breaking news
Krishna
-
ఎస్ఎంసీ పీజీ విద్యార్థికి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకే వేదికపై అత్యధిక మంది ఇచ్చిన కరాటే ప్రదర్శనకు గిన్నిస్ రికార్డులో స్థానం దక్కింది. ఆ ప్రదర్శన ఇచ్చిన వారిలో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగంలో పోసు్ట్రగాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్ మద్దుల దినేష్ కుమార్ గుప్తా కూడా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 1212 మందితో అతిపెద్ద కరాటే ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్లో స్థానం లభించింది. ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. సర్టిఫికెట్ అందుకున్న దినేష్కుమార్ గుప్తాను శనివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. 24 నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్లో టాలీలో శిక్షణ గన్నవరం: ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి టాలీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ ప్రతినిధి అంకమరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 60 రోజుల కాల వ్యవధి కలిగిన టాలీ కోర్సులో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫైనాన్సియల్ స్టేట్మెంట్, ఆఫీస్ అటోమేషన్ టూల్స్, తెలుగు, ఇంగ్లిష్ టైపింగ్, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్పై శిక్షణతో పాటు ఆహారం, వసతి సదుపాయాలను కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ కల్పనతో పాటు ఈ మెటీరియల్, సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. బీకాం, బీబీఏ, ఎంకామ్, ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులుగా పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం 91000 33552, 93466 07845 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు. పటమటలో చైన్ స్నాచింగ్ పటమట(విజయవాడతూర్పు): మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన ఓ గృహిణి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన ఘటన పటమట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక బాలాజీనగర్కు చెందిన కాపవరపు కుమారి ప్రతి రోజూ చైన్నె –కోల్కతా 16వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్రోడ్డులో రామలింగేశ్వరనగర్ వరకు మార్నింగ్ వాకింగ్కు వెళ్తారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా మార్నింగ్ వాకింగ్కు వెళ్లగా రామలింగేశ్వరనగర్ కట్టపై నీలవేణి రోడ్డు వద్ద కొంతమంది దుండగులు అడ్డగించి, ఆమె వద్ద ఉన్న నగలను ఇవ్వమని, లేదంటే చంపుతామని బెదిరించారు. మెడలో ఉన్న బంగారు నానుతాడు, రూపులు, మంగళసూత్రం మొత్తం కలిపి 32 గ్రాముల నగలను బలవంతంగా తనను కిందపడవేసి లాక్కెళ్లారని బాధితురాలు పటమట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్లల్లో కారం చల్లి దాడి కంకిపాడు: మద్యం దుకాణం వద్ద రెండు గ్రామాలకు చెందిన యువత మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ నెలకొంది. సేకరించిన వివరాల్లోకి వెళితే... ఈనెల 11వ తేదీ రాత్రి కంకిపాడు పట్టణంలోని గన్నవరం రోడ్డు కూడలిలో ఉన్న మద్యం దుకాణం సమీపానికి పునాదిపాడు గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువత చేరుకుని స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులపై కళ్లల్లో కారం చల్లి తీవ్రంగా దాడి చేశారు. దాడిలో కంకిపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కళ్లల్లో కారం చల్లటంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. గతంలో ఇదే వ్యక్తులు పునాదిపాడుకు చెందిన వ్యక్తిపై చేయి చేసుకోవటంతోనే ప్రతిదాడి జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరుపక్షాలు రాజీ చేసుకోవటంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. -
శాప్ పరిశీలకుడు లేకుండా నిర్వహించిన ఎన్నిక చెల్లదు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అబ్జర్వర్ (పరిశీలకుడు) లేకుండా నిర్వహించిన ఏ క్రీడా సంఘం ఎన్నికలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీ ఎన్నిక ఇటీవల తాడేపల్లిలోని ఒక క్లబ్లో శాప్ నుంచి పరిశీలకుడు హాజరు కాకుండానే ఎన్నిక నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ అంశంతో పాటుగా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పలు వ్యవహారాల గురించి ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ పత్రిక 10వ పేజీలో ‘స్వప్రయోజనాలే గురి’ పేరుతో కథనం ప్రచురితమైంది. అసోసియేషన్లో జరుగుతున్న ఈ పరిణామాలను తెలుసుకున్న షూటర్స్ పేరెంట్స్ నగరంలోని శాప్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను కలిసి వివరణ అడిగారు. శాప్ పరిశీలకుడు లేకుండా నిర్వహించిన ఎన్నిక చెల్లుతోందా, అలాంటి అసోసియేషన్ నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా, వాటికి విలువ ఉంటుందా అనే సందేహాలను తల్లిదండ్రులు శాప్ అధికారులను ప్రశ్నించారు. శాప్ కార్యాలయం సిబ్బంది స్పందించి శాప్ పరిశీలకుడు లేకుండా నిర్వహించిన ఏ ఎన్నిక చెల్లదని, అలాంటి అసోసియేషన్కు తాము గుర్తింపు కూడా ఇవ్వమని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ఈ విషయాలను వివరిస్తూ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీలోని అధ్యక్షుడికి తెలియజేస్తూ శాప్ కార్యాలయ సిబ్బంది లేఖను పంపారు. ఈ లేఖను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు కూడా పంపారు. త్వరలోనే రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందుతున్న వారి తల్లిదండ్రులు సమావేశం నిర్వహించనున్నారు. -
అసత్యాల క్యాప్చర్
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల హాజరు తగ్గుతున్నా జిల్లా విద్యాశాఖకు పట్టడంలేదు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా లోని 1,771 పాఠశాలల్లో 2,09,339 మంది విద్యార్థులకు 15,028 మంది గైర్హాజరుగా నమోదయ్యారు. 7.2 శాతం మంది బడులకు దూరంగా ఉన్నారు. హాజరు వివరాల ‘క్యాప్చర్’ 99.99 శాతంగా నమోదుచేసి జిల్లా విద్యాశాఖ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గైర్హాజరుకు దారితీస్తున్న కారణాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, విద్యార్థులు క్రమం తప్పకుండా బడులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే ప్రస్తుత గైర్హాజరు క్రమంగా దీర్ఘకాలికంగా మారి డ్రాప్అవుట్లకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ‘క్యాప్చర్’ వేరు.. అసలు హాజరు వేరు విద్యార్థుల హాజరు వివరాలను నమోదు చేయడంలో అధికారులు వంద శాతంగా చూపుతున్నా, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య అందుకు భిన్నంగా ఉంటోంది. మొత్తం విద్యార్థుల్లో 1,94,290 మందే హాజరైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే వాస్తవ హాజరు 92.8 శాతమే. 99.99 శాతం హాజరు క్యాప్చర్ ఉందని చూపడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతే స్థాయిలో ఉందన్న భావన కల్పించడం సరికాదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. పెనమలూరులో పరిస్థితి తీవ్రం మండలాల వారీగా గైర్హాజరును పరిశీలిస్తే పెనమలూరు మండలంలో అత్యధికంగా 2,026 మంది విద్యార్థులు బడికి రాలేదు. గుడివాడలో 1,668 మంది, మచిలీపట్నంలో 1,479 మంది, మచిలీపట్నం సౌత్లో 856 మంది, గన్నవ రంలో 778 మంది, కంకిపాడులో 695 మంది, బాపులపాడులో 601 మంది గైర్హాజరుగా నమోదయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకే రోజు బడికి దూరంగా ఉండ టంపై విద్యాశాఖ మండలాల వారీగా ప్రత్యే కంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. కారణాలపై ఆరా లేదు విద్యార్థులు బడికి ఎందుకు రావడం లేదన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల వలసలు, వ్యవసాయ పనులు, రవాణా ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు, చదువుపై ఆసక్తి తగ్గడం, పాఠశాల వాతావరణం వంటి కారణాల్లో ఏవి ప్రభావం చూపుతున్నాయో అధికారులు క్షేత్ర స్థాయిలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఒక రోజు గైర్హాజరును సాధారణంగా తీసుకో వచ్చు. కానీ ఇదే పరిస్థితి పదేపదే కొనసాగితే అది క్రమంగా దీర్ఘకాలిక గైర్హాజరు, చివరకు డ్రాప్ అవుట్కు దారితీసే ప్రమాదం ఉంది. ఆన్లైన్లో హాజరు నమోదు చేయడం, ‘అటెండెన్స్ క్యాప్చర్’ శాతాన్ని పెంచడం మాత్రమే విద్యాశాఖ లక్ష్యంగా మారకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గైర్హాజరు అవుతున్న ప్రతి విద్యార్థిని గుర్తించి, వారు బడికి ఎందుకు రావడం లేదో తెలుసుకుని, ఆ సమస్యను పరిష్కరించి తిరిగి పాఠశాలకు రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేకపోతే ఆన్లైన్లో 99.99 శాతం హాజరు క్యాప్చర్ అవుతున్నా, తరగతి గదుల్లో ఖాళీ బెంచీలే మిగిలే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. విద్యార్థుల హాజరుపై మండలాల వారీగా నిరంతర పర్యవేక్షణతో పాటు, డ్రాప్అవుట్కు దారితీసే కారణాలను ముందుగానే గుర్తించి నివారించే కార్యాచరణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
మార్కాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)లో 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా శనివారం రెండో రోజు లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హెచ్ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. బాలుర విభాగం లీగ్ దశలో శ్రీకాకుళం జట్టు గుంటూరు జట్టుపై, ఈస్ట్ గోదావరి జట్టు అనంతపురం జట్టుపై, కృష్ణా జట్టు కడప జట్టుపై విజయం సాధించినట్లు హెచ్ఎం తెలిపారు. విశాఖపట్నం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై, కర్నూలు జట్టు విజయనగరంపై, చిత్తూరు జట్టు తూర్పు గోదావరిపై, నెల్లూరు జట్టు కడప జట్టుపై గెలుపొందాయి. గుంటూరు జట్టు ప్రకాశంపై, అనంతపురం జట్టు కృష్ణాపై, శ్రీకాకుళం జట్టు కర్నూలుపై, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై, గుంటూరు జట్టు కృష్ణాపై, గుంటూరు జట్టు కర్నూలుపై, ఈస్ట్ గోదావరి జట్టు కృష్ణాపై, విశాఖపట్నం జట్టు విజయనగరంపై గెలుపొందాయి. బాలికల విభాగంలో.. శ్రీకాకుళం జట్టు కడపపై, అనంతపురం జట్టు కృష్ణా పై, నెల్లూరు జట్టు పశ్చిమగోదావరిపై, ఈస్ట్ గోదావరి జట్టు కర్నూలుపై, గుంటూరు జట్టు చిత్తూరుపై, విశా ఖపట్నం జట్టు కృష్ణాపై, నెల్లూరు జట్టు విజయనగరంపై, ప్రకాశం జట్టు కడపపై, అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై, శ్రీకాకుళం జట్టు చిత్తూరుపై, గుంటూరు జట్టు కర్నూలు జట్టుపై, అనంతపురం విజయనగరంపై, చిత్తూరు జట్టు కడపపై, కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై, గుంటూరు జట్టు ఈస్ట్ గోదావరిపై విజయాన్ని సాధించాయి. ఈ చాంపియన్షిప్ పోటీ లు రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ జట్టు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు మురళి పర్యవేక్షణలో జరిగాయి. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.దామోదర్రెడ్డి తెలిపారు. పీవీ కృష్ణారావు, వై.శీనయ్య, శంకర్, చెంచయ్య నాయుడు, కోటేశ్వరరావు, జాహ్నవి ప్రియ, కె.ఓబులేసు, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, 13 జిల్లాల క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు -
కృష్ణపట్నం పోర్టులో పీసీఓఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్ కుమార్ శనివారం కృష్ణపట్నం పోర్టుతో పాటు కీలక రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత పోర్టులో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే వ్యూహాలపై ఆదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్తో సమీక్షించారు. సరుకు రవాణా సమర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా ఉమ్మడి అభివృద్ధి కార్యాచరణపై చర్చలు జరిపారు. ఇటీవల చేపట్టిన ఆధునికీకరణ పనుల్లో భాగంగా పోర్టు సైలో–లోడింగ్ సదుపాయాలను మెరుగుపర్చడం, అదనంగా ఫీడింగ్ కన్వెయర్ను జోడించడం ద్వారా రెండు సైలోలు ఏకకాలంలో పనిచేసే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఒక్కొక్క నౌకలో లక్ష టన్నులకు పైగా సరుకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు మెకనైజ్డ్ బెర్త్ను పరిశీలించారు. ఈ మౌలిక సదుపాయాలు, కార్యాచరణ మెరుగుదలతో గత ఆర్థిక సంవత్సరం సాధించిన 22.7 మిలియన్ టన్నులతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం పోర్టు సమీపంలోని మనుబోలు, కృష్ణపట్నం, నిడుగుంటపాలెం, రావూర్ రైల్వేస్టేషన్లతో పాటు గూడ్స్ షెడ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సరుకు రవాణా కార్యకలాపాల కోసం ఉన్న సౌకర్యాలు, పనుల పురోగతి, సరుకు రవాణ, నిర్వహణను మెరుగుపర్చేందుకు అక్కడి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పీసీఓఎంతో పాటు సినియర్ డీఓఎం ఎ.సురేష్రెడ్డి, డీసీఎం జి.మోహన కృష్ణ పాల్గొన్నారు. -
వైద్య కళాశాలకు ఐద్వా నేత మృతదేహం దానం
తిరువూరు: అనారోగ్యంతో మృతిచెందిన మహిళా సంఘ నాయకురాలు మేకల రవికుమారి(56) మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు శనివారం మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యకళాశాలకు దానమిచ్చారు. ఈ మేరకు ఆమె భర్త, సీనియర్ న్యాయవాది, సీపీఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్ సమ్మతితో వైద్యులు రవికుమారి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, సీపీఎం రాష్ట్ర నాయకులు బీఆర్ తులసీరావు, స్థానిక నాయకులు రవికుమారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరువూరు కోర్టు న్యాయమూర్తి సింధూర, పలువురు న్యాయవాదులు రవికుమారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఆర్.వెంకట సన్యాసిరావు కుమారుడు విశ్వసాయి హవిష్ అమ్మవారి వివిధ పథకాలకు రూ.3.52 లక్షలు విరాళాలను అందజేశారు. అమ్మవారి అన్నదానానికి రూ.1.50 లక్షలు, మల్లేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి రూ.1.02 లక్షలు, అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని అందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవ్వాన శ్రీనివాసరావు, బుర్రా రాంబాయిల కుటుంబం సభ్యులు అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని, విజయవాడ కొత్తపేట కుమ్మరి వీధికి చెందిన రాంపిళ్ల పద్మజ, వెంకట రమణలు అమ్మవారి అన్నప్రసాదానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
దేవుడి పేరుతో దందాకు బ్రేక్
భవానీపురం(విజయవాడపశ్చిమ): దేవుడి పేరుతో దందా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కొందరు వ్యక్తులకు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర బ్రేక్ వేశారు. గణనాథుని అడ్డంపెట్టుకుని ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్ట్లను రద్దు చేస్తూ ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేయటం చర్చనీయాంశమైంది. విజయవాడ విద్యాధరపురంలోని లేబర్కాలనీ గ్రౌండ్లో 72 అడుగుల మట్టి మహా గణపతి విగ్రహాన్ని నెలకొల్పి వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునేందుకు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది. వాస్తవానికి లేబర్కాలనీ గ్రౌండ్లో గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాణ పనులు కుంటుపడ్డాయి. ఈ క్రమంలో స్టేడియం కోసం కేటాయించిన మైదానంలో కేవలం క్రీడలకు, వాకింగ్కు తప్ప మరే ఇతర పనులకు అనుమతులు ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన కౌన్సిల్ సప్లిమెంటరీ ఎజెండాలోని అదనపు అంశాన్ని ఆమోదించడం, తీర్మానించడం కూడా జరిగిపోయింది. అయితే కొందరు గ్రౌండ్లో ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున షెడ్లు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇది కేవలం దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకునేందుకు సన్నాహాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన వీఎంసీ లేబర్కాలనీ ఓపెన్ గ్రౌండ్లో 12 రోజుల పాటు 72 అడుగుల పర్యావరణహిత గణపతి విగ్రహం ఏర్పాటుతో పాటు నాలుగు నుంచి ఐదు ప్రదర్శన (ఎగ్జిబిషన్) రైడ్లు, కొన్ని ఫుడ్ కోర్టులను నిర్వహించుకునేందుకు డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులకు నగరపాలక సంస్థ అనుమతులు ఇచ్చింది. వాస్తవానికి ఇది కౌన్సిల్లో ఫిబ్రవరిలో జరిగిన తీర్మానానికి వ్యతిరేకం. కారణాలేమైనా తాము తొలుత ఇచ్చిన అనుమతులను తక్షణమే అమలులోకి వచ్చేలా రద్దు చేస్తూ కమిషనర్ ప్రొసీడింగ్స్ జారీ చేయడం విశేషం. 72 అడుగుల పర్యావరణహిత గణపతి విగ్రహానికి ఇచ్చిన అనుమతిని ఎట్టి పరిస్థితిలోనూ ప్రదర్శన రైడ్లు, ఫుడ్ కోర్ట్లు లేదా ఇతర వాణిజ్య లావాదేవీల అనుమతిగా పరిగణించరాదని ప్రొసీడింగ్స్లో పేర్కొన్నారు. అలాగే భారీ వర్షాలు, ప్రజా భద్రత, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులకు తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.లేబర్కాలనీ గ్రౌండ్లో ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్ట్ల అనుమతులు రద్దు -
వైభవంగా సహస్ర గళ భగవద్గీత పారాయణం
మైలవరం: మైలవరంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర గళ భగవద్గీత పారాయణ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. శ్రీ గణపతి సచ్ఛిదానందస్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ద్వారకా తిరుమల దేవస్థానాల చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ప్రోత్సాహంతో కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు వి.బాలాజీ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి 800 మంది పారాయణ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానాల వంశపారంపర్య ధర్మకర్త ఎస్వీ నివృతరావు ఆధ్వర్యంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మైలవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బయన శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ సభ్యులు జాస్తి వెంకటేశ్వరరావు, అలమూరు చంద్రశేఖరరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వినాయకుని దేవాలయం నుంచి శోభాయాత్ర జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
దంచికొట్టిన వాన పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో వాన దంచికొట్టింది. ఏకధాటిగా మూగు గంటలపాటు కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్డు నీటితో నిండి వాగులను తలపించాయి. రోడ్లపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం విజయవాడలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈదురుగాలుతో మూడు గంటలపాటు వర్షం పడింది. 70.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి వీధుల నుంచి ప్రధాన రోడ్ల వరకు వాగులను తలపించేలా ఉప్పాంగి ప్రవహించాయి. నడుములోతు నీళ్లు రోడ్లపైకి చేరటంతో నగరవాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒకవైపు రోడ్లపైకి భారీగా చేరిన వర్షపు నీరు.. మరో వైపు విరిగిపడిన చెట్ల కొమ్మలతో ఎక్కడికీ వెళ్లలేని స్థితి నెలకొంది. దీనికితోడు వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ట్రాిఫిక్ నిలిచిపోవటంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం పోలీసులకు కష్టంగా మారింది. విఫలమైన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ విజయవాడ నగరపాలక సంస్థ వర్షాలను తట్టుకునేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేసినప్పటికీ ఫలితం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, వీఎంసీ సాధారణ నిధులు, అమృత్ పథకం ద్వారా వచ్చిన రూ.30 కోట్లుతో ఆయా ప్రాంతాల్లో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణం, డ్రెయిన్లలో పూడికతీత, నూతన అవుట్ ఫాల్ డ్రెయిన్ల నిర్మాణం చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా అవి పూర్తిస్థాయిలో అమలుకాకపోవటంతో నగరంలో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. వన్టౌన్ జెండాచెట్టు సెంటర్, నిర్మలా కాన్వెంట్రోడ్డు, బెంజిసర్కిల్ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవటంతో రోడ్లపైకి చేరిన వర్షం నీటితో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. అక్కరకు రాని ఎంఆర్టీలు విజయవాడ నగరంలో ఎప్పుడు వర్షం వచ్చిన రోడ్లపై నిలిచిన నీటిని తోడేండుకు వీఎంసీ ప్రత్యేకంగా మాన్సూన్ రెస్సాన్స్ టీం (ఎంఆర్టీ)ల వ్యవస్థను అమలు చేస్తోంది. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని 286 సచివాలయాల ప్రాంతాల్లో అధికంగా నీళ్లు నిలిచే 42 ప్రాంతాలను గుర్తించారు. సచివాలయ సిబ్బంది, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం సమన్వయంతో పనిచేసే ఎంఆర్టీ బృందాలు ఆయా ప్రాంతాల్లో వాహనాలను, మోటర్లు పెట్టి నీటిని తోడాల్సి ఉంది. అయితే ఈ వ్యవస్థ నిద్రావస్థలో ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్లు 30కు పైగా ఏర్పాటు చేశారు. వీఎంసీ సాధారణ నిధులు ఒక్కో ట్యాంకర్కు రోజుకు రూ.3 వేల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ఇన్ని వాహనాలున్నా నగరంలో రోడ్లన్నీ జలమయం అవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రం పెనమలూరు: సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రమేనని కేంద్ర ప్రభుత్వ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ రామజోగారావు కాశీభట్ల అన్నారు. సిద్ధార్థ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ లా మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. విద్యార్థులు సంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ విధానం ద్వారా చట్టాల్లో వస్తున్న మార్పులను గమనించాలన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకుల పతి డాక్టర్ సూర్యప్రకాష్రావు మాట్లాడుతూ న్యాయ శాస్త్రం ప్రధాన ఉద్దేశం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రా తృత్వం వంటి రాజ్యాంగ సూత్రాలు అమలు చేయట మేనన్నారు. ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్వీడీ సిద్ధార్థ లా కాలేజీ సిద్ధార్థ యూనివర్సిటీలో విలీనమైందన్నారు. బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులతో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించామన్నారు. లా స్కూల్ డీన్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు, ప్రో ఉప కులపతి డాక్టర్ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ రవిచంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో శనివారం 22.68 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయవాడ సెంట్రల్ మండలంలో 72.3 మిల్లీమీటర్లు వర్షం పడింది. విజయవాడ నార్త్లో 69.7 మిల్లీమీటర్లు, వెస్ట్లో 65.0, ఈస్ట్లో 64.6, తిరువూరులో 37.6, ఇబ్రహీంపట్నంలో 26.4, వత్సవాయిలో 19.5, గంపలగూడెంలో 12.4, వీరులపాడులో 9.2, జి.కొండూరులో 4.0, చందర్లపాడులో 2.3, జగ్గయ్యపేటలో 1.3, నందిగామ, మైలవరంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
17న ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పారిశ్రామిక, వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నెల 17వ తేదీన కలెక్టరేట్లో ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న ఔత్సాహికులు, ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తూ వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వ సహాయం, అనుమతులు, ఇతరశాఖల నుంచి అవసరమైన సహకారం కావాల్సిన వారు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి ఎదురవుతున్న సమస్యలు కూడా సమావేశంలో వివరించవచ్చని చెప్పారు. జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని సమస్యలను చట్టపరమైన పరిధిలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్న ఇతర ప్రాంతాల వారు ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్కు హాజరుకావాలన్నారు ఇతర సమాచారం కోసం 99890 92288 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
కార్తికేయుడికి బంగారు నాగపడగ సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి కొడాలి గ్రామానికి చెందిన ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సోదరి తుమ్మల లక్ష్మీసుజాత బంగారు నాగపడగ సమర్పించారు. రూ.30 లక్షలు వెచ్చించి 220 గ్రాముల బంగారంతో నాగపడగ చేయించారు. శనివారం ఉదయం స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం దాత లక్ష్మీసుజాత కుమారులు శ్రీనివాస కిరణ్, శివతరుణ్ పేరిట బంగారు నాగపడగను ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరావు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ప్రతి రూపాయి వారి సొత్తేనని, దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్వస్తి చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభ జరిగింది. ముఖ్య అతిథి కనినిక ఘోష్ బోస్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టే హక్కు ప్రభుత్వాలకు లేదని, ఇది మోదీ, అమిత్షా సొమ్ము కాదని స్పష్టం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అసమానతలు, వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఐద్వా పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, సీనియర్ నాయకులు ఎస్.పుణ్యవతి, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో రూ.600 కోట్లతో యూజీడీ పనులుపటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో రూ.600 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచి, వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు చేపడుతున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ తెలిపారు. నిర్మలా కాన్వెంట్ సిగ్నల్స్ వద్ద జరుగుతున్న ఔట్ఫాల్ డ్రెయిన్ పూడికతీత పనులను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు డ్రెయిన్లలో పూడిక పేరుకు పోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు శనివారం నుంచి 70 యంత్రాలతో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. ఈ పర్యటనలో ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, ఇన్చార్జి కమిషనర్ ఎ.రవీంద్రరావు, వీఎంసీ చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, జోనల్ కమిషనర్ కె.షమ్మీ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలోని ఆయా ప్రాంతాల్లో వీఎంసీ కల్పించే మౌలిక వసతుల కల్పనలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమ వారం వినాయక చవితి పర్వదినం సంద ర్భంగా రద్దు చేసినట్లు వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరవాసులు తర్వాత వచ్చే సోమవారం తమ వినతులను అధికారులకు సమర్పించి పరిష్కరించుకోవచ్చని సూచించారు. -
ఫేక్ పత్రాలతో భూంఫట్!
రూ.10 కోట్ల వీఎంసీ భూమి దర్జాగా కబ్జా!సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన విలువైన భూములు కూటమి పెద్దల సహకారంతో దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. తమకు చెందిన వారి భూమిగా మార్చేందుకు అటు రెవెన్యూ–ఇటు వీఎంసీ పట్టణ ప్రణాళికపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో గద్దలా వాలిన కబ్జా రాయుళ్లు ప్రభుత్వ స్థలం కనబడితే రాత్రికిరాత్రే సర్వే నంబర్లు మార్చేసి తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించేస్తున్నారు. ఇలాంటి ఓ స్థల కబ్జా వ్యవహారమే ఇది. ఓపెన్ సైట్ను.. ప్రైవేటు స్థలంగా.. నగరం నడిబొడ్డులో ఉండే పటమట ప్రాంతంలోని లక్ష్మీపతి–అప్పారావు మున్సిపల్ పార్కు పక్కనే 582 గజాల మునిసిపల్ కార్పొరేషన్ ఓపెన్సైట్ ఉంది. దాదాపు 30 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంపై విజయవాడ కూటమి పెద్దలు కన్నేశారు. ఇంకేముంది.. క్షణాల్లో పత్రాలు సిద్ధం.. ఇదే పత్రాలు పెట్టి బ్యాంకులో రూ. 1.85కోట్లు రుణాన్ని కూడా పొందా రు. దీనిపై గతంలో వీఎంసీ కౌన్సిల్లో కూడా పెద్ద దుమారమే రేగింది. వీఎంసీ స్థలాలకు రక్షణ కరువయ్యిందని, దీన్ని పరిరక్షించాలని తీర్మానం చేసినప్పటికీ వీఎంసీ ఉన్నతాధికారి ఉదాసీనంగా ఉండ టంతో.. పట్టణ ప్రణాళిక విభాగం–రెవె న్యూ విభాగం రూ.లక్షల్లో లంచాలు తీసు కుని ఓపెన్ సైట్ను సైతం ప్రైవేటు స్థలంగా చూపుతూ పన్నులు కూడా వేసేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ. 10కోట్లు కంటే ఎక్కువగా విలువైన ఈ స్థలం వ్యవహారంలో డివిజన్ టీడీపీ స్థాయి నాయకులు, స్థానిక టీడీపీ మాజీ కార్పొరేటర్ నుంచి ఎంపీ వరకు భాగస్వాములుగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీఎంసీ రెవెన్యూ విభాగం భాగస్వామ్యం.. ఈ తతంగానికి వీఎంసీ రెవెన్యూ విభాగం పూర్తిస్థాయిలో సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి. పాత సర్వే నంబరు ప్రకారం 2025లో మార్చి నుంచి ఆస్తిపన్ను విధించారు. దీని ఆధారంగా తనకు ప్లాను మంజూరు చేయాలని వీఎంసీ ప్రణాళిక విభాగంపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. దీనికి స్థానిక ఎంపీ అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల అభ్యంతరం.. వివేకానంద కాలనీ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్థలం వ్యవహారంపై కాలనీ పెద్దలు పలు మార్లు వీఎంసీ ఉన్నతాధికారులను సంప్రదించారు. 2022 నుంచి స్థలం వ్యవహారంలో కాలనీ వాసులు ఓపెన్సైట్ కోసం పోరాడుతున్నారు. అప్పటికే స్థలంలో రేకుల షెడ్డు వేయటంతో స్థానికులు ప్రభుత్వ పెద్దల దృష్టికి, వీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థలం వీఎంసీదేనని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రణాళిక విభాగం అధికారులను కూడా ఆదేశించారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు భవన నిర్మాణ ప్లాన్ కోసం సంబంధిత వ్యక్తులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పటమట 10వ డివిజన్(ప్రస్తుతం) హైస్కూలు రోడ్డులోని వివేకానంద కాలనీలోని వీఎంసీ ఓపెన్ సైట్ 166/2లో ఉన్న 582 గజాల స్థలాన్ని పటమటకు చెందిన నల్లూరి పున్నమ్మ నుంచి భవానీపురానికి చెందిన మధుపల్లి మోహనగుప్త 1986లో కొనుగోలు చేసినట్లు దస్తావేజులు తయారు చేశారు. మధుపల్లి మోహనగుప్తా నుంచి 2022లో హైదరాబాద్కు చెందిన అరవపల్లి విజయశాంతి, నగిలి ప్రకాష్ రెడ్డి పేరుతో కొనుగోలు చేసినట్లు అదే ఏడాది జనవరిలో పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం 2025లో తాము కొనుగోలు చేసిన స్థలం తాలూక సర్వే నంబరు తప్పుగా పడిందని, సర్వే నంబరు 165/6కు బదులుగా 166/2గా నమోదయ్యిందని దీన్ని సరిచేయాలని విజయవాడ సబ్కలెక్టర్కు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకోగా ఈ ఏదాది జనవరిలో ఈ ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం సర్వే నంబరును సరిచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
కూచిపూడి నాట్యం అజరామరం
ఆర్మీ కల్నల్ డి.అగ్నిహోత్రి ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి గుడివాడ టౌన్: రాష్ట్రంలో వర్షాభావం కారణంగా పత్తిరైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి వర్షాధారిత పంట కావడంతో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సాగునీటి సౌకర్యంగానీ, విత్తన సబ్సిడీగానీ లేకపోవడంతో రైతు కష్టాలకు ఓర్చి సాగు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, ఎన్టీఆర్, మార్కాపురం తదితర జిల్లాల్లో వేలాది మంది రైతులు వర్షంపై ఆధారపడి ఈ సాగు చేస్తారని పేర్కొన్నారు. వరి తర్వాత అత్యధికంగా సాగు చేసేది పత్తి పంటేనన్నారు. జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 50 శాతం సాధారణ వర్షపాతానికి తక్కువగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. వర్షాభావంతో పంట దిగుబడి తగ్గే రైతులకు ప్రత్యేక కరువు సహాయం ప్యాకేజి ప్రకటించాలని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ అందించాలని, తీవ్రంగా దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందించాలని, కనీస మద్దతు ధర అందేలా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేతనకొండ(ఇబ్రహీంపట్నం): లారీ ఢీకొనడంతో వృద్ధురాలు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కేతనకొండలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంకసాల అక్కమ్మ(90) హుషారుగా తన పనులు తాను చేసుకుంటుంది. ప్రతిరోజూ మాదిరిగా పాలకేంద్రం వద్ద పాలు పోయించుకునేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఆమెను ఢీకొట్టింది. ఘటనలో అక్కమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్య కేసులో నిందితులకు ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు బెయిల్ తిరస్కరించారు. 2026 జూన్ 28న కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామం వద్ద శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను హత్య చేసి మోటార్ సైకిల్కు కట్టి ఉప్పుటేరులో పడేసి హత్య చేసిన ఘటన పాఠకులకు విదితమే. ఈ కేసులో నిందితులు కటికల కల్యాణ్, అబ్దుల్ఖాదర్ జిలానీలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరఫున ఎస్సీ, ఎస్టీ కోర్టు పీపీ భోగిరెడ్డి వెంకన్నబాబు వాదనలు వినిపించారు. దీంతో న్యాయమూర్తి వీరికి బెయిల్ను తిరస్కరించారు. -
‘రియల్’ దందాపై కార్పొరేషన్ కొరడా
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝుళిపించారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో అడ్డగోలుగా వేస్తున్న అక్రమ ‘లే అవుట్ల’పై ఈ నెల 9వ తేదీన సాక్షి దినపత్రికలో వెలువడిన ‘ఆయన చెబితే అంతా సక్రమమే’ అనే కథనానికి కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర స్పందించారు. అక్రమ లే అవుట్లపై విచారణ చేసి చర్యలు చేపట్టాలని సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో టౌన్ప్లానింగ్ టీపీఓ రిజ్వానా, అజిత్సింగ్నగర్ సీఐ చంద్రశేఖర్ సహకారంతో శుక్రవారం న్యూఆర్ఆర్పేటలోని అక్రమ లేఅవుట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు పోసి, ప్లాట్లు వేయడాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు. -
నిలుద్దాం.. గెలుద్దాం..
