టుపై నుంచి పడిన సర్పం ● భయంతో మెట్ల పూజలను నిలిపివేసిన భక్తులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాత మెట్ల మార్గంలో బుధవారం ఉదయం కొండచిలువ కలకలం రేపింది. ఈ మార్గంలో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు పక్కనే చెట్టు ఉంది. బుధవారం తెల్లవారుజామున ఆరున్నర గంటల సమయంలో చెట్టుపై నుంచి సుమారు ఐదు అడుగుల పొడవైన కొండ చిలువ కింద పడింది. ఉడతను పట్టుకునే క్రమంలో అది కింద పడటంతో ఆ సమయంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు బెంబేలెత్తిపోయి కేకలు వేశారు. అమ్మవారి మెట్లకు పూజలు నిర్వహించేందుకు వచ్చిన మహిళలు సైతం కంగారు పడి కిందకు దిగిపోవడం కనిపించింది. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపిన అర్చకుడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న శానిటేషన్ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పది రోజుల కిందట ఇదే మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఉడి పడి చిన్నారి గాయపడింది. మంగళవారం క్యూలైన్ మార్గంలో భక్తుడికి కుక్క కరిచింది. ఇప్పుడు తాజాగా బుధవారం కొండ చిలువ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,1710 టీఎంసీలుగా నమోదైంది. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్డులోని ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్లో తొమ్మిది జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానజ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7 -
విజయవాడ నగరంలో...
విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వైర్లు తెగి ఏడు ఫీడర్ల పరిధిలో గంటల తరబడి విద్యుత్ లేకుండా పోయింది. మంగళవారం రాత్రి గుణదలలో లైన్లు లూజుగా ఉండి, నిప్పురవ్వలు రాలి, గడ్డి తగలబడటంతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో గన్నవరం, గూడవల్లి, గుణదల, పాలిటెక్నికల్ కాలేజీ, ఎనికేపాడు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ నెల 22వ తేదీనే గుణదలలో లైన్ల నుంచి నిప్పురవ్వలు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మంగళవారం ప్రమాదం జరిగింది. మైలవరం, జగ్గయ్యపేట, చిలకల్లు ప్రాంతాల్లో ఈదురు గాలుల కార ణంగా సోమవారం నాలుగు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళ వారం రాత్రి వీచిన గాలులకు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయ్యి రెండు, మూడు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. గుణదల విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎగసిపడుతున్న మంటలు -
నిధులు దోచుకో.. పరికరాలు దాచుకో!
● వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అందని పౌష్టికాహారం, క్రీడా పరికరాలు ● విడుదలైన రూ. 5.78 లక్షల నిధులు ఏమైనట్టో.. ● ఈ నెల 31తో ముగియనున్న వేసవి క్రీడా శిక్షణ ● అధికారుల తీరుపై విమర్శల వెల్లువ మచిలీపట్నంఅర్బన్: క్రీడలకు విడుదల చేసిన నిధులు దోచుకుంటూ, ప్రభుత్వం అందించిన క్రీడా పరికరాలు దాచుకుంటున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఉచిత వేసవి శిక్షణా శిబిరాల కోసం ప్రభుత్వం రూ. 5,78,860 విడుదల చేసింది. అందులోనే రూ.1.53 లక్షలు అవసరమైన ఆట పరికరాల కొనుగోలు, ఒకొక్క కోచ్కు రూ. 2 వేలతో పాటు రవాణా ఖర్చులకు రూ. వెయ్యి, శిక్షణకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున పౌష్టికాహారం అందించేందుకు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఖాతాకు నిధులు అందాయి. పిల్లలకు ఇచ్చే రూ.10లో రూ.4 విలువైన చిక్కీ, మిగిలిన రూ.6తో ఇతర పౌష్టికాహారం అందించాలని ఉంది. అయితే శిబిరాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పంపిం చిన చిక్కీలు సైతం పంపిణీ చేసిన పరిస్థితి లేదు. కేవలం శిక్షణ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లలకు అందాల్సిన సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తూ నిధులు దోచుకుంటున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు అధికారులు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు: అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ తదితర క్రీడలకు సంబంధించిన పరికరాలతో పాటు, అదనపు కొనుగోళ్ల కోసం రూ.1.53 లక్షల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. క్షేత్రస్థాయిలో మాత్రం హర్డిల్స్ మినహా ఇతర పరికరాలు ఇప్పటివరకు శిక్షణ కేంద్రాలకు చేరలేదు. విడుదలైన నిధులతో అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వేసవి శిబిరాల పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొనుగోలు ప్రతిపాదనలు ఇలా: జిల్లాలో ప్రస్తుతం 16 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మాత్రమే నిర్వహిస్తుండగా, వాటిలో 18 రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. అయితే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మాత్రం 55 రకాల క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై క్రీడా వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహిస్తున్న క్రీడల సంఖ్యకు మించి పరికరాల కొనుగోలు ప్రతిపాదనలు ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణ: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఈత కొలను, బాక్సింగ్, హాకీ క్రీడలకు జిల్లా స్థాయి ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం వార్షికంగా రూ.5 లక్షల పునరావృత గ్రాంట్తో పాటు, రూ.5 లక్షల వన్టైమ్ గ్రాంట్ను అందిస్తోంది. కృష్ణాజిల్లాలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో స్విమ్మింగ్కు సంబంధించి ఖేలో ఇండియా కేంద్రం కొనసాగుతున్నప్పటికీ, గత రెండేళ్లుగా స్విమ్మింగ్, హాకీ కోచ్లు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కోచ్లు పేరుతో నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ నిర్వహణ కూడా సరిగా లేదని, నీటిని సమయానికి మార్చకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో పిల్లలు ఈత కొలనుకు రావడం లేదు. -
దేదీప్యమానంగా డోకిపర్రు
