Vikarabad
-
విత్తన ఎంపిక ఎంతో కీలకం
పరిగి: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం విత్తన వారోత్సవాలు నిర్వహిస్తోందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త స్వర్ణలత అన్నారు. బుధవారం మండలంలోని నస్కల్ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంట సాగులో విత్తన ఎంపిక ఎంతో కీలకమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. నానో యూరియా, నానో డీఏపీ వాడాలన్నారు. నేలను బట్టి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. మోతాదుకు మించి రసాయనాలు వాడితే భూ సారం దెబ్బతింటుందన్నారు. ఈ నెల 23 నుంచి విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికార రజిత, ఏఈఓ కావ్య తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికే విత్తన వారోత్సవాలు శాస్త్రవేత్త స్వర్ణలత -
కఠిన చర్యలు
రైతులను మోసం చేస్తే బషీరాబాద్: వరి ధాన్యం తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. ప్యాడీ క్లీనర్కు వేశాకే బస్తాకు 40.6 కేజీలు కాంటా చేయాలని ఆదేశించారు. బుధవారం బషీరాబాద్ మండలం కాశీంపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంత తాలు పోతే అంతే అదనంగా తూకం వేయాలని రైతులు కోరారు. గన్నీ బ్యాగులు లేవని ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి ఇందిరమ్మ పైలెట్ గ్రామం కాశీంపూర్లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జూన్ మాసంలో రెండు విడత ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. పునాది వేసినా బిల్లు రాలేదని నర్సమ్మ కలెక్టర్కు విన్నవించారు. లోకేషన్ రాని కారణంగా బిల్లు రాలేదని అధికారులు సమాధానం ఇచ్చారు. ఫార్మర్ రిజిస్ట్రీ వంద శాతం ఎందుకు పూర్తి చేయలేదని ఏఈఓ అనితను కలెక్టర్ ప్రశ్నించారు. 77 శాతం పూర్తి చేసినట్లు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనులు సక్రమంగా జరగ డం లేదని సర్పంచ్ హరిత కలెక్టర్ దృష్టికి తెచ్చా రు. పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధి కారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అనిత, డీఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ షాహెదాబేగం, ఎంపీడీఓ సంపత్కుమార్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి యాలాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తూకం సరిగ్గా చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. కేంద్ర నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధన మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అగ్గనూరు గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనిజ, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంఈఓ మహిపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. ధాన్యం సేకరణ సజావుగా సాగాలి కలెక్టర్ దీపక్ తివారి -
బతికి ఉంటే ఇబ్బందిపెడతాడని..
హస్తినాపురం: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను ఆమె తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్రెడ్డినగర్లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగ దీష్ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? ఇదిలా ఉండగా నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు వేర్వేరుగా విచారిస్తున్నట్లు తెలిసింది. భర్తను చంపేసింది తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య ఘాతుకం -
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
నవాబుపేట: రైతులు సాగులో రసాయనిక ఎరువులు తగ్గించి, సస్య రక్షణ చర్యల చేపడితే మంచి లాభాలు పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాణిశ్రీ, పద్మజలు అన్నారు. మండల పరిధి గంగ్యాడలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు సూచనలు చేశారు. మండల వ్యవసాయాధికారి జ్యోతి, సర్పంచ్ మల్లేశం, ఏఈఓ రమాదేవి, రైతులు పాల్గొన్నారు. పాఠశాలలకు నోట్ పుస్తకాలు ధారూరు: మండల పరిధి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నోట్ పుస్తకాలు అందాయి. ఎంఆర్సీ కార్యాలయం నుంచి బుధవారం పంపిణీ చేశామని ఎంఈఓ చెన్నయ్య తెలిపారు. 2026– 27 సంవత్సరానికి విద్యాశాఖ నుంచి ఈ పుస్తకాలు ఎంఆర్సీకీ చేరాయని పేర్కొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అనంతరం ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేస్తారని వివరించారు. రైతులకు ఇబ్బంది కలగొద్దు బషీరాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకరప్పతో కలిసి దామర్చెడ్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం చివరి గింజవరకుకొంటుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో సాఫీగా ధాన్యం సేకరణ జరుగుతుందని తెలిపారు. ఇక్కడి మిల్లులతో పాటు కొత్తగా సంగారెడ్డి జిల్లాలోని మిల్లుకు ధాన్యం తరలించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపారని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, నాయకులు రాజేందర్రెడ్డి, మల్కన్గిరి బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వేసవి శిక్షణ క్యాంపు ఇబ్రహీంపట్నం: జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినోభానగర్లోని సాధన కుటీర్లో ప్రభుత్వ బడుల నుంచి ఎంపిక చేసిన 85 మంది విద్యార్థులకు 25 రోజుల పాటు ఇచ్చిన క్రీడా శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ మెంబర్ విజయభారతి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన శారీరక సామర్థ్యం, పట్టుదల, కష్టపడేతత్వం గల విద్యార్థులు చాలా మంది ఉన్నారన్నారు. సరైన గుర్తింపు, శిక్షణ, పోషకాహారం, మార్గదర్శకత్వం లేక వారి ప్రతిభ మధ్యలోనే కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటిగా జీఎస్ఎఫ్ సాధన నిలిచిందన్నారు. రాష్ట్ర తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి సతీష్గౌడ్ మాట్లాడుతూ.. ఎంపికై న విద్యార్థులకు ఆటల్లోనే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు అందించాలన్నారు. కార్యక్రమంలో జీఎస్ఎఫ్ ఫౌండర్ సదా వెంకట్రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్ రాజేందర్రెడ్డి, సామాజిక కార్యకర్త సత్యం, జీఎస్ఎఫ్ సాద్రి ఇన్చార్జి ప్రమోద, స్పోర్ట్స్ వింగ్ ఇన్చార్జి చంద్రా తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
ఇళ్లు నిర్మించుకునేదెలా?
● ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నాం ● చెంచులంటే అంతా చిన్నచూపా.. ● తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన తాండూరు రూరల్: ‘నిరుపేదలమని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. కానీ నిర్మించుకోవడానికి ఇసుక దొరకడం లేదు. ఇళ్లు ఎలా కట్టుకోవాలి? చెంచుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. సమస్య గురించి చెబితే పట్టించుకోవడం లేదు. మేమంటే అంత చిన్నచూపా’ అని చెంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక కొరత తీర్చాలని కోరుతూ.. పెద్దేముల్ మండలం చైతన్యనగర్ చెంచులు బుధవారం తహసీల్దార్ వెంకట్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు 176 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే మనోహార్రెడ్డి మూడు నెలల క్రితం భూమిపూజ చేయగా.. ఇసుక కొరత వలన పనులు జరగడం లేదని చెప్పారు. మండల పరిధి రేగొండి శివారు వాగు నుంచి ఇసుక పర్మిషన్ ఇచ్చారన్నారు. కానీ ఇసుక కోసం అక్కడి వెళ్లగా యాలాల మండలం అడాల్పూర్ గ్రామస్తులు అడ్డుకుంటున్నారని వివరించారు. కలెక్టర్ స్పందించి ఇళ్లకు ఇసుక అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందులో శ్రీనివాస్, వెంకటయ్య, లాలయ్య, శ్రీనివాస్, కిరణ్, గోపి, రాములు, వెంకటయ్యలు ఉన్నారు. -
సహకారంపై ఆశలు
భానుడి భగభగలు సాగర్ హైవే నిర్మానుష్యం యాచారం: మండుతున్న ఎండలకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. భానుడి భగభగతో రోడ్లకు మీదకు ప్రజలు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. మండే ఎండలకు బుధవారం యాచారం మండల కేంద్రంలోని సాగర్ హైవే వాహనాలు రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారింది. రోడ్లకు మీదకు వచ్చిన ప్రజలు ఎండలకు ఉపశమనం కోసం కొబ్బరిబొండాలు తాగడం, శీతలపానీయాలు సేవించారు. ఎండల తీవ్రతకు యాచారం మండల కేంద్రంతో పాటు మాల్ వ్యాపార కేంద్రంలో వ్యాపార దుకాణాల్లో క్రయ, విక్రయాలకు కూడా ప్రజలు రావడానికి భయపడుతున్నారు. యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)ల నామినేటెడ్ పదవులపై ఆశావహులు కన్నేశారు. సర్కార్ పీఏసీఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ చేస్తామని ప్రకటించడంతో వాటిని దక్కించుకోవడం కోసం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. నేటికి అధికారిక ఉత్తర్వులు జారీ కానప్పటికీ, కచ్చితంగా నామినేటెడ్ చేస్తుందనే సంకేతాలతో నాయకులు ఆశావహులు మండల స్థాయి నేతలు, సర్పంచులను కలుస్తూ మద్దతుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, సీనియర్ నేతలు పీఏసీఎస్ పదవులపై ఆసక్తి చూపుతున్నారు. పీఏసీఎస్ పదవులను నామినేటెడ్ చేస్తుందనే సమాచారంతో జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం డివిజన్లోని పీఏసీఎస్ల సీఈఓలు కలిసి చర్చించారు. నిబంధనలు, విధివిధానాలు జారీ అయిన తర్వాత మరోమారు సమావేశమై చర్చిద్దామని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రతి పీఏసీఎస్కి 13 మంది సభ్యుల రిజర్వేషన్ల వివరాలను సైతం ఖరారు అయినట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచన మేరకే పీఏసీఎస్ల పాలకవర్గాల నామినేటెడ్ పద్ధతిపై ఎమ్మెల్యే అనుకున్న పేర్లతో కూడిన నివేదికను సహకార శాఖ ఉన్నతాధికారులు ఫైనల్ చేసే అవకాశం ఉంది. అందుకే ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఆయా మండలాల్లోని ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా డివిజన్లోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే రంగారెడ్డి తాను అనుకున్న వారికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేత ఉత్తర్వులు జారీ చేయించారు. అదే మాదిరిగా పీఏసీఎస్ల పాలకవర్గాల సభ్యుల ఎంపిక విషయంలో పదవులు వచ్చే అవకాశం ఉంది. మొండిబకాయిదారులకు నో చాన్స్ పీఏసీఎస్ పాలకవర్గాల సభ్యుల నామినేటెడ్ విషయంలో మొండి బకాయిదారులకు నో చాన్స్ అంటూ అధికారులు అంటున్నారు. ఈ మేరకు లిస్టును తయారు చేస్తున్నారు. డివిజన్లోని యా చారం, మంచాల, ఉప్పరిగూడ, ఆర్కే మైలారం, ఎంపీ పటేల్గూడ, పోల్కంపల్లి పీఏసీఎస్లున్నాయి. అందులో దాదాపు 25,755కు పైగా సభ్యులు ఉన్నారు. వారిలో సగానికి పైగా మంది రైతులు ఆయా పీఏసీఎస్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక, బంగారు, వ్యక్తిగత రుణాలు పొందారు. వారిలో దాదాపు 25 శాతానికి పైగా డిఫాల్టర్లుగా ఉన్నారు. అందులో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం డిఫాల్టర్లకు నామినేటెడ్ పదవుల ఎంపిక విషయంలో నిబంధనలు కఠినంగా ఉండడంతో వారు పదవులకు అర్హత కోల్పోయే అవకాశం లేకపోలేదు. తిరుగులేని సంస్థ భారతి సిమెంట్ ఇబ్రహీంపట్నం డివిజన్లో పీఏసీఎస్లుపీఏసీఎస్ సభ్యులు యాచారం 8,429 మంచాల 6,553 ఉప్పరిగూడ 2,644 ఆర్కే మైలారం 3,844 పోల్కంపల్లి 1,436 ఎంపీ పటేల్గూడ 2,849 పీఏసీఎస్ల పాలకవర్గాలను నామినేట్ చేయనున్న సర్కార్ సభ్యుల ఎంపికకు రిజర్వేషన్లు ఖరారు పదవులకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన నాయకులు ఎమ్మెల్యే రంగారెడ్డిని కలిసిన జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ -
సమాఖ్య మహిళలు
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026బషీరాబాద్: మహిళా సమాఖ్య సభ్యులు బస్సు యజమానులు కానున్నారు. త్వరలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు బస్సులను అద్దెకిచ్చి తద్వారా లబ్ధి పొందనున్నారు. సెర్ప్ ద్వారా జిల్లాకు రూ.5.7 కోట్ల గ్రాంట్ మంజూరు కాగా.. సమాఖ్య సభ్యులు తమ వాటాగా రూ.1.14 కోట్లు చెల్లించి 19 బస్సులను కొనుగోలు చేశారు. ఈ నెల 25 నుంచి ఈ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి మండల సమాఖ్యకు ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. బస్సుల కొనుగోలుకు సెర్ప్ సంస్థలోని సీఐఎఫ్ నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 19 మండల సమాఖ్యలకు రూ.5.7 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు వెచ్చించనున్నట్లు సమాచారం. సీఐఎఫ్(కమ్యూనిటీ ఇన్విస్టిమెంట్ ఫండ్) ద్వారా రూ.30 లక్షలు, సమాఖ్య సభ్యులు తమ వాటాగా రూ.6 లక్షల చొప్పున చెల్లించారు. కొనుగోలు చేసిన 19 బస్సులను ఆర్టీసీకి ఏడేళ్ల పాటు ఫైనాన్స్ చేస్తూ అప్పగించనున్నారు. మండల సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఈ ఏడేళ్లలో తిరిగి చెల్లిస్తాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతి నెలా మొదటి వారంలో ఈఎంఐ రూపంలో రూ.69,468 చెల్లించేందుకు సమాఖ్యల పేరున ఆర్టీఏలో హైపతికేషన్ పూర్తిచేశారు. ప్రతి నెలా చెల్లించే ఈ మొత్తం మండల సమాఖ్యకు చెందిన సీఐఎఫ్ ఖాతాలో జమవుతాయి. ఈ మొత్తాన్ని సభ్యుల అభ్యున్నతికి వినియోగిస్తారు. మంజూరైన 19 బస్సుల్లో ఆరు జిల్లా నుంచి మిగతా 13 బస్సులను హైదరాబాద్ డిపో 1, 2 నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు సెర్ప్ డీపీఎం నర్సింలు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి బస్సులు రోడ్డెక్కనున్నట్లు తెలిసింది. ఆర్టీసీ సంస్థపై తగ్గనున్న ఒత్తిడి ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకొని నడిపిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణంతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో అదనపు బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూర్చడంతో ఆర్టీసీపై ఒత్తిడి తగ్గనుంది. జిల్లాకు 19 బస్సుల కేటాయింపు సెర్ప్ ద్వారా రూ.5.7 కోట్ల నిధులు తమ వాటాగా రూ.1.14 కోట్లు చెల్లించిన సభ్యులు 25 నుంచి రోడ్డెక్కనున్న వాహనాలు తాండూరులో దాల్మిల్ తాండూరు రూరల్: డ్వాక్రా సంఘాల ఆర్థిక బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాండూరులో దాల్మిల్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బుధవారం జాతీయ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ అధికారులు రాజేంద్రప్రసాద్, డాక్టర్ సత్యజేంద్ర, ఎంబీకే రాజు, సెర్ప్ మార్కెటింగ్ అధికారులు రాములు, ఇందు బ్రాహ్మణి, దినేష్ తదితరులు తాండూరులో పర్యటించారు. ముందుగా మహిళా సమాఖ్య కార్యాలయంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రసూల్పూర్ వద్ద గల వ్యవసాయ పరిశోధన సంస్థకు వెళ్లి అక్కడి దాల్, ఆయిల్ మిల్లులను పరిశీలించారు. సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తర్వాత పట్టణంలోని డీసీఎంఎస్లో దాల్మిల్లును సందర్శించారు. మేనేజర్ సలాం పాషాతో మాట్లాడారు. అంతారం మార్గంలోని గోదాంను చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సెర్ప్ ఆధ్వర్యంలో రూ.కోటితో తాండూరులో దాల్మిల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో పరిశ్రమ కొనసాగుతుందన్నారు. ఇక్కడ తయారయ్యే కంది పప్పును స్థానిక సూపర్ మార్కెట్లతో పాటు ప్యాకింగ్ చేసి వివిధ పట్టణాలకు తరలిస్తామని చెప్పారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేయనున్నట్లు వివరించారు. దేశంలోనే తాండూరు కంది పప్పునకు మంచిపేరు డిమాండ్ ఉన్నందున ఇక్కడ దాల్మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎంలు కొమరయ్య, శేఖర్, ఏపీఎం బాలయ్య, సీఈఓ ప్రశాంత్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి, మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల రక్షణకే కార్డెన్ సెర్చ్
యాలాల: ప్రజల రక్షణ, భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. బుధవారం మండలంలోని ఇందిరమ్మ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి చేపట్టిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ఉంటున్న ఇద్దరు రౌడీ షీటర్లు, ఇద్దరు అనుమానితుల ఇళ్లను పూర్తిగా తనిఖీ చేసినట్లు తెలిపారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాసులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐలు పరమేష్, ప్రవీణ్కుమార్రెడ్డి, రఘు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కేసుల్లో పురోగతి సాధించాలి బషీరాబాద్: పెండింగ్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆదేశించారు. బుధవారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మండలం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య -
‘సర్’లో భాగస్వాములు కండి
పరిగి: సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పరిగి తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని కోరారు. ఎన్నికల సిబ్బంది ఇంటింటి సర్వే చేసి డబుల్ ఓట్లు, మృతి చెందిన వారిని జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. అందులో ఏమైన అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30లోగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 సంత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అక్టోబర్ ఒకటిన తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, అనిల్బాబు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓ వాసుచంద్ర -
ఉపాధికూలీలపై తేనెటీగల దాడి
కుల్కచర్ల: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 35మంది కూలీలు రామలింగేశ్వర కళాశాల పరిసర ప్రాంతంలో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 10గంటల ప్రాంతంలో తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామానికి వారందరూ పరుగులు పెట్టగా.. ఇద్దరు తీవ్రంగా, మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. ఓ మహిళ కిందపడి గాయపడింది. బాధితులను తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మహబూబ్నగర్కు తరలించారు. గాయపడిన వారిని సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, కాంగ్రెస్ నేతలు భీంరెడ్డి, ఆంజనేయులు, జోగు వెంకటయ్య, గోపాల్, టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్ పరామర్శించారు. -
భూ సేకరణ ప్రారంభించాలి
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే టీఆర్ఆర్ పరిగి: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి కోరారు. బుధవారం నగరంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తయితే పరిగి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సాగు నీటికి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారం రోజుల్లో భూ సేకరణ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బొంరాస్పేట: మండల కేంద్రంలోని దివ్యాంగ చిన్నారులకు ఉచితంగా పరికరాలు అందజేశారు. మండలంలోని 15మంది చిన్నారులకు అవసరమైన పరికరాలు డీఈఓ రేణుకాదేవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐ కోఆర్డినేటర్ రజిని కుమారి, ఐఆర్పీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం వికారాబాద్లోని ఏటీసీలో విద్యార్థులకు యూత్ పార్లమెంట్, పెయింటింగ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడల వి భాగం జిల్లా అధికారి అబ్దుల్ సత్తార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జీపీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావు అనంతగిరి: గ్రామ పాలన అధికారులు ఐకమత్యంగా ఉండి హక్కుల సాధనకు పోరాటం చేద్దామని జీపీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్లో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో క్షేత్రస్థాయిలో పనిచేసేది జీపీఓలేనని పేర్కొన్నారు. సమస్యలపై నిరంతరం పోరాడుతమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ చంద్రశేఖర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు కావలి వెంకటయ్య, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు టీ గోపాల్, ప్రధాన కార్యదర్శి మలిగేరి రాజు, అసోసియేట్ అధ్యక్షుడు మొగులప్ప, మహిళా విభాగం అధ్యక్షురాలు సంధ్యారాణి, కోశాధికారి శివ, సలహాదారు రాంచంద్రయ్య, ఉపాధ్యక్షురాలు మమత, వికారాబాద్, తాండూరు డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు పాల్గొన్నారు. -
బట్లచందారంలో తాగు నీటి కటకట
దోమ: నాలుగు రోజులుగా నీరు రాక ఇబ్బంది పడుతున్నామని మండల పరిధి బట్లచందారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా కాగా.. పెద్దసఖ్యలో గుమికూడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎండలో నడుచుకుంటూ పొలాల నుంచి బిందెలతో నీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడమే కాకుండా, ఉన్న బోర్లు పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. సరిపోవడం లేదన్నారు. విషయం అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ఆరోపించారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి, తాగు నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
హెచ్ఆర్ మందలించాడని కార్మికుడి ఆత్మహత్య
కొత్తూరు: విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మందలించడంతో ఓ కార్మికుడు మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రంగాపూర్లో నివాసం ఉంటున్న కిశోర్(24) నాలుగేళ్ల నుంచి కొత్తూరు పట్టణంలో ఉన్న నాట్కోఫార్మాలో పనిచేస్తున్నాడు. కాగా పరిశ్రమలో ఓ హెచ్ఆర్ మేనేజర్ తనను తిట్టి కొన్ని రోజుల పాటు విధులకు రాకుండా చేశాడని మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం పరిశ్రమకు వెళ్లకుండా ఇంటి సమీపంలోని మెట్రోసిటీ వెంచర్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ పరిశ్రమ గేటు ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టారు. ఈ విషయమై పరిశ్రమ హెచ్ఆర్ను వివరణ కోరగా మృతుడు గత నెల రోజుల క్రితం విధుల్లో భాగంగా నిద్రించడంతో అలా చేస్తే జరిగే ప్రమాదాలపై కొన్ని రోజుల పాటు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తిరిగి విధులకు హాజరవుతున్నట్లు వివరించారు. అంతేతప్ప కార్మికుడిని కావాలని తిట్టడం, అవమానించడం చేయలేదన్నారు. అనంతరం పరిశ్రమ ప్రతినిధులతో స్థానికులు, కుటుంబ సభ్యులు చర్చించడంతో న్యాయం చేస్తామని హామీ ఇవ్వగాఽ ధర్నా విరమించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలని పరిశ్రమ గేటు ఎదుట ధర్నా -
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
తాండూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 17 నెలల చిన్నారి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. గత ఆదివారం తెల్లవారు జామున బెల్కటూర్ శివారులోని ఓ పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆదానీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్తో పాటు అతని కూతురు వేదశ్రీ (17 నెలలు), డ్రైవర్ నారాయణ గాయపడ్డారు. వీరిని తాండూరులోని ఆస్పత్రికి తరలించగా, వేదశ్రీని హైదరాబాద్కు రిఫర్ చేయగా బుధవారం చనిపోయింది. మహేష్ స్వస్థలం ఏపీలోని కడప జిల్లా కాగా, ఒక్కగానొక్క పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లికి చెందిన డాకి వెంకటేశం(33) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రఘుకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆలంపల్లికి చెందిన వెంకటేశం వ్యవసాయంతో పాటు ప్రైవేట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. మృతుని తల్లిదండ్రులు, భార్య పొలం పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి విగతాజీవిలా ఉన్నాడు. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అప్పుల బాధతోనే తన కొడుకు చనిపోయినట్లు తండ్రి తెలిపాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. ఉరి వేసుకొని వలస కూలీ ఆత్మహత్య కొందుర్గు: చెట్టుకు ఉరి వేసుకొని ఓ వలస కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొందుర్గులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కాశీమండి(35) తన మిత్రులతో కలిసి కొన్ని రోజుల క్రితం కొందుర్గుకు వలస వచ్చాడు. శివారులో ఉన్న ధన లక్ష్మీ ప్యాకింగ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈనెల 19న ఆయన చిన్న ఎల్కిచర్ల గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి మిత్రుడు అదాన్ ముర్ము ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. కాశీమండి తాగిన మైకంలో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
సీఎం చొరవతో మహర్దశ
ఆమనగల్లు/కడ్తాల్: సీఎం రేవంత్రెడ్డి సహకారంతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులైన సూదిని రాంరెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, సీఎం రేవంత్రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి, విద్యాకమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసి రేవంత్రెడ్డి సీఎం కావడం కల్వకుర్తి ప్రజలకు గర్వకారణమని, సీఎం సహకారంతో కల్వకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సీఎం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తా గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా తన పదవిని బాధ్యతా యుతంగా నిర్వర్తిస్తానని సూదిని రాంరెడ్డి చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రాంరెడ్డిని కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని కాంగ్రెస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దివంగత జైపాల్రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున సత్కరించారు. మార్గమధ్యలో మైసిగండి ఆలయంలో రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, బాలాజీసింగ్, గీత, భాస్కర్రెడ్డి, పత్యానాయక్, ఆనంద్కుమార్, కిషన్రెడ్డి, కేశవులు, నర్సింహ, జగన్, బిచ్చానాయక్, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
బస్సు ఓనర్లు!
ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ప్రభుత్వం సెర్స్ ద్వారా జిల్లాకు రూ.5.7 కోట్లు మంజూరు చేసింది. 19 సమాఖ్యలు తమ వాటాగా రూ.1.14 కోట్లు చెల్లించి 19 బస్సులు కొనుగోలు చేశాయి. వీటిని ఆర్టీసీకి ఇవ్వబోతున్నాం. తద్వారా ప్రతి నెలా రూ.70 వేల చొప్పున 84 నెలల పాటు సమాఖ్యలకు రూ.58 లక్షల ఆదాయం చేకూరి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – జానకి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు -
ఏమిటీ కమీషన్ల దందా?
పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి షాద్నగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ శనివారం పంచాయతీ వర్కర్స్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ముఖ్యకూడలిలో నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ధరలను పెంచి, ప్రజలపై పెనుభారం మోపుతోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి ప్రజల మీద భారం మోపడం సరికాదని అన్నారు. మోదీ ఽప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేష్యాదవ్, ఏఐటీయూసీ నాయకులు శేఖర్రెడ్డి, రాములుగౌడ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ స్కీం (ఎంపీ లాడ్స్) పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో ఉమ్మడి జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి పనిలోనూ 12 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. రెండు జిల్లాల అధికారుల తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు’ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఎల్.శ్రీలత అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్య కార్యదర్శి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, సభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయం, హార్టికల్చర్, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, పౌరసరఫరాలు, పంచాయతీ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అమలు తీరు తెన్నులపై చర్చించారు. మీ కెందుకు కమీషన్ ఇవ్వాలి? సీపీఓ సౌమ్య ఎంపీ లాడ్స్ కేటాయింపు, నిధుల ఖర్చును వివరిస్తుండగా కమిటీ చైర్మన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పనుల కేటాయింపు, నిధుల ఖర్చుపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ లాడ్స్ నుంచి తాను ఇప్పటికే వందకుపైగా పనులు మంజూరు చేయగా 20కి మించి చేపట్టలేదని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రతి పనిలోనూ కమీషన్ ఆశిస్తున్నారని, వర్క్ ఎస్టిమేషన్, అగ్రిమెంట్, బిల్లుల చెల్లింపు వరకు 12 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇది కాంట్రాక్టర్లకు భారంగా మారుతోందని, చిన్నచిన్న పనులకు కమీషన్లు ఎందుకు చెల్లించాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను నిలదీశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఈ రెండు విభాగాలు అవినీతి, అక్రమ వసూళ్లకు నిలయంగా మారాయని ఆరోపించారు. అధికారులకు 12 శాతం కమీషన్, 18 శాతం జీఎస్టీ చెల్లించిన తర్వాత కాంట్రాక్టర్కు మిగిలేదేముందని ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి జోక్యం చేసుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ మైనింగ్లను నియంత్రించడంలో మైనింగ్ విభాగం పూర్తిగా విఫలమవుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. పీఎంశ్రీ పథకంలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పాఠశాల అవసరాలకు నిధులు కేటాయించడం లేదు. – ఆంబోజి శ్రీనివాస్, సభ్యుడు, దిశ కమిటీ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదు. కమిటీలో అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అధికారుల తీరుతో అనర్హుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. – రమేష్, సభ్యుడు, దిశ కమిటీ ఎంపీ లాడ్స్ పనులనూ వదలరా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి అధికారుల తీరే కారణం నిలదీసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వాడీవేడిగా ‘దిశ’ సమీక్ష సమావేశం -
డ్వాక్రా మహిళల రక్షణకు ‘జీఆర్సీ’
తాండూరు రూరల్: డ్వాక్రా మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండర్ రీసోర్స్ సెంటర్(జీఆర్సీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ లింగయ్యగౌడ్ తెలిపారు. శనివారం ఆయన మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం జిల్లాలోని తాండూరు మహిళా సమాఖ్య కార్యాలయానికి జెండర్ రీసోర్స్ సెంటర్ మంజూరు చేసిందన్నారు. డ్వాక్రా సంఘంలోని మహిళల చట్టపరమైన సమస్యల పరిష్కారమే జీఆర్సీ ఉద్దేశమన్నారు. గ్రామస్థాయి, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వారికి డీఆర్డీఏ నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. సంఘంలోని మహిళలను భర్త, అత్త, మామాలు వేధిస్తే జెండర్ రీసోర్స్ సెంటర్లో ఫిర్యాదులు చేయవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, మూఢ నమ్మకాలు, మానవ అక్రమ రవాణాలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నర్సింలు, ఏపీఎం కిష్టప్ప, బాలయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సీసీలు పాల్గొన్నారు. సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ లింగయ్యగౌడ్ -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ● ‘కాటన్ మరిచి.. కుట్లు వేసి’న ఘటనపై ఆరా తాండూరు టౌన్: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. శనివారం ఆయన తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) తనిఖీ చేశారు. ఇటీవల ఎంసీహెచ్లో ఓ బాలింతకు ఎపిసియోటమీ చేసి కాటన్ లోపల మరిచిపోయి కుట్లు వేయగా, ఆమె తీవ్ర అనారోగ్యంపాలయింది. ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అనిల్, సివిల్ సర్జన్ డాక్టర్ సునీతను అడిగి వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. పలు విభాగాల హాజరు రిజిస్టర్లు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలింత ఘటనపై ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ అనిల్, సివిల్ సర్జన్ సునీత తదితరులతో కలిసి సోమవారం కమిటీ వేసి, ఘటనపై విచారణ చేపడతామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆసుపత్రి పైకప్పు మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపాలని, ఈ వేసవిలోనే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శరత్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతిభను వెలికితీయాలి అనంతగిరి: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ డైట్ కళాశాలలోని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన హస్తకళా ప్రదర్శనను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. ఉత్తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, వికారాబాద్ ఎంఈఓ బాబుసింగ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, హెచ్ఎం యాదయ్య, డీఈఓ కార్యాలయ సిబ్బంది, వికారాబాద్ బాల భవన్ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఊపందుకున్న ఉపాధి
వికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ మాసంలో 50 వేల మంది కూలీలు అధికంగా వస్తున్నారు. కలెక్టర్, ఆర్డీఓ నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధి పనుల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ పనులు లేని కాలంలో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఈ పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు కొన్ని పనులకే పరిమితమైన ఈ పథకం ప్రస్తుతం 50కి పైగా పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వ్యవసాయ అనుబంధ పనులు, పొలాల గట్ల వెంట మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వుకోవడం, పాఠశాల క్రీడా మైదానాల చదును, పశువుల, గొర్రెల, మేకల పాకలు నిర్మించుకోవడం, మట్టి రోడ్లు వేసుకోవడం, చెక్ డ్యాంలను ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి అవకాశం కల్పిస్తున్నారు. నిత్యం 60వేల మందికి పైగా.. జిల్లాలో 1,86,197 జాబ్కార్డులు.. 3,77,087 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 74,953 మంది ఉపాధి పనులకు వస్తున్నారు. 20 మండలాల్లో రోజుకు సగటున 60వేల నుంచి 70వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గత నెలలో రోజుకు 20వేల మందే వచ్చేవారు. ప్రస్తుతం అత్యధికంగా పెద్దేముల్ మండలంలో 7,171 మంది, ధారూరులో 5,735 మంది, మర్పల్లిలో 5,018 మంది కూలీలు పనులకు వస్తున్నారు. అయితే కూలి గిట్టుబాటు కావడంలేదని పలువురు అంటున్నారు. తగ్గుతున్న పనిదినాలు కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపాధి పనుల్లో కోత విధిస్తూ వస్తోంది. సంస్కరణల పేరుతో నిబంధనలను కఠినతరం చేస్తూ పేదలను పనులకు దూరం చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కల్పించాల్సిన పని దినాల్లో దాదాపుగా కోటి రోజులు కోత విధించిందంటే ఈ ప్రభావం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం కూలీల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేపట్టాలనే నిబంధన ఇబ్బందిగా మారింది. గతంలో ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహ్నం వరకు ఇళ్లకు చేరుకునే వారు. ప్రస్తుతం ఉదయం ఒక పని.. మధ్యాహ్నం తర్వాత మరో పనికి సంబంధించి ఫొటో అప్లోడ్ చేయాలి. రెండు సార్లు ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో ఫొటోలు దిగాలి. ఇందు కోసం కూలీలు మండుటెండలో వేచి చూడాల్సి వస్తోంది. జిల్లాలో చురుగ్గా ఉపాధి హామీ పథకం పనులు జాబ్కార్డులు 1,86 లక్షలు కూలీల సంఖ్య 3.77 లక్షలు ప్రస్తుతం పనికిహాజరవుతున్న వారు 74,953 గత నెలతో పోలిస్తే 50వేల మంది అధికం జిల్లాలో 74వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వారం రోజుల్లోగా కూలీలకు డబ్బులు అందుతున్నాయి. అందరి సహకారంతో పనులు బాగా కల్పించగలుగుతున్నాం. మూడేళ్లుగా ఉపాధి పనుల్లో మన జిల్లా ముందు వరుసలో ఉంది. – శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
నిబద్ధతతో పనిచేద్దాం
● ఎస్పీ స్నేహ మెహ్ర ● జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ దర్బార్ అనంతగిరి: మనమంతా ఒకే కుటుంబం, కలసిమెలసి పని చేద్దామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఆ శాఖ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సమాజానికి రోల్ మోడల్గా నిలవాలన్నారు. సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం చట్ట విరుద్ధ పనులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐ శ్రీశైలం, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నామినేటెడ్ పదవులు ఇవ్వాలి
తాండూరు: మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్న సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కోరారు. గురువారం నగరంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్ పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ను కోరిన ఎమ్మెల్యే బీఎమ్మార్ -
సీపీఆర్తో ప్రాణ రక్షణ
● ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి ● ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల షాద్నగర్: అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు చేసే సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్డియాలజిస్ట్ డాక్టర్ చందులాల్ రాథోడ్ విద్యార్థులకు కార్డియోపల్మోనరీ రెస్యూసిటేషన్(సీపీఆర్)పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుండెపోటు సమయంలో మెదడుతో పాటు కీలక అవయవాలకు ఆక్సిజన్ ఉన్న రక్తం అందేలా చేసే ప్రాణరక్షణ చర్యే సీపీఆర్ అన్నారు. దీనిద్వారా ఆకస్మిక గుండెపోటు బాధితులకు ప్రాణరక్షణ అవకాశాలను 60శాతం మెరుగుపర్చని తెలిపారు. అనంతరం డాక్టర్ చందులాల్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు ఎదపై భాగంలో రెండు చేతులతో ఇంటర్లాక్చేసి నిమిషానికి 100నుంచి 200 సార్లు ఛాతిని నొక్కాలన్నారు. ముక్కుమూసి నోటిద్వారా బలంగా శ్వాస అందించాలని, ఈ విధంగా కనీసం 45 నిమిషాలు చేయాలని సూచించారు. అంబులెన్స్ సాయంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పాలాది శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ శాంతి, డాక్టర్ జయ, దేవయ్య, నదిర, అనురాధ, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిబంధనలకు పాతర
యాచారం: ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద వచ్చిన రూ.కోటి పారితోషికం దుబారా ఖర్చయింది. గ్రామ పంచాయతీ ఖాతాలో జమ అయినా నగదును నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీ పాలకవర్గం, అధికారుల తీరుతో ఉన్నత లక్ష్యానికి గండిపడ్డట్లు అయింది. 2025 ఏడాదికి గాను మండల పరిధిలోని మాల్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డుకు ఎంపికై ంది. గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 ఏప్రిల్ 24వ తేదీన బిహార్ రాష్ట్రంలోని మధుబన్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మాల్ పంచాయతీ కార్యదర్శి రాజు అవార్డు అందుకున్నారు. దీంతోపాటు రూ.కోటి నగదు పారితోషికాన్ని అందుకున్నారు. ప్రత్యేక ఆర్థిక వనరు కింద ఎంపిక గతేడాది ఏప్రిల్ నెలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చింది. 19 ఆర్థిక అంశాలపై అధ్యయనం చేసి అప్పటి ఎంపీడీఓ నరేందర్రెడ్డి సూచన మేరకు మాల్ పశువుల సంత ఆర్థిక వనరును గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి మంగళవారం ఏర్పాటు చేసే పశువుల సంతతో ఏటా రూ.50 లక్షలకు పైగానే ఆదాయం పొందడం, అది కూడా పంచాయతీ ఆర్థిక వనరు కిందనే ఖర్చు చేస్తుండడంతో ఆత్మ నిర్భర్ నేషనల్ గ్రామ పంచాయతీ అవార్డుకు కేంద్ర ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. వసతుల లేమితో ఇక్కట్లు ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద మాల్కు అందిన రూ.కోటి పారితోషికం దుబారా ఖర్చు అయిందని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అవార్డు తెచ్చి పెట్టిన పశువుల సంత అభివృద్ధికి నిధులు వెచ్చించాలి. కానీ పైసా కూడా సంతకు ఖర్చు చేయలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సమస్యలున్నాయి. క్రయ, విక్రయాలకు తీసుకువచ్చే పశువులకు నీడ, తాగునీటి సౌకర్యం లేదు. రైతులకు, మధ్యవర్తులకు సైతం నిలువ లేదు. సంతకు శాశ్వత స్థలం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన వెంచర్లో మంగళవారం నిర్వహణ కొనసాగుతుంది. ఎండకు, వానాకు పశువులతో పాటు రైతులు, మధ్యవర్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ప్రభుత్వ భూమి సర్వేనంబరు 640లో ఐదు ఎకరాల్లో పశువుల సంతకు శాశ్వత స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినా నేటికి అనుమతులు రాలేదు. ఇంతలోనే నిబంధనలు ఉల్లంఘించి కార్యదర్శి, పాలకవర్గం కనీసం ఎంబీలు లేకుండానే ఇష్టానుసారంగా నిధులను అనవసరమైన పనులకు దుబారా చేశారు. మాల్ పశువుల సంతకు ప్రతి మంగళవారం పశువుల క్రయ, విక్రయాల కోసం వస్తాను. రూ.వేలాది పన్నులు చెల్లిస్తాను. కానీ సంతలో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. పాడి, పశువులు, కాడెద్దుల విక్రయాల కోసం ఎండకే ఉండడంతో వడదెబ్బకు గురవుతున్నాం. తాగునీటి సౌకర్యం కూడా లేదు. – మహేందర్, వ్యాపారి, మునుగోడు సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికే రూ.కోటి పారితోషికంలో రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. సంతకు శాశ్వత స్థలం కేటాయించాలని కలెక్టర్ని కలిసి విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రొసీడింగ్ రాగానే పనులు చేపడుతాం. – అశోక్యాదవ్, సర్పంచ్, మాల్ రూ.కోటి పారితోషికం గతేడాదిలోనే పంచాయతీ ఖాతాలో జమ అయింది. కానీ పశువుల సంతకు శాశ్వత స్థలం లేకపోవడంతో అభివృద్ధి పనులకు పైసా ఖర్చు చేయలేదు. గ్రామాభివృద్ధి కోసం ఆ నిధులను వెచ్చించాం. రూ.40–50 లక్షలకు పైగానే వివిధ పనులకు ఖర్చు చేశాం. – రాజు, పంచాయతీ కార్యదర్శి, మాల్ రూ.కోటి పారితోషికం దుబారా మాల్కు ఆత్మ నిర్భర్ జాతీయ అవార్డు గుర్తింపు తెచ్చిన పశువుల సంతపై నిర్లక్ష్యం పైసా ఖర్చు చేయని పంచాయతీ పాలకవర్గం కనీస పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులుఏడాది ఆదాయం(రూ.లక్షల్లో) 2021–22 రూ.53 2022–23 రూ.59 2023–24 రూ.71 2024–25 రూ.73 2025–26 రూ.82 2026–27 రూ.105 -
సర్వేకు ఓవర్ ల్యాప్స్ గండం
యాచారం: మండలంలోని మొండిగౌరెల్లిలో అసైన్డ్ భూముల సర్వే నిలిచింది. పక్షం రోజులుగా జోరుగా సాగిన సర్వేను అధికారులు రెండు రోజులుగా నిలిపేశారు. గ్రామంలోని అసైన్డ్ సర్వేనంబర్లు 19, 68, 127లతో పాటు పలు పట్టా సర్వేనంబర్లల్లోని మొత్తం 822.11 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ల పేరుతో సేకరించడానికి సర్కార్ నిర్ణయించింది తెలిసిందే. ప్రస్తుతం 500 ఎకరాల వరకున్న అసైన్డ్ భూమిని సేకరించడానికి భూ సర్వే చేపట్టారు. కొద్ది రోజులుగా 19, 127లలోని 300 మందికి పైగా రైతులకు చెందిన భూ కబ్జా సర్వే చేపట్టారు. ఇంకా ఆయా సర్వే నంబర్లల్లోని రైతుల కబ్జాను సర్వే చేయడం మిగిలింది. సర్వేనంబరు 127, 19 లలోని భూమిని సాఫీగా సర్వే చేసిన అధికారులు 68 సర్వే నంబరు బార్డర్కు వచ్చే సరికి సర్వేకు ఆటంకం ఏర్పడింది. ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు, ఎకరాకు 121 గజాల ప్లాటు, అదనంగా రైతు కుటుంబాలకు మరొక 121 గజాల ప్లాటు ఇచ్చేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అంగీకరించారు. దీంతో రైతులు భూసర్వేకు సమ్మతించారు. రికార్డుల పరిశీలన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూసర్వేను నిలిపేసిన అధికారులు ఆ లోపు ప్రస్తుతం వరకు పూర్తి చేసిన సర్వే రికార్డులను పరిశీలన చేయడానికి నిర్ణయించారు. 127లో మొత్తం అసైన్డ్ భూమి 122.02 ఎకరాలు ఉంది. 108.30 ఎకరాలను అసైన్డ్ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్లో మాత్రం 113.34 ఎకరాలను నోటిఫికేషన్లో ప్రకటించారు. 19లో మొత్తం భూమి 575.30 ఎకరాలు ఉండగా, 400 ఎకరాలను గుర్తించారు. 68లో రికార్డుల ప్రకారం మొత్తం 788.20 ఎకరాలు ఉండగా కేవలం 203.16 ఎకరాలను మాత్రమే అసైన్డ్ చేశారు. ఈ 68 సర్వేనంబరులోని మిగిలిన భూమి పూర్తిగా గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడి వ్యవసాయానికి యోగ్యంగా పనికి రాకుండా ఉంది. 68 సర్వేనంబరులో టెన్షన్ సర్వేలో భాగంగా 68 సర్వేనంబరులో అసైన్డ్ భూమి ఓవర్ ల్యాప్స్తో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ సర్వేనంబర్ అసైన్డ్ భూమి యాచారం–మంచాల మండలాల సరిహద్దులో ఉంది. మొత్తం అసైన్డ్ భూమి 788.20 ఎకరాల ఉంది. ఇందులో 203.16 ఎకరాలే అసైన్డ్ చేశారు. అనేక అనధికార నకిలీ సర్టిఫికెట్లు పుట్టుకొచ్చాయి. ఈ సర్వేనంబరులో పేరుకే 788.20 ఎకరాలు కాని ట్యాడ్ పోజిషన్ చూస్తే మాత్రం కేవలం 300 ఎకరాలే ఉంటుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 68 సర్వేనంబర్లోని 500 ఎకరాల్లో చంచల్గూడ జైలును తరలించి ఇక్కడ నిర్మించడానికి అధికారులు నిర్ణయించారు. కొద్ది రోజుల పాటు రెవెన్యూ, సర్వే, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సర్వే కూడా చేశారు. 68 సర్వేనంబర్లో పేరుకే 788.20 ఎకరాలు కానీ పోజిషన్ చూస్తే మాత్రం 300 ఎకరాలే ఉండడంతో జైలు నిర్మించడానికి నిరాకరించారు. ప్రస్తుతం 68 సర్వేనంబర్లోని ఓవర్ట్యాప్స్తో ఏం చేయాలో తోచక సర్వే, రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు భూసర్వేను కొద్ది రోజుల పాటు నిలిపేశారు. మొండిగౌరెల్లిలో నిలిచిన 68 సర్వేనంబరు అసైన్డ్ భూ సర్వే ఉన్నతాధికారులకు నివేదించిన అధికారులు -
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
● కలెక్టర్ దీపక్ తివారి ● కడా కార్యాలయంలో విద్యా వారోత్సవాలు కొడంగల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధిక నిధులు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషశ్రీ, ఎంఈఓ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వాములు కండి అనంతగిరి: ఆధునిక విద్యా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డీఈఓ రేణుకాదేవి, ఆయా మండలాల విద్యాధికారులు తదితరలు పాల్గొన్నారు. నివేదికలు సమర్పించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రత్యేక అధికారులు రోజు సందర్శించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి వరి ధాన్యం, మొక్కజొన్న, జొన్న కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లపురోగతి, ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా, పౌర సరఫరాల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మే చివరి నాటికి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కే వెంకటాచారి, జిల్లా పౌర సంబంధాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా సహకార అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం వద్దు బొంరాస్పేట: రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం బొంరాస్పేట, నాగిరెడ్డిపల్లిలోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హమాలీల సమస్య ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎంసీఎస్ మురళీకృష్ణ, డీఎస్ఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మండల టాపర్కు సన్మానం దుద్యాల్: పదో తరగతి ఫలితాల్లో 557 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచిన మౌనికను కలెక్టర్ దీపక్ తివారి సన్మానించారు. బుధవారం కొడంగల్లోని కడా కార్యాలయంలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, దుద్యాల్ సర్పంచ్ సంగీత వాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆట.. భవితకు బాట
హుడాకాంప్లెక్స్: మానసిక, శారీరక దృఢత్వానికి దోహదం చేసే క్రీడలపై చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. వీరికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అండగా నిలుస్తోంది. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సరూర్నగర్ స్టేడియంలో నిత్యం ఉదయం 6నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4నుంచి 6గంటల వరకు అనుభవజ్ఞులైన కోచ్ల పర్యవేక్షణలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫోన్లు, టీవీలు, ట్యాబ్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు సైతం కొంత సమయం కేటాయిస్తున్నారు. రోజూ తమ పిల్లలను వెంట పెట్టుకుని క్రీడాప్రాంగణానికి చేరుకుంటున్నారు. మెలకువలు నేర్పిస్తూ.. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలతో పాటు మారుమూలల నుంచి తరలివస్తున్న క్రీడా ఔత్సాహిక బాలబాలికలతో ఇండోర్/ అవుట్ డోర్ స్టేడియాలు సందడిగా మారుతున్నాయి. తల్లిదండ్రులు వాకింగ్, జాగింగ్ చేస్తుండగా, పిల్లలు జిమ్నాస్టిక్, స్కేటింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, కరాటే, టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ తదితర క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. కోచ్లు సైతం వీరిని ఆయా ఆటల్లో రా టుదేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ ప్రతి భ చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. దీనికితోడు ఉద్యోగ నియామకాల్లోనూ రిజర్వేషన్ లభించే అవకాశం ఉంటుంది. క్రీడాంశం శిక్షణకాలం ఫీజు క్రికెట్ 30 రోజులు రూ.1000 స్విమ్మింగ్ 30 రోజులు రూ.1,500 అథ్లెటిక్స్ 30 రోజులు రూ.1,000 బాస్కెట్బాల్ 30 రోజులు రూ.2,000 స్కేటింగ్ 30 రోజులు రూ.2,000 జిమ్నాస్టిక్స్ 30 రోజులు రూ.1,000 బ్యాడ్మింటన్ 30 రోజులు రూ.2,500 వాలీబాల్ 30 రోజులు రూ.1,000 టెన్నిస్ 30 రోజులు రూ.1,500 బాక్సింగ్ 30 రోజులు రూ.500 కరాటే 30 రోజులు రూ.500 కబడ్డీ 30 రోజులు రూ.500 టేబుల్ టెన్నిస్ 30 రోజులు రూ.2,000 సద్వినియోగం చేసుకోవాలి ఏడేళ్ల పైబడిన పిల్లలకు ఇక్కడ వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాం. పిల్లలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. క్రీడలతో పిల్లలు ఒత్తిడిని తట్టుకుని చదువులో రాణించే అవకాశం ఉంటుంది. క్యాంప్ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – స్వర్ణలత, డీఎస్డీఓ వాలీబాల్ శిక్షణ నాకు చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడటం ఇష్టం. ఈ క్రీడలో రాణించాలనే పట్టుదలతో నిత్యం ఉదయం ఐదు గంటలకే స్టేడియానికి చేరుకుని రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నా. ఉదయం గ్రౌండ్లో గడపడం మనసుకు ప్రశాంతతనిస్తోంది. కోచ్లు ఆటల్లో మెలకువలను నేర్పిస్తున్నారు. – నయిమిషాశ్రీ, ఎల్బీనగర్ వేసవి శిబిరానికి పోటెత్తుతున్న బాలబాలికలు సరూర్నగర్ స్టేడియంలో సందడే సందడి తల్లిదండ్రులతో కలిసి వచ్చి నచ్చిన క్రీడల్లో శిక్షణ సరూర్నగర్ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరాల ఫీజులు ఇలా -
బాధ్యతగా మెలగాలి
కొడంగల్: ప్రజా ప్రతినిధులు బాధ్యతగా మెలగా లని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం కడా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వస తులు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులను సన్మానించారు. కార్యక్రమంలో కడా ప్రత్యే కాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సి పల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, ఎంఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి -
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
ఇబ్రహీంపట్నం: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన వినోబానగర్లో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక గురుకుల విద్యాపీఠ్్లో నిర్వహించిన విద్యావారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యారంగాభివృద్ధికి రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఇందులో భాగంగా ఆరుట్ల పబ్లిక్ స్కూల్, నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారని వివరించారు. భవిష్యత్తు తెలంగాణ రేపటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని.. ఆ దిశగా అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ భోధన పద్దతుల్లో మార్పులు తీసుకురావాలన్నారు. విద్యార్థుల ఇబ్బందులకు చెక్ ఒకే చోట డిగ్రీ, ఇంటర్ తరగతులు షిప్ట్ పద్ధతిలో కొనసాగడంతో విద్యార్థుల ఇబ్బందులు తీరుతాయన్నారు. కొత్తగా నిర్మించిన డిగ్రీ కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్లు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ అనంతరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక, భూదాన్బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యాశాఖాధికారులు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
రంగారెడ్డి డీపీహెచ్ మమత ఇబ్రహీంపట్నం రూరల్: పిల్లలకు క్రమం తప్పకుండా టీకా వేయించాలని జిల్లా డీపీహెచ్(డైరెక్టర్ఆఫ్ పబ్లిక్ హెల్త్) ఎన్.మమత సూచించారు. బుధవారం ఆమె ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14–15 ఏళ్ల లోపు ఆడపిల్లలందరూ హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని సూచించారు. ప్రతీ బుధవారం చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి టీకా ఇస్తారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అజయ్కుమార్, ఇబ్రహీంపట్నం హెచ్ఈ బ్రిజిత సిస్టర్ తిరుమలమ్మ, అనిత, భాగ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. కడ్తాల్: మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏసీపీ కార్యాలయం, వాహనాల రద్ధీ నియంత్రణకు ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి డీజీపీ సీవీ ఆనంద్ను కోరారు. బుధవారం ఆయన నగరంలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీగా నియమితులైన సీవీఆనంద్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా అవసరాలపై చర్చించి వినతిపత్రం అందజేశారు. ఫ్యూచర్సిటీలో భాగంగా కడ్తాల్ మండలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కూడ ఉండటంతో వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ మేరకు డీజీపీ సానుకూలంగా స్పందించారని, సంబందిత అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారని తెలిపారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శివకుమార్ తుర్కయంజాల్: నీట్ పరీక్ష నిర్వహణలో వరుసగా విఫలమవుతోన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి పి.శివకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం తుర్కయంజాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పరీక్షా అని కేంద్రం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల ఎంతో మంది విద్యార్ధులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్–2026 లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: భారత ప్రభుత్వం చేపట్టిన జనగణన–2027లో భాగంగా సోమవారం ప్రారంభమైన ఇళ్ల జాబితా, గణన ప్రక్రియలో అధికారులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. వచ్చే నెల 9వ తేదీ వరకు మీ ఇంటి వద్దకు వచ్చే నమోదు అధికారికి అన్ని వివరాలు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. స్వీయ గణన నమోదు చేసుకున్నవారు ఎస్ఈఐడీ నంబర్ చూపితే సరిపోతుందన్నారు. సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల గణనకు వచ్చే అధికారికి సరైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు. సూదిని రాంరెడ్డికి కసిరెడ్డి అభినందనలు మాడ్గుల: పంచాయితీ రాజ్ ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సూదిని రాంరెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రమంజిల్లోని తన కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో అభినందించారు. వీరిలో సూదిని లక్ష్మారెడ్డి, సూదిని అరవింద్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాయితి సాయిరెడ్డి, రవికాంత్, యాదయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు. -
ఊసేలేని వికాసం
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026వికారాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికతో ఆగిపోయింది. అర్జీలు స్వీకరించి ఏడాది గడిచినా ప్రభుత్వం రుణాల ఊసే ఎత్తడం లేదు. గతేడాది జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మిన్నకుండి పోయింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే నెలలో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత పథకం అమలుపై కదలిక లేకపోవడంతో యువత నిరుత్సాహానికి గురువుతోంది. తాండూరు నుంచి అత్యధికంగా.. రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 50,197 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్ మున్సిపాలిటీ నుంచి అత్యల్పంగా 760 మంది దరఖాస్తు చేయగా.. తాండూరు మండలం నుంచి అత్యధికంగా 3,456 మంది దరఖాస్తు చేసుకున్నారు. తదనంతరం అర్జీలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. యూనిట్ ధర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు అందజేయాలని నిర్ణయించారు. ఇందులో రూ.లక్షకు 90 శాతం రాయితీపై రుణాలు అందజేస్తారు. రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ వర్తించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందే వారికి 70 శాతం రాయితీ వర్తిస్తుంది. నేతల కనుసన్నల్లోనే ఎంపిక లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వారు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వారికి లబ్ధి చేకూరేలా చూసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నేతల అండదండలు ఉన్న వారికే జాబితాలో పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పథకం ఎప్పుడు అమలు చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. యువత మాత్రం ఏడాదిగా రుణాల కోసం ఎదురు చూస్తోంది.రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులు 50,197 ఏడాది క్రితం లబ్ధిదారుల ఎంపిక ఆ తర్వాత ఆగిపోయిన ప్రక్రియ రుణాల కోసం యువత ఎదురుచూపులు -
బీసీ గణనతోనే న్యాయం
పరిగి: బీసీ గణన చేసినప్పుడే న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ లాల్కృష్ణ అన్నారు. బుధవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. వారి పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయాలంటే కుల ఆధారిత జనగణన అత్యంత కీలకమన్నారు. సరైన గుణాంకాలు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ నియోజకవర్గ అధ్యక్షుడు సదానందం, నాయకులు ఆనంద్, పులేందర్, వెంకటయ్య, లింగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ -
లక్ష బోర్లకు ప్రాణం పోసిన భగీరథుడు