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడుదాంచిలకలపూడి(మచిలీపట్నం): చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక సత్య కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలను దీటుగా ఎదుర్కొని విజయం సాధించాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మునిసిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రక్రియకు అందరూ సమాయత్తం కావాలన్నారు. ఇందుకోసం ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించ తలపెట్టామన్నారు. అనంతరం జిల్లాలోని పార్టీ సమన్వయకర్తలు ప్రసంగించారు. తీర్మానం ఇది.. 170ఏళ్ల కాలంలో సాగునీరు విడుదల చేయకుండా రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబు ప్రభుత్వం మాత్రమేనని పేర్ని నాని అన్నారు. రైతు సంక్షేమం కోసం ఈ సమావేశంలో కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా సాగు పరిధిలో ఉన్న రైతులకు కరవు మండలంగా ప్రకటించాలని, రైతులు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పేర్ని నాని తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి సమావేశంలోని ప్రతి ఒక్కరూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మాజీ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకులు సింహాద్రి వికాస్, మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, పలువురు పార్టీ రాష్ట్ర కమిటీ, విభాగం నాయకులు, జిల్లా కమిటీ, అనుబంధ విభాగం నాయకులు, మండల పార్టీ కమిటీ, అనుబంధ విభాగం నాయకులు, మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. -
ఐద్వా ఆల్ఇండియా కార్యదర్శి కనినిగా ఘోష్ బోస్
మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం ఆటోనగర్(విజయవాడతూర్పు): బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్న మనువాద భావజాలం, మహిళా వ్యతిరేక భావజాలం, ద్వేషప్రచారానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు ఐద్వా ఆల్ ఇండియా కార్యదర్శి కనినిగా ఘోష్ బోస్ అన్నారు. శుక్రవారం ఆటోనగర్లోని ప్రయివేట్ రెసిడెన్సీలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనినిగా ఘోష్ బోస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీజేపీకి చెందిన నాయకులు మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కావాలని, ఏదైనా సమస్యను లేవనెత్తినా, బయటకు వచ్చి పోరాడినా సమాజం మొత్తం నాశనమైపోతుందన్నట్టుగా వారు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోరాటాలు కొనసాగుతాయి.. ఐద్వా ఆలిండియా అధ్యక్షురాలు పీకే శ్రీమతి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. ఐద్వా ప్యాట్రన్ నాయకురాలు సుభాషిణి ఆలీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం విషయంలో కూడా మార్పులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి మాట్లాడుతూ మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలలో 33 శాతం రిజర్వేషన్ విషయంలో పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామన్నారు. -
అనుమానంతోనే హత్య
పటమట(విజయవాడతూర్పు): భార్యపై అనుమానంతోనే తాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యపై అనుమానం ఉందని దీనికితోడు మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కసితోనే చంపానని హత్య కేసులో నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు శుక్రవారం స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బాడింగి మండలం గదిరినేనివలస గ్రామానికి చెందిన దంపతులు మజ్జిశెట్టి, గౌరమ్మ(60) పటమట ఎలక్ట్రిసిటీ కాలనీలోని ముమ్మనేని టవర్స్లో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. మజ్జిశెట్టి.. భార్య గౌరమ్మను తరచూ అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తనకు మద్యం కోసం డబ్బులివ్వాలని అడగ్గా ఇద్దరి మద్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ మద్యం తాగొచ్చిన మజ్జిశెట్టి అపార్టుమెంట్ సెల్లార్లో నిద్రిస్తున్న గౌరమ్మను గ్రానైట్రాయితో తలపై మోది చంపి అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం ఉదయం వీఎంసీ పారిశుద్ధ్య ఉద్యోగి గౌరమ్మ రక్తపుమడుగులో ఉండటం గమనించి ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు విచారణ చేపట్టామన్నారు. తమ విచారణలో మద్యానికి డబ్బులివ్వలేదని, ఆమైపె తరచూ అనుమానంతో ఇరువురి మద్య ఘర్షణలు చోటు చేసుకునేవని ఈ నేపథ్యంలోనే గౌరమ్మను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో అదుపులోకి.. హత్య అనంతరం మజ్జిశెట్టిని పటమటలోని ఓ ప్రైవేటు బార్వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి సుమారు 100కు పైగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గంటలోపే పట్టుకున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.పోలీసుల విచారణలో అంగీకరించిన మజ్జిశెట్టి -
కొడుకు తప్పుకు ఐఏఎస్లను తలంటుతావా..!
వైఎస్సార్ సీపీ కృష్ణా అధ్యక్షుడు పేర్ని నాని చిలకలపూడి(మచిలీపట్నం): డీఎస్సీ అక్రమాలు, తప్పుడు నిర్ణయాల పాపాలను ఐఏఎస్ అధికారుల పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు చంద్రబాబు తప్పుడు ఆలోచనలపై అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల సన్నద్ధ సమావేశం శుక్రవారం మచిలీపట్నంలో జరిగింది. సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, డీఎస్సీ అంశం, కలెక్టర్ల సమావేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం చేసే తప్పులు, అవినీతి, పాపాలను సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి నాళ్లలోనే కలెక్టర్లతో సమావేశం పెట్టి పొలిటికల్ గవర్నెన్స్ చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. తనే స్వయంగా తప్పుడు జీవోలు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఇవాళ అధికారులను నిలదీయటం దారుణమన్నారు. తన కొడుకు మంచోడు, ఉద్యోగాలను అమ్ముకున్న వారు మంచోళ్లంటూ.. ఐఏఎస్ అధికారులు మాత్రమే చెడ్డవారంటూ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. మిమ్మల్ని నమ్మి పెత్తనం అప్పగిస్తే తలంతా గొరిగారంటూ ఐఏఎస్లను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో జరిగిన తప్పుల నిందను అధికారులపై మోపుతున్నారని, ఆయన తప్పుడు ఆలోచనలకు అధికారులు బలికా వద్దని, జాగ్రత్తగా ఉండాలని పేర్ని నాని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల్లో పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు సన్నద్ధ సమావేశం నిర్వహించామని పేర్ని నాని తెలిపారు. రెండేళ్ల పాటు ఒక కొత్త పింఛను ఇవ్వని దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ప్రజలపై కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు మోసాలను, వెన్నుపోట్లను ప్రజలకు వివరించి ప్రతి మున్సిపాల్టీని గెలిపించి వైఎస్ జగన్కు కానుకగా ఇస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు. -
జీవననాదం
అడుగుల సవ్వడే కొన్ని కళలు నేర్చుకోవచ్చు. కొన్ని కళలు సాధించవచ్చు. కానీ కొందరు కళాకారులు మాత్రం ఆ కళతోనే జీవిస్తారు. వారికి వేదిక ఒక ప్రదర్శన స్థలం కాదు.. సాధనకు ఆలయం. అలాంటి కళా తపస్వుల్లో భాగవతుల వెంకట్రామ శర్మ ఒకరు. ఆరు దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా అడుగుల సవ్వడినే జీవన నాదంగా చేసుకున్న ఆయన ప్రయాణం.. ఒక కళాకారుడి కథ మాత్రమే కాదు.. ఒక సంప్రదాయాన్ని తరతరాలకు తీసుకెళ్తున్న వారసత్వ గాథ. గురువుల చెంత మొదలైన ప్రయాణం ఒక అకాడమీ.. వేలాది మంది శిష్యులు గౌరవాలు ఎన్నో.. సాధన మాత్రం ఆగలేదు కుటుంబంలోనూ కొనసాగుతున్న నాట్య వారసత్వం నాట్య శిక్షణలో భాగవతుల -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి కె.రమేష్బాబు అన్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తమ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఏకపక్ష, వివక్షపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం అఖిల భారత సమ్మెను చేపట్టారు. అందులో భాగంగా వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఐదు రోజుల బ్యాంకింగ్ను అమలు చేయడం, ప్రభుత్వ ఏకపక్ష పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకుని, దాని అమలును నిలిపివేయడం వంటివి ప్రధాన డిమాండ్లలో ఉన్నాయన్నారు. సంఘ అధ్యక్షుడు ఎన్.సుబ్బారావు వివిధ సంఘాల నేతలు జగన్మోహన్రావు, ప్రభు కిరణ్, గణేష్, పి.ఆంజనేయులు, కె.రాధాకృష్ణ, వై. శ్రీనివాసరావు, కేవీఎస్ రవికుమార్, బి.వడయవార్లు, సందీప్, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో కంచర్ల గోపన్న వారసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భక్త రామదాసు(కంచర్ల గోపన్న) వారసులు శుక్రవారం దర్శించుకున్నారు. కంచర్ల గోపన్న పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్లోని ఐచి–నగోయాలో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరుగనున్న 20వ ఆసియా క్రీడలకు తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న యలమంచిలి శ్రీకాంత్ సాంకేతిక అధికారిగా ఎంపిక అయ్యారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నక్కల అర్జునరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో కబడ్డీ క్రీడను ప్రోత్సహించడంలోనూ, అభివృద్ధి చేయడంలోనూ విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జపాన్లో జరిగే 20వ ఆసియా క్రీడల్లో సాంకేతిక అధికారిగా వ్యవహరించే బాధ్యతను శ్రీకాంత్కు అప్పగించిందని తెలిపారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్యతో పాటుగా అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ను అభినందించారు. వన్టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెస్టారెంట్లు, ఇతర హోటళ్లపై నిర్వహించిన తనిఖీలపై ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వివరణ కోరింది. ఈ మేరకు విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 జాయింట్ కమిషనర్లను ఆయా అంశంపై నివేదికలను కోరినట్లు తెలిసింది. సాక్షి దినపత్రిక ‘తనిఖీలకూ ఉందో లెక్క!’ శీర్షికతో వార్త కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దానిపై ఆ శాఖ రాష్ట్ర కార్యాలయం స్పందించి.. ఎందుకు పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. దానిపై మూడు డివిజన్ల పరిధుల్లో రెస్టారెంట్లు, హోటల్స్పై ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు? ఎంత జరిమానాలు విధించారు? ఎంత వసూళ్లు జరిగాయనే విషయాలను తెలియజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా 2022 నుంచి ఆయా సంస్థల నుంచి రావాల్సిన బకాయి నాలుగైదు కోట్ల మేర ఉన్నట్లు సమాచారం. -
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ను చర్చకు రమ్మనడానికి లోకేష్కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. -
మహాగణపతికి 630 కేజీల బందరు లడ్డూ
మచిలీపట్నంటౌన్: మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్టించే 63 అడుగుల మహాగణపతికి ప్రసాదంగా 630 కిలోల భారీ లడ్డూ తయారు చేస్తున్నట్లు మల్లయ్య స్వీట్స్ అధినేత గౌర వెంకటేశ్వర్లు తెలిపారు. ఈడేపల్లిలోని మల్లయ్య స్వీట్స్ తయారీ కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి కోరిన మేరకు ఈ భారీ బందరు లడ్డూను అత్యంత భక్తిశ్రద్ధలతో, నాణ్యమైన పదార్థాలతో తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ లడ్డూ తయారీకి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు. లడ్డూను ఉంచేందుకు ఇత్తడి రేకుతో ప్రత్యేక పాత్ర, తరలించేందుకు ప్రత్యేక ట్రాలీని తయారు చేశామన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ నెల 12వ తేదీన వివిధ కోర్టులలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులు బకాయిలు చెల్లించాలని సంస్థ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఇప్పటికే క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులకు న్యాయసేవాధికార సంస్థల ద్వారా నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు అందుకున్న వారు కోర్టుకి హాజరుకాకుండా ముందుగానే బకాయిలు చెల్లించొచ్చని తెలిపారు. ఈ సదావకాశాన్ని క్లోజ్ చేసిన బీఎస్ఎన్ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 11వ తేదీలోపు వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించుకోవటంతో పాటు సమస్య పూర్వాపరాలు పరిశీలించిన మీదట తగిన రాయితీ పొందొచ్చని తెలి పారు. మరింత సమాచారం కోసం 0866– 2444420, 0866 –2444588, 83338 98997, 94911 19556 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ప్రయాణికులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 120 సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేశారు. విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఆర్.జి.జయసూర్య ఈ వివరాలు వెల్ల డించారు. విజయవాడ సబ్ డివిజన్లయిన విజయవాడ, ఏలూరు, గుడివాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024–2026 మధ్య కాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్లు జె.వి.రమణ, దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్ఐ ఎం.షరీఫ్, సిబ్బంది జి.ఎ.నర్సయ్య, షేక్ సూరుద్దీన్, ఎం.భాస్కర్, రాంబాబు, ఐటీ కోర్ బృంద సభ్యులు పి.శివాజి గణేష్, ఎన్. హర్షవర్ధన్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సుమారు రూ. 25 లక్షల విలువైన 120 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశామని వివరించారు. వాటిని చట్టపరమైన ప్రక్రియను పూర్తిచేసి పోగొట్టుకున్న వారికి అప్పగిస్తామన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎం.అశోక్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతేఅలీబేగ్ తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): చెఫ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం విజయవాడలో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్.కె, ఉపాధ్యక్షుడు రామకృష్ణరాజు, జనరల్ సెక్రటరీ యాదగిరి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల కంటే, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అమరావతి రీజియన్కు నూతన కమిటీని ఎంపిక చేశారు. -
మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి
చవితి పందిళ్ల నిర్వహణపై కృష్ణా జిల్లా ఎస్పీ దిశానిర్దేశంకోనేరుసెంటర్: జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేందుకు ఉత్సవ కమిటీలు, పందిళ్ల నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని అందుకు అవసరమైన ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ సూచించే నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోండి.. విగ్రహాలను మండపాల వద్దకు తీసుకువెళ్లే సమయంలో ర్యాలీలు, ఊరేగింపులు లేకుండా తీసుకువెళ్లాలని, ఆ సమయంలో జన సమీకరణ చేసి రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదని ఎస్పీ తెలిపారు. ఉత్సవ కమిటీలు https://ganeshutsav.net/ వెబ్సైట్లో తమ వివరాలు, విగ్రహం ప్రతిష్టించే ప్రదేశం, సంబంధిత పత్రాలను సమర్పించి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే స్థల యజమాని అనుమతి, పబ్లిక్ ప్రాంతాల్లో అయిదే సంబంధిత గ్రామ పంచాయతీ, నగరంలో అయితే మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ శాఖతో పాటు అవసరమైన ఇతర సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేలా బాధ్యతలను కేటాయించుకోవాలని తెలిపారు. -
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్పై కారులో మంటలు
పూర్తిగా దగ్ధమైన కారు, అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయంకృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలో బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్పై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. సమయానికి వెనకాల వస్తున్న వాహనదారుడు అప్రమత్తం చేయడంతో మెకానిక్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సేకరించిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఒక వ్యక్తి తన కారును రిపేర్ నిమిత్తం మహానాడు రోడ్డులోని అంబికా డీజిల్ వర్క్స్ మెకానిక్ షాప్నకు ఇచ్చాడు. రిపేర్ పనులు పూర్తయిన తర్వాత కారును మెకానిక్ గుడిసె అభినవ్ టెస్ట్ డ్రైవ్కు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా మంటలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో స్క్రూబ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకుని షాపునకు వెళ్లే క్రమంలో బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కి జ్యోతి కన్వెన్షన్ ఎదురుకు చేరుకోగానే కారు వెనుక భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దానిని గమనించిన ఒక ద్విచక్ర వాహనదారుడు కేకలు వేసి డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. వెంటనే డ్రైవర్ కారును ఫ్లైఓవర్పై ఆపి బయటకు దిగిపోయాడు. అతను దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారును నడుపుతున్న మెకానిక్ సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో సంభవించిన సాంకేతిక లోపం లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. -
నీళ్లున్నా.. కన్నీళ్లే..!
జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా బెట్ట పరిస్థితులు కనిపిస్తున్నాయి. జలాలతో కళకళలాడాల్సిన చెరువులు వానలు లేక, ఎత్తిపోతల పథకాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సాగు చేసిన వరిపైరు నీరు లేక ఎండుముఖం పడుతోంది. పట్టిసీమ జలాలు అందుబాటులో ఉన్నా, ఎత్తిపోతల పథకాలను అధికార పార్టీ నిర్వీర్యం చేసింది. వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యం రైతులను కష్టాల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో ఉన్న 542 సాగునీటి చెరువుల్లో 90 శాతం చెరువులు ఎండిపోవడంతో పాటు వాగుల్లో నీరు అందుబాటులో ఉన్న చోట్ల ఎత్తిపోతల పథకాలు పని చేయక మాగాణి భూములు బీడు బారుతున్నాయి. నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు జి.కొండూరు మండలంలో హెచ్.ముత్యాలంపాడు గ్రామ పరిధిలోని 15.36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, 11.95 ఎకరాల అక్కుల చెరువు, 3.81 ఎకరాల కురివిడి చెరువుకు నీరు నింపేందుకు ఇదే గ్రామం వద్ద బుడమేరుపై రూ.51.48 లక్షలతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఇక్కడే రూ.190 లక్షలతో ఆత్కూరు గ్రామం 58.35 ఎకరాల ఊర చెరువు, 33 ఎకరాల కురివిడి చెరువు, 16.80 ఎకరాల సావరాల చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 125.32 ఎకరాల వెల్లటూరు బంధు చెరువును నింపేందుకు పోలవరం కుడికాలువపై వెలగలేరు వద్ద రూ.109.10 లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడే రూ.40.57 లక్షలతో చేగిరెడ్డిపాడులో 67.53 ఎకరాల వీరయ్య చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. నీళ్లున్నా ఎత్తిపోయక.. జూలై ఎనిమిదో తేదీన పట్టిసీమ ఎత్తపోతల నుంచి పోలవరం కుడి కాలువలోకి నీరు విడుదలవగా అదే నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలోకి జలాలు ప్రవేశించాయి. పోలవరం కుడి కాలువ మీద ఉన్న వెల్లటూరు, చేగిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాల మోటార్లు పనిచేయక నీటిని తోడి చెరువులను నింపలేదు. దీంతో ఈ చెరువుల కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ చెరువుల కింద ఇప్పటికే వెద పద్ధతిలో సాగుచేస్తున్న వరిపైరు సైతం నీటి తడి అందక ఎండుముఖం పట్టింది. హెచ్.ముత్యాలంపాడు గ్రామం వద్ద బుడమేరుపై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు పోలవరం కుడి కాలువలో ప్రవహిస్తున్న పట్టిసీమ నీరు ఎగదన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఆ రెండు ఎత్తిపోతల పథకాలు నిర్వహణా లోపం కారణంగా చెరువులు వెలవెలబోతున్నాయి. ఆత్కూరు సావరాల చెరువు కింద ఇప్పటికే సాగు చేపట్టిన రైతులు నీరు లేక లబోదిబోమంటున్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ నాయ కులు, పైరు ఎండుతున్నా మోటార్లను ఆడించకుండా వేధించడం వల్లే పొలాలు నెర్రెబారుతున్నాయని రైతులు వాపోతు న్నారు. చెరువులో ఉన్న నీరు తూముల్లోకి రాకపోవడంతో ఇంజిన్లతో నీటిని సరఫరా చేసుకొని పైరును బతికిస్తున్నారు. వీటీపీఎస్ బ్యాక్ వాటర్తో నడిచే తారకరామా ఎత్తిపోతల పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఈ పథకంలోని కుడికాలువ కింద 4,820 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. -
స్వప్రయోజనాలే ‘గురి’!
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి, పతకాలు సాధించేలా చేయాల్సిన క్రీడా సంఘాలు వారి సొంత ప్రయోజనాల కోసం క్రీడాకారులతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు కూటమి ప్రభుత్వంలో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవహారం కాస్త శృతి మించిందంటూ షూటర్లు వాపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీదనే రెండు రాష్ట్రాల్లోని షూటర్లు వివిధ స్థాయిలో జరిగే టోర్నమెంట్స్కు హాజరవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన అసోసియేషన్ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్కే షూటర్లు వారి ఫీజులన్నీ(కాంపిటేషన్, మేనేజర్, మెంబర్షిప్ ఫీజులు) జమ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది మే నుంచి అకౌంట్ నంబరుతో పాటుగా రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును ‘ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా మారింది. ఈ విధంగా అకస్మాత్తుగా అసోసియేషన్ పేరు మార్చడంలో ఉన్న మతలబు ఏమిటనేది అసోసియేషన్లో ఉన్న సభ్యులకు సైతం అంతపట్టడం లేదు. పేరు మార్పుపై సభ్యులు అడిగితే స్పెల్లింగ్ మిస్టేక్ అని, పొర పాటున పడిందంటూ సంఘం నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సభ్యులు చెప్పారు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోని బ్యాలె న్స్ జీరో అయినట్లుగా ఆన్లైన్లో చూపిస్తోందని కొంత మంది సభ్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరపాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న శాప్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024లోనే శాప్ దగ్గర రెన్యూవల్ చేయించుకోవాలి. అయితే రెన్యూవల్ చేసుకోకుండానే రెండు రాష్ట్రాల నుంచి టోర్నమెంట్కు షూటర్లను పంపుతున్నా.. శాప్ ఏవిధమైన స్పందన లేకుండా చోద్యం చూస్తోంది. అదేమంటే క్రీడా సంఘాలు అన్ని తమ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ను తమకు సమర్పించి రెన్యూవల్ చేసుకోవాలని కేవలం పేపర్ ప్రకటనలు జారీ చేసి మిన్నకున్నారు. అసలు ఎన్ని క్రీడాసంఘాలకు గుర్తింపు ఉందనే పూర్తి సమాచారం ఇప్పటి వరకు శాప్ దగ్గర లేదంటే వారు పనితీరును అర్థం చేసుకోవచ్చు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన విషయం కూడా శాప్ దృష్టిలో లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఈ సంఘానికి గుర్తింపు లేదని సమాచారం. నాయకులంతా తెలంగాణలోనే.. ది రైపిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఇటీవలే తాడేపల్లిలోని ఒక క్లబ్లో జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక చాలా గోప్యంగా జరిగింది. ఈ సమావేశానికి అబ్జర్వర్ను పంపాలని శాప్కు అసోసియేషన్ నాయకులు లేఖను ఈ–మెయిల్ ద్వారా పంపారు. మీ అసోసియేషన్ పూర్తి వివరాలను పంపితే, వాటిని పరిశీలించి అప్పుడు చూస్తామంటూ శాప్ నుంచి రిప్లయ్ వచ్చింది. తీరా శాప్ నుంచి అబ్జర్వర్ లేకుండానే ఎన్నిక ప్రక్రియను అసోసియేషన్ సభ్యులు పూర్తి చేశారు. ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధితో పాటుగా తెలంగాణకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యుడిని ఈ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించి, వారి సమక్షంలో ఎన్నిక ప్రక్రియను ముగించారు. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి.లలిత్ను అధ్యక్షుడిగా, కార్యదర్శిగా రాజ్కుమార్ను ఎన్నుకున్నారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. మరి ఆంధ్రప్రదేశ్లోని షూటర్లు, కోచ్లు ట్రైనింగ్ క్యాంపుల గురించి, వారికి ఏమైనా సందేహాలు, ఇబ్బందుల గురించి అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా అంటూ క్రీడాకారులు, కోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఈట్స్ట్రీట్లో ఉన్న వెంకటేశ్వర గన్హౌస్లో జూన్ 17వ తేదీన గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో.. గుంటూరు జిల్లాకు చెందిన విజయహర్ష అనే వ్యక్తి నకిలీ అస్పైరింగ్ సర్టిఫికెట్లతో గన్లను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని వద్ద మూడు గన్లు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే అసలు విజయహర్షకు ఈ నకిలీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? దీనిలో అసోసియేషన్లోని సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? ఇలా ఎంత మందికి ఈ విధంగా అస్పైరింగ్ సర్టిఫికెట్లు ఇప్పించాడు? అనే విషయాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఇంత పెద్ద ఘటనపై అసోసియేషన్ కాని, శాప్ కాని, ఒలింపిక్ అసోసియేషన్ గాని స్పందించలేదు. నకిలీ సర్టిఫికెట్లు చూపించి విజయహర్ష తిరుపతిలో శాప్లో షూటింగ్ కోచ్గా జాయిన్ అయినా విచారణ జరపలేదు. -
ఒడిశా నుంచి గంజాయి రవాణా
ముగ్గురు నిందితులు అరెస్ట్చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు యువకులు అరెస్టు చేసి వారి నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ గుణ్ణం రామకృష్ణ పేర్కొన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు మాట్లాడారు. ఇస్లాంపేటలోని దళాయి వారి వీధిలో పాడుపడిన బిల్డింగ్ వద్ద ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిపై పోలీసులకు సమాచారం రావడంతో సీఐ, ఇతర పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఇస్లాంపేటకు చెందిన షేక్ అస్ఘర్(21), ఆటోనగర్లో పని చేసే షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్(20)కు, రామరాజ్యనగర్కు చెందిన ఆటోడ్రైవర్ కట్టా ప్రసాద్లకు పరిచయం ఉంది. కట్టా ప్రసాద్ భవానీపురంలో 2020లో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికుడిని బెదిరించి డబ్బులు లాక్కున్న కేసులో నిందితుడు. ఈ క్రమంలో ముగ్గురు గంజాయికి అలవాటు పడ్డారు. రైలులో ఒడిశాలోని రాయగడకు వెళ్లి మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత వినియోగించుకున్న తర్వాత మిగిలిన దానిని పంచుకునేందుకు పాడుబడ్డ బిల్డింగ్ వద్దకు వచ్చారు. అక్కడ అనుమానాస్పదంగా పోలీసుల కంట పడటంతో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట సీఐ కొండలరావు, స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ
డీఎస్ఎంఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి ఆలీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మనువాద, మతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తోందని డీఎస్ఎఎం జాతీయ ఉపాధ్యక్షులు సుభాషిణి ఆలీ విమర్శించారు. కుల, లింగ వివక్షలను కొనసాగించడమే బీజేపీ పాలన అజెండాగా ఉందన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని పూలే అంబేడ్కర్ భవన్లో కేవీపీఎస్, అంబేడ్కర్ పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘కులం, మతం, సామాజిక న్యాయం’ అంశంపై కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన గురువారం సెమినార్ జరిగింది. సుభాషిణి ఆలీ మాట్లాడుతూ.. ఆర్థిక సమానత్వం లేకుండా సామాజిక న్యాయం, లింగ సమానత్వం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పూలే విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దళితులకు భూమి, ఇళ్లు, సామాజిక హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం, డి.రమాదేవి, నల్లప్ప, జి.క్రాంతి కుమార్, ఎం.డి.ఆనంద్ బాబు, బి.రఘురామ్, కె.క్రాంతి బాబు, తిరుపాల్, జి.రంగమ్మ, చీకటి రాజేష్, చింతల శ్రీనివాస్, టి.వెంకటేష్, ప్రాన్సిస్, చిరంజీవి, రమణ, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత మతీన్ మృతి
పెడన: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర డ్రెయినేజీ బోర్డు మాజీ డైరెక్టర్, పీసీసీ మాజీ సభ్యుడు ఎండీ మతీన్(79) బుధవారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నారు. ఈయనకు భార్య దిల్షద్బేగం, ఇద్దరు కుమార్తెలు రేష్మ, కరిష్మాలు. కుమార్తెలు ఇరువురికి కూడా వివాహాలయ్యాయి. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తూ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శ్రేయోభిలాషిని కోల్పోయా: పేర్ని నాని ఎండీ మతీన్ నుంచి తాను రాజకీయాలు కొంత మేర నేర్చుకున్నా, ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయని, కుటుంబపరంగా మంచి స్నేహితుడు, మంచి శ్రేయోభిలాషిని కోల్పోయానని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్నివెంకట్రామయ్య(నాని) అన్నారు. పెడనలోని మతీన్ గృహానికి నాని, జయసుధ దంపతులు చేరుకుని మతీన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నాయకులు బళ్ల గంగయ్య, కమాల్బేగ్, భండారు మల్లికార్జునరావు, ఎండీ ఖాజా, కోడూరు శ్రీను, వన్నెంరెడ్డి మహాంకాళరావు, దివాకర్ తదితరులున్నారు. అనంతరం సాయంత్రం జరిగిన మతీన్ అంత్యక్రియల్లో పేర్నినాని పాల్గొన్నారు. అలాగే పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, అబ్దుల్ ఖయ్యూం, కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రా నాగేశ్వరరావు, కొల్లూరి నాగభూషణం, సీహెచ్ అప్పారావు తదితరులు మతీన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆత్మహత్యల నివా రణపై అవగాహన కల్పిస్తూ విజయవాడలో గురువారం ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మెంటల్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం భారీ వర్షం పడింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 40 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం పడటంతో పలు రోడ్లు నీటమునిగాయి.కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. ఈ సీజన్లో 3,28,072 ఎకరాల్లో వరి సాగు చేశారని, 9,84,216 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యని తెలిపారు. కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,461, సాధారణ రకం రూ.2,441గా నిర్ణయించారని పేర్కొన్నారు. ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించేందుకు 312 రైతు సేవా కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పౌర సరఫరాల సిబ్బంది రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు వాట్సాప్ నంబరు 73373 59375కు హాయ్ మెసేజ్ పెడితే నేరుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు కావాల్సిన షెడ్యూలు బుకింగ్ జరుగుతుందని, ఈ అంశంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించిన వివరాలను ధాన్యం కొనుగోలు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం రవాణా చేసేందుకు గోనెసంచులు, జీపీఎస్తో అనుసంధానం చేసిన వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు కావాల్సిన బ్యాంకు గ్యారెంటీలను అక్టోబర్ 15వ తేదీలోపు సమ ర్పించాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సిబ్బందికి మండలాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ (నంబరు 82476 93551) ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు అప్పగించి ధాన్యం కొనుగోలులో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ టి.శివరామప్రసాద్, సివిల్ సప్లయీస్ డీఎం వరలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జ్యోతిరమణి, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: రెండేళ్ల క్రితం బుడమేరు సృష్టించిన బీభత్సం ఇంకా విజయవాడ ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఆ విలయంలో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యు వాత పడగా.. వేల మంది సర్వం కోల్పోయారు. ప్రజలను ఆదుకోవడంలో, ముందస్తుగా బుడమేరు వరద హెచ్చరికలను జారీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విపత్తు సంభవించిన అనంతరం బుడమేరును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది. ఆపరేషన్ బుడమేరు కాగితాలకే పరిమితమైంది. దుఃఖదాయనిగా బుడమేరు వాగు ఆక్రమణలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో బుడమేరు సహజ ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోయింది. ఒకప్పుడు వర్షపు నీటిని పంటపొలాలకు అందించడంతోపాటు సులభంగా కొల్లేరుకు తరలించిన బుడ మేరు ఇప్పుడు భారీ వర్షం కురిస్తే ప్రజల గుండెల్లో భయం పుట్టిస్తూ దుఃఖదాయనిగా మారింది. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు సుమారు 40 గ్రామాల పరిధిలో 42 కిలోమీటర్ల మేర బుడమేరు పరీవాహక ప్రాంతం ఉంది. విజయవాడలో ఈ వాగు వెడల్పు ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 120 అడుగుల వరకు ఉండేది. ఆక్రమణల కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కిపోయింది. ఒక్క విజయవాడ పరిధిలోనే 380 ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు అంచనా. 2024 ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్ చానల్కు పలు ప్రాంతాల్లో గండ్లు పడటంతో విజయవాడ నగరం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరద ముంపును చవిచూసింది. 2,400 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న చోట ఏకంగా 33 వేల క్యూసెక్కుల వరద రావడం, ప్రభుత్వం సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోవడం, డైవర్షన్ కెనాల్కు గండ్లు పడడం, చివరి క్షణాల్లో వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తివేయడంతో విజయవాడలోని 32 డివిజన్లలో సుమారు 2.62 లక్షల మంది ప్రజలు వరద ముంపులో చిక్కి విలవిల్లాడారు. డీపీఆర్ తయారీకే పరిమితం బుడమేరులో ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం స్థలం కేటాయించడం, లేనిపక్షంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం, కాలువ గట్లను పటిష్టం చేయడం, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడం వంటి పనులు చేపట్టేందుకు రూ.5,222 కోట్లతో ప్రభుత్వం డీపీఆర్ రూపొందించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్ల తర్వాత కూడా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. బలహీనమైన గట్లు, 2,400 క్యూసెక్కుల సామర్థ్యంతో 70 ఏళ్ల క్రితం నిర్మించిన వెలగలేరు రెగ్యులేటర్, గండిపడిన ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తికాని పనులే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి బుడమేరుకు వరద వస్తే నష్టం మరింత భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్లో బుడమేరు ఆక్రమణలకు గురికాకుండా చూడటం, విజయవాడ నగరంతోపాటు ఎ.కొండూరు నుంచి కొల్లేరు వరకు పరీవాహక ప్రాంత గ్రామాలు, రైతులు, ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2024లో బుడమేరుకు భారీ వరద వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.5,222 కోట్లతో ఆపరేషన్ బుడమేరు అంటూ ప్రకటించింది. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేపట్టి వదిలేసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరులో కలిసే వరకు బుడమేరులో ఆక్రమణలను తొల గించాలి. డైవర్షన్ కెనాల్ సామర్థ్యం పెంచాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే మరో సారి బుడమేరు ఉపద్రవం తప్పదు. – పటాపంచల జమలయ్య, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి బుడమేరుకు 2024 ఆగస్టులో వచ్చిన వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ వెంటనే బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఆ తరువాత పనులు చేపట్టకుండా వదిలేసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువన విజయవాడ రూరల్ ప్రాంతంలో బుడమేరు కనుమరుగైంది. ఆక్రమణలు తొలగించి వాగును పునరుద్ధరించకపోతే భవిష్యత్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. – బొర్రా నరేంద్రబాబు, రైతు, కవులూరు గ్రామం, జి.కొండూరు మండలం బుడమేరుకు వరద రాకముందు వరకు ఎకరం భూమి ధర రోడ్డు పక్కన అయితే రూ.1.5 కోట్లు, లోపల అయితే రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలికేది. ప్రస్తుతం కొనేవారే లేరు. బుడమేరు వరద వల్ల నేను ఆరు ఎకరాల్లో వరి పంట నష్టపోయాను. బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే రైతులు ధైర్యంగా సాగు చేయగలుగుతారు. – దొడ్డా విష్ణువర్ధన్రావు, రైతు, ఆత్కూరు, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది. బుడమేరు డైవర్షన్ చానల్ ప్రస్తుత సామర్థ్యం సుమారు 15 వేల క్యూసెక్కులు. దీనిని 37,555 క్యూసెక్కులకు పెంచాలనే ప్రతిపాదన వచ్చినా అమలుకు నోచలేదు. 1964లో నిర్మించిన వెలగ లేరు రెగ్యులేటర్ను ఆ తర్వాత ఆధునికీకరించలేదు. అవసరమైన చోట రిటైనింగ్ వాల్స్ నిర్మించడం, బుడమేరు ప్రవాహాన్ని విజయవాడకు దూరంగా మళ్లించేందుకు కొత్తగా కాలువ తవ్వకం, బలహీనమైన గట్లను పటిష్టం చేయడం వంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన తర్వాత కూడా వాటిలో చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. సింగ్నగర్ వంతెన సమీపంలో ఆక్రమణలు ప్రమాదకర స్థాయికి చేరాయి. కాలువలో సగం వరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. సుమారు 3,051 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంచనా. న్యూ రాజరాజేశ్వరిపేటలో బుడమేరును పూడ్చి చిన్న రేకుల ఇళ్ల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు నిర్మించారు. నగరంలో బుడమేరును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తుంటే, గ్రామాల్లో ఆక్ర మించి సాగు భూమిగా మారుస్తున్నారు. వీటి వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. విజయవాడ పరిధిలో ఏడు నుంచి పది వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉంటేనే భారీ వర్షాల సమయంలో ముంపు ముప్పు ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. -
నాణ్యమైన విద్యుత్, నిరంతర సరఫరానే లక్ష్యం
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయం సరఫరా చేయడమే లక్ష్యంగా సంస్థలోని సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి. పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ పరిధిలోని అధికారులతో సమీక్ష సమావేశం గురువారం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకురావాలని, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్లో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముంద స్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. వేగంగా డిజిటలైజేషన్.. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచు కుని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నామని, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో 1912 నంబరు ద్వారా సేవలను సమర్థంగా అందిస్తున్నామని సీఎండీ చెప్పారు. నూతన విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను కూడా 1912 ద్వారా స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏపీసీపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ యు.హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు విశ్వేశ్వర ప్రసాద్, రాజమోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి తాపీ మేసీ్త్ర మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణలంక, రణదీవె నగర్ కట్ట ప్రాంతానికి చెందిన బలుగూరి దుర్గారావు(43) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఖాళీ సమయంలో అప్పుడప్పుడు కృష్ణానదికి చేపల వేటకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పద్మావతి ఘాట్ వద్ద చేపలు పట్టడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఉదయం 10.30 గంటల సమయంలో పద్మావతి ఘాట్ రైల్వే బ్రిడ్జి పిల్లర్ నంబర్–1 వద్ద చేపలు పడుతుండగా దుర్గారావు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. అది గమనించిన తోటి మత్స్యకారులు మృతుని సోదరుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించగా వెంటనే మృతుని కుమారుడైన వెంకటేశ్వరరావుకు ఫోన్ ద్వారా విషయం తెలిపాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పద్మావతి ఘాట్ వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అపహరించిన సొత్తు స్వాధీనం జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాల గ్రామంలోని భవానీ ముక్తేశ్వేర స్వామి వారి దత్తత ఆలయం చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పూర్తి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు తెలిపారు. ఈ నెల ఆరో తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవార్లకు చెందిన 6.5 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగాం చోరీ చేశారన్నారు. సోమవారం జిల్లా ఏసీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంతో.. ఆలయంలో చోరీ జరగటానికి ముందు నంబర్ ప్లేట్ లేని కారు ఆలయం చుట్టు పక్కల సంచరించగా, ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి వచ్చి రెక్కీ చేసినట్లు సీసీ ఫుటేజీలలో గుర్తించామని తెలిపారు. దీంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల కోటయ్య అలియాస్ కోటేశ్వరరావు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన అల్లుడు కావటంతో తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లోని ఆలయాల పూర్తి సమాచారం సేకరించి పాత నేరస్తులు నాగర్కర్నూలు జిల్లా తిమ్మయ్యపల్లికి చెందిన డేరంగుల మల్లేష్, ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలానికి చెందిన కారం సాంబయ్యలతో కలిసి ఆలయంలోకి వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు కోదాడ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించి, వారి వద్ద నుంచి రూ. 15లక్షల విలువ చేసే పూర్తి చోరీ సొత్తు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. అనంతరం చోరీ కేసును ఛేదించిన జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ఎస్ఐలు రాజు, తోట సూర్య శ్రీనివాస్, శంకర్, మణికంఠ, అర్జున్లతో పాటు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానికం’లో గెలుపునకు ‘కూటమి’ అడ్డదారులు
u8లో ● అందుకే కొత్త పింఛన్లంటూ హడావుడి ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా వెళుతుంది.తిరువూరు: కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపు ఆరోపించారు. ఇప్పటి నుంచే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు అధ్యక్షతన బుధవారం జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అవినాష్ మాట్లాడారు. ఇన్నాళ్లుగా లేనిది బీసీలపై కపట ప్రేమ చూపుతూ, తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా మంజూరు చేయని కొత్త పింఛన్లకు హడావుడిగా దరఖాస్తులు స్వీకరిస్తూ నానా హంగామా చేస్తోందని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తారన్నారు. అనంతరం పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులను అవినాష్ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ అనే బుక్లెట్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, తిరువూరు పట్టణ, మండల అధ్యక్షుడు రేగళ్ల మోహనరెడ్డి, తాళ్లూరి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. -
ఏసీబీ వలలో వార్డు సచివాలయ ఉద్యోగి
● రూ.7 వేల లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ● గతంలోనూ ఆ ఉద్యోగిది అదేతీరు పటమట(విజయవాడతూర్పు): ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో పేరు చేర్చేందుకు, తనకు సంబంధం లేని డిపార్ట్మెంట్లోకి కూడా చొరబడి లబ్ధిదారుల నుంచి డబ్బులు దండుకోవటం ఆ సచివాలయ ఉద్యోగి ప్రత్యేకత. అయితే ఈ ఉద్యోగి బుధవారం లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో అర్హతా ప్రమాణాలను పరిశీలించి వారికి పథకం వర్తింప చేయటానికి ఓ సచివాలయ ఉద్యోగి లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు బుధవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. విజయవాడ పటమట రామలింగేశ్వరనగర్కు చెందిన పాండ్రాజు దుర్గారావు ఫీజు రీయింర్స్మెంట్కు దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తును పరిశీలించాలని వార్డు సచివాలయ సెక్రటరీ సాంబశివరావును పదేపదే కోరినప్పటికీ పట్టించుకోలేదు. రూ.20 వేల లంచం ఇస్తేనే చేస్తానని కరాఖండీగా చెప్పటంతో దుర్గారావు అతనితో బేరం మాట్లాడుకుని రూ.7 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం దుర్గారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం ఏసీబీ ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు, అదనపు ఎస్పీ కె.శ్రవంతిరాయ్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిఘా పెట్టి బాధితుడు లంచం ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా సాంబశివ రావును పట్టుకున్నారు. అధికారిక ఫైళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మొదటి నుంచీ అదేతీరు.. సచివాలయ వార్డు సంక్షేమ సెక్రటరీ సాంబశివ రావుకు తొలుత రాజరాజేశ్వరిపేట వార్డు సచివాలయంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ టిడ్కో ఇళ్ల వ్యవ హారంలో లబ్ధిదారులు కానివారికి ఇళ్లను ఇప్పిస్తా మని లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు తెలియటంతో అక్కడి నుంచి సర్కిల్–3 పరిధిలోని 17వ డివిజన్కు బదిలీ చేశారు. అక్కడ కృష్ణారివర్ రిటైనింగ్వాల్ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించే క్రమంలో స్థానికులను లబ్ధిదారులుగా చేర్చాలంటే భారీ మొత్తంలో డిమాండ్ చేసి వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం కూడా ఉన్నతాధికారులకు తెలియటంతో అతడిని అక్కడి నుంచి రామలింగేశ్వరనగర్ సచివాలయానికి బదిలీ చేశారు. ఇటీవలే ఓ తండ్రీ కొడుకుల నుంచి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ధ్రువీకరణకు రూ.10 వేలు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. -
నిండు ప్రాణం!