ఘనంగా శ్రీ వేంకటేశ్వరుని దేవస్థాన వార్షికోత్సవాలు డీఎంహెచ్వో డాక్టర్ మాచర్ల సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభ) ఐడీని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, దానితో అనేక ప్రయోజనాలు ఉన్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అభ ఐడీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. అభ ఐడీతో హెల్త్ రికార్డులు డిజిటల్గా భద్రంగా ఉంటాయని, ఒక్కసారి ఐడీ క్రియేట్చేసి, మనం ఎప్పుడు టెస్ట్లు చేయించుకున్నా, ఆ ఐడీలో రికార్డు అవుతాయన్నారు. గతంలో ఫైల్స్ను భద్రపర్చాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు, వైద్యుని ప్రిస్క్రిప్షన్ వంటి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ గా పొందవచ్చున్నారు. ధ్రువీకరించిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ద్వారా టెలి కన్సల్టేషన్ సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. కాబట్టి 14– అంకెల ప్రత్యేక హెల్త్ ఐడెంటి నెంబర్, అభను పొందండి డిజిటల్ అవ్వండి అనే నినాదంతో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. -
సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పేస్ టెక్నాలజీపై యువత ఆసక్తి పెంచుకుని పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంఽధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ రెడ్ బెలూన్ పేరుతో రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను బుధవారం ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ స్పేస్ టెక్నాలజీ ద్వారా సేకరించిన సమచారం రైతులు, ప్రజలు, వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సూపర్ ప్రెజర్ బెలూన్ భూమి నుంచి 25 కిలో మీటర్లపైకి వెళుతుందని తెలిపారు. ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మూలాలను తెలుసుకోవడానికి సూపర్ ప్రజర్ బెలూన్లో అమర్చిన సాంకేతిక వ్యవస్థ దోహదపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చౌకగా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ కనెక్టవిటీని ఈ బెలూన్ ద్వారా అందించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. -
మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్టు
● వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తే నిందితుడు ● మృతురాలిది కై కలూరు మండలం వింజరం ● నిందితుడిని అరెస్టు చేసిన కంకిపాడు పోలీసులు కంకిపాడు: మహిళ హత్య కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ జె.మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి హత్యకేసు వివరాలను వెల్లడించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ... ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ (33) కృష్ణాజిల్లా పెడన మండలం షేరివత్తర్లపల్లి గ్రామానికి చెందిన తోకల వినోద్బాబు అలియాస్ వినోద్కుమార్తో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇటీవల వీరిద్దరూ తెన్నేరు గ్రామంలోని ఇటుకల బట్టీల వద్ద పనులకు వచ్చారు. జొన్నాదుల మేరీ శివకుమార్ భార్యాభర్తలు. అయితే కై కలూరులోని ఓ హోటల్లో మేరీ పనిచేస్తూ ఉండేది. అక్కడికి ట్రాక్టరు నడిపే పనులకు వచ్చిన వినోద్బాబుతో పరిచయం ఏర్పరుచుకుంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అదే క్రమలో వినోద్బాబు, మేరీలు తెన్నేరులో ఇటుకల బట్టీల పనులకు వచ్చారు. అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు.. మేరీ తాను పనిచేసిన హోటల్లో వంట మేసీ్త్రతో చనువుగా మాట్లాడటం వినోద్బాబుకు నచ్చలేదు. ఈ విషయమై ఇరువురు మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈనెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నైట్ ప్యాంటుతో మేరీ మెడకు బిగించి ఊపరాడకుండా చేసి హత్యచేసి పరారయ్యాడు. ఘటనపై మృతురాలి భర్త శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పడి నిందితుడు వినోద్బాబు కోసం విస్తృతంగా గాలించారు. నిందితుడిని కంకిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్ఎస్ఐ కె.సురేష్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
గాలివీస్తే విద్యుత్ కట్కట
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: అనధికార విద్యుత్ కోతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపాటి గాలులు వీస్తే చాలు ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు అనధికార విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 220 కేవీ / 132 కేవీ ఈహెచ్టీ (ఎక్స్ట్రా హై టెన్షన్) లైన్లు, వాటి కింద ఉన్న ఫీడర్లలో ఓవర్లోడ్ పడితే ఆ ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తున్నారని సమాచారం. ఓవర్ లోడ్ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగా కొత్త లైన్లు వేయకపోవడం, ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయకపోవడం, ఈహెచ్టీ సబ్స్టేషన్ నిర్మాణాలు చేపట్టనందు వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుణదల నుంచి ఆటోనగర్, గుణదల నుంచి గంగూరు, తాడికొండ నుంచి తాడేపల్లి 132 కేవీ లైన్ల పరిధిలో ఓవర్ లోడ్ కారణంగా వాటి పరిధిలోని ఫీడర్లలో అనధికారికంగా విద్యుత్ కోత విధిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. జనవరిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గరిష్ట వినియోగం రోజుకు 18 మిలియన్ యూనిట్లు. మంగళవారం విద్యుత్ వినియోగం 27.54 మిలియన్ యూనిట్లకు పెరి గింది. ఈ పెరుగుదలను ముందుగా అంచనా వేసి, దానికి అనుణంగా చర్యలు తీసుకోవడంలో విద్యుత్ శాఖ యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో అనధికార కోతలు తప్పడం లేదు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవ ర్గంలో మచిలీపట్నం రూరల్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రతి రోజూ పగలూ రాత్రి అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మచిలీపట్నం పట్టణ పరిధిలో చిన్నపాటి గాలులు వీచినా విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నారు. అసలే మండే ఎండలకు విద్యుత్ కోతలు తోడవ్వటంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
మత్స్యకారుల నిరసన