● భూగర్భ జలాల రక్షణకు బోర్లు వేయించనని ప్రమాణం ● ‘సాక్షి’తో హైడ్రో జియాలజిస్ట్ డాక్టర్ దేవరాజరెడ్డి ఎన్.జె శంకర్పల్లి: ఆయన భూగర్భ జల శాస్త్రవేత్త. ఇప్పటికే ఎండిపోయిన దాదాపు లక్ష బోర్లను రీచార్జ్ చేసి ప్రాణం పోశారు. రూ.లక్షలు సంపాదించే అవకాశాలను వదిలి జల సంరక్షణకు 28 ఏళ్లుగా నడుం బిగించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా భూగర్భ జలవనరులను కాపాడే మెళకువలను విరివిగా తెలియజేస్తున్నారు. పదేళ్ల క్రితం శంకర్పల్లి మండలం మోకిలలోని సార్క్–2 వెంచర్లో ఆయన చేసిన కృషి కారణంగా ఇప్పటికీ నీటి ఎద్దడి తలెత్తకుండా కేవలం రెండు బోర్ల ద్వారానే నీటిని సంమృద్ధిగా వినియోగించుకుంటున్నారు. ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. గ్రౌండ్ వాటర్ స్పెషలిస్ట్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దేవరాజ రెడ్డి ఎన్.జె 1987లో మైసూరు వర్సిటీ నుంచి భూగర్భ జల శాస్త్రవేత్తగా పట్టా పొందారు. నాటి నుంచి దాదాపు 11 ఏళ్ల పాటు మైసూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి లభ్యత ఆధారంగా బోర్లను వేయించే వారు. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంపై చలించిన ఆయన 1998లో వృత్తిని వదిలి బోర్లను వేయించనని ప్రమాణం చేశాడు. సుమారు ఐదేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాపాడాలని కోరుతూ అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం పలు కమిటీల్లో చోటు కల్పించడంతో కర్ణాటకలో గ్రౌండ్ వాటర్ స్పెషలిస్ట్గా పేరు వచ్చింది. 2020నుంచి మూడేళ్ల పాటు కర్ణాటక ప్లానింగ్ కమిషన్ బోర్డు సభ్యుడిగా విధులు నిర్వర్తించారు. జియో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెంటర్ భూగర్భ జల వనరులను కాపాడాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కృషిని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులను ప్రదానం చేశాయి. కన్నడలో నవ కర్ణాటక పబ్లికేషన్స్ నుంచి 15 ఎడిషన్స్, తెలుగులో విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి ఐదు ఎడిషన్స్ పుస్తకాలు విడుదలయ్యాయి. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2002లో బళ్లారి సమీపంలో చిత్రదుర్గలో తాను చైర్మన్గా ఉండి ఎనిమి మంది సభ్యులతో జియో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. భవిష్యత్లలో తాగునీటికి ఇబ్బంది 1965లో డెన్మార్క్ సాంకేతిక ఆధారంగా భారతదేశంలో బోర్లు వేయడం ప్రారంభించారు. కేవలం 25 మీటర్లు లోతు మాత్రమే వేయాలని సూచించారు. ప్రభుత్వం గ్రీన్ రెవల్యూషన్ పేరుతో బోర్లకు సబ్సిడీ ఇచ్చి పెద్ద ఎత్తున బోర్లు వేయించింది. తర్వాత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో 25 మీటర్ల లోతు కాస్తా.. వేయి మీటర్లకు వెళ్లింది. దీంతో దేశంలో 60 ఏళ్లలో దాదాపు 6 కోట్లకు పైగానే బోర్లు ఉన్నాయని, వీటి ద్వారా అవసరానికి మించి నీటిని తోడడంతో దాదాపు 80 శాతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వేసిన బోర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఎండిపోయిన బోర్లను రీచార్జి పద్ధతిలో వినియోగంలోకి తీసుకురావచ్చని సూచిసున్నారు. ప్రస్తుతం ఉన్న 20శాతం భూగర్భ జలాలు సైతం రూరల్, అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తాగడానికి నీరు లభించడం కష్టమని హెచ్చరించారు. సూచనలు ● వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. ● పొలంలో ఓ చివరన పెద్ద గుంతను తవ్వి వర్షపు నీరు నిలిచేలా సిద్ధం చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. ● ఇళ్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, వెంచర్లలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలి. ● ఇంకుడు గుంత నిర్మాణంలో మొదట 40 ఎంఎం కాంక్రీటు తర్వాత 20ఎంఎం వేసిన తర్వాత ఫిల్టర్ని అమర్చాలి. తర్వాత బొగ్గు, చివరల్లో 6 ఎంఎం కాంక్రీటును వేయాలని. దీంతో నీరు భూమిలోపలికి వెళ్తుందన్నారు. మోకిలలో సార్క్ విల్లాలను నిర్మించిన బిల్డర్ సరైన సదుపాయాలు కల్పించలేదు. 2016లో ఉన్న రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో నెల రోజుల్లో 300 వాటర్ ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేశాం. తర్వాత యూట్యూబ్లో డాక్టర్ దేవరాజ రెడ్డి అవగాహన కార్యక్రమాలను చూసి ఆయన్ను పిలుచుకున్నాం. కేవలం రూ.4 లక్షల ఖర్చుతో ఒక కుంటను ఏర్పాటు చేయించి, ఎండిపోయిన రెండు బోర్లను రీచార్జ్ చేశారు. పదేళ్లుగా సంవృద్ధిగా నీరు లభిస్తోంది. ఇప్పుడు సార్క్–2 వెంచర్ నుంచి ఇతరులకు నీటి సాయం చేశామని గర్వంగా చెప్పుకుంటాం. – భాస్కర్, సార్క్–2 అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుసంవత్సరం అవార్డు 2008 కృషిపండిట్ 2011 ఎన్విరాన్మెంటల్ 2016 రాజ్యోత్సవ, అసమాన్య కన్నడి 2018 వాటర్ రిసోర్సెస్ (కేంద్ర ప్రభుత్వం) -
పేదల వైద్యుడి కన్నుమూత
బొంరాస్పేట: యాభై ఏళ్ల క్రితం సైకిల్పై పల్లెలకు, గిరిజన తండాలకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి, వైద్యం అందించిన దూగుర్ రాఘవేంద్రచారి(90) బుధవారం మృతిచెందారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ)గా పనిచేసిన ఆయన గ్రామీణ ప్రజలకు యాభై ఏళ్ల పాటు వైద్యం చేసి, పేదల వైద్యుడిగా మంచి పేరు సంపాదించారు. కల్లు దుకాణం వద్ద మహిళ మృతి బొంరాస్పేట: మండలంలోని నాందార్పూర్లో ఓ మహిళ కల్లు దుకాణం వద్ద మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంబళ్ల తుల్జమ్మ(53) సోమవారం రాత్రి 8 గంటలకు కల్తీకల్లు తాగి ఇంటికి తిరిగి వస్తుంటే దుకాణం సమీపంలో కిందపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతురాలి తండ్రి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీకల్లు కారణంగానే తుల్జమ్మ చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపించారు. విద్యాభివృద్ధికి పెద్దపీట షాద్నగర్: ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్దపీట వేస్తోందని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లకు విద్యాభివృద్ధిపై వర్క్ షాప్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. -
రూ.600 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు
మర్పల్లి: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందకు తనవంతు కృషి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచ్ రమేష్ తోకలిసి రత్నమ్మ, మంజుల, లక్ష్మి తోపాటు మరి కొందరి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ నుంచి ప్రధాన రహదారి వరకు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 47మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు నిర్మిస్తున్నుట్లు చెప్పారు. ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.50 లక్షల నుంచి రూ.కోటి వెచ్చించి సీసీ రోడ్లు వేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారం అవుతోందన్నారు. మండల పరిధిలోని ఘణాపూర్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, జిల్లా, మండల నాయకులు సుభాష్ యాదవ్, దివాకర, రవీందర్, నాగేశ్, రఫీ, రాచన్న, శేఖర్, రథన్, సర్వేష్, మధుకర్రెడ్డి, నిఖీల్రెడ్డి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ మండలంలోని కోట్మర్పల్లిలో మల్లన్న స్వామి ఆలయ పునర్నిర్మాణానికి స్పీకర్ ప్రసాద్కుమార్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి, సిరిపురం సహకార సంఘం మాజీ చైర్మన్ రఘుపతిరెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు రాచన్న, రామేశ్వర్, వెంకట్రాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జైహింద్రెడ్డి, బిచ్చిరెడ్డి, ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ప్రజలకు వరం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
తాండూరు: మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ పాల్గొన్నారు. నాలుగు స్థానాలకు గాను 12 మంది నామినేషన్లు వేశారు. అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు నలుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న వారిలో సుభాష్, మహ్మద్ రహీం, చిన్నోళ్ల సరిత, అఫ్రీన్ జవేరియా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదర్రెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికై న వారిని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సన్మానించారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్కు చెందిన 12 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే పదో తరగతిలో ఉతీర్ణత సాఽధించిన విద్యార్థులను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అభినందించారు. బుధవారం పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మున్సిపల్ చైర్పర్సన్ నీరజతో కలిసి అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నర్సింగ్రావు, మహిపాల్రెడ్డి, ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా నేరం
అనంతగిరి: బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవులను వధించకుండా చర్యలు చేపట్టాలన్నారు. పశువుల అక్రమ రవాణా నేరమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అధికారి సదానందం, పరిగి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ తదితర అంశాలపై నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలోజరుపుకోవాలని కోరారు. ప్రత్యేక నిఘా: ఎస్పీ తాండూరు టౌన్: పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చెక్పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. బుధవారం మండలంలోని అంతారం చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బక్రీదు పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. పశువులను తరలిస్తే చర్యలు ధారూరు: అనుమతి, సరైన పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తుంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ధారూరు సీఐ రఘురామ్, ఎస్ఐ రాఘవేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర -
పార్క్ చేసిన వాహనాల నుంచి డీజిల్ చోరీ
ఇద్దరు ఆటోడ్రైవర్లకు రిమాండ్ కందుకూరు: పార్క్ చేసిన వాహనాల నుంచి రాత్రి వేళ డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని దిల్వార్గూడ(జండాగూడ)లో రాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు పార్క్ చేసిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలిస్తున్నారు. ఓ ఆర్టీసీ బస్సు నుంచి 110 లీటర్లు, డీసీఎం నుంచి 30 లీటర్లు, టిప్పర్ నుంచి 300 లీటర్లు మొత్తంగా రెండు రోజుల వ్యవధిలో 440 లీటర్లు దోచినట్లు వాహనాల యజమానులు, డ్రైవర్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వి.ప్రసాద్, క్రైం బృందం శివారజ్, ప్రవీణ్ దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించారు. ఓ బ్లూ స్విఫ్ట్ కారులో రాత్రి సమయంలో ఇద్దరు వచ్చి డీజిల్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ఫుటేజీ ఆధారంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఐలాపూర్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ సభావత్ రమేశ్(30), హైదరాబాద్ మియాపూర్లో ఉండే నడిగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్ ముడావత్ గణేశ్(18)గా గుర్తించారు. వారిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకొన్నారు. దీంతో వారి వద్ద 330 లీటర్ల డీజిల్తో పాటు స్విఫ్ట్ కారు, డీజిల్ అమ్మగా వచ్చిన సొమ్ము రూ.19,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికిల్..!
పరిగి: నియోజకవర్గంలో మెడికల్ దందా జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. మందుల షాపుల్లో తప్పనిసరిగా ఫార్మసిస్టు ఉండాలి. వారే విక్రయించాల్సి ఉంటుంది. కానీ అర్హత లేని వారితో షాపులు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దుకాణాలపై అధికారులకు నియంత్రణ కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు చేసి వారు ఇచ్చే మామూళ్ల తీసుకుంటూ మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 50కి పైగా మెడికల్ షాపులు పరిగి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, చౌడాపూర్ మండలాల్లో 50కి పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. 90శాతం దుకాణాల్లో ఫార్మసిస్టులు లేరు. అనర్హులు మందు విక్రయించడం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ ఒక రకం రాస్తే రోగులకు మరో రకం మందులు అంటగడుతున్నారు. పరిగి పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో అనధికార మెడికల్స్ ఉన్నాయి. వాటిని ఆర్ఎంపీలు, పీఎంపీలు నిర్వహిస్తున్నారు. విషయం సంబంధిత అధికారులకు తెలిసినా మామూళ్లకు ఆశపడి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అద్దెకు సర్టిఫికెట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన వారే మందుల దుకాణాలు నిర్వహించాలి. కానీ మెడికల్ రంగంలో ఏమాత్రం అనుభవం లేని వారు బీ ఫార్మసీ, డీ ఫార్మసీ సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని షాపులు పెట్టేస్తున్నారు. ఎక్కువ శాతం ఇలాంటి దుకాణాలే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారులకు విషయం తెలిసినా వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. మందుల కాంబినేషన్ తెలియని వ్యక్తులు విక్రయాలు చేస్తుండలం ఆందోళన కలిగిస్తోంది. అనుమతులు లేని మెడికల్ షాపులు, అర్హత లేని వారు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని షాపుల వివరాలను మా దృష్టికి తేవాలి. అలాంటి వాటిని సీజ్ చేస్తాం. తరచూ తనిఖీలు చేస్తూనే ఉన్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు. – క్రాంతి కుమార్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, పరిగి కిరాణా దుకాణాల్లో కూడా మందులు లభిస్తున్నాయి. తలనొప్పి.. జ్వరం.. ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు వంటి వాటికి మందులు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదు. కానీ షాపుల నిర్వాహకులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా బ్రాండెడ్ మందుల పేరుతో జనరిక్ మందులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు ధ్రువపత్రంతో పాటు లైసెన్స్డ్ ఫార్మాసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరపాలి. మెడికల్ షాపును కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించాలి. ఈ నిబంధనలను ఎవ్వరూ పాటించడం లేదు. మందులు కొన్న వారికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి. కొందరు బిల్లులు అడిగినా ఇవ్వడం లేదు. మందుల దుకాణాల్లో నిబంధనలకు పాతర కనిపించని ఫార్మసిస్టులు అర్హత లేనివారితో విక్రయాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు -
ప్రజల భద్రతలో రాజీ పడొద్దు
తాండూరు: ప్రజల భద్రత విషయంలో రాజీ పడరాదని ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. మంగళవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమాండ్ కట్రోల్ రూమ్, స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా పీస్ కమిటీలు నిర్వహిస్తామన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా తాండూరు రూరల్: ఇసుక, మత్తు పదార్థాలు, రేషన్ బియ్యం, కల్తీ విత్తనాల విక్రయం, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాకప్ గదులు, రికార్డులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. మండలం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్రాష్ట్ర దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకోవాలన్నారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ స్నేహమెహ్ర -
టీఎన్జీఓ నూతన కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం రూరల్: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా ఊటు యశ్వంత్ ఎన్నికయ్యారు. రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి హుస్సేన్ ఆదేశాల మేరకు మంగళవారం నాంపల్లి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీ కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా యశ్వంత్, అసోసియేట్ ప్రెసిడెంట్గా మాధవ్గౌడ్ (హెచ్డబ్ల్యూఓ), వైస్ ప్రెసిడెంట్ రంగయ్య (అగ్రికల్చర్), అంజాద్ అలీ (వైద్య), రాజశేఖర్ (రెవెన్యూ), వాణి (ప్రణాళిక), కార్యదర్శి శ్రీనివాస్రావు (మెడికల్), జాయింట్ సెక్రట్రీలుగా శ్రీనివాస్, గాయత్రి, కార్తీక్, అమృత, ట్రెజరరీ ఆనంద్సింగ్ (రెవెన్యూ), ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాధర్, పబ్లిక్ సెక్రట్రీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా మల్లేష్గౌడ్, నసీరుద్దీన్, వెంకట్రెడ్డి, విజిత శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న యశ్వంత్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. -
అక్రమాలకు లేటరైట్
జిల్లాలో యథేచ్ఛగా తవ్వకాలుసాక్షి, రంగారెడ్డి జిల్లా: సిమెంట్ తయారీలో ఉపయోగించే లేటరైట్(క్యాల్షియం, అల్యూమినియం ఆకై ్సడ్) ఖనిజం జిల్లా సరిహద్దులు దాటుతోంది. భూమి నుంచి వెలికితీసిన ముడిసరుకును కర్మాగారాల్లో ముక్కలు చేసి, 900 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. లైమ్స్టోన్, జిప్సం ఇతర ముడిపదార్థాల మిశ్రమాన్ని కలిపి కావాల్సిన గ్రేడింగ్లో సిమెంట్ తయారు చేస్తుంటారు. లేటరైట్ వినియోగం ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. జిల్లాలోని పెద్దేముల్ మండలం తట్టేపల్లి, ఓంలానాయక్ తండా, పాషాపూర్, రాంసింగ్ తండాలు.. బంట్వారం మండలంలోని బోపునారం శివారు.. వికారాబాద్, పూడూరు, మోమిన్పేట్, నవాబ్పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో వందల ఎకరాల్లో ఈ లేటరైట్ ఖనిజం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో 38 మైన్స్ ఉండగా, కొత్తగా మరో తొమ్మిది గుర్తించారు. నిజానికి హెక్టార్ పట్టా భూమిలో ఈ లేటరైట్ ఖనిజాన్ని తవ్వాలంటే రూ.8 లక్షలు డెడ్రెంట్ చెల్లించాల్సి ఉంది. పర్యావరణం, గనులు, రెవెన్యూశాఖల అనుమతి తప్పని సరి. తవ్వకాలు చేపట్టే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంది. ఇందుకు రూ.లక్షల్లో ప్రభుత్వానికి చెల్లించాలి. అనుమతి పొందిన ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలి. ప్రతి టన్నుకు రూ.135 చొప్పున రాయల్టీ కట్టాలి. కానీ మెజార్టీ లీజు దారులు రాయల్టీ ఎగొట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున ఆరువేల టన్నుల అక్రమ తవ్వకాలతో ప్రభుత్వం రూ.8.10 లక్షల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. కేవలం ఈ లేటరైట్ ఖనిజం అక్రమ రవాణాతోనే ప్రభుత్వానికి నెలా రూ.2.43 కోట్ల ఆదాయం రాకుండా పోతోంది. పెద్దేముల్ మండలం ఓంలా నాయక్ తండాలోని అసైన్ భూమిలో లేటరైట్ అక్రమ తవ్వకాలు2022 – 25 వరకు లేటరైట్ తవ్వకాలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో..) సంవత్సరం తవ్వకాలు 2022–23 26,25,493 2023–24 3,06,459 2024–25 28,90,709 2022 – 25 వరకు లైమ్స్టోన్ తవ్వకాలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో..)సంవత్సరం తవ్వకాలు 2022–23 49,415 2023–24 33,870 2024–25 33,150 సరిహద్దులు దాటుతున్న ఖనిజం పట్టించుకోని మైనింగ్ విభాగం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి లైమ్స్టోన్ మైన్స్.. సిమెంట్ తయారీలో వాడే లైమ్స్టోన్(క్యాల్షియం కార్బొనేట్) మైన్స్ జిల్లాలోని తాండూరు, బషీరాబాద్, కొడంగల్ పరిసరాల్లో 49 వరకు ఉన్నాయి. వీటిలో 24 మైన్స్ వర్కింగ్లో ఉన్నాయి. కొత్తగా మరో 17 ప్రాంతాల్లో మైన్స్ను గుర్తించారు. వీటిలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేలింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తవ్వకాలకు.. ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయానికి అసలు పొంతన ఉండటం లేదనే విమర్శలు లేక పోలేదు. -
తాగునీటి సమస్యకు చెక్ తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు.
నీట్.. ఫట్! ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు పరీక్ష రద్దు ప్రకటనతో ఆందోళనకు గురయ్యారు. ఎగ్జామ్ బాగా రాసి, ర్యాంకుపై ఆశలు పెట్టుకున్న వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. – ధారూరు, దుద్యాల, దోమ లీకై న చోటే రద్దు చేయాలి నీట్ పరీక్ష పేపర్ ఎక్కడ లీకై తే అక్కడే పరీక్ష నిర్వహించాలి. పరీక్ష బాగా రాసి, సీటు వస్తుందనే ధీమాతో ఉన్న సమయంలో కేంద్రం చేసిన ప్రకటన కుంగదీసింది. – లక్ష్మీప్రసన్న, ధర్మాపూర్, ధారూరు మండలం రద్దుతో చాలా నష్టపోతున్నాం కీ పేపర్ చూసుకుని బెస్ట్ ర్యాంక్ వస్తుందని చాలా సంతోషపడ్డా. ఆ ఆనందం ఇలా ఆవిరైపోతుందనుకోలేదు. మళ్లీ పేపర్ ఎలా వస్తుందో.. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయోననే టెన్షన్ మొదలైంది. – నిఖిల్, బొంపల్లి, దోమ మండలం లాంగ్టర్మ్ తీసుకున్నా.. నేను 2025లో ఇంటర్ పూర్తి చేశా. అప్పుడు నీట్ పరీక్ష రోజే మా తాత మరణించడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయా. అనంతరం ఏడాది పాటు లాంగ్ టర్మ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. మంచి ర్యాంక్ వస్తుందని ఆశించా. చాలా బాధగా ఉంది. – నవీన, హస్నాబాద్, దుద్యాల మండలం -
‘ఇందిరమ్మ’ నిబంధనలు సడలించాలి
తాండూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న నిబంధనలను సడలించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లపై చర్చించారు. తాండూరు పట్టణ శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇళ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. స్పందించిన మంత్రులు ఈ నెల 25న తాండూరుకు వస్తామని, అప్పటిలోగా సీసీ రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బషీరాబాద్ మండలంలో నీళ్లపట్టి – మైల్వార్ అటవీ ప్రాంతంలో ఆక్రమణకు గురైన వందలాది ఎకరాల భూములను కర్ణాటక వాసుల చెర నుంచి విముక్తి కల్పించాలని మంత్రులను కోరారు. స్పందించిన వారు సర్వే చేసి నివేదిక అందజేయాలని డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రులను కోరిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి నగరంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశం -
అడిషనల్ డీఆర్డీఓగా సత్తయ్య
అనంతగిరి: జిల్లా అడిషనల్ డీఆర్డీఓగా సత్తయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఆయన సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీగా పనిచేశారు. పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. అనంతగిరి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతి ప్రవేశం కోసం అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి కమలాకర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జిల్లా వాసులు అయి ఉండాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5గంటలలోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సమర్పించాలన్నారు. విద్యార్థి 01–06–2019 నుంచి 31–05 –2020 మధ్య కాలంలో జన్మించి ఉండాలన్నారు. కులం, ఆదాయం, నివాసం, ఆధార్ కార్డు, ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో జతచేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8639388553లో సంప్రదించాలన్నారు. దరఖాస్తు చేసుకోండి అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ ఐటీఐ ప్రిన్సిపల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 8 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 9177472488లో సంప్రదించాలన్నారు. 16, 18 తేదీల్లో కౌన్సెలింగ్ అనంతగిరి: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం సీట్ల భర్తీకి ఈ నెల 16న బాలురకు, 18న బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జిన్నారం(సంగారెడ్డి)కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఎల్టీ గ్రూప్ల్లో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో రావాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అనంతగిరి: కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం నగరం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. హమాలీల సంఖ్య పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా కోఆపరేటివ్ అధికారి నాగార్జున, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పసుపుల ప్రశాంత్ నియమితులయ్యారు. పట్టణంలోని కార్యాలయంలో బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో మంగళవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్కు నియామక పత్రం అందజేశారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలందరినీ ఏకంచేసి బీసీ జనసేనను ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జనసేన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ, పట్టణ అధ్యక్షురాలు కాటం రాజ్యలక్ష్మిగౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్, నాయకులు సత్యం, రాములు, వెంకటయ్య, సాయి, తరుణ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
భీమయ్య బాట.. రక్షణ కోట
మోమిన్పేట: హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న, గాయాలపాలవుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది హెల్మెట్ వినియోగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మండల పరిధిలోని అంరాధికలాన్కు చెందిన చాకలి భీమయ్య ఎక్కడికై నా సైకిల్పై వెళ్తూ విధిగా హెల్మెట్ ధరిస్తున్నారు. సైకిల్కు హెల్మెట్ తప్పనిసరి కాదు కదా అని అడగగా.. నా సైకిల్పై నేను నిదానంగా వెళ్తున్నా.. ఎదుటివారు అడ్డదిడ్డంగా వచ్చి ఢీకొడితే హెల్మెట్ కాపాడుతుందని బదులిచ్చారు. ద్విచక్ర వాహనదారులు ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ప్రమాదాల్లో ప్రాణనష్ట తీవ్రతను తగ్గించవచ్చు. -
బెంగళూరులో చోరీ... కుల్కచర్లలో రికవరీ
కుల్కచర్ల: బెంగళూరులో జరిగిన చోరీ సొత్తును మండల కేంద్రమైన కుల్కచర్లలో రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లలో బుడ్డరాం, సురేష్, కై లాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. సురేష్, కై లాస్ రాజస్థాన్కు చెందిన మరో ముగ్గురు బెంగళూరు కమిషనరేట్ పరిధిలోని బెలున్ఘట్ ప్రాంతంలో ఏప్రిల్ 27న ఓ నగల దుకాణంలో 70కిలోల వెండిని చోరీ చేశారు. అక్కడి పోలీసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారు కుల్కచర్లకు చెందిన సురేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసిన వెండిని కుల్కచర్లలోని కేసరియా జ్యువెలర్స్, బుడ్డరాం ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో 4 కిలోల 600 గ్రాములు, దుకాణంలో మరో 6కిలోలు లభ్యమైంది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. సీఐ రఘుకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని 45–50 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుని జేబులో ఆధార్కార్డు లభించింది. ధాని ఆధారంగా అతని పేరు చాకలి బందయ్య లక్నాపూర్ గ్రామం రంగారెడ్డి జిల్లా అని తెలిసిందన్నారు. అతని మృతి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దౌల్తాబాద్: మండలంలోని నందారం చిన్న నందిగామ రోడ్డుపై ఉన్న వరికుప్ప కారణంగా బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నందారం గ్రామానికి చెందిన బంటు కృష్ణ బైక్పై కొడంగల్కు బయలుదేరాడు. గ్రామ సమీపంలో రోడ్డుపై వరికుప్పలు ఆరబెట్టి పక్కనే రాళ్లు ఉంచారు. బైక్ రాళ్లకు గడలంతో కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక అక్రమంగా ఓ ట్రాక్టర్ను యాలాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అడాల్పూర్ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఓ ట్రారక్టర్ను పట్టుకొని పీఎస్కు తరలించారు. పట్టుబడ్డ వాహనం అడాల్పూర్కు చెందిన బాలప్పదిగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. డయల్ యువర్ డీఎంలో షాద్నగర్ డీఎం ఉష షాద్నగర్రూరల్: ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీఎం ఉష అన్నారు. మంగళవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్ చేసి సమస్యలు ఆమె దృష్టికి తెచ్చారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన డీఎం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం షాద్నగర్ డిపోకు చెందిన రెండు డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. హైదరాబాద్–ఆత్మకూరు, హైదరాబాద్–జూరాల డీలక్స్ బస్సుల అప్ అండ్ డౌన్ కోసం ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చని సూచించారు. తుర్కయంజాల్: రైతు సేవా సహకార సంఘం పీఐసీ చైర్మన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన కొత్తకుర్మ సత్తయ్య, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డిని మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. రైతులకు మొరుగైన సేవలు అందించాలని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగ్ విష్ణువర్ధన్ రావు, ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, బీజేపీ నాయకులు బచ్చిగళ్ల రమేష్, తూళ్ల నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పొడుపు కథ.. మెదడుకు మేత
చిన్నారులను ఉత్సాహపర్చే ప్రశ్నలు ●ఆలోచనా శక్తిని పెంచే జవాబులు ●సరదాతో పాటు విజ్ఞానాన్ని పంచే పొడుపు కథలు నోరులేదు కాని మాట్లాడగలను, పాడగలను నాపేరు చెప్పుకోండి చూద్దాం? జవాబు: రేడియో – దైవిక్, పరిగి ఎప్పుడు చూసినా ఒక్కకాలు మీదే నిలబడి ఉంటుంది, ఏమిటది? జవాబు: గొడుగు – వి.మమత, పరిగి రెక్కలు, తోక ఉన్నా.. పక్షిని కాను, ఆకాశంలో ఎగురుతాను కానీ విమానం కాను, మరి నేనెవరిని ? జవాబు: గాలిపటం – మాన్విత కిటకిట తలుపుల కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు? జవాబు: కంటి రెప్పలు – శివకుమార్ కందనెల్లి ●అమ్మానాన్నకు ఆసరాగా.. దుద్యాల్: వేసవి సెలవుల వేళగ్రామీణ విద్యార్థులు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. స్నేహితులతో కలిసి ఆడిపాడుతూనే.. అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నారు. కొడంగల్ సమీపంలోని గంధంబావితండా వద్ద ధాన్యం ఆరబోస్తున్న తల్లిదండ్రులకు సాయం చేస్తున్న బాలుడిని సాక్షి తన కెమెరాలో బంధించింది. బొంరాస్పేట: ‘పొదుపు కథలనెవరు పొందుగా పఠియించి విప్పిచెప్పుకున్న విమలమైన బుద్ధి వృద్ధియౌను భూలోక జనులందు కలుగు చురుకు ధనము గలుగు శుభము!’ అంటూ సాహితీకారులు పొదుపుకథల ప్రాముఖ్యతను గొప్పగా చాటుతూనే ఉన్నారు. ఇవి చిన్నారుల ఆలోచనా శక్తికి పదును పెడుతాయి. వింతగా, వినోదంగా ఉంటూ చిన్నారులకు గిలిగింతలు పెట్టిస్తాయి. వినోదం, వికాసంతో పాటు లోకజ్ఞానం, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ చిన్నారులకు నాయనమ్మలు చెప్పేకథలు, తాతయ్యలు విప్పి చెప్పే కల్పిత కథలు ఎంతో ఆనందాన్నిస్తూ నిద్రొచ్చే వరకూ జోకొడుతుంటాయి. కాగా మన నిత్యజీవితంలో చుట్టూ ఉండే అన్ని రకాల అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ విషయావగాహన కల్పించేవే పొడుపు కథలు. ప్రశ్నోత్తరాలతో కూడిఉండి చిన్నారుల్లో తెలుసుకోవాలనే జిజ్ఞాసను కల్పిస్తాయి. ప్రశ్నల్లో ఉండే మర్మము తెలిస్తేనే జవాబును పట్టేస్తారు. ఇలాంటి పొడుపు కథలు తెలగు భాష పరిరక్షణకు సైతం పాటుపడుతాయని సాహితీవేత్తలు చెబుతున్నారు. సెలవుల వేళ పిల్లల్లో వీటిపై ఉన్న ఆసక్తినిపెంచే క్రమంలో ‘సాక్షి’ చేస్తున్న చిరు ప్రయత్నం ఇది.. పొడుపు శతకం బొంరాస్పేట మండల పరిధిలోని వడిచర్లకు చెందిన కవి, తెలుగు ఉపాధ్యాయుడు వడిచర్ల సత్యం రచించిన ‘విప్పిచెప్పుబాల’ అనే 116 పొడుపు కథల పుస్తకం జిల్లా విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటోంది. సర్వశిక్షా అభియాన్లో భాగంగా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఇందులోని 116 పొడుపు కథలు పాఠశాల విద్య చదువుతున్న బాలబాలికల నోళ్లలో నానుతుంటాయి. ‘జతను వీడిపోరు జగడమాడరువారు అందమంతయేరి ఆరగించి కలిసి మెలిసిఉన్న కనరొకరినొకరు విప్పిచెప్పు బాల వినయశీల!’అంటూ.. ‘రెండు కళ్లు’ గురించి చెప్పిన పొడుపు కథలతోపాటు నమస్కారం, శుభాకాంక్షలు, మంగళసూత్రం, కుంకుమబొట్టు, పక్షులు, జంతువులు, క్రిములు, లోహాలు, యంత్రాలు, ఇంట్లోవాడే వస్తువులు, కూరగాయలు, పండ్లు, సెల్ఫోన్, గడియారం, రేడియో, కంప్యూటర్, అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు వంటి అనేకరకాల పొడుపుకథల పుస్తకం ప్రతి సర్కారుబడి, అంగన్వాడీల్లో దర్శనమిస్తున్నాయి. ●చెట్టు నీడన క్రికెట్టు! మంచాల: ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక, ఎండ వేడిమికి ఆరు బయట ఆడుకోలేక అవస్థలు పడుతున్న చిన్నారులు.. చల్లని చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నారు. మంగళవారం నోముల గ్రామంలో చెట్ల కింద క్రికెట్ ఆడుతున్న పిల్లలను సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. తెల్లటిపొలంలో నల్లటి విత్తనాలు? జవాబు: పుస్తకంలోని అక్షరాలు – సుశాంత్, దిర్సంపల్లితండా -
తండ్రి కనిపించడం లేదని..
మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య మీర్పేట: గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిన తండ్రి తిరిగి రాలేదన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేటకు చెందిన బుయ్యకారి చంద్రశేఖర్రావు (26) ప్రైవేటు ఉద్యోగి. గత నెల 24న తన తండ్రి రవీందర్తో గొడవ జరిగింది. మరుసటి రోజు తండ్రి యథావిధిగా విధులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కేశంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రిని వెతికేందుకు ఈ నెల 3న నగరానికి వచ్చాడు. మధ్యలో తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చాడా లేదా అన్న సమాచారం అడిగి తెలుసుకునేవాడు. ఈ నెల 11న చంద్రశేఖర్రావు బడంగ్పేటలోని దుర్గా వైన్స్ సమీపంలో పెట్రోల్ పోసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి శోభారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసిల్ల రాజయ్య, సభ్యులకు అదనపు కలెక్టర్ కిరణ్మయి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు సక్రమంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సదస్సులో ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, ఎస్.సుధీర్ రెడ్డి, దక్షిణ జిల్లాల అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, ఫణీంద్రరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, పంచాయతీ సెక్రట్రీలు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -
డబ్బులకోసం ప్రాణం తీశాడు
● హత్య కేసును ఛేదించిన పోలీసులు ● ఇద్దరు నిందితులకు రిమాండ్ షాద్నగర్రూరల్: రెండు రోజుల క్రితం జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను మంగళవారం డీసీపీ శిరీష వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం పోమాల్ గ్రామానికి చెందిన పల్లెకేశవులు, పద్మ దంపతులు షాబాద్ మండలం సర్దార్నగర్లోని శ్రీనివాసరావుకు చెందిన ఫాంహౌస్లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. సొంత ఊరిలో పొలానికి సంబంధించిన కేసును మాట్లాడేందుకు ఈ నెల 9న పల్లెకేశవులు యజమాని వద్ద రూ.50వేలు తీసుకొని పరిగి వెళ్లి కేసు విషయంలో రూ.40 వేలు ఇచ్చి తిరిగి రాత్రికి షాద్నగర్ బస్టాండ్కు చేరుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా గంజిపేటకు చెందిన పుల్లగోయి బజారన్న కొంతకాలం క్రితం పట్టణానికి వచ్చి కూలీ పనులు చేస్తూ పరమేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. కేశవులు బస్టాండ్ ఎదురుగా ఉన్న వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న బజారన్న పరిచయమయ్యాడు. ఇద్దరు బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళ మద్యం తీసుకునేందుకు వైన్స్ షాపు వద్దకు వచ్చింది. ఆమెతో గడిపేందుకు తీసుకురావాలని బజారన్నకు జేబులో నుంచి డబ్బుల తీసి ఇవ్వడానికి ప్రయత్నించాడు. కేశవులు వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నాయనే విషయాన్ని గమనించిన అతను మహిళతో కలిసి ఎలాగైనా వాటిని కాజేయాలనుకున్నాడు. తన బైక్పై కేశవులు, మహిళను ఎక్కించుకొని పట్టణ సమీపంలోని వెంచర్లోకి తీసుకెళ్లాడు. కేశవులు వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతను ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న రాయితో ముఖం, తలపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న రూ.7,500 తీసుకొని ఇద్దరూ పరారయ్యారు. బజారన్న సొంత గ్రామానికి వెళ్లి రెండు రోజుల తరువాత తన గదిలోని సామాను తీసుకెళ్లేందుకు పట్టణానికి వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. మరో నిందితురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,900 నగదు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
మట్టి అక్రమ రవాణాపై పోలీసుల దాడులు
● మూడు టిప్పర్లు స్వాధీనం ● అడ్డుకున్న వారిపై కేసు నమోదు కేశంపేట: అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. టిప్పర్లతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కల్పించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామ శివారులో సోమవారం రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మూడు టిప్పర్లు మట్టిని తరలిస్తున్నట్టు గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మార్గమాధ్యలో నందిగామ మండల పరిధిలోని సంఘీగూడ గ్రామానికి చెందిన టిప్పర్ యజమానితో పాటు అతడి స్నేహితుడు చంద్రయ్య, సురేష్ వేములనర్వ గ్రామ శివారులో టిప్పర్లను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి టిప్పర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. టిప్పర్ డ్రైవర్లు శ్యామ్కుమార్ సాహు, అమరేందర్ కుమార్, అజయ్కుమార్ యాదవ్తో పాటు విధులకు ఆటంకం కలిగించిన చంద్రయ్య, సురేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
గిట్టుబాటు ధరలు కల్పించండి
అనంతగిరి: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, నాయకులు వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం రైతుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అనంతరం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని, క్వింటాల్కు బోనస్ రూ.500 ఇవ్వాలని, ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి కూలీల వ్యతిరేక జీఓలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 14 వారాల పెండింగ్ డబ్బులు తక్షణమే విడుదల చేసి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కూలీ రూ.600లకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రీనివాస్, చంద్రయ్య, బుగ్గప్ప, సుదర్శన్, సతీశ్, మంగమ్మ, నర్సింలు, సంతోష, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
హుడాకాంప్లెక్స్: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వ హించిన మెగా జాబ్మేళాను ఆయన ప్రారంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకుచెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 1,645 మందిని షార్ట్లిస్ట్ చేసి 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగాపని చేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. స్కిల్ వర్సిటీ ద్వారా యువతకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.కిరణ్మయి, రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లాల పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు శ్రీలక్ష్మి, వినయ్కుమార్, మహేశ్, డీఈఈటీ డైరెక్టర్ జె.రాజేశ్వర్రెడ్డి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వనం మరిచిన కోతులు
వికారాబాద్: కోతుల బెడద తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సర్వేకే పరిమితమయ్యాయి. ఇదే విషయమై రైతులు గతంలో పలుసార్లు అప్పటి మంత్రులు సబితారెడ్డి, మహేందర్రెడ్డి, ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, ప్రస్తుత స్పీకర్ ప్రసాద్కుమార్కు పలుమార్లు వినతులిచ్చారు. దశాబ్ద కాలంగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతులు చేస్తూ రాగా ఎట్టకేలకు ప్రభుత్వం 2022లో జిల్లాలో వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో వానర గణన చేపట్టింది. కాగా కోతుల ను వనంలో వదిలేయడం కానీ, ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) శస్త్ర చికిత్సలు చేస్తామని ప్రకటనలు గుప్పించినా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల వీటి బెడద తీవ్రమైంది. సర్వేకే పరిమితం కోతులను లెక్కించే బాధ్యతలు క్షేత్రస్థాయిలో ఏఈఓలకు అప్పగించారు. ప్రధానంగా మండలాలు, గ్రామాల్లో ఎన్ని కోతుల గుంపులు ఉన్నాయి. ఆయా గుంపుల్లో ఎన్ని కోతులు ఉన్నాయనే ప్రాతిపదికన కోతులను లెక్కించారు. లెక్కించిన వివరాలు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. జిల్లాలో ధారూరు మండలంలో అత్యధికంగా కోతులు ఉండగా పరిగి, కోట్పల్లి, దోమ, పెద్దేముల్, కుల్కచర్ల, వికారాబాద్, మండలాల్లోనూ సంచారం అఽధికంగానే ఉంది. మూడేళ్ల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం ఒక్క ధారూరు మండంలోనే 194 వానరాల గుంపులు గుర్తించగా ఇందులో 25,983 కోతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దోమ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి 2,986 వానరాలున్నాయి. మోమిన్కలాన్, ధారూరు, నాగారం, మున్నూర్సోమారం, కెరవెళ్లి, గుర్దొట్ల, నాగసముందర్, లఖ్నాపూర్, పాలపల్లి, అనంతగిరి తదితర గ్రామాల్లో కోతుల గుంపులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఒక్కో గ్రామంలో రెండు నుంచి నుండి ఐదు వేల వరకు కోతులున్నాయి. అప్పటి సర్వే ప్రకారం 45,000– 50 వేల కోతులు ఉన్నాయని లెక్కలు తేల్చగా ఆ సంఖ్య ఇప్పుడు 70 వేలు దాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు అధిక నష్టం కోతుల కారణంగా రైతులు అత్యధికంగా నష్ట పోతున్నారు. వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, పళ్లతోటలు, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వరి పంటను సైతం పీకి పడేస్తున్నాయి. జనం సంచులు తీసుకువెళ్తున్నా దాడి చేసి గాయపరిచి లాక్కుంటున్నాయి. ధారూరులో బిల్డింగ్ పైన ఉన్న ఓ మహిళను కోతులు వెంబడించగా ఆమె భవనం పై నుంచి దూకడంతో తీవ్రగాయాలై ఆస్పత్రి పాలైంది. జిల్లాలో ఎక్కువ శాతం నాపరాతి బండలతో కప్పిన పైకప్పుడు ఉండగా ఆ బండలను పీకి మరీ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. వీటిని లెక్కించాక వాటిని సుదూర అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లి వదలటం కానీ, సంతతిని నియంత్రించడంగానీ చేస్తారని జనం ఆశగా చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 50 కోతులను పట్టి తీసుకెళ్లగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ప్రక్రియ అక్కడికే నిలిచిపోయింది. వణికి పోతున్న గ్రామాలు -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
ధారూరు: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సూచించారు. ఇటీవల ధారూరులో చేపట్టిన క్రికెట్ టోర్నమెంట్ ముగియడంతో సోమవారం ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతిస్తోందని.. యువత చదవుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విజేత జట్టు ధారూరుకు రూ.20వేల నగదు, రన్న రప్ జట్టు గట్టెపల్లికి రూ.పదివేల నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు. అంతకు మందు ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, డీసీసీ కార్యదర్శి మహ్మద్ బాబాఖాన్, సర్పంచ్ ప్రమీళగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, నాయకులు కల్వ కిరణ్కుమార్, బుజ్జయ్యగౌడ్, తిరుపతిగారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయలోపంతో సమస్యలు
ధారూరు: తూకం వేసిన మొక్కజొన్న సంచులను వెంటనే తరలించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ధారూరులోని మొక్కజొన్న కేంద్రాన్ని, గట్టెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గోనె సంచులు ఇవ్వడం లేదని.. మొక్కజొన్న సంచులు సకాలంలో తూకం వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోయారు. గట్టెపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులైనా ఒక్క సంచి ధాన్యం కొనుగోలు చేయలేరని ఆయన ధ్వజమెత్తారు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే హమాలీలు రావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లై అధికారులను అడిగితే తమ దృష్టికి రాలేదని సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ధాన్యం, మొక్కజొన్నలను సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారుర. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, రాములు, పోటరీ మహేశ్, రహమతుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత
తాండూరు: మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రభు త్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్నఓ భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశా రు. తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదు ట ఉన్న ప్రధాన రహదరి పక్కన 130 సర్వే నంబర్లో 36 గుంటల ప్రభుత్వ భూమిని పట్టణానికి చెందిన వ్యాపారి కబ్జా చేసి నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ విషయమై గత నెల 16న 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మధుసూదర్రెడ్డి తాండూరు తహసీల్దార్తో మాట్లాడి వివరాలను సేకరించారు. రెవెన్యూ రికార్డుల్లో సర్వేనెంబర్ 130 ప్రభుత్వ భూమిగా 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సోమ వారం టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మి స్తున్న కట్టడాలను కూల్చి వేసేందుకు జేసీబీని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కబ్జా దారులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించగా వాగ్వా దం జరిగింది. అధికారులు పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో పోలీసుల సమక్షంలో కబ్జాలను కూ ల్చి వేశారు. ప్రభుత్వ భూములను అక్రమించి కబ్జా కు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కౌన్సిలర్ అధికారులను కోరారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా గిరిజన, ఆశ్రమ హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బంది పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వారితో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది నెలలుగా వేతనాలు అందక హాస్టల్ వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రయ్య, రాములు, శ్రీనివాస్, తారాబాయి, లక్ష్మి, మొగులమ్మ, అంజమ్మ, భీమమ్మ, మొగులమ్మ, రాములు తదితరులు ఉన్నారు. -
హోంగార్డ్ బలవన్మరణం
దోమ: ఇంటి స్థలం (ప్లాట్) విషయంలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఓ హోంగార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని బాస్పల్లికి చెందిన తలారి వెంకటయ్య(47) వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని తమ ఇంటి వెనక ఉన్న అరవై గజాల స్థలాన్ని వెంకటయ్య తండ్రి నలభై ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన కుందేళ్ల చంద్రయ్య వద్ద కొనుగోలు చేశాడు. ఇప్పటివరకూ సదరు స్థలానికి ఫెన్సింగ్ వేయలేదు. ఇటీవల వెంకటయ్య కడీలు పాతుతుండగా చంద్రయ్య మనమడు మల్లేశ్ అడ్డుకున్నాడు. స్థలం తమదేనని గొడవపడటంతో పాటు కడీలను ధ్వంసంచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అనంతయ్య పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ముగ్గురు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు అశ్విని వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, అక్షిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మల్లేశ్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ వసంత్జాదవ్ తెలిపారు. -
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 150 దరఖాస్తులు వచ్చాయని.. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ పరిదిలో నిర్వహిస్తున్నామని, డివిజన్ పరిధిలో వచ్చే దరఖాస్తులను సంబంధిత డివిజన్ అధికారులే పరిష్కరించాలని చెప్పారు. 30 రోజుల్లో సమ స్య పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రజావాణి ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, బాధితులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పీఎస్ అధికారులతో కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ప్రయోగాత్మక విద్యకు ల్యాబ్లు దోహదం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: సైన్స్ ల్యాబ్లు విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యలో ఉపకరిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో స్థానిక జీహెచ్ఎం, ఎంఈఓ హరిలాల్తో కలిసి సైన్ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాఠశాలకు రూ.21లక్షలు మంజూరైన పీఎంశ్రీ నిధులతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, డైరెక్టర్ మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు బేగరి రాములు, ఉపసర్పంచ్ నందినిసాగర్, మైనుద్దీన్, ఉపాధ్యాయ బృందం బాకారం చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యకు ప్రతిభ పురస్కారం మర్పల్లి: ఇటీవల విడుదలైన పదో తరగతిఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన ఘణాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి పట్లోళ్ల చైతన్య సోమవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారం అందుకుంది. స్కూల్ హెచ్ఎం, ఎంఈఓ అశోక్తో కలిసి ప్రశంసపత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, నర్సింలు, కవిత, నాగభూషణం, సీఆర్పీ మల్లేశం విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. -
దారి దోపిడీ కేసులో నిందితుల రిమాండ్
శంషాబాద్ రూరల్: ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తున్న వారిని స్నేహితులతో కలిసి బెదిరించి నగలు, నగదు దోచుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రిన్సికుమార్ కొత్తూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇతడి స్నేహితులు అభిషేక్కుమార్, రోషన్కుమార్ హైదరాబాద్ను చూసేందుకు ఈ నెల 7వ తేదీన సొంతూరు నుంచి చెర్లపల్లికి వచ్చారు. అదేరోజు రాత్రి వీరిని తీసుకుని ఆటోలో కొత్తూరు వస్తున్నాడు. ఆటో డ్రైవర్ అబ్దుల్ యాషిన్ మార్గమధ్యలో ఈ ఆటోలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. ఆటో ఘాంసిమియాగూడ వద్దకు చేరుకోగానే.. ఆటో డ్రైవర్తో పాటు మార్గ మధ్యలో ఆటోలో ఎక్కిన వారు ప్రిన్సికుమార్, అతడి స్నేహితులను కత్తితో బెదిరించారు. వారి వద్ద ఉన్న రూ.1,800 నగదు, రెండు వెండి గొలుసులు, రెండు ఉంగరాలతో పాటు రెండు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. దీంతో పాటు గూగుల్పే ద్వారా రూ.5 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిందితులైన ఆటో డ్రైవర్తో పాటు చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ మోసిన్, అబ్దుల్ మోసిన్, అతిఫ్ఖాన్ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుల నుంచి నగలు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్ చేశారు. -
కూతురి మరణానికి అల్లుడే కారణం
● నిర్లక్ష్యంగా ఆటో నడపడంతోనే ప్రమాదం ● పోలీస్టేషన్లో మామ ఫిర్యాదు, కేసు నమోదు తాండూరు రూరల్: అతివేగంగా, నిర్లక్ష్యంగా ఆటో నడపడంతోనే తన కుమార్తె మృతి చెందిందని ఓ మామ అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్వర్ధన్ కథనం ప్రకారం.. మన్సాన్పల్లికి చెందిన అంగోత్ నందిని(23)కి మూడేళ్ల క్రితం చౌడాపూర్ మండలం చిన్న మేఘ్యా నాయక్ తండాకు చెందిన మెగావత్ సురేష్తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. సురేష్ హైదరాబాద్లో ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. నందిని తన తల్లి గారి ఇంట్లో శుభకార్యం ఉండటంతో భర్త, కుమారుడితో కలిసి శుక్రవారం మన్సాన్పల్లికి వచ్చింది. శనివారం దంపతులు ఇంటి సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆటోలో తాండూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో చైతన్య నగర్ గేటు వద్ద ఆటో బోల్తా పడింది. నందిని తలకు తీవ్రగాయం కాగా సురేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నందిని వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆదివారం మామ నారాయణ ఫిర్యాదు చేయడంతో అల్లుడు సురేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నల్లబెల్లం, పటిక పట్టివేత
కడ్తాల్: నాటు సారా తయారీ కోసం ఉపయోగించే నల్లబెల్లం, పటికను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. సీఐ బద్యానాథ్ చౌహాన్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పలు గ్రామాలకు నల్లబెల్లం, పటికను సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఎకై ్సజ్ పోలీసులు వాహన సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వైపు నల్లబెల్లం, పటికతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 750 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక లభ్యమైంది. ఈ మేరకు వాహనంతో పాటు, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. నిందితులు కేతావత్ మోహన్, డేరంగుల నరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తనిఖీల్లో ఎస్ఐ స్వప్న, ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ రామిరెడ్డి, ఉపేందర్, అహ్మద్, లింగయ్య, శివప్రసాద్, సాయి శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి హెచ్పీపీఎల్ లీగ్
గన్ఫౌండ్రీ: నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రైవేట్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని విశ్రాంత డీజీపీ గోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆదర్శ్నగర్లోని బిర్లా ప్లానిటోరియంలో హైదరాబాద్ ప్రొఫెషనల్ ప్రీమియర్ లీగ్ (హెచ్పీపీఎల్) సీజన్ వన్ జెర్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు మధురానగర్లోని స్పోర్ట్స్ ఎరీనాలో మ్యాచ్లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో సినీ నటుడు సత్యం రాజేష్, లీగ్ నిర్వహకులు పుట్టపర్తి నవ్యజోతి, విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి, చగన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంపులో పడి మృతి
శంకర్పల్లి: అప్పటిదాక అందరితో ఆడుతూ అల్లరి చేసిన చిన్నారిని అనుకోని ప్రమాదం వెంటాడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఆదివారం మోకిల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జన్వాడకు చెందిన కాట్నే శేఖర్, మేఘన దంపతులకు ఒక కుమారుడు, కూతురు ప్రియాన్షు(3) ఉన్నారు. శేఖర్ ప్రైవేటు ఉద్యోగి. ఉదయం వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లగా.. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ప్రియాన్షు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. కాసేపటికి చిన్నారి ఎక్కడ అని వెతికిన తల్లికి.. చివరికి సంపులో తేలియాడుతూ విగతజీవిగా కనిపించింది. చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
నేటి నుంచి ఇళ్ల గణన
తాటి ప్రయోజనాల్లో మేటి తాటి ముంజలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అధిక పోషకాలు ఉండటంతో ధర ఎక్కువైనా కొంటున్నారు. ● జూన్ 9 వరకు ప్రక్రియ ● వివరాలు సేకరించనున్న ఎన్యుమరేటర్లు ● ముగిసిన స్వీయ గణన వికారాబాద్: జనాభా లెక్కల సేకరణ మొదటి దశలో భాగంగా నేటి(సోమవారం) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది రోజులపాట స్వీయ గణనకు అవకాశం ఇవ్వగా ఈ నెల 10వ తేదీతో గడువు ముగిసింది. మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించిన ఇళ్లకు మ్యాపింగ్ చేయనున్నారు. అనంతరం సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా స్వీయ గణనలో నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి వాటిని అప్రూవల్ చేస్తారు. అంతా సిద్ధం జిల్లాలో ఇళ్ల గణనకు సర్వం సిద్ధమైంది. అవసరమైన సిబ్బంది, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. రెండు వేడతల్లో సర్వే నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఇళ్లు, కుటుంబాలను మాత్రమే లెక్కిస్తారు. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. ఇందులో ఎలాంటి నివాసాలు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఎన్ని అంతస్తులు కలిగి ఉన్నాయి అనే వివరాలు నమోదు చేస్తారు. రెండో విడత సర్వే 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అప్పుడు జనాభా లెక్క తేల్చనున్నారు. ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ ఇప్పటివరకు జనాభా లెక్కలు కాగితాల్లో నిర్వహించి ఫైళ్ల రూపంలో భద్రపరుస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్యాబ్, సెల్ ఫోన్ల ద్వారా సర్వే చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే మండల ఇన్చార్జ్ అధికారిగా ఎంఈఓలు, తహసీల్దార్లను.. మున్సిపాలిటీల్లో కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. సూపర్ వైజర్లుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను తీసుకున్నారు. ఎన్యుమరేటర్లుగా జూనియర్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు వ్యవహరించనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్కు 300 కుటుంబాలతో కూడిన బ్లాక్ను అప్పగించనున్నారు. మొదటి విడత సెన్సెస్లో 34 కాలమ్స్తో కూడిన డిజిటల్ ఫారాల ద్వారా సర్వే చేస్తారు. పెరగనున్న జనాభా ప్రస్తుతం 2011 సెన్సెస్కు సంబంధించిన జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న జనగణనతో జిల్లా జనాభా రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. 2001 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 8,28,664 కాగా 2011 నాటికి 9,27,140కి చేరుకుంది. ప్రస్తుత ఓటరు జాబితా ఆధారంగా చూస్తే జిల్లా జనాభా రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన 11,25,000 మంది ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇళ్ల గణనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు సేకరించాలని ఆదేశించాం. ప్రజలు ధైర్యంగా వివరాలు చెప్పొచ్చు. వాటిని గోప్యంగా ఉంచుతాం. ఎన్యుమరేటర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. – దీపక్ తివారి, కలెక్టర్ -
పశువులు తరలిస్తున్న వ్యక్తిపై కేసు
తాండూరు టౌన్: అనుమతి లేకుండా రెండు ఎద్దులను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ ఆదివారం తెలిపారు. రసూల్ అనే వ్యక్తి ట్రాలీ వాహనంలో పెద్దేముల్ మండలం గాజీపూర్కు రెండు ఎద్దులను తరలిస్తున్నాడు. బక్రీదు పర్వదినాన్ని పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణాను నివారించుటలో భాగంగా అంతారం వద్ద పోలీసులు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. తనిఖీలో అనుమతి లేకుండా ఎడ్లను తరిలిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో రెండు ఎడ్లను మహారాష్ట్రలో కొనుగోలు చేసిన రసూల్, బషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో రెండు ఎడ్లను వాహనంలో తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పశువులను రవాణా చేసే క్రమంలో తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని పట్టణ సీఐ తెలిపారు. ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కండక్టర్ నిజాయతీ చాటుకున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి ఆదివారం ఇబ్రహీంపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు హడవుడిగా దిగుతూ బ్యాగు మరిచిపోయింది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ ఆ బ్యాగును గుర్తించారు. అందులో రెండున్నర తులాల బంగారు గొలుసు, ఆధార్, ఏటీఎం కార్డులున్నాయి. ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా సదరు ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చారు. తిరిగి బొంగుళూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వారి కుటుంబసభ్యులు రాగా బ్యాగును వారికి అందజేశారు. విలువైన వస్తువులు మళ్లీ దక్కడంతో వారు కండక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ సుజాత కండక్టర్ సీతారాం నిజాయతీని అభినందించారు. బైకు ఢీకొని వృద్ధురాలి మృతి హయత్నగర్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని వేగంగా వచ్చిన బైకు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన బీర్ల జంగయ్య భార్య లక్ష్మమ్మ (80) తొర్రూర్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప పండుగకు బంధువుల ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా మునుగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బైకు (టీఎస్ 07 జీఎఫ్0071) లక్ష్మమ్మను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న పవన్కు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ రూరల్: వాగులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం ననాజీపూర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఈదులనాగులపల్లికి చెందిన బ్యాగరి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న ననాజీపూర్లో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చారు. మరుసటి రోజు ఆయన కుమారుడు శ్రీచరణ్ (17) బహర్భూమి కోసం బైక్పై వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఆదివారం ననాజీపూర్ శివారులోని వాగు నీళ్లలో శ్రీచరణ్ మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు వాగునీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. దేశ రక్షణ హిందువుల లక్ష్యం ఆధ్యాత్మిక వక్త భూమానందగిరి స్వామి అబ్దుల్లాపూర్మెట్: కులాలను పక్కనపెట్టి.. దేశ రక్షణకు హిందువుల మంతా ఏకమవుదామని ఆధ్యాత్మిక వక్త భూమానందగిరి స్వామి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం రాత్రి మండల పరిధి కవాడిపల్లి కోదండ రామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను సమైక్యంగా ఎదురుకొందామని పిలుపునిచ్చారు. హిందు సమాజం పట్ల గౌరవం, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వికసింపజేయాలన్న లక్ష్యంతో చేపట్టిన హిందూ సమ్మేళనాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహిళా వక్త డాక్టర్ కళ్లెం స్వప్న, సంఘ వక్త సదావెంకట్రెడ్డి, బలిజగూడ సర్పంచ్ మాధవి, సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు జానకి, మాధవి, వరమ్మ, ధర్మారెడ్డి, బాలకృష్ణగౌడ్, జగదీష్, జైపాల్రెడ్డి, మహేశ్, నాగభూషన్రెడ్డి, మల్లికార్జున, రవీయాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిజ్ఞానం తప్పనిసరి