క్షణికావేశం.. ఆత్మహత్యల నివారణకు అవగాహనే మార్గంలబ్బీపేట(విజయవాడతూర్పు): ఆత్మహత్య గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి నిజంగా జీవితాన్ని ముగించాలనుకోడు. చాలాసార్లు వారు తమ బాధను, నిస్సహాయతను, ఒంటరితనాన్ని ముగించాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎదుటి వారు వారికి తీర్పు చెప్పడం కాదు.. అర్థం చేసుకోవడం అవసరం. ఒక మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ‘ఏం జరిగింది?’ కంటే ‘నీకు ఎలా అనిపిస్తోంది?’ అని అడగాలి. ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. అది కుటుంబాన్ని, స్నేహితులను, సమాజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక మానసిక ఆరోగ్య సమస్య. ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా సెప్టెంబరు 10వ తేదీని ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రజల్లో ఆత్మహత్యను ఎదుర్కోవడంపై అన్ని వర్గాల్లో అవగాహన పెంచుతున్నారు. పెరుగుతున్న ఆత్మహత్యలు.. ఇటీవల కాలంలో విద్యార్థులు, వ్యాపారులు, గృహిణిలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్రమైన ఒత్తిడి, నిరాదారణకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని చూస్తున్నాం. ఏటా ఉమ్మడి జిల్లాలో 200మందికి పైగా వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ముందుగా గుర్తించవచ్చు.. ఆత్మహత్య ఆలోచన చేసే వారిని ముందుగా గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు అకస్మాత్తుగా మౌనంగా మారడం, అందరినీ దూరం పెట్టడం.. నాకు ఇక ఏమీ అవసరం లేదు.. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. నేను లేకపోతే అందరికీ మంచిది.. వంటి మాటలు మాట్లాడటం, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం వంటి సంకేతాలను చూపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అలా ఆలోచించకు.. నీకు అన్నీ ఉన్నాయి కదా.. ఇది చిన్న సమస్య అని చెప్పడం వారి బాధను కాస్త తగ్గించవచ్చు. ఒక వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నట్లు అనిపిస్తే, వారిని ఒంటరిగా వదిలేయకుండా వెంటనే కుటుంబ సభ్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు, అత్యవసర సేవలను సంప్రదించాలి. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని టెలీమానస్ కేంద్రంలో టోల్ఫ్రీ నంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్, సంక్షోభ సమయంలో సహాయం, ప్రమాదాన్ని గుర్తించడం, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలకు రిఫర్ చేయడం వంటి సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో టెలీ–మానస్ సేవలకు స్పందన క్రమంగా పెరుగుతోంది. ఈ కేంద్రం 2022లో ఏర్పాటు కాగా, ఆ ఏడాది 523 కాల్స్ రాగా 2023లో 18వేలు, 2024లో 20వేలు, 2025లో 17వేలు, 2026లో ఇప్పటివరకు 31వేల కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అందిన 86,529 టెలీ–మానస్ కాల్స్లో 2.16 శాతం ఆత్మహత్య ఆందోళనలకు సంబంధించినవే ఉన్నాయి. యువతలో విద్యా ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ సంబంధాల్లో సమస్యలు, కుటుంబ విభేదాలు, సోషల్ మీడియా ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వైఫల్య భయం వంటి అంశాలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. పరీక్షలో విఫలం అయితే జీవితం విఫలం కాదని తెలుసుకోవాలి. ఒక ఉద్యోగం రాకపోవడం భవిష్యత్తు ముగిసినట్లు కాదన్నది గ్రహించాలి. ఆయా సమయాల్లో ఇతరులను సహాయం కోరడం బలహీనతగా భావించవద్దు. – గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించినట్లే, మనసులో బాధ, నిరాశ, ఆందోళన ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక వైద్యులను సంప్రదించడం ఆరోగ్యకరమైన నిర్ణయం. సమయానికి ఇచ్చే కౌన్సెలింగ్, మానసిక చికిత్స తీసుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యను సమర్థంగా నిర్వహించవచ్చు. ఆత్మహత్య నివారణ ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ, కార్యాలయం, ప్రతి స్నేహితుడు భాగస్వామి కావాలి. – డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు -
గురువే.. బరువా?
కృష్ణాజిల్లాగురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● మూడేళ్లుగా జిల్లాలో గురుపూజోత్సవం నిర్వహించని విద్యాశాఖ ● పురస్కారాలు అందుకోవటానికి ఎదురు చూస్తున్న గురువులు ● నిధులు లేక గురుపూజోత్సవాన్ని నిర్వహించటం లేదని ప్రచారం ● ఇది తమను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం ● బతికి సాధించాలంటున్న మానసిక నిపుణులు ● సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదని సూచన ● ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే చాలంటూ వివరణ ● నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కృష్ణలంక(విజయవాడతూర్పు): ఓ హెడ్ కానిస్టేబుల్ కనిపించకుండా పోయిన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు 14వ బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం ఎ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్గా హెడ్ కానిస్టేబుల్ ఆర్.మధుబాబు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఈ నెల 6వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో మరో సిబ్బంది సుధాకర్ గౌడ్తో కలిసి భోజనం చేయడానికి నగరంలోని ఓల్డ్ క్వార్టర్స్, మెస్ డార్మెటరీకి బైక్పై వెళ్లాడు. భోజనం అనంతరం ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిన మధుబాబు తిరిగిరాలేదు. 7వ తేదీ ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉన్నా హాజరు కాలేదు. సెల్ఫోన్కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతని సొంత ఊరిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆయన భార్య వసుంధర కూడా మధుబాబు ఇంటికి రాలేదని స్పష్టం చేశారు. మధుబాబు కనిపించడం లేదని ఆర్ఎస్ఐ కె.వెంకటేశ్వర్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏటా ఉపాధ్యాయ దినోత్సవం రోజున జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో ఎంపికై న గురువులు సత్కారాన్ని పొందటం పరిపాటి. కానీ ఎన్టీఆర్ జిల్లా మాత్రం అందుకు విరుద్ధం. జిల్లాలో ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కూటమి ప్రభుత్వం అందించటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లలో మూడు సార్లు ఉపాధ్యాయ దినోత్సవాలు వచ్చాయి. కానీ ఒక్క ఏడాది కూడా జిల్లా విద్యాశాఖ ఈ జిల్లాలో వేడుకలు నిర్వహించలేదు. అలాగే జిల్లా స్థాయిలో పురస్కారాలను ప్రదానం చేయలేదు. ఇది ముమ్మాటికీ గురువులను అవమానించటమేనంటూ వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ఎదురుచూపులు.. రాష్ట్రంలో 2024 మే మాసంలో ఎన్నికలు జరిగాయి. జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ తరువాత 2024, 2025, తాజాగా 2026 సెప్టెంబర్ ఐదో తేదీ మొత్తం మూడు సార్లు నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగలేదు. ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేసి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. కనీసం పదేళ్ల అనుభవం కలిగిన సర్కార్ బడుల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఎటువంటి క్రిమినల్ కేసులు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. కానీ ఉపాధ్యాయ దినోత్సవ తేదీ దాటి ఐదు రోజులైనా ఇప్పటి వరకూ దాని ఊసు ఎత్తకపోవటంపై ఈ ఏడాది సైతం ఉపాధ్యాయ దినోత్సవం జరగదనే నిర్ణయానికి ఉపాధ్యాయులు వచ్చినట్లు సమాచారం. నిధులు లేవంటూ వంకలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ జిల్లాలోని పాఠశాలల అభ్యున్నతికి ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఉపాధ్యాయలు చెబుతున్నారు. దానివల్ల విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని మార్లు ప్రతిపాదనలు పంపినా కూటమి ప్రభుత్వం స్పందించటం లేదు. ఆఖరికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించటానికి సైతం నిధులు లేక కార్యక్రమాన్ని నిర్వహించటం లేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువులను గౌరవించే కార్యక్రమాన్ని సైతం నిధుల కొరతతో నిలుపుదల చేయటం తమను అవమానించటమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు సైతం ముందుకు రావడం లేదు.. ఈ ఏడాది సెప్టెంబర్ ఐదో తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పత్రికా ముఖంగా ప్రకటన చేశారు. వివిధ కేటగిరీల్లో సుమారుగా 50 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తారు. జిల్లా విద్యాశాఖ రెండు సార్లు ప్రకటన చేసినా ఇప్పటి వరకూ పట్టుమని 25 మంది సైతం దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. గత సంవత్సరాలు అంతకు లోపే దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. జిల్లా విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఉపాధ్యాయులు సైతం ముందు కు రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలోని వైద్య కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని ఆపరేషన్ థియేటర్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఆత్మహత్యతో ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. ఎన్టీఆర్ జిల్లాలో వివిధ యజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,451 కొనసాగుతున్నాయి. అందులో 942 ప్రభుత్వ యాజమాన్య పరిధి అయిన ప్రభుత్వం, జెడ్పీ, మునిసిపల్, ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 5,091 మంది వివిధ క్యాడర్లలో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏటా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజైన సెప్టెంబర్ ఐదో తేదీన జరిగే గురుపూజోత్సవం రోజున జిల్లాలోని ఎంపికై న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించాలి. కానీ ఈ సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో పూర్తిగా పక్కన పెట్టింది. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గడచిన మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు బుధవారం ముగిశాయి.కారణాలు ఏమైనా 2024 నుంచి జిల్లాలో గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. ప్రతి ఉపాధ్యాయుడు ఎదురు చూసే ఉత్సవం ఇది. ఒక వేళ రాష్ట్ర స్థాయి వేడుకలు ఇక్కడ జరిగితే ముందో, వెనుక ఒక తేదీన నిర్వహిస్తే బాగుంటుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది నిర్వహిస్తామని చెప్పి సమావేశాన్ని సైతం నిర్వహించారు. కానీ ఎందుకనో ఇప్పటి వరకూ చర్యలు చేపట్టిన దాఖలాలు కనపడటటం లేదు. – ఎ. సుందరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట
● డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ● కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(సీ4) ప్రారంభంకృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (సీ4)ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ 3వ అంతస్తులో కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రాన్ని బుధవారం ఆయన పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. త్వరలో సైబర్ గార్డ్ పాలసీ.. ఈ సందర్భంగా డీజీపీ హరీష్కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ మాదిరిగానే సైబర్ కేసులు తీవ్రంగా ఉన్నాయన్నారు. సీఎం చంద్ర బాబు దిశానిర్దేశంతో ఇప్పటికే డ్రగ్స్ను నియంత్రణలోకి తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా సైబర్ కేసులు నియంత్రించడానికి త్వరలోనే రాష్ట్రంలో సైబర్ గార్డ్ పాలసీని తీసుకురావడంతో పాటు రాష్ట్రస్థాయిలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు 20 మంది సైబర్ కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేగంగా న్యాయం.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సీ4 ద్వారా ఫిర్యాదు నుంచి నిందితుల ఆనవాళ్ల వరకు ప్రతి సమాచారాన్ని ఆధునిక పరిజ్ఞానంతో విశ్లేషించి బాధితులకు వేగంగా న్యాయం అందిస్తామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ప్రత్యేక సైబర్ ఎస్ఐని నియమించి వారికి ఆధునిక సాంకేతిక దర్యాప్తు పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాష్, సైబర్ క్రైమ్ డీసీపీ కె.కృష్ణ ప్రసన్న డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరా ళాలు సమర్పించారు. తాడిగడప రామానగర్కు చెందిన చిగురుపాటి శ్రీనివాసరావు, సాయిమిత్ర దంపతులు అమ్మవారి అన్నదానానికి రూ.1,01,111 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన శరధి వల్లభజోష్యుల రూ.లక్ష విరాళం సమర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెదిన పి.నాగఆదిత్య రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు, మధు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి
డీఆర్వో శ్రీధర్రెడ్డికి కేవీపీఎస్ నాయకుల వినతి చిలకలపూడి(మచిలీపట్నం): సామాజిక పింఛన్లు పొందేందుకు అవసరమైన అర్హత పత్రాలు తీసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆలస్యమవుతున్న నేపథ్యంలో దరఖాస్తు గడువు పెంచాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) కృష్ణా జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజేష్ కోరారు. ఈ మేరకు బుధవారం డీఆర్వో కె.శ్రీధర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియలో కుల ధ్రువీకరణ తదితర అర్హత పత్రాలు నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేయాలన్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం ఆలస్యమవుతున్న నేపథ్యంలో అనేక మంది అర్హులు పింఛన్లు పొందేందుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రేషన్కార్డు, ఆధార్కార్డు తదితర పత్రాలను ప్రామాణికంగా పరిగణించాలని, ఆధార్ అప్డేట్, విద్యుత్ బిల్లులు తదితర నిబంధనలతో పింఛను మంజూరు ప్రక్రియ కఠినతరం చేయటం సవరించాలన్నారు. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ అయితే ఆ వ్యక్తి కులం మారదని, అలా అయితే గతంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రేమల్లె శరత్బాబు, మిరియాల ఆనంద్బెనర్జీ, సీఐటీయూ నాయకులు బూర సుబ్రహ్మణ్యం, సీహెచ్ జయరావు పాల్గొన్నారు. -
కవర్ల నిషేధం చల్లపల్లికే పరిమితమా?
ట్రైనీ కలెక్టర్ను నిలదీసిన వ్యాపారులు చల్లపల్లి: ిసంగిల్ యూజ్డ్ ప్లాస్లిక్ కవర్ల నిషేధంపై పలువురు వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. ట్రైనీ కలెక్టర్ బి.నిఖిల బుధవారం చల్లపల్లిలోని పలు షాపులను తనిఖీ చేసేందుకు స్థానిక పంచా యతీ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చారు. షాపులను తనిఖీలు చేస్తున్న క్రమంలో పలువురు వ్యాపారులు ఆమె వద్దకు వచ్చి, కేవలం చల్లపల్లిలోనే సింగిల్ యూజ్డ్ ప్లాస్లిక్ కవర్లను నిషేధించటం సరికాదన్నారు. దీనిని అన్ని ప్రాంతాలకు వర్తింపజేయాలని సూచించారు. కేవలం ఒక వర్గాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టేలా తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా దాడులు చేయటం అన్యాయమన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ తనిఖీలు చేస్తున్నట్లు ట్రైనీ కలెక్టర్ నిఖిల స్పష్టంచేశారు. వ్యాపారుల సూచనల మేరకు మూడు వారాల గడువు ఇచ్చిన తరువాతే నిషేధం అమలు చేశామని గుర్తుచేశారు. టీడీపీ నాయకుల అత్యుత్సాహం ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని ప్రజలు స్వాగతించారు. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి చేతి సంచులను వెంట తెచ్చుకోవడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే వ్యాపారులు ట్రైనీ కలెక్టర్ను నిలదీసిన సమయంలో అప్పటికే సమాచారం అందుకుని రెడీగా ఉన్నట్లుగా పలువురు టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి వ్యాపారులకు మద్దతుగా మాట్లాడటంపై విమర్శలు వచ్చాయి. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీడలు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకూ జరిగిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని బుధవారం సీపీ రాజశేఖరబాబు అభినందించారు. ఈ సంద ర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తి గతంగా కలిసి వారి పతకాలను, ప్రశంసా పత్రాలను పరిశీలించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది క్రీడా పోటీల్లో పాల్గొని గొప్ప ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో వివిధ విభాగాల్లో 74 పతకాలు సాధించి జిల్లా పోలీస్ కమిషనరేట్ పేరును నిలబెట్టిన ప్రతి క్రీడాకారునికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఇతర డీసీపీలు కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి, కె.కృష్ణప్రసన్న, సత్యనారాయణ, ఏడీసీపీ ఎన్.వి.రమణ, ప్రేమ్కుమార్, ఆర్ఐలు శ్రీనివాస్ శ్రీకాంత్, సుధాకర్రెడ్డి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు -
వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలి
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు. మచిలీపట్నం రూరల్ మండలంలోని ఓ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ కమిటీని నియమించకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు రెండున్నరేళ్ల క్రితమే ఐఆర్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఏపీలో మాత్రం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ చైర్మన్ మన్మోహన్సింగ్ కమిటీలో చేరకుండానే రాజీనామా చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త కమిటీని నియమించకపోవడం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. వెంటనే కాలపరిమితి (టైమ్ బౌండ్)తో కూడిన పీఆర్సీ కమిటీని నియమించి, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు సరెండర్ లీవ్ నగదును పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేవలం 2022 సంవత్సరానికి మాత్రమే సరెండర్ లీవ్ నగదు చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న సరెండర్ లీవ్ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వి.కృష్ణమూర్తి, మచిలీపట్నం రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. సుబ్రహ్మణ్యేశ్వరరావు, జె.రాజు పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు -
డ్వాక్రా నిధులు గోల్మాల్
● భారీగా సొమ్ము స్వాహా ● విచారణకు ఆదేశించిన పీడీ పెనమలూరు: మండలంలోని వెలుగు కార్యాలయం అవినీతి, అక్రమాలతో ప్రకంపనలు సృష్టి స్తోంది. డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన సొమ్మును అవినీతి తిమింగిలాలు స్వాహా చేశాయి. దీంతో డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ వ్యవహారం బయటకు రావటంతో డీఎర్డీఏ పీడీ విచారణకు ఆదేశించారు. పెనమలూరు మండలంలో డ్వాక్రా సంఘాలలో సభ్యులు పొదుపు చేసిన సొమ్ము రూ.కోట్లలో గల్లంతైంది. దీని వెనుక ఏపీఎం, వీఓఏలు, డ్వాక్రా లీడర్లు, బుక్ కీపర్ల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు, అలాగే సీ్త్ర నిధి నుంచి పొందిన రుణాలు తీసుకుని తిరిగి సకాలంలో సంఘ లీడర్ల ద్వారా చెల్లించారు. అయితే వీఓఏలు, బుక్కీపర్లు, సీసీలు, ఏపీఎం నిర్లక్ష్యం కారణంగా ఆ సొమ్ము గల్లంతైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వెలుగు కార్యాయలంలో కొద్ది కాలంగా అవినీతి రాజ్యమేలుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఆడిట్ రిపోర్టులను తుంగలోకి తొక్కి నిధులు స్వాహా చేశారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు రూ.3 కోట్ల వరకు పొదుపు నిధులు గల్లంతయ్యాయన్న ప్రచారం జరుగు తోంది. ఎంత సొమ్మును అక్రమార్కులు దోచేశారన్న విషయమై అధికారులు నోరుమెద పటం లేదు. పేద మహిళలు పొదుపు చేసుకున్న సొమ్ముకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని బాధిత మహిళలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై బడానేత వద్ద పంచా యితీ జరుగుతోందని సమాచారం. గతంలో కూడా నిర్లక్ష్యం పెనమలూరు వెలుగు కార్యలయంలో గతంలో కూడా నిధులు గోల్మాల్ చేసినా అధికారులు వ్యవహారాన్ని నీరుకార్చారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. గతంలో డ్వాక్రా నిధుల్లో రూ.43 లక్షలను పూర్వ వీఓఏ సునీతారాణి స్వాహా చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె వద్ద నిధులు రికవరీ చేయలేదు. విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేశారు. చివరకు గత జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినా ఆమె వద్ద నయాపైసా రికవరీ చేయలేదు. పొదుపు చేసిన మహిళలు తీవ్రంగా నష్టపోయారు. బాధ్యులైన మిగితా వారిపైనా చర్యలు తీసుకోలేదు. విచారణకు ఆదేశాలు పెనమలూరు వెలుగు కార్యాలయంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కృష్ణా డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ను వివరణ కోరగా విచారణకు ఆదేశించానని తెలిపారు. డీపీఎం, ఏపీఎంలు విచారణ చేస్తారని పేర్కొన్నారు. నివేదిక వారం రోజుల్లో అందే అవకాశం ఉందన్నారు. నిధులు స్వాహా జరిగితే అందరు బాధ్యత వహించాల్సి ఉంటుందని, తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. -
‘రైజ్’కు జాతీయ స్థాయి గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామీణ మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తూ, పారిశ్రామిక రంగాల వైపు ప్రోత్సహించేందుకు జిల్లాలో అమలుచేస్తున్న రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్(రైజ్) కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగం, స్వయం సహాయక సంఘాల మహిళలు, భాగస్వామ్య సంస్థల సమష్టి కృషికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ నుంచి బుధవారం అధికారులతో కలిసి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ మంథన్ వెబినార్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పాల్గొన్నారు. మహిళలకు స్థిరమైన జీవనోపాఽధి నిర్మాణం అనే అంశంపై ఈ వెబినార్ను నిర్వహించారు. జిల్లాల స్థాయిలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను జాతీయ స్థాయిలో పరస్పరం పంచుకునేందుకు ‘స్కిల్ మంథన్’ను వేదికగా రూపొందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళల జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రదర్శించారు. మహిళా సాధికారత లక్ష్యంగా.. వెబినార్ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గుంటుపల్లిలోని రైజ్ కేంద్రం లక్ష్యాలను వివరించారు. నీతి ఆయోగ్, సెర్ప్ తదితర శాఖల సహకారంతో విజయవంతంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషి ఫలితమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం
నందివాడ: రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమై యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండవల్లి మండలం సింగనపూడి గ్రామ పరిధిలోని నాగభూషణపురానికి చెందిన కత్తి ప్రవీణ్ రాజు (27) పోలుకొండలోని ఓ ఆక్వా కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో పోలుకొండలోని షాప్ నుంచి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. రుద్రపాక గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డుపైకి వచ్చాయి. ఆ గేదెలను తప్పించే క్రమంలో ప్రవీణ్ రాజు బైక్తో గేదెను ఢీకొని ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మతి చెందాడు. ప్రవీణ్ రాజు సోదరుడు కత్తి పవన్ ఫిర్యాదు మేరకు నందివాడ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందివాడ: చేపల మేత కట్టేందుకు చెరువులోకి వెళ్లిన ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి నీట మునిగి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో భాస్కర్ ప్రదీప్కు చెందిన చెరువుల్లో చేపల మేత కట్టే పనుల కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలసింగ్ మాజీ (36), అతని బంధువులు బుగన మాజీ, సునదర్ మాజీ తదితరులు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలసింగ్ మాజీ, బుగున మాజీ పడవలో చేపల మేత కట్టలు తీసుకుని చెరువులో మేత కడుతుండగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఈదురుగాలులు వీచాయి. దీంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరూ చెరువులో పడిపోయారు. ఇద్దరూ ఈదుకుంటూ ఒడ్డుకు వస్తుండగా బాలసింగ్ మాజీ ఒక్కసారిగా చెరువులో మునిగిపోయాడు. చెరువుపై పనిచేస్తున్న వారు గమనించి కేకలు వేయడంతో అక్కడున్న వారు అతని కోసం గాలించారు. అయితే బాలసింగ్ మాజీ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ప్రదీప్ చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్న మాతంగి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందివాడ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడూరు: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసు వివరాలను ఎస్ఐ చాణక్య బుధవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని మందపాకల గ్రామానికి చెందిన వ్యక్తికి బందరు మండలం అరిసేపల్లె గ్రామానికి చెందిన నాగరమ్య (31)తో 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నాగరమ్య వ్యవసాయ కూలి పనులకు వెళ్లే క్రమంలో మండలంలోని పాదాలవారిపాలెం గ్రామానికి చెందిన అద్దంకి నాగరాజుతో పరిచయం ఏర్పడింది. మంగళవారం నాగరమ్య డ్వాక్రా నగదు కట్టేందుకు కోడూరు బ్యాంకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వారిని విచారించినా ఆచూకీ లభించకపోవడంతో నాగరమ్య భర్తకు అనుమానం వచ్చి పాదాలవారిపాలెం నాగరాజు ఇంటికి వెళ్లాడు. అప్పటికే నాగరమ్య మృతి చెంది మంచం మీద ఉండటం గమనించాడు. పరిచయాన్ని అడ్డు పెట్టుకుని నాగరాజు తన భార్యను ఇబ్బందులకు గురి చేయడం వల్ల మంగళవారం రాత్రి నాగరమ్య నాగరాజు ఇంటి వద్దే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఈ ఆత్మహత్యకు కారణమైన అతనిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యవర్గం ఏకగ్రీవం
మధురానగర్(విజయవాడసెంట్రల్): భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవమైంది. బీహెచ్ఆర్ఎస్ సెంట్రల్ కమిటీ హాల్లో బుధవారం భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ రాష్ట్ర బోర్డు సభ్యుడిగా విజయవాడ బాప్టిస్ట్నగర్కు చెందిన సిరివెళ్ల సంతోష్కుమార్ను, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్తిపాటి సంపత్కుమార్, ఉపాధ్యక్షుడిగా మల్లుల మోహన్కుమార్, ప్రధాన కార్యద ర్శిగా వెలితోటి డానియేలు, కో ఆర్డినేటర్గా పొలిమెట్ల జోసఫ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీహెచ్ఆర్ఎస్ నాయకులు మాట్లా డుతూ.. మానవ హక్కుల పరిరక్షణకు కమిషన్ కృషి చేస్తోందన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ జబహర్లాల్ ఓజా, జాతీయ అధ్యక్షుడు పుల్లెల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మానియేల్, ప్రధాన కార్యదర్శి జాన్ పాల్గొన్నారు. -
ఉద్యోగోన్నతుల నిలిపివేత.. ఆందోళనలో ఏఎన్ఎంలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగోన్నతులు జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయాయని ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సుమారు 50 మంది సచివాలయ గ్రేడ్–3లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు అంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత జూలై 11న సర్వీసు రిజిస్టర్లతో పాటు, మచిలీపట్నం డీఎంహెచ్ఓ కార్యాలయానికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని, మరుసటి రోజు ఆదివారం కావడంతో సర్వీస్ రిజిస్టర్లు, సంబంధిత ధ్రువ పత్రాలు సేకరించి సమర్పించడానికి సమయం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ సోమవారం జూలై 13న సుమారు 40మంది ఏఎన్ఎంలు ఎస్ఆర్లు సమర్పించినట్లు తెలిపారు. అయితే అప్పటికే ప్రభుత్వం ఉద్యోగోన్నతులపై ఫ్రీజింగ్ వచ్చిందని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్కు మాత్రమే.. మరలా ప్రభుత్వం తాత్కాలికంగా పోయిననెల ఆగస్టు చివరి తేదీ వరకు ఫ్రీజింగ్ ఎత్తివేయగా, అందులో రాష్ట్ర స్థాయి కేడర్లకు మాత్రమే మినహాయింపును ఇవ్వడంతో తమ వంటి చిన్న కేడర్లకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. అసోసియేషన్ జిల్లా నాయకుడు కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టీడీకే సాగర్, దుర్గాప్రసాద్, వీవీ సత్యనారాయణ బాబు ఉన్నారు. -