పాలకాయతిప్పలో ● టూరిజం బోటు తరలింపును అడ్డుకున్న గంగపుత్రులు ● పర్యాటకం పేరుతో జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని ఆగ్రహం కోడూరు: సముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగించే పాలకాయతిప్ప మత్స్యకారులు అటవీ అధికారులపై నిరసనకు దిగారు. పర్యాటక అభి వృద్ధి పేరుతో అటవీ అధికారులు సముద్ర శింకు వద్ద నుంచి సాగర సంగమం వరకు బోటు టూరిజం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ట్రాలీపై టూరిజం బోటును అధికారులు సముద్రతీరానికి తీసుకువచ్చారు. దీనిని గమనించిన పాలకాయతిప్ప మత్స్యకారులు కరకట్ట వద్దే బోటు ఉన్న ట్రాలీని అడ్డుకొని శింకు వద్దకు వెళ్లడానికి వీలు లేదంటూ వాహనం ముందు బైఠాయించారు. జీవనోపాధికే ప్రమాదమంటూ భావోద్వేగం తరతరాలుగా సముద్ర శింకు వద్దే తమ వేట పడవలను నిలిపి, ఇక్కడే నుంచే సముద్ర వేటకు బయలుదేరి వెళ్తామని మత్స్యకారులు తెలిపారు. తుపాన్లు, అలల ప్రభావం ఎక్కువగా ఉండే సమయంలో కూడా ఈ ప్రాంతమే తమకు భద్రత కల్పించిందని, అలాంటి ప్రదేశాన్ని ఇప్పుడు టూరిజం అవసరాల కోసం వినియోగించాలనే ప్రయత్నం, తమ జీవనోపాధిపై ప్రభావం చూపు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సముద్రం మా జీవితం.. పడవ మా ఆస్తి.. ఈ శింకే మా ఆశ్రయం’ అంటూ మత్స్యకారులు భావోద్వేగానికి లోన య్యారు. గ్రామపెద్దలు, మత్స్యకార సంఘాల నేలతో చర్యలు జరపకుండా అటవీ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వేట పడవలను వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు సూచించడం అసాధ్యమని, అటవీ అధికారులే టూరిజం స్పాట్ను వేరే ప్రాంతానికి మార్చుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయాలను పాలకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని మత్స్యకారులు వాపోయారు. వివాదాన్ని సద్దుమణిచిన పోలీసులు టూరిస్ట్ బోటును తీసుకువస్తున్న ప్రత్యేక ట్రాలీని మత్స్యకారులు అడ్డుకోవడం అటవీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మత్స్యకారులతో మాట్లాడి వారి అభ్యంతరాలను తెలుసుకున్నారు. అనంతరం బోటును దింపకుండా తిరిగి అదే లారీలో వెనక్కి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణిగింది. -
కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానం మేరకు కౌలు రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వాటి ఆధారంగానే వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు, మార్కెట్ తదితర పథకాలన్నీ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయవాడలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర సమితి విస్తృత సమావేశం సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం కావాలన్నారు. రెండేళ్లుగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కేవలం పంట హామీపైనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలురైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయా లని డిమాండ్ చేశారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల సమస్యలపై జూన్ ఒకటో తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు దొంత కృష్ణ, నేలపాల రామకృష్ణ, పి.వి. జగన్నాథం, వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 15 నుంచి సర్ సర్వే
వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తిచేయాలి చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కళాశాల పరిపాలనా విభాగం తరగతి గదులు, భోజన శాల విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ ఆషాలత, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ బలోపేతానికి యువశక్తి కృషి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపకత శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాన్ని (ఈటీఎంపీ) ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఎంఈడీసీ)తో భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) ఒక ఆసక్తి పత్రంపై సంతకాలు చేసింది. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో జరిగిన ‘ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ సందర్భంగా ఈ ఆసక్తి పత్రాలను పరస్పరం మార్చుకున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధమైన శిక్షణ, మార్గదర్శకత్వం, డిజిటల్ లెర్నింగ్, పర్యావరణ వ్యవస్థ నిర్మాణ చర్యల ద్వారా నానో సూక్ష్మ పరి శ్రమలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అధికారిక వెబ్సైట్లో ఎస్ఎస్సీ మార్కుల మెమోలు మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ హైస్కూళ్ల విద్యార్థులకు సంబంధించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోలను అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల లాగిన్లలో షార్ట్ మెమోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసి పాఠశాల ముద్ర, సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. విద్యార్థుల పేరు, ఇంటిపేరు, జన్మతేదీ తదితర వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులతో సమ గ్రంగా పరిశీలించి ధ్రువీకరించాలని పేర్కొన్నారు. అధికారిక వెబ్సైట్లో స్కూల్ లాగిన్ సవరణల ఆప్షన్ ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ నాలుగో తేదీ వరకు అందుబాటులో ఉంటుందని సూచించారు. అవసరమైన సవరణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు తగిన సూచనలు జారీ చేసి పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు. -