ఇంటర్ చదువుతున్నాను. ప్రతీరోజు ఉదయం షాబాద్లో కంప్యూటర్ సెంటర్కు వచ్చి పీజీడీసీ ఏలో శిక్షణ పొందుతున్నా. ఇంటర్ పూర్తయ్యే వరకు డీటీపీ, పీజీడీసీఏ కోర్సులు పూర్తి చేస్తా. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటున్నాం. – పల్లవి, నరెడ్లగూడ, షాబాద్ మండలం కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతీరోజు ఉదయం బ్యాచ్లో వస్తున్నా. డీసీఏ నేర్చుకుంటున్నా. ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువులు చదివినా కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి. – వికాస్, కుమ్మరిగూడ, షాబాద్ మండలం డీసీఏ నేర్చుకుంటున్నా.. -
పది విద్యార్థులకు ‘ప్రైవేటు’ వల
తాండూరు: పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు వల వేస్తున్నాయి. ఎన్నికలను తలపించేలా ఇంటింటికి వెళ్లి తమ కళాశాలలోనే పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేస్తున్నారు. టెన్త్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ప్రచారం జోరందుకుంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలు సేకరించి.. బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో తిరుగుతున్నారు. అమ్మా.. అయ్యా అంటూ మీ పిల్లలను మా కాలేజీలోనే చేర్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఫీజులో మినహాయింపు, ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడుతున్నారు. పదిలో 12,302 మంది ఉత్తీర్ణత జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, రెసిడెన్సియల్, కేజీబీవీల్లో 13,482 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. గత నెల చివరి వారంలో ఫలితాలు వెలువడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 12,302 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిని తమ కళాశాలలో చేర్పించాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని కళాశాలలు జేఈఈ, ఐఐటీ బోధన ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంటర్లో ర్యాంక్ వచ్చిన విద్యార్థుల ఫొటోలు చూపుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర కళాశాలలతో పోలిస్తే తమ కాలేజీలో ఫీజు తక్కువ అని చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లదీ అదే బాట జిల్లాలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఏటా పెరుగుతోంది. పదేళ్ల క్రితం వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ప్రైవేటు స్కూళ్లు నేడు మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇబ్బడి ముబ్బడిగి వెలుస్తున్నాయి. వారు కూడా విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రచారం మొదలు పెట్టారు. బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరుగుతున్నారు. ఉత్తీర్ణులైన వారి ఇళ్లకు ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు ఫీజు మినహాయింపు అంటూ తాయిలాలు ఆఫర్లతో అదరగొడుతున్న యాజమాన్యాలు -
4
జాతీయ రహదారి విస్తరణ పనులు వాహనదారుల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నత్తనడకన పనులు.. కల్వర్టులు, డ్రైనేజీలు నిర్మించే చోట ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. నెలలోపే ఇద్దరు మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దురుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నరకమే!కిలోమీటర్లుప్రత్యామ్నాయ మార్గాలు లేక.. ప్రమాదకరంగా లక్ష్మీనారాయణపూర్ – తాండూరు రోడ్డు నత్తను తలపిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులు తరచూ యాక్సిడెంట్లు నెలలోపే ఇద్దరి దుర్మరణం పట్టించుకోని అధికారులు -
అందరూ భాగస్వాములు కావాలి
అనంతగిరి: జనగణన ఎంతో కీలకమని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల విభాగం అధికారి అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎన్నెపల్లి చౌరస్తా వరకు జనగణనపై అవగాహన వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని తెలిపారు. నేటి నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని తెలిపారు. సిబ్బంది ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేశామని వారికే వివరాలు తెలియజేయాలన్నారు. జనగణన పేరిట అపరిచితులు వివరాలు సేకరించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, టీఎంసీ వెంకటేశ్, సహాయ సంచాలకులు రవిచంద్ర పాల్గొన్నారు. -
నేడు మెగా జాబ్మేళా
● సరూర్నగర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు ● పాల్గొననున్ను 150 కంపెనీలు హుడాకాంప్లెక్స్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రజా పాలన–ప్రగతి పణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా భారీ జాబ్మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 150 కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొననున్నాయి. జాబ్మేళాలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగాలకు సంబంధించి న కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ వేదికగా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఎంపికై న అభ్యర్థులకు ఉపాధితో పాటు మంచి జీతం. రవాణా సదు పాయాలను ఆయా కంపెనీలు కల్పించనున్నాయి. ఇప్పటికే 5వేల మంది రిజిస్ట్రేషన్ ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ సహా ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకుని, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్మేళాను ఏర్పాటు చేశారు. ఆఫీస్ రిసెప్షనిస్టు మొదలు.. ఐటీ ఎంప్లాయి పోస్టు వరకు అన్ని రకాల జాబ్ అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇప్పటి వరకు 5వేల మంది నిరుద్యోగులు జాబ్మేళాలో పేర్లు నమోదు చేసుకున్నారు. అర్హత, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేతనాలు చెల్లించనున్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు వెంటనే ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇవ్వనున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, బిస్కెట్లు, మజ్జిగను అందజేయనున్నారు. -
విద్యా వారోత్సవాలను విజయవంతం చేద్దాం
కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా నేటి(సోమవారం) నుంచి 17వ తేదీ వరకు జరగనున్న విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలను ప్రారంభిస్తారని ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి విద్యార్థులు, వారి తల్లితండ్రులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు కోసం 40 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మండలం నుంచి రెండు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఆర్డీఓ శ్రీనివాస్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ రూరల్: గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఇంటర్లో చేరేందుకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 16న బాలురకు, 18న బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కే నాగార్జునరావు ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి రోడ్లోని గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 10గంటల నుంచి కౌన్సిలింగ్కు హాజరుకావాలని తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన మార్కుల మెమో, బదిలీ ధ్రువపత్రం, స్టడీ, కండక్ట్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, 2026 – 27 ఆదాయ ధ్రువీకరణ పత్రం.. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతం రూ.2 లక్షలు మించరాదన్నారు. ఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్, పీహెచ్సీ ధ్రుకరణ పత్రం, 3 కలర్ ఫొటోలు, రెండు జతల జిరాక్స్ కాపీలతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన తెలిపారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి అరెస్టు తాండూరు టౌన్: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. బతుకుదెరువు కోసం తాండూరుకు వచ్చి అభం శుభం ఎరుగని 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో పడేశాడు. బాలికను ఢిల్లీ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సదరు నిందితునిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఆదీమ్(28) అనే వ్యక్తి వలస వచ్చి తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఢిల్లీ సెలూన్లో పని చేస్తూ, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఎవరికీ తెలియకుండా శనివారం తీసుకుని ఢిల్లీకి పారిపోయేందుకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లో ఆదీమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వ్యక్తికి తీవ్ర గాయాలు యాలాల: వేగంగా, అజాగ్రత్తగా వెళుతున్న ఓ ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ సమీపంలో మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన మహ్మద్ మోయిజ్ వ్యాపార పనుల నిమిత్తం దౌల్తాబాద్ మండలం హుస్నాబాద్కు వెళ్లి మధ్యాహ్నం వేళ తన బైక్పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్ సమీపంలోకి రాగానే అగ్గనూరు గ్రామానికి చెందిన రవిగౌడ్కు చెందిన ట్రాక్టర్ ఇసుక లోడ్తో వేగంగా వెళ్తుండగా ముందు టైరు పేలింది. ఈ క్రమంలో ఎదురుగా బైక్పై వస్తున్న మోయిజ్ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఎడమకాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మోయిజ్ను నగరానికి రిఫర్ చేశారు. క్షతగాత్రుడి కొడుకు ఫాజిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రతి పల్లెకూ సురక్షిత తాగునీరు
ఆమనగల్లు: ప్రతి పల్లె, ప్రతి తండాకు సురక్షిత తాగునీరు అందించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లో శనివారం సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమనగల్లులో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. అనంతరం పోచమ్మగడ్డ తండాలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం సురక్షిత తాగునీరు ఎంతో అవసరమన్నారు. పల్లెలు, తండాల్లో సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మహిపాల్, గోపాల్, గన్యానాయక్, రమేశ్నాయక్, నాయకులు పంతులునాయక్, శ్రీరామ్, హనుమంతు, వెంకట్నాయక్, సేవ్యానాయక్, జైపాల్, తిరుపతి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, జైపాల్రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి -
సెలవుల్లో ప్లానింగ్..
కంప్యూటర్ ట్రైనింగ్షాబాద్లోని కంప్యూటర్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులుమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇందులో భాగంగా కొంతమంది అటు సరదాగా గడుపుతూనే, ఇటు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే దిశగా శిక్షణ పొందుతున్నారు. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉదయం, సాయంత్రం కంప్యూటర్ కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. – షాబాద్ -
ఇంటికొస్తానన్నాడు.. అంతలో హతమయ్యాడు
షాద్నగర్రూరల్: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారాం కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం పోమాల్ గ్రామానికి చెందిన పల్లెకేశవులు (39) పద్మ దంపతులు. షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్లో శ్రీనివాస్రావుకు చెందిన ఫాంహౌస్లో పని చేయడంతో పాటు వ్యవసాయంచేస్తూ పిల్లతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఈ నెల 9న (శనివారం) తన సొంత ఊరులోని భూమికి సంబంధించిన కేసు విషయం మాట్లాడేందుకు వెళ్లాలని పల్లెకేశవులు యజమాని వద్ద రూ.50 వేలు తీసుకొని వెళ్లిపోయాడు. అదేరోజు తన సోదరులతో కలిసి పరిగి వెళ్లి అక్కడ అడ్వకేట్తో కేసు విషయం మాట్లాడి రాత్రి తిరుగు పయనమయ్యారు. రాత్రి 9.30 గంటల సమయంలో షాద్నగర్ బస్టాండ్కు వచ్చాను, ఇంటికి వస్తాను అని భార్య పద్మకు ఫోన్చేసి చెప్పాడు. ఇంటికి చేరుకోలేదు. పట్టణ సమీపంలోని వీర్లపల్లి రోడ్డులోగల వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ఆదివారం ఉదయం వెంచర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సీతారాం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై తీవ్ర గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో మృతుడి సెల్ఫోన్కు భార్య ఫోన్ చేయడంతో విషయాన్ని ఆమె తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె హత్యకు గురైంది తన భర్తనే అని తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.మధ్యలో ఏం జరిగిందో ఏమో? -
రైల్వే ట్రాక్ పనులు చేస్తూ.. క్వార్టర్స్లో ఉంటూ..
తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. పెద్దేముల్ మండలం రుక్మాపూర్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున నలుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, తాండూరు పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళా నక్సలైట్ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన నలుగురు మావోయిస్టులు ఆ రాష్ట్రాల కూలీలతో కలిసి పది రోజుల క్రితం పెద్దేముల్ మండలం రుక్మాపూర్కు వచ్చారు.రైల్వే ట్రాక్ పనులు చేసుకుంటూ, అక్కడి క్వార్టర్స్లో తలదాచుకుంటున్నారు. వీరిపై మహారాష్ట్రలో పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. వీరి కదలికలపై నిఘా ఉంచిన మహారాష్ట్ర పోలీసులు పక్కా సమాచారంతో పెద్దేముల్ మండలానికి వచ్చారు. తాండూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు.. మొత్తం 50 మంది పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రుక్మాపూర్ రైల్వే క్వార్టర్స్ను వీరు చుట్టుముట్టారు. అందులో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనంలో మహారాష్ట్రకు తరలించారు. కాగా, మావోయిస్టుల పేర్లు, ఫొటోలు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. -
పారదర్శకత.. ఉత్తమ పనితనం
వికారాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిధిలోని మో త్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనలో జాతీయ పురస్కారానికి ఎంపికయింది. రికార్డులు పూర్తి స్థాయి లో ఆన్లైన్లో నిర్వహించటం, నిధుల ఖర్చులో పారదర్శకత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడటం, తరచూ సమావేశాల ద్వారా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను పాలనలో భాగస్వాములను చేయటం, రికార్డుల్లో నమోదైన అంశాలు వాస్తవంలోనూ ప్రతిబింబించటంలాంటి అంశాలు ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావటంలో కీలక భూమిక వహించాయి. ఈ గ్రామంలో 703 కుటుంబాలు, 2,090 ఓటర్లు, 2,576 మంది జనాభా ఉన్నారు. అవార్డు వరకు తీసుకువెళ్లిన అంశాలివే.. మోత్కుపల్లి గ్రామంలో జరిగిన ప్రగతి, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే పద్ధతి, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వాటిని వాడటం, మురుగు గుంతలు లేకుండా గ్రామంలో చేపడుతున్న చర్యలు, రోడ్ల పరిశుభ్రత, మురుగు కాల్వల పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, గ్రామంలో నిర్వహించిన హరితహారం.. అందులో బతికి ఉన్న మొక్కల శాతం, ఇంకుడు గుంతలు, విద్యా, వైద్యం, పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్ తదితర అంశాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆకర్షించాయి.వీటితో పాటు గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే గ్రామంలో ఖర్చు చేసిన నిధులు, పన్నుల వసూలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, వారికందిస్తున్న పౌష్టికాహారం, ఉపాధి హామీలో వందరోజులు పని చేసిన కుటుంబాలు, లబ్ధి పొందిన కుటుంబాలు.. వీటన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర ఉన్నతాధికారులు గ్రామాన్ని జాతీయ అవార్డు కోసం ఎంపిక చేశారు. మాపై బాధ్యత మరింత పెరిగింది మా గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషంగా ఉంది. దీంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. గ్రామ అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు, జీపీ సభ్యులు, ప్రజలు.. ఇలా అందరి సహకారం ఉంది. అవార్డు రావటంలో గత సర్పంచ్, వార్డు సభ్యుల కృషి కూడా ఎంతో ఉంది. అవార్డు ద్వారా వచ్చే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తాం. – అమృతమ్మ, సర్పంచ్, మోత్కుపల్లి -
హక్కులపై అవగాహన అవసరం
షాద్నగర్: శ్రామికులు తమ హక్కులను విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శంషాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని లేబర్ అడ్డాలో కూలీలకు వారి హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని శ్రమ జీవులు అనునిత్యం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రోజు పనిచేస్తేనే కానీ వారి కడుపునిండని పరిస్థితి నెలకొందన్నారు. శ్రామికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా కార్మికులు ప్రసూతికి రూ.20వేల చొప్పున పొందే హక్కు ఉందని చెప్పారు. అదేవిధంగా కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం అందిస్తోందని తెలిపారు. అదేవిధంగా కార్మికుల కోసం వృత్తి శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కార్మికులు ఏదైనా న్యాయ సహాయం అవసరం అయితే రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థను ఆశ్రయించవచ్చని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్రెడ్డి -
ఉపాధి సరే.. సౌకర్యాలేవి? ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాల్లో కనీస వసతులు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు.
కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శనివారం నగరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. విద్యా వారోత్స వాలను విజయవంతం చేయాలని సూచించారు. సోమవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగే ముఖ్యమంత్రి సమావేశానికి ప్రతి మండలం నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఆర్డీఓ శ్రీనివాస్, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతగిరి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రతి రోజు రెండు విడతల్లో ఉంటాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఉంటాయన్నారు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెంటర్లో ఇంటర్నెట్, ప్రింటర్, సీసీ కెమెరాలు, విద్యుత్, తాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి హాల్టికెట్లు పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్లు బుచ్చిరెడ్డి, సత్తయ్య, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
బషీరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ కేంద్రాలు వేగం పెంచాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి ఆదేశించారు. శనివారం ఆమె ఏఎంసీ చైర్మన్ మాధవ్రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శంకర్రెడ్డితో కలిసి దామర్చెడ్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం తూకాల్లో అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు తూకాలు వేయాలని సూచించారు. రైతులకు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి, టార్పలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతిరెడ్డి, ఏపీఎం పద్మారావు, ఐకేపీ కొనుగోలు కేంద్రం కమిటీ సభ్యులు సావిత్రమ్మ, నవనీత, జగదీశ్వర్, ఉప సర్పంచ్ రవికుమార్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి -
కాంగ్రెస్ చేతల ప్రభుత్వం
షాబాద్: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో రూ.20లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, రూ.20లక్షల నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులు, రూ.5లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు పనులకు వారు శంకుస్థాపన చేశారు. పెద్దవేడు గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గ్రామాలభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పమని తెలిపారు. కార్యక్రమలో సర్ధార్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్లు శ్రీశైలంయాదవ్, రాజసులోచన, అశోక్, ప్రభాకర్రెడ్డి, లావణ్యచెన్నయ్య, స్వరూప మహేందర్గౌడ్, రాజు, పెంటయ్య, యాదిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, జంగయ్య, శేఖర్, భరత్, రవీందర్, దేవేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026
జటిలం!పాత తాండూరు పంప్హౌస్ వద్ద లీకేజీ అవుతున్న గేట్వాల్వ్ వికారాబాద్: ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. పైప్లైన్ లీకేజీలతో నీరు కలుషితముతోంది. అయినా పట్టించుకునేవారు కరువయ్యారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. మిషన్ భగీరథ పథకం 80శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తోంది. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్ పంపులు భర్తీ చేస్తున్నాయి. మిషన్ భగీరథ ట్యాప్లను తొలగించడంతో నీరు వృథాగా పోవడమే కాకుండా మురుగు తిరిగి పైపుల్లోకి చేరుతోంది. దీంతో చాలా మంది ఇళ్లలోని బోరుబావులనే వాడుకుంటున్నారు. పట్టణ పరిధిలో 16,500 ఆవాసాలు..70 వేల మంది నివసిస్తున్నారు. జనాభా ప్రకారం రోజుకు 7 ఎంఎల్డీ(మిలియల్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం.. ప్రస్తుతం రెండు రోజులకు 8 నుంచి 9 ఎంఎల్డీ నీరు సరఫరా అవుతోంది. పట్టణంలో 200 పైచిలుకు బోరు బావులు, 56 చేతి పంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. 16,500 గృహాలు ఉండగా 10,600 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వేసవిలో ఏదైనా సమస్య తలెత్తితే శివారెడ్డిపేట్ చెరువును నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల ధన్నారంలో నీటి సమస్య తలెత్తింది. గెర్గెట్పల్లిలో కొత్త బోరు వేసి ప్రజల ఇబ్బందులు తీర్చారు. పరిగి: కాలనీకి ట్యాంకర్ వస్తేనే ఆ రోజు ఇంట్లో పనులు జరిగే పరిస్థితి నెలకొంది. నిత్యం ప్రజలు తాగునీటి కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే బోరుబావుల్లో నీటి మట్టం పడిపోయింది. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని తిరుమల, సిద్దాంతి, భవానీ కాలనీల్లో.. మైత్రీ నగర్, టీచర్స్ కాలనీలో ప్రజలు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలో 32వేల జనాభా ఉంది. రోజుకు 4.16 ఎంఎల్టీ నీటి అవసరం ఉంది. 117 బోర్ల ద్వారా 1.26 ఎంఎల్టీ నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 2.20 ఎంఎల్టీ నీటిని మిషన్ భగీరథ ద్వార అందిస్తున్నారు. అమృత్ 2.0 పథకం కింద రూ.15.5 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. నాలుగు, ఐదు వార్డుల్లో మిషన్ భగీరథ పైప్లైన్లు లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు రోజూ ఐదు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు ఏ మాత్రం సరిపోవడం లేదని పలువురు పేర్కొన్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట శివారు కాలనీలు, గ్రామాల్లో మరింత అధికం లీకేజీలతో వృథాగా పోతున్న నీరు ఎండిపోతున్న బోరుబావులు అవస్థల్లో పట్టణ ప్రజలు చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. అన్ని వార్డుల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణ పరిధిలో 36 వార్డులు.. 85 వేల మంది ఉన్నారు. జనాభా ప్రకారం రోజూ 12 ఎంఎల్డీ నీరు అవసరం. మిషన్ భగీరథ పథకం ద్వారా 9 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతోంది. 14,706 గృహాలు ఉండగా 6 వేల ఇళ్లకే నీటి సరఫరా జరుగుతోంది. మూడేళ్ల క్రితం సాయిపూర్, గ్రీన్ సిటీ, పాత తాండూరు, ఇంద్రానగర్ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు నీటి సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ కాలనీల ప్రజలు బోర్లు, ట్యాంకర్లపై ఆధారపడి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. పలుచోట్ల పైప్లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవడం లేదు. పాత తాండూరు పంప్ హౌస్ వద్ద గేట్వాల్వ్ లీకేజీ అవుతోంది. సమీపంలోని పొలాల్లోకి భారీగా నీరు చేరుతోంది. తాండూరు మున్సిపాలిటీకి అమృత్ 2.0 పథకం కింద రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు వాటర్ ట్యాంకులు, పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి. ఎన్టీఆర్ కాలనీలో ఒక ట్యాంక్, పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మరో ట్యాంక్ నిర్మిస్తున్నారు. నిధులు మంజూరై రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణ శివారులోని కాగ్నానది వద్ద ప్రజల తాగునీటి అవసరాల కోసం రెండు పంప్హౌస్లు ఏర్పాటు చేశారు. కొడంగల్ మార్గంలోని పంప్ హౌస్ దశాబ్ద కాలంగా పని చేయడం లేదు. పాత తాండూరులోని పంప్ హౌస్ మాత్రమే ప్రజల దాహార్తి తీరుస్తోంది. ఈ పంప్హౌస్ పునరుద్ధరణకు రూ.16 కోట్లు మంజూరై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు టెండర్లు పిలువలేదు. తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. అన్ని వార్డుల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణ పరిధిలో 36 వార్డులు.. 85 వేల మంది ఉన్నారు. జనాభా ప్రకారం రోజూ 12 ఎంఎల్డీ నీరు అవసరం. మిషన్ భగీరథ పథకం ద్వారా 9 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతోంది. 14,706 గృహాలు ఉండగా 6 వేల ఇళ్లకే నీటి సరఫరా జరుగుతోంది. మూడేళ్ల క్రితం సాయిపూర్, గ్రీన్ సిటీ, పాత తాండూరు, ఇంద్రానగర్ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు నీటి సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ కాలనీల ప్రజలు బోర్లు, ట్యాంకర్లపై ఆధారపడి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. పలుచోట్ల పైప్లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవడం లేదు. పాత తాండూరు పంప్ హౌస్ వద్ద గేట్వాల్వ్ లీకేజీ అవుతోంది. సమీపంలోని పొలాల్లోకి భారీగా నీరు చేరుతోంది. తాండూరు మున్సిపాలిటీకి అమృత్ 2.0 పథకం కింద రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు వాటర్ ట్యాంకులు, పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి. ఎన్టీఆర్ కాలనీలో ఒక ట్యాంక్, పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మరో ట్యాంక్ నిర్మిస్తున్నారు. నిధులు మంజూరై రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణ శివారులోని కాగ్నానది వద్ద ప్రజల తాగునీటి అవసరాల కోసం రెండు పంప్హౌస్లు ఏర్పాటు చేశారు. కొడంగల్ మార్గంలోని పంప్ హౌస్ దశాబ్ద కాలంగా పని చేయడం లేదు. పాత తాండూరులోని పంప్ హౌస్ మాత్రమే ప్రజల దాహార్తి తీరుస్తోంది. ఈ పంప్హౌస్ పునరుద్ధరణకు రూ.16 కోట్లు మంజూరై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు టెండర్లు పిలువలేదు. నీటి సమస్య రానివ్వం.. ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.. ఏటా వేసవిలో పాలకులు, అధికారులు చెప్పేమాటలివి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి బాధలే వ్యక్తమవుతున్నాయి. శనివారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్ట్ -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
అబ్దుల్లాపూర్మెట్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు మండలంలోని బాటసింగారం జెడ్పీహెచ్ఎస్ తొమ్మిదో తరగతి విద్యార్థి మండారి ధనాంజనేయులు ఎంపికయ్యాడు. ఈ నెల 7వ తేదీన సరూర్నగర్ ఇండోర్ ప్రధాన అథ్లెటిక్స్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అతడు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి 16 ఏళ్ల లోపు బాలుర విభాగంలో జావెలిన్ త్రో ఈవెంట్కు అర్హత సాధించాడు. దీంతో హనుమకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే చాంపియన్షిప్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఉపాధ్యాయులు, సర్పంచ్ గౌరిశంకర్చారి, ఉప సర్పంచ్ వెంకటేశ్యాదవ్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంఈఓ జగదీశ్ తదితరులు విద్యార్థిని అభినందించారు. -
బీఆర్ఎస్వి నీచ రాజకీయాలు
తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజారెడ్డి తాండూరు: నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేరు ప్రతిష్టలు తగ్గించేందుకు బీఆర్ఎస్ నీచరాజకీయాలకు పాల్పడుతోందని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి ఆరోపించారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు కోర్టు కేసులు పెడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్కు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. ఇది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు గొడవలు సృష్టించేందుకు యత్నించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేయడానికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం అర్ధరహితమన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డిపై పట్టణ పీఎస్లో కేసు నమోదు కావడంతో బీఆర్ఎస్ నాయకులు అల్ప సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో పాటు చోటా మోటా నాయకులు మద్యం, డ్రగ్స్ మత్తులో ఎన్నికల అధికారులపై పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే కౌటింగ్ కేంద్రం వద్దకు వచ్చారని గుర్తు చేశారు. సౌమ్యుడైన ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు పెట్టారన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన చివరకు న్యాయం గెలుస్తోందన్నారు. తరచూ ఏదో ఒక కేసులో కోర్టుల చుట్టు తిరిగే వారికి రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన తాండూరు నియోజవకర్గ అభివృద్ధి నచ్చడం లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు మహిపాల్రెడ్డి, రాజ్కుమార్, రాజవర్ధన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు హబీబ్లాల, తాండూరు మండల మాజీ అధ్యక్షుడు జన్నె నాగప్ప తదితరులు పాల్గొన్నారు. -