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
సాక్షి,విజయవాడ: సెంట్రల్ ఏసీపీ దామోదర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులన్నీ ఒకేలా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.బుధవారం వల్లభనేని వంశి, న్యాయవాది దేవి సత్యశ్రీలు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిశారు. సివిల్ వివాదాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఏసీపీ దామోదర్ అందులో జోక్యం చేసుకుంటున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సంబంధం లేని సివిల్ వివాదాల విషయంలో తరచూ లొకేషన్కు రావాలని తమను బెదిరిస్తున్నారని న్యాయవాది దేవి సత్యశ్రీ ఆరోపించారు.ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పోలీస్ కమిషనర్ను కలిసిన ఆమె.. సివిల్ వివాదాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటున్న ఏసీపీ దామోదర్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
అసౌకర్యాల శిక్షణ
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026మచిలీపట్నంఅర్బన్: స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించాల్సిన అధికారులు అందుకు తగిన కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఏడాదికి ఒకసారి ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతుండటం విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పీఎం శ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ అందిస్తోంది. అయితే ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇదే తరహా శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా తగిన చర్యలు లేవు. అయితే ప్రభుత్వం నిధులివ్వకపోయినా విద్యార్థులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు రూ.4,000 వసూలు చేసి శిక్షణకు పంపిస్తున్నారు. కృష్ణాజిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 32 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా 31 పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల చొప్పున గ్రాంట్ విడుదల చేసింది.ఈ ఏడాది స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణకు 26 పీఎం శ్రీ పాఠశాలలు, రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 28 పాఠశాలల నుంచి 28 మంది ఎస్కార్ట్ టీచర్లు శిక్షణకు హాజరవుతున్నారు. ఒక్కో పాఠశాల నుంచి ఎనిమిది మంది చొప్పున మొత్తం 224 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతి ఏడాది బాలబాలికలకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ నిర్వహిస్తారు. 2025–26లో విడుదలైన గ్రాంట్లో భాగంగా ఏప్రిల్లో బాలికలకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం బాలురకు శిక్షణ కొనసాగుతోంది. మంగళవారం రెండో రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి. ప్యాట్రోల్ లీడర్ ట్రైనింగ్, ప్రవేశ్ నుంచి ద్వితీయ సోపాన్ వరకు శిక్షణ. ఇందులో 112 మంది విద్యార్థులు ప్యాట్రోల్ లీడర్ ట్రైనింగ్లో, మరో 112 మంది ప్రవేశ్ నుంచి ద్వితీయ సోపాన్ శిక్షణలో పాల్గొంటున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు వచ్చిన విద్యార్థులకు ఇచ్చిన వసతి గృహంలోని గది శిక్షణార్థులకు వసతికి కేటాయించిన భవనం224 మంది విద్యార్థులకు ఐదు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడం విచారకరం. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, శిక్షణకు అనువైన వాతావరణం వంటి ప్రాథమిక సదుపాయాలపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పాఠశాలలకు గ్రాంట్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆ నిధులు విద్యార్థుల ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నదీ పరిశీలించాల్సి ఉంది. విద్యార్థులకు క్రమశిక్షణ, సేవాభావం నేర్పే ఇటువంటి మంచి కార్యక్రమానికి కనీస సౌకర్యాలు లేకపోతే ఇక ఈ శిక్షణ ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జి బీఎన్వీ భాస్కరరావు, జిల్లా కార్యదర్శి పి.లలిత్ మోహన్ ఈ పరిస్థితులపై దృష్టి సారించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా విద్యార్థులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతున్నాం. శిక్షణలో భాగంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఇబ్బందులను అధిగమించేలా శిక్షణ ఉంటుంది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సేవాభావం పెంపొందించడమే శిక్షణ ప్రధాన ఉద్దేశం. – పి.లలిత్ మోహన్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి -
పింఛన్ దరఖాస్తుకు పాట్లు
కృత్తివెన్ను: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లకు ప్రారంభించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో విధించిన సవాలక్ష ఆంక్షల కారణంగా దరఖాస్తుదారులు నానా పాట్లు పడుతున్నారు. దీనికి తోడు సర్వర్ మొరాయించడంతో ఉద్యోగులు ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. గడువు మూరెడు.. లిస్ట్ బారెడు... ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు సామాజిక పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం తెర తీసింది. అందుకు అనుగుణంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియకు అవసరమైన రీతిలో సర్వర్ పని చేయడం లేదు. దీంతో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్న పని జరగడం లేదు. గడువు మూరెడు.. జాబితా బారెడుగా ఉందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. సచివాలయాల్లో సేవలేవి ? పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్, రైస్ కార్డులతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ హిస్టరీ తప్పని సరిగా పొందు పరచాల్సి ఉంది. ఇప్పటి వరకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల ద్వారా అందించే వారు. ప్రస్తుతం ఉద్యోగులంతా అర్జీల ఆన్లైన్పైనే దృష్టి సారించడం, అన్ని పనులు ఒకే కంప్యూటర్లలో చేయాల్సి రావడంతో ధ్రువీకరణ పత్రాలను మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు సచివాలయాల నుంచి మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా కొందరు మీ సేవ నిర్వాహకులు తమ వద్ద ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే బాండ్లు లేవని తిప్పి పంపేస్తున్నారు. దీంతో చాలా మంది ఏం చేయాలో తోచక ఉసురుమంటున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం గతంలో మాదిరి పింఛన్ దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల ద్వారానే అందించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో నరసింహరావును వివరణ కోరగా ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సచివాలయాల ద్వారానే వాటిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ప్రభుత్వాలు పింఛన్లను నెల నెలా తరువాత ఆరుమాసాలకొకసారి మంజూరు చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ పింఛన్లు ఇవ్వలేదు. ప్రస్తుతం వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల పేరుతో దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నారు. సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలకు మీ సేవకు పంపడం సరికాదు. దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి. – మైల రత్నకుమారి, జెడ్పీటీసీ కృత్తివెన్ను -
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి
గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వినాయక చవితి ఉత్స వాలకు ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. మండపాల్లో తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్లు, ప్లగ్లు మాత్రమే వినియోగించాలని, మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ వైరింగ్, ఇతర పనులను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు. అధిక లోడ్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగ్, రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, వర్షాల సమయంలో విద్యుత్ పరికరాలు, వైర్లు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తడిసిన విద్యుత్ పరికరాలను చేతితో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు సీఎండీ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో జాప్యం తగదు
చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై డిస్ట్రిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుతో కలిసి కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, దర్యాప్తు, చార్జ్షీట్ల దాఖలు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులు, బాధితుల సమస్యలపై చర్చించారు. కేసుల నమోదుకు, దర్యాప్తుకు, చార్జ్షీట్ల దాఖలుకు సంబంధించి నిర్దేశిత గడువులను అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు మాట్లాడుతూ బాధితుల భద్రతకు పోలీస్శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సున్నిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపడతామన్నారు. -
చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా కరువే
అవనిగడ్డ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వానలు పడవని, కరువు తాండవిస్తుందని ప్రజల్లో నమ్మకమని, ఇది మరోసారి రుజువైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాగునీరందక పంటలు ఎండిపోయి, నాట్లు వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరందించాలని కోరుతున్నా ప్రభుత్వానికి ఉలుకూ పలుకూ లేదన్నారు. పులిచింతల నుంచి 3 నుంచి 4వేలు క్యూసెక్కులు నీరు అందిస్తే కృష్ణాడెల్టాకు ఇబ్బంది ఉండదన్నారు. గతంలో ప్రాజెక్టుల్లో ఇంతకంటే తక్కువ నీటి నిల్వలు ఉన్న రోజుల్లో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీరిచ్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ను రైతులు అడుగుతుంటే ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారని, అధికార పక్షంలో ఉండి సాగునీటి కోసం డిమాండ్ చేయా ల్సింది పోయి మంత్రి నిమ్మల రామానాయుడుకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించి రైతులకు సాగునీరందించకపోతే రైతుల పక్షాన పోరుబాట పడతామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, రైతు విభాగం జిల్లా కార్యదర్శి సామర్ల రాముడు పాల్గ్గొన్నారు. -
వేసవి వరకు తాగునీటి సమస్య రాకూడదు
● నీటి వృథాను అరికట్టి లీకేజీలను నివారించాలి ● కలెక్టర్ డీకే బాలాజీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. తాగునీటి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పైప్లైన్ లీకేజీలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అరికట్టాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్వో ప్లాంట్లు నిరంతరం పనిచేసేలా చూడాలని, ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఆర్వో ప్లాంట్లను కూడా తనిఖీ చేసి నీటి నాణ్యతను పరిశీలించాలన్నారు. -
ఇబ్రహీంపట్నం పీఎస్కు యూట్యూబర్ రమా నందన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రముఖ యూట్యూబ్ చానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమా నందన మంగళవారం విచారణకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో గతంలోనే నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై కేసు నమోదు చేయ డంతో పాటు లుక్ఔట్ నోటీసును కూడా జారీ చేశారు. ఇవాళ ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్లలో మోసానికి పాల్పడరంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. విచారణకు సహకరిస్తానని 15 రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీపీలకు రమా నందన మెయిల్ చేశారు. ఇండియా వచ్చి విచారణకు సహకరిస్తానని లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను మెయిల్లో ఆమె కోరారు. లుక్ఔట్ నోటీసు తీసేయటం కుదరదని విచారణకు రావాలని చెప్పటంతో రమా నందన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం పోలీసులు 41 నోటీసులిచ్చారు. రమా నందన విచారణ పూర్తయ్యాక ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి యూకే నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరుకానున్నారు.ఇదీ చదవండి: 'డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేశ్ హస్తం' -
ఉమ్మడి జిల్లాకు పనిచేయడం అదృష్టం
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్ అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మీరు నిజమైన రైతులేనా! -
మొక్క బతికేదెట్లా
పెనుగంచిప్రోలు: ఎల్నినో ప్రభావంతో వర్షాల జాడ లేకుండా పోయింది. ఎండలు వేసవిని తలపిస్తుండటంతో మిరప మొక్కలు వడలిపోతున్నాయి. వర్షం కోసం రైతులు ఆశగా ఎదురుచూడటం తప్ప వరుణుడు ఏమాత్రం కరుణించడం లేదు. కళ్ల ముందే వేసిన మిరప మొక్కలు ఎండిపోతుండటంతో మిర్చి రైతులు, దిగుబడుల సంగతి అటుంచి చివరికి మొక్కలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు పడక, సాగర్ జలాల ఊసులేక పోవడంతో మిరప మొక్కలు చనిపోకుండా ఉండేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు ఇందుకోసం అదనంగా ఖర్చు చేస్తున్నారు. అలాగే పొలాల్లో నీటివినియోగం తగ్గించుకునేందుకు స్పింకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. 15వేల ఎకరాల్లో మిరప సాగు... గతేడాది దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా అధిక ధరలు ఉంటాయనే ఆశతో రైతులు మిరప సాగుకు సమాయత్తమయ్యారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఏటా 20 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుండగా, ఈఏడాది వర్షాలులేక సాగు ఆలస్యమైంది. ప్రస్తుతానికి సుమారుగా 15 వేల ఎకరాల్లో మిర్చిసాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అడపాదడపా పడుతున్న వర్షపు జల్లులకు రైతులు నర్సరీల నుంచి మిరప మొక్కలను తెచ్చి నాటుతున్నారు. వాటిని కాపాడుకునేందుకు పొలాల్లో కొత్తగా బోర్లు వేస్తున్నారు. పాత బావుల పూడికలు తీస్తున్నారు. బావులు ఉన్న చోట నుంచి అర కిలోమీటరు నుంచి కిలో మీటరు వరకు కూడా పైపులు ఏర్పాటు చేసుకుని మొక్కలకు నీరు అందిస్తున్నారు. నీటితడికి ఎకరానికి రూ.4 వేలు... ఇప్పటికే మిర్చి సాగుకు ఎకరానికి రైతులు రూ.50 నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టారు.నీటివసతి లేని రైతులు బావి లేదా బోరు వసతి ఉన్న రైతు దగ్గర నుంచి పొలాన్ని తడి పెట్టేందుకు ఎకరానికి రూ.4వేలు వసూలు చెల్లిస్తున్నారు. గతంతో పోలిస్తే మిర్చికి పెట్టుబడులు బాగా పెరిగాయని ఎకరానికి రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. ఈఏడాది మొదటి నుంచో పెట్టుబడులు పెరిగాయని, సాగుకాలం పూర్తయ్యేనాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో అడపాదడపా జల్లులు పడటం తప్ప పెద్ద వర్షాలు కురవటం లేదు. జులై నెలలో మిర్చి మొక్కలు నాటాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణంతో సెప్టెంబర్ నెల వచ్చినా మొక్కలు నాటుతూనే ఉన్నారు. మొక్కలు బతికించుకోవటానికి మొదటి నుంచే ట్యాంకర్లు ద్వారా నీళ్లు పెట్టాల్సి వస్తోంది. – రామారావు, రైతు, ముండ్లపాడు ఇప్పటికే ఎకరానికి రూ.60 వేలు వరకు పెట్టుబడి అయింది. ఒకో మిర్చి మొక్క రూ.1 నుంచి రూ.1.50 పైసలకు కొనుగోలు చేశాం. ఎకరానికి 13వేల మొక్కలు వరకు వేశాం. ప్రస్తుతానికి మునేరు ఎత్తిపోతల పథకం అప్పడప్పుడు ఆదుకుంటోంది. మునేరులో కూడా అడుగంటింది. స్కీం కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. – దురిశాల మురళి, రైతు, పెనుగంచిప్రోలు -
ఉరేసుకుని వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన మూలపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. జూపూడికి చెందిన జిమ్ట్రైనర్ జంగా శ్రీనివాసరావు(31)కు రెండేళ్ల కిందట మూలపాడుకు చెందిన మహిళతో వివాహమైంది. కుటుంబంలో ఇటీవల చెలరేగిన కలహాలతో అతని భార్య మూలపాడులో పుట్టింటికి వెళ్లింది. శ్రీనివాసరావు కూడా మూలపాడులో అద్దె ఇళ్లు తీసుకుని భార్యతో కలిసి ఉంటున్నాడు. మరలా వివాదం నేపథ్యంలో భార్య తరుపు బంధువులతోమాటమాట పెరగడంతో మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తెల్లారిన తర్వాత గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచామిచ్చారు. మృతుడికి భార్య, పది నెలల కుమారుడు ఉన్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
స్త్రీనిధి అవకతవకలపై విచారణకు డుమ్మా
మోపిదేవి: మండలంలోని మోపిదేవి–1 బుక్కీపర్ పరిధిలో 14స్వశక్తి సంఘాల రుణాల చెల్లింపులో చోటుచేసుకున్న అవకతవకలపై సోమవారం స్త్రీనిధి జిల్లా ఏజీఎం మునిరత్నం విచారణ చేపట్టారు. గ్రూపు సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించగా కేవలం మూడు గ్రూపుల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈసందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో సీసీ హాజరు కాలేదని, ఏపీఎం ప్రత్యేక సమావేశం నిమిత్తం మచిలీపట్నం వెళ్లినందున హాజరుకాలేదని తెలిపారు. తదుపరి సమావేశానికి స్వశక్తి సంఘాలతోపాటు సీసీ, ఏపీఎం కూడా తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. విచారణలో భాగంగా ఆయా గ్రూపుల సభ్యులు మాట్లాడుతూ తాము ప్రతి నెలా క్రమంతప్పకుండా నిర్ధేశించిన వాయిదాలను బుక్కీపర్కు చెల్లిస్తున్నామని, ఇప్పటికే పూర్తిస్థాయిలో చెల్లించామంటూ పలువురు సంఘ సభ్యులు ఏజీంఎ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు చెల్లించిన రసీదులు అందజేయాలని ఏజీఎం కోరారు. అవకతవకలపై పూర్తి వివరాలు బయటకు రావాలంటే బుక్కీపర్తోపాటు స్వశక్తి సంఘ సభ్యులు, సీసీ, ఏపీఎం విచారణకు సహకరించాలని ఏజీఎం ఆదేశించారు. జిల్లా కమిటీ సభ్యులు, బుక్కీపర్, పలు గ్రూపుల సభ్యులు పాల్గొన్నారు.ఎఫ్సీఐ ఆధ్వర్యంలో దక్షిణ భారత సాంస్కృతిక పోటీలువిజయవాడ కల్చరల్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ పోటీలకు విజయవాడ వేదికై ంది. రెండు రోజులపాటు సాగే ఈ పోటీలు విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్షిణ మండల జోనల్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సోలో, గ్రూప్ నృత్యాలను, హిందీ, తెలుగు, చిత్రగీతాలను, లఘునాటికలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మినితా లాజరస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్మినితా లాజరస్ మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించడంలో భారత ఆహార సంస్థ ముందుందన్నారు. శాఖకు సంబంధిన ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ అభినందించారు. భారత సాంస్కృతిక సంపద విలువలతోకూడుకున్నదన్నారు. వాటిని పరిరక్షించడంలో బాధ్యతగా భావించాలని సూచించారు. పోటీల సహజమని, ప్రతీ అపజయం విజయానికి తొలి మేలికొలుపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్ జీఎం విజయకుమార్యాదవ్, ప్రాంతీయ రీజయన్ జీఎం సమీర్కుమార్వర్మ పాల్గొన్నారు. -
అధునాతన విధానంతో మేలు..
ఫిజియోథెరపీలోని అధునాతన వైద్యవిధానంతో ఎంతో మేలుకలుగుతుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న నేపథ్యంలో మెడ, వెన్ను తదితర నొప్పులు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే కచ్చితంగా ఫిజియోథెరపీ ద్వారా కొన్ని పద్ధతులు అవలంభించి నివారించవచ్చు. ముందస్తు చికిత్స చేయించుకుంటే పెరాలసిస్ రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఎల్. ప్రభాకర్, ఎంపీటీ (న్యూరో), మచిలీపట్నం -
చెన్నకేశవుని ఆలయంలో చోరీ
6.50 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగారం అపహరణముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని భవానీ ముక్తేశ్వరస్వామి దత్తత ఆలయం చెన్నకేశవస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే ..ముక్తేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెన్నకేశవసామి ఆలయంలో అర్చకులుగా తూమాటి లక్ష్మీనరసింహాచార్యులు రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పూజలు చేసిన అనంతరం ఆలయానికి తాళాలు వేసి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం ఐదుగంటలకు ఆలయానికి రాగా గర్భగుడి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆలయ అధికారులు, ధర్మకర్తలకు సమాచారమందించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు తోట సూర్యశ్రీనివాస్, రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్వామి వారికి చెందిన 6.50 కేజీల వెండి కవచాలు, ఆదిలక్ష్మీ అమ్మవారికి చెందిన ఆరు గ్రాముల మంగళసూత్రాలు, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి దేవాదాయ శాఖ ఏసీ నారాయణశెట్టి చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు పరిశీలించి క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లతో వివరాలు సేకరిస్తున్నారు. దుండగులు నాలుగు రోజులుగా రెక్కీ నిర్వహించి ఆలయ సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి మాస్కులు ధరించి లోపలికి వెళ్లినట్లు తెలుస్తోందని తెలిపారు. ఆలయం ఎదుటనంబర్ ప్లేట్లేని కారు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా సమీపంలోని ముక్త్యాల కోట వద్ద నిరంతరం సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూతవేటు దూరంలో ఉన్న ఆలయంలో చోరీ జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
11 నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి 24వ కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సర్వే పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాం’ అనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా రెండు వారాల పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు అంగవైకల్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జేసీ ఎస్.ఇలక్కియ,డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ బి.భానునాయక్, డీఈఓ ఎల్.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. కోనేరుసెంటర్: అమరావతిలోని వీఐటీ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కృష్ణాజిల్లా పోలీసులు 11 బంగారు, ఏడు వెండి, రెండు కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన సిబ్బంది సోమవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడును మర్యాదపూర్వకంగా కలువగా, ఆయన వారిని ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విఽధులతోపాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గర్వకారణమన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. ఎస్పీని కలిసిన వారి లో కంకిపాడు సీఐ బీబీ రవికుమార్, డీసీఆర్బీ సీఐ కె.లక్ష్మణ్రెడ్డి, పీసీఆర్హెచ్సీ సీహెచ్ రామ్మో హనరావు, ఇనగుదురుపేట ఉమెన్ హెచ్సీ ఆర్.నాగసరస్వతి, గుడివాడ వన్టౌన్ పీసీపీ రామచంద్రరావు, తోట్లవల్లూరు పీఎస్ పీసీ పి.రామ్శివ, ఆత్కూరు పీఎస్ పీసీ ఎస్.నరేష్కుమార్, పెనమలూరు సిసిఎస్ పీసీ ఎం. సాయికిరణ్ ఉన్నారు. మచిలీపట్నం అర్బన్: అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లి, జిల్లాలో నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం–2026ను పురస్కరించుకుని సెప్టెంబర్ ఒకటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అక్షరాస్యత పక్షోత్సవాల్లో భాగంగా రూపొందించిన పోస్టర్ను ఆయన సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకులు ఎండీ హాజీబేగ్ మాట్లాడుతూ ప్రజల కోసం, భూమి కోసం, సమృద్ధి కోసం అక్షరాస్యత అనే ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ థీమ్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వన్ ఎర్త్–వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో సోమవారం సీడ్ బాల్స్తో గణేష్ ప్రతిమను రూపొందించారు. కలెక్టర్ లక్ష్మీశ సీడ్ బాల్స్తో రూపొందించిన గణేష్ ప్రతిమను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో వన్ ఎర్త్–వన్ లైఫ్ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యా ర్థులు, సంస్థ వలంటీర్లు తయారు చేసిన 2లక్షల సీడ్బాల్స్ను అందజేశారు. వన్ ఎర్త్–వన్ లైఫ్ ఫౌండర్ ఏలూరి లీలా కుమారి మాట్లాడారు. -
వ్యాధుల నుంచి విముక్తి..
గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ శ్వాసకోశ సమస్యల వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఫిజియోథెరపిస్టు సూచనలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. పక్షవాతానికి గురైన వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేయడంతో ఫిజియోథెరపీ కీలకం. అంతేకాదు పుట్టుకతో జన్యుపరమైన లోపాలతో వైకల్యాలకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం. – డాక్టర్ ఎం. ప్రభుదాస్, ఫిజియోథెరపిస్టు, విజయవాడ -
రోడ్డెక్కి.. రైతన్న రణం
అక్రమ తూముల నిర్మాణమే ఆందోళనకు కారణం నాగాయలంక: రైతాంగం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కాలువల ద్వారా అన్ని ప్రాంతాల పొలాలకు సాగునీటిని సక్రమంగా అందించడంలో నీటిపారుదల శాఖ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, స్థానిక నీటి సంఘాల పూర్తిగా వైఫల్యం చెందడంతో రైతన్నల నడుమ తలెత్తుతున్న వివాదాలు, ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలోని సెంట్రల్ చానల్ ప్రధాన కాలువ వెంట 2ఏ ఉప కాలువ(బ్రాంచి కెనాల్)వద్ద భావదేవరపల్లి, కమ్మనమోలు ఇతర దిగువ ప్రాంత రైతులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏం జరిగిందంటే.. నాగాయలంక డిస్ట్రిబ్యూటరి కమిటి పరిధిలోని 2ఏ ఉప కాలువ సమీపంలో సెంట్రల్ చానల్ కాలువ ఉత్తర గట్టుకు 5వ తేదీ అర్ధరాత్రి వేళలో ఈ బ్రాంచి కెనాల్ ఆయకట్టు రైతులు గండికొట్టి అక్రమంగా అడుగున్నర వ్యాసార్థం కలిగిన తూములు నిర్మించడంతో సెంట్రల్ చానల్ దిగువ భావదేవరపల్లి, కమ్మనమోలు నీటి సంఘాల పరిధిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో కాట్రగడ్డ సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ అక్రమ నిర్మాణం చేపట్టారని, పంటకాలువకు గండి కొట్టి, తూములతో అవతలి వైపు మురుగు కాల్వలోకి సాగనీటిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో పాటు నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్మాణానికి వినియోగించిన మిషన్, ట్రాక్టర్లను స్టేషన్లో అప్పగించారు. అధికారులతో వాగ్వాదం.. రెండు రోజులు గడిచినా అక్రమ తూములు తొలగింపు చర్యలు లేకపోవడంతో ఆగ్రహించిన దిగువ ప్రాంత రైతులు భావదేవరపల్లి మాజీ సర్పంచి మండలి ఉదయభాస్కర్ సారథ్యంలో తొలుత మర్రిపాలెంలోని నాగాయలంక ఇరిగేషన్–డీసీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయంతో బయలు దేరారు. అయితే రెండో నంబరు కాలువ వద్ద అక్రమ తూములు వేసిన చోట అధిక సంఖ్యలో రైతులు గుమిగూడటంతో ఇరిగేషన్ ఏఈ పొన్నూరు రవితేజ, డీసీ చైర్మన్ బండ్రెడ్డి చినబాబు, నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్ సిబ్బందితో చేరుకొని మాట్లాడారు. యంత్రాంగం వైఫల్యం.. మాజీ సర్పంచ్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఇరిగేషన్ యంత్రాంగం పూర్తి వైఫల్యం వల్లే రైతులు రోడ్డునపడ్డారని ఆరోపించారు. పంటకాల్వలకు సాగునీటి విడుదల విషయంలో ఆది నుంచి స్పష్టత లేదన్నారు. గండికొట్టిన వ్యక్తులు అధికార పక్షం కావడం వల్లే దిగువ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తొలగిస్తాం.. అక్రమ తూములు తొలగింపుపై ఏఈ రవితేజను ‘సాక్షి’ వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి తొలగిస్తామన్నారు. గురువారం తూములు తొలగించే చర్యలు చేపడతామని చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగిందని ఎస్ఐ రాజేష్ చెప్పారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 86 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 86 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి సమస్యలు తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ️భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 39ఫిర్యాదులు, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై ఐదు, వివిధ మోసాలపై ఐదు ఫిర్యాదులు అందాయి. అంతేకాక ️మహిళా సంబంధిత నేరాలపై ఆరు, కొట్లాటలు ఆరు, ️ దొంగతనాలపై మూడు, ఇతర సమస్యలపై 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. -
మొండి నొప్పులకు థెరపీ మంత్ర!