‘ఎస్కేపీవీవీ’లో ఎన్సీసీ రైఫిల్ షూటింగ్ శిక్షణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్ర బెటాలియన్ 17(ఎ) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కాకినాడ పరిధిలోని తొమ్మిది జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్లోని ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ కమిటీ ముందుకు వచ్చింది. కోస్తా ఆంధ్రాలోని ఎన్సీసీ క్యాడెట్లకు ఆయుధాలను ఉపయోగించడం, గురి చూడటం, కాల్పులు జరపడంలో శిక్షణ ఇచ్చేందుకు ఫైరింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి హైస్కూల్ ఇది. బుధవారం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ ఇన్చార్జ్ సెక్రటరీ/కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాసు మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపుతోపాటు క్యాడెట్లలో ధైర్యం, ఏకగ్రతను పెంచడమే ఫైర్ రేంజ్ ఏర్పాటు మఖ్య ఉద్దేశమన్నారు. దేశానికి సేవలు అందించే ఆర్మీ, అగ్నివీర్లలో చేరేందుకు ఎన్సీసీ ద్వారా అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. శిక్షణ జేసీఓ సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్ఫ్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు అబ్ట్పాకిల్ ట్రైనింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్, టెంట్ పిచింగ్, ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, వెపన్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలలో సమగ్ర శిక్షణ ఇస్తామని వివరించారు. బెటాలియన్ పరిధిలోని 537 మంది క్యాడెట్లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీపై గెస్ట్ లెక్చర్స్.. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై నిపుణులతో గెస్ట్ లెక్చర్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.శ్యామల మాట్లాడుతూ క్యాడెట్లలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఈ ఫైరింగ్ క్యాంప్ దోహదపడుతున్నారు. కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియ, కెప్టెన్ కేపీటీ విజయభాస్కర్ పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు మైలవరం: ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఘటన మంగళవారం మైలవరం చండ్రగూడెం జాతీయ రహదారిపై జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం తిరువూరు డిపోకు చెందిన అర్టీసీ అద్దె బస్సు 40 మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తోంది. చండ్రగూడెం బైపాస్ వద్దకు వచ్చే సరికి రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో బస్సులో ఉన్న వారు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్సై సుధాకర్ తెలిపారు. -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందాలి
● 1912 టోల్ ఫ్రీ నంబర్ ఎల్లప్పడూ అందుబాటులో ఉండాలి ● ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి మంగళవారం సర్కిల్ పరిధిలోని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఆపరేషన్స్)తో వర్చువల్ విధానంలో సమీక్షించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి ముందుగానే ప్రజలకు సమాచారం తెలియజేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 1912, 83309 11912 వాట్సప్ నంబర్ సేవలను మరింత పటిష్టంగా అందించాలన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టి, వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. నిర్మాణంలో సబ్ స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, సీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఈ–కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి
కృష్ణా జాయింట్ కలెక్టర్ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ధి పొందేందుకు రేషన్కార్డులోని ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో మే 24వ తేదీ నాటికి 20,450 మంది ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉందన్నారు. పెండింగ్ జాబితాలు వీఆర్వో, సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైస్కార్డు కలిగి ఉండి ఇంకా ఈ–కేవైసీ చేయని లబ్ధిదారులు (ఐదేళ్లలోపు చిన్నారులు మినహా) వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, ఈ–పోస్ పరికరాల ద్వారా బయోమెట్రిక్ నమోదుచేసి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగులకు ఇటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సరుకులు సరఫరా చేయాలన్నారు. రేషన్ దుకాణాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పటమట(విజయవాడతూర్పు): పటమట పీఎస్ పరిధిలోని నిర్మల జంక్షన్ దగ్గరలో సర్వీస్ రోడ్డులోని ఎంపైర్ హోటల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద సుమారు 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పటమట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. మృతుని శరీరంపై షర్టు లేకుండా బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని పేరు వివరాలు తెలియ రాలేదని, వివరాలు తెలిసినవారు పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
జల్జీవన్ మిషన్ పనులు వేగవంతం
చిలకలపూడి(మచిలీపట్నం): జలజీవన్ మిషన్ పథకం ద్వారా చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయటంతో పాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడూరు మండలంలో అత్యధికంగా పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయా మండలాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. టాయిలెట్లలో టైల్స్, కమోడ్లు, స్టీలు కుళాయిలు, సరిపడా వెంటిలేషన్ తదితర సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులను చేపడతామన్నారు. త్వరలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి సంబంధిత పనులను స్వయంగా పరిశీలిస్తామన్నారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వహణాధికారి సోమశేఖర్, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, డీపీవో ధనలక్ష్మి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశం -
అప్పులు.. అభాసుపాలు!