పొదుపు మహిళల ఆందోళన
ఇబ్రహీంపట్నం: రాయపోల్ మహిళా సహకార పొదుపు సంఘంలో అవకతవకలు జరిగాయంటూ మహిళలు, గ్రామస్తులు శనివారం ఆ సంఘం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆఫీసుకు తాళం వేసి నిరసన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాయపోల్ సేవా పరస్పర సహాయక సహకార పొదుపు(పరిమిత) సంఘం ముప్పై ఏళ్లుగా కొనసాగుతోంది. ఇందులో సుమారు రెండు వేల మంది సభ్యులు డబ్బు పొదుపు చేస్తూ, అవసరాలకు రుణాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొదుపు సంఘం మేనేజర్ ఓం ప్రకాశ్ మహిళల చేత పొదుపు డబ్బులు కట్టించుకుంటున్నారే తప్ప.. ఇటీవల కొత్త రుణాలు ఇవ్వడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. రుణాలు ఎలాగూ ఇవ్వడంలేదు.. తాము జమ చేసిన డబ్బులైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. పలువురు స్థానికులు నచ్చజెప్పడంతో ఆదివారం ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ వద్ద చర్చించేందుకు అంగీకరించారు. -
మోదీ సభను విజయవంతం చేద్దాం
అనంతగిరి: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నేడు(ఆదివారం) జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తున్నట్లు తెలిపారు. రైల్వే, రోడ్లు, పలు అభివృద్ధి పనులకు పెద్ద పీట వేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టి అజేయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. నేడు అన్ని వర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి, శివరాజు, రమేష్కుమార్, మిట్ట పరమేశ్వర్, పాండుగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, అసెంబ్లీ కోర్డినేటర్ వడ్ల నందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లేశం, నరోత్తంరెడ్డి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
సాగు భూములు లాక్కోవద్దు
● ‘రేడియల్’ భూ బాధితుల ఆవేదన ● తహసీల్దార్ గోవిందమ్మకు వినతిపత్రం అందజేత దోమ: రేడియల్ రింగ్ రోడ్డు కోసం సాగు భూములను లాక్కోరాదని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ఖమ్మం నాచారం, పాలేపల్లి గ్రామాల్లో రేడియల్ రింగ్ రోడ్డు కోసం జరుగుతున్న సర్వేను తహసీల్దార్ గోవిందమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రేడియల్ రింగ్ రోడ్డు కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. సాగుకు అనుకూలమైన భూములను తీసుకోవడం సరికాదన్నారు. సర్వే అధికారులు భూములు కోల్పోతున్న రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు లాక్కుంటున్నారని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలే శరణ్యం ప్రకృతి వైపరీత్యాలు, అడవి జంతువుల బెడద ఉన్నా ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఖమ్మం నాచారం, పాలేపల్లి గ్రామాల రైతులు తెలిపారు. రేడియల్ రింగు రోడ్డు కారణంగా జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వం లాక్కుంటే ఏం చేసి బతకాలని ప్రశ్నించారు. ఆత్మహత్యలే శరణ్యం అని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా రైతుల బాధలు విన్న తహసీల్దార్ గోవిందమ్మ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అమ్మ మనసు చల్లన
బొంరాస్పేట: అసలే మూఢ నమ్మకాలను బాగానమ్మే గిరిజన తెగ. చదువు, విజ్ఞానం లేని రెండు దశాబ్దాల క్రితం జన్యులోపం కారణంగా ఆతండాలోని ఓ తల్లి రెండు చేతులు లేని మగ బిడ్డకు జన్మనిచ్చింది. ‘తొలి కాన్పులో మురిపాల కొడుకునిస్తుందని కలలుకంటే పిశాచిని కన్నది’.. అంటూ పచ్చి బాలింతను పశువుల కొట్టంలోకి తరలించి, కళ్లు తెరవని పసిగుడ్డుకు పాలివ్వొద్దని హుకుం జారీ చేశారు. ఆతల్లికి అన్నం కాదు కదా.. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఇంతటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని, పేగు తెంచుకు పుట్టిన తన బిడ్డను బతికించుకుంది. ఎవరూ చూడని సమయంలో, రాత్రి వేళల్లో బాబుకు పాలిచ్చింది. తాను అర్ధాకలితో అలమటిస్తూనే కన్న కొడుకును కాపాడుకుంది. ఇలా అమ్మ ఇచ్చిన జన్మ, పునర్జన్మతో పెరిగి పెద్దయిన కొడుకు నేడు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ తల్లి కలలను సాకారం చేస్తున్నాడు. మాతృదినోత్సవం సందర్భంగా సాక్షి కథనం.. అరిష్టమని గెంటేసినా.. బాపల్లితండాకు చెందిన శీలాబాయి దినసరి కూలీ. భర్త మంగ్యానాయక్ ముంబై వలస కూలీ. 2004లో వీరికి రెండు చేతులు లేకుండా బాబు పుట్టాడు. పుట్టింది పసిబిడ్డ కాదని, పిశాచి అని, ఇది కుటుంబానికి అరిష్టమని తల్లీబిడ్డను ఇంట్లోనుంచి గెంటేసి, పశువుల కొట్టంలో ఉంచారు. బిడ్డకు పాలివ్వకూడదని ఆదేశించారు. కొద్ది నెలల తర్వాత ఓసంస్థ ప్రమేయంతో తల్లీకొడుకుకు ఇంట్లో స్థానం దక్కింది. బాబుకు శ్రీకార్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇతని తర్వాత నర్సింగ్, తారాసింగ్కు జన్మనిచ్చింది. పుట్టుకతోనే చేతులు లేని శ్రీకార్ను రెండో తరగతి వరకు తుంకిమెట్లలో, ఆతర్వాత పదో తరగతి వరకు బొంరాస్పేట ప్రభుత్వ పాఠశాలలో చదివించింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఆయువకుడు ప్రస్తుతం కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన నర్సింగ్ పోలీస్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటుండగా, తారాసింగ్ విదేశాల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సీఎం చొరవతో.. శ్రీకార్ కాళ్లతో రాయడం, కంప్యూటర్ విద్య నేర్చుకోవడం వంటి అంశాలు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లగా ఏడాదిన్నర క్రితం కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుంచి అమ్మకు, కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తన తల్లికి జన్మంతా రుణపడి ఉంటానని చెబుతున్నాడు. తన ముగ్గురు కొడుకులే తనకు సర్వస్వమని చెబుతోంది సుశీలాబాయి. అందరూ వద్దన్నా.. బిడ్డను కాపాడుకున్న తల్లి వేధింపులను తట్టుకుని నిలిచి, గెలిచిన ఆదర్శమూర్తి నేడు మాతృదినోత్సవం -
● కొడంగల్ బెటర్
కొడంగల్: కొడంగల్ మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా అంతరాయం లేకుండా జరుగుతోంది. కొడంగల్, పాత కొడంగల్, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మిషన్ భగీరథ తోపాటు కాగ్నా రక్షిత మంచినీటి పథకం కూడా అందుబాటులో ఉంది. ఒక పథకంలో ఇబ్బంది వస్తే ఇంకో పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ శివారులో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి గ్రామాల్లోని ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. -
బీజేపీ లక్ష్యం వికసిత్ భారత్
షాద్నగర్: వికసిత్ భారత్ సాధనే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత అందె బాబయ్య అన్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పెయింటింగ్స్ను శనివారం పట్టణంలో బీజేపీ నాయకులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, గ్రామాలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు మోదీ హైదరాబాద్ విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. -
రోబోటిక్ సర్జరీతో ఉత్తమ ఫలితాలు
రాంగోపాల్పేట్: భారతీయ రోగుల్లో హిప్ రీప్లేస్మెంట్ శస్త్ర చికిత్సలు క్లిష్టంగా ఉంటున్నాయని న్యూయార్క్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీ విక్లైన్ అన్నారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రిలో రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై జాతీయ సదస్సు నిర్వహించారు. విక్లైన్ మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంప్లాంట్ను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతున్నామని అన్నారు. న్యూయార్క్లో రోగులను కేవలం ఆరు గంటల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. మెడికవర్ సికింద్రాబాద్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి ఉదయ్ కృష్ణ మైనేని తదితరులు పాల్గొన్నారు. -
వీఓఏల పోరుబాట
● ఈనెల 18 నుంచి నిరవధిక సమ్మెకు ● డిమాండ్లు నెరవేర్చేవరకు నిరసన ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రభుత్వం అందించే రూ.5వేల వేతనం కూడా సక్రమంగా చెల్లించడంలేదు. దీంతో కుటుంబపోషణ భారంగా ఉంది. సమాన పనికి సమాన వేతనం నిబంధన అమలు చేయాలి. కనీస వేతనం రూ.20వేలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన చేపడతాం. – గోపాల్గౌడ్, జిల్లా అధ్యక్షుడు, వీఓఏల సంఘం దౌల్తాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తున్న వీఓఏలు (గ్రామ సంఘ సహాయకులు) పోరుబాటకు సిద్ధమవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారంగా మారుతుందని సెర్ఫ్ ఉద్యోగులకు దీటుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రూ.5వేల వేతనం మాత్రమే చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల బలోపేతంలో కీలకం జిల్లా వ్యాప్తంగా 666 మంది వీవోఏలు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల (ఎన్హెచ్జీ) బలోపేతంతో పాటు పేదరిక నిర్మూలనలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం అందించే రూ.5 వేల వేతనానికి తోడుగా గ్రామ మహిళా సంఘాలు లాభాల్లో ఉంటే అందులో నుంచి మరో మూడు వేల వేతనం తీసుకునే వెసులుబాటు ఉంది. గ్రామసంఘాల పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడంతో పాటు పొదుపు సంఘాల్లోని మహిళలను సంఘటితం చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన విధి. గ్రామసంఘం, మహిళా సంఘాల ఆర్థికపరమైన అంశాలు, పొదుపు, రుణాల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ పథథకాలపై సభ్యులకు అవగహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తారు. బ్యాంకు రుణాలను అందించి తిరిగి వాటిని సక్రమంగా చెల్లించేలా చూడడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రధాన డిమాండ్లు ● వీఓఏలకు రూ.20వేల కనీస వేతనం ● సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్సీ పాలసీ, ఉద్యోగ భద్రత ● అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి ● వీవోఏలకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20లక్షలు వరకు కల్పించాలి కార్యాచరణ -
బీసీ హక్కుల అమలుపై స్పష్టత ఇవ్వాలి
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్కుమార్ తాండూరు టౌన్: బీసీల హక్కుల అమలుపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదివారం మోదీ హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో బీసీలకు ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని, బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. లేదంటే తెలంగాణాలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఒక కలగానే మిగిలిపోతుందన్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారికి రిమాండ్ మీర్పేట: విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని మీర్పేట పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎస్ఐ సారంగపాణి కథనం ప్రకారం.. ఈ నెల 7వ తేదీన పోలీస్స్టేషన్కు చెందిన హోంగార్డు ధారావత్ లింగనాయక్, ఏఆర్పీసీ అఖిల్వాసులు సీఐ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారు. గస్తీలో భా గంగా అర్ధరాత్రి బడంగ్పేట గ్రంథాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ఉండటాన్ని గమ నించి అక్కడికి వెళ్లి వివరాలు అడిగారు. దీంతో వారు సిబ్బందితో వాగ్వివాదానికి దిగా రు. సదరు యువకులు మరికొందరికి ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన మిగతవారు అందరూ కలిసి సిబ్బందిపై దాడి చేశారు. హోంగార్డు లింగనాయక్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సాయికుమార్, నర్సింహ, ప్రభులను రిమాండ్కు తరలించామని, మరో ముగ్గురు శివకుమార్, కృష్ణ, మహేష్లు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు. వికసిత్ తెలంగాణమే లక్ష్యం రాజేంద్రనగర్: ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల వనితారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వికసిత్ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.7823 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. -
ఎన్ఎంఎంఎస్ పనితీరు పరిశీలన
ఇబ్రహీంపట్నం: ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ పనితీరును పరిశీలించేందుకు రాయపోల్ గ్రామ పరిధిలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాన్ని శుక్రవారం అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి సందర్శించారు. ముఖకవళికలు గుర్తించే ఈ యాప్ ద్వారా ఉపాధి పనికి వచ్చే కూలీల ఫొటోలు తీసుకుంటారు. పనికి వచ్చిన నాలుగు గంటలకు 40 నుంచి 50 మంది కూలీల మరో గ్రూప్ ఫొటోను తీయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఫొటోల గుర్తింపులో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆమె కూలీలను ప్రశ్నించారు. ఫొటోలకే సమయం పడుతోందని, టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని కూలీలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెంట ఉపాధి హామీ ఏపీఓ చారి, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లు ఉన్నారు. -
పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి
షాద్నగర్: పాడి రైతులు శాసీ్త్రయ పద్ధతులను పాటించడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు పాల దిగుబడిని పెంచి అధిక లాభాలు పొందొచ్చని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం పీర్లగూడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణాను సరైన నిష్పత్తిలో అందించాలని సూచించారు. పాల దిగుబడి పెరగడానికి పశుగ్రాసంలో ఖనిజ లవణాల మిశ్రమాన్ని తప్పనిసరి కలపాలన్నారు. పశువుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, గొంతువాపు, జబ్బవాపు, గాలికుంట వ్యాధుల నివారణకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. క్రమ తప్పకుండా నట్టల నివారణ మందు తాగించాలన్నారు. జిల్లాలోని 30 గ్రామాల్లో పాడి రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా పశుగణాభివృద్ధిశాఖ అధికారి డాక్టర్ అరుణశ్రీ, ఏడీఏ విజయ్కుమార్రెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ ముక్కంటి రాజ్, సర్పంచ్ షమీమ్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
వివాహ వేడుకలో స్పీకర్ ప్రసాద్కుమార్
అనంతగిరి: వికారాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పలు శుభకార్యాల్లో స్పీకర్ ప్రసాద్కుమార్ పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీనియర్ న్యాయవాది బస్వరాజ్ పటేల్ కుమార్తె వివాహంలో పాల్గొన్నారు. పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పశువైద్యాధికారి సదానందం కొడంగల్ రూరల్: పశు వైద్య శిబిరాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువై ద్యాధికారి డాక్టర్ సదానందం అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పశు వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు గర్భ నిర్దారణ పరీక్షలు, చికిత్స, ఎద గుర్తింపు తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పశువులను సాధ్యమైనంత వరకు నీడపాటున ఉండేలా చూసుకోవాలన్నారు. సమయానుకూలంగా తాగునీరు, మేత అందించాలని సూచించారు. దూడలకు ముర్రు పాలు తాగించాలని, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ నోవా, పశు వైద్యాధికారులు డాక్టర్ పరమేష్, డాక్టర్ అశోక్ రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి అనంతగిరి: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తోందని మత్స్య సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పథకాల గురించి వివరించారు. చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపలకు వచ్చే వ్యాధులు.. నియంత్రణ, అధికోత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ప్రధాని సభను విజయవంతం చేద్దాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ కుమార్ అనంతగిరి: హైదరాబాద్లో 10వ తేదీ జరిగే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాజశేఖర్, జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బలోపేతం చేస్తామండి
సర్కార్ బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తోంది.. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. సర్కార్ స్కూళ్లపై ప్రభుత్వం నజర్ షాద్నగర్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేస్తోంది. అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు రోజు వారీగా కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఏ రోజు ఏం చేస్తారంటే.. -
దేవదేవుని ఆదేశంతోనే..
శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారంకొడంగల్: దేవదేవుని ఆదేశం మేరకు కొడంగల్లో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ జన్మకు వచ్చిన గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి 2027 డిసెంబర్లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నవీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్న దాన సత్రం, కల్యాణ మండపం, ధ్వజ స్తంభం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, పార్కింగ్, ప్రసాద కౌంటర్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలు నిర్వహించారు. ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణాహుతి జరిపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దుద్యాల్ మండలం లగచర్లలో 430 పడకల ఆస్పత్రికి, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయానికి, దౌల్తాబాద్లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇక్కడే శిలాఫలకాలకు పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 55 ఏండ్ల క్రితం నందారం కుటుంబీకులు నిర్మించిన కొడంగల్ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమలకు వెళ్లి వచ్చిన పుణ్యం వస్తుందన్నారు. శ్రీవారి ఆలయానికి ఎంతో సేవ చేసిన టీటీడీ వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారులు, దివంగత సుందర వరధ భట్టాచార్యుల పేరును ఏదో ఒక ప్రాంగణానికి పెట్టాలని అధికారులకు సూచించారు. గడి గుడి ఏకమై కొడంగల్ను నందనవనంగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణంలో ఇక గ్రూపులకు.. గుంపులకు తావులేదన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసమే పని చేయాలన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు నందారం వెంకటయ్య, నందారం సూర్యనారాయణలు ఈ గుడి కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. వారి ఆశయాలను అమలు చేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. తిరుమల తరహాలో నిత్య పూజలు, కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పారు. నారాయణపేట ఎత్తిపోతల పథకం, కృష్ణా – వికారాబాద్ రైల్వేలైన్, కొడంగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీ పనులకు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కొడంగల్కు మెడికల్, వృత్తి విద్య, ఇంజనీరింగ్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళా శాల, జూనియర్ కళాశాలలు మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, బుయ్యని మనోహర్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యారు, కలెక్టర్ దీపక్ తివారి తదితరులు పాల్గొన్నారు. -
పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేపై లేజర్ గన్లు
రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుంచి మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వరకు ఉన్న పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పై వాహన వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 11.6 కిలోమీటర్ల మేర పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంది. ఫ్లైఓవర్పై కార్లకు మాత్రమే అనుమతి ఉంది. ప్రస్తుతం వాహనాలు వేగంగా వస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి 80 కి.మీ వేగంతో మాత్రమే వెళ్లాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరువైపులా లేజర్ గన్లను ఏర్పాటు చేశారు. 80 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు గుర్తించి చలానాలు వేస్తున్నారు. ప్రతిరోజు 120 నుంచి 150 వాహనాలకు చలానాలు విధిస్తున్నారంటే.. ఫ్లై ఓవర్పై వాహనాలు ఎంత వేగంగా వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. -
తాండూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు
తాండూరు: స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, డీసీసీబీ చైర్మన్ రవిగౌడ్తో పాటు పురుషోత్తంరావు నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ హాల్లోకి వెళ్లారు. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి కూడా కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై మరుసటి రోజున పది మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై ఫిబ్ర వరి 27న ఎన్నిక లసంఘంతో పాటు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి నా ఫలితం లేకపోవడంతో మార్చి 11న తాండూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. ఏప్రిల్ 4న కేసు నమోదు చేయాలని న్యా యమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో ఈనెల 2న ఐదుగురిపైనా కేసు నమోదు చేశారు. -
బంగారు తునకలా మార్చుకుందాం
వికారాబాద్: దశాబ్దాల తరబడి అన్యాయానికి గురైన కొడంగల్ను బంగారు తునకగా మార్చుకుందామని సీఎం రేవంత్రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనేలా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, దేశంలోని గొప్ప గొప్ప పరిశ్రమలు కొడంగల్ బాట పట్టాయని తెలిపారు. శుక్రవారం కొడంగల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డితో కలిసి రూ.110 కోట్లతో కొడంగల్ వెంకటేశ్వరస్వామి, రూ.2 కోట్లతో కోస్గి వేణుగోపాలస్వామి, రూ.2.5 కోట్లతో దౌల్తాబాద్ వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిఏడాదిన్నరలోపు పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తాం. దీనికి సంబంధించిన భూసేకరణ బాధ్యతలను మంత్రి శ్రీహరికి అప్పగిస్తే నెల రోజుల్లో పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకానికి ఇక ఏ అడ్డంకులూ లేవు. ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాం. ఏడాదిన్నర లోపు పనులు పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు నీరందిస్తాం. రైల్వేలైన్ కోసం పరిగి ఎమ్మెల్యే ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వికారాబాద్– కృష్ణా రైల్వే మంజూరు పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తయ్యాయి.మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి పరిగి, కొడంగల్లో రైలు కూత వినిపిస్తాం. సుద్ద గనులు మన దగ్గర ఉంటే సిమెంటు కంపెనీలు కర్ణాటకలో ఉండేవి. మన ఖనిజ సంపదంతా అక్కడకు తరలివెళ్లేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గంలో సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.మెడికల్, ఇంజనీరింగ్, ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యా సంస్థలు ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు అవుతున్నాయి. ఏడాదిన్నరలోపు ఎడ్యుకేషన్ హబ్ పనులు పూర్తవుతాయి. ఉపాధి అవకాశాలు లేక పేదలు పూణే, బాంబేలకు వలసలు వెళ్లేవారు.. నేడు మన దగ్గరే పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పింస్తున్నాం. పేదల తిరుపతిగా కొడంగల్ వెంకటేశ్వరాలయం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా పేదల తిరుపతిగా విరాజిల్లుతోంది. ఇప్పుడు పునరి్నర్మాణ పనులు చేపట్టి తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతానికి చెందిన ఆగమ శాస్త్ర పండితులు సుందర వరదాచార్యుల సలహా ప్రకారమే తిరుపతిలో అన్ని కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఇక్కడ భూమి పూజ కూడా ఆయన పెట్టిన ముహూర్తానికే చేశాం. కానీ ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోవటం ఎంతో లోటు. ఈ ప్రాంత ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఆలయంలోని ఓ విడిదికి వరదాచార్యుల పేరు పెడతాం. వెనుకబాటుకు గురయ్యాం.. గురునాథ్రెడ్డి కొడంగల్ నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారు. కొడంగల్ అభివృద్ధికి ఆనాడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి గెలిచిన వారెవరూ మంత్రి కాలేకపోయారు. దీంతో అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యాం. ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అన్న తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిలో కలిసిసాగాలి పార్టీలకతీతంగా నాయకులు, సర్పంచ్లు కలిసొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాం. రాష్ట్రంలోనే కొడంగల్ ఎత్తయిన ప్రాంతం. నీరు వచ్చే అవకాశం లేకపోయింది. కందులు తప్ప వడ్లు పండించే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి తండా, ప్రతీ పంచాయతీకి రోడ్డు నిర్మించుకున్నాం. ఇంకా ఎక్కడ ఏం అవసరం ఉన్నా చేసుకుందాం. కార్యకర్తలు, నాయకుల కష్టంతోనే నేను ఈ స్థాయికి వచ్చా.. కొడంగల్ కార్యకర్తల ఆశీర్వాదంతో ముఖ్యమంతి పదవి వచ్చింది.. దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందాం. ఏది కావాలన్నా చేసుకుందాం.. 2,300 ఎకరాల్లో ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎయిర్పోర్టు నుంచి కోస్గి వరకు 300 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించుకుంటున్నాం. 2009లో మీరు నాటిన మొక్క నేడు చెట్టుగా మారింది. సీఎంగా మీముందు కూర్చుంది.. ఏది కావాలన్నా కొదవ లేకుండా చేసుకుందాం’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యార్, కార్పొరేషన్ల చైర్మన్లు గురునాథ్రెడ్డి, కల్వ సుజాత, కలెక్టర్ దీపక్తివారి తదితరులు పాల్గొన్నారు. -
సారు.. వికారాబాద్కు రారు!
వికారాబాద్: ప్రభుత్వ ఆదేశాలను జిల్లా మైనింగ్ అఽధికారులు బేఖాతరు చేస్తున్నారు. సర్కారు కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉండరాదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. మూడు నెలల క్రితం అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత బిల్లింగ్లలో ఆఫీసులను మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మైనింగ్ ఏడీ కార్యాలయం మాత్రం తాండూరులోని చిన్నపాటి వాహనం కూడా వెళ్లడానికి వీలులేని వీధిలో ఓ అద్దె ఇంట్లో కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్న సమయంలో తాండూరు ప్రాంతంలో ఎక్కువ మైన్స్ ఉన్నాయనే కారణంతో అక్కడ ఆ శాఖ ఏడీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వికారాబాద్ కొత్త జిల్లాగా ఏర్పాటై ఎనిమిదేళ్లు అవుతోంది. అన్ని హెచ్ఓడీల కార్యాలయాలను కలెక్టరేట్కు మార్చారు. మైనింగ్ కార్యాలయం మాత్రం తాండూరులోనే ఉండిపోయింది. ఏ చిన్న పని పడినా ఆ శాఖ కిందిస్థాయి అధికారులు, కాంట్రాక్టర్లు తాండూరుకు వెళ్లాల్సి వస్తోంది. తరచూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ఆ శాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని కలెక్టరేట్కు మార్చలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి ఇటీవలి కాలంలో మైనింగ్ శాఖ అధికారుల తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, నాపరాయి, సుద్ద, గ్రానైట్, ల్యాట్రేట్ తదితర ఉత్పత్తుల తవ్వకాలు, రవాణా విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. లీజు తీసుకున్న ప్రాంతంతోపాటు పక్కనున్న ఏరియాలో కూడా తవ్వకాలు జరపడం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం వంటి ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓవర్ లోడ్తోనే ఖనిజాలు రవాణా అవుతున్నాయి. 30 టన్నుల సామర్థ్యం ఉన్న లారీలో 50 నుంచి 60 టన్నులు తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల టన్నుల ఐరన్ ఖనిజాన్ని తరలిస్తుంటారు. టన్నుకు రూ.279.50 ప్రభుత్వానికి చెల్లించాలి. ఇందులో డీఎంఎఫ్టీ నిధుల కింద జిల్లాకు టన్నుకు రూ.36 చొప్పున జమ చేస్తారు. ఓవర్లోడ్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ 50 శాతమే వస్తోంది. మిగతా సగం మైనింగ్ యజమానుల జేబుల్లోకే వెళ్తోంది. ఎప్పుడో ఒకసారి అధికారులు ఒకటి అర కేసులు, ఫైన్లు వేసి చేతులు దులుపుకొంటున్నారు. తాండూరులోనే మైనింగ్ ఏడీ కార్యాలయం చిన్నపాటి అద్దె భవనంలో నిర్వహణ సొంత బిల్డింగ్లో ఉండాలన్న నిబంధన బేఖాతరు తరచూ అవినీతి ఆరోపణలు తాజాగా ఏడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులపై అనేక ఆరోపణలు రావడం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటి విషయాలు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్గా తీసుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో మైనింగ్ ఏడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, ఇసుక వ్యాపారులు పేట్రేగి పోతుంటే, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్తుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అక్రమార్కులను వెంటనే కట్టడి చేయాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. ఓ పక్క ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజల నుంచి విమర్శలు వెళ్లువెత్తుతున్నా వారి తీరు మాత్రం మారడంలేదు. మూడేళ్ల క్రితం నూతన కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు మైనింగ్ శాఖ ఏడీ కార్యాలయం, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజనీర్ల కార్యాలయాలు మాత్రం బయటే కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ కార్యాలయాలు జిల్లా కేంద్రం వికారాబాద్లోని ఓ మూలన కొనసాగుతుండగా మైనింగ్ కార్యాలయం మాత్రం తాండూరులోనే ఉండిపోయింది. -
పని చేయకుండానే పైసలు డ్రా!