వైద్య రంగంలో కీలకంగా ఫిజియోథెరపీ మచిలీపట్నానికి చెందిన రాజు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏడాదిగా స్పాండిలైటిస్తో బాధపడుతున్నాడు. అనేక చోట్ల వైద్యుల సూచనలతో మందులను వాడుతున్నా ఫలితం కనిపించలేదు. ఓ స్నేహితుడు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపశమనం ఉంటుందని సలహా ఇస్తే ప్రయత్నించారు. దీంతో నెల రోజుల్లోనే ఆ నొప్పి నుంచి బయటపడ్డాడు. ఇలా అనేకమంది ఏళ్లుగా మొండి నొప్పులతో బాధ పడుతున్న వారు ఫిజియోథెరపీతో ఉపశమనం పొందుతున్న వారు ఇటీవల పెరుగుతున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు)/మచిలీపట్నంటౌన్: వైద్య రంగంలో ఫిజియోథెరపీ నేడు అత్యంత కీలకంగా మారింది. మొండి నొప్పులకు థెరపీలతో ఉపశమనం కలిగించడమే కాక.. సుఖ ప్రసవం కోసం, హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం రోగుల చికిత్సలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరిగింది. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కండరాలు సాధారణ స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చేయాల్సిందే. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఫిజియోథెరపిస్టులు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు నగరంలో దాదాపు వందకు పైగా ఫిజియోథెరపీ క్లినిక్లు ఏర్పాటయ్యాయంటే దాని ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘హృదయ సంబంధ వ్యాధులు, పక్షవాతం నిర్వహణ, పునరావాసంలో ఫిజియోథెరపీ, శారీరక కార్యకలాపాల పాత్ర’ అనే నినాదంతో జరుపుకొంటున్నారు. మొండి నొప్పులకు చెక్.. వెన్నుముక నొప్పి, మెడనొప్పి వంటి వాటికి శస్త్ర చికిత్సలతో సంబంధం లేకుండా ఫిజియోథెరపిస్టులు విముక్తి కలిగిస్తున్నారు. ముఖ్యంగా మోకీలు మార్పిడి, తుంటికీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సల తర్వాత మరలా కండరాలు సాధారణ స్థితికి రావడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. బైపాస్ సర్జరీలు, ఇతర మేజర్ శస్త్ర చికిత్సలు తర్వాత కూడా ఫిజియో థెరపీ అవసరం ఉంటుంది. అంతేకాదు శ్వాసకోశ సమస్యలకు బ్రీతింగ్ వ్యాయామాలు, యోగా థెరపీలతో విముక్తి కలిగిస్తున్నారు. ఇలా వైద్య పరంగా అనేక సమస్యలకు ఫిజియోథెరపిస్టులు పరిష్కారం చూపుతున్నారు. -
గడువులోగా పింఛన్ దరఖాస్తులు స్వీకరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులకు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై సోమవారం ఎంపీడీవోలు, డీఎల్డీవోలు, మునిసిపల్ కమిషనర్లతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి దరఖాస్తుల సమర్పణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ ధ్రువీకరణ చేపట్టాలన్నారు. దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అనంతరం సాధారణ అర్హత ప్రమాణాలు, ఇప్పటికే ఉన్న పింఛనుదారుల డేటా బేస్ ఆధారంగా ధ్రువీకరణ చేపట్టాలన్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి దరఖాస్తుదారుని అర్హత, సమర్పించిన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను ధ్రువీకరించాలన్నారు. భౌతిక పరిశీలన అనంతరం ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు దరఖాస్తులోని వివరాలు, ధ్రువపత్రాలు, అర్హత ధ్రువీకరణ, పింఛనుదారుల డేటా బేస్, భౌతిక పరిశీలన నివేదిక, ఈ–కేవైసీ వివరాలను పరిశీలించి అర్హత నిర్ణయించాలన్నారు. అర్హులైన దరఖాస్తులను తదుపరి స్థాయి ఆమోదానికి సిఫార్సు చేయాలన్నారు. సెప్టెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ–కేవైసీ ధ్రువీకరణ చేపట్టాలన్నారు. 17 నుంచి 21 వరకు సాధారణ అర్హత పరిశీలన, 22 నుంచి 24 వరకు భౌతిక, శాఖా పరమైన పరిశీలన, అర్హత నిర్ధారణ చేయాలన్నారు. 25, 26 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్రతి దశను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హతకు గురైన దరఖాస్తుల వివరాలను అందుకుగల కారణాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. -
సానుకూలంగా స్పందించండి
పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ నవీన్చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో వచ్చిన అర్జీలపై సానుకూలంగా స్పందించి, పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో కె. శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ ఆవుల శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పీజీఆర్ ఎస్లో వచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించవచ్చో అధ్యయనం చేయాలన్నారు. అనంతరం శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సమస్య పరిష్కారం కాలేదని తిరిగి మరలా పీజీ ఆర్ఎస్కు రాకుండా చూడాలన్నారు. మొత్తం 102 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. ● హనుమాన్ జంక్షన్ నుంచి కలిదిండి వరకు నిర్మించిన గ్యాస్ పైప్లైన్ నిర్మాణం వల్ల తమ వ్యవసాయ భూమిని నష్టపోతున్నామని గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. తొలుత నాలుగు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల లోతులో నిర్మాణం చేస్తామని చెప్పారని, ఇప్పుడు 82 అడుగులు భూమి కావాలని ప్రతిపాదనలు పెట్టారన్నారు. దీని వల్ల 50 సెంట్లు భూమి ఉన్న రైతు 40 సెంట్లు, 10 ఎకరాల భూమి ఉన్న రైతు రెండు ఎకరాల నష్టపోతున్నారని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
రొయ్యల సాగు రైతుల ఆందోళన
పెనమలూరు: తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ రొయ్యల సాగు రైతులు పోరంకిలోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ రొయ్యల రైతుల సమైఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుగ్గినేని గోపీనాధ్ విలేకరులతో మాట్లాడారు. రొయ్యల సాగు ద్వారా దేశానికి విదేశాల నుంచి ఆదాయం సమకూరుతుండగా, రొయ్యలసాగు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని ఆందోళణ వ్యక్తం చేశారు. ఆరునెలల్లో టైగర్ రొయ్య ఫీడ్ కేజీకి రూ.26, వేనామయ ఫీడ్ కేజీకి రూ 21 పెంచారన్నారు.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలను సమీక్షించే పద్ధతిని రద్దు చేసి, ఏడాదికి ఒకసారి ధరలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పవర్ ఫ్యాక్టర్ షరతులతో సంబంధం లేకుండా రొయ్యల రైతులందరికీ యూనిట్ రూ.1.50 సబ్సిడీ అందచేయాలని కోరారు. టైగర్ రొయ్యల ధరలు 30 కౌంట్ కేజీ రూ.150, 20 కౌంట్ కేజీ ధర రూ.100 చొప్పున పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టైగర్ రొయ్యల ధరలను స్థిరీకరణ చేయాలన్నారు. రొయ్యల రైతులకు న్యాయం చేయని పక్షంలో ఆరునెలలు రొయ్యల పంట విరామానికి అనుమతించాలని కోరారు. కమిషనర్కు వినతి... ధర్నా అనంతరం రొయ్యలసాగు రైతులు మత్య్సశాఖ కమిషనర్ శంకర్నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫీడ్ ముడిపదార్థాల ధరలు పెరిగినందునే ఫీడ్ ధరలు పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా రొయ్యల ధరలు తగ్గాయన్నారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలు ఎలా పెంచుతారని కమిషనర్ను రైతులు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీరంతా నిజమైన రైతులేనా? అని కమిషనర్ ప్రశ్నించడంతో ఆయన తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. జగనన్న విద్యాకానుక పేరును మార్చి వాటి నాణ్యతను పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరచి మూడు మాసాలవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కిట్లు అందలేదు. అందిన వాటి నాణ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ, విద్యార్థి విభాగం -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు.ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదాన పథకానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. వారికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనం రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో తెల్లవారుజామున అమ్మవారికి ఖడ్గమాలార్చనను రెండు షిఫ్టులలో నిర్వహించారు. ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో సైతం ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అరగంట తర్వాత తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో రద్దీ మరింత అధికం కావడంతో మహా నివేదన అనంతరం అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి రూ. 500 టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. దీంతో వీఐపీలు, సిఫార్సులపై విచ్చేసిన వారికి సైతం అంతరాలయ దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్కార్ బడుల్లో చిన్నారుల భుజాలపై పుస్తకాల బరువుతోపాటు.. చిరిగిన బ్యాగుల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన ‘విద్యార్థి మిత్ర’ కిట్లలోని బ్యాగులు కొద్ది రోజులకే చిరిగిపోతుండటంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పుస్తకాలు కింద పడిపోకుండా చేతులతో పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు. నాడు నాణ్యతతో కూడిన కిట్లు రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్కార్ బడుల్లో చిన్నారులకు అన్ని రకాలుగా అండగా ఉండే లక్ష్యంతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ క్రమంలో పుస్తకాలు, వర్క్బుక్, యూనిఫామ్, బూట్లు, బెల్టు, సాక్సులు ఇలా నాణ్యమైన పలు వస్తువులతో కూడిన బ్యాగ్ను విద్యార్థులకు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విద్యార్థులు వాపోతున్నారు. పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టుగా పేరు మార్చి నాణ్యత లేని వస్తువులను ఇస్తున్నారని మండిపడుతున్నారు. అంతంత మాత్రంగా పంపిణీ ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 920 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 88,432 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారందరికీ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయాల్సి ఉంది. 2025–2026 విద్యా సంవత్సరంలో ఉన్న సంఖ్యలో పదో తరగతి విద్యార్థులను తీసివేసి ఇండెంట్ను అధికారులు పంపించారు. కొత్తగా చేరిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన కిట్లు రాకపోవడం, పాఠశాలలు మానివేసిన పాత విద్యార్థుల కిట్లను కొత్తవారికి అందించారు. పాఠశాలలు తెరిచి మూడు మాసాలైనా ఇంకా చాలా మందికి పూర్తి స్థాయి వస్తువులతో కూడిన కిట్లు అందలేదని విద్యార్థులు వివరిస్తున్నారు. బ్యాగులు, బూట్లు ఇప్పటికీ చాలా మందికి పెండింగ్లో ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. నాసిరకంతో అవస్థలు విద్యార్థులకు అందిన బ్యాగులు ఇతర వస్తువులు నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్యాగులు విద్యార్థులకు అందించిన నెల రోజుల్లోనే అవి చిరిగిపోవడం ప్రారంభమైంది. పుస్తకాలతో బడికి వెళ్తున్న విద్యార్థులు వాటిని తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. బూట్ల విషయంలోనూ అదే నాణ్యత వెంటాడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల సీపీఎం నేతల బృందం ఎ.కొండూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో సమావేశమైనప్పుడు వారి స్కూల్ బ్యాగులు చూసి అవాక్కయ్యారు. చిరిగిన బ్యాగులతో విద్యార్థులు అవస్థలు పడటంపై వారు నాణ్యతపై ప్రశ్నించారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చిరిగిన బ్యాగులతో కుస్తీ పడుతున్నారు. మండిపడుతున్న తల్లిదండ్రులు చిన్నారుల అవస్థలను చూసి తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే కిట్లు గతంలో చక్కగా ఉండటమే కాకుండా మా పిల్లలు ఇబ్బందులు లేకుండా బడులకు వెళ్లే వారని ఇప్పుడు పుస్తకాలు బ్యాగ్లో నుంచి ఎక్కడ పడిపోతాయోనని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అందించే బ్యాగులు, బూట్లు నాణ్యమైనవి ఇస్తే బాగుం టుంది. పిల్లలను ఎందుకు కష్టాలపాలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.8716 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరపాలక సంస్థకు ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయమని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్.. పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి పాలనలో ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రోడ్లు, పార్క్లు, వాటర్ట్యాంకులు ప్రారంభిస్తే కూటమి నేతలు సిగ్గు లేకుండా సొంత పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారన్నారు. మనం ప్రజల కోసం పనిచేస్తే.. కూటమి ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పని చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను వివరిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా గెలిచేది మరోసారి వైఎస్సార్ సీపీ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంత మంది పోలీసులు వచ్చినా, గుండాలు, రౌడీలు వచ్చినా పార్టీ కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని పేర్కొన్నారు. వెన్నుపోటు పాలనకు రెండున్నరేళ్లు.. వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ప్రజానీకానికి కూటమి వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఈ నెల 23 నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. పాంప్లెట్లు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ప్రజానీకానికి తెలియజేయాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గానికి సుమారు ఏడు వేల మందికి పార్టీ పదవులు ఇచ్చారని, వారంతా అప్రమత్తంగా ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని 28 డివిజన్లలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇంటింటికీ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడిస్తారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పును ఇస్తారన్నారు. అనంతరం పార్టీల్లో వివిధ పదవుల్లో నియమితులైన ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్, మనోజ్ కొఠారి, గౌస్ మొహిద్దీన్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
పంటకాలువలో వరినాట్లు
కృత్తివెన్ను: పంట భూములకు సాగునీరందించాల్సిన కాలువలు నీటి జాడ లేక ఎండిపోవడంతో రైతులు వినూత్న నిరసనకు దిగారు. కాలువలో నీరు లేకపోవడంతో ఏకంగా దానిలోనే వరినాట్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం యండపల్లి పంచాయతీ పరిధిలోని యండపల్లి, గాంధీనగరం రైతులు పార్టీలకతీతంగా ఆదివారం బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. నీరున్నా.. చేరడం లేదు గుడ్లవల్లేరు లాకుల నుంచి వంతులవారీగా బంటుమిల్లి కెనాల్కు 250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నప్పటికీ నెల రోజులుగా కృత్తివెన్నుకు చుక్కనీరు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని, పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 150 ఏళ్లలో ఇదే దుస్థితి బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఇంతటి దుర్భర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని రైతులు తెలిపారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటితో కళకళలాడాల్సిన కాలువలు ఎండిపోవడం దారుణమన్నారు. నాట్లు వేసిన పంటలూ ఎండిపోయాయి మండలంలో ఈ ఏడాది సుమారు 7 వేల ఎకరాల్లో ఖరీఫ్ నాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. అందులో దాదాపు 90 శాతం పంట నీరు లేక ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. తక్షణమే కృత్తివెన్నుకు కాలువల ద్వారా సాగునీరు అందించా లని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గెజిట్లో హామీ.. నీరెక్కడ? కృత్తివెన్ను శివారు ప్రాంతంతో పాటు సముద్రతీరానికి సమీపంలో ఉండటంతో రెండో పంట రబీకి కూడా సాగునీరు అందించేలా గతంలో అప్పటి మల్లేశ్వరం ఎమ్మెల్యే పిన్నెంటి పమిడేశ్వరరావు ప్రభుత్వాన్ని ఒప్పించి గెజిట్లో పొందుపరిచేలా జీవో తీసుకొచ్చినట్లు రైతులు గుర్తుచేశారు. రెండో పంట సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క పంటకై నా సాగునీరు అందించకపోవడంపై వారు ప్రశ్నించారు. -
వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు
చిలకలపూడి(మచిలీపట్నం): తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గుర్రంకొండ సురేంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీ జోన్–2 తొలిదశ ఉద్యమ కార్యాచరణ సమాయత్త సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.660 విలువ కలిగిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం (ఏఏఎస్) ప్రయోజనాన్ని అమలు చేయడానికి సంవత్సర కాలంగా తాత్సారం చేయటం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.. బీఎల్ఓ విధులు నిర్వహించిన ఉద్యోగులకు సంబంధించిన నిధులను సంవత్సర కాలంగా పెండింగ్లో ఉంచారన్నారు. మరో వైపు మూడు నెలలుగా సర్ పేరుతో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం కూడా సెలవు లేకుండా నిరంతరం విధులు చేయిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, జేఏసీ నేతలు హరీష్, చవెంకటేశ్వర్లు, రవితేజ, సిద్దేశ్వరరెడ్డి, పి.అపర్ణ, రామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మూడే చంద్రకుమార్, కృష్ణాజిల్లా చైర్మన్ పువ్వల కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
కొండలమ్మ సన్నిధిలో జడ్జి అరుణసారిక
గుడ్లవల్లేరు: వేమవరం కొండలమ్మను చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థాన కమిటీ చైర్మన్ ఈడె విష్ణు వెంకట మోహన్రావు, ఈఓ ఆకుల కొండలరావు స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందించారు. 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలి మధురానగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి శతాధిక వృద్ధులు ఈ నెల 15వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పది మంది శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీస్సులు తీసుకుంటే దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి వారికి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 93475 72766, 98481 11138 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ సొంత ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేసి తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బెంగళూరులో జరిగిన 80వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ మహిళల టీమ్ చాంపియన్ షిప్ టైటిల్ను ఏపీ సీనియర్ మహిళల బ్యాడ్మింటన్ జట్టు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్లో తెలంగాణపై 3–1 స్కోర్తో ఏపీ జట్టు ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఫైనల్లో తమిళనాడు జట్టుతో పోటీ పడి ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 3–2 స్కోర్తో ఏపీ జట్టు విజయం సాధించింది. ఇదే చాంపియన్ షిప్లో ఏపీ జూనియర్ బాలుర జట్టు ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతిభ చూపిన జట్లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి అభినందించారు. పామర్రు: పామర్రు మండలం కురుమద్దాలి రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 9గంటలకు జాబ్మేళా నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిలో బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ట్రైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్బీ లైఫ్ ఇన్సూరెన్సు కో లిమిటెడ్, కురకు పైనాన్సియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో ఇండియా పైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ పైవేట్ లిమిటెడ్, టీమ్ రెడ్ మేనేజ్మెంట్ పొల్యూషన్ పైవేట్ లిమిటెడ్ (డీబీఎస్ బ్యాంక్), పీటీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 11కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి నరేష్కుమార్ మాట్లాడుతూ టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని తెలిపారు. అభ్యర్థులు ముందుగా హెచ్టీటీపీఎస్://ఎన్ఏఐపీయుఎన్వైఏఎం.ఏపీ.జీవోవి.ఐఎన్/ వెబ్సైట్లో పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతో పాటు, జాబ్ మేళాకు రెజ్యూమ్లతో లేదా బయోడేటా ఫారమ్లతో పాటు, ఆధార్, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల్ జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96187 13243 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
సుబ్బారాయుడి ఆదాయం రూ.8.28 లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8,28,687లు ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా టికెట్ల ద్వారా రూ.7,16,051లు, డొనేషన్లు రూ.1,12,636 మొత్తం రూ.8,28,687 ఆదాయం సమకూరిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బాల్య వివాహాల నిర్మూలనపై భారతదేశం నుంచి వినిపించిన గళం నేడు ప్రపంచ స్థాయి సంకల్పంగా మారిందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి.కీర్తి అన్నారు. దేశంలోని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థ చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించి, నవంబర్ 27న బాల్య వివాహాల నిర్మూలన దినంగా ప్రకటించడం గొప్ప విషయమని ఆమె పేర్కొనారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ భాగస్వాములతో కలిసి ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ (బాల్య వివాహ రహిత భారత్) ప్రచారాన్ని 2024 సెప్టెంబర్లో ప్రారంభించామన్నారు. జిల్లాల్లోని ఏదో ఒక గ్రామంలో కనీసం ఒక్క బిడ్డ అయినా బాల్య వివాహం ముప్పులో ఉన్నంత కాలం, మా పోరాటం అసంపూర్ణంగానే ఉంటుందని చెప్పారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేమని ఆమె పేర్కొన్నారు. అందుకే పాఠశాలలు, పంచాయతీలు, గ్రామాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఏపీ కో ఆర్డినేటర్ బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఏలూరు కాలువలో దూకి యువకుడు గల్లంతైన ఘటనపై ఆదివారం ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. కాజా గౌరీ శంకర్(26) కేదారేశ్వరపేట పండ్లమార్కెట్లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని అక్క రౌతు లక్ష్మి కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. నెల రోజుల నుంచి ఇంటో డబ్బులు ఇవ్వకపోవడంతో అక్క నిలదీసింది. డబ్బులు తీసుకొస్తానని ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గౌరీశంకర్ అక్క అతను పనిచేసే మేస్త్రికి ఫోన్ చేయగా ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం తమ్ముడికి రౌతు లక్ష్మి ఫోన్ చేయగా సాయంత్రం డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గౌరీ శంకర్ మీసాల రాజారావు వంతెనపై నుంచి ఏలూరు కాలువలో దూకినట్లు తెలిసిన వారు ఫోన్ చేసి తెలపగా ఆమె ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఎన్పురం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి గౌరీశంకర్ కోసం గాలింపు చేపట్టారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కార్ల షోరూమ్పై పిడుగుపాటు
● రూ.30 లక్షల ఆస్తినష్టం ● ఆదివారం కావడంతో తప్పిన ప్రాణనష్టం ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ ఆటోనగర్ ఆర్టీసీ బస్డిపో పక్కన ఉన్న హ్యూండాయ్ కార్ల షోరూమ్పై ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ సమయంలో ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో షోరూమ్ మొదటి అంతస్తుపై పిడుగు పడటంతో రెండు క్యాబిన్లు దగ్ధం అయ్యాయి. ఇందులో అడ్మినిష్ట్రేషన్ గది, కంప్యూటర్లు కాలిపోయాయి. ఏసీలు, ఫర్నిచర్ సర్వర్ గదితో పాటు కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో షోరూమ్పై పిడుగు పడటంతో మంటలు వచ్చాయని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కన ఉన్న కార్లకు నిప్పు అంటుకోకుండా మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదివారం కావడంతో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. తప్పిన పెనుప్రమాదం.. ఆదివారం కావడం వల్ల షోరూమ్లో పనిచేసేవారు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సోమవారం నుంచి శనివారం వరకు వారంలో సుమారు 100 నుంచి 120 మందికి పైగా ఇక్కడ పనిచేస్తారని షోరూమ్ సర్వీస్ జీఎం ప్రదీప్ తెలిపారు. స్పేర్పార్ట్లు, కార్లు సర్వీస్ చేస్తుంటారు. ఆదివారం కావడం వల్ల కేవలం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, పిడుగు పడిన సమయంలో వారంతా వేరే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కార్లు ఉన్న ప్రాంతంలో పిడుగు పడి ఉంటే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని సమాచారం. -
రుణాల పేరుతో వల
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరగాళ్లు పోలీసుల అంచనాలకు సైతం అందకుండా కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు. అసలు ఏ రూపంలో మోసగాళ్లు వస్తున్నారో తెలుసుకోవడం ఇప్పుడు పోలీసులకు పెద్ద చాలెంజ్గా మారింది. రుణాలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట ఇలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగతున్న సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇటీవల సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసు మాషా అల్లా కూడా ఇన్స్టా వేదికగా చేసిన ప్రచారంతోనే ప్రజలు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ● మీ ఓటీపీ, సీవీవీ, పిన్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవిత కాల పొదుపులను క్షణాల్లో కోల్పోయేలా చేస్తుంది. ● ఆన్లైన్లో అప్రమత్తంగా ఉండాలి. నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, తెలియని ఏపీకె ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ● ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దు. ● లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తక్షణ లోన్ పేరుతో వచ్చే అనధికారిక యాప్స్ను నమ్మవద్దు. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు అంటూ ముందుగా చెల్లింపులు చేయవద్దు. ● ఒక్క క్లిక్ మీ ఫోన్ మొత్తం ప్రమాదంలో పడవచ్చు. ట్రాఫిక్ చలానా పేరుతో వచ్చే నకిలీ లింకులు, ఏపీకే ఫైల్స్ను నమ్మవద్దు. ● మొబైల్ పోయిన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించి, సీఈఐఆర్ ద్వారా ఐఎంఈఐని బ్లాక్ చేయించాలి. ● కేవలం 15 నిమిషాల ఆలస్యం కూడా నష్టాన్ని పెంచవచ్చు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఇన్స్ట్రాగామ్లో అన్వేషించడం మొదలు పెట్టింది. దానిలో ఉద్యోగ అవకాశాలు అనే ప్రకటన చూసి, వివరాలు తెలుసుకుంది. ఆమెకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తానని నమ్మించి దాదాపు రూ.2 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశారు. ఇలా మోసగాళ్లు ఈజీమనీ కోసం కొత్త కొత్త ఎత్తులను ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని ఏదో రూపంలో వారిని దోపిడీ చేస్తూ, మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కంచికచర్ల ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తకు గుండె వైద్యం కోసం రూ.10 లక్షల వరకూ అప్పుచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు కూడా చదువు పూర్తయినా ఉద్యోగాలు రాలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకు ఒక తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద రూ.50 లక్షల వరకూ రుణ మంజూరు అవుతుందని చెప్పారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె.. అంత మొత్తం అవసరం లేదు. సగం ఇప్పించినా చాలని చెప్పి, వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చింది. అప్పుడే అసలు కథ మొదలైంది. టీడీఎస్ ముందుగా చెల్లించాలని, ప్రాసెసింగ్ చార్జీలంటూ దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆమె నుంచి వసూలు చేశారు. అనంతరం ఫోన్ కలవడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తెలియని వ్యక్తి నుంచి పంపిన లింక్లను క్లిక్ చేయకూడదు. అంతేకాదు తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫోన్కాల్స్తో మాట్లాడటం కూడా సురక్షితం కాదు. వీడియో కాల్స్ అసలు మాట్లాడవద్దు. ఇటీవల కాలంలో ఇన్స్టా, ఫేస్బుక్ వంటి వాటిలో ఆకర్షణీయమైన ప్రకటనలు వస్తున్నాయి. వాటిని క్లిక్ చేసే మీ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం, ఓటీపీ చెప్పమని ఫోన్ చేస్తుంటారు. అలాంటి వాటిని నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. ఏదైనా మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి సమాచారం ఇవ్వండి. – డి.చవాన్, ఇన్స్పెక్టర్, ఎస్ఆర్ పేట -
నందమూరినగర్లో పట్టపగలు చోరీ
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నందమూరినగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే ఇంటి తాళాలు పగలకొట్టి ఆ ఇల్లును కొల్లగొట్టిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరినగర్ ఏడో లైన్లో మొండి రేవతి, వెంకట రమణ దంపతులు నివసిస్తున్నారు. భర్త మహేంద్ర కంపెనీలో పనిచేస్తుండగా రేవతి ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 5వ తేదీన వెంకటరమణ తన పనులకు వెళ్లిపోగా ఉదయం 10 గంటలు దాటిన తరువాత రేవతి తన ఇంటికి తాళాలు వేసి వారి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలకొట్టి కనిపించాయి. బెడ్రూమ్లోని అలమరలో దాచుకున్న 97 గ్రాముల బంగారపు వస్తువులతో పాటు రూ.74 వేల నగదు కనిపించలేదు. దీంతో తమ ఇంట్లో దొంగతనం జరిగిందని భావించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకూ అజిత్సింగ్నగర్ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు.. ఇంటికి తాళం వేసి వెళ్లిన ఐదు గంటల వ్యవధిలోనే ఇంట్లో దొంగతనం జరగడంతో పోలీసులు ఇది పాత నేరస్తుల పనా.. లేక బాధితులకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఛోరీకి పాల్పడి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల వివరాలను రాబడుతున్నారు. 97 గ్రాముల బంగారం, రూ.74 వేలు నగదు మాయం -
వస్త్ర దుకాణంలో రూ.11 లక్షలు కాజేసిన క్యాషియర్
కృష్ణలంక(విజయవాడతూర్పు): పని చేసే చోటనే ఓ క్యాషియర్ తన చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.11 లక్షల సంస్థ సొమ్మును కాజేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సారపరెడ్డి సాయికుమార్ నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలో ఉన్న ఓ వస్త్ర షోరూంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ కస్టమర్ తమ క్రెడిట్ బిల్లును ఉపయోగించుకోవడానికి హైదరాబాద్లోని వారాహి సిల్క్స్ బ్రాంచ్కు వెళ్లారు. అక్కడ సిబ్బంది ఆ బిల్లును వెరిఫై చేయగా ఆ క్రెడిట్ బిల్లును విజయవాడ బ్రాంచ్లోనే వినియోగించినట్లు చూపిస్తుందని చెప్పారు. అనుమానం వచ్చిన మేనేజర్ పి.బాలకృష్ణ విజయవాడ బ్రాంచ్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా సాయికుమార్ స్వయంగా ఆ క్యాష్ను విత్డ్రా చేసినట్లు కనిపించింది. ఫుటేజీ ఆధారంగా అతడిని పిలిచి ప్రశ్నించగా తాను రూ.31,449లను సొంతానికి వాడుకున్నట్లు అంగీకరించాడు. అంతటా ఆ మొత్తాన్ని షోరూమ్కు చెల్లించి రాతపూర్వకంగా రాసిచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఘటన తర్వాత షోరూం యాజమాన్యం ఆడిట్ నిర్వహించగా రూ.11 లక్షలకు సంబంధించిన బిల్లులను అదేవిధంగా మోసం చేసి నగదు తీసుకున్నట్లు తేలింది. సంస్థను మోసం చేసిన సాయికుమార్పై చర్యలు తీసుకోవాలని షోరూం మేనేజర్ బాలకృష్ణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగాయలంక: వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడు కరుణించాలని సంకల్పంతో స్థానిక కృష్ణానది తీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్లో కొలువైన శ్రీరామలింగేశ్వర శివలింగానికి ఆదివారం సహస్ర ఘటాల(1008)తో కృష్ణానదిలోని సముద్రపు జలాలతో భక్తులు విశేష అభిషేకం నిర్వహించారు. ప్రసన్న గణ పతి దేవస్థానం అర్చకుడు బ్రహ్మశ్రీ అంబా సాయికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం, భక్తుల ఆర్థిక సౌజన్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘటాలతో తెచ్చిన నదీ జలం నేరుగా శివలింగంపై కాకుండా పైపులో పోసిన నీరు శివలింగంపై పడేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం శివలింగాన్ని పూర్తిగా మూసివేస్తూ ఇటుకలతో చతురస్రం గది నిర్మించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు జలాభిషేకం కొనసాగింది. అనంత రం స్వామికి నవహారతులు సమర్పించారు. సాయంత్రం అభిషేకం పూర్తయ్యే సమయానికి రోజూ మాదిరిగానే వర్షం పడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లికి చెందిన మార్కాపురం వెంకటరమణ, వెంకటేశ్వరరావు(55)లు భార్యాభర్తలు. వెంకటేశ్వరరావు బార్బర్ షాపు నడుపుతుంటాడు. ఈ నెల 3న షాపు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న వెంకటేశ్వరరావును ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటేశ్వరరావును అజిత్సింగ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. ఘటనపై వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అన్నప్రసాదానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ ఎస్బీఐ కాలనీకి చెందిన బొప్పన దుర్గా వెంకట్రామ్ కుటుంబం రూ.1,00,005, ప్రజాశక్తినగర్కు చెందిన దావూలూరి ప్రభాకరావు కుటుంబం రూ.1,00,005, మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టి.తారక రామారావు కుటుంబం రూ. 1.16 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. -
జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ‘మీ కోసం’
కోనేరుసెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని సబ్–డివిజన్లలోనూ మీకోసం కార్యక్రమం జరుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని బాధితులు తమకు సమీపంలోని పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించే ఎస్హెచ్ఓలను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని చెప్పారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మీకోసంలో అర్జీలు స్వీకరిస్తామని ఎస్పీ తెలిపారు. -
టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనచోదకుడు దుర్మరణం
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలం పరిధిలోని కిలేశపురం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. సెక్టార్ ఎస్ఐ బోనగిరి రాజు తెలిపిన వివరాల మేరకు నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మండ్రు కృష్ణంరాజు(37) వ్యక్తిగత పనులపై తన బైక్పై విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కిలేశపురం వద్దకు చేరుకునే సమయానికి వెనుక నుంచి దూసుకు వచ్చి న టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. ఈఘటనలో రోడ్డుపై పడిన కృష్ణరాజు మీదుగా లారీ దూసుకెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి ప్రాణాలు విడిచా డు. సంఘటన జరిగిన అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి లారీని వెంబడిస్తూనే ఎస్ఐ రాజుకు ఫోన్ ద్వారా సమాచా రం అందించాడు. హుటాహుటినా పోలీస్ వాహనంలో వెళ్లిన ఎస్ఐ దొనబండ క్వారీల రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
తమ్ముడి పిల్లలను చూసేందుకు వెళ్తూ..