గుడ్లవల్లేరు: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్వర్ణ పంచాయతీ’ సైట్తో అవస్థలు తప్పడం లేదు. దీని కారణంగా జిల్లాలోని చాలా పంచాయతీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కృష్ణా జిల్లాలో 486గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎన్నో పంచాయతీలకు బిల్లులు కాకపోవటంతో పరిపాలన కుంటు పడుతోంది. జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో ఉన్నతాధికారుల అండదండలున్న కొంతమంది గ్రామ కార్యదర్శులకు మాత్రం భారీ మొత్తంలో బిల్లులు సత్వరమే విడుదల చేసేందుకు కొన్ని శక్తులు సహకరిస్తున్నాయి. కానీ మైనర్ పంచాయతీల్లో కనీసం చాటింపు వేయించేందుకు రూ.500 డ్రా చేయాలన్నా కష్ట సాధ్యమవుతోంది. లక్ష్యాలకు దూరంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ స్వచ్ఛపథం, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల లక్ష్యాన్ని పంచాయతీలకు అప్పగించింది. కానీ ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఆయా పంచాయతీలు నానా అగచాట్లకు గురవుతున్నాయి. ● మేజర్, మైనర్ పంచాయతీల పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నా.. సీఆర్డీఏకు జమ అవుతున్నాయే తప్ప అందులో పంచాయతీలకు రావలసిన నిధులు అందడం లేదు. ● ఎన్నో ఏళ్లగా గ్రామ పంచాయతీలకు సర్కార్ ఇవ్వవలసిన స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వటం లేదు. కేవలం పంచాయతీలకు వచ్చే నాన్ ట్యాక్స్, ఇంటి పన్నులు, నీటి పన్నులకు సంబంధించిన అరకొర నిధులతోనే పాలనా కాలాన్ని వెలిబుచ్చుతున్నారు. ● దీంతో నెలాంతపు ఖర్చులు, సిబ్బంది జీతాలు తలకు మించిన భారంగా మారాయి. ● మంచినీటి మోటార్ల రిపేర్లు, మురుగు కాల్వల్లో పూడికతీత వంటి పనులకు, పని వారికి వెంటనే డబ్బును అప్పటికప్పుడే చెల్లించకపోవటంతో ఆ పనులు చతికలబడిపోతున్నాయి. ● జిల్లా ఉన్నతాధికారుల అనుమతి లేనిదే చెత్త చేరవేసే వాహనాలకు సైతం కనీసం పెట్రోల్, డీజిల్ కూడా ఉండటం లేదు. ● రోజువారీ అవసరాల్ని బట్టి పంచాయతీల పరిధిలో పని చేసే మిషనరీలతో పాటు పని వారికి సొమ్ము చెల్లించలేక పోతున్నారు. ● కొన్ని పంచాయతీల్లో గత మార్చి వరకు చేయించిన పనులకు బిల్లులు చెల్లించవలసి ఉంది. ఏప్రిల్ నుంచి ఎం బుక్ ద్వారా చెల్లించవలసిన బిల్లులు కూడా కొన్ని పంచాయతీల్లో చెల్లించవలసి ఉంది. ● ఇదంతా ఏప్రిల్ నుంచి వచ్చిన నూతన స్వర్ణ పంచాయతీ సైట్లో సవరణలే కారణమని పంచాయతీలు భావిస్తున్నాయి. అప్పులూ కరువు.. బిల్లుల ఫ్రీజింగ్ వల్ల పంచాయతీలకు పెట్టుబడులు పెట్టే నాథులు కూడా కరువయ్యారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినపుడు గ్రామ కార్య దర్శులే ఖర్చు పెట్టేవారు. ఇపుడు వారికి అప్పులు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావటంతో ప్రత్యేకాధికారులు ఆ స్థానే వచ్చారు. కానీ వారు కూడా ఈ ఖర్చులను పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. స్వర్ణ పంచాయతీ సైట్తో తిప్పలు బిల్లులు రాక కార్యదర్శులు సతమతం బ్లీచింగ్, పైపులైన్ల రిపేర్లకు నిధులు లేవు అప్పుల్లో కూరుకుపోతున్న పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలను విడుదల చేస్తున్నామని చెప్పుకునే జిల్లా అధికారులు.. చర్యలు మాత్రం కంటి తుడుపుగా ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తూతూమంత్రంగానే కొన్ని పంచాయతీలకే బిల్లులు ఆమోదిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. కొన్ని పంచాయతీలకై తే కనీసం బ్లీచింగ్కు బిల్లులను చెల్లించటంలో కూడా విఫలమవుతున్నారు. మంచినీటి పథకానికి చెందిన పైపులైన్ల రిపేర్ల ఖర్చుల బిల్లులకు మోక్షం లేకుండా పోయింది. నెలాంతపు ఖర్చుల బిల్లులు రాక నెలల తరబడి నానా ఇబ్బందుల్లో పంచాయతీలు ఉన్నాయి. -
భయపెడుతున్న బుడమేరు ఆక్రమణలు
●ఆదాయ వనరుగా మారిపోయిన ‘ఆపరేషన్ బుడమేరు’● సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో దందా! ● ‘మామూళ్ల’ మత్తులో కన్నెత్తి చూడని అధికారులు ● వరదొస్తే ప్రళయం తప్పదని స్థానికుల ఆందోళన సాక్షిప్రతినిధి,విజయవాడ: బుడమేరు.. ఈ పేరు వింటే నే విజయవాడ నగర ప్రజలు నేటికీ వణికిపోతుంటారు.. రెండేళ్ల క్రితం బుడమేరు వరదలు సృష్టించిన బీభత్సం స్థానిక ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తూనే ఉంది.. కొద్దిపాటి చినుకులు పడినా.. తుపాను వస్తోందనే హెచ్చరిక వినినా.. ఎటు నుంచి ఏ వరద ముంపు తమను ముంచేస్తుందోనంటూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డున పడినా.. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగినా.. పదుల సంఖ్యలో అమాయక ప్రజలు అసువులు బాసినా.. ప్రభుత్వ పాలకులు, సంబంధిత అధికారులు అవేవి తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధి అండదండలతో.. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బుడమేరులో మట్టి, రాళ్లు పోసేసి పూడ్చేయడం.. వాటిని ప్లాటుగా మార్చేసి.. దొంగ సర్వే నంబర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం.. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను చేపట్టడం చేస్తున్నారనే విమర్శ లు గుప్పుమంటున్నాయి. ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు బుడమేరు ఆక్రమణల్లో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. మామూళ్ల మత్తులో.. స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు రావడం.. ఆక్రమణ దారుల నుంచి ముడుపులు అందుతుండటంతో బుడమేరులో ఇంత యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ టౌన్ప్లానింగ్, నీటి పారుదల శాఖ అధికారులెవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నా, ఫిర్యాదులు అందు తున్నా ‘మామూళ్ల’ మత్తులో అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడైన వ్యక్తితో కొంతమంది టౌన్ప్లానింగ్ అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు న్నాయి. కొంతమంది ఇరిగేషన్ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవే నిదర్శనాలు.. స్థానిక న్యూరాజరాజేశ్వరీపేట, ఇందిరానాయక్నగర్, రామకృష్ణాపురం, సన్సిటీ కాలనీ, భరతమాత మందిర చివర భాగం, అయోధ్యనగర్ నుంచి న్యూఆర్ఆర్పేటకు వెళ్లే దారి, రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. బుడమేరును పూడ్చేసి ప్లాట్లుగా మార్చడమే కాకుండా.. ఇక్కడ బఫర్ జోన్లలో భవనాలు, షెడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు బుడమేరులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బుడమేరు వరదల్లో మేమంతా ఆర్థికంగా చాలా చితికిపోయాం. ఆ ప్రభావం నుంచి నేటికీ కోలుకోలేదు. వరదలు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆక్రమణలను తొలగించకపోగా కొత్తగా అడుగడుగునా బుడమేరును పూడ్చేస్తున్నారు. ఇలా అయితే కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా బుడమేరు కదిలే మార్గం లేక మళ్లీ ముంపు సమస్య వస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి మా కన్నీటి ఘోషను ఆలకించి బుడమేరును, మా కుటుంబాలను కాపాడాలని కోరుకుంటున్నాం. – ఎస్.దుర్గారావు, న్యూఆర్ఆర్పేట -
ప్రసవం.. విషాదం..