● బయట పడిన అధికారుల బండారం ● హడావుడిగా ఎండిన చెట్ల తొలగింపు ధారూరు: పనులు చేయకుండానే పైసలు డ్రా చేశారన్నా ఫిర్యాదు నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో నిధుల స్వాహ నిజమేనని తేలింది!. దీంతో తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఆ అవినీతి అధికారులు హడావుడిగా పనులు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. విచారణ అధికారికి బుజ్జగింపు ఫారెస్టు రేంజ్ పరిధి రాస్నం సెక్షన్ మూడు గ్రామాల్లో అప్రూటల్ (అటవీ ప్రాంతంలో ఎండిన చెట్లను వేర్లతో సహా తొలగించి కాల్చివేయడం) పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు చూపి, రూ.7 లక్షలు డ్రా చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఆఫీసర్ సువర్ణ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో బుధవారం ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలోని రాస్నం, సంగాయపల్లి, దోర్నాల్ ఫారెస్టు బీట్లలో విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుంద్రెడ్డి (విజెలెన్స్) బృందం.. అక్కడ బాధ్యత వహిస్తున్న ఇద్దరు అధికారులపై విచారణ పూర్తి చేసింది. ఇందులో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. విషయం బయట పడటంతో ఆ అధికారులు గురువారం అప్రూటల్ పనులు ప్రారంభించారు. ఈ అవి నీతి అధికారులను కాపాడేందుకు మరో అధికారి విచారణ అధికారులను మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారుల విచారణ నివేదికను వారిద్దరికి అనుకూలంగా వచ్చేవిధంగా చూడాలని విచారణ అధికారిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అవినీతి అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
భగ్గుమన్న పాత కక్షలు
బషీరాబాద్: పాత కక్షలు రెండు కుటుంబాల మధ్య పాశవిక దాడులకు దారితీశాయి. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకోవడంతో తొమ్మిది మందికి రక్తగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఇరు కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సభావత్ శంకర్నాయక్, రమావత్ బాబునాయక్ కుటుంబాల మధ్య గత పంచాయతీ ఎన్నికల నుంచి కక్షలు కొనసాగుతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లికి సంబంధించి, రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉదయం రాథోడ్ లోక్యానాయక్ ఇంటి వద్ద స్థానిక గిరిజన నాయకుడు వెంకటేశ్నాయక్ మాట్లాడుతుండగా లక్ష్మణ్నాయక్ వచ్చి ఇంట్లోకూర్చుని మాట్లాడమేంటి.. ఆలయం వద్ద మాట్లాడాలి అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పంచాయితీ గుడి వద్దకు చేరింది. ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో రమావత్ బాబునాయక్ కుటుంబ సభ్యులు సభావత్ శంకర్ నాయక్పై దాడికి దిగారు. దీంతో రెండు కుటుంబాలు అక్కడే ఉన్న వంట చెరుకు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు చేతికందిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో శంకర్నాయక్ తలకు తీవ్రగాయాలు కావడంతో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికి చెందిన ఐదుగురికి రక్తగాయాలు కాగా, బాబునాయక్ తరఫున వారికి నలుగురికి గాయాలయ్యాయి. బషీరాబాద్ సివిల్ ఆస్పత్రిలో పోలీసులు వీరికి చికిత్సలు చేయించారు. 14 మందిపై కేసులు సభావత్ శంకర్నాయక్ కొడుకు మోత్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబునాయక్, లక్ష్మణ్నాయక్, మోహన్నాయక్, హద్దునాయక్, లోక్యానాయక్, బలరాంనాయక్, గోపాల్నాయక్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే రమావత్ బాబునాయక్ ఫిర్యాదుతో సభావత్ శంకర్నాయక్, లక్ష్మణ్నాయక్, బలరాంనాయక్, మోత్యానాయక్, వెంకట్ నాయక్, రాజునాయక్, శాంతిభాయిపై కేసులు నమోదయ్యాయి. గ్రామంలో టెన్షన్ టెన్షన్ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుకుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దౌర్జన్యంగా దాడులు చేశారని, బీఆర్ఎస్ గ్రామ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే.. తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ నాయక్, రోదిస్తున్న భార్యకర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు తొమ్మిది మందికి రక్త గాయాలు, ఒకరి పరిస్థితి విషమం 14 మందిపై కేసు నమోదు నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం -
ఆధ్యాత్మికతతో ప్రశాంతత
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మోమిన్పేట: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న కోల్కుంద గ్రామంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విశాల, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సంగమేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి దుద్యాల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. బుధవారం దుద్యాల్ మండలం హస్నాబాద్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, తహసీల్దార్ కిషన్, జీపీఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి దుద్యాల్: నిరుపేదలకు ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హంసంపల్లిలో ఇందిరమ్మ ఇంటిని పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. గత పాలకులు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పమ్మ, పంచాయతీ కార్యదర్శి పుష్పలత, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సీతారాం, సర్పంచులు హన్మా నాయక్, మొగులయ్య, నాయకులు గోపాల్, మల్లికార్జున్, జెల్లరాజు, రాములు, శివ చౌహాన్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: నగరంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 11న నిర్వహించే మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో యువజన విభాగం, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాబ్మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కబిషనర్ విక్రం సింహారెడ్డి, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి దుక్కులతో
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026ఇది రైతు ప్రభుత్వంతాండూరు: ‘సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాక పొలాలను అలాగే వదిలేస్తారు.. మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు భూములను దున్నకుండా వదిలేస్తారు.. దీంతో కలుపు, గడ్డి జాతి మొక్కలు పెరిగి నీరు, ఇతర పోషక పదార్థాలను గ్రహించి భూమి సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి.. దీని వల్ల భూ సారం మందగించి భూమి లోపల పొరల నుంచి నీరు గ్రహింపబడి ఆవిరైపోతాయి. తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని’ జిల్లా వ్యవసాయాధికారి టీ రాజరత్నం అన్నారు. వేసవిలో భూముల చదును చేసుకునే విధానంపై ఆయన సలహాలు సూచనలు.. దుక్కులు దున్నక పోతే.. వేసవిలో వ్యవసాయ పొలాలను దుక్కులను దున్నక పోతే ముడి పోషకాల కొరత ఏర్పడుతుంది. అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు వేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెలలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలి. మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. తగిన సమయంలో పంట విత్తు కోవాలన్నప్పుడు రైతులకు భూములు తయారుగా ఉండాలంటే ఈ వేసవిలో లోతైన దుక్కులు అవసరం ఎంతైనా ఉంది. రుతుపవనాల ఆరంభానికి ముందే భూమిని దున్ని ఉంచుకోవడం వల్ల తొలకరి వర్షాలు పడగానే పెళ్లలు మెత్తబడి నీరు త్వరగా భూమిలోకి ఇంకుతుంది. దీని వల్ల భూమి లోపలి పొరల్లో నీరు నిక్షిప్త సామర్థ్యం పెరగడంతో పాటు మొలక శాతం బాగుంటుంది. దున్నే విధానం లోతైన దుక్కులు వాలుకు అడ్డంగా చేయడం వల్ల వర్షపు నీరు పారుదల కాకుండా భూమి లోతుకు చేరుతుంది. ఒక వేళ వాలుకు అనుకూలంగా దున్నినట్లయితే నేల విపరీతమైన కోతకు గురికావచ్చు. సాళ్ల వెంట పడిన వర్షపు నీరు ప్రవహించి సారవంతమైన మట్టినంత ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా మారుస్తుంది. అడ్డంగా దున్నడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. దిగుబడి మందగింపుపై.. సాధారణంగా భూమి పొరలు గట్టిబడి, దళసరి గోడలాగ తయారవడం వల్ల మొక్కల వేళ్లు లోనికి చొచ్చుకొని పోలేక, భూమి లోపల పోషక పదార్థాలు, నీరు, ఇతర ఖనిజ లవణాలును పొందక పోవడంతో పంటల ఆరోగ్యం దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతాయి. నివారణ కోసం రైతులు వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకున్నట్లయితో భూమి గుల్లబారి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారై నీటిని నిల్వ చేసుకొనే శక్తి పెరుగుతుంది. అంతే తేమతో జీవించే మేలు సూక్ష్మాతి సూక్ష్మి జీవులు గణనీయంగా వృద్ధి చెందడంతోపాటు వాన పాముల సంతతి కూడా భారీగా పెరుగుతుంది. దీంతో భూసార అభివృద్ధి అధికమవుతుంది. పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తున్న రైతురబీ తర్వాత లోతైన దుక్కులు చేయాలి సేంద్రియ ఎరువులతో నేల సారవంతం జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అక్కంపల్లి, అగ్గనూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం సేంద్రియ సాగుతో.. సేంద్రియ ఎరువులతో దుక్కులు దున్నుకోవాలి. వేసవి దుక్కులు దున్నుకునే ముందు భూమిలో పశువుల ఎరువు, కంపోస్టు లేదా చెరువు మట్టిని చల్లడం వలన నేల సారవంతంగా మారుతుంది. దుక్కులు దున్నే ముందు పొలంలో పశువుల మందలు, గొర్రెలు, మెకల మందలను వదలాలి. ఇలా చేయడం వల్ల అవి విసర్జించే మల మూత్రాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం విపరితంగా పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల ప్రత్యేకించి పశువుల ఎరువును ఖరీదు చేసే పరిస్థితి కూడ తగ్గుతుంది. సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా పండించే పంట పొలాల్లో సూక్ష్మ – స్థూల పోషక పదార్థాల లోపాలను నివారించుకోవచ్చు. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ స్నేహమెహ్రఅనంతగిరి: చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో బుధవారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పశువుల సంతలు, చెక్పోస్టుల వద్ద సిబ్బంది నియమించాలని ఆదేశించారు. ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసినా.. వధించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్లాపూర్, రావులపల్లి, బషీరాబాద్ రైల్వే గేట్ వద్ద మూడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, అంగడి చిట్టంపల్లి, మైతాబ్ ఖాన్ గూడ, అంతారం, లక్ష్మీనారాయణపూర్ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో నాలుగు అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టామన్నారు. పశువుల అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి సదానందం, అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు అంజయ్య, జానయ్య, శ్రీనివాస్, యాదయ్య, శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి పశువుల అక్రమ రవాణాపై నిఘా ఎస్పీ స్నేహ మెహ్ర -
పునర్ నవీకరణ పూజలు ప్రారంభం
కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్ నవీకరణ పూజలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తిరుమల అర్చకులు భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణ తదితర వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలను వైభవంగా చేశారు. గురువారం ఉదయం పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం 7.10 గంటల నుంచి 8.20 గంటల మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని అర్చకులు కోరారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆలయ ధర్మకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నమూనా మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నమూనాను అధికారులు సిద్ధం చేశారు. ఆలయ విస్తరణ ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మిస్తారు. -
పండుగ వాతావరణం ఉట్టిపడాలి
కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటనలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సభా వేధిక, ప్రాంగణం, పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు జగన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్ఐఈ రాములు, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బషీరాబాద్: మండల పరిధి ఎక్మాయి వాగు నుంచి మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కంసాన్పల్లి(బి) గ్రామానికి చెందిన వెంకటయ్య, గొల్ల బసప్పకు చెందిన (టీఎస్34 కే 3452, ఏపీ39 ఎల్ఎఫ్7192) నంబర్ గల రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా పోలీసులు లోక్యానాయక్, నర్సింహులు స్వాధీనం చేసుకున్నారు. పీఎస్కు తరలించి, ఇరువురిపై కేసులు నమోదు చేశారు. జొన్న పంట దగ్ధం ధారూరు: ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధమైంది. ధారూరు మండలం బాచారం గ్రామానికి చెందిన రైతు కావలి బాలమణి.. తనకున్న రెండు ఎకరాల్లో జొన్న సాగుచేశారు. ఇందుకోసం పెట్టుబడిగా రూ.35 వేలు వెచ్చించారు. పంట కోతకు రాగా.. మంగళవారం సాయంత్రం వరకు ఆరడానికి వదిలిపెట్టారు. అదే రోజు మంటలు చెలరేగి పంట కాలి బూడిదయింది. పంటను విక్రయిస్తే రూ.70 వేల వరకు వచ్చేవని, ఇప్పుడు పెట్టుబడి సైతం కోల్పోవాల్సి వచ్చిందని బాధిత రైతు వాపోయింది. వ్యవసాయ అధికారులు పరిశీలించి, తగిన పరిహారం అందించాలని కోరారు. యాచారం: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వివరాలు.. మండల పరిధిలోని మాల్–కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలోని గుట్టల ప్రాంతం నుంచి బుధవారం ఓ జింక కిషన్పల్లి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన వీధి కుక్కలు జింకను వెంటాడి దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి కళేబారాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. జ్ఞానం ముందు తరాలకు అందించాలి ● ప్రొఫెసర్ ఖాసీం ● అప్పాయిపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ బొంరాస్పేట: చదువు అనే జ్ఞానాన్ని ముందు తరాలకు అందించాలని, అలాగే సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పంచాలని ప్రొ. ఖాసీం అన్నారు. బుధవారం కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ చూపిన బాటలో నడవాలన్నారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. రెండు వందల ఏళ్ల క్రితమే సీ్త్ర విద్యను జ్యోతిరావు పూలే స్థాపించారని గుర్తు చేశారు. రేలారే రేలా ప్రసాద్ కళాబృందం నిర్వహించిన ధూమ్ధామ్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు గోకుల్సింగ్, సర్పంచ్ వెంకటయ్య, నిర్వాహకులు శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్, రమేశ్బాబు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యం
షాద్నగర్: తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కుటుంబ పార్టీలను ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఆరంభం మాత్రమేనని అన్నారు. వికసిత తెలంగాణ లక్ష్యంగా ద్యేయంగా కేంద్రం పని చేస్తోందన్నారు. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా సభకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి రాజభూపాల్, నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, కక్కునూరి వెంకటేష్గుప్తా, దేపల్లి అశోక్, చెంది మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి -
సివిల్స్లో మైనార్టీలకు ఉచిత శిక్షణ
అనంతగిరి: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఎగ్జామినేషన్– 2027 కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకుచెంది, ఆసక్తి ఉన్న మైనార్టీ విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ద, పార్సి) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, స్క్రీనింగ్ పరీక్ష జూన్ 14న ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040– 2323 6112లో సంప్రదించాలని సూచించారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధి శివరాంనగర్లో విద్యుదాఘాతంతో ఓ ఇల్లు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. శివారంనగర్కు చెందిన నరసింహచారి కుటుంబ సమేతంగా తన ఇంట్లోని రెండో అంతస్థులో నివా సం ఉంటున్నారు. బుధవారం వారందరూ బయటకు వెళ్లగా.. చారి తండ్రి ఒక్కడే ఉన్నా డు. మధ్యాహ్నం ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్మేసింది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకువ చ్చారు. ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఫర్నిచర్ తదితర సామగ్రి కాలిపోయింది. రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. సీఐ రఘుకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్ల పరిశీలన తాండూరు: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్లను సంబంధిత అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ నెల 4వ తేదీ వరకు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు మొత్తం 19 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో మైనార్టీ విభాగం నుంచి పురుషులు నలుగురు, మహిళలు ఇద్దరు ఉన్నారు. అనుభవజ్ఞుల విభాగం నుంచి 13 నామపత్రాలు వచ్చాయి. ఇందులో పురుషులు 8, మహిళలు 5గురు ఉన్నారు. పత్రాల పరిశీలనలో 7 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. 12 మంది ఎన్నికకు అర్హత సాధించారు. ఈ నెల 11న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ పదవులకు ఇద్దరు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం పీఏసీఎస్ సీఈఓ గణేశ్కు రాజీనామా లేఖలను అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికై న టేకుల సుదర్శన్రెడ్డి, కౌన్సిలర్గా గెలుపొందిన క్యామా శంకర్ పీఏసీఎస్ డైరెక్టర్లుగా ఉన్నారు. జోడి పదవులు ఉండకూడదని రాజీనామా చేసినట్లు తెలిపారు . -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
● యువకుడికి తీవ్ర గాయాలు ● తలకొండపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో ఘటనఆమనగల్లు: తలకొండపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగరావ్పల్లికి చెందిన కుమార్ తన అత్త జంగమ్మ(50)ను తీసుకుని బైక్పై తలకొండపల్లికి వెళ్తుండగా కాటన్మిల్లు వద్ద ఎదురుగా వచ్చిన లారీ అంతివేగంతో ఢీకొట్టింది. ఘటనలో జంగమ్మ మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన కుమార్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ మండల అధ్యక్షుడు గోదల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో దండుమైలారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. దండుమైలారం ఐకేపీ సెంటర్లో సీజన్కి 80 వేల నుంచి లక్షా బస్తాలు కొనుగోలు చేస్తుండగా సూమారుగా 640 క్వింటాళ్ల ధాన్యం అదనంగా రైతుల నుంచి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మకై ్క రైతులకు రూ.25 లక్షల వరకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవ తీసుకొని సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేదంటే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొండ రమణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నెర్రపల్లి సర్పంచ్ శ్రీహరి, వేణుగోపాల్రెడ్డి, తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్ -
మోదీ పాలనలో పెరిగింది పేదరికమే
చేవెళ్ల: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పేదరికం, నిరుద్యోగం పెరిగిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధరల నియంత్రించాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. వికసిత్భారత్ లక్ష్యం ధరల పెంచడమేనా అని ఎద్దేవా చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, మక్బూల్, మంజుల, పాపయ్య, కార్మికులు మల్లయ్య, వెంకయ్య, యాదమ్మ, నర్సింలు, వెంకటమ్మ, రాజు, శేఖర్, శివ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి -
సర్వం సిద్ధం
శ్రీవారి ఆలయ అభివృద్ధికి కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నవీకరణ పూజలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 8వ తేదీ ఉదయం 7.10 నుంచి 8.20 గంటల మధ్యలో శంకుస్థాపన చేస్తారు. సీఎం దంపతులు ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన, భూమి పూజ) కార్యక్రమం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూ లైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. కార్యక్రమ వివరాలు ● 6వ తేదీ(బుధవరం) ఉదయం భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణం నిర్వహిస్తారు. ● 7వ తేదీ(గురువారం) పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయి. ● 8వ తేదీ(శుక్రవారం) ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణాహుతి, ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి బహిరంగ సభ ప్రాంగణం, యాగశాల, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి పునర్నవీకరణ పూజలు 8న సీఎం రేవంత్రెడ్డిచేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మను చౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 10న మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, పోలిస్ శాఖ, విద్యుత్, ట్రాన్స్పోర్టు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మను చౌదరి -
ఉద్యాన పంటలతో అధిక లాభాలు
అనంతగిరి: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయిల్ పామ్ సాగు, రైతు సంక్షేమ పథకాలపై ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా ఆయిల్ పామ్ సాగుకు అధికారులు కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. సాగుపై అవగాహన కల్పించేందుకు అశ్వరావుపేట్ ప్రాంత పర్యటనకు రైతులను తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు పండ్లు, పూలు, కూరగాయల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జూన్ మాసంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి సత్తార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు చాపల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ధాన్యం సేకరించాలి జిల్లాలో పకడ్బందీగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్డీఏ శ్రీనివాస్, డీఎస్ఓ సుదర్శన్, డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మార్కెటింగ్ ఎండీ రియాజ్, మార్క్ఫెడ్ అధికారి రేఖ, డీసీఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ దీపక్ తివారి -
చిన్నారులు ఉన్నతస్థాయికి ఎదగాలి
హుడాకాంప్లెక్స్: చిన్నారులు క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ సుజాత ఆకాంక్షించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. శిక్షణ పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, వారి ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కోచ్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. శిక్షణలో మరింత నాణ్యత పెంచాలని సూచించారు. జిల్లా యువజన క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కోచింగ్ క్యాంపులో నమోదు చేయించి వారి క్రీడా భవిష్యత్కు పునాదులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాక్సింగ్, కబడ్డీ, కరాటే, టేబుల్ టెన్నిస్ తదితర విభాగాల్లో శిక్షణ ఇసున్నట్టు తెలిపారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్
తాండూరు టౌన్: వికారాబాద్ పట్టణంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, మధు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జంప్, త్రో, 400 మీటర్ల రన్నింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమోతో రిపోర్ట్ చేయాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10న వరంగల్లో జరగనున్న అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో, ఈ నెల 17 హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ల 9951343432, 6300075229లో సంప్రదించాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప యాలాల: రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న ఆశవర్కర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆశవర్కర్ల యూనియన్ పిలుపు మేరకు మంగళవారం పీహెచ్సీ వైద్యురాలు రూబియానాజ్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ఆశవర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనాన్ని అందించి, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్హెచ్ఎంలకు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశవర్కర్ల విషయంలో ప్రభుత్వం అనుకూలంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి శశికళ, ఆశ వర్కర్లు అనిత, వెంకటమ్మ, దస్తమ్మ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి తాండూరు రూరల్: కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్లాపూర్ గ్రామ శివారులో వెలసిన ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు వినోద్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి, ఈఓలు శేఖర్గౌడ్, శాంతు, ఉప సర్పంచ్ రాజు, సిబ్బంది అమరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన ఫార్మా భూ బాధితులు యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ కవితను నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ చేస్తోందని, 40 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో రైతుల పేర్లపై ఉన్న భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసి ఆ భూములు సర్కార్వేనని భయపెట్టాలని చూస్తున్నారని వాపోయారు. దీంతో స్పందించిన ఆమె త్వరలోనే కుర్మిద్ద తండాలో గిరిజన రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామా ల రైతులతో పాటు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, నేనావత్ శ్రీకాంత్నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు. -
సంచార జాతులకు వెసులుబాటు
కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం డీఎన్టీ సర్టిఫికెట్ జారీతో సంచార జాతి కులాలకు మేలు చేకూరుతుందని బైలు కమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ సూర్యవంశీ, రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షుడు మోహన్ చవాన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తమ కులాలకు న్యాయం చేశారని కొనియాడారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచార జాతుల సంక్షేమం, గుర్తింపు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ ఏ గ్రూపులో ఉన్న 49 కులాలు, బీసీ ఈ గ్రూపులో ఉన్న 2 కులాలను కలిపి మొత్తం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంచార జాతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బైలు కమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ సలోంకి, శివాజీ, కృష్ణ, భీమయ్య, కొడంగల్ బైలు కమ్మర సంఘం అధ్యక్షుడు ఆనంద్ పవార్, జనరల్ సెక్రటరి శివాజీ, విజయ్, సంజు, బాబు చవాన్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలును తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మండలంలోని రాయపోల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి కోతలు పూర్తికావస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలును ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం ఉండటంతో వర్షాలు పడితే రైతులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సివస్తోందన్నారు. కిరాయికి పట్టాలు తెచ్చుకొని ధాన్యం ఆరబోసుకుంటున్నారని.. ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇవ్వాలన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు నాలుగైదు కిలోల తరుగు తీస్తున్నారని.. ఇది రైతులను దోచుకోవడమేనని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇటీవల వడదెబ్బకు గురై మృతి చెందిన రైతు గౌరయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రటించాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యుడు సామెల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రామంచందర్, సీహెచ్ బుగ్గరాములు, పి.జగన్, సీహెచ్ జంగయ్య, ఎ.నర్సింహ, సీహెచ్ ముసలయ్య, భిక్షపతి, యాదగిరి, నర్సింహ, అశోక్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
రుణాలు చెల్లించరే!