● బైక్ను మోపెడ్ ఢీ కొనడంతో రోడ్డుపై పడిన ప్రైవేట్ టీచర్ ● అతనిపె నుంచి వెళ్లిన ట్రాక్టర్.. చికిత్స పొందుతూ మృతి కంచికచర్ల: ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తన తమ్ముడి పిల్లలను చూసేందుకు విజయవాడ వెళ్తుండగా కీసర గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు జగ్గయ్యపేట హయత్నగర్లో నివాసముంటున్న దాసరి అనిల్ సుందర్(41) జగ్గయ్యపేట సమీపంలోని బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావటంతో విజయవాడలో ఉన్న తన తమ్ముడి పిల్లలను చూసేందుకు బైక్పై బయలుదేరాడు. కంచికచర్ల మండలం కీసర సమీపంలోకి రాగానే టీవీఎస్ మోపెడ్ను అడ్డదిడ్డంగా నడుపుతున్న వ్యక్తి బైక్ను ఢీ కొట్టాడు. దీంతో బైక్పై ఉన్న అనిల్ సుందర్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో విజయవాడ వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ అనిల్ సుందర్పై నుంచి వెళ్లింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిల్ సుందర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాల వివరాలపై దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.కాగా, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రానున్న స్థానిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేద్దామని, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేద్దామని, గత ఐదేళ్లలో మనం చేసిన మంచిని వివరిద్దామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో శనివారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా సంస్థాగత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. రాబోయే ఎన్నికలు ఒక మంచి మలుపు: వెలంపల్లి వైఎస్సార్ సీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మంచి మలుపు అని మాజీ మంత్రి, పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వైఎస్సార్ సీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తథ్యమన్నారు. ఎన్టీఆర్ నుంచి నేటి ఏపీ ప్రజల వరకు చంద్రబాబు అందరినీ వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ లబ్ధి చేకూరుస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. పార్టీకో రకంగా పోలీసు చట్టాలున్నాయా: మల్లాది విష్ణు విజయవాడ ఎంజీ రోడ్డులో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. జనసేన పార్టీ రోడ్డుపై షోలు, సమావేశాలు నిర్వహిస్తుంటే అనుమతులు ఎలా ఇస్తున్నారని ఆయన నిలదీశారు. నారా లోకేష్ సెమినార్ పేరుతో వచ్చినప్పుడు బస్టాప్లు, రహదారులన్నింటినీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీకి ఒక రకంగా కూటమికి మరొక రకంగా చట్టాలుంటాయా అని ఆయన పశ్నించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలకు అడుగడుగునా బారికేడ్లు, డైవర్షన్లు పెట్టి అడ్డుకోవడాన్ని ఖండించారు. పేదవారికి సొంతింటి ఆస్తిని అందించిన ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేశారు: మొండితోక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు, ప్రజలను నమ్మించి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నందిగామ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్రావు మండిపడ్డారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని ప్రజలందరికీ అర్థమయిందన్నారు. హామీలు నెరవేర్చడంలో విఫలం: నల్లగట్ల నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, కాపు కార్పొరేషన్కు ఏడాదికి రూ.3 వేల కోట్లు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే, తిరువూరు ఇన్చార్జి నల్లగట్ట స్వామిదాసు ప్రశ్నించారు. వయస్సు 50 ఏళ్లు నిండిన వారికి ఫించన్ ఎందుకు ఇవ్వలేక పోతున్నారని నిలదీశారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఎండీ రూహుల్లా, మొండితోక అరుణ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ కందుల రవీంద్ర, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్ర పుణ్యశీల, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్, తదితరులు పాల్గొన్నారు.ఈ రెండున్నర ఏళ్ల కూటమి పాలనలో సంక్షేమ పథకాలు లేక, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో డీఎస్సీ స్కామ్ జరిగిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. -
విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, విద్యుత్ సబ్స్టేషన్లలో ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ మొదలైనఅంశాలపై చర్చించారు. అనంతరం పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తరచూ ట్రిప్పింగ్కు గురయ్యే ఫీడర్లు, ఓవర్ లోడ్ అవు తున్న ట్రాన్స్ఫార్మర్లు, బలహీనంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. పీక్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎల్నినో ప్రభావం నేప థ్యంలో డిస్కమ్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితులు, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు ,సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి -
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కంచికచర్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలయినా విశ్రాంత ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని, ఎన్నికల సమయంలో ఇస్తామని చెప్పిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విశ్రాంత ఉద్యోగుల సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సానె రామ్మోహనరావు ఆరోపించారు. కంచికచర్లలోని ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహనరావు మాట్లాడుతూ.. పింఛన్దారులకు 70, 75 సంవత్సరాలకు గతంలో తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ చేయలేదని, తమ నుంచి ప్రతి నెలా డబ్బులు మినహాయించుకున్నప్పటికీ హెల్త్ కార్డులపై వైద్యం జరిగే దిక్కులేదని మండిపడ్డారు. 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయలేదని, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించలేదని, 2024న జనవరి నుంచి డీఏ అరియర్స్ ఇవ్వలేదని ఆరోపించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించక పోతే త్వరలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విజయవాడకు చెందిన మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పోతరాజు, అసోసియేట్ ప్రసిడెంట్ పెద్దినీడి కోటేశ్వరరావు, కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు -
మినీ మార్ట్లుగా 275 రేషన్ షాపులు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 1,059 రేషన్ షాపులు వాటిలో 275 షాపులను మినీ మార్ట్లుగా ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి పి.శివరామప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం సాయంత్రం పీడీఎస్ డీటీలు, మినీ మార్ట్లకు ఎంపికై న రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో 68 షాపులను గుర్తించగా వాటిలో 57 షాపులను మినీ మార్ట్ లుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన డీలర్లు కూడా రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ మార్ట్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అర్హత కలిగిన రేషన్డీలర్లకు అదనపు వ్యాపార అవకాశాలు కల్పించటం, స్థానిక రిటైల్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
హోల్సేల్ కాంప్లెక్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఫుడ్ (ఐపీఎం) డైరెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్లం, తేనె నమూనాల సేకరణపై ఫుడ్ సేీఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా శని వారం గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మాగాంధీ హోల్సేల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లోని ఇద్దరు ప్రముఖ బెల్లం వ్యాపారుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రంగు కలిపిన బెల్లం ఉన్నదన్న అనుమానంతో దాదాపు 3,500 కేజీల స్టాక్ను సీజ్ చేశారు. ఈ బెల్లం శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం చైన్నెలోని ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు తదనంతర చర్యలు తీసుకోనున్నారు. ఈ సంద ర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్ర రెడ్డి మాట్లా డుతూ.. మూడు రోజులుగా హోల్సేల్ కాంప్లె క్స్లో 15 వరకు బెల్లం శ్యాంపిల్స్ తీశామని, వాటిల్లో కేసు నమోదు చేయగలిగే విధంగా మూడు ఉంటాయని తెలిపారు. ఈ మూడు రోజుల్లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే ఐదు వేల కేజీల బెల్లాన్ని సీజ్ చేశామని చెప్పారు. తాము సేకరించిన శ్యాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని, వాటిల్లో రంగు కలిసినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వలాభంతో బెల్లంలో సల్ఫర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. సల్ఫర్ 100 పీపీఎం మించి వాడితే ప్రాణాలకు ప్రమాదమని, రంగు వేసిన బెల్లంతో క్యాన్సర్ (కార్సినోజెనిక్) వచ్చే ప్రమాదం ఉందని, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం రంగులు వాడటం నిషేధమని వ్యాపారులను హెచ్చరించారు. -
నకిలీ ఎస్ఐ అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్: పోలీస్ సబ్ ఇన్స్పె క్టర్ను అంటూ ద్విచక్ర వాహనదారుడి నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కున్న ఓ నకిలీ ఎస్ఐని హనుమాన్జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను హనుమాన్జంక్షన్ సీఐ ఎల్. రమణ, ఎస్ఐ ఎం.శ్రీవివాస్తో కలిసి శనివారం వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం వేలేరుకు చెందిన మాధవరపు సాంబయ్య తన బావమరిది సత్యనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై హనుమాన్జంక్షన్కు బయలుదేరాడు. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో నకిలీ ఎస్ఐ సరిహద్దు దుర్గాంజనేయులు వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. వాహనానికి నంబర్ ప్లేట్ లేనందున జరిమానా చెల్లించాలని బెదిరించాడు. నగదు ఇవ్వకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతామంటూ హెచ్చరించాడు. సాంబయ్య జేబులోని రూ.6 వేలను బలవంతంగా లాక్కున్నాడు. పోలీస్ యూనిఫాం లేకుండా ఓ వ్యక్తి రోడ్డుపై దౌర్జన్యం చేయటంపై అనుమానం వచ్చిన సాంబయ్య, సత్యనారాయణ తమ వద్ద డబ్బు లాక్కున్న దుర్గాంజనేయులను నిలదీశారు. దీంతో అతను వారిద్దరిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన సాంబయ్య హనుమాన్జంక్షన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టిన హనుమాన్జంక్షన్ ఎస్ఐ ఎం.శ్రీనివాస్ గన్నవరం రాయనగర్కు చెందిన సరిహద్దు దుర్గాంజనేయులు నకిలీ ఎస్ఐగా చెలామణీ అవుతూ వాహనదారులను బెదిరించి, డబ్బులు లాక్కుంటున్నట్లుగా గుర్తించారు. హనుమాన్జంక్షన్ శివారులోని వేలేరు క్రాస్రోడ్డు వద్ద శనివారం దుర్గాంజనేయులు ఉన్నట్లుగా సమాచారం అందటంతో తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు సీఐ రమేష్, ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న ఆర్టిీఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్ల్లో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడల్లో ఏఐ ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. డేటా యన్నోటేటర్ అసిస్టెంట్–5, డేటా క్యూరేటర్ అసిస్టెంట్–5, కంప్యూటర్ లాబ్ అసిస్టెంట్–10 పోస్టులను భర్తీ చేస్తారని తెలియజేశారు. పూర్తి వివరాలకు జీవోవీఐటీఐకాకినాడ.వోఆర్జీ వెబ్సైట్ను పరిశీలించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. వివరాలకు 99484 20477 నంబర్లో సంప్రదించాల్సిందిగా కోరారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని జిల్లా అధికారులు సూచించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం దుర్గగుడి ఆవరణలోని మహా మండపం నాలుగో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది.ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, జేసీ ఇలక్కియ, కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పాలక మండలి సభ్యులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సమగ్ర ప్రణాళిక అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియాతో మాట్లాడారు. దర్శనం, రద్దీ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, మరుగుదోడ్లు, ప్రసాదం, భక్తుల భద్రతపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం, ఉచిత ప్రసాద పంపిణీ చేయాలన్నారు. ఉత్సవాల్లో పోలీసు సిబ్బందిని 20 శాతం మేర తగ్గించి ఆధునిక సాంకేతిక విధానాన్ని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. 4డీ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది దసరా వాటర్ బాటిల్స్ స్థానంలో బబూల్స్తో తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. గతేడాది దసరా, భవానీ దీక్షల సమయంలో కార్పొరేషన్కు దేవస్థానం చెల్లించాల్సిన బిల్లుల పెండింగ్ ఉండటంతో సమావేశంలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. -
చదువుతోపాటు సద్గుణాలూ నేర్పాలి
టీచర్స్ డే వేడుకల్లో ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో విలువలు, మానవత్వం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి వంటి సుగుణాలను పెంపొందించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. మాజీ రాష్ట్ర పతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 39 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. నవీన్ మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులు చేసే ప్రతి పని విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో ఏఐ ద్వారా విస్తృతమైన సమాచారాన్ని పొందగలుగుతున్నా విద్యార్థి ఎందుకు ప్రశ్న అడుగుతున్నాడు, అతనికి ఏమి అవసరం – బలహీనతలు ఏంటనే విషయాలను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగేది ఉపాధ్యాయుడు మాత్రమేనన్నారు. అందుబాటులో ఉన్న మౌలిక, డిజిటల్ సౌకర్యాలను సమర్థంగా వినియోగించుకుని బోధనా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలన్నారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యాన్ని సాధించేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), డీవైఈవోలు శేఖర్సింగ్, కె. రవికుమార్, ఏడీ ఎం.విద్యాలత, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కె. విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీఏ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు
మోపిదేవి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పీఎల్ దయాకర్ అధికారులకు సూచించారు. మోపిదేవి పీహెచ్సీని శనివారం డీఎంహెచ్వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీ కేసులు తక్కువగా ఉన్నాయని, మరింత పెంచాలని స్టాఫ్ నర్సులకు సూచించారు. అనంతరం స్థానికుల బలానికి ఇంజెక్షన్లు పీహెచ్సీలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందాలన్నారు. డాక్టర్ లక్ష్మీనాఽథ్, సిబ్బంది పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): హైరిస్క్ గర్భిణులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు అన్నారు. ఆయన శనివారం నగరంలోని అజిత్సింగ్నగర్ యూపీహెచ్సీని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఓపీ విభాగం, రోగుల రిజిస్టర్లు, మందుల నిల్వలు, అత్యవసర మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి, సంబంధిత సిబ్బందిని ఓపెన్ వయాల్ పాలసీ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ శ్రావణ్బాబు మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యాని నవీన, వైద్య సిబ్బంది ఉన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
ఉయ్యూరు: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఉయ్యూరు రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధర్మేంద్ర ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని పెద ఓగిరాలలో కొంత మంది యువకులు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎస్ఐ సురేష్బాబు తన సిబ్బందితో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. నిందితులు పోలిమెట్ల సందీప్, కట్టా నాగబాబు, చాగంటిపాటి ఆకాశ్, చీలి భార్గవ్, తలకంటి షణ్ముఖ్ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో కంకిపాడు సీఐ బి.బి. రవికుమార్, ఎస్ఐ సురేష్బాబు పాల్గొన్నారు. -
జెడ్పీకి కొత్త రూపం
జిల్లా మారింది.. పాలనా స్వరూపం మారింది. ఇప్పుడు జిల్లా పరిషత్ రూపురేఖలు మారనున్నాయి. 66 ఏళ్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామీణాభివృద్ధికి దిక్సూచిగా నిలిచిన జిల్లా పరిషత్.. జిల్లాల పునర్విభజనతో రెండు జెడ్పీలుగా రూపాంతరం చెందనుంది. జిల్లా బోర్డు నుంచి జెడ్పీగా ఎదిగిన ప్రస్థానంలో ఎందరో నాయకులు తమదైన ముద్ర వేశారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఆరు దశాబ్దాలకు పైగా ప్రజాపాలనకు వేదికగా నిలిచిన కృష్ణా జిల్లా పరిషత్ ఇప్పుడు మరో కీలక మలుపు తిరగనుంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వం శనివారం ఇచ్చిన జీవోతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ రెండు జిల్లా ప్రజా పరిషత్లు కానుంది. ఏలూరు జెడ్పీలో రెండు నియోజకవర్గాలు విలీనం కానున్నాయి. కృష్ణాలో 25 మండలాలు, ఎన్టీఆర్లో 15 మండలాలతో జెడ్పీలు ఏర్పడనున్నాయి. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశారు. వీటి ఆధారంగా నేడు జిల్లా పరిషత్లు కూడా విభజన జరగనుంది. సెప్టెంబరు 24తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ రూపాంతరాలపై కథనం. జిల్లా బోర్డు నుంచి జిల్లా ప్రజాపరిషత్గా జిల్లా పరిషత్ ఏర్పాటుకు ముందు జిల్లా బోర్డుగా ఉండేది. ప్రభుత్వం నామినేటెడ్ సభ్యులను నియమించి పాలన సాగించేది. పాఠశాల నిర్వహణ, రహదారులు, గ్రంథాలయాల నిర్వహణ వంటి బాధ్యతలను బోర్డు నిర్వహించేది. అనంతరం 1959లో తీసుకొచ్చిన చట్టంతో జిల్లా పరిషత్గా మార్పు జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ను ఉమ్మడి కృష్ణాజిల్లాలో సమితి అధ్యక్షులతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నుకునేవారు. తర్వాత 1987లో జిల్లా ప్రజాపరిషత్గా మార్పు చెంది మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ (జెడ్పీటీసీ)లుగా ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీలుగా ఎన్నికై న సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునే విధానం ప్రారంభమైంది. వన్నె తెచ్చిన ఎందరో నాయకులు జెడ్పీ ఏర్పడిన అనంతరం తొలిసారిగా 1960లో యార్లగడ్డ శివరామప్రసాద్ (చల్లపల్లి రాజా) చైర్మన్గా ఎన్నికయ్యారు. 1962 నుంచి 64 వరకు మాగంటి అంకినీడు, 1964 నుంచి 76 వరకు తిరిగి 1981 నుంచి 83 వరకు పిన్నమనేని కోటేశ్వరరావు చైర్మన్లుగా పనిచేశారు. 1983 నుంచి 86 వరకు సుంకర సత్యనారాయణ, 1987 నుంచి 92 వరకు పిన్నమనేని కోటేశ్వరరావు చైర్మన్లుగా చేశారు. 1995 నుంచి 2000 వరకు కడియాల రాఘవరావు, 2001 నుంచి 06 వరకు నల్లగట్ల సుధారాణి, 2006 నుంచి 11 వరకు కుక్కల నాగేశ్వరరావు, 2014 నుంచి 19 వరకు గద్దె అనూరాధ చైర్మన్లుగా పనిచేశారు. 2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చైర్పర్సన్గా ఉప్పాల హారిక ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్నారు. చైర్మన్గా పిన్నమనేని మూడు పర్యాయాలు ఉన్నారు. 1960 నుంచి 2026 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మొత్తం 10 మంది పదవిని అలంకరించారు. వైఎస్సార్ సీపీ హయాంలో నూతన హంగులు వైఎస్సార్ సీపీ హయాంలో జిల్లా పరిషత్కు నూతన హంగులు సమకూరాయి. వైఎస్సార్ సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లాల పునర్విభజన చేశారు. దీని ప్రాతిపదికన జిల్లా ప్రజాపరిషత్లను కూడా విభజించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ కృష్ణా జిల్లా, నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలో కై కలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 8 మండలాలు కలవనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 25 మండలాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ 25 మండలాల్లోని జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. -
అన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ ఎనికేపాడు కేవీఆర్ కాల నీకి చెందిన పి.రవిశంకర్ దంపతులు అమ్మవారిని దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన చుండూరి శ్రీనివాసరావు దంపతులు అన్నదా నానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీ ర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్బాబు, ఆలయ అధికారి శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి పామర్రు: వీఆర్ఏలు నాలుగు దశాబ్దాలుగా తక్కువ జీతంతో పని చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే జీతాలను పెంచా లని కృష్ణాజిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్ష కార్యదర్శిలు బొడ్డు వెంకటరత్నం, చాట్ల రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్టు హౌస్లో జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులతో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వా లని కోరారు. తక్కువ జీతాలతో వీఆర్ఏలు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు ఎం.గోపి, జై.బాబుజీ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య గన్నవరం: కుటుంబ సభ్యులు మందలించా రని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముస్తాబాదలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముస్తాబాదకు చెందిన నర్రా నాగసాయిరామ్(30) గ్రామంలో షామియానా దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య ప్రసవం నిమిత్తం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అతను రోజు మద్యం తాగుతున్నాడు. నాగసాయిరామ్ను తండ్రి, సోదరుడు గట్టిగా మందలించారు. మనస్తాపా నికి గురైన నాగసాయిరామ్ ఉదయం 11 గంట లకు ఇంటిలో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఉచిత ఆరోగ్య బీమా మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అంధ క్రికెటర్లకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చొప్పున ఆరోగ్య పాలసీని కల్పిస్తున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశి నేని శివనాథ్ తెలిపారు. నగరంలోని ఏసీఏ కార్యాలయంలో అంధ క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ.. ఐదుగురు అంధ క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పు ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన పాలసీలను అందజేశామన్నారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ క్రికెట్ అభివృద్థికి ఏసీఏ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇ.అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ దుర్గారావు, క్రీడాకారులు వెంకటేష్, రవి, దున్నా వెంకటేశ్వరరావు, కుమారి సత్యవతి పాలసీ పత్రాలను అందుకున్నారు. డెఫ్ క్రికె టర్ యశ్వంత్ నాయుడును, శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్ అండ్ డంబ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన కుమారి జోష్నారెడ్డిని సత్కరించారు. భారత అండర్–19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికై న కాట్రగడ్డ దీక్షను శివనాథ్ అభినందించారు. అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వందే.. వరదాయినీ
ఇంద్రగిరిపై వరలక్ష్మీవ్రత శోభ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ చెంతన మహిళలు సామూహిక వర లక్ష్మీవ్రతాలను ఆచరించారు. దేవస్థానం మహామండపం ఆరో అంతస్తు సామూహిక వరలక్ష్మీవ్రతాలకు వేదికై ంది. ఆరో అంతస్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతంతో పాటు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో, ప్రధాన ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరలక్ష్మిగా దుర్గమ్మ.. మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతాలను నిర్వహించారు. రూ. 1500 టికెట్పై సుమారు వంద మంది మహిళలు ప్రత్యేక ఆర్జిత సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించగా, 600మందికి పైగా మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రి, గాజులు, రవికలతో పాటు అమ్మవారికి నివేదనగా సమర్పించేందుకు పూర్ణాలు, చక్రెర పొంగలి, పులిహోరలను దేవస్థానమే అందజేసింది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ. 100, రూ. 300టికెట్ క్యూలైన్లో ఉచితంగా అనుమతించారు. కృష్ణునికి విశేష అభిషేకాలు, పూజలు.. కృష్ణాష్టమిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తొలుత కృష్ణుని విగ్రహానికి ఆలయ ఈవో శీనా నాయక్ అభిషేకాలు నిర్వహించారు. చైర్మన్ రాధా కృష్ణ పాల్గొన్నారు. సాయంత్రం రాజగోపురం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. బారులు తీరిన భక్తులు.. శ్రావణ మాసం నాల్గో శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రం వరకు, ఇటు మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. భక్తులతో పాటు గత రెండు రోజులుగా శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నవ దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. -
ఎల్నినో ప్రభావాన్ని అధిగమించాలి
● రైతులకు సాయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి ● ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ● కేవీకేలో ఎల్నినోపై అవగాహన సదస్సు ఘంటసాల: ఎల్నినో ప్రభావంతో పంటలు వేయని రైతులకు చేయాల్సిన సాయంపై ఆలోచన చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఒక్క అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఇంకా 15 వేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉందన్నారు. ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో శుక్రవారం ఎల్నినోపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా నది నుంచి చుక్క నీరు రాలేదని పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీళ్లే దిక్కు అయ్యాయన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే మనం కాపాడబడతామన్నారు. వర్షపాతం తక్కువుగా ఉండటంతో కెనాల్ ద్వారా సాగునీరు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచినలు పాటించి ఎల్నినో ప్రభావాన్ని అధిగమించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటపై దృష్టి.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మాగాణి రైతులు మినుము ముందుగా వేయొద్దని, ఇప్పటికీ వరి వేయని రైతులు పెసలు వేసుకోవాలని సూచించారు. కృష్ణాడెల్టా వరి మాగాణుల్లో నవంబర్ రెండో వారం తర్వాత ఎల్బీజీ 752, 832, టీబీటీ104, 129, 145 రకాలు వేసుకోవచ్చని ఇవి 70–80 రోజుల్లో పంట వస్తుందని, చీడపీడలను తట్టుకోవడంతో పాటు మిషన్ల కోతకు అనుకూలమైందన్నారు. డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో అయితే పెసలు వేసుకోవాలని, జనవరి ఒకటో వారం నుంచి నెలాఖరులోపు కోతలు వస్తే వారు నువ్వుల పంట వేసుకోవాలని సూచించారు. హైదరాబాద్కు చెందిన ఐసీఏఆర్ అటారీ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ఊరట కలిగించినా రాబోయే పది రోజుల్లో కురిసే వర్షాలు కీలకంగా తీసుకుని త్వరితగతిన రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని శాస్త్రవేత్తలను కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంవర్థకం, మత్స్య సంపద, విలువ ఆధారిత వస్తు ఉత్పత్తుల తయారీపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు శాస్త్రవేత్తలను, అతిథులను సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.మణి, విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.రామచంద్రరావు, పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ వి.సునీత, వ్యవసాయ డీన్స్ డాక్టర్ సీహెచ్.శ్రీనివాసరావు, జగన్నాధరావు, సీఈ డాక్టర్ మోహన్ రెడ్డి, గుంటూరు లాం ఏడీఆర్ డాక్టర్ ఎన్వీవీఎస్ దుర్గా ప్రసాద్, ఏఏంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కె.జ్యోతిరమణి, ఉద్యానశాఖ జిల్లా అధికారి కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు స్వర్ణాభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం స్వర్ణాభరణాలను సమర్పించారు. విజయవాడ బ్యాంక్ కాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీప్రణవి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సుమారు 22.8 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు బొట్టు(నవరత్నాలు, డైమండ్స్ పొదిగినది), బంగారు నత్తు(డైమండ్స్, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగినవి, బంగారు బులాకీ(డైమండ్స్, ఎరుపు, పచ్చ రాళ్లు, ముత్యం పొదిగినది)లను తయారు చేయించి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం బహూకరించారు. అందరి సహకారంతోనే ప్లాస్లిక్ నిర్మూలన సాధ్యం చల్లపల్లి: ప్రాణాంతకమైన క్యాన్సర్కు కారణమవుతున్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని డెప్యూటీ ట్రైనీ కలెక్టర్ బి.నిఖిల చల్లపల్లి ప్రజలను కోరారు. ఈనెల ఒకటో తేదీ నుంచి చల్లపల్లిలో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, గ్లాసులు, అలాగే పేపర్ గ్లాసులు, టీ కప్పులు వంటి వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అదేరోజు అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసు కుని మొదటి విడతగా హెచ్చరించి వదిలేశారు. కాగా అవే షాపులకు ట్రైనీ కలెక్టర్ నిఖిల అధికారులతో కలిసి శుక్రవారం మరలా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పేపర్, ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో వ్యాపారులు గాజు గ్లాసులను వినియోగించటం, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకం ఆపివేయటంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట డెప్యూటీ ఎంపీడీవో పేర్ని మాధవేంద్రరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సూర్యరావు, కానిస్టేబుల్ రవి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ బోలెం నాగమణి ఉన్నారు. రైస్ కౌంటర్లలో తనిఖీలు మచిలీపట్నంటౌన్: వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైస్కౌంటర్లను శుక్రవారం కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్ తనిఖీ చేశారు. మచిలీపట్నం నగరంలోని రెండు రైతుబజార్లలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతిరోజు జరిగిన విక్రయ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటంతో పాటు సంబంధిత రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని పౌరసరఫరాలశాఖకు సంబంధించిన డెప్యూటీ తహసీల్దార్లకు సూచించారు. బియ్యం కౌంటర్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కౌంటర్ల వద్ద బియ్యం నిల్వలు తగినంతగా ఉండేలా చూసుకోవాలన్నారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం–తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. మచిలీపట్నం–తిరుచానూరు(07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారుజామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
పలు హోటళ్లకు నోటీసులు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని హోటళ్లలో శుభ్రతపై జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం ‘తనిఖీల్లో తిరకాసు’ శీర్షికన ప్రచురించిన కథనంపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది పంపే నివేదికల్లో డొల్లతనంపై ఈ కథనం రాగా.. శుక్రవారం జరిగిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, వసతులు సరిగా లేని హోటళ్లపై చర్యలు చేపట్టారు. ఆయా హోటళ్లకు జరిమానా విధించటంతోపాటు లోపాలను సరిచేసుకునేందుకు నిర్ణీత గడువుతో నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే తనిఖీలు జరిగిన హోటళ్లలో 50 హోటళ్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్న అధికారు తీరుపై కూడా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హోటళ్లకు రూ.15వేలు జరిమానా.. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు హోటళ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. 37వ డివిజన్ పరిధిలోని కెనాల్ రోడ్ ప్రాంతంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు. ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. సర్కిల్–1 శానిటరీ సూపర్వైజర్ డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
జయ కృష్ణా.. ముకుందా.. మురారి
విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉట్టి కొడుతూ సందడి చేస్తున్న యువతబాల గోపాలా.. ముకుందా.. మురళీగానలోలా.. మురారీ.. రారా.. మము దీవించ మా ఇంటికి.. అంటూ భక్తలోకం ప్రార్థించింది. ముద్దులు మూటగట్టిన మురిపాల కన్నయ్యను చూసి పరవశించిపోయింది. గోకులంలో కేరింతలు కొట్టిన లీలా వినోదుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసింది. జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సుగంధాలు గుబాళింపగా.. కొన్నిచోట్ల బాలకృష్ణులు, బుల్లి గోపికమ్మల రూపాలలో చిన్నారులు చూడముచ్చటగా అలరించారు. యువత, చిన్నారులు ఉట్టి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
గ్రేటర్ లేనట్టే!
● ఊరించి.. ఉసూరుమనిపించారు!సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడకు గ్రేటర్ యోగం ఇప్పట్లో లేనట్టే! మొన్నటివరకూ గ్రేటర్ అంటూ ఊరించిన ప్రభుత్వం ఇప్పుడు పెరిగిన డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 64 డివిజన్ల స్థానంలో 86 డివిజన్లకు పెంచుతూ శుక్రవారం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ మూడు సర్కిళ్లు పరిధిలో ప్రస్తుతం 64 డివిజన్లుగా ఉంది. విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్ విజయవాడగా మార్చేందుకు 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనికిగాను విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలను కలుపుకుని గ్రేటర్గా రూపాంతరం చేయటానికి కొంతమేర కసరత్తు కూడా చేసింది. 61.88 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడను పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాలు, మైలవరం మండలాల్లో ఉన్న 46 గ్రామాలతో తొలుత 330 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అప్పటి మునిసిపల్ కమిషనర్ జె.నివాస్ కూడా గ్రేటర్ ప్రతిపాదనపై చురుగ్గా వ్యవహరించి గ్రామాలతో కూడా చర్చలు జరిపారు. అయితే తర్వాత ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. మళ్లీ ఎన్నికల ముందు గ్రేటర్ అంటూ హామీలు ఇచ్చారు. 2025లో మళ్లీ గ్రేటర్ ప్రతిపాదన రాగా ఆయా మండలాల్లో 75 గ్రామాలను విలీనం చేయాలని, 500 కిలో మీటర్లు విస్తీర్ణంలో గ్రేటర్గా మార్చాలని ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టారు. దీనిపై గత ఏడాది డిసెంబర్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ప్రతిపాదన చేశారు. ఇక అంతా అయిపోతున్నట్లు ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేవలం విజయవాడకు మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, డివిజన్ల పునర్వవస్థీకరణతో 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు డివిజన్ సరిహద్దులు కూడా మార్చారు. తాజాగా 86 డివిజన్లకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నగర ఏరియల్ వ్యూనోటిఫికేషన్ విడుదల.. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లుగా పెంచుతూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డివిజన్లు పునర్విభజన శాసీ్త్రయంగా జరగలేదని పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో విచారణ చేపట్టిన కోర్టు గురువారం ఆ పిల్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర డివిజన్ల పునర్విభజనపై, డివిజన్ సరిహద్దులపై నోటిఫికేషన్ను విడుదల చేశారు. విజయవాడ నగరంలో 86 డివిజన్లుగా మారుస్తున్నందున దీనిపై నగరవాసులకు సమాచారం నిమిత్తం ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, చిట్టినగర్లోని సర్కిల్–1 కార్యాలయంలో, సత్యనారాయణపురంలోని సర్కిల్–2 కార్యాలయంలో, పటమటలోని సర్కిల్–3 కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలుంటే ప్రజలు రాతపూర్వకంగా అధికారులకు అందించాలని సూచించారు. 2017లో వచ్చిన గ్రేటర్ ప్రతిపాదన సమయంలో విజయవాడ నగర జనాభా కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే. విలీన ప్రతిపాదన పంచాయతీల జనాభా నాలుగు లక్షలు. అయితే గ్రేటర్ చేయాలంటే ఆ నగర జనాభా 15 లక్షలకు మించి ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహకల్ప శాఖ నిబంధన ఉంది. ఈ మేరకు 2026 నాటికి విజయవాడ నగర జనాభా 13లక్షలుగా ఉండగా, పరిసర ప్రాంత గ్రామాల జనాభా మరో నాలుగున్నర లక్షలు ఉంది. ఆయా గ్రామాల విలీనం కలుపుకుని గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ జనాభా 17.5లక్షలు అవుతుంది. గతంలో విలీనం చేయాలని ప్రతిపాదించిన గ్రామాల్లో ఒకటైన తాడిగడప ఇప్పుడు మునిసిపాలిటీగా మారింది. కొండపల్లి గ్రామం కూడా మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ గ్రేటర్ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. -
రైతన్నపై అధనపు భారం!