మచిలీపట్నంఅర్బన్: మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవనం ప్రాంతానికి చెందిన హరిత (30) సోమవారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చి, మంగళవారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో మృతి చెందింది. ప్రసవం జరిగిన సుమారు 15 గంటల్లోనే బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రెండో ప్రసవానికీ అదే ఆస్పత్రి మచిలీపట్నం ప్రాంతానికి చెందిన హరితకు మొదటి ప్రసవం కూడా మూడేళ్ల క్రితం మచిలీ పట్నం సర్వజన ఆస్పత్రిలోనే జరిగింది. రెండో ప్రసవం కోసం కూడా కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. సిజేరియన్ అనంతరం సరైన వైద్య సదుపాయాలు అందలేదని ఆరోపిస్తున్నారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హరితకు సిజేరియన్ తర్వాత ఐసీయూకు తరలించకుండా సాధారణ వార్డుకు మార్చారని తెలిపారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యులు మరోసారి ఆపరేషన్ చేశారని, అయినా ఫలితం లేదని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. పల్మనరీ ఎంబోలిజం కారణమై ఉండొచ్చు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ స్పందిస్తూ, హరితకు సిజేరియన్ అనంతరం ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించిందన్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అనుమానంతో మళ్లీ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. పల్మనరీ ఎంబోలిజం వంటి అరుదైన పరిస్థితి కారణంగా మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్కు ముందు ఆమెకు ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కనిపించలేదని, అందువల్ల సాధారణ వార్డులో ఉంచినట్లు వివరించారు. డాక్టర్ల నిర్లక్ష్యం లేదని ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు. పాలకులు మొద్దు నిద్ర వీడాలి: పేర్ని కిట్టు ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు వైద్య సేవలు దూరమవుతున్నాయనే దానికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ప్రచారాలకే పరిమితమవుతున్నారని, వైద్య సేవలపై సరైన దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఇక్కడ సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
వడగాలుల విలయం
ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు 11 మంది మృతిగణపేశ్వరం(నాగాయలంక): ఉమ్మడి కృష్ణా జిల్లాలో వడగాలుల విలయం కొనసాగుతోంది. రోహిణీ కార్తెలో ఉగ్రోష్ణతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులకు ఉమ్మడి జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల 11మంది మృతి చెందారు. గణపేశ్వరం శివారు బర్రంకులలో తోట గోపాలరావు(95) మంగళవారం వడదెబ్బ తగిలి మరణించినట్లు కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు మండల తహసీల్దార్కు తెలియపర్చినట్లు వీఆర్వో జయరామ్ తెలిపారు. వడదెబ్బ తగిలి వృద్ధుడు మృతి చెందిన సమాచారంపై తహసీల్దార్ సీహెచ్వీ ఆంజనేయప్రసాద్ వివరణ కోరగా వడదెబ్బకు మృతి చెందినట్లు త్రీమెన్ కమిటీ నిర్ధారించవలసి ఉందని, పోస్ట్మార్టమ్ కు పంపించాలని సూచించామన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్ చెప్పారు. హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం కె.సీతారామపురం వద్ద వడదెబ్బకు ఓ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం సత్యనారాయణపురానికి చెందిన యార్లగడ్డ శిరీష (47) మతస్థిమితం కోల్పోవడంతో ఇంటి నుంచి సోమవారం వెళ్లిపోయింది. జాతీయ రహదారి వెంట వస్తుండగా వేసవి ఎండ తీవ్రతకు అలసటతో కె.సీతారామపురం వద్ద డివైడర్పై కూర్చుంది. అక్కడే స్పృ తప్పి పడిపోవటంతో స్థానికులు గుర్తించి జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు పరిశీలించగా అప్పటికే మహిళ మృతి చెందింది. తొలుత మృతురాలు వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేశారు.ఆ తర్వాత మృతురాలి ఫొటోను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, కుటుంబ సభ్యులు గుర్తించారు. మల్లవల్లిలో.. బాపులపాడు మండలం మల్లవల్లిలో వేసవి వడగాల్పుల ధాటికి శతాధిక వృద్ధురాలు తూము ఈశ్వరమ్మ (101) సోమవారం రాత్రి మృతి చెందారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి ఈశ్వరమ్మ తట్టుకోలేక సాయంత్రానికి పూర్తిగా నిరసించిందని,ఆ తర్వాత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గన్నవరం: వడదెబ్బకు గురై ఓ గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై గన్నవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ నెల 23వ తేదీ మండలంలోని ముస్తాబాదలో వడదెబ్బకు గురై సుమారు 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్లో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందినట్లు ఎస్ఐ ప్రశాంతి తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు గన్నవరం పీఎస్లో సంప్రదించాలని కోరారు. ఉంగుటూరు(గన్నవరం): నాగవరప్పాడు గ్రామంలో ఓ గుర్తుతెలియని మహిళ వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగవరప్పాడులోని బస్ షెల్టర్లో సుమారు 30 నుంచి 35 ఏళ్లు వయస్సు కలిగిన మహిళా మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎండల తీవ్రత, వడగాలుల కారణంగా సదరు మహిళా మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మృతురాలికి సంబంధించిన ఆచూకీ తెలియరాలేదని, మృతురాలు ఎరుపు రంగుపై పసుపు రంగు పువ్వులు కలిగిన పంజాబీ డ్రస్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతురాలు సంబంధించి వారు ఉంగుటూరు పీఎస్లో సంప్రదించాలని కోరారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారుచల్లపల్లి మండలంలో .. చల్లపల్లి: లక్ష్మీపురం శివారు చింతలమడ గ్రామానికి చెందిన చిగురుపాటి నల్లమ్మ(67) విపరీతమైన ఎండలు, వడగాలులు కారణంగా వడదెబ్బకు గురైంది. వృద్ధాప్యంలోనే తన పనులు తానే చేసుకుంటుంది. అయితే సోమవారం సాయంత్రం నుంచి వంట్లో బాగోలేదని, నీరసంగా, ఆయాసంగా ఉందని చెప్పి కదలకుండా పడుకొంది. మంగళవారం ఉదయం నల్లమ్మ పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం సమయానికి నల్లమ్మ మృతి చెందింది. ఆమెతో కలిపి చల్లపల్లి మండలంలో వడదెబ్బకు గురై మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకుంది. పటమటలో.. పటమట(విజయవాడతూర్పు): వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పటమట పీఎస్ సీఐ పవన్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉన్న వ్యక్తి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆటోనగర్ బస్స్టాండ్ (సిటీ టెర్మినల్) వెనుక వైపున వడదెబ్బ కారణంగా పడిపోయి చనిపోయాడు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే పటమట పీఎస్లో తెలియజేయాలని లేదా 7416812304, 9494918585 ఫోన్ నంబర్లుకు సమాచారం అందించాలని కోరారు. ఉయ్యూరు: వడగాడ్పులకు గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఉయ్యూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారికి సమీపంలోని జియో పెట్రోలు బంకు వెనుక ఖాళీ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వడదెబ్బకు మృతి చెంది ఉంటాడని, మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల్లు ఉంటాయని, కాఫీ రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని సీఐ రామారావు తెలిపారు. కాటూరు రోడ్డులో.. పట్టణంలోని కాటూరు రోడ్డులో ఫుట్పాత్పై ఓ యాచకురాలు మృతి చెందింది. ఫుట్పాత్పై యాచకురాలి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చల్లపల్లి: మండల పరిధిలోని వక్కలగడ్డలో మరో వృద్ధురాలు అడ్డాడ రవంబ(90) వడదెబ్బతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు. వయస్సు 90 సంవత్సరాలైనా రవంబ యాక్టివ్గా ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గూడూరు: మండలం రాయవరంలో వడగాలులకు వృద్ధుడు మరణించాడు. గ్రామానికి చెందిన నారగం వీర వెంకట సత్యనారాయణ(60) మంగళవారం మృతి చెందాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే సత్యనారాయణ ఎండ వేడికి తాళలేక తనువు చాలించాడు. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ(పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ సునీల్ కుమార్ హాజరైన సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు. పటిష్టంగా చట్టం అమలు..జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతమున్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు, రెన్యువల్ దరఖాస్తులు, మార్పుచేర్పుల (మోడిఫికేషన్) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ఆమోదం తెలిపింది. సరోగసీకి సంబంధించిన ఆరు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో రవాణా శాఖ మంత్రి
తోట్లవల్లూరు: ట్రాక్టర్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు తోట్లవల్లూరులో అరెస్టు చేశారు. పమిడిముక్కల సీఐ వై.చిట్టిబాబు చోరీ ఘటన వివరాలను మంగళవారం మీడియాకు తెలియజేశారు. మండలంలోని రొయ్యూరుకు చెందిన వల్లూరు శ్రీనివాసరావు తన ట్రాక్టర్ను ట్రక్కుతో సహా గ్రామ సచివాలయం వద్ద ఈ నెల 14వ తేదీ రాత్రి నిలిపి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూసే సరికి ట్రాక్టర్ కనిపించలేదు. దీనిపై ట్రాక్టర్ యజమాని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 25న దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక రోడ్డులో ట్రాక్టర్ను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతోపాటు ట్రాక్టర్ అపహరణకు పాల్పడిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామానికి చెందిన మైల గణేష్ను అరెస్టు చేసినట్లు సీఐ చిట్టిబాబు తెలియజేశారు. చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీన పరుచుకున్నామన్నారు. ఆ వాహనం కూడా గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో చోరీ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని గుడివాడ కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించినట్లు చిట్టిబాబు చెప్పారు. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించినట్లు పేర్కొన్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026u8లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. గాంధీనగర్: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. -
గన్నవరం ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: ఎబోలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ పాసింజర్స్కు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో విమానం రాగా, వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది!
తెన్నేరు మహిళది హత్యేనని తేల్చిన పోలీసులు కంకిపాడు: వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది. ఉంచుకున్నోడే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కలిసి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది.. ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ(33) తనతో వివాహేతర సంబంధం నడుపుతున్న తోకల వినోద్కుమార్ అనే వ్యక్తితో పది రోజులు క్రితం తెన్నేరు గ్రామంలోని ఇటుక బట్టీల వద్దకు పనికి వచ్చింది. తరచూ వీరు ఇక్కడికి పనులకు వస్తుంటారు. అదే విధంగా ఇద్దరూ ఇటుక బట్టీలకు వచ్చారు. ఈనెల 24వ తేదీన బట్టీల వద్ద ఎవరూ లేని సమయంలో వారు ఉండే పాకలో మేరీ, వినోద్కుమార్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వినోద్కుమార్ మెడకు గుడ్డతో బిగించి హత్య చేసినట్లు మృతు రాలి భర్త శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నాడు. ఘటనాస్థలాన్ని సందర్శించిన కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, సిబ్బంది వివరాలు సేకరించి హత్యకేసు నమోదు చేశారు. అనుమానమే కారణమా? గత కొద్ది రోజులుగా మేరీ వేరే వ్యక్తులతో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకుని ఇదే విషయమై వినోద్కుమార్ తరచూ గొడవలు పడేవాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు ఇది కూడా కారణంగా పోలీసులు భావిస్తున్నారు. లేక మరేదైనా కారణం అయ్యి ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో.. హత్యకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వినోద్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మేరీ మృతి అనంతరం అక్కడి నుంచి కంకిపాడు వచ్చిన వినోద్కుమార్ భోజనం పార్సిల్ను ఓ మిత్రుడికిచ్చి మేరీకి ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలుస్తోంది. భోజనం ఇచ్చేందుకు వెళ్లిన వ్యక్తి ద్వారా హత్య జరిగిన ఘటన వెలుగు చూసిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ద్వారా నిందితుడిని గుడివాడ పరిసరాల్లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కంకిపాడు స్టేషన్కు ఉంచినట్లు సమాచారం. -