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో దీర్ఘకాలిక రుణాలు పొంది, తిరిగి చెల్లించని వారి ఆస్తుల జప్తునకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధమవుతోంది. యాచారం పీఏసీఎస్లో 1,500 మంది రైతులకు పైగా తమ పట్టాదారు, పాసుపుస్తకాలను మార్టిగేజ్ చేసి రూ.50 కోట్లకు పైగా లాంగ్టర్మ్ లోన్లు పొందారు. వీరంతా పౌల్ట్రీ, డెయిరీఫాం, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టారు. తీసుకున్న రుణాలను ఏటా మార్చి 30లోపు వాయిదాలతో కూడిన రుణం, వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 550 మందికి పైగా రైతులు ఏటా సక్రమంగా వాయిదాలు చెల్లిస్తూ పీఏసీఎస్కు సహకరిస్తున్నారు. మిగిలిన వారు మొండికేశారు. దీంతో అధికారులు వీరి ఇళ్లు, వ్యవసాయ బావుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హెచ్డీసీసీ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పీఏసీఎస్ అధికారులు పలుమార్లు రైతులను కలిసి బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు చేసినా మార్పు రావడం లేదు. లీగల్ నోటీసులు అందజేత యాచారం పీఏసీఎస్లో గత మూడేళ్లుగా 932 మంది రైతులు సక్రమంగా వాయిదాలు చెల్లించడం లేదు. వీరికి లీగల్ నోటీసులు పంపినా ఫలితం లేకుండాపోతోంది. దీంతో రుణాల కోసం తాకట్టు పెట్టిన పొలాల జప్తునకు అధికారులు రెడీ అయ్యారు. ఈనెల 15న ఉదయం 11 గంటలకు యాచారం పీఏసీఎస్లో అసలు, వడ్డీతో కలిపి అప్పులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్డీసీసీ జాయింట్ రిజిస్ట్రార్ మనోజ్కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో ఈ నెల 30 లోపు తీసుకున్న అప్పు మొత్తంతో పాటు అపరాధ రుసం కలిపి, ఆస్తులు జప్తు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. చింతపట్ల, నల్లవెల్లి, మంతన్గౌరెల్లి, తమ్మలోనిగూడ, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, మంతన్గౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నస్దిక్సింగారం తదితర గ్రామాల్లో మొండి బకాయిలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించినా స్పందన లేదన్నారు. కొత్త వారికి అందని రుణాలు దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యాచారం పీఏసీఎస్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. వసూళ్ల సేకరణలో అప్పటి పాలకవర్గంతో పాటు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించింది. దీంతో మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్కు రూపాయి కూడా కేటాయించలేదు. ఇదిలా ఉండగా, వివిధ గ్రామాలకు చెందిన సుమారు వంద మందికి పైగా రైతులు లాంగ్టర్మ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రుణాలు అందకపోవడంతో చాలా మంది తమ అప్లికేషన్లను వెనక్కి తీసుకుని, కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. మూడేళ్లుగా రుణాల వసూలు పరిస్థితి ఏడాది టార్గెట్ వసూలైంది బకాయి 2023– 24 రూ.26 కోట్లు రూ.10 కోట్లు రూ.16 కోట్లు 2024– 25 రూ.34 కోట్లు రూ.13 కోట్లు రూ. 21 కోట్లు 2025– 26 రూ.32 కోట్లు రూ.12 కోట్లు రూ.20 కోట్లు మొండి బకాయిలతో పీఏసీఎస్కు అవస్థలు ఈనెల 15లోపు చెల్లించాలని నోటీసులు రైతులు స్పందించాలని సూచన లేదంటే ఆస్తులు జప్తుచేస్తామని హెచ్చరిక -
తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు
జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్రావు తాండూరు: తప్పులకు ఆస్కారం లేకుండా జనగణన నిర్వహించాలని జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్రావు సూచించారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్యుమరేటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన పక్కాగా నిర్వహించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జంగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదర్రెడ్డి, మేనేజర్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ఎల్ఆర్ఎస్
ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు పరిగి మండలంలో అనుమతులు లేకుండా చేసిన వెంచర్వికారాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు అందించింది. 2024లో అప్పటి ప్రభుత్వం మొదటిసారి ప్లాట్ల రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం లభించింది. 20 నెలలుగా అనేక మార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో రెండు నెలలు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డీటీసీపీ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తూ వచ్చారు. రియల్టర్లు కొనుగోలుదారుల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్లాట్లు విక్రయిస్తూ వెళ్లారు. 2020లో అప్పటి ప్రభుత్వం టీఎస్ బీపాస్ నిబంధన అమలులోకి తెచ్చింది. అనుమతిలేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు షాక్కు గురయ్యారు. ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్లాట్లు, వెంచర్లకు అనుమతులు తప్పనిసరి చేశారు. దీంతో విధిగా క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆరేళ్ల క్రితం అప్పటి సర్కారు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించింది. తదనంతర ప్రక్రియను విస్మరించింది. అనుమతులు లేనివే అధికం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని లే అవుట్లే అధికంగా ఉన్నాయి. దాదాపు 550 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కనీస రుసుం చెల్లించి ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆరేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపి వేసింది. దీంతో నాలుగు నెలల పాటు వ్యవసాయేతర భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 20,968, గ్రామ పంచాయతీల్లో 12,745 దర ఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్నింటిని క్రమబద్ధీకరించగా మెజార్టీ అర్జీలు పెండింగ్లోనే ఉన్నాయి. మరో రెండు నెలలు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం 25శాతం రాయితీ కూడా.. నాలుగు మున్సిపాలిటీల్లో 20,968 దరఖాస్తులు గ్రామ పంచాయతీల్లో 12,745 అర్జీలు పరిశీలనకు త్రిసభ్య కమిటీలుతరచూ గడువు పొడిగింపుతో.. అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువును తరచూ పొడిగిస్తుండటంతో ఎవరూ ముందుకు రావడంలేదు. తాజాగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు 25 శాతం ఫీజు రాయితీ కూడా ప్రకటించింది. గతంలో రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోగా.. మరి కొందరు రూ.10వేలు చెల్లించి అర్జీ పెట్టుకున్నారు. ఇందులో రూ.1,000 చెల్లించిన వారికి ప్రభుత్వం అవకాశం ఇవ్వగా రూ.10 వేలు చెల్లించిన వారు ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మూడు శాఖల అధికారులతో త్రిసభ్య కమిటీలు వేశారు. -
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం
దుద్యాల్: ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన లాభాలు పొందవచ్చని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ అన్నారు. మంగళవారం మండలంలోని హస్నాబాద్ రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. కొడంగల్లో నియోజకవర్గంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి సురేందర్ నాథ్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వం సబ్సిడీ అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, దుద్యాల్, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల వ్యవసాయ అధికారులు నాగరాజు, శ్రీలత, లావణ్య, హార్టీకల్చర్ విస్తరణ అధికారి బాబ్యానాయక్, ఇకో పామ్ ఫీల్డ్ సిబ్బంది మల్లికార్జున్, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. ఏడీఏ శంకర్ రాఽథోడ్ -
ఇసుక డంప్ సీజ్
బషీరాబాద్: మండలంలోని జీవన్గీ గ్రామ శివారు కాగ్నానది ఒడ్డున నిల్వ చేసిన భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. నదీ పరీవాహక గ్రామాలైనా క్యాద్గీరా, జెట్టూరు గ్రామాల సర్పంచులు జైపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, రైతులు సూర్య ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున్, బల్రామ్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఇసుక డంపు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన జీపీఓలు అస్లాం, మధు, రికార్డు అసిస్టెంట్ మున్నెప్ప అక్కడికి చేరుకొని 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. ఈ ఇసుక మహబూబ్నగర్కు చెందిన ఓ మాజీ ఎంపీకి చెందినదిగా రైతులు ఫిర్యాదు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోశాల నిర్మాణం కోసం ఇసుక డంపు చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. షాద్నగర్: వృద్ధుల సేవాశ్రమం నిర్వహిస్తూ 25 ఏళ్లుగా సేవలందిస్తున్న పట్టణానికి చెందిన రంగారెడ్డి దాసరి నారాయణరావు సేవారత్న అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పలువురికి నిర్వాహకులు దాసరి నారాయణ రావు సేవారత్న అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో 25 ఏళ్లుగా నవోదయ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు సేవ చేస్తున్న రంగారెడ్డి సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ డైరక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కందుకూరు: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తున్న మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అండేకార్ నాగరత్నం రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం అందుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేలా తర్ఫీదు ఇవ్వడం, తన సొంత పిల్లలను కూడా అదే పాఠశాలల చదివించి ఆదర్శంగా నిలవడం, కోర్టులు, ఇతర ప్రభుత్వ శాఖల పని తీరును తెలుసుకునేలా విద్యార్థులను నేరుగా తీసుకెళ్లడం లాంటి చేస్తుండడంతో ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ.నవీన్ నికోలస్ ఆయనను సన్మానించి ప్రశంసా పత్రం అందించారు. కందుకూరు: సిటిజన్ విజిలెన్స్, మానిటరింగ్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో మంగళవారం దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజాసంఘాలు, మేధావులు, విలేకరులు, న్యాయవాదులు, డీవీఎంసీ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా బోడ కృష్ణ, కో కన్వీనర్గా జోగు రమేష్, సభ్యులుగా దివ్యశ్రీ, కంబాలపల్లి సంతోష, దరువుల శంకర్, మిన్నాల డేవిడ్, మమత, రఘు, రాములు, యాచారం మండల కన్వీనర్గా బడే భాగ్యమ్మను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు గండు నరసింహ, హైకోర్టు అడ్వకేట్ దివ్యశ్రీ, అంబేడ్కర్ జాతర ఫౌండర్ జి.సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు నరసింహ, శేఖర్, యాదయ్య, భగవంతు, బాలమణి, కుమార్, సంతోష్, తాండ్ర యాదయ్య, గోరేటి జగన్ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ గోదాంలో మంటలు
పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న బిస్కట్ కంపెనీకి అలుముకున్న సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గాలిబ్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ప్లాస్టిక్ కవర్ల స్క్రాప్ గోదాములో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఆ మంటలు దానిని ఆనుకొని ఉన్న అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్ (బిస్కట్ మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్)కు అంటుకొని అందులోని ముడిసరుకు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మూడు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బేకరీ యజమాని సయ్యద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బలవంతపు భూ సేకరణ వద్దు
పరిగి: పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవడం దారుణమని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో రైతులు 43 రోజులుగా చేస్తున్న దీక్షకు మంగళవారం మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పంట పొలాలను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రియల్ దందా చేయడం తప్పా కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పులే చేసిందని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బాధిత రైతులకు సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేల ఎకరాల పోడు భూములు ఉన్నాయని.. వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పీర్ మహ్మద్, వెంకటేశ్, విజయలక్ష్మి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. పంట పొలాల్లోపరిశ్రమల ఏర్పాటు దారుణం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ -
ఆశ్రమం.. ఆదర్శం
‘పది’ ఫలితాల్లో సత్తా చాటుతున్న ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులుబొంరాస్పేట: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను తన ఖాతాలో వేసుకుంటున్నాయి. చౌడాపూర్ మండలం కొత్తపల్లిలో, మర్పల్లిలో ఆశ్రమ పాఠశాలలు.. బొంరాస్పేట మండలం బొట్లోనితండా, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల, రాంపూర్లో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. కుల్కచర్ల, తాండూరు పట్టణాల్లో ఎస్సీ బాలికల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో అనాథ పిల్లలు, చదువు మానేసిన చిన్నారులు, వలస కుటుంబాలకు చెందిన పిల్లలు, నిరుపేదల పిల్లలు చదువుకుంటున్నారు. ఏటా 3 నుంచి 10వ తరగతి వరకు 450 మంది విద్యనభ్యసిస్తున్నారు. మన జిల్లాతోపాటు, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకొంటున్నారు. ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకున్న సుమారు పాతిక మందికిపైగా మంచి కొలువుల్లో స్థిరపడ్డారు. అలాంటి వారిలో కొందరు.. వైద్య విద్య చేస్తూ.. మండలంలోని ఊరెనికి తండాకు చెందిన రుక్కీబాయి, మోహన్నాయక్ దంపతుల కూతురు కోమల్. బొంరాస్పేట మండలం బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (2018–19) పదో తరగతిలో 9.7 గ్రేడ్తో మండల టాపర్గా నిలిచింది. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేసి ఎంబీబీఎస్లో ఉచిత సీటు సాధించింది. ప్రస్తుతం వికారాబాద్ మహవీర్ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా.. బొట్లోనితండాకు చెందిన రాథోడ్ కమల (2017–18) పదో తరగతిలో మంచి మార్కులు సాధించింది. పట్టుదలతో పైచదువులు పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీయర్ పని చేస్తోంది. తండ్రి హర్యానాయక్ ఆటో డ్రైవర్. ఏఎన్ఎంగా.. బిచ్చాల్తండాకు చెందిన అనూష(2017–18)పదో తరగతి వరకు చదివింది. పాఠశాలలో మెరుగైనా మార్కులు సాధించింది. మధ్యలో చదువు మానేయకుండా ఏఎన్ఎం చేసి తిరిగి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తోంది. సర్పంచ్గా గెలిచి.. మండల పరిధిలోని బాపల్లితండాకు చెందిన కోమల్(2017–18) ఇదే ఆశ్రమ పాఠశాలలో చదివి బీటెక్ పూర్తి చేసింది. తల్లి లక్ష్మి అంగన్వాడీ కార్యకర్త. విద్యావంతురాలైన కోమల్ కోస్గిలో జరిగిన సీఎం సభలో రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేసి అందరి మన్ననలు పొందింది. పదికి పది కొడంగల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మి ముదిరాజ్(2021–22) పదో తరగతిలో 10/10 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. ప్రస్తుతం మహబూబ్నగర్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. ఉన్నతంగా జీవించాలని.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం సెగిరెడ్డిఘనపూర్కు చెందిన పద్మ(2022–23) పదో తరగతిలో 9.5 మార్కులు సాధించింది. ప్రస్తుతం బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉద్యోగంతో ఉన్నతంగా జీవించాలనే పట్టుదలతో ఉన్నానని పద్మ చెబుతోంది. ప్రస్తుతం ఐఐటీ కోచింగ్ తీసుకుంటోంది. మండల టాపర్గా.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం, దాచకపల్లికి చెందిన చెంచుబిడ్డ స్రవంతి (2023–24) పదో తరగతిలో 9.3 గ్రేడ్ సాధించి మండల టాపర్గా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది. దాతలు సహకారం అందితే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. పెళ్లి తిరస్కరించి.. యాలాల మండలం ముద్దాయిపేట తండాకు చెందిన లక్ష్మి (2024–25) పదో తరగతిలో 535 మార్కులతో మండల రెండో స్థానంలో నిలిచింది. నాన్న దుబాయిలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధం తిరస్కరించి ఇంటర్మిడియెట్ చదువుతోంది. మండలంలో రెండో స్థానం.. మండల పరిధిలోని సీత్యానాయక్ తండాకు చెందిన నందిని (2025–26) పదో తరగతిలో 529 మార్కులు సాధించింది. మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచి ఆశ్రమ పాఠశాల పేరు నిలబెట్టింది. గురుకులాల్లోని సీఓఈ కళాశాలకు వెళాల్లని ఎదురుచూస్తోంది. తల్లి కష్టం తెలిసి.. ప్రశాంతి నాన్న హోంగార్డుగా పని చేస్తూ పదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తాను చదువుతున్న ఆశ్రమ పాఠశాలలో తల్లి మణెమ్మ వంట మనిషిగా చేస్తోంది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 527 మార్కులతో ఆశ్రమ పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఇలా అనేక మంది పేద విద్యార్థినులు ఆశ్రమ పాఠశాలల్లో చదివి ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకున్నారు. మండల టాపర్లుగా నిలుస్తున్న గిరిజన బిడ్డలు కన్నవారి కలలను సాకారం చేస్తున్న బాలికలు ఎంబీబీఎస్, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో రాణిస్తున్న వైనంలక్ష్యం నెరవేరుతోంది జిల్లాలోని బొట్లోనితండా బాలికల ఆశ్రమ పాఠశాల పదో తరగతి ఫలితాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. చదువుకు దూరమైన సంచార, గిరిజన విద్యార్థులను వృద్ధిలోకి తీసుకరావాలన్నదే గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యం. ఆ కళ నేడు సాకారమవుతోంది. ఉపాధ్యాయులు చక్కగా బోధన చేయడం కలిసివస్తోంది. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. – కమలాకర్రెడ్డి, డీటీడీఓ, వికారాబాద్ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు చక్కటి వేదికలవుతున్నాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలు. వీటిలో చదువుతున్న చెంచు, లంబాడా, ఎరుకల తెగకు చెందిన విద్యార్థినులు ఏటా మండల టాపర్లుగా సత్తా చాటుతున్నారు. గతంలో ఉత్తీర్ణులైన పలువురు పై చదువులు పూర్తి చేసి ప్రస్తుతం ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారు -
8న ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
● వైఖానస శాస్త్రోక్తంగా పనులు ● హాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డి● పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఎండోమెంట్ కమిషనర్ హన్మంత్ రావ్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్తరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దైవిక కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. రూ.110 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం శ్రీవారి ఆలయాన్ని రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పనులు చేపడుతున్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలకు పాటిస్తూ రెండేళ్లలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు, ఆలయ నిర్మాణ స్తపతులు, ఆలయ నిర్మాణ శిల్పులు భవిష్యత్ ఆలయానికి రూపకల్పన చేశారు. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ గుప్త, ఈఓ రాజేందర్రెడ్డి, ఎండోమెంట్, ఆర్అండ్బీ, ట్రాన్స్కో, హౌసింగ్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బాధ్యతగా పని చేద్దాం
అనంతగిరి: ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిషారంలో అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీఎస్సీడీఓ జైపాల్ రెడ్డి, డీబీసీడీఓ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సమాయత్తం కండి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరం నుంచి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 129 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరం మేరకు గోనె సంచులను సరఫరా చేయాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మురళీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీసీఓ నాగార్జున, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకట్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలి
పరిగి: వర్షాకాలానికి ముందే చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో ఆయా మండలాల నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రవికుమార్, ఈఈ రేణుక, డీఈఈలు పార్థసారథి, కృష్ణారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు. అభివృద్ధి చూసే చేరికలు పూడూరు: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీలకు చెందిన పలువురు హస్తం పార్టీలో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చన్గోముల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు అజిమొద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజిమొద్దీన్ మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ రామస్వామి, నాయకులు శ్రీనివాస్ గుప్తా, తిర్మల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
సేంద్రియ పద్ధతిలో సాగు మేలు
మంచాల: వ్యవసాయ పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటల సాగు విషయంలో నూతన పద్ధతులు అవలంబించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని నేలలో పోషకాల లోపాలను గుర్తించాలని, తదనుగుణంగా ఎరువులు వాడాలన్నారు. లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పచ్చి రొట్ట ఎరువులు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుజాత, ఏఓ వెంకటేశ్, సర్పంచ్ మానస వినయ్, వ్యవసాయాధికారులు వనజాత, హరినాథ్, నవీన, లింగస్వామి, నిఖిత, సాయిసిరి, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి ఉష -
ఉపాధి కూలీలకు అందని వేతనాలు
షాద్నగర్: ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్ ఆరోపించారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశాన్ని శ్రీనునాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఫిబ్రవరి నుంచి నేటి వరకు వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా కూలీలకు ప్రతి వారం పేస్లిప్పులు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం య థావిధిగా కొనసాగించాలని, కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కూలీలకు వేతనాలు, పని దినాలు పెంచాలన్నారు. అదేవిధంగా పని ప్రదేశంలో రోజుకు రెండు పూటలా ఫొటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. -
పరిగి సీఐగా కొండల్రెడ్డి
పరిగి: పరిగి సీఐగా కొండల్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డి మల్టీజోన్ –2 ప్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయానికి బదిలీ అయినట్టు అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా సాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కొండల్రెడ్డిని పరిగి సీఐగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. పరిగి: మండలంలోని జాఫర్పల్లి మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ అంజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 7వ తేదీ లోపు మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేయాలన్నారు. కోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కమిషనర్ వికారాబాద్: పీఏసీఎస్ చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఫిబ్రవరి 15తో పీఏసీఎస్ పాలక మండళ్ల పదవీ కాలం పూర్తయ్యింది. ఆరు నెలల పాటు పొడిగించిన ప్రభుత్వం ఆ తర్వాత సహకార సంఘాలను రద్దు చేసింది. జిల్లాలో మొత్తం 19 సహకార సంఘాలు ఉండగా ఇందులో మెజార్టీ చైర్మన్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో వారిని కొనసాగించటం ఇష్టం లేని ప్రభుత్వం వారి పదవీ కాలం పూర్తవగానే అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల నియామకం చట్ట విరుద్దమంటూ గత పాలక మండళ్లు కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలు నిర్వహించే వరకు గత పాలక మండళ్లనే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు గత ఫిబ్రవరి 14వ, తేదీ వరకు ఉన్న కమిటీలను కొనసాగించాలని తాజాగా వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూడూరు: రైతులు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా ఎరువులు వాడాలని భారతీయ నూనె గింజల ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ జవహర్లాల్ సూచించారు. సోమవారం మండలంలోని మంచన్పల్లి రైతు వేదికలో సమతూల్య ఎరువుల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేందర్, శాస్త్రవేత్తలు ఉషాకిరణ, రమ్య, చంద్రిక, ఏఓ ప్రభాకర్, ఏఈఓ మహిపాల్, తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ జాతరకు రావాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి, ఈఓ శేఖర్గౌడ్ కోరారు. సోమవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 15న జరిగే రథోత్సవం, సిడె కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. మీర్పేట: మేడే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జంగయ్య పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లెలగూడ వార్డు కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో పనిగంటల భారం పడడంతో పాటు స్వేచ్ఛ లేకుండా చేసిందని ఆరోపించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం
అనంతగిరి: కాంగ్రెస్తోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కళను కాంగ్రెస్ నిజం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని వాగ్దానాలను నెరవేరుస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి అత్యధిక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ సుధాకర్రెడ్డి, నాయకులు రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో జొన్న కొనుగోలు కేంద్రం ధారూరు: మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం గట్టెపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దోర్నాల్, గురుదోట్ల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ భాస్కర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, డీసీసీ కార్యదర్శి మహ్మద్ బాబాఖాన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, ధారూరు, హరిదాస్పల్లి పీఏసీఎస్ల సీఈఓలు నర్సింహులు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
విషాదం నింపిన ప్రమాదం
● శుభకార్యానికి వెళ్లి వస్తుండగాఇద్దరు యువ ఫొటో గ్రాఫర్ల దుర్మరణం ● శోకసంద్రంలో మృతుల కుటుంబాలు మంచాల: పొట్టకూటి కోసం ఇంటి నుంచి బయలు దేరిన ఫొటోగ్రాఫర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదం నింపారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల కుటుంబాలు. ఇప్పుడిప్పడే యువకులు చేతికి వచ్చి కుటుంబానికి ఆసరా ఉంటున్నారు. రోడ్డు ప్రమాదం వారి ఇళ్లలో చీకట్లు నింపింది. ఆదివారం సిద్దిపేటలోని శివం గార్డెన్లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్ రింగ్రోడ్డు వద్ద కారు అదుపుతప్పడంతో మండల పరిధిలోని తిప్పాయిగూడకు చెందిన గ్యార గౌతమ్(21), ఆగాపల్లికి చెందిన అన్నారం అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శోకసంద్రంలో తిప్పాయిగూడ తిప్పాయిగూడకు చెందిన గ్యార పెంటయ్య–మనోహర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గౌతమ్ ఇప్పుడిప్పుడే పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే దేవుడు తీసుకెళ్లాడంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఆగాపల్లికి చెందిన అన్నారం సంతోష–శేఖర్ దంపతులకు ఒక్కగాను ఒక్క కొడుకుడు అఖిల్(23) కొన్ని రోజులుగా ఫొటోగ్రాఫర్ వృత్తిలో పని చేస్తున్నాడు. పనికి వెళ్లిన కొడుకు శవమై తిరిగిరావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు మేము ఎవరి కోసం బతకాలని రోదిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే అఖిల్ మృతితో ఆగాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆగాపల్లికి చెందిన అనిరుద్ ప్రస్తుతం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పంట భూముల జోలికి రావద్దు
● రైతు వారోత్సవాల్లో కర్షకుల ఆందోళన ● ప్రభుత్వ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని డిమాండ్ మొయినాబాద్ రూరల్: కూరగాయలు, పూల మార్కెట్ నిర్మిస్తామంటూ తమ భూముల జోలికి రావొద్దని అజీజ్నగర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సోనియాదర్శన్, కమిషనర్ ఖాజామొహియుద్దీన్, మండల వ్యవసాయ, అభివృద్ధి అధికారులకు విన్నవించారు. సర్వే నంబర్లు 151, 176లోని భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాపోయారు. ఈనిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చనివెల్లి అమరేందర్రెడ్డి, చాకలి యాదగిరి, మాణిక్యం, శంకరయ్య, రైతులు మాడి రాంచంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి, రాంభూపాల్, నరేందర్యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘కూలీ’ల డబ్బులు చెల్లించండి
బంట్వారం: ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న 14 వారాల కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బంట్వారం మండలం తొర్మామిడి, బస్వాపూర్ గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలలో మాట్లాడారు. పని ప్రదేశంలో కూలీలకు టెంట్లు వేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. దినసరి కూలీ రూ.307 నుంచి రూ.600కు పెంచడంతో పాటు 200 రోజులు కల్పించాలని కోరారు. ప్రమాద బీమా కల్పించాలని, అడిగిన వెంటనే కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. రోజుకు రెండు సార్లు ఫొటోలు తీయడం వలన 4 గంటల సమయం వృథా అవుతుందని, పాత పద్ధతినే కొనసాగించాలని సూచించారు. రైతు కూలీల వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు, సీపీఎం కార్యకర్తలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
షాద్నగర్రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆర్డీఓ ఆర్ఎన్ సరిత అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లాల్సివచ్చేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాల్లోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. డివిజన్ స్థాయిలోని అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ డీఈ సురేష్, ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారంకోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖల ద్వారా తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో హౌసింగ్ శాఖకు సంబంధించి 4, పెన్షన్ కోసం 1, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకోసం 2 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్నిశాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు ఇబ్రహీంపట్నం: డివిజన్ స్థాయి ప్రజావాణిని సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి నిర్వహించారు. రాష్ట్ర ప్రజావాణి కో–ఆర్డినేటర్ రాకేష్రెడ్డి సందర్శించి పిటిషనర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరిచి, ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూ భారతికి సంబంధించి 27, ఇందిరమ్మ ఇళ్లకు 4, ఇనామ్ భూములకు 4, సదాబైనామ 3, విద్యుత్ శాఖకు సంబంధించి 3 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో అనంతరెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ డీఈఈ నరేష్కుమార్, డీఎల్పీఓ సాధన, సీడీపీఓ వినీత, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
షాబాద్: 108 వాహనంలో ఓ తల్లి ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. షాబాద్ 108 సిబ్బంది రాజేశ్, భూపాల్ సెల్పులు తెలిపిన ప్రకారం బిహార్కు చెందిన ఓ జంట ఎలికట్ట గ్రామంలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కుమారికి మధ్యాహ్నం పురిటి నొప్పులురావడంతో ఆమె భర్త 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో ఆమెను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
వైద్యరంగానికి ప్రాధ్యానత ఇవ్వాలి
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్మోహన్రెడ్డి, కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రమేశ్రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యకళాశాల విద్యార్థులె శ్రీట్రోయ్ జియాంజ్శ్రీ పేరుతో గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు. వేడుకలను శాసనమండలి చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ వరదారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యవృత్తి చెప్పటిన విద్యార్థులు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యంలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి నిరంతర పరిశోధకుడిగా ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కష్టాన్ని మరిచిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాల్ జోయారాణి, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ గౌరి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది చరిత్రాత్మక గెలుపు
● సంక్షేమ పథకాలే పార్టీకి అండ ● బీజేపీ నాయకులు ● కమలనాథుల విజయోత్సవంఅనంతగిరి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని, ఇదీ ప్రజాస్వామ్య విజయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాధవరెడ్డి, శివరాజు అన్నారు. సోమవారం వికారాబాద్లో బాణసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. దేశంలో మోదీ గాలి వీస్తుందన్నారు.కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలే పార్టీకి అండగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్చార్జీ శ్రీధర్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్యాదవ్, ముఖ్య నాయకులు నందు, నరోత్తంరెడ్డి, యాస్కి మల్లికార్జున్, సాయిచరణ్రెడ్డి శ్రీనివాస్గౌడ్, రాములు, రమేష్ పాల్గొన్నారు. మోదీకి బ్రహ్మరథం కుల్కచర్ల: దేశం మొత్తం ప్రధాని మోదీ నాయకత్వం కోరుకుంటుందని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. అందుకు నిదర్శనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టమేనని పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అవినీతి, మతమార్పిడి, హిందువులపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు కేంద్రంగా మారిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోని రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీమండల అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు అంజిలయ్య, మైపాల్, సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, శంకర్, హన్మంతు, రాంచంద్రయ్య పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం మర్పల్లి: ఇటీవల నిర్వహించిన 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించిందని పార్టీ మండల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కమలనాథులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. బాణసంచాలు కాల్చారు. మిఠాయి పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్కుమార్, జిల్లా నాయకులు లక్ష్మణ్, బలరాంగౌడ్, నాగయ్య, మండల నాయకులు శివకుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
నవాబుపేట: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఎక్ మామిడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవాబ్పేట్ పసుల రాజు తన రెండు ఎడ్లతో పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. ఊరు చివరన ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఓ ఎద్దు తగలి.. విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఎద్దు విలువ రూ.లక్ష వరకు ఉంటుందని, ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వలనే నష్టపోయాయని రైతు పేర్కొన్నాడు. ట్రాన్స్ఫార్మర్కు కంచె ఉంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదని వాపోయారు. అధికారులు స్పందించి, తగిన న్యాయం చేయాలని కోరాడు. కడ్తాల్: న్యామతాపూర్లోని ఓ వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడు నల్లవోతుల లక్ష్మయ్య (30) గ్రామంలోని మద్దూరు రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న శనివారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఊరి శివారులోని ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించడంతో బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 40 అడుగుల లోతున్న బావిలో నుంచి శవాన్ని తీసేందుకు పోలీసులకు సహకరించిన స్థానికులు తానేషా, రాములును పీఎస్కు పిలిపించి సన్మానించడంతో పాటు నగదు అందించారు. ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ ఉన్నారు. హత్య కేసులో నిందితుల రిమాండ్ కొందుర్గు: హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విజయ్ కథనం ప్రకారం.. జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన కడమూరి పోచమ్మ (70)ని ఆస్తికోసం కన్న కొడుకు భీమయ్య, కోడలు పద్మమ్మ కలిసి హ్యతచేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. శంకర్పల్లి: పట్టణానికి చెందిన ఓ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు సోమవారం నిర్వహించిన తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
చైర్మన్గా బాధ్యతల స్వీకరణ
పూడూరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లను పొడిగించడంతో పూడూరు పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల సతీష్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మరోమారు రైతులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. మీర్పేట: హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్ను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మీర్పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 1వ తేదీన రాత్రి గాయత్రీ నగర్ వద్ద మీర్పేటకు చెందిన తండ్రీకొడులు జిలానీ, ఫైజల్ బైక్ వెళ్తున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కారు డ్రైవర్ నీలకంఠం సత్యనారాయణ బైక్కు సైడ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకంఉది. ఈ క్రమంలో సత్యనారాయణ కారులో కూర్చుని ఫైజల్ను తోసేయడంతో డివైడర్పై పడి గాయపడ్డాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించగా జిలానీ బైక్ను కారుకు అడ్డుగా పెట్టాడు. ఆయన్ను ఢీకొట్టడంతో బానైట్పై పడ్డాడు. కారు ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను రిమాండ్కు తరలించారు. మొయినాబాద్: బంధువుల రిసెప్షన్కు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని అజీజ్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన డప్పు చంద్రయ్య కుటుంబం ఆదివారం రాత్రి బంధువుల రిసెప్షన్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రయ్య నిద్ర లేచి చూడగా కూతురు చందన(19) కనిపించలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