నందిగామరూరల్: ఒకవైపు విత్తనాలు ధర.. మరోవైపు ఎరువుల ఖర్చు.. రోజురోజుకు పెరుగుతున్న కూలీ రేట్లు.. పెట్రోల్, డీజిల్ సంగతి సరేసరి.. పెరిగిన సాగు ఖర్చులకు వెనుకాడకుండా ప్రకృతి విపత్తులను తట్టుకుని.. పంట సాగు చేస్తున్న అన్నదాతలపై కూటమి సర్కారు మోపిన ట్యాక్సుల భారం వారి పాలిట గుదిబండగా మారుతోంది. వ్యవసాయ భూములు దున్ని నాలుగు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నెట్టుకొచ్చే రైతన్న బండి(ట్రాక్టర్)పై కూటమి ప్రభుత్వం ట్యాక్సులు విధిస్తోంది. నిన్న మొన్నటి వరకు ట్యాక్సులు లేకుండా దర్జాగా తిరిగిన తమ రథాలు కూటమి ప్రభుత్వం పుణ్యమాని ట్యాకులు, పెనాల్టీలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదీ సంపద సృష్టేనా.. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా.. ట్రాక్టర్లపై ట్యాక్సులు వసూలు చేసి సంపద సృష్టిస్తున్నారనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. ట్రాక్టర్ ప్రభుత్వం దృష్టిలో యంత్రం అయినప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు మాత్రం కుటుంబ జీవనాధారమనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లపై పలు రకాల పన్నులు విధించటమేంటని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ భారం.. ట్యాక్సులు అదనం.. నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల పరిధిలోని 69 గ్రామ పంచాయతీలలో సుమారు 750కు పైగా ట్రాక్టర్లున్నాయి. పెరిగిన సాగు ఖర్చులకు తోడు రుణాల వాయిదాలు, ఇంధనం, మరమ్మతులు, టైర్లు, డ్రైవర్ ఖర్చులతో ట్రాక్టర్ నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత తరుణంలో కూటమి ప్రభుత్వం మూడేళ్ల పన్నులు, జరిమానాలు విధించటం మరింత అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాక్టర్లపై వసూలు చేస్తున్న మూడు రకాల పన్నులను రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా మోటార్ వెహికల్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్కు సంబంధించి రవాణా శాఖాధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ ట్రాక్టర్లపై పన్నులు వసూలు చేయలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2023 వరకు ట్రాక్టర్లపై ఒక్క రూపాయి కూడా పన్నులు విధించలేదని చెబుతున్నారు. 2023 సెప్టెంబర్లో పన్నులు వసూలుకు ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ రైతుల వద్ద నుంచి మాత్రం పన్నులు కూడా వసూలు చేయలేదని చెబుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం 2023 సెప్టెంబర్ నుంచి పన్నులను పెనాల్టీలతో పాటు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు ఇలా.. ఏడేళ్ల లోపు ట్రాక్టర్కు ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ట్యాక్స్ రూ. 8,970, లేబర్ ట్యాక్స్ రూ.1,480, ఏడేళ్లు దాటిన ట్రాక్టర్లకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ రూ.2,960 చొప్పున వసూలు చేస్తుండటంతో అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. లేబర్, గ్రీన్ ట్యాక్స్ను ఏడాదికొకసారి రూ. 460కాగా మోటార్ వెహికిల్ ట్యాక్స్ మాత్రం మూడు నెలలకొకసారి రూ.460 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తోంది. వ్యవసాయ ట్రాక్టర్లకు మూడు రకాల ట్యాక్స్లు విధించటం సరికాదు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో పాటు ట్రాక్టర్ల నిర్వహణ కష్టంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకు ట్రాక్టర్లకు మోటార్ వెహికిల్, లేబర్, గ్రీన్ ట్యాక్సులను ప్రభుత్వాలు వసూలు చేయలేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మూడు రకాల పన్నులు వసూలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్యాక్సుల వసూలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – డి. శేషయ్య, రైతు -
రాగి తీగల చోరీ ముఠా అరెస్ట్
హనుమాన్జంక్షన్రూరల్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ పగలుకొట్టి రాగి తీగల చోరికి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వీరవల్లి పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్స్టేషన్లో ఈ కేసు వివరాలను గన్నవరం డీఎస్పీ కె.ధర్మేంద్ర శుక్రవారం వెల్లడించారు. వీరవల్లి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న పాత కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కొంత మంది కాపర్ వైర్లు దొంగిలిస్తున్నట్లుగా వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్కు పక్కా సమాచారం అందటంతో తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పథకం ప్రకారం అక్కడ చోరికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు తనదైన స్టైల్లో విచారించటంలో ఈ దొంగల ముఠా చిట్టా విప్పారు. పోలీసులను పట్టుబడిన ఈ ముఠా సభ్యులను ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరంకు చెందిన పొట్లూరి ప్రభుదాస్ అలియాస్ నాని, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన అల్లంశెట్టి భాగ్యరాజు, రావూరి కలగయ్య, రావూరి గోపి, బాపట్లకు చెందిన చేవూరి వంశీ కల్యాణ్, చేవూరి వెంకటేష్, నరసరావుపేటకు చెందిన మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, హనుమాన్జంక్షన్, ఆత్కూరు, వీరవల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఏలూరు జిల్లాలోని 10 పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన 49 కేసులలో 72 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ పగలుకొట్టి రాగి తీగల చోరికి పాల్పడినట్లు గుర్తించామని డీఎస్పీ ధర్మేంద్ర వివరించారు. ఈ ముఠా సభ్యులను గన్నవరం కోర్టుకు హజరు పర్చనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ దొంగలను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహారించిన హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు, కానిస్టేబుల్ దుర్గారావులను డీఎస్పీ ధర్మేంద్ర ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డును అందించారు. హనుమాన్జంక్షన్ సీఐ ఎల్.రమేష్, వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ పాల్గొన్నారు. -
నేడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు 40 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్లో శనివారం నిర్వహించనున్న జిల్లా స్థాయి గురుపూజోత్సవం కార్యక్రమంలో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఉంగుటూరు మండలం జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న సీహెచ్. అనిత, పెనమలూరు మండలం పోరంకి పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.సుమలత, ఉంగుటూరు మండలం అట్కూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కె.విజయ్, గుడివాడ మండలం గంగాధరపురం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.ఎస్. నాగేశ్వరరావు తదితరులు ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయులకు అవకాశం లభించింది. మచిలీపట్నం మండలం పోతేపల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఎం.రామాదేవి, టి.మురళీకృష్ణ, గుండుపాలెం జెడ్పీహెచ్ఎస్కు చెందిన బి.సోమేశ్వరరావు, ఉయ్యూరు మండలం కడవకొల్లు జెడ్పీహెచ్ఎస్కు చెందిన వి. బెణర్జీ సత్య విజయ్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఎస్జీటీ విభాగంలో కూడా పలువురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. గన్నవరం, మోపిదేవి, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, కంకిపాడు, చల్లపల్లి తదితర మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అవార్డుల జాబితాలో ఉన్నారు. ఉర్దూ బోధన విభాగంలో మిర్జా అఫ్సర్ అబ్బాస్, అలియా బేగం కూడా ఎంపికయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో సుమయ్యా ఖాతూన్, ఎ.రాజేశ్వరి, వై.అనిల్కుమార్లకు స్థానం దక్కింది. విజయవాడరూరల్: అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి అంబాపురం గ్రామంలో జరిగింది. విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని మాఫియా ముఠా మినీ వ్యానుల్లో నగర శివారులోని అంబాపురం తరలిస్తున్నారు. అక్కడి విక్రమ పబ్లిషర్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో లారీల్లో లోడు చేస్తున్నారు. దీనిపై పౌర సరఫరాలశాఖ అధికారులకు సమాచారం అందింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వాణి ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 500 బ్యాగుల్లో 250 క్వింటాళ్ళ రేషన్ బియ్యంతో రవాణాకు సిద్ధం అవుతున్న లారీతో పాటు డ్రైవర్ బాలసుబ్రహ్మణ్యంను అదుపులోనికి తీసుకున్నారు. విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు ఏఎస్ఓ 3 లక్ష్మణ్బాబు తెలిపారు. 6ఎ కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దారు ప్రవీణ్రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, లతీఫాలున్నారు. తోట్లవల్లూరు: కేఈబీ కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మండలంలోని చాగంటిపాడు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రొయ్యూరుకు చెందిన చప్పిడి తిరుపతిరావు(51)కు గేదెలు అమ్మే విషయమై భార్య శ్రీదేవితో వివాదం జరిగింది. దీంతో ఆయన ఈ నెల 2వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరుపతిరావు ఆచూకీ కోసం గాలిస్తుండగా శుక్రవారం చాగంటిపాడు వద్ద కేఈబీ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిషోర్ తెలియజేశారు. కలుపు మందు తాగి యువకుడు మృతి తోట్లవల్లూరు శివారు అంబేడ్కర్ నగర్కు చెందిన గుమ్మడి వినోద్కుమార్(29) మనస్తాపంతో ఈ నెల 2వ తేదీ రాత్రి ఇంటి వద్ద కలుపు మందు తాగాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4 న మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిషోర్ తెలిపారు. -
అకారణంగా ఆర్టీసీ డ్రైవర్పై దాడి
గన్నవరం: స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్షాపు వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్పై కొంత మంది యువకులు దాడిచేసి కొట్టిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్షాపు రాత్రి 10గంటలకు మూసివేసిన తర్వాత జానీ అనే వ్యక్తితో అధిక ధరలకు దొడ్డిదారిన మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసరపల్లి శివారు వీఎన్ పురం కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సతీష్కుమార్ మద్యం కోసం అర్ధరాత్రి 12 గంటలకు వైన్షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు చేసి గేటు వద్దకు వచ్చిన అతనిపై బైక్పై వచ్చిన కొంత మంది యువకులు ఇనుప రాడ్లతో దాడిచేసి కొట్టి పరారయ్యారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేరే వ్యక్తి అనుకొని.. అయితే ఈ ఘటనకు ముందు వైన్షాపు వద్ద కొంత మంది యువకుల మధ్య ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సదరు యువకులు పొరబడి గొడవ పడ్డ వ్యక్తి అనుకుని డ్రైవర్పై అకారణంగా దాడిచేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వైన్షాపు వద్ద గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికి ఎకై ్సజ్, పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు కారణంగా వైన్షాపు ఉన్న వీఎన్. పురం రోడ్డులో ప్రయాణించలంటేనే మహిళలు, ఆడపిల్లలు భయపడే పరిస్థితి నెలకొంది. -
తూతూమంత్రంగా తనిఖీలు
కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో విజయవాడ నగరంలో పలుమార్లు డయేరియా వ్యాధి ప్రబలింది. వందల సంఖ్యలో నగర వాసులు ఆస్పత్రుల పాలయ్యారు. గిరిపురం, ఉడ్పేట, భవానీపురం, అజిత్సింగ్ నగర్, నందమూరి నగర్, పటమట ప్రాంతాల్లో తరచూ డయేరియా ప్రబలుతోంది. గత ఏడాది అజిత్ సింగ్ నగర్లో డయేరియా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధానంగా ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నీరు తాగడమే కారణమని జిల్లా వైద్య విభాగం, నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు వాటర్ బబుళ్లలో తాగునీరు సరఫరా చేశారు. మరో వైపు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతపై తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బందరు రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఎక్కువ రోజులు నిల్వవున్న మాంసాన్ని అధికా రులు గుర్తించారు. పటమటలోని మరో రెస్టారెంట్లో కూడా నిల్వ ఉన్న మాంసంతోపాటు ఆహార పదార్థాలు తయారు చేసే వంటగది శుభ్రతపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలు, ఆర్వోప్లాంట్ల పనితీరు, అక్కడ నెలకొన్న శుభ్రతపై నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్వాహకులకు జరిమానా విధించాలని, అప్పటికీ ఫలితం లేకుండా ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీలు చేపట్టి, అంతా బాగుందంటూ నివేదికలు ఇచ్చారు. ఇలా నివేదకలు ఇవ్వడంపై ఆరోపణలు వస్తున్నాయి. -
జల్ జీవనంపై నిర్లక్ష్యం
తిరువూరు: ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న తాగునీటి కారణంగా కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఎ.కొండూరు మండలంలోని గిరిజనులకు రక్షిత మంచినీరు అందించడంలో ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఉదాసీనవైఖరి అవలంబిస్తు న్నాయి. ఫలితంగా మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ మండలంలో జలజీవన్మిషన్ పథకంలో భాగంగా 854 కుళాయిలు ఏర్పాటు చేయడంతో పాటు గోపాలపురం, మాధవరంలో మూడు సంపులు, 21 ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. వాటి నుంచి అన్ని పంచాయతీలు, శివారు గ్రామాలు, తండాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేయాలన్నది లక్ష్యం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదీ జలాలను ఎ.కొండూరు మండలానికి సరఫరా చేసేందుకు 2023లో రూ.49.44 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టు పనులు గతంలోనే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తిచేసి అన్ని గ్రామాలకు కృష్ణా నదీ జలాలను అందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ శాఖల నడుమ సమన్వయం లోపించింది. ఫలితంగా రక్షిత తాగునీరు అందక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. పేదలు రోజుకు రూ.50 ఖర్చు చేసి ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో మంచి నీరు కొనుక్కుని తాగాల్సివస్తోంది. పాత పైపులైన్లతోనే నీటిసరఫరా ఎ.కొండూరు మండలంలోని గ్రామాల్లో పంచాయతీలు బోరు నీటిని విడుదల చేసే పైపులైన్లలోనే కృష్ణా నదీ జలాలను కూడా సరఫరా చేస్తున్నారు. దీనితో కృష్ణా నదీ జలాలను శుద్ధి చేసినప్పటికీ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న సాధారణ నీటితో కలసి ఆశించిన ప్రయోజనం నెరవేరడంలేదు. కృష్ణా నదీ జలాలను సరఫరా చేయడానికి ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ఆరు నెలల్లో ఈ మండలంలోని కృష్ణారావుపాలెం, రామచంద్రాపురం, కోడూరు, కంభంపాడు, ఎ.కొండూరు, ఎ.కొండూరు తండా, గోపాలపురం, చీమలపాడు, మాధవరం గ్రామాల్లో 15 మంది కిడ్నీరోగులు మృత్యువాత పడ్డారు. ఇంకా పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో కిడ్నీ సంబంధిత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి తీవ్రతరం అవడంతో డయాలసిస్ చేసినా ఫలితం లేక గిరిజనులు, పేద రోగులు మృత్యు ఒడి చేరుతున్నారు. ప్రకటనలతో సరిపెడుతున్న అధికారులు రాష్ట్రంలో ఎక్కువ మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులున్న ఎ.కొండూరు మండలంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తిరువూరు, ఎ.కొండూరులో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మండలంలోని భూగర్భ జలాల్లో కిడ్నీవ్యాధికి కారణమైన అంశాలను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత కృష్ణా నదీ జలాల సరఫరాకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాలను త్వరలో సరఫరా చేస్తామంటూ జిల్లా అధికారులు ప్రకటించడం మినహా పూర్తిస్థాయిలో అమలుకు నోచడం లేదు. -
బోధనలో ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఉయ్యూరు మండలం ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా పనిచేస్తున్న కె. కృష్ణవేణి, చల్లపల్లి మండలం పురిటిగడ్డ జెడ్పీహెచ్ఎస్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)గా పనిచేస్తున్న వి. ఉమా సరస్వతి, బాపులపాడు మండలం మల్లవల్లి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న కె. శివనాగ కృష్ణ అవార్డులకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎ కన్వెన్షన్లో జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. విద్యాబోధనలో ప్రతిభ, విద్యార్థుల అభ్యసనాభివృద్ధి, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు ఎంపిక -
జాతీయ స్థాయిలో విజయవాడ షూటర్ల సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేరళంలోని త్రివేండ్రంలో ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్షిప్–2026లో నగరానికి చెందిన షూటర్లు ప్రతిభ చూపి వివిధ విభాగాల్లో 8 పతకాలు పొందారు. ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్కు చెందిన నాగిశెట్టి జాహ్నవి ప్రతిభ కనపరచి 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ఫైర్ ఆర్మ్స్, సీనియర్, జూనియర్, యూత్ మహిళల విభాగాల్లో మూడు కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. కొసన పూర్ణిమ శ్రీనివాస్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో మూడు రజత పతకాలు సొంతం చేసుకుంది. ఏడూరు శ్రీకర జయంత్ రెడ్డి 25 మీటర్ల జూనియర్, యూత్ మెన్ విభాగాల్లో రెండు రజత పతకాలను గెలుచుకున్నాడు. పతకాలు పొందిన షూటర్లను ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు అభినందించారు. ఆగస్టు 31వ తేదీన మొదలైన ఈ చాంపియన్షిప్ ఈ నెల 8వ తేదీ వరకు జరుగుతుంది. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎం.వి. శ్యామ్నాథ్ పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని, బకాయిలు, పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్ల నగ దును వెంటనే చెల్లించాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.రావు, సీహెచ్.గోపాల్, గోపీచంద్ పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఈ నెల ఐదో తేదీన ఏపీ డీ–ఫార్మసీ (ఎంపీసీ, బైపీసీ)లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి గురువారం తెలిపారు. దివ్యాంగులు, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ అభ్యర్థులు స్వయంగా హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఆరో తేదీ రాత్రిలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ఆప్షన్ల మార్పులు, చేర్పులకు ఈ నెల ఏడో తేదీ రాత్రి వరకు అవకాశం ఉందని తెలిపారు. -
కూచిపూడి నృత్య పరీక్ష ఫలితాలు విడుదల
పామర్రు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం(రాజమహేంద్రవరం)శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం కూచిపూడి నందు 2026 జూన్ 29వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు జరిగిన నృత్యం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల సిద్ధాంత, ప్రాయోగిక వార్షిక పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణులైనట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. గురువారం పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. కూచిపూడి నృత్యం సర్టిఫికెట్ కోర్సులో 56 మందికి 56 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అదే విధంగా డిప్లొమా ఇన్ కూచిపూడి నృత్యంలో ఐదుగురికి ఐదుగురు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ముగిసిన రాత పరీక్షలు.. కూచిపూడి నాట్య కళాపీఠంలో గత నెల 31వ తేదీన ప్రారంభమైన ఎంపీఏ మొదటి సంవత్సరం, రెండో సెమిస్టర్ రాత పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ సరీక్షలకు 23 మంది విద్యార్థులు హాజరు కాగా పరీక్ష అధికారిగా టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథశాస్త్రి, చీఫ్ సూపరింటెండెంట్గా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ వ్యవహరించారు. ఇది ఇలా ఉండగా ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంపీఏ, యక్షగానం, సాత్వికాభినయనం కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్పెన్యూర్ నినాదంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 7న కృష్ణా యూనివర్సిటీలో ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాపు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వర్క్షాపు జరుగుతుందన్నారు. వ్యాపారం నిర్వహిస్తున్న వారు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈ వర్క్షాపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థల ప్రతినిధులు, నిపుణులు, బ్యాంకర్లు పాల్గొని వ్యాపారాభివృద్ధికి అవసరమైన అవకాశాలు, పెట్టుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9989092288లో సంప్రదించాలన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తురాలు మహా మండపం రెండో అంతస్తులో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61), తన భర్త నాంచారయ్యతో కలిసి గురువారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు మహామండపం రెండో అంతస్తులో దింపాలని లిఫ్టు సిబ్బందికి కోరింది. అయితే గ్రౌండ్ప్లోర్లో దింపిన సిబ్బంది.. అక్కడి నుంచి మెట్లపై రెండో అంతస్తుకు వెళ్లాలని సూచించారు. మెట్లు ఎక్కే క్రమంలో పద్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆలయ సిబ్బంది వెంటనే పద్మను గ్రౌండ్ ఫ్లోర్కు దింపి, అక్కడి నుంచి దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పద్మ మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకిలా? కనీసం వృద్ధులు, వికలాంగులను అన్నదానం జరిగే ఫ్లోర్లో లిఫ్టు ద్వారా దింపాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర, శని, ఆదివారాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన 2026 మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తక్షణమే జీవో 102ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఎన్యూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 71,547 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు సాధించిన 43మంది రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించారన్నారు. ఎస్వీయూ రీజియన్లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 94,966 కాగా అంతకంటే మెరుగైన ర్యాంకు వచ్చిన 27 మంది రిజర్వేషన్ విద్యార్థులకు ఓపెన్ సీట్లు ఇవ్వకుండా రిజర్వేషన్ సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ కంటే మంచి మార్కులు లేదా ర్యాంకులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించాలని డిమాండ్ చేశారు. -
తనిఖీల్లో తిరకాసు
పటమట(విజయవాడతూర్పు): ఇటీవల విజయవాడలోని పలు హోటల్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల్లో నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంతా బాగుందంటూ నివేదిక ఇచ్చారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, చేపలు, మాంసం దుకాణాల నిర్వా హకుల నుంచి కాసులు దండుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మునిసిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మూడు బృందా లుగా ఏర్పడి, నగరంలోని 64 డివిజన్లలో 286 సచివాలయ పరిధిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 624 హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా అవన్నీ శుభ్రంగా ఉన్నా యని, ఎక్కడా సమస్య లేదని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో చికెన్, మటన్, బీఫ్, చేపల దుకాణాలు 353, ఆర్వోప్లాంట్లు 241 ఉండగా, అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నివేదించారు. అధికారుల నివేదికలపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి పలువురు అధికారులు డబ్బులు తీసుకునే ఇలా నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఇలా.. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో వంట గదులు శుభ్రంగా ఉండేందుకు ప్రజారోగ్య విభాగం పలు నిబంధనలను సూచిస్తోంది. ఆయా వ్యాపార సంస్థలు సొంతగా ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. భోజన టేబుల్పై మూత ఉన్న తాగునీటి జగ్లు ఉంచాలి. కిచెన్ నిత్యం శుభ్రంగా ఉండాలి. మాంసం ఒక్క రోజుకంటే కూడా ఎక్కువ నిల్వ వుండకూడదు. అక్కడ పనిచేసే వర్కర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు హెయిర్ క్యాప్స్ ధరించాలి. అయితే నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఇవేమీ కన్పించవు. మాంసం దుకాణాల గోడలకు ఐదు అడుగుల వరకు టైల్స్ వేయాలి. ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నగరంలోని చాలా దుకాణాల్లో ఇలాంటి వాతావరణం కన్పించదు. ఆర్వోప్లాంట్ల వ్యవహారంలో కూడా నిబంధనలు కఠి నంగా ఉన్నాయి. ఫిల్టర్లను ప్రతినెలా శుభ్రం చేయాలి, నీటి శాంపిల్ను ప్రతివారం ప్రజారోగ్య అధికారులు పరిశీలించాలి. నీరుపట్టే ప్రాంతంలో నీటి పారుదల సక్రమంగా ఉండాలి. అక్కడ టైల్స్ ఉండాలి. కానీ చాలా ప్లాంట్ల వద్ద ఇవేవీ కన్పించటంలేదు. పేరుకే నోటీసులు తనిఖీల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు డొల్లతనం ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 42 రెస్టారెంట్లకు, 11 ఆర్వోప్లాంట్లకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. తమ తనిఖీల్లో కేవలం రూ.55 వేల జరిమానా విధించారు. హోటళ్లకు నోటీసులు జారీచేసిన తరువాత తాము సూచించిన అంశాలను సరిచేసుకున్నదీ లేనిదీ తిరిగి పరిశీలించడం లేదు. ఆయా సంస్థల నిర్వాహకులతో హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా బేరాలాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఒక్కో రెస్టారెంట్, హోటల్ రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. -
వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటిన కృష్ణా క్రీడాకారులు
మచిలీపట్నంఅర్బన్: తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్షిప్ వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ, మూడు రజత పతకాలు సాధించారు. జి.లెనిన్ ప్రియ, బి.ఝాన్సీ స్వర్ణం, ఓ.గాయత్రి, యశోధర్, ఎన్.వి.అనూ రజత పతకాలు సాధించారు. గురువారం కలెక్టరేట్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్, డీఎస్ఏ చైర్మన్ డి.కె.బాలాజీ అభినందించారు. కోచ్ల కృషి, క్రీడాకారుల పట్టుదల, క్రమశిక్షణ, సాధనతోనే రాష్ట్రస్థాయి విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. డీఎస్ఏ కోచ్ వి.అయ్యప్ప, జిల్లా వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.రవి పతక విజేతలను అభినందించారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రక్తం నిల్వలు, రక్తదాన శిబిరాల నిర్వహణను మరింత బలోపేతం చేసి అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం సాయంత్రం డిస్ట్రిక్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవీ – ఎయిడ్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్త నిల్వలు, హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, రెడ్క్రాస్ సంస్థల సమన్వయంతో మరిన్ని శిబిరాలు నిర్వహించాలన్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలన్నారు. హెచ్ఐవీ బాధితులకు చికిత్స, సేవలు, నిరంతరం అందేలా సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిస్ట్రిక్ టీబీ అధికారి డాక్టర్ ఎ వెంకట్రావు, డిస్ట్రిక్ మెడికల్ అధికారి డాక్టర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ పది విశేష అలంకారాల్లో భక్తులను కరుణిస్తారు. గురువారం జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో దసరా విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్ను దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ఆవిష్కరించారు. ఈ మేరకు 11వ తేదీ నుంచి అమ్మవారు పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల తొలి రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఇక విజయ దశమి మంగళవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంసవాహన సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారిలోని ప్రతిభను వెలికితీసి ఉపాధి, స్వయం ఉపాఽధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్లో కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ, ల్యాబ్లను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ యువతకు ఉపాధి కల్పించే వేదికగా నిలుస్తాయన్నారు. జిల్లాలోని జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, స్థానిక వంటకాలు, కళాకారుల ప్రతిభను డిజిటల్ రూపంలో డాక్యుమెంట్ చేసి భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి జి.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, డీపీఆర్ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సిబ్బంది దౌర్జన్యం.. మహిళ ఆత్యహత్యాయత్నం
అవనిగడ్డ: తమకు సమాచారం ఇవ్వకుండా తమ పొలంలో రెవెన్యూ సిబ్బంది సర్వే చేయడాన్ని అడ్డుకున్న మహిళపై రెవెన్యూ సిబ్బంది హేళనగా మాట్లాడి, దౌర్జన్యం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. బాధితురాలి నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దక్షిణ చిరువోలులంకకు చెందిన పరిశె శోభనాద్రికి పంచాయతీ పరిధిలో 40 సెంట్ల పంట భూమి ఉంది. ఈ రహదారి పక్కనే పంచాయతీ రహదారి ఉండగా ఈ రోడ్డుపై శోభనాద్రి కుటుంబ సభ్యులను నడవకుండా కొంత మంది పెత్తందారులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఇంతకు ముందు పనిచేసిన తహసీల్దార్ రోడ్డుపై నడవడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. అడ్డుకోవడంతో.. గురువారం ఉదయం వీఆర్వో చిన్నారితో పాటు సర్వేయర్, కార్యదర్శి సర్వే చేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న శోభనాద్రి భార్య సుజాత ఘటనాస్థలికి వెళ్లి తమ భూమి పక్కనే పంచాయతీ రహదారి ఉందని, ఇక్కడ రైతులు ఎవరూ లేరని, తమకు సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించింది. తన భర్త వచ్చే వరకూ ఆగాలని చెప్పినప్పటికీ విన కుండా పొలాల్లో కర్రలు పాతడంతో ఆమె అడ్డుకుంది. దీనికి ఆగ్రహించిన వీఆర్వో ఆమెను హేళన చేయడంతో పాటు దౌర్జన్యం చేయగా మనస్తాపం చెందిన సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వెంటనే బంధువులు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా పదిరోజుల క్రితం పొలం వెళ్తే ఆ కుటుంబం కత్తులతో తనపై దాడికి ప్రయత్నించగా భయంతో పారిపోయి వచ్చానని శోభనాద్రి చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
పంచాయతీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు
మచిలీపట్నంఅర్బన్: గ్రామాల పారిశుద్ధ్యం, తడి–పొడి చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి, కార్మికులను స్వర్ణ పంచాయతీ పోర్టల్లో నమోదు చేసి నేరుగా విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఒక్కరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు జారీ చేసిన జీవోలను అమలు చేయాలని, కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఒకే పని చేస్తున్న కార్మికులకు రూ.1,500 నుంచి రూ.14,500 వరకు వేర్వేరు వేతనాలు చెల్లిస్తున్నారని, ఈ వ్యత్యాసాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.10వేల వేతనం చెల్లించాలని జీఓ నంబర్ 680లో ఉన్నప్పటికీ అనేక పంచాయతీల్లో అమలు కావడం లేదన్నారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. జగన్, ఎం. గణేష్, కార్యదర్శివర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు, నాగమణి, సభ్యులు పాల్గొన్నారు. -
బందరులో ఆకస్మిక తనిఖీలు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ. లక్ష్మీరెడ్డి బందరులో గురువారం సాయంత్రం పర్యటించారు. నగరంలోని మాచవరం రేషన్షాపును పరిశీలించారు. దుకాణంలోని స్టాక్ వివరాలపై ఆరా తీసి అనంతరం అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా, లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆరా తీశారు. అనంతరం రేషన్షాపులోని స్టాక్ రికార్డుల ప్రకారం పరిశీలించారు. అనంతరం వలందపాలెం బీసీ బాలికల వసతిగృహంలో విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందుతున్నాయా, లేదా రుచికరంగా ఉంటున్నాయా అనే అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు. ముస్తాఖాన్పేటలోని సాంఘిక సంక్షేమశాఖ నిర్వహణలో ఉన్న సమీ కృత విద్యార్థుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆ వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి పి. శివరామప్రసాద్, పౌరసరఫరాలశాఖ అధికారులు, ఆయా వసతి గృహాల వార్డెన్లు ఉన్నారు. -
డ్రైవర్ను హత్య చేసిన క్లీనర్ అరెస్ట్
పెనమలూరు: కానూరులో లారీ డ్రైవర్ను హత్య చేసిన ఘటనలో లారీ క్లీనర్ను అరెస్ట్ చేశామని డీఎస్పీ కె.ధర్మేంద్ర తెలిపారు. ఆయన పెనమలూరు పోలీస్స్టేషనల్లో గురువారం వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ ఆనంద్సర్కార్(50) లారీ మరమ్మతుల కోసం కానూరు నవతారోడ్డులో ఉన్న రమణ షెడ్డుకు గత నెల 5వ తేదీన వచ్చాడు. అతను లారీ మరమ్మతులు చేయించుకుంటూ అక్కడే ఉంటు న్నాడు. అయితే అదే లారీకి క్లీనర్గా బెంగాల్ రాష్ట్రానికి చెందిన సంజయ్హల్దార్ (36) ఆగస్టు 19వ తేదీన వచ్చాడు. అయితే ఈ నెల 30వ తేదీ రాత్రి ఇద్దరు మద్యం తాగారు. అనంతరం వారి మధ్య గొడవ మొదలయింది. దీంతో లారీ క్లీనర్ సంజయ్హల్దార్ ఇనుప రాడ్తో డ్రైవర్ ఆనంద్ సర్కార్పై విచక్షణా రహితంగా దాడి చేయటంతో అతని మృతి చెందాడు. లారీ షెడ్డు యజమాని రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు సంజయ్హల్దార్ను అరెస్టు చేశారు. యజమానుల వద్ద వివరాలుండాలి.. మద్యం తాగిన వారు విచక్షణ కోల్పోరాదని డీఎస్సీ ధర్మేంద్ర తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం సేవించిన తరువాత చిన్న వివాదం కారణంగానే హత్య జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసే వారి వివరాలు యజమానుల వద్ద ఉండాలన్నారు. ఆధార్కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు యజమానులు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా ఉంచుకోవాలని సూచించారు. బెంగాల్కు చెందిన నిందితుడు సంజయ్హల్దార్ ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేసినందుకు సీఐ వెంకటనారాయణ, ఎస్ఐలు సత్యసుధాకర్, రమేష్, వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు.వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధర్మేంద్ర -
1500మంది.. 108 మహా సూర్య నమస్కారాలు
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు గుడివాడరూరల్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 1500 మంది ఏకకాలంలో 108 మహా సూర్య నమస్కారాలు చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు సహకారంతో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య యోగా డైట్ నిపుణుడు పూడి లక్ష్మణ్ సూచనలతో గుడివాడకు చెందిన యోగా శిక్షకురాలు వర్రే లీలావతి ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కార్యదర్శి కిలారు రంగప్రసాద్, వన్టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 5, 6వ తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని మొత్తం 1,936 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ముసాయిదా జాబితాలో అందిన క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా తయారీపై గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల విభాగ కార్యాలయం నుంచి సీఈఓ వివేక్ యాదవ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ఈ రెండు రోజులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి అందుబాటులో ఉంటారన్నారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించడం, ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి తగిన సలహాలు, సూచనలు చేస్తారన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హత కలిగిన వయోజనులు, అలాగే 18–19ఏళ్ల యువత ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఎ.కొండూరు మండ లంలో కిడ్నీ రోగులకు రక్షిత మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదు. అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవ డంతో గిరిజనులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వెంటనే రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. – నల్లగట్ల స్వామిదాసు, మాజీ ఎమ్మెల్యే, తిరువూరు -
రూ.25 కోట్లతో దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు రూ.25 కోట్లతో అంచనాలను రూపొందించామని దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం మహా మండపం నాల్గో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, ఈఓ, ఏఈఓలు, సూపరిండెంటెంట్లు, ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలతో రూపొందించిన పోస్టర్ను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మొత్తం 54 అంశాలు చర్చకు రాగా, 50 అంశాలకు ఆమోదం లభించింది. వీటిలో ఎక్కువ ప్రతిపాదనలు దసరా ఉత్సవాలకు సంబంధించినవే. ఈ సమావేశానికి ముందే సుమారు రూ.25 కోట్ల మేర బిల్లులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పనులకు బోర్డు సభ్యులు ఆమోదం తెలపడం గమనార్హం. ఆమోదం తెలిపిన కీలక అంశాలివే... ఆస్ట్రేలియాలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం, కుంకుమార్చన నిర్వహించేందుకు ఆరుగురు వైదిక సిబ్బందిని డెప్యుటేషన్పై పంపేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. క్లోక్రూమ్, చెప్పులస్టాండ్లో పని వారిని నియమించి, వారి ద్వారా ఆయా కౌంటర్లు దేవస్థానం నడపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కొబ్బరి చెక్కలను పోగు చేసుకునే హక్కును బహిరంగ వేలంలో సంకాబత్లు నాగవైష్ణవి రూ.1.36 కోట్లకు హెచ్చపాటను పాడింది. ఈ వేలానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. అమ్మవారి ఉత్సవాల్లో కాయలు, పండ్లను సరఫరా చేసే టెండర్ను సీహెచ్.నాగ విజయ, శ్రీవిజయ ట్రేడింగ్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూల సరఫరా టెండర్ను ఎం. గంగాధర్రెడ్డికి కేటాయించింది. నూతన లడ్డూ పోటు భవనం పక్కనే వంటశాల కోసం రూ.40 లక్షలతో షెడ్డు నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఉత్సవాల్లో తాత్కలికంగా డ్రైవర్లు, సూపర్వైజర్ల నియామకానికి రూ.6.20 లక్షల అంచనాలకు, భక్తులను కొండపైకి, దిగువకు తీసుకెళ్లేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుకు రూ.32 లక్షలతో చేసిన అంచనాలకు, డీఈఈగా ఉద్యోగ విమరణ చేసిన వి.కోటేశ్వరరావును కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగించేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం. దసరా ఉత్సవాల్లో భక్తులకు లడ్డూ ప్రసాదాలను కొరత లేకుండా అందించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆరు లడ్డూల బాక్స్ను రూ.100 చొప్పున విక్రయిస్తుండగా, దసరా నుంచి మూడు లడ్డూలను బాక్స్ రూపంలో రూ.50 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. సాక్షి కథనాలపై చర్చ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వరసగా చోటు చేసుకుంటున్న వివాదాలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ వరస కథనాలుగా ప్రచురిస్తోంది. ఈ కథనాలపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి చేసే విశేష అలంకారాలు, ఇటీవల ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య చోటు చేసుకున్న వివాదం, అన్నదాన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి పార్టీకి చెందిన కొంత మంది సభ్యులు దూరంగా ఉండటంతో పాటు ‘సాక్షి’ గురువారం ప్రచురించిన ‘అమీతుమీ తేలుస్తారా... మౌనం పాటిస్తారా’ కథనంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరో వైపు ఆలయ వ్యవహారాలు ‘సాక్షి’కి చేరడంపైన కొంత మంది సభ్యులు చర్చను లేవనెత్తారు. అయితే అవన్నీ వాస్తవం కావడంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారని తెలిసింది. -