మరికొన్ని రోజులు ఇదే తీవ్రత..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. విజయవాడతో పాటు పలు రూరల్ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ, సోమవారం ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వడగాడ్పుల ప్రభావానికి గురైన చాలామంది పిట్టల్లా రాలుతున్నారు. బయటకు వచ్చిన వారే కాదు, ఇళ్లలో ఉన్న వారు సైతం హీట్స్ట్రోక్కు గురవుతున్నారు. అలాంటి వారు తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతుల వంటి సమస్యలతో ఆస్పత్రుల దారి పడుతున్నారు. వడదెబ్బ మృతుల్లో అధికంగా శ్రమ జీవులు, యాచకులే ఉంటున్నారు. పెనమలూరు: జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్కు చెందిన తులసిరాణా(60) పోరంకిలో అపార్టుమెంట్లో కార్పెంటర్ పనికి వచ్చాడు. అతను శుక్రవారం పని చేస్తున్న సమయంలో ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతనిని చికిత్సకై ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తులసి రాణా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అల్లుడు మనోజ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన తంగిరాల వినోద్బాబు(34) భవన నిర్మాణ పనుల్లో భాగంగా టైల్స్ వేస్తుంటాడు. ఆదివారం పనికి వెళ్లిన వినోద్బాబు సాయంత్రం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఉయ్యూరులోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్కి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున మృత్యువాత పడ్డాడు. కాగా వినోద్బాబుకు తొలుత వైద్యుల పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారని, తర్వాత పోస్టుమార్టం చేయకుండానే పంపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ జంక్షన్ సమీపంలోని నివాసం ఉంటున్న వెల్డింగ్ పనులు చేసే కార్మికుడు గొంగటి చంటి(45) వడదెబ్బతో మృతి చెందాడు. చంటి భార్య గతంలోనే చనిపోవడంతో తల్లి యశోదమ్మతో కలిసి సిద్ధార్థ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వేళ చికెన్ తీసుకువస్తానని చెప్పి చంటి బయటకు వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిద్ధార్థ కళాశాల చెట్టు కింద మీ అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడని స్థానికులు చంటి తల్లి యశోదమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే వచ్చి 108లో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే చంటి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ● విజయవాడ సూర్యారావుపేటలో హోటల్ కార్మికుడు, హనుమాన్పేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందారు. తిరువూరురూరల్: వావిలాల మండలంలోని వావిలాలలో వడదెబ్బకు ఇరువురు మృతిచెందారు. ఆదివారం రాత్రి షేక్ షఫీ కమృన్(87) అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించేలోపు మృతిచెందారు. వడదెబ్బకు ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన టైలరింగ్ వృత్తి నిర్వహించే షేక్ నాగుల్మీరా (52) శనివారం విధినిర్వహణలో ఉండగా వడదెబ్బకు గురయ్యారు. 108 అంబులెన్సులో తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం షేక్ నాగుల్మీరా మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం. ఇబ్రహీంపట్నం: మండుతున్న ఎండలకు తట్టుకోలేక వడదెబ్బ సోకి ఆవు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యంలో సోమవారం జరిగింది. ఇప్పటి వరకూ కొండపల్లి మునిసిపాలిటీలో ఎండవేడి గాలులకు మూడు ఆవులు చనిపోయాయి. మృతి చెందిన ఆవును కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్పై తీసుకెళ్ల్లి సమాధి కార్యక్రమం నిర్వహించారు. పశువులు వడదెబ్బకు గురైతే సకాలంలో వైద్య సేవలు అందించేందుకు టోల్ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయాలని పశు వైద్యాధికారులు సూచించారు. గన్నవరం: ఉంగుటూరుకు చెందిన షేక్ మౌలాలి(42) స్థానిక బుద్ధవరం రోడ్డులోని ఫీడ్ మిక్చర్ తయారీ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కర్మాగారం ఆవరణలో సోమవారం పనిచేస్తుండగా వడదెబ్బకు గురై మౌలాలి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి మృతి చెం దాడు. స్థానిక వెంకటేశ్వర థియేటర్ కాంప్లెక్స్లో టైలరింగ్ షాపులో పనిచేస్తున్న తాళ్లూరి విజయ్ కూడా వడదెబ్బకు గురై షాపులో మృతి చెందాడు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): అంబాపురం తోటమూల సెంటర్ వద్ద రోడ్డు మీద ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆరా తీయగా సదరు మృతుడి వివరాలు ఎవరికీ తెలియదని సమాధానమొచ్చింది. అలాగే ఎండ వేడి తాళలేక మృతి చెంది ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. దానిపై కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగ్గయ్యపేట: మండలంలోని బలుసుపాడుకు చెందిన బండ్ల శాంతమ్మ (80) ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తుంటుంది. ఎప్పటి మాదిరిగానే పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో రావటంతో వడదెబ్బ తగిలి అస్తస్థతకు గురవటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను(47) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆదివారం కూడా పొలం పనులకు వెళ్లి రాత్రికి ఇంటికి చేరాడు. దీంతో రాత్రి స్పృహ తప్పటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరులపాడు: మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన కోపూరు మోషే (70) రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా తన పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే అలసటగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపటంతో గ్రామంలోని వైద్య సేవలందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది మృతి మృతుల్లో కష్టజీవులు, యాచకులే అధికం పీఎం చేస్తేనే వడదెబ్బగా గుర్తింపు ఆస్పత్రుల్లో పీఎం చేయకుండానే పంపేస్తున్న వైనం ఉమ్మడి కృష్ణాలో మరో ఐదు రోజుల పాటు ఎండలు ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్రం 4 గంటల్లోపు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా వడగాడ్పుల ప్రభావానికి వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, మద్యం తాగిన వారు త్వరగా గురయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వడదెబ్బగా నమోదు ఎలా?వడదెబ్బకు మృతి చెందినట్లు అధికారుల లెక్కల్లోకి ఎక్కాలంటే పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ జిల్లాలో వడదెబ్బ మృతులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులకు మృతి చెందిన వారిని తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందిన వారికి కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. మరి వడదెబ్బగా ఎలా నమోదు అవుతుందో అధికారులకే తెలియాలి.