రామ్జీ పథకం పనుల్లో నాణ్యత పాటించాలి
జయంతిపురం(జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపడుతున్న పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలన్నారు. పథకం ద్వారా చేపడుతున్న పనులు రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చటంతో పాటు భూగర్భజలాల పెంపునకు దోహదపడేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యాన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలని అర్హులైన రైతులు ఆ పంటల సాగుకు ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో అనిల్కుమార్, తహసీల్దార్ శిరీష, డ్వామా ఏపీవో రామ కృష్ణ, డీఎల్డీవో లక్ష్మీకుమారి, ఎంపీడీవో అరుణ కుమారి, ఆర్ఐ ఆనందబాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఏపీఐఐసీ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
దళిత కుటుంబంపై దాష్టీకం
కోనేరుసెంటర్: బందరు మండలంలో ఓ దళిత కుటుంబంపై గ్రామంలోని జనసేన పార్టీకి చెందిన కుటుంబం దాడి చేసింది. ఈ దాడిలో దళిత సామాజికవర్గానికి చెందిన భార్యాభర్తలు గాయాల పాలు కావటంతో పాటు తీరని అవమానానికి గురయ్యారు. దాడి చేసిన జనసేన కుటుంబీకులు అంతటితో ఆగక దళిత దంపతులను ఇంట్లో నుంచి బయటికి లాగి, తాళాలు పెట్టటంతో పాటు వారిని ఊరి నుంచి వెలేశామని.. ఎవరైనా తాళాలు తెరిస్తే.. పెట్రోల్ పోసి తగలబెడతా మంటూ బాధిత కుటుంబంతో పాటు బంధువులను సైతం బెదిరించారు. ఏం జరిగిందంటే.. బందరు మండలం పెదయాదర గ్రామానికి చెందిన పొనుగుమాటి ఏడుకొండలు, మాధురి భార్యాభర్తలు. వీరు గత 15ఏళ్లుగా గ్రామంలోని పీడబ్ల్యూడీ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కంచర్లపల్లి నాంచారమ్మకు మాధురి కుటుంబం సాగు చేస్తున్న 30 సెంట్లు భూమికి ఆనుకుని కొంత పొలం ఉంది. అయితే మాధురి కుటుంబం సాగు చేసుకుంటున్న 30 సెంట్లు భూమిపై నాంచారమ్మ కుమార్తెలు గరికపాటి సీతారావమ్మ, భోగాది రజనీ, బండి లక్ష్మీకాంతంలతో పాటు వారి భర్తల కన్నుపడింది. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన వారి భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తూ వస్తుండగా మాధురి, ఏడుకొండలు వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. గత నెల 30వ తేదీన ఏడుకొండలు, మాధురి తమకు ఉన్న 30 సెంట్ల పొలంలో నాట్లు వేయగా రజనితో పాటు ఆమె బంధువులు, డ్రైవర్ సనకా మహేష్ అతని బంధువులు కలిసి ట్రాక్టర్తో ఆ పంటను తొక్కించేశారు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. రజని ఆమె తరఫు బంధువులపై మాధురి అదే రోజు బందరు రూరల్ పోలీస్స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. అధికారుల ప్రమేయంతో.. మరుసటి రోజు జరిగిన విషయం సోషల్ మీడియా ద్వారా బయటికి పొక్కటంతో బందరు రూరల్ సీఐ ఏసుబాబు, సౌత్ మండల తహసీల్దార్ శివ ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఏడుకొండలు ఇంటి తాళాలు తెరిపించి లోనికి పంపారు. జరిగిన సంఘటనపై గ్రామంలో జనసైనికులమని చెప్పుకునే అగ్రవర్ణానికి చెందిన వారందరిపై తాలూకా పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా దళిత కుటుంబానికి జరిగిన అవమానాన్ని తెలుసుకున్న మండల వైఎస్సార్ సీపీ నాయకులు, పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ నెల 2వ తేదీ రాత్రి గరికపాటి వీరరాఘవయ్య, సీతారావమ్మ, బోగాధి రజని, బండి లక్ష్మీకాంతం, సనకా మహేష్ కలిసి మాధురి, ఏడుకొండలుపై విచక్షణారహితంగా దాడి చేయటంతో పాటు కులం పేరుతో దూషించారు. అక్కడితో ఆగకుండా వారిని ఇంట్లో నుంచి బయటికి తోసేసి తాళాలు పెట్టారు. తాళాలు తీసే ప్రయత్నం చేస్తే పెట్రోల్ పోసి తగులబెట్టేస్తామంటూ బెదరించారు. వారితో పాటు వారి బంధువులను హెచ్చరించారు. దీంతో ఏడుకొండలు, మాధురి జరిగిన విషయాన్ని గ్రామంలోని కొంత మంది పెద్దలకు చెప్పి ఇంటి ముందు తెల్లవార్లు కునుకు లేకుండా అలాగే నిలబడ్డారు. మాధురి, ఏడుకొండలుకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేని గ్రామానికి చెందిన అనేక మంది అగ్రవర్ణాలకు చెందిన కుటుంబీకులు వారికి అండగా నిలిచారు. కుల అహంకారంతో తెగబడిన జనసేనకు చెందిన కుటుంబం -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
పెడన: మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఇంట్లో ఉన్న గడ్డిమందును తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందిన సంఘటనపై గురువారం పెడన పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన వరుదు వెంకటకృష్ణారావు (55)మద్యానికి బానిసయ్యాడు. గతంలో కూడా ఇంట్లో వారిని డబ్బులు కోసం బెదిరించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇలాగే బుధవారం మధ్యాహ్నం కూడా ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని గడ్డిమందును తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పెడన పోలీసులు మృతుని భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్లు ఎంపిక
గన్నవరంరూరల్: మండలంలోని చిన అవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్రథ మెడికల్ కళాశాలలో 12వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ బాల్ బ్యాడ్మింటన్ పురుషులు, మహిళా జట్టుల ఎంపిక ఆగస్టు 30 నుంచి బుధవారం వరకు జరిగాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి క్రీడాకారులు తమ ప్రతిభను చూపారు. కృష్ణాజిల్లా పురుషుల జట్టు జీవీ సుబ్బారావు కెప్టెన్, జి.వంశీధర ప్రసాద్, పి.కార్తీక్, ఎం.దామోదర చందు, కె.శ్రీను, ఎ.కార్తిక్, డి.జగదీష్, బి.నరేష్, ఎ.సాయిరాం, కె.రాజేష్, కె.రాజేంద్రబాబు కోచ్గా వ్యవహరించనున్నారు. మహిళా జట్టు యు.శ్రీలేఖ, కె.మౌనిక, శ్రీలత, ఎన్.భవాని, రామచంద్రిక, శ్రావణి, మేరీ రత్నకుమారి, పి.భువనేశ్వరీ, జేగువీన రవలి, పి.నాగదుర్గ, కోచ్గా ఎం.రాంబాబు, వ్యవహరిస్తారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ జట్టు సెప్టెంబరు 4 నుంచి 6 వరకు నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగే పోటీలలో ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్లను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.భీమేశ్వర్, ఏవో టి.వి. సుబ్బారావులు అభినందించి మాట్లాడారు. పోటీల్లో చక్కటి ప్రతిభ చూపి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కార్యదర్శి ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వరుస చోరీల నిందితుడు అరెస్ట్
ఉంగుటూరు(గన్నవరం) షామియానా షాపు నిర్వహణ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు ఉంగుటూరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ. 95 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఉంగుటూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె. ధర్మేంద్ర బుధవారం వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉంగుటూరు, లంకపల్లి, నందమూరు, కొయ్యగూరపాడు గ్రామాల్లో వరుస చోరీలు జరిగినట్లుగా చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, సీసీఎస్ సీఐ గోవిందరాజులు నేతృత్వంలో ఉంగుటూరు పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. వివిధ సాంకేతిక పద్దతులతో పాటు బాధితుల అనుమానం మేరకు ఉంగుటూరుకు చెందిన షామియానా దుకాణానికి చెందిన ధూళిపూడి శ్యామ్బాబు అలియాస్ నానిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టురట్టయినట్లు చెప్పారు. అతడి నుంచి 615 గ్రాముల బంగారం, 2.75 కిలోల వెండి వస్తువులు, రూ.60 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై 2014లో ఒక కేసు నమోదైనట్లు చెప్పారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఉంగుటూరు ఎస్ఐ యు. గోవిందు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. షామియానా షాపు నిర్వహణ వృత్తిగా, చోరీలు ప్రవృత్తిగా ఎంచుకున్న శ్యామ్బాబు గత ఏడు నెలలుగా వరుస చోరీలతో ప్రజలతో పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. రూ.95 లక్షల సొత్తు రికవరీ -
కృష్ణానదిలో నిలిచిపోయిన పంటు
ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన కంకరు, బూడిద, గ్రావెల్ జల రవాణా ద్వారా సరఫరా చేసే పంటు ఇసుక మేటలు అడ్డొచ్చి నిలిచిపోయింది. పది లారీలు బూడిద, కంకర సామగ్రితో సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెం వద్దకు బయలు దేరింది. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీటితో నదిలో ఇసుక మేటలు మధ్య పంటు నీటిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. రెండు రోజులుగా పంటు రవాణా నిలిచి పోవడంతో లారీల రాకపోకలు వెస్ట్ బైపాస్ మీదుగా అమరావతి ప్రాంతానికి మెటీరియల్ రవాణా చేపట్టారు. నదిలో చిక్కుకున్న పంటును డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా తీసేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక రమేష్ ఆస్పత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా) కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాఘర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈ–డీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ గ్రోత్పై వర్క్షాప్ బుధవారం జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంఎస్ఎంఈ ఈడీ సుధాకర్తో పాటుగా జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చీరాలకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. చీరాల కొత్తపేటకు చెందిన ఎం. నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించే చర్యలో భాగంగా ఎక్కువ డిమాండ్ ఉన్న లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లో పెరగనున్న రద్దీని తగ్గించే దిశగా హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ కల్పిస్తూ రైల్వేశాఖ ప్రకటించింది. దీని ప్రకారం దసరా, దీపావళి పండుగ సీజన్లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 11 వరకు (15 రోజులు), అదే విధంగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సీజన్లు డిసెంబర్ 18 నుంచి 2027 జనవరి 19 వరకు (33 రోజులు) హైటెక్ సిటీలో తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందన్నారు. హైటెక్ సిటీలో ఆగే రైళ్లు ఇవే.. ●నర్సాపూర్–లింగంపల్లి (17255) ఆయా రోజుల్లో ప్రతి రోజు ఉదయం 4.45కి హైటెక్ సిటీ చేరుకుని 4.46కి బయలుదేరుతుంది. అదే విధంగా లింగంపల్లి–నర్సాపూర్(17256) రాత్రి 9.08కి చేరుకుని 9.09కి బయలుదేరుతుంది. ● కాకినాడ టౌన్–లింగంపల్లి(12775) ఉదయం 7.10కి చేరుకుని 7.11కి బయలుదేరుతుంది. లింగంపల్లి–కాకినాడ టౌన్(12776) రాత్రి 7.08కి హైటెక్ సిటీ చేరుకుని 7.09కి బయలుదేరుతుంది. -
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ డీఎస్ఎన్ రెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీలోపు ఉద్యోగ సంఘాలను చర్చలకు సమస్యలపై చర్చించాలన్నారు. బుధవారం గాంధీనగర్లోని ఏపీఎన్జీవో కార్యాలయంలో జిల్లా జేఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం, ప్రభుత్వంతో చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, డీఏలు, సరెండర్ లీవ్లు, పెండింగ్ బకాయిల చెల్లింపులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మంత్రుల కమిటీ జేఏసీ సంఘాలతో సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించ లేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కోరారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ సయ్యద్ ఖాసీం, పి.రమేష్ ఎ. అనుగ్రహ ప్రసాద్, వైస్ చైర్మన్ జి.నారాయణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ డీఎస్ఎన్ రెడ్డి -
అక్టోబర్ 3, 4 తేదీల్లో అడ్వకేట్స్ బ్యాడ్మింటన్
పామర్రు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని కురుమద్దాలి గ్రామంలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని స్కిల్ హబ్లో బయోమెట్రిక్ డేటా ఆపరేటర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్కుమార్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించి అనంతరం కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పామర్రు, ఉయ్యూరు, పమిడిముక్కల, గుడివాడ, పెదపారుపూడి, మొవ్వ మండలాల పరిసర ప్రాంతాల యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన సర్టిఫికెట్, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. పూర్తి వివరాల కోసం 8074370846 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పటమట(విజయవాడతూర్పు): వాహనం గుంతలో పడి అదుపు తప్పిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరు మండలం పోరంకి గిరిజాపురం కాలనీకి చెందిన నిమ్మగడ్డ ధర్మేంద్ర కుమార్ (92) పోరంకి నుంచి దుగ్గిరాలకు ఎలక్ట్రికల్ మూడు చక్రాల వాహనంపై వెళ్తున్నాడు. బెంజిసర్కిల్ సమీపంలోని సర్వీస్ రోడ్డులోకి తిరుగుతుండగా అక్కడ రోడ్డుపై ఉన్న గుంతలో వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ధర్మేంద తలకు బలమైన గాయమవ్వగా స్థానికులు 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లగా ధర్మేంద్ర అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖండించిన ఏపీ క్రిస్టియన్ సొసైటీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ క్రిస్టియన్ (మైనార్టీ) సొసైటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ సభ్యుడు పాస్టర్ జి.అరుల్ అరసు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఒక మతానికి సంబంధించిన వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారన్నారు. మరో సభ్యుడు జేమ్స్ కుంపట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూ మతానికి ఎటువంటి సహాయ, సహకారాలు అందించలేదని, కేవలం క్రైస్తవ మతాన్ని మాత్రమే ప్రోత్సహించారంటూ విజయసాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి చరిత్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆయన కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి సొంత పార్టీ పెడుతూ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. క్రైస్తవులపైన, క్రైస్తవ మతంపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి
గుడ్లవల్లేరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆర్ఎంపీ దుర్మరణం చెందాడు. గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు.. మండలంలోని అంగలూరుకు చెందిన పేరుబోయిన శ్రీనివాసరరావు(48) ఆర్ఎంపీగా వైద్యం చేస్తుంటాడు. ఆయన బుధవారం తన పొలానికి సాగునీరు పెట్టేందుకు డీజిల్ కోసం ద్వి చక్రవాహనంపై గుడ్లవల్లేరుకు వచ్చారు. అంగలూరుకు తిరిగి వస్తుండగా గుడివాడ నుంచి వస్తున్న కారు టైరు పేలిపోయి శ్రీనివాసరరావు మీదకు దూసుకొచ్చింది. బలమైన గాయాలు కావటంతో పేరుబోయిన అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అటవీ ప్రాంతం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
● పగలు నరకడం, రాత్రి వేళ తరలించడం ● ఇటుక బట్టీలకు భారీగా రవాణా ● అక్రమార్కులకు వరంలా మారిన యుద్ధ ప్రభావం ● జగయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో శృతిమించిన దందా ● కళ్లు మూసుకుంటున్న అటవీశాఖ ● సొంతశాఖలో పరిస్థితిపై సమీక్షించని డెప్యూటీ సీఎం పవన్ టన్ను రూ.3వేల వరకు.. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల పరిధిలో 20వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇదే నియోజకవర్గంలో ఇటుక బట్టీలు అధికంగా ఉండడంతో కలపకు డిమాండ్ ఉంటుంది. దీంతో కొందరు అడవిలో చెట్లను కోత మిషన్లతో ముక్కలుగా కటింగ్ చేసి ఇటుక బట్టీలతో పాటు టింబర్ డిపోలకు సైతం తరలిస్తున్నారు. అడవిలో లభించే నిద్రగన్నేరు, నరలేగి, రేగి, తుమ్మ, వేప, నల్లతుమ్మ వంటి చెట్లను కలప దొంగలు ఎక్కువగా నరికి తరలిస్తున్నారు. ఈ కలప అయితే దృఢంగా ఉండి ఇటుక బట్టీలలో ఎక్కువ సమయం మండే స్వభావం ఉంటుంది. దీంతో అక్రమార్కులు ఈ చెట్లనే ఎక్కువగా నరుకుతున్నారు. టన్ను కలపను ఇటుక బట్టీల నిర్వాహకులకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ఒక్కొక్క బ్యాచ్ కలప దొంగలు ఒక ట్రాక్టరు ట్రక్కు అంటే 10 టన్నుల వరకు కలపను మిషన్లతో ముక్కలుగా చేసి తరలిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా పెద్ద తుమ్మ చెట్లను నరికి ఆ కలపను డింబర్ డిపోలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక చోట డంపు చేసి.. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ‘మాకు డబ్బులు బాగా అవసరం. మా తమ్ముడు, మరదలు విదేశాలకు వెళ్లాలి. నీ పేరు మీద ఉన్న ఆస్తులు విక్రయించి డబ్బులు తీసుకురా’ అంటూ భర్త, అత్తింటి వారు సాగిస్తున్న వేధింపులు తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దేవీనగర్ ప్రాంతంలో నివసి స్తున్న బొమ్మిన హరీష్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. భద్రా చలం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన నందిని (32)తో అతనికి 2016వ సంవత్సరంలో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హరీష్ కొంత కాలం నుంచి పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని నందినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని తమ్ముడు భార్గవ్, మరదలు ఉమా విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు కావాలని.. ఆమె పేరు మీద ఉన్న ఆస్తులను విక్రయించి డబ్బులు తెస్తావా? లేదా? అంటూ హరీష్తో పాటు అతని కుటుంబ సభ్యులు నందినిపై వత్తిడి తెస్తున్నారు. వారి వేధింపులు భరించలేని నందిని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు హరీష్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆయన పేరు చెబితే వదిలెయ్యాలి! -
ఏపీలో ‘సర్’ గడువును పెంచిన ఎన్నికల కమిషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువును రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెంచింది. ఈ నెల 10 వరకు సర్ గడువు ఉంటుందని తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. -
కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. తమపై దాడి జరిపి.. పారిపోతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దేవరపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన దుండగుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు దుండగుడు నిన్న ఉదయం పోలీసులపై దాడి జరిపి పారిపోయాడు. అయితే అతన్ని పట్టుకునే క్రమంలో మరోసారి పోలీసుల మీదకు దాడికి దిగినట్లు తెలుస్తోంది. కత్తి, రాళ్లతో దాడి చేయగా.. ఈ క్రమంలోనే అతన్ని నిలువరించేందుకు కంకిపాడు సీఐ కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడిని అవినాశ్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో అతని రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: గృహ ప్రవేశం చేసిన నాలుగు రోజులకే విషాదం -
‘ముకుంద జ్యూవెలరీ’ ఔట్లెట్ ప్రారంభం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్మార్క్ గోల్డ్ జ్యువెల్లరీ, స్టోన్స్ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్తోపాటు క్యారెట్కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారం¿ోత్సవ సేల్ను నగరం ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. -
సమష్టి కృషితో జిల్లాకు ప్రథమ స్థానం
కృష్ణా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్: రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందంటే దానికి ప్రధాన కారణం సిబ్బంది పనితీరు, సమష్టి కృషి అని ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన పలువురు పోలీసు అఽధికారులు, సిబ్బందిని సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ.. ఉద్యోగ బాధ్యతలో భాగమేనన్నారు. సర్వీసులోకి వచ్చినపుడు ఎంత సంతోషపడతామో సంపూర్ణ ఆరోగ్యంతో పదవీ విరమణ పొందేటప్పుడు అంతే ఆనందంగా ఉండాలన్నారు. నేరాల నియంత్రణలో జిల్లాకు అత్యంత గుర్తింపు తీసుకురావడంలో మీరంతా చేసిన కృషి పడిన కష్టం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అనంతరం ఆయన పదవీ విరమణ పొందిన డీటీసీ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, ఎస్సై హనుమంతరావు, ఉమెన్ ఎస్సై టి.వెంకటరమణ, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సిబ్బందికి పోలీసుశాఖ తరఫున అందాల్సిన ప్రయోజనాలు వీలైనంత త్వరగా చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, ఏఆర్ ఆర్ఐ రవికిరణ్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు. నిమ్మకూరు(పామర్రు): తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు తెలుగు సంస్కృతి అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత సప్తాహ మహోత్సవాలు ఏపీలో జరిగాయి. దీనిలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఎస్ల నిర్వహణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర జరిగింది. టీటీడీ కమ్యూనిటీ హాల్ విద్యార్థులు సంస్కృత భాష గొప్పదనాన్ని వివరించారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఏపీఆర్జెసీ కళాశాల ప్రధానాచార్యులు సాంబశివరావు, ఏపీ గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు మండలి బ్రహ్మణేశ్వరమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు భవానీపురం(విజయవాడపశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్మార్క్ గోల్డ్ జ్యువెల్లరీ, స్టోన్స్ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్తోపాటు క్యారెట్కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ సేల్ను నగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రైతన్నకు సాగునీటి కష్టం!
● గుడివాడలో రైతుల ఆందోళన ● నాగాయలంకలో ఎండిపోతున్న నారుమళ్లు నాగాయలంక/గుడివాడరూరల్: అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాల్లో రైతన్న సాగునీటి కష్టం ఎదురవుతోంది. నాగాయలంక మండలంలో సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోతుంటే రైతన్నలు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. సాగునీరు అందించి ఆదుకోండి మహాప్రభో అని పాలకులను, అధికారులను వేడుకుంటున్నారు. సీజన్ మొదట్లో కూటమి సర్కార్ నీళ్లు ఇస్తున్నామంటూ ఆశ చూపి చేతులెత్తేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పర్యవసానంగా నాగాయలంక మండలంలో ఈ ఏడాది వ్యవసాయం చతికిలపడింది. సుమారు 60 శాతంపైగా పొలాల్లో పనులు మొదలుకాలేదు. ఆయిల్ ఇంజిన్లతో నీటి చేదుకుని వరి నారుమళ్లు వేసుకున్నా ప్రభుత్వం సాగునీరు అందించకపోవడంతో నారుమళ్లు ఎర్రగా మారి ఎండిపోతున్నాయి. మండలంలోని బర్రంకుల, కమ్మనమోలు, సంగమేశ్వరం, నాలి తదితర తీరప్రాంత పొలాలు బీడుగా మారిపోయాయి. భావదేవరపల్లి రెవెన్యూ పరిధిలోని చోడవరం పర్ర తదితర చోట్ల మొదట్లో వెదజల్లిన వరి పొలాలకు సాగునీరు అందక పైరు ఎండిపోతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీరు అందక పెరిగిన నారుతో నాట్లు వేసే పరిస్థితి లేక రైతులు ఏం చేయాలి సారూ ఈ ఏడాది? అంటూ తీవ్ర కలవరంతో కనబడిన వారందరిని అడుగుతున్నారు. కాల్వలకు పంపిస్తున్న కొద్దిపాటి సాగునీటిని పలుచోట్ల చేపల చెరువులకు కొల్ల గొట్టుకుపోతున్నా ఇరిగేషన్ శాఖ నియంత్రణ కొరవడింది. గుడివాడలో.. సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని మండలంలోని ఆరు గ్రామాల రైతులు కంటతడి పెట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ ఇరిగేషన్ కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని ఆరు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగునీరు అందక 15వేల ఎకరాలపైగా పంట ఎండిపోతుందని, సంబంధిత ఇరిగేషన్ అధికారులు మాత్రం సాగునీరు అందించడంలో తీవ్రంగా వైఫల్యం చెందుతున్నారని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు సాగునీరు ఇవ్వడం లేదు కానీ డ్రైనేజీ అధికారులు మాత్రం చేపల చెరువులకు నీరు ఎలా అందిస్తున్నారని ఇరిగేషన్ డీఈ పి.సూర్యభరత్ను రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గుడివాడ మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన రైతులు సాగునీటి కోసం ఆందోళన బాటపట్టామన్నారు. ఆయా గ్రామాల్లో 15వేల ఎకరాలు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు విడుదల చేయకపోతే తామంత ఆందోళనలు, నిరసన చేస్తామని ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో రైతులు పాల్గొన్నారు. -
జిల్లాకు రూ.24,671 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.24,671 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, క్రాప్ ఇన్సూరెన్స్ పురోగతిపై కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చర్చించారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ రంగాల అభివృద్ధికి ఉపయోగపడే వ్యవసాయం, పంట రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన రుణ సదుపాయాలను కల్పించేందుకు ఈ ప్రణాళికను రూపొందించామన్నారు. 2026 –27 వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.18,224 కోట్లు కేటాయించగా ఇందులో వ్యవసాయరంగానికి రూ.12,719 కోట్లు, పంట రుణాలకు రూ.6,785 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి రూ.4,250 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్.ప్రదీప్కుమార్, ఆర్బీఐ సీడీఓ పి.యలమంద, నాబార్డు డీపీఎం అనిల్కాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రరెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టా లని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం పారిశ్రామిక ఎగుమతి, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు మూడు నుంచి 31వ తేదీ వరకు 107 దరఖాస్తులు అందగా వాటిలో 79 దరఖాస్తులు ఎస్ఎల్ఏ గడువులోపు ఆమోదం పొందాయన్నారు. ఈ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025లో కుదిరిన అవగాహన ఒప్పందాల పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. భూముల కేటాయింపు, మౌలిక వసతులు, తదితర అంశాల్లో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం సమన్వయంతో పనిచేయాలన్నారు. పరిశ్రమలకు వడ్డీ రాయితీ క్లయిమ్ల ద్వారా ఐదు పరిశ్రమ లకు రూ.1.36 కోట్ల మేర ప్రోత్సాహకాలను మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, డీపీఓ ఎం.ధనలక్ష్మి, డీఆర్డీఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.1.20 లక్షల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. సత్యనారాయణపురానికి చెందిన ఉపద్రష్ట శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, డీఈఓ కిషోర్కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఐసెట్లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం మొదలైంది. ఎన్సీసీ–22, దివ్యాంగులు–20, సీఏపీ–11, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–5, స్కౌట్స్ అండ్ గైడ్స్–1 చొప్పున మొత్తం 59 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్–10001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వివరించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఈ నెల రెండో తేదీలోగా ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి సంస్కృతిని సమూలంగా నిర్మూలించడంతో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల భయాలను తొలగించి ఎన్టీఆర్ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చడమే ధ్యేయమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి సమూల నిర్మూలనకు తీసుకొచ్చిన మూడు ప్రత్యేక ప్రచార రథాలు, ప్రచార గుర్రాలను తన కార్యాలయం వద్ద ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, ఈగల్ చాలెంజ్లపై వినూత్నరీతిలో అవగాహన కోసం డిజిటల్ స్క్రీన్లు కలిగిన మూడు ప్రచార రథాలు వారం రోజులు నగర వ్యాప్తంగా తిరుగుతాయన్నారు. గుట్టలు, కొండ ప్రాంతాల్లో అవగాహన కోసం గుర్రాలను, మెక్ అనౌన్స్ మెంట్ సౌకర్యం ఉన్న అత్యాధునిక మాట్రిస్ 4టీ డ్రోన్ల ద్వారా విస్తృత ప్రచారంచేస్తామ న్నారు. గంజాయి విక్రేతల సమాచారమందిస్తే రూ.5 వేలు, వినియోగదారుల సమాచారం తెలిపితే రూ.1500 బహుమతిగా ఇస్తామన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయదారులపై తీవ్ర చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 32 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. 15 వేల మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించి, 1,287 మంది వినియోగదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి, కె.జి.వి.సరిత, కె.కృష్ణ ప్రసన్న, జి.రామకృష్ణ, ఏసీపీ దామోదర్, ఇన్స్పెక్టర్ గుణరాం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ: ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్ జూనియర్ సాప్ట్బాల్ జట్ల ఎంపిక సోమవారం జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. వీరంతా సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గమిడి సాంబశివరావు తెలిపారు. -
ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్ నుంచి మహామండపానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు అందుబాటులోకి తీసుకురావాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం కన్నబాబు, రామచంద్రమోహన్ పరిశీలించారు. కనకదుర్గనగర్, గోశాల, మహామండపం వద్ద వెలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను తనిఖీచేశారు. తొలుత ప్రతిపాదించిన విధంగా ఆలయ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ చేయగా, వాటి ప్రకారం పనులు జరిగితే తలెత్తే ఇబ్బందులను చర్చించారు. ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ను మహామండపానికి, నూతన అన్నదాన భవనానికి అనుసంధానంగా నిర్మించాలని సూచించారు. ఈ మేరకు చైన్నెకి చెందిన ప్లానర్లతో ఉన్నతాధికా రులు చర్చలు జరిపారు. మహామండపం క్యూ లైన్లలో అధికారులు స్వయంగా నడిచి భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. తొలుత రామచంద్రమోహన్ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, దుర్గగుడి ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఎఈఈలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
● ఒత్తిళ్లకు తలొగ్గి నేత కార్మికులకు అన్యాయం చేసిన అధికారులు
● అర్హులందరికీ న్యాయం చేయాలని చేనేత కార్మికుల డిమాండ్ పెడన: ‘నేతన్నకు సేవలో’ పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం అర్హులకు మొండిచేయి చూపింది. తెలుగు తమ్ముళ్ల సిఫార్సులకే పెద్దపీట వేసి అనర్హులకు లబ్ధి చేకూర్చింది. ఎన్నికల సమయంలో నేత కార్మికుల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్ర బాబుతో పాటు కూటమి పార్టీల నాయకులంతా ‘నేతన్న నేస్తం’ పథకానికి మించి సాయం చేస్తామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని విస్మరించారు. రెండేళ్లు ఎదురు చూసిన చేనేత కార్మికులు కడుపుమండి రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ‘నేతన్న సేవలో’ అంటూ పథకం పేరు మార్చి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పింది. అయితే అరకొరగా నిధులు విడుదల చేసింది. ఆ నిధుల్లోనూ అర్హులకు అరకొరగా ఇచ్చి, తమ పార్టీ నాయకులు సూచించిన వారికి మగ్గం లేకున్నా, ఇతర వృత్తుల్లో ఉన్నా లబ్ధిచేకూర్చింది. దీంతో అర్హులైన చేనేత కార్మికులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శకంగా.. చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ పథకం తీసుకొచ్చారు. ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబా నికి ఏడాదికి రూ.24 వేల చొప్పున క్రమం తప్ప కుండా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. 4,832 మంది కుటుంబాలకు మేలు జరిగింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పథకం అమలుచేసి ఆదుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగింది. సచివాలయ సిబ్బంది చేనేతల ఇళ్ల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ చేసి ఆ తర్వాత అర్హుల పేర్లు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసి జాబితా రూపొందించారు. ఈ జాబితాలను సచివాలయాల వద్ద ప్రదర్శించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఫలితంగా అర్హులు అందరికీ ఈ పథకం కింద లబ్ధిచేకూరింది. ఇప్పుడు సిఫార్సులు ఉంటేనే.. చంద్రబాబు ప్రభుత్వంలో నేతన్న సేవలో పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు హడా వుడిగా పూర్తి చేశారు. చేనేత, జౌళి శాఖ అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి గప్చిప్గా దరఖాస్తులను స్వీకరించారు. ఎటువంటి విచారణ లేకుండానే కూటమి నాయకులు చెప్పిన పేర్లతో జాబితాలక రూపొందించారు. ఈ జాబితాలను ఎక్కడా వెల్లడించలేదు. మగ్గం లేని, ఇతర వృత్తుల్లో ఉన్న వారికి సైతం లబ్ధిచేకూర్చారు. 4,393 మందితో జాబితా రూపొందించారు. వీరిలో 215 మందికి వివిధ కారణాలతో పథకం వర్తింప జేయలేదు. మిగిలిన వారికి ఆగస్టు ఏడో తేదీన రూ.25 వేల చొప్పున సాయం అందించారు. అయితే ఒకే ఇంటిలో ముగ్గురికి పథకం వర్తింపజేయడం, మెకానిక్లను కూడా అర్హులుగా గుర్తించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కూటమి నాయకులు అనర్హులకు లబ్ధి చేకూర్చి, వారి వద్ద వాటాలు దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరో 1,072 మందికి లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. నేను పుట్టి పెరిగింది పెడనలోనే. బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం చీరాల వెళ్లాం. అక్కడ కూడా పరిస్థితి బాగోలేక తిరిగి పెడన వచ్చి ఆరేళ్లు గడిచాయి. ఆధార్కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడకు మార్పించుకున్నాం. మగ్గంపైనే ఆధారపడి బతుకుతున్నాం. నేనూ, నా భార్య నాగేశ్వరకుమారి మగ్గం నేస్తున్నాం. దరఖాస్తు చేసినా పథకం వర్తింపజేయలేదు. డబ్బులు ఎప్పుడు పడతాయా అని రోజూ బ్యాంక్కు వెళ్లి ఆరాతీస్తున్నాం. – ఉటుకూరి నాగవెంకటేశ్వరరావు, పోలవరపు పేట, పెడన నేతన్న సేవలో పథకం వర్తించలేదు. 50 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. నాకు చేనేత గుర్తింపు కార్డు కూడా ఉంది. అయినా పథకం వర్తింపజేయలేదు. అర్హత ఉన్నా అన్యాయం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారొచ్చి ఫొటోలు తీసుకువెళ్లారు. అయినా పథకం రాలేదు. అద్దె ఇంట్లో ఉంటూ నేత నేసుకుంటున్నాం. పథకం వర్తింపజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – పేరిశెట్టి రుక్మిణి, పోలవరపు పేట, పెడన నేతన్న సేవలో పథకంలో మొదట 4,393 మంది అర్హులను గుర్తించాం. వారిలో 215 మందికి ఆధార్, సాంకేతిక కారణాలతో లబ్ధిచేకూరలేదు. రెండో సారి మరో 1,072 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 215 మందితో పాటు 1,072 మందికి కూడా త్వరలోనే నగదు జమ అవుతుంది. ఇంకా వీరి నగదు విడుదల కాలేదు. అనర్హులు ఉన్నారని లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్ విజయ్బాబు, చేనేత, జౌళిశాఖ ఏడీ, మచిలీపట్నం -
బస్సును తప్పించబోయి కారును ఢీకొని..
రేపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇరువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన పెనుమూడి రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన నడకుదుటి సాయిచరణ్ (22) తన ద్విచక్రవాహనంపై రేపల్లె నుంచి అవనిగడ్డ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును తప్పించబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి ముందున్న కారును ఢీకొన్నాడు. ఢీకొన్న వేగంతో సాయిచరణ్ వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనంపై పడిపోయాడు. ఆ వాహనంపై ప్రయాణిస్తున్న దేవరపల్లి నాగయ్య, మోళ్లగుంట పీహెచ్సీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో బాధితులను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిచరణ్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నాగయ్య, పార్వతిలకు ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్కుమార్ చెప్పారు. మృతుడు సాయి చరణ్ క్షతగాత్రుడు నాగయ్య -
ప్లాస్టిక్ లేని గ్రామంగా చల్లపల్లి ఆదర్శం కావాలి
చల్లపల్లి: ప్లాస్టిక్ లేని గ్రామంగా చల్లపల్లి ఆదర్శంగా నిలవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆకాంక్షించారు. గ్రామంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలుకానున్న ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, పేపర్ కప్పులు, పేపర్ ప్లేట్లు, గ్లాసులు వంటివాటి నిషేధానికి వ్యాపారులు, వినియోగదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చల్లపల్లి నుంచి నాంది పలకాలని ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ బాలాజీతోపాటు ప్రజాప్రతినిధులు, అధికా రులు, ప్రముఖ వ్యాపారులు, సామాజికవేత్తలు, విద్యార్థులు ర్యాలీ పాల్గొన్నారు. ప్లకార్డులు చేబూని ప్లాస్టిక్ వద్దు.. సమాజం ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన సెంటర్కు చేరుకుని మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ ఉద్యమాన్ని మూడు వారాల క్రితమే ప్రారంభించాల్సి ఉండగా పలువురు వ్యాపారుల సూచనల మేరకు సోమవారం నుంచి అమలు చేస్తున్నామన్నారు. టీ స్టాళ్లు, హోటళ్లలో గాజు గ్లాసుల్లోనే టీ, కాఫీ ఇవ్వా లని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు పలు సూచనలు చేశారు. పోలీసులు సహకరించాలని కోరారు. అనంతరం అంద రితో ప్రతిజ్ఞ చేయించారు. అంనతరం నార చేతి సంచులు, కాటన్ చేతి సంచులను పలువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ డి.ధనలక్ష్మి, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ బి.నిఖిల, డీఎల్పీఓ ఎండీ రజావుల్లా, అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, ఎంపీడీఓ ఎం.ఎం. ఆనందకుమారి, సీఐ కె.ఈశ్వరరావు, ఎస్ఐ డి.దుర్గాంజనేయులు, ఈఓపీఆర్డీ పేర్ని మాధవేంద్రరావు, ఎంఈఓ–2 పి.వెంకటేశ్వర రావు, పీఆర్ ఏఈ బి.శ్రీనివాసరావు, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, అడపా గురవయ్య మాస్టారు, ప్రజా ప్రతినిధులు, విజయా, విజయ క్రాంతి జూనియర్ కళాశాలలు, చల్లపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తాం
కోనేరుసెంటర్: మీ కోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఎస్పీ సావధానంగా ఆలకించారు. ముఖ్యంగా వృద్ధుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. మీ కోసంలో మొత్తం 56 ఫిర్యాదులు అందుకున్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్) జరిగింది. కలెక్టర్తో పాటు డీఆర్వో శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీఎస్పీ ఆర్.అభిషేక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిష్కరించటంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీఆర్ఎస్లో అధికారులు మొత్తం 118 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. -
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమంలో భాగంగా సోమవారం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు పెండింగ్ డీఏలను ప్రకటించి, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు గతంలో మాదిరిగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి ప్రతిపాదించిన 29 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఏపీ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల్లో వెనుకపడుతున్నారని పేర్కొన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పేపేటి సత్యనారాయణ, ఏపీ జేఏసీ చైర్మన్ ఎం.శ్యామనాథ్, జిల్లా ఏపీ అమరావతి సెక్రటరీ జనరల్ వైవీ రావు, ఏపీ రెవిన్యూ అసోసియేషన్ నాయకులు నెల్సన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు


