breaking news
Vikarabad
-
ఆప్యాయతల ‘రక్షాబంధన్’
సోదరి కష్టసుఖాల్లో అనుక్షణం తోడుగా ఉండేందుకు సోదరులకు కట్టే రక్షాబంధన్ పర్వదినం రానే వచ్చేసింది. అనురాగం, ఆప్యాయతల మేళవింపులో జరుపుకొనే అపూర్వ వేదికకు ప్రతి తోబుట్టువు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. షాబాద్: అక్కాచెల్లెళ్లు.. అన్నాదమ్ములకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకుంటారు.. ఏటా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొంటారు.. విదేశాల్లో ఉన్న వారు కూడా రక్షాబంధన్కు ఇక్కడికి వచ్చి అన్నాదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపిస్తారు. శనివారం జరుపుకొనే రాఖీ పండుగకు ఆడపడుచులు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత అనుబంధం, అనురాగం, ఆప్యాయత తోబుట్టువుల మధ్య ఉంటుంది. ఇంటి ఆడపడుచుల సుఖాసంతోషాలే తమ సంతోషంగా భావిస్తారు. సోదరులు ఇంతటి విశిష్టమైన అనుబంధానికి ప్రతీకగా, సోదరుల క్షేమం కోరుతూ ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ నిర్వహిస్తారు. మొదలైన సందడి అనుబంధాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే హిందూ సంస్కృతిలో రక్షాబంధన్కు విశిష్టమైన స్థానం ఉంది. సోదరి, సోదరుల అనురాగానికి చిహ్నంగా ఈ వేడుక జరుపుకొంటారు. ఇళ్లల్లోనే కాకుండా ఆలయాల్లో, సామూహిక వేదికల వద్ద ఈ పర్వదినాన్ని ఆనందోత్సహాల నడుమ నిర్వహించుకోనున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అంతా రాఖీ బంధన్ వేడుకను నిర్వహించేందుకు నాలుగు రోజుల ముందు నుంచే ఆడపడుచులు ఉత్సాహంగా రాఖీలు కోనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీక్ష సంకల్పమే రక్ష ఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యాన్ని గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు తదితర కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరి. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. ఆనాటి నుంచి ఆనవాయితీగా ఈ ఆచారం వస్తోంది. జోరుగా రాఖీల విక్రయాలు అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ దగ్గర పడుతుండడంతో మండలంలో రాఖీల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు డిజైన్లల్లో రాఖీలు అందుబాటులో ఉంచారు. వివిధ రకాల డిజైన్ రాఖీలు కోనుగోలుకు సిద్ధంగా పూసల రాఖీలు ప్రకృతి మెచ్చిన ‘వృక్షాబంధన్’ కడ్తాల్: ప్రకృతికి మానవాళి రక్షణగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వినూత్నంగా గత 12 ఏళ్లుగా విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ నిర్వహిస్తోంది. ప్రకృతికి మానవాళికి మధ్య సైతం అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో వృక్షాబంధన్ కార్యక్రమం ఏటా దిగ్విజయంగా కొనసాగుతుంది. పిల్లలు, యువకులు, గ్రామస్తులు, విద్యార్థులు అందరి ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష... మనమంతా భూమాతకు రక్ష’ అనే గొప్ప సంకల్పంతో వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆవు పేడతో రాఖీలు తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలాంటి హాని కలుగచేయని వస్తువులను వినియోగించాలని ప్రకృతి ప్రేమికులు పదే పదే చెబుతుంటారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి ఆవు పేడ, మూత్రంతో ఏకంగా రాఖీలను తయారు చేశారు. పర్యావరణాన్ని రక్షించుటతో హిందూ సంప్రదాయ పండగలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తాయనేది సహజసిద్ధంగా తయారు చేసిన రాఖీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాండూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఏటా పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన రాఖీలను సోదరులకు కట్టాలని ఆమె చెబుతున్నారు. ఈ రాఖీలు తిరిగి భూమిలోకి చేరి మట్టి సారవంతాన్ని పెంపొందిస్తాయంటున్నారు. పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణా చారి అనే వ్యవసాయ విద్య అభ్యసించిన ఓ యువకుడు దీర్ఘాయుష్షు అనే సంస్థను నెలకొల్పి ఆవుపేడ, మూత్రంతో రాఖీలను తయారు చేసి, పర్యావరణ పరిరక్షణపై తన వంతు బాధ్యతను బహిర్గతం చేస్తున్నారు. ఇలాంటి రాఖీలు మార్కెట్లో విక్రయానికి సైతం పెట్టడం విశేషం. -
మనువాదాన్ని వ్యతిరేకించాలి
కందుకూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మైనార్టీ వర్గాలపై దాడులకు తెగబడుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి మండలాలకు సంబంధించిన ప్రజాసంఘాలతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత టీచర్లతో అయ్యప్ప మాల వేసిన విద్యార్థి కాళ్లు మొక్కించి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గుడుల్లో దళితులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ప్రవేశిస్తే ఆలయాలను శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలో మోదీ, అమిత్షా పాలనతోనే జరుగుతుందని విమర్శించారు. మతోన్మాదానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలందరిని చైతన్య పరచడానికి ఈ నెల 13న ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ హాజరవుతున్నారన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్, కేవీపీఎస్ మండలాల కన్వీనర్లు ఏర్పుల శేఖర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం వికారాబాద్లోని సంగం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యా బోధన ఎలా చెబుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని వాడాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ -
42శాతం రిజర్వేషన్ల సాధనకు పోరు
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య దుద్యాల్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన రెండు రోజుల ధర్నా కార్యక్రమానికి కొడంగల్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గురువారం ఫోన్లో సాక్షితో మాట్లాడారు. రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు శ్రీకాంత్గౌడ్తో కలిసి రాష్ట్రపతి భవన్ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడంగల్ తాలూకా బీసీ సంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్యాదవ్, బీసీ సంఘం నాయకులు యాదగిరి, సత్యపాల్, కృష్ణ, మన్సూర్, రాజు, కాశి యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత దుద్యాల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన రెబ్బని శ్రీకాంత్ తన ట్రాక్టర్తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. దుద్యాల్ మీదుగా హకీంపేట్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మీసేవ నిర్వాహకులపై ఫిర్యాదు ధారూరు: మండల కేంద్రంలోని మీసేవ నిర్వాహకులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ బాధితుడు గురువారం తహసీల్దార్ సాజిదాబేగంకు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేయడానికి వెళితే రూ.45కు బదులు రూ.60 తీసుకుంటున్నారని దోర్నాల్ గ్రామానికి చెందిన మహిపాల్ వాపోయాడు. ఇంతకుముందు కూడా తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా నిర్వాహకులను బెదిరించినట్లు చేసి వదిలివేశారని ఆరోపించారు. ప్రస్తుతం కొత్త రేషన్కార్డుల కోసం, పాత కార్డుల్లో ఉన్న కొంతమంది పేర్లు తొలగించడానికి వందల సంఖ్యలో వస్తున్నారని, వీరి నుంచి నిత్యం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు ఆర్ఐని పంపిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తెలిపారు.కలివివనం పాట ఆవిష్కరణ చేవెళ్ల: పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలనే కాన్సెప్ట్తో తీసిన కలివివనం సినిమా అందరినీ ఆలోచింపజేస్తుందని చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, సినీ నటుడు బిత్తిరి సత్తి అన్నారు. పట్టణంలోని కేజీఆర్ గార్డెన్లో గురువారం సాయంత్రం చేవెళ్ల ప్రాంతానికి చెందిన నిర్మాతలు మల్లికార్జున్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి ఏఆర్ క్రియేషన్పై నిర్మించిన చిత్రంలోని ఓ పాటను ఆవిష్కరించారు. స్థానిక వివేకానంద కశాళాల యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక నాయకులు సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాజ్నరేంద్ర, సినిమా హీరోయిన్ నాగదుర్గ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, బీజేపీ మున్సిప ల్ అధ్యక్షుడు అనంతరెడ్డి, సీనియర్ నటుడు గాంధీ, చిత్ర యూనిట్ సభ్యులు, చేవెళ్ల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుమార్తె వెళ్లిపోయిందని.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యరాంగోపాల్పేట్: అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తె పైళ్లెన వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంగళరావునగర్కు చెందిన జంగిటి రామస్వామి (50) ఆటో డ్రైవర్గా పని చేస్తుండగా అతడి భార్య లక్ష్మి బుద్ధభవన్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్వీపర్గా పని చేస్తుంది. గత నెల 30న అతడి కుమార్తె పైళ్లెన వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో రామస్వామి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి లోనైన రామస్వామి బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గురువారం ఉదయం లక్ష్మి భర్తను నిద్ర లేపేందుకు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
కొడంగల్ రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని కొడంగల్ ఎంజేపీటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామ సమీపంలో ఉన్న కొడంగల్ ఎంజేపీటీ కళాశాల, దౌల్తాబాద్ ఎంజేపీటీ పాఠశాలల్లో నిర్వహించిన నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. గతేడాది ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి వారికి బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్, ఎంజేపీ కొడంగల్ పాఠశాల ప్రిన్సిపాల్ నగేశ్, ఏటీపీ రేఖ్య నాయక్, కాశప్ప, ఉపాధ్యాయులు అనంతరాములు,నరేశ్, విజయ్, కిషన్, అశ్విని, మాణేప్ప, రాధ, రాములు, వెంకటేశ్, అనిల్, నరేందర్, రత్నం తదితరులు పాల్గొన్నారు.ఎంజేపీటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ -
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
యాచారం: సీసీ కెమెరాలుంటే పోలీస్ నిఘా ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లిలో గురువారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, యువకులు సమష్టిగా డబ్బులు జమ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగిప్పుడు సులభంగా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాలుంటే నేరాలు, చోరీలు తగ్గుముఖం పడుతాయన్నారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతల సహకారం కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు శ్రీశైలం, సంతోష, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు -
బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి
షాబాద్: బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీసీసేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కడుమూరు విఠలయ్య, ఉపాధ్యక్షుడిగా కడుమూరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కావలి రాములు, కోశాధికారిగా కావలి సత్తయ్యలను ఎనుకున్నారు. యువజన కమిటీ అధ్యక్షుడిగా కావలి సందీప్, ప్రధాన కార్యదర్శిగా కడుమూరి ఆనంద్, ఉపాధ్యక్షుడిగా మహేందర్, కార్యదర్శిగా బుగ్గరాములు, కోశాధికారిగా ఉండాల మల్లేష్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. ఆధిపత్య పోరుతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని చెప్పారు. అందుకే బీసీలకు అండగా ఆర్.కష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల అధ్యక్షులు దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
ఏ ఒక్క దరఖాస్తూ పెండింగ్లో ఉండొద్దు
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ధారూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీ నాటికి క్లియర్ చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. గురువారం ధారూరు రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్, డీటీ, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసుకోవాలని సూచించారు. ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్లో పెట్టరాదని ఆదేశించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాజిదాబేగం, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ఐలు స్వప్న, దేవేందర్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ బంక్కు స్థలం కేటాయింపు దుద్యాల్: మండలంలోని హకీంపేట్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ కోసం గురువారం తహసీల్దార్ కిషన్ స్థలాన్ని కేటాయించారు. గ్రామ శివారులో సర్వే నంబర్ 256లో 20 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆర్ఐ నవీన్కుమార్, ఏపీఎం బందెయ్య, సీసీ సంజీవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చాకలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దుడీపీఓ జయసుధ దోమ: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని డీపీఓ జయసుధ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం దోమ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్కు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ పట్టణ కార్యదర్శిగా తేజ అనంతగిరి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వికారాబాద్ నగర కమిటీ కార్యదర్శిగా తేజను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా ఽశాఖలకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. -
విశ్వనాథం సేవలను మరువలేం
అనంతగిరి: వికారాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత నేత విశ్వనాథం పాత్ర మరువలేమని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. గురువారం వికారాబాద్లోని సత్యభారతి గార్డెన్లో విశ్వనాథం ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వనాథం 103 సంవత్సరాలు జీవించడంతో పాటు మరో 100 సంవత్సరాలు ప్రజలు చెప్పుకునే మంచి పనులు చేశారన్నారు. నాలుగు సార్లు వికారాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారంటే ఆషామాషీ కాదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్నాయక్, నాయకులు బస్వరాజు, రాంచంద్రారెడ్డి, సురేష్, రెడ్యానాయక్ తదితరులు పాలొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
భవన లీకేజీలను అరికట్టండి
అనంతగిరి: వికారాబాద్ పట్టణలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. వర్షాలకు భవనం ఉరుస్తుండటం చూసి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలని సూచించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఎండబ్ల్యూఓ రాజేశ్వరి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, ప్రిన్సిపాల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
హామీల అమలుకు పోరాటం
మాడ్గుల: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గురువారం మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మండల కేంద్రంలో భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయాలనికి తరలివెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని, రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకొంటుందన్నారు. హామీల అమలుకు ఈ నెల 30 న చలో కొండారెడ్డిపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, నాయకులు రామకిషన్, వెంకటేశ్, నర్సింహ, శ్రీను, వెంకన్న, అశోక్, సునీల్, రాజు, భూపేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి -
ప్రైవేటుకు ‘ఇందిరమ్మ’ ఇసుక..!
బషీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య ఉండొద్దని భావించిన ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల పేరిట అక్రమ దందా సాగిస్తున్నారు. ప్రైవేటు నిర్మాణాలకు భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని నావంద్గీ ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. మంతట్టి నుంచి ఇందర్చెడ్ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర కాగ్నా నదీ పరివాహక ప్రాంతం ఉంది. నావంద్గీ వద్ద ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తుంటారు. కొంతమంది వాపారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రెవెన్యూ కార్యాలయంలో చూపి అనుమతులు పొందుతున్నారు. అనంతరం ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండి కొడుతున్నారు. బషీరాబాద్, నావంద్గీ, మంతన్గౌడ్, కొర్విచెడ్, పర్వత్పల్లి, నీళ్లపల్లి, బాబునాయక్ తండా, అల్లాపూర్, దామర్చెడ్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలించాల్సి ఉందని 40 ట్రాక్టర్లకు అనుమతులు తీసుకున్నారు. ఆ పత్రాలు చూపి యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. కాగ్నాను తోడేస్తున్న తోడేళ్లు కాగ్నా పరీవాహక గ్రామాలైన మంతట్టి, కంసాన్పల్లి(ఎం), జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్, ఇందర్చెడ్, మైల్వార్, ఎక్మాయి, అల్లాపూర్, దామర్చెడ్, కొత్లాపూర్ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఈ గ్రామాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక ను అక్రమంగా తరలిస్తున్నారు. బాద్లాపూర్, కాశీంపూర్, కుప్పన్కోట్ గ్రామాలకు, తాండూరు మండలం గోనూరు నుంచి కూడా రాత్రి వేళల్లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తున్నారు. నిద్ద్దరోతున్న యంత్రాంగం చీకటి పడగానే కాగ్నాపై ఇసుక తోడేళ్లు పంజా విసురుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. పోలీసుల దాడుల్లో ట్రాక్టర్లు పట్టుబడితే రూ.5 వేలు జరిమానా కట్టి మరుసటి రోజు నుంచే మళ్లీ దందా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లబ్ధిదారుల పేరుతో దందా కాగ్నా నుంచి భారీగా తరలింపు కాసులు కొల్లగొడుతున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కేసులు పెడతాం ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇస్తున్న ఇసుకను ప్రైవేటు అవసరాలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తాం. ఇసుక రీచ్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుక ఎక్కడ డంప్ వేస్తున్నది మాకు తెలియదు. ఎవరికి అనుమతులు ఇచ్చామో వారి ఇళ్లకు ఇసుక చేరిందా లేదా అని పరిశీలిస్తాం. తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – షాహెదాబేగం, తహసీల్దార్ -
‘రైతు బజారు’పాలు
వికారాబాద్: రైతు బజార్లలో సమస్యలు తిష్ట వేశాయి. కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే అన్నదాతలు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. సంతలు, మార్కెట్లు మరీ అధ్వానంగా మారాయి. రైతులతో పాటు కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రం వికారాబాద్లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కూరగాయల మార్కెట్, రైతు బజార్లలో తాగునీటి వసతి కూడా లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఆయా గ్రామాల నుంచి తెల్లవారుజామునే అన్నదాతలు పంట ఉత్పత్తులతో మార్కెట్లకు చేరుకుంటారు. వికారాబాద్లోని మహాశక్తి థియేటర్ ముందు ఉన్న మార్కెట్కు, రైతు బజార్కు, కూరగాయల మార్కెట్లో వ్యాపారాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీటన్నింటిలోనూ సమస్యలు తాండవం చేస్తున్నాయి. తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకే రైతు బజార్లు.. అక్కడ షెడ్లు కూడా లేవని అన్నదాతలు అంటున్నారు రోజంతా ఎండలోనే కూరగాయలు విక్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగిన ‘ఇంట్రిగేటెడ్’ గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు మున్సిపల్ కేంద్రాల్లో నాలుగేళ్ల క్రితం ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల పిల్లర్ దశలో పనులు ఆగిపోగా.. మరికొన్ని చోట్ల ప్రారంభమే కాలేదు. మరో చోట చేసిన పనులకు బిల్లులు రాక.. వచ్చిన డబ్బులో తమకూ వాటా కావాలని ప్రజా ప్రతినిధులు పేచీ పెట్టడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసి పారిపోయాడు. వికారాబాద్ పట్టణంలో పిల్లర్ దశలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం రైతులు ఎండలో కూరగాయలు విక్రయిస్తున్నారు. పరిగిలో స్లాబ్ వేసి వదిలేశారు. తాండూరులో పనులు ప్రారంభించి మిన్నకుండిపోయారు. కొడంగల్లో ప్రారంభించలేదు. రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు.. గత ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని భావించింది. పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రెండెకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. వికారాబాద్, తాండూరు పట్టణాల్లో జనాభా, అవసరాలను బట్టి ఐదు నుంచి ఆరు ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేశారు. నాలుగేళ్ల క్రితం స్థలాలను పరిశీలించి 2021లో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభమైనా నత్తనడకనే సాగాయి. ఎక్కడా పిల్లర్, స్లాబ్ దశ దాటనేలేదు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను పూర్తి చేయాలని ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. మార్కెట్లలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కూరగాయల విక్రయాలు తాగునీటికీ తప్పని అవస్థలు నాలుగేళ్లుగా పూర్తికానిఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి -
దంచికొట్టిన వాన
విరిగి పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు దోమ: మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దోమ – ఊటుపల్లి మార్గంలో చెట్లు విరిగి పడటంతో వాహ నాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పంచాయతీ కార్యదర్శి రవి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. వికారాబాద్లో భారీ వర్షం అనంతగిరి: వికారాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం పడింది. దీంతో ప్రధాన రోడ్లన్నీ జ లమయంగా మారాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ధారూరులో.. ధారూరు: మండలంలో భారీ వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి వాన జాడ లేక కంది, పత్తి, పెసర, మినుము, మొక్కజొన్న తదితర పంటలు ఎండుముఖం పట్టాయి. ప్రస్తుత వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు. హరిదాస్పల్లి, ధారూరు సమీపంలోని వాగులు ఉధృతంగా ప్రవహించాయి. జోరు వాన తాండూరు రూరల్: తాండూరు, పెద్దేముల్ మండలాల్లో గురువారం జోరు వర్షం పడింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, కంది పంటలకు ప్రస్తుత వర్షాలు జీవం పోశాయని అన్నదాతలు పేర్కొన్నారు. ధారూరు: చింతకుంట – హరిదాస్పల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు అనంతగిరి: జైదుపల్లి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు -
శభాష్.. అమృత
దుద్యాల్: ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ అన్నారు. ఇటీవల మండలంలోని కుదురుమల్ల గ్రామానికి చెందిన రాసూరి అమృత బీఎస్ఎఫ్లో చేరడంతో గురువారం ఆమెను స్థానిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సమ్మ, రాములు దంపతులు వారి కూతురు అమృతను దేశ రక్షణ కోసం పంపడం గొప్ప విషయమన్నారు. అనంతరం అమృత మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సాయప్ప, ఉపాధ్యాయులు వేణుగోపాల్, శ్రీనివాస్, మంజుల, తిరుపతి, శివకుమార్, శ్రీనివాస్, లత, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పన్ను చెల్లింపుతోనే అభివృద్ధి
అనంతగిరి: గ్రంథాలయాలను అభివృద్ధి పరిచేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు లైబ్రరీ పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రంథాలయ పన్ను వసూలు కమిటీతో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు పన్ను మాత్రమేనని, వసూలును బట్టి జిల్లాలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన గ్రంథాలయ పన్నులను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లుగా చెల్లించాల్సిన గ్రంథాలయ బకాయి పన్నును చెల్లించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రంథాలయాలను జ్ఞానాన్ని పెంపొందించే దిశగా తీర్చి దిద్దాలని, భవిష్యత్ తరాలకు కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్బాబు, గ్రంథాలయ కార్యదర్శి సురేష్, మున్సిపల్ కమిషనర్లు బలరాంనాయక్, విక్రమ్ సింహారెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ -
భార్యాభర్తలపై కత్తితో దాడి
మొయినాబాద్: పశువుల మేత విషయంలో చోటుచేసుకున్న దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్కు చెందిన మహ్మద్ హఫీజ్, మహ్మద్ వాజిద్ ఖురేషీ ముర్తూజగూడ రెవెన్యూలోని షమ్స్ కాలనీలో ఇళ్లు కట్టుకుని, కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి వద్దా మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో వీటిని మేపుతుంటారు. బుధవారం ఉదయం వాజిద్ తన మేకలు, గేదెలను ఓ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో కట్టేశాడు. ఇది గమనించిన హఫీజ్, అతని కొడుకు అఫ్రోజ్ ముందు నుంచీ తమ పశువులను ఇక్కడే మేపుతున్నామని, నీవెందుకు కట్టేశావని వాజిద్తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో అఫ్రోజ్ తమ ఇంట్లో నుంచి కొమ్మలు కొట్టే కత్తి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉండే వాజిద్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని భార్య రఫియాను సైతం కత్తితో గాయపర్చారు. దీంతో వాజిద్ తల, మెడ, ఛాతితో పాటు శరీరంపై గాట్లు పడ్డాయి. రఫియా తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పశువుల మేత విషయంలో గొడవ పోలీసుల అదుపులో తండ్రీకొడుకులు ఇద్దరిపైనా హత్యాయత్నం కేసు నమోదు -
వక్ఫ్ భూములు పరాధీనం
వికారాబాద్: జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. మెజార్టీ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిగి మండలం సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో వక్ఫ్ భూములను పక్క పొలం రైతులు ఆక్రమించారని ఎర్రగడ్డపల్లికి చెందిన కొందరు కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. సమాధులను సైతం కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ భూములను గతంలో వక్ఫ్ బోర్డు అధికారులు పలుమార్లు సందర్శించారు. కబ్జాకు గురయ్యాయని తేల్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన ప్రతి సారీ వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపి కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో 2,170 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండగా అవి చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. పొజిషన్లో మాత్రం వేరేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్లి పోయాయి. కొన్ని చోట్ల సంరక్షకులుగా ఉన్న వారే యజమానులుగా మారిపోయారు. మరి కొన్ని చోట్ల కాగితాల్లో భూములు కనిపిస్తున్నాయి. పరాధీనం అయిన భూములపై ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక వేళ విచారణ జరిపినా నేతల ఒత్తిడి.. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు కారణంగా నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. సర్వే చేయడంలో విఫలం వక్ఫ్ భూములు ఉన్నదెంత.. ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? అనే దానిపై ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులకు అవగాహన ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇటు రెవెన్యూ.. అటూ వక్ఫ్ బోర్డు అధికారుల కనుసన్నల్లోనే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వక్ఫ్ భూములపై 1958 – 64 ప్రాంతంలో సర్వే నిర్వహించారు. 2006లో మరోసారి సర్వే చేసినా ఆ వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ సర్వే ప్రకారం వక్ఫ్ భూముల విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండో విడత సర్వే చేసి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం 2017 ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు వెళ్లడవుతాయని అందరూ భావించారు. కానీ మొదటి విడతలో కేవలం లిటిగేషన్ లేని భూములను మాత్రమే సర్వే చేశారు. రెండో విడత సర్వే చేసి ఉంటే వక్ఫ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలిసేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అనేక చోట్ల కబ్జా ● పరిగి మండలం సుల్తాన్పూర్ శివారులో ఓ దర్గా సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇందులో సుమారు ఐదెకరాల భూమి పరాదీనం అయ్యింది. గార్డియన్గా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వాటిని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయంలో స్థానకంగా నివాసముండే ఓ వ్యక్తి రెవెన్యూతో పాటు వక్ఫ్బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి నివేఽధిక కూడా ఉన్నతాధికారులకు అందజేశారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతేడాది అధికారులు ఆ భూములను పరిశీలించి కబ్జాకు గురైనట్టు తేల్చారు, కాని ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వీటితో పాటు పరిగి మున్సిపల్ పరిధిలోని 568 సర్వే నెంబర్లో సుమారు 205 ఎకరాల భూమి ఉండగా అందులో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యింది. పరిగి మండలం రాపోల్ గ్రామంలో వక్ఫ్ భూములు పరాధీనమయ్యాయి. ఇదే మండలం నారాయణ్పూర్లో 24 ఎకరాలు ఉండగా 22 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్, ధారూరు, తాండూరు మండలాల్లో సైతం అన్యాక్రాంతం అయ్యాయి. జిల్లాలో 2,170 ఎకరాలు ఆక్రమణలపై తరచూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, వక్ఫ్ బోర్డ్ అధికారులు 2006 సంవత్సరంలో సర్వే.. నేటికీ వెల్లడి కాని భూముల వివరాలు -
నిరుపయోగం.. కూలేందుకు సిద్ధం
దుద్యాల్: మండలంలోని గౌరారం, నాజుఖాన్పల్లి, హస్నాబాద్ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. అవి ఎప్పుడు కూలుతాయోననే భయంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌరారంలో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా ఉంచారు. హస్నాబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. వినియోగించక చాలా ఏళ్లు అవ్వడంతో ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు వాపోతున్నారు. నాజుఖాన్పల్లిలో ఓ వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదాలు సంభవించకముందే అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో వాటర్ ట్యాంక్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ట్యాంక్లతో పొంచి ఉన్న ప్రమాదం -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
పరిగి: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఎర్రవాపుల సాయిరెడ్డి(76) పని నిమిత్తం పరిగికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో స్టాండ్కు బయలు దేరాడు. పరిగి నుంచి షాద్నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బహార్పేట చౌరస్తాలో ఆయన్ని ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య సుశీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సబితారెడ్డిని అవమానించడం తగదు తాండూరు: మాజీ మంత్రి సబితారెడ్డిని అధికారిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్ రాజుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మహేశ్వరంలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలను మంత్రి పక్కన కూర్చుబెట్టుకోవడం సరికాదన్నారు. మహిళ అని చూడకుండా మాజీ మంత్రి సబితారెడ్డిని అవమానించడం తగదన్నారు. బీఆర్ఎస్ నాయకులు తలచుకొంటే ఇన్చార్జ్ మంత్రిని చేవెళ్ల గడ్డపై తిరగనివ్వమన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. చోరీ కేసులో మూడేళ్ల జైలు పరిగి: చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీరామ్ తీర్పునిచ్చినట్లు స్థానిక ఎస్ఐ మోహనకృష్ణ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన సయ్యాద్ ఫెరోజ్ ఇంట్లో 2025 మార్చి ఒకటిన బంగారు, వెండి నగలు దొంగతనం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలో 2024 అక్టోబర్ 14న భారతమ్మ ఇంట్లో బంగారు, వెండి నగలు చోరీ జరిగినట్టు పోలీసులను ఆశ్రయించారు. ఈ రెండు కేసులను దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వడ్డెరపాలెంకు చెందిన తన్నీరు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు రికవరీ చేసి కోర్టులో డిపాజిట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా బుధవారం కోర్టులో వాదోపవాదనలు విన్న తరువాత దొంగతనం చేసినట్టు రుజువు కావడంతో జడ్జి నేరస్తుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి పూడూరు: చికిత్స పొందుతూ ఓ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ ఆలంపల్లికి చెందిన హాజీపాషా(24) డీసీఎం వాహనంతో నగరంలోని మార్కెట్కు మంగళవారం రాత్రి 2 గంటలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎన్కేపల్లి గేటు సమీపంలో డీసీఎం అదుపుతప్పి మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హాజీపాషా తల, కాళ్లకు బలమైన రక్త గాయాలయ్యాయి. వెంటనే అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి షాహిన్బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న కండక్టర్.. గుండెపోటుతో మృతి అబ్దుల్లాపూర్మెట్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్కు గుండెపోటు రావడంతో మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాలరాజ్గౌడ్(54) హయత్నగర్– 2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరిన బాల్రాజ్ రాత్రి 8.45గంటలకు అబ్దుల్లాపూర్మెట్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి బస్లో వచ్చాడు. రాత్రి బస్సును కాలనీలో పార్క్ చేసి(నైట్ హాల్ట్), బ్లాక్ నం.62/1లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 11.20 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని డ్రైవర్ ఉపేందర్కు చెప్పాడు. దీంతో ఆయన 108కు సమాచారం ఇవ్వగా అతన్ని పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భా ర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
బిరబిరా కృష్ణమ్మ
కొడంగల్: కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పరుగులు పెడుతున్నాయి. నారాయణపేట జిల్లా సరిహద్దు వరకు పనులు పూర్తి కాగానే మన జిల్లాలో ప్రారంభిస్తారు. మొదటి విడతలో దామరగిద్ద మండలం కానుకుర్తి వరకు చేపట్టారు. ఇది పూర్తి కాగానే కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభమవుతాయి. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో లక్షా 5వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ పథకానికి సుమారు రూ.4,500 కోట్లు అంచనా వేశారు. మొదటి విడతలో రూ.2,945 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జీఓ 69కి జీవం పోసిన సీఎం గతంలో అటకెక్కిన జీఓ 69కు సీఎం రేవంత్రెడ్డి జీవం పోశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. బీమా ఎత్తిపోతల ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు, 5లక్షల 50వేల మందికి తాగునీరు అందించాలని నిర్ణయించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 69 జీఓను అమలు చేయకుండా అటకెక్కించింది. నాలుగు రిజర్వాయర్లు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదుగా కృష్ణానది ప్రవహిస్తూ తెలంగాణలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణానదిపై తెలంగాణలో తొలి ప్రాజెక్టు జూరాలను నిర్మించారు. ఇక్కడి నుంచి నికర జలాలతో మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బూత్పూర్ రిజర్వాయర్ నుంచి నాలుగు దశల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తారు. ఊట్కూర్, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి దగ్గర రిజర్వాయర్లు నిర్మిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఊట్కూర్, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, దౌల్తాబాద్, హస్నాబాద్, కొడంగల్, బొంరాస్పేట చెరువులను కాకరవాణి ప్రాజెక్టును నింపి ఆయకట్టు భూములకు సాగునీరు వదులుతారు. ఈ పథకానికి రేవంత్ సర్కార్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తెరపైకి ‘పాలమూరు – రంగారెడ్డి’ కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కొడంగల్కు సాగునీరు రాదని కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం జలసాధన సమితి సభ్యులు ఉద్యమించారు. అయినా గత ప్రభుత్వం స్పందించలేదు. రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న 2014 నుంచి 2018 వరకు పలుమార్లు ఈ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ఈ పథకానికి ప్రాణం పోశారు. వేగంగా కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పనులు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, 5.50 లక్షల మందికి తాగునీరే లక్ష్యం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,500 కోట్లు మొదటి విడతలో రూ.2,945 కోట్లు మంజూరు -
కార్మిక సమస్యలు పరిష్కరించాలి
పరిగి: కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను విడుదల చేయాలని బుధవారం నగరంలోని విద్యా కమిషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. భోజన కార్మికులు, సీఐటీయూ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేసుకుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. సర్కారు కార్మికులకు ధర్నా చేసే హక్కులను కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు కార్మికులకు రూ.పది వేలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. భోజన కార్మికులకు బిల్లులు, గౌరవ వేతనాలు సక్రమంగా రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, శ్రీశైలం, సువర్ణ, రాములమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ -
వసతి.. అథోగతి..!
భవనం అప్పగించాలి మండలంలోని ఆయా గ్రామాల నుంచి రోజూ విద్యార్థినులు 3 కి.మీ. నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్నారు. వంద మంది ఉండేలా హాస్టల్ నిర్మించారు. భవనానికి కరెంట్, తాగునీటి కనెక్షన్ ఇవ్వలేదు. చిన్ని చిన్న మరమ్మతులు చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేసి తమకు అప్పగిస్తే హాస్టల్ను ప్రారంభిస్తాం. – అనీల, ప్రిన్సిపాల్, బషీరాబాద్ ఆదర్శ పాఠశాల ప్రతిపాదనలు పంపాం మోడల్ స్కూల్ హాస్టల్ భవనంలో చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.6.50 లక్షలు అవసరం. వారం రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. హాస్టల్ బిల్డింగ్పై మరో ఫ్లోర్ వేయడానికి రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. – శ్రీనివాసులు, డీఈ, టీఎస్ఈడబ్ల్యూఎస్ బషీరాబాద్: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో హాస్టల్ వసతి లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో అప్పటి సర్కారు వెనుకబడిన మండలాలకు మోడల్ స్కూల్స్ మంజూరు చేసింది. 2019లో బషీరాబాద్ మండలంలో రూ.1.28 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అన్ని సౌకర్యాలతో భవనాన్ని పూర్తి చేసి 2022లో టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులు జిల్లా విద్యాశాఖకు అప్పగించారు. భవనం అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచిన హాస్టల్ ప్రారంభించలేదు. ప్రస్తుతం 120 మంది విద్యార్థినులు వసతి సౌకార్యం లేక రోజూ పాఠశాలకు 3 కి.మీ. కాలినడకన వచ్చి వెళ్తున్నారు. దెబ్బతిన్న తలుపులు, కిటికీలు మూడేళ్ల క్రితం పూర్తయిన హాస్టల్ భవనానికి తాగునీటి వసతి లేదు. కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. భవనం గురించి పట్టించుకునే వారు లేకపోవడంతో తలుపులు దెబ్బతిన్నాయి. కిటికీలు, అద్దాలుఽ పాడయ్యాయి. బాత్రూమ్లు, ఫ్యాన్లు పాడైపోయాయి. భవనం చుట్టూ, లోపల ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. మూడేళ్లుగా నిరుపయోగంగా మోడల్ స్కూల్ హాస్టల్ విద్యుత్, నీటి సదుపాయం లేకపోవడంతో వృథాగా.. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
మద్యం తాగి వాహనం నడపొద్దు
మోమిన్పేట: మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేస్తామని ఏఎస్ఐ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని మొరంగపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతున్న సమయంలో మద్యం తాగరాదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు ఉండాలన్నారు. నంబరు లేని వాహనం రోడ్డు ఎక్కకూడదని హెచ్చరించారు. నిషేధిత వస్తువులను రవాణా చేయ్యెద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బలరాం, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. విజ్ఞానం
● ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్య ● విద్యార్థులతో కలిసిపోయి చదువు నేర్పుతున్న ఉపాధ్యాయులు ● ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి ● జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక దుద్యాల్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ఏకరూప దుస్తులు(యూనిఫాం) అందించడం, పాఠ్య, రాత పుస్తకాలతో సాంకేతికతను అందించేలా డిజిటల్ విద్యను ప్రవేశ పెట్టింది. మూడేళ్లు నిండిన చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తుండడంతో మెజార్జీ తల్లిదండ్రులు అక్కడే తమ పిల్లలను కొనసాగిస్తున్నారు. సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడంతో ఇటువైపు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలతో పాటు కొన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా కొంత మంది ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారులకు ప్రత్యేకంగా ఆటపాటలతో బోధనను అందిస్తున్నారు. పేద విద్యార్థులకు మేలు ప్రభుత్వ పాఠశాలలో సైతం పూర్వ ప్రాథమిక విద్యను అమలులోకి తీసుకువస్తే ప్రైవేట్ బడులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మూడేళ్లు నిండగానే అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నా అక్కడ ఆ మేరకు విద్యను అందిపుచ్చుకోలేకపోతున్నారనే వాదన తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుంది. దీంతో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఇంటిలో ఉంచుకుని ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు సాగనంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెడితే పేద విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచిగా మారే అవకాశం లేకపోలేదు. మూడేళ్లకు ప్రైవేట్.. ఐదేళ్లకు సర్కార్ ప్రస్తుతం పిల్లలకు మూడేళ్లు నిండగానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల పేరుతో ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. అదే సర్కారు పాఠశాలకు అయితే ఐదేళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తల్లిదండ్రులకు అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఐదేళ్ల వరకు పిల్లవాడిని పాఠశాలకు పంపించకుండా ఇంట్లో ఉంచుకోవడంతో వయసు పెరిగి విద్య బుద్ధులు నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని భావించి, మూడేళ్లకే ప్రైవేట్ బడికి పంపుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి సర్కారు పాఠశాలల్లో కూడా 3–4 ఏళ్ల వయసు పిల్లలను చేర్చుకొని పూర్వ ప్రాథమిక విద్యను అందించడం మొదలు పెడుతుంది. మండల పరిధిలోని నాజుఖాన్పల్లి, ఆలేడ్, హకీంపేట్, చిలుముల మైల్వార్, పోలేపల్లి తదితర ప్రాథమిక పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తున్నారు. సన్నాహాలు చేస్తున్నాం పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ విద్యను అమలు చేయడానికి జిల్లాలో 36 పాఠశాలలను ఎంపిక చేశాం. ప్రస్తుతం ఐదు బడుల్లో బోధన కొనసాగుతుంది. త్వరలో మిగతా పాఠశాలలో కూడా అమలు చేస్తాం. మునుముందు మరింతగా విస్తరిస్తాం. – రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
మా సమస్యలు పరిష్కరించండి
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం తొర్రూర్లో హెచ్ఎండీఏ ద్వారా రూపొందించిన లే అవుట్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ప్లాట్ల వేలాన్ని భూములు ఇచ్చిన రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా వేలం వేయడంపై అభ్యంతరం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్లోని సర్వే నంబర్ 383/1లో సుమారు 117 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి హెచ్ఎండీఏ అధికారులు సేకరించారు. పొజీషన్లో ఉన్న రైతులకు పరిహారం కింద ఒక్కొక్కరికి 300 గజాల ఇంటి స్థలాన్ని అదే లే అవుట్లో ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు అలాట్మెంట్ పత్రాలు జారీ చేశారు. అనంతరం కొన్ని ప్లాట్లను వేలం వేశారు. తమకు ఇచ్చిన పత్రాల ఆధారంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ స్థలాలపై పూర్తి హక్కుల కల్పించాలని రైతులు కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి అధికారం పొందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 510 ప్లాట్లలో 100 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. గ్రామంలోని ఓ కన్వెన్షన్ హాలులో వేలం వేసేందుకు బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి వచ్చారు. బహిరంగ వేలం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న రైతులు వేలం పాటకు అడ్డు తగాలారు. పోలీసులు కలుగ జేసుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వేలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని అక్కడికి పంపించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, 10–15 రోజుల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలాన్ని అడ్డుకున్న రైతులు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి హామీతో శాంతించిన వైనం -
మహోన్నత వ్యక్తి జయశంకర్
అనంతగిరి: తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నా రు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి తోకలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సేవలను కొనియాడారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవస్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన కలలుగన్న తెలంగాణ కోసం మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్, డీఆర్డీఏ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బూత్స్థాయి అసిస్టెంట్లను నియమించుకోవాలి పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు ఆయా పార్టీలు బూత్స్థాయి అసిస్టెంట్లను నియమించుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు సన్నాహాలు, కొత్త పోలింగ్ బూత్ల ఏర్పాటు, భవనాల గుర్తింపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండరాదన్నారు. జిల్లాలో 284 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, బూత్స్థాయి అసిస్టెంట్లను నియమించి ఎన్నికల కమిషన్ సైట్లో అప్లోడ్ చేసి అనుమతి పొందాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేసి ఓటరు జాబితాలో పేర్ల మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీటీ అనిత పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ కలెక్టరేట్లో ఘనంగా జయంతి వేడుకలు -
లక్ష్యాన్ని అధిగమించాలి
అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఎంఎల్ హెచ్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కే లలితాదేవి జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధులు, టీబీ నియంత్రణ కార్యక్రమలపై సమీక్షించారు. పీహెచ్సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో 87 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని, నాణ్యత పాటిస్తూ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలపై ప్రతి మూడు నెలలకు సమీక్ష చేయాలన్నారు. ఈనెల 11న నులిపురుగుల నివారణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ కలెక్టర్ సుధీర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, డాక్టర్ పవిత్ర, వైద్యాధికారులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, వసతి గృహాల వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు తరచూ వైద్య సేవలు అందేలా చొరత తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్డీఏ శ్రీనివాస్, సంక్షేమ ఖాఖ జిల్లా అధికారులు కమలాకర్ రెడ్డి, ఉపేందర్, రాజేశ్వరి, వార్డెన్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనేప్రసవాలు జరిగేలా చూడాలి కలెక్టర్ ప్రతీక్జైన్ -
9న లక్ష తులసీ అర్చన
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 9న మూడో శనివారం సందర్భంగా స్వామివారికి లక్ష తులసీ దళాలతో అర్చన నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలు, తులసీ దళాలతో మూల మూర్తులకు విశేష అలంకరణ చేస్తారు. పండితులు విష్ణు సహస్ర నామావళి పటిస్తూ లక్ష తులసీ దళాలతో అర్చన చేస్తారు. శ్రావణమాసం మూడో శనివారం కావడంతో శ్రీవారి మూలమూర్తికి అభిషేకం, తోమాల సేవ, అలంకరణ చేయనున్నారు. విష్ణుసహస్ర నామార్చన, నైవేద్య సమర్పణ, మహా మంగళ హరతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందుబాటులో సబ్సిడీ గడ్డి విత్తనాలు అనంతగిరి: జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో 75శాతం సబ్సిడీపై మేలుజాతి గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశు వైద్యాధికారి సదానందం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు కేజీల మినీ కిట్స్ పూర్తి ధర రూ.500 కాగా సబ్సిడీ రూ.375 పోను రూ.125 చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం వికారా బాద్ మండలం కామారెడ్డిగూడలో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. నేడు ఎక్కడ చూసినా కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న పనులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు అమరేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, నాయకులు గోపాల్రెడ్డి, గోపాల్, నర్సింహారెడ్డి, సురేందర్రెడ్డి, సంజీవరెడ్డి మైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయసమస్యలు పరిష్కరించాలి టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు చేవెళ్ల: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్రావు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం సంఘం నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్కార్డులు వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నం చేయాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం టీపీయూఎస్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, గౌరవ అధ్యక్షుడు గణపురం సురధీర్, మండల కోశాధికారి దూత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు దీటుగా గురుకులాలు
తాండూరు టౌన్: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో బోధన సాగుతోందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల (ట్రైస్) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ అన్నారు. బుధవారం తాండూరులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠ శాల, కళాశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, లైబ్రరీ, ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆన్లైన్ బోధనను పరిశీలించారు. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సిలబస్తో పాటు ఆన్లైన్ తరగతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో అత్యుత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తోందన్నారు. ప్రతి ఏటా ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. తాండూరు గురుకులంలో బోధన, ఫలితాలు, వసతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోధన, వసతుల కల్పనలో మేటి ట్రైస్ సెక్రటరీ రమణకుమార్ తాండూరులోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన -
రైతులకు అండగా కేంద్రం
అనంతగిరి: ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముద్ర రుణాలను కేంద్రం అందజేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని రాళ్ల చిట్టెంపల్లి, మైలార్ దేవరంపల్లి గ్రామాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని రైతులకు పెట్టుబడి సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. రైతులపై భారం పడకుండా ఎరువులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి, నాయకులు మల్లేష్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం దోమ: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మండల అధ్యక్షుడు బొంగు మల్లేశం అన్నారు. మంగళవారం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో బీజేపీ ప్రవేశపెడుతున్న పథకాలను కార్యకర్తలతో కలిసి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సత్యం, నాయకులు అశోక్, శ్రీనివాస్, శ్రీనుగౌడ్, వెంకటేశ్గౌడ్, శ్రీశైలం, మాదవులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్రెడ్డి -
నేడు టీజీఈపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
అనంతగిరి: టీజీఈపీసెట్–2025 చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన బుధవారం వికారాబాద్లోని ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొమ్మిదేళ్ల చిన్నారిపై యువకుడి అఘాయిత్యం పూడూరు: తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు ఈ సంఘటన చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని నేవీరాడార్లో బిహార్కు చెందిన పలు కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి చెందిన కృష్ణకుమార్ (24) ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని లేబర్ కోసం నిర్మించిన షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇది గమనించిన చిన్నారి కుటుంబ సభ్యులు అతనికి దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భరత్రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు అనంతగిరి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ప్రిన్సిపాల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. బుధ, గురువారాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వాటని పరిశీలించి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 8న ఉదయం 10గంటలకు అన్ని ఒరిజినల్స్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్స్లతో రిపోర్టు చేయాలన్నారు. సీటు లభించిన వారు వెంటనే రూ.5,080 కౌన్సిలింగ్ ఫీజు వెంటనే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియామకం అనంతగిరి: బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మహిళ కన్వీనర్గా వికారాబాద్కు చెందిన మాజీ కౌన్సిలర్ టి.శ్రీదేవిసదానందరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడుతామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వాటర్ ట్యాంకర్ ఢీకొని యువకుడి దుర్మరణం నిజాంపేట్: నగర శివారులోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైకు నడుపుతున్న బీటెక్ విద్యార్థి నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్
షాద్నగర్రూరల్: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రిమాండ్కు తరలించామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఠాణాలో సీఐ విజయ్కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని చెరుకుపల్లికి చెందిన నర్సింలు జూన్ 19న ద్విచక్రవాహనంపై షాద్నగర్కు వచ్చాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కొరియర్ కార్యాలయం పక్కన తన బైక్ పార్క్ చేసి వెళ్లాడు. మరునాడు వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఆయన షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక నైపుణ్యంతో కొత్తూరు మండలం ఇన్ముల్నర్వకు చెందిన కొర్రా వినోద్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. నాలుగు బైక్లు స్వాధీనం నిందితుడిపై ఇప్పటికే షాద్నగర్ ఠాణా పరిధిలో నాలుగు, ఆర్జీఐ పీఎస్ పరిధిలో ఒకటి, కొత్తూరు పరిధిలో నాలుగు, అప్జల్గంజ్ పీఎస్ పరిధిలో రెండు కేసులు నమోదై జైలు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితుడి నుండి రూ.2 లక్షల విలువ చేసే బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, సంతోశ్, కర్ణాకర్, జాకీర్, రాజు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఇద్దరు చైన్ స్నాచర్లకు.. ఇబ్రహీంపట్నం: ఇద్దరు చైన్ స్నాచర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లికి చెందిన సంఘీ నాగరాజు(25) అల్మాస్గూడలో నివసిస్తూ ఆమెజాన్ కంపెనీలో ప్యాకింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. 2023లో ఓ రేప్ కేసులో జైల్కు వెళ్లి వచ్చాడు. షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న నాగరాజుకు నెల రోజుల క్రితం జడ్చర్లకు చెందిన వేదవ్యాస్ (24)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉంటున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురూ సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ బాటపట్టారు. ఈ నెల 1వ తేదీన పోల్కంపల్లి పంచాయతీ పరిధిలోని జాజోనిబావికి చెందిన లావణ్య(33) తమ పొలంలో పశువులను మేపుతుండగా నాగరాజు, వేదవ్యాస్ బైక్పై వచ్చి ఆమె మెడలోంచి పుస్తెల తాడును అపహరించేందుకు యత్నించారు. సదరు మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చారు. అప్రమత్తమైన దుండగులు వెంటనే పుస్తెలతాడును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో మంగళవారం మంగళ్పల్లి వద్ద చైన్ స్నాచింగ్ కోసం యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. చైన్స్నాచింగ్కు వాడిన వేదవ్యాస్ ఆర్15 బైక్ను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.నాలుగు బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
హస్తినాపురం: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గిరీష్కుమార్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మంచన్పల్లి లోకేశ్(31) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మనస్తాంపం చెంది గత నెల 26న పురుగుల మందు తాగడంతో వెంటనే కుటుంబ సభ్యులు బండ్లగూడ జాగీర్లోని మెడిలైఫ్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. -
కూలీల కొరత.. రైతులకు వెత
పరిగి: వర్షాలు సరిగ్గా పడక సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. వారం రోజులుగా వానలు లేక పోవడం, బోర్లల్లో నీరు తగ్గడంతో వరినాట్లు వేయాలనుకునే చిన్న, సన్నకారు రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు కూలీల కొరతతో విలవిలలాడే పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటలకు కలుపు తీసేందుకు కూలీ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అటు వరి నాట్లు, కలుపుతీత తీసే రైతులు ఒకేసారి పనులు చేయిస్తుండటంతో కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. వలస కూలీలతో పనులను చేయిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో వరి నాట్లు వేసేందుకు కూలీల రేట్లు రెండింతలు కాగా సాగు పెట్టుబడి కూడా పెరిగింది. సాధారణంగా ఒక్కో కూలీకి రూ.250 నుంచి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. దెబ్బతింటున్న పంటలు జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధార పంటలపైనే ఆధారం. ఖరీప్ సీజన్లో గతేడాది కురిసిన వర్షపాతానికి ఈసారి చాలా తక్కువగా కురిశాయి. అయినా పంటల సాగుపైన దృష్టి సారించారు. వరి నాట్లు వేయడం, పొలాల్లో కలుపు మొక్కలను తొలగించడానికి కూలీలు అవసరం ఏర్పడింది. వరినాట్లు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేసినా కూలీల కొరతతో సమయానికి నాట్లు పడటం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. కూలీల కొరత ఒకవైపు భారీగా పెరిగిన కూలీల రేట్లతో కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదునుకు కలుపు తీత తీయకపోవడంతో పంటను మించి కలుపు పెరిగిపోతుంది. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు కూలీలు దొరక్క సాగు చేసిన పంటలో కలుపు తీత తీయకుండా రసాయనాలు పిచికారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికే వరినాట్లు వేసి కలుపులు తీయాల్సి ఉండగా ఇంకా పూర్తిగా నాట్లే పడలేదు. నారుమళ్లు ముదిరి పోవడంతో పంట దిగుబడిపై దెబ్బపడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరతతో కలుపు తీసేందుకు, వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రెండింతలు పెరిగాయి కూలీల రేట్లు రెండింతలు కావడంతో పెట్టుబడి కూడా భారీగా పెరుగుతోంది. రేట్లు పెరిగినా కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామాల్లో కూలీల కొరత ఉండేది కాదు. కాలానుగుణంగా వ్యవసాయ కూలీలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గుతుంది. దీంతో డిమాండ్ పెరిగింది. – రవికుమార్, రైతు మోత్కూర్ కష్టంగా సాగు పంట సాగు చేయాలంటే కష్టంగా మారింది. వ్యవసాయం చేయడానికి కూలీలు కచ్చితంగా అవసరం. విత్తనాలు విత్తిన నాటి నుంచి కోత నూర్పిడి తదితర పనులకు కూలీలు ఉండాలి. రైతులంతా ఒకేసారి ఒకే పంట సాగు చేయడంతో కూలీల కొరత ఏర్పడుతోంది. – శ్రీనివాస్, ఐనాపూర్ భారీగా పెరిగిన కూలీ రేట్లు వరినాట్లకు తీవ్ర ఇబ్బందులు కలుపుతీతకు రసాయనాల పిచికారీ -
దళితవాడకు అడ్డు కంచె తొలగింపు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో నెలకొన్న దళితవాడకు అడ్డంగా కంచె వివాదం సద్దుమణిగింది. రాకపోకలకు ఇబ్బందులు రాకుండా దారిని ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటుపై మంగళవారం దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, టీఎమ్మార్పీఎస్, ధర్మసమాజ్పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అడ్డుగా వేసిన కంచెను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అవసరాలకోసం ఇచ్చిన స్థలంలో కంచె వేయడం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే కంచె ఏర్పాటు చేశారని ఆరోపించారు. కంచె ఏర్పాటుతో దళితులు తమ ఇళ్లకు రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. కంచె ఏర్పాటుతో ఇబ్బంది కలుగుతుందంటే తొలగిస్తామని బూర్గుల నర్సింగ్రావు సోదరి సుమన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, వివిధ సంఘాల నాయకులు సామేల్, జంగయ్య, చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనునాయక్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. స్మృతివనం ఏర్పాటు చేస్తాం స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు గ్రామ అవసరాలకు ఇచ్చిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఆయన సోదరి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బూర్గుల సుమన వెల్లడించారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆమె గ్రామస్తులు, దళితులతో మాట్లాడారు. దళితులు వెళ్లడానికి దారి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామానికి ఇచ్చిన స్థలంలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆ స్థలంలో బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఆ స్థలంలో బూర్గుల నర్సింగ్రావు ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారని, ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారని చెప్పారు. ఏ రోజూ తాము ఆ స్థలాన్ని తిరిగి తీసుకోవాలనే ఆలోచన చేయలేదన్నారు. స్మృతివనం ఏర్పాటుచేస్తే మొక్కలను పశువులు మేస్తాయనే ఆలోచతో కంచె వేశామే తప్ప ఆక్రమించుకునేందుకు కాదని స్పష్టం చేశారు. సద్దుమణిగిన వివాదం -
లైసెన్స్ల జారీలో దళారుల దగా!
బషీరాబాద్: టీఎఫ్టీ లైసెన్స్ల జారీలో అవినీతి రాజ్యమేలుతోంది. కల్లు విక్రయించేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ గీత కార్మికుడి నుంచి మధ్యవర్తులు ఏకంగా రూ.85 వేలు వసూలు చేశారు. ఈ ఘటన బషీరాబాద్ మండలం ఎక్మాయిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పోతుల బాలయ్యగౌడ్ వ్యవసాయంతో పాటు గీత కార్మికుడిగా జీనవం సాగిస్తున్నాడు. ఇతను కల్లు దుకాణం లైసెన్స్ కోసం ఈఏడాది జనవరిలో తాండూరు ఆబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 19న ఇతనికి టాపింగ్ పరీక్ష నిర్వహించిన అధికారులు లైసెన్స్ జారీ కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. రోజులు గడుస్తున్నా లైసెన్స్ రాకపోవడంతో బాధితుడు ఓ స్థానిక నాయకుడిని ఆశ్రయించాడు. ఇందుకు రూ.70 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో తన భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి.. సదరు లీడర్కు రూ.65 వేలు ఇచ్చాడు. అనంతరం ఎన్నిసార్లు వాకబు చేసినా ఏదో కారణం చెబుతూ దాటవేయడంతో బాధితుడు ఎకై ్సజ్ కార్యాలయంలో పనిచేసే ఓ ప్రైవేటు ఉద్యోగిని సంప్రదించాడు. రూ.40 వేలు ఇస్తే అధికారులతో పని పూర్తి చేయిస్తానని చెప్పడంతో రూ.20 వేలు ఇచ్చాడు. ఈక్రమంలో అతనికి లైసెన్స్ మంజూరైంది. ఇదిలా ఉండగా తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు బాలయ్య, అతని భార్య నర్సింగమ్మ మంగళవారం సదరు నాయకుడిని నిలదీశారు. అయితే నేను పైరవీ చేయడంతోనే మీకు లైసెన్స్ వచ్చిందంటూ లీడర్ తమను దబాయించాడని బాధితులు వాపోయారు. ఆబ్కారీ అధికారుల పేరుతో మధ్యవర్తుల వసూళ్లు ఎక్మాయిలో ఓ గీత కార్మికుడి నిలువు దోపిడీ మా ప్రమేయం లేదు గీత కార్మికుడు పోతుల బాలయ్య దరఖాస్తును పరిశీలించి, అన్ని పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అన్ని అర్హతలు కలిగి ఉండటంతో అతనికి లైసెన్స్ జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వ ఛాలన్ డబ్బులు మాత్రమే కట్టించుకున్నాం. మధ్యవర్తులు తీసుకున్న డబ్బులతో మాకెలాంటి సంబంధం లేదు. – రవికుమార్, ఎకై ్సజ్ ఎస్ఐ -
హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్
ధారూరు: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండలం రాంపూర్తండాకు చెందిన సబావత్ మోహన్పై ఇదే తండాకు చెందిన శంకర్, అతని భార్య లక్ష్మీబాయి, కొడుకు రాజేశ్ ఈనెల 1న గొడ్డలి, రోకలి, ఇనుప వస్తువులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మోహన్ను కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య సావిత్రీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపైనా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మోహన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. ఘటన జరిగిన రోజు మోహన్కు చెందిన కోడి, దాని పిల్లలు శంకర్ ఇంటివైపు వెళ్లాయి. ఇందులో కొన్ని చనిపోవడంతో.. నోరు లేని కోడి పిల్లలను ఎలా చంపాలనిపించిందంటూ శంకర్ కుటుంబ సభ్యులను మోహన్ నిలదీశాడు. పాత కక్షలతో కోపోద్రిక్తులైన వారు అతనిపై దాడికి తెగబడ్డారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలి ఏడీఏ లక్ష్మీకుమారి కుల్కచర్ల: ఎరువులను ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి సూచించారు. మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు యూరియా, డీఎపీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. యూరియా కోసం వచ్చిన రైతులకు లేవని చెప్పి పంపిస్తే లైసెన్స్లను రద్దు చేస్తామన్నారు. యూరియాలో సన్న రకం, దొడ్డు రకం రెండు ఉన్నాయని రెండింటిలో ఎటువంటి తేడాలు లేవన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. భారీ శబ్దాలతో భయందోళన తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం సిద్ధన్నమడుగుతండా, ఎర్రగడ్డతండా, ఆత్కూర్ గ్రామాల్లో భారీ శబ్దాలతో ప్రజలు భయందోళన చెందారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు భూమి కంపించే విధంగా భారీ చప్పుళ్లు వినిపించాయని తండావాసులు వాపోతున్నారు. ఆత్కూర్ గ్రామ శివారులో ఉన్న ఓ క్రషర్ మిషన్కు సంబంధించి గనులు ఉన్నాయని అక్కడ బ్లాస్టింగ్ చేయడంతో శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దేముల్ పోలీసులు మధ్యాహ్నంపర్యటించి అనుమానిత ప్రదేశాలను పరిశీలించారు. ఈసీవాగులో కూలీ గల్లంతు? పూడూరు: కంకల్ ఈసీ వాగులో ఓ వ్యవసాయ కూలీ గల్లంతైన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన మంగళి సాయన్న(36) వ్యవసాయ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఈసీ వాగు సమీపంలో ఉన్న పత్తి పొలంలో పత్తి దంతె పట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి పొలానికి వెళ్లే క్రమంలో ఈసీ వాగు ఉధృతి ఎక్కువ కావడంతో అందులో పడి పోయి ఉండవచ్చని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కాగా సాయన్నకు ఈత రాదు. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. బాధితుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసత్య వార్తలపై ఫిర్యాదు దోమ: విధుల్లో ఉన్నా లేనట్లుఅసత్య కథనాలు రాసి, తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మోత్కూరు అంగన్వాడీ టీచర్ సువర్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికలో అసత్య వార్తలు రాసిన రిపోర్టర్పై దోమ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై అవాస్తవాలు చిమ్మిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 మంది సభ్యులను సంఘంలో నూతనంగా చేర్చుకున్నామని, 24 మంది రైతులకు రూ. 2.65 కోట్లు రుణాలను మంజూరు చేశామన్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్ను ఆమోదించడంతో పాటు, 2025–26 మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మూడు నెలల జమా ఖర్చులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ, సంజీవ రెడ్డి, యాదగిరి, ఎస్.లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సీఈఓ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు.డీసీసీబీ చైర్మన్ సత్తయ్య -
రైతుల పొలాల్లో ఆస్తుల సర్వే
దుద్యాల్: మండల పరిధిలోని పారిశ్రామికవాడ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. భూములు ఇచ్చిన రైతుల పొలాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండల పరిధిలోని హకీంపేట్ గ్రామ పరిధిలోని ఇటీవల భూములు ఇచ్చిన రైతులు పొలాల్లో పెద్ద పెద్ద వృక్షాలు, బోర్లు, పశువుల షెడ్లకు సంబంధించి వివరాలను మంగళవారం సేకరించారు. గతంలో కొంత మందికి పొలాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి పరిహారం ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా రైతుల పొలాల్లో ఆస్తుల వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదించామని తహసీల్దార్ కిషన్ తెలిపారు. సర్వేలో హర్టికల్చర్ అధికారి సురేంద్రనాథ్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
లేన్లుగా..
నాలుగు లేన్లుగా విస్తరించనున్న హైదరాబాద్ – బీజాపూర్ రహదారికొడంగల్: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిని(ఎన్హెచ్ 163) జిల్లా పరిధిలో మరింత విస్తరించనున్నారు. మన్నెగూడ నుంచి కొడంగల్ మండలం రావులపల్లి వరకు నాలుగు లేన్ల రహదారిగా మార్చనున్నారు. మొత్తం 73 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అనుమతి మంజూరు చేసింది. భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు ఉన్న రెండు వరుసల రోడ్డును ఇకపై నాలుగు లేన్లుగా మారుస్తారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ – బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చింది. ఎన్హెచ్ 163గా నామకరణం చేసింది. కొన్ని సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల కారణంగా హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు పనులు జరగలేదు. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్ మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు జాతీయ రహదారిని నిర్మించారు. రెండు లేన్ల రహదారి వేశారు. ప్రస్తుతం దీన్ని విస్తరించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2028 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంపై బాధ్యతలు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఉంచింది. ఇందుకు అవసరమైన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. డీపీఆర్ అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయనుంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయిన తర్వాత వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే కొడంగల్ మండలం చిట్లపల్లి గేటు సమీపంలో ఒక టోల్ గేటు ఉంది. రహదారి విస్తరణ పూర్తి అయితే రెండో టోల్ గేట్ను మన్నెగూడ – పరిగి మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రహదారి పనులు పూర్తయితే పరిగి, కొడంగల్ పట్టణాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మన్నెగూడ – రావులపల్లి రోడ్డు విస్తరణ 73 కిలోమీటర్ల మేర పనులు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు నాలుగు లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వెళ్లి రావడానికి సులభంగా ఉంటుంది. పరిగి, కొడంగల్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. – తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇన్చార్జ్ -
ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు
తాండూరు రూరల్: మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన పెద్దేముల్లో ఎల్ఎన్ఆర్ యువసేన, ఎంఎన్ఆర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు నర్సింలు ఆధ్వర్యంలో వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేశారు. అనంతరం కేక్కట్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు డీవై నర్సిలు, కో ఆప్షన్ మాజీ సభ్యుడు నసిరొద్దీన్, నాయకులు వెంకటయ్య, ఆనంద్చారి, రాంరెడ్డి, సంగమేశ్వర్, నాగభూషణం, ప్రకాష్రెడ్డి, రాములు, సురేష్, విజయ్, సచిన్, వెంకట్, దేవ్యాసింగ్, శ్రీను, వైద్యులు సుభాష్, ఇశ్వర్య, కావ్య, ఫజల్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిధారాసింగ్ నాయక్ పెద్దేముల్లో ఉచిత వైద్య శిబిరం -
పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు
అడిషనల్ కలెక్టర్ సుధీర్ అనంతగిరి: మూగజీవాలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం వికారాబాద్లోని జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం, పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడుతున్నందున మూగ జీవాలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. ఎంఈఓ, హెచ్ఎంకు షోకాజ్ నోటీసుతాండూరు రూరల్: పెద్దేముల్ మండలం తింసన్పల్లి ప్రాథమిక పాఠశాలలో 50 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంపై కలెక్టర్ ప్రతీక్జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దేముల్ ఎంఈఓ తోపాటు హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తింసన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. వంట చేసేందుకు నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ రేణుకాదేవి శనివారం పాఠశాలను సందర్శించి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓ నర్సింగ్రావు, హెచ్ఎం ఫక్రుజమాకు షోకాజ్ నోటీసులతో పాటు చార్జి మోమో ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. అరుణాచలేశ్వరుడి సేవలో బీఎంఆర్ తాండూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలై అరుణాచల పుణ్యక్షేత్రాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సందర్శించారు. మంగళవారం బీఎంఆర్ జన్మదినం కావడంతో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వయోజనుల కోసం ‘ఉల్లాస్’ కొడంగల్: చదువురాని వయోజనులు, నిరక్షరాస్యుల కోసం న్యూ ఇండియా లిటరసీ ప్రోగాం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనే కార్యక్రమం చేపట్టిందని ఉల్లాస్ జిల్లా అధికారి శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో ఐకేపీ, మెప్మా శాఖలకు చెందిన ఆర్పీలు, సీసీలతో సమావేశం నిర్వహించారు. మండలంలోని వయోజనులు, నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి బోధనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మహిళా సంఘాల సభ్యులు, సీసీలు, ఆర్పీలు బాధ్యత వహించి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గోపాల్, సీసీలు, మెప్మా సభ్యులు పాల్గొన్నారు. యూరియా కొరత లేదు యాలాల: జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం తెలిపారు. మంగళవారం యాలాల, లక్ష్మీనారాయణపూర్లోని ఫెర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తగినంతగా యూరియా వాడాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు రెండు బస్తాల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పూడూరు: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రభారి శ్రీకాంత్, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, నాయకులు జంగయ్య, బుచ్చన్న, పెద్దిని ప్రకాష్, కృష్ణాచారి, సుభాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి -
సత్వరం పరిష్కరించండి
దౌల్తాబాద్: భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరితో కలిసి సందర్శించారు. రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఇంత వరకు ఆన్లైన్లో నమోదు చేశారని తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటినీ వారంలోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం మండలంలోని దౌల్తాబాద్, తిమ్మారెడ్డిపల్లి, బాలంపేట, గోకఫసలవాద్ గ్రామాల్లోని పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. తరగతి గదులకు తలుపులు, కిటికీలు అమర్చాలని ఆదేశించారు. స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండచడంతోపాటు మొక్కలు నాటాలని సూచించారు. కేజీబీవీ ప్రహరీ చుట్టూ బ్లూ షీట్లు అమర్చాలన్నారు. గోకఫసల్వాద్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఏఈ నాగేందర్కు సూచించారు. బాలంపేటలో నిర్మిస్తున్న పీహెచ్సీకి రోడ్డు వేయాలన్నారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దారు గాయత్రి, ఎంఈఓ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ పలు గ్రామాల్లో పాఠశాలల సందర్శన వసతులు కల్పించాలని ఆదేశం -
విద్యారంగ సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: విద్యారంగంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకుడు ఏ.రాములు(టీఎస్ యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) వికారాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. జీవో నంబర్ 25ను సవరించి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు వర్క్ లోడ్ కనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ విడుదల చేయాలని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి పర్యవేక్షణాధికారి పోస్టులను నింపాలన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి బీఈడీ, డీఈడీ అర్హతలు ఉన్న సీనియర్ ఎస్జీటీ లందరికీ ప్రమోషన్ అవకాశం కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని కోరారు. మోడల్ స్కూల్స్, గురుకుల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూలై 2023 నుంచి అమలు చేయాలని విన్నవించారు. జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, 12 నెలల వేతనాలు చెల్లించాలని వర్తింపచేయాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు బాబురావు, టి.పవన్ కుమార్, శివరాజ్, బసప్ప, వికారాబాద్ మండల అధ్యక్షుడు రాములు, ధారూరు అధ్యక్షుడు అజయ్ కుమార్, కోటపల్లి అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు వినోద్ కుమార్, పరమేష్, ప్రభాకర్, వికారాబాద్ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ నాయకుడు రాములు డిమాండ్ యూఎస్పీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా -
తాగునీరు కలుషితం
తాండూరు టౌన్: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్వహించిన తవ్వకాలతో తాగునీటి పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీరు కలుషితమవుతోంది. తాండూరు – చించోళి మార్గంలో సెయింట్ మార్క్స్ పాఠశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు బయటకు వచ్చి మడుగును తలపిస్తోంది. లీకేజీ నీటిలో పందులు పొర్లాడుతున్నాయి. కుక్కలు, పశువులు దాహం తీర్చుకుంటున్నాయి. ఆ నీరే ఇంకి పైపుల్లో కలిసి ఇళ్లకు సరఫరా అవుతోంది. నెల రోజులుగా ఇలాగే జరుగుతోందని అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే పైప్లైన్కు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్చకులు సంఘటితంగా ఎదగాలి
యాలాల: అర్చకులు సంఘటితంగా ఎదిగేందుకు కృషి చేయాలని దూప దీప నైవేద్య అర్చక సంఘం(డీడీఎన్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం కోకట్ రోడ్లోని షిరిడీ సాయిబాబా మందిర ఆవరణలో జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో చండీ, కుబేర పాశుపత యాగ విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కారు అందిస్తున్న అర్చక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి, మఠం రాజశేఖరస్వామి, విజయ కృష్ణజ్యోషి, కరణం శ్రీకాంత్ పంతులు, జంగం జగదీశ్వర్ స్వామి, నటరాజ స్వామి, కిరణ్కుమార్ జ్యోషి, సంతోష్ స్వామి, వికారాబాద్ శ్రీకాంత్ స్వామి, గౌరారం రఘు స్వామి, సుమన్ పంతులు తదితరులు పాల్గొన్నారు. డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ -
ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడికి సన్మానం
బొంరాస్పేట: జాతీయ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింలుగౌడ్ను పలువురు నాయకులు, ఆయా సంఘాల సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో కోస్గి ఏఎంసీ మాజీ చైర్మన్ ఏర్పుమళ్ల వెంకట్రాములుగౌడ్, రాంచంద్రారెడ్డి, గౌడసంఘం మండల నాయకులు ప్రకాశ్గౌడ్, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులున్నారు. భవిత సెంటర్లో ఫిజియోథెరపీ ఎంఈఓ చంద్రప్ప బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఫిజి యోథెరపీకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు తప్పక తీసుకురావాలని కోట్పల్లి ఎంఈఓ చంద్రప్ప అన్నారు. సోమవారం భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు డాక్టర్ శ్రీకాంత్ ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. సుమారు 20 మందికి పైగా పిల్లలకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. వీరికి ప్రతిరోజు తరగతులు ఉంటాయన్నారు. వారానికోసారి ఫిజియోథెరపీ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్, ఐఈఆర్పీ దిలీప్కుమార్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి స్పందన 380 మందికి ఉచిత పరీక్షలు తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 380 మంది పేషంట్లు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓ లలితాదేవి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ఈ శిబిరం విజయవంతమైంది అన్నారు. 62 మందికి ఆపరేషన్ల నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. వీరికి వారం రోజుల్లో ఆపరేషన్లు పూర్తి చేస్తామన్నారు. అనంతరం పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు గిరిధర్, అక్షయ్, అఖీల్ ఖాన్, రాధ, రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కట్నం కోసం వేధింపులు భర్తపై కేసు మొయినాబాద్: అదనపు కట్నం కోసం భార్య ను వేధిస్తున్న భర్తపై మొయినాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపల్లి గ్రామానికి చెందిన చీపిరి రాజుకు 2012లో నాగిరెడ్డిగూడకు చెందిన సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరితకు మరో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. సోదరులు లేకపోవడంతో పుట్టింటి నుంచి భూమి, ఇల్లు ఇప్పించాలని రాజు కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అతని బాధ భరించలేక కొంత కాలం క్రితం 6 గంటల భూమి ఇచ్చారు. అయినా ఇల్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో గత ఆదివారం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి అక్కడికి చేరుకున్న రాజు భార్యపై దాడిచేశాడు. దీంతో సోమవారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు ఆమనగల్లు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా ఓ బాలికకు దగ్గరై మోసం చేసిన వ్యక్తికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్లుకు చెందిన వెంకటేశ్పై 2021లో పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన షాద్నగర్ పోక్సో కోర్టు నిందితుడికి పైశిక్ష విధిస్తూ తీర్పు వెలువర్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ కుషాల్కర్, ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్, కోర్టు కానిస్టేబుల్లు యాదయ్య, జగన్ నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు. -
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
తాండూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతపై వి ద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పట్టణ మున్సిపల్ డీఈ, ఇంచార్జి కమిషనర్ మణిపాల్ సూచించారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇళ్లు, పాఠశాల, మైదానం వంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని పూల కుండీల్లో, టైర్లలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి, మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి పోయి ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగుతూ వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడంతో పాటు ఇంట్లో వారికి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల హెచ్ఎం ప్రతిభా భారతి, వార్డు ఆఫీసర్లు కార్తీక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త వేరుచేయాలి పరిగి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని గంగపుత్ర కాలనీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు రోజు తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా వేయాలని సూచించారు. చెత్త సేకరణకు ప్రతి రోజు వాహనాలు వస్తున్నాయని వాటిలోనే చెత్తను వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ్ పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ డీఈ మణిపాల్ -
బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు
తాండూరు రూరల్: తాండూరు మండల నూతన ఏపీఏంగా బాలయ్యను జిల్లా అధికారులు నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఐకేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన ఏపీఏం ఆనంద్ బంట్వారం మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మహిళ సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం ఏపీఎంను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి నాగమ్మ, సీసీలు శంకర్, సంధ్య, ప్రభు, వెంకటయ్య, అరవింద్కుమార్, అనసూయ, అకౌంటెంట్ కవిత పాల్గొన్నారు. కుల్కచర్ల ఏపీఎంగా శ్రీనివాస్రెడ్డి కుల్కచర్ల: మహిళ సంఘాల ఉన్నతికి అధికారులు నిస్వార్థంగా పనిచేయాలని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష అన్నారు. సోమవారం కుల్కచర్ల నూతన ఏపీఎంగా శ్రీనివాస్రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న శోభ బదిలీపై దోమ మండలానికి కేటాయించగా.. పరిగి ఏపీఎంగా శ్రీనివాస్రెడ్డి కుల్కచర్లకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఏపీఎంను మహిళా సమాఖ్య అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీలు, వీబీకేలు తదితరులు పాల్గొన్నారు. విధుల్లో చేరిక..యాలాల: ఐకేపీ ఏపీఎంగా శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ప్రమీల జనగాం జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆమె స్థానంలో చౌడాపూర్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను యాలాలకు కేటాయించారు. సో మవారం ఐకేపీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఐకేపీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. -
దళితవాడకు అడ్డంగా కంచె
షాద్నగర్ రూరల్: తమ కాలనీకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు కంచె వేశారని ఫరూఖ్నగర్ మండలం బూర్గుల దళితవాడకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు, దళితుల కథనం ప్రకారం.. బూర్గుల గ్రామంలోని సర్వేనంబర్ 130లో స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు స్థానిక అవసరాల నిమిత్తం యాభై ఏళ్ల క్రితం ఎకరా పది గుంటల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇది పశువుల మంద స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. గ్రామం కోసం కేటాయించిన ఈ భూమిలో కొంతమంది నిరుపేద దళితులు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంలో పంచాయతీ తరఫున బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా అందించడంతో పాటు పశువుల కోసం నీళ్ల తొట్టి నిర్మించారు. ఇళ్లు కట్టుకున్న దళితులు ఈ భూమిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్వే నంబర్ 130లోని 20 గంటల భూమి మాదేనంటూ బూర్గుల నర్సింగ్రావు బంధువు ఆ స్థలం చుట్టూ ఇనుప కంచె వేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని దళితులు తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని తరలించేందుకు కొంత కంచెను తొలగించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదించారని తెలిపాడు. బూర్గుల నర్సింగ్రావు ఆశయ సాధనకు కృషి చేయాల్సిన వారి కుటుంబ సభ్యులే ఇలా దళితులను చిన్నచూపు చూస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని మూసేసి కంచె నిర్మించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులు, పంచాయతీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. రాకపోకలకు అవస్థలు పడుతున్నామని బాధితుల ఆందోళన -
ఢిల్లీకి తరలిన బీసీ నాయకులు
దుద్యాల్: కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మండలంనుంచి పలువురు బీసీ నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి సోమవారం ఢిల్లీకి పయనమయ్యారు. మండల కేంద్రానికి చెందిన మెరుగు వెంకటయ్య కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీసీ సంఘం జిల్లా ముఖ్య నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మీనాక్షి నటరాజన్తో కలిసి ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీసీ నాయకులు ఉన్నారు. అనంతగిరి: బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధనకై కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి వికారాబాద్ ప్రాంతం నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం బయలుదేరారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వీరంతా పయనమయ్యారు. రిజర్వేషన్ల సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రైలులో ప్రయాణం యాలాల: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సోమవారం మండల నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ హన్మంతు, నాయకులు మహిపాల్ తదితరులు ఢిల్లీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో బయలుదేరారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తాండూరు రూరల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన 151 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రేషన్కార్డు ఇచ్చిన దాఖాలలు లేవన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్, పీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు ప్రవీణ్ కుమార్, జితేందర్రెడ్డి, విద్యాసాగర్, ఆనంద్చారి, షబ్బీర్, నర్సింలు, ఫయాజ్, మల్లేశం, ఇక్బాల్, మినహాజ్, బుజ్జమ్మ, ఎర్రబాలప్ప, శంకర్నాయక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలుబొంరాస్పేట: ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రేషన్కార్డులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. బురాన్పూర్, తుంకిమెట్ల తదితర గ్రామాల్లో లబ్ధిదారులు కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గౌడ సంఘం మండల నాయకులు ప్రకాశ్గౌడ్, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులున్నారు.పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ -
నేడు రేషన్ కార్డుల పంపిణీ
బడంగ్పేట్: మహేశ్వరం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ మహే శ్వరం ఇన్చార్జ్ కేఎల్లార్ తెలిపారు. మల్లాపూర్లోని యెల్మేటి అమరేందర్రెడ్డి ఫంక్షన్ హాలులో కొనసాగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి 12 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని స్పష్టంచేశారు. లబ్ధిదారులు విధిగా హాజరై కార్డులు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అమరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, నవారు మల్లారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ‘డబుల్ ఇళ్లు’ స్థానికులకే ఇవ్వాలి తుక్కుగూడ: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానికులకే కేటాయించాలని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూంల పనులను పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వీటి పంపిణీలో స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. హాజరుకానున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
కుల్కచర్ల: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ముజాహిద్పూర్ ప్రభుత్వ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిబా అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్ మాడల్స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నరేశ్ ఈ నెల 2, 3 తేదీల్లో చైన్నైలోని రామకృష్ణ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ పోటీలలో ప్రతిభను కనబరిచాడు. ఈ మేరకు ఆయన్ను జాతీయస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం నరేశ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
మాత్రలు వేద్దాం.. ‘నులి’మేద్దాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకటి నుండి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11న అల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ మాత్రలపై అవగాహన కల్పించి, వందశాతం లక్ష్యం పూర్తయ్యేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆ ర్ఓ సంగీత, డీఆర్డీఏ పీడీ శ్రీలత, డీపీఓ సురేష్మోహన్, డీఈఓ సుశీందర్రావు పాల్గొన్నారు. ప్రజావాణికి 82 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీతతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి కోసం డీఈఈటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)ను ప్రారంభించిందని, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఈటీ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు నిరంతర ఉపాధి కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన డీఈఈటీ వెబ్సైట్ను గత సంవత్సరం డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు వారి నైపుణ్యాలు, విద్యార్హతలు, నివాస ప్రాంతం మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగ సమాచారం అందించబడుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మొండి బకాయిల వసూలుకు చర్యలు
జాయింట్ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావు బంట్వారం: దీర్ఘకాలిక రుణాలు తీసుకొని చెల్లించని వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాయింట్ రిజిస్ట్రార్ (ఓఎస్డీ) సూర్యచంద్రరావు తెలిపారు. సోమవారం బంట్వారం సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంఘం పరిధిలో రూ.5.32 కోట్ల రుణాలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. మొండి బకాయి దారులకు మొదటగా నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇస్తామన్నారు. వారి నుంచి స్పందన లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకుంటే వడ్డీ ఎక్కువ పడుతుందన్నారు. తీసుకున్న రుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే ఎలాంటి నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ డీఎల్ఎన్ రెడ్డి, మోమిన్పేట్ బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, సీఈఓ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్కు పదోన్నతి తాండూరు రూరల్: తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్కు పదోన్నతి లభించింది. డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రదీప్ హైదరాబాద్ జిల్లాకు డీటీగా వెళ్లారు. బదిలీపై వెళ్తున్న ఆయన్ను సోమవారం తహసీల్దార్ తారాసింగ్ తోపాటు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పరిగి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి ప్రభుత్వాతన్ని డిమాండ్ చేశారు. సోమవారం పరిగి పట్టణంలో పార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా రాంచంద్రయ్య, యాదయ్య, చంద్రయ్య, మల్లయ్య, జంగయ్య, రాములు, నజీర్, గఫార్, నర్సింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేదలు ఇళ్లు లేక రోడ్డు పక్కన జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పలు గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పీర్ మహ్మద్, సురేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వేకు సహకరించాలి యాచారం: ఫార్మాసిటీకి పరిహారం అందజేసి సేకరించిన భూముల సర్వేకు రైతులు సహకరించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. యాచారం మండలం పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో అధికారులు చేపట్టిన రైతుల కబ్జా భూముల సర్వేను సోమవారం ఆమెపరిశీలించారు. -
లక్ష్యానికి మించి..
● ఈ ఏడాది సాగు లక్ష్యం 2వేల ఎకరాలు ● ఇప్పటికే టార్గెట్ పూర్తి ● ముందుకొచ్చిన 2,300 మంది రైతులు ● 90శాతం రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. వికారాబాద్: ఆయిల్ పామ్ సాగుకు జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతోంది. ఈ పంట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి, లాభాలు ఉండటంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. భవిషత్ అవసరాలు, ఆయిల్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన వన శాఖ అధికారులకు లక్ష్యం నిర్ధేశించింది. ఇన్నాళ్లు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీలు కల్పిస్తుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన టార్గెట్ను ఉద్యాన వన శాఖ పూర్తి చేసింది. ఇటీవల వికారాబాద్ మండలం కొత్రెపల్లి శివారులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, స్పీకర్ ప్రసాద్కుమార్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ రాష్ట్ర డైరక్టర్ హాస్మిన్బాషా, డిప్యూటీ డైరక్టర్ నీరజ ఆయిల్ పామ్ మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. 35వేల ఎకరాల్లో అనుకూలం జిల్లాలో 5.61 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతుండగా ఇందులో 50 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు అవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను విధించింది. వికారాబాద్ జిల్లాలో 35 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో కనీసం 2వేల ఎకరాల్లో పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకొగా అది పూర్తయ్యింది. 2వేల మంది రైతులు సాగుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. లక్ష్యానికి మించి మరో 300 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. రాయితీతో.. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఐదెకరాల వరకు సాగుచేసే సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై మొక్కలు అందజేయనుంది. 90శాతం రాయితీపై డ్రిప్పైపులు కూడా అందజేస్తారు. పంట దిగుబడి ప్రారంభమయ్యే వరకు అంతర పంటలు సాగుకు ఎకరాకు ఏడాదికి రూ.2100 చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మొక్కలతోపాటు డ్రిప్ పరికరాలను ఉచితంగా ఇస్తారు. 9 ఎకరాల నుంచి 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేసే రైతులకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఏడాదికి రూ.2.5 లక్షల ఆదాయం ఆయిల్పామ్ దీర్ఘకాలిక పంట. మూడున్నర సంవత్సరాల నుంచి పంట ప్రారంభమై ఐదు సంవత్సరాలకు అమ్మాకినికి వస్తుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాల పాటు ఏడాదికి ఎకరాకు 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. దాదాపు రూ.2.5 లక్షల ఆదాయం చేకూరుంది. ఎకరం పొలంలో 57 మొక్కలు మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. అంతర పంటలుగా శ్రీగంధం, సర్వి, ఉల్లి, కూరగాయల పంటలు సాగు చేసుకోవచ్చు.ఇటీవల కొత్రెపల్లిలో ఆయిల్ పామ్ మొక్క నాటుతున్న మంత్రి తుమ్మల, స్పీకర్ ప్రసాద్కుమార్ దరఖాస్తు చేసుకోవాలి ఆయిల్ పామ్ సాగుపై అసక్తి గల రైతులు తమను సంప్రదించి దరఖాస్తూ చేసుకోవాలి. రైతు వాటా ఎకరాకు రూ.1,750 చొ ప్పున ఎన్నిఎకరాలు ఉంటే అంత డబ్బు డీడీ రూపంలో తీసి ఇవ్వాలి. నీట సౌకర్యం ఉన్న రైతులే దరఖాస్తు చేయాలి.తాండూ రు సమీపంలోని కోకట్ నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే కంపెనీలతో రైతులను టయ్యప్ చేస్తాం. – సత్తార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
రిజర్వేషన్లు ఆమోదించకుంటే ఉద్యమం
కడ్తాల్: 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యవర్గ సభ్యుడు కందుకూరి జగన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్లో సోమవారం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తక్షణమే బీసీ రిజర్వేషన్లను ఆమోదించి అమలు చేయాలని లేని పక్షంలో బీసీ సామాజికవర్గాన్ని ఐకమత్యం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకోసం మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ సామాజికవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఆమనగల్లు ఏరియా కమిటీ కన్వీనర్ శివశంకర్, నాయకులు శివగల రమేశ్, గుమ్మడి కరుమయ్య పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● వికారాబాద్, మోమిన్పేట్ జూనియర్ కళాశాలల్లో తనిఖీ అనంతగిరి/మోమిన్పేట్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ లెక్చరర్లకు సూచించారు. సోమవారం వికారాబాద్, మోమిన్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏఏ సబ్జెక్టులు ఎంత వరకు పూర్తయ్యాయని ఆరా తీశారు. ఆతర్వాత సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ పనులు ఉంటే సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆదేశించారు. అనంతరం మోమిన్పేట్ పశువైద్యశాలను తనిఖీ చేశారు. ఒక్కరే విధుల్లో ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్.శంకర్ నాయక్, వికారాబాద్ఎంపీడీఓ వినయ్ కుమార్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు, మోమిన్పేట్ ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 147 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
● చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు పూర్తి ● ప్రభుత్వానికి చేరిన అంచనాలు ● ఉత్తర్వులు రావడమే ఆలస్యం ● జిల్లాలో మొత్తం చెరువులు 1,179 ● ఎంపిక చేసినవి 778 ● వదలాల్సిన చేపపిల్లలు 1.29 కోట్లు ● మత్స్య సహకార సంఘాలు 152వికారాబాద్: జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. వందశాతం రాయితీతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించినా ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. ఏ సమయంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చేప పిల్లలు వదిలేందుకు అనువైన చెరువులను ఎంపిక చేశారు. ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన ఆ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అంజేశారు. ప్రస్తుతం టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే ఎప్పటిలోగా చేపపిల్లలు వదులుతారనే విషయంపై స్పష్టత లేదు. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 778 చెరువుల్లో చేపపిల్లలు వదలాలని నిర్ణయించారు. ఈ ఏడాది 1,29,72,000 చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో ఈ నెల నుంచే చేప పిల్లలు వదిలే ప్రక్రియ ప్రారంభించాలని మత్స్య సహకార సంఘాల సభ్యులు కోరుతున్నారు. అలాగే చెరువులకు సరిపడా చేప పిల్లలు పంపిణీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. లక్ష్యానికి దూరంగా.. చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే చేపపిల్లలు వదిలి చేతులు దులపుకొంటున్నారు. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో చెరువులు పూర్తి స్థాయిలో నిండేవి. ఈ ఏడాది ఇప్పటికే అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించపోవడంతో చాలా మంది మత్స్యకారులు బయట కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకోవాల్సి వస్తోంది. నాసిరకం పిల్లలు ఏటా ప్రభుత్వం వదులుతున్న చేపపిల్లల్లో ఎక్కువ శాతం నాసిరకంగానే ఉంటున్నాయి. సాధారణంగా చెరువుల్లో వదిలే సమయంలో మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాలి. కానీ ఒక్క ఇంచుకు మించి ఉండటం లేదు. గతేడాది దోమ మండలం మోత్కూర్ చెరువులో చేపపిల్లలు వదిలేందుకు అధికారులు వచ్చారు. నాసిరకంగా ఉండటంతో మత్స్యకారులు అధికారులతో గొడవకు దిగారు. నాలుగు సార్లు చేప పిల్లలను తిరిగి పంపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప పిల్లల లెక్కల్లో తేడా ఉందని అంటున్నారు. లక్ష పిల్లలు వదిలామని చెబుతున్నా అందులో 50 వేలు కూడా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు దృష్టిసారించి నాణ్యమైన చేపపిల్లలు వదలడంతోపాటు లెక్క కూడా సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఉత్తర్వులు రాగానే.. జిల్లాకు ఎన్ని చేపపిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాం. ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆదేశాలు అందిన వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదులుతాం. – వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి
షాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామిక వాడలో నీలోఫర్ బాబురావు ఏర్పాటు చేసిన నీలోఫర్ టీ ఫౌడర్ ప్యాకింగ్ కర్మాగారాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్ది, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహాకాలను అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్లు జనార్దన్రెడ్డి, లింగం, నాయకులు అశోక్, రాఘవేందర్, నర్సింహారెడ్డి, సూర్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి -
రక్తదానం.. ఆరోగ్యానికి మంచిది
కొడంగల్ కోర్టు సివిల్ జడ్జి శ్రీరామ్ కొడంగల్: రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదని కొడంగల్ కోర్టు సివిల్ జడ్జి శ్రీరా మ్, వికారాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రవీంద్రా యాదవ్, సీఐ శ్రీధర్రెడ్డి అన్నా రు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివా రం యువసేన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రక్తదానం శిబిరం ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు 56 మంది యువకు లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అతిథు లు మాట్లాడుతూ.. రక్తదానం చేయడంతో కొ త్త రక్తం ఉత్పత్తి అవుతుందన్నారు. దీంతో శరీ ర భాగాలు చురుకుగా పని చేస్తాయని చెప్పా రు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వ హించిన పరిశోధనలో రక్తదానం చేసిన వారి జీవిత కాలం నాలుగేళ్లు పెరిగినట్లు తేలిందన్నారు. రోడ్లకు మరమ్మతు చేపట్టాలి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య యాలాల: మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్–దేవనూరు మార్గంలో అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మతు పనులను చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కేవీపీఎస్ నాయకులతో కలిసి దెబ్బతిన్న రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. లక్ష్మీనారాయణపూర్–బెన్నూరు మార్గంలో మరమ్మతు పనుల పేరిట గతంలో తవ్వి వదిలేశారని, ఈ ప్రాంతంలో వాహనదారులు అవస్థలు పడుతున్నారన్నారు. అసంపూర్తిగా మారిన రోడ్డు విషయంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చొరవ చూపి మరమ్మతు పనులు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో యాదప్ప, చిన్న, ఫాజిల్, ఎల్లప్ప, నర్సింలు, పాండుగౌడ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వాస్పత్రిలో కంటి పరీక్షలు కొడంగల్: కంటి సమస్యలు ఉన్న వారికి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు డిప్యూ టీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రాయాదవ్ అన్నారు. గత నెల 22వ తేదీన కంటి ఆపరేషన్లు చేసిన వారికి ఆదివారం స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కొన్నేళు్ాల్గ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వైద్యారోగ్య శాఖ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆప్తాల్మిక్ అధికారి లయన్ హరినాథ్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం తిరుపతిలో ప్రత్యక్షం పూడూరు: మండలంలోని మన్నెగూడ కేశవరెడ్డి పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేశవరెడ్డి పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న కె. ఈశ్వర్ (12) ఈ నెల 2న పాఠశాల నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పాఠశాల సిబ్బంది ఆరా తీయగా పాఠశాల గోడదూకి పారిపోయినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. గోడ దూకి వెళ్లిన విద్యార్థి ఇంటికి రాలేదని, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ విక్రం, విద్యార్థి కుటుంబ సభ్యులు చన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి కనిపించకుండ పోయిన విషయాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు దొరికినట్లు తెలిపారు. వారు విద్యార్థినుంచి పూర్తి వివరాలు సేకరించి తిరుపతిలోని కేశవరెడ్డి పాఠశాల బ్రాంచిలో బాలుడిని అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నేడు ఇందిరానగర్లో వైద్య శిబిరం
తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరా నగర్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి లలితా దేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. చెవి, ముక్కు, గొంతు, కళ్లు, కడుపులో గడ్డలు, మానసిక సమస్యల వంటి వాటికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్యాంపు ఇన్చార్జి డాక్టర్ గిరిధర్తో పాటు మరికొంత మంది స్పెషలిస్టు వైద్యులు ఈ శిబిరంలో సేవలందించనున్నట్లు చెప్పారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు తాండూరు టౌన్: వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వయసు క్రీడాకారులకు మంగళవారం అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాము ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విలియంమూన్ గ్రౌండ్లో ఉదయం 8 గంటల నుంచి ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నా రు.అండర్–8, 10 విభాగాల్లో బాలబాలికలకు 60 మీటర్ల పరుగు పందెం, బ్రాడ్ జంప్, అండర్–12 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, అండర్–14 విభాగంలో జావెలిన్ త్రో, అండర్–6,18,20 విభాగాల్లో జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తహసీల్దార్ ధ్రువీకరించిన జనన పత్రంతో రావాలన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నేరుగా రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 63000 75229, 99513 43432 నంబర్లలో సంప్రదించాలన్నారు. చంద్రకల్ వాసికి డాక్టరేట్ దౌల్తాబాద్: మండల పరిధిలోని చంద్రకల్ గ్రా మానికి చెందిన దేవయ్య, శకుంతల కుమార్తె సరిత ప్రొఫె సర్ జయశంకర్ వర్సిటీలో ఆదివారం డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో నేల నాణ్యత పెరుగుదలపై అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశ్రీ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినట్లు వివరించారు. డాక్టరేట్ పొందిన సందర్భంగా సరితను కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు. బాలేశ్వర్గుప్తాకు సత్కారం యాలాల: లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ సువర్ణ కంకణ అవార్డుల సంబురాలను ఆదివారం హైదరాబాద్లోనిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవ ఎంపీపీగా బాలేశ్వర్గుప్తాకు నిర్వాహకు లు జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ అవార్డుల కార్యక్రమానికి ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, సినీనటుడు శివాజీ రాజా, జనార్థన్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలేశ్వర్గుప్తా మాట్లాడుతూ.. ఉత్తమ సేవా విభాగంలో భాగంగా తనను గుర్తించడం సంతోషించ తగిన విషయమన్నారు. పేలిన లారీ టైరు ● అక్కడికక్కడే డ్రైవర్ మృతి ● హనుమకొండ జిల్లా వంగపహాడ్ సమీపంలో ఘటన ● మృతుడు జిల్లా వాసి హసన్పర్తి: టైరును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా వంగపహాడ్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జిల్లా పరిధిలోని తాండూరుకు చెందిన పి.సాయిలు(40) షాబాద్ బండల లోడ్ లారీతో జాతీయ రహదారిపై ములుగు వైపునకు బయలుదేరాడు. ఈ క్రమంలో వంపగహాడ్ సమీపంలో లారీ ఆపి టైరును పరిశీలిస్తుండగా ఒకేసారి పేలింది. ఈ ఘటనలో సాయిలు అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సంజీవనిలా 108
● ప్రాణరక్షకులుగా సిబ్బంది ● అత్యవసర సమయాల్లో మెరుగైన సేవలు తాండూరు రూరల్: దివంగత మహానేతవైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకువచ్చిన 108 అంబులెన్స్ పథకానికి నేటికీ ఆదరణ కొనసాగుతోంది. ఆపదలో ఉన్న వారికి అంబులెన్స్ సిబ్బంది ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా మొదట గుర్తుకువచ్చేది 108. ప్రమాదం చూసిన వారు తొలి స్పందనగా 108 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇస్తున్నారు. క్షతగాత్రులకు ప్రథ మ చికిత్స అందించడంతో రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీంతో అంబులెన్స్ ప్రజలకు సంజీవనిగా నిలుస్తోంది. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. అత్యవసర సేవలు 108 అంబులెన్స్ వాహనంలో అత్యవసర సేవలు అందుతున్నాయి. శిక్షణ పొందిన ఈఎంటీ, పైలెట్ అందుబాటులో ఉంటారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది వచ్చి అంబులెన్స్లో ప్రథమ చికిత్స అందించిన తర్వాత సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తుంటారు. వాహనంలో ఏఈడీ పరికరం, గుండె చికిత్సకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంటాయి. ఆక్సిజన్ పరికరాలు, ఆక్సీమీటర్, పురుగు మందు తాగితే కక్కించే యత్రం ఉంటాయి. గర్బిణి కేసులు ఎక్కువ 108కు వచ్చే ఫోన్కాల్స్లో గర్భిణులకు సంబంధించినవే ఎక్కువ. మారుమూల ప్రాంతా ల్లోని గ్రామాలు, తండాల నుంచి గర్భిణులకు తాండూరు మాతాశిశు ఆస్పత్రికి తరలిస్తుంటారు. వాహనంలోనే సుఖ ప్రసవాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రాణాలు కాపాడడమే కర్తవ్యం కాల్ వచ్చిన వెంటనే లోకేషన్ నుంచి 30 సెకండ్లలోపు వా హ నం బయలుదేరుతుంది. జిల్లాలో 17 వాహనాలున్నాయి. అంబు లెన్స్లను నిత్యం తనిఖీ చేస్తున్నాం. మందులు, పరికరాలు అందుబాటులో ఉంచాం. ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి క్షత్రగాత్రులకు అంబులెన్స్లో ప్రథమ చికిత్స నిర్వహిస్తాం. వారి ప్రాణాలు కాపాడమే మా కర్తవ్యం. – శ్రీకాంత్, జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ ఉద్యోగంతో సంతృప్తి 12 ఏళ్లుగా పని చేస్తు న్నా. ఈ ఉద్యోగం కత్తిమీద సాము లాంటింది.రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తించాలి. ఫోన్కాల్ వచ్చిన క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకోవాలి. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులకు వివరిస్తూ ఆస్పత్రికి తరలిస్తాం. ఇందుకు పైలెట్ల సహకారం మరవలేనిది. ఈ ఉద్యోగం ఎంతో సంతప్తినిస్తోంది. – నర్సింలు, ఈఎంటీ, పెద్దేముల్ జిల్లాలో 15 నెలలుగా అందించిన సేవలు మెడికల్ కేసులు 20,407 గర్భిణులు 5,424 యాక్సిడెంట్ 1,872 గుండె నొప్పి 771 బ్రీతింగ్ సమస్యలు 983 -
ఛత్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి
శంకర్పల్లి: హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. మండలంలోని గోపులారంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన పోరాటాలకు సంబంధించిన చరిత్రను చదివి స్ఫూర్తి పొందాలన్నారు. రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. యువత అన్ని మతాల వారిని గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట వీరధర్మాజ స్వామి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మండలాధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములు, వాసుదేవ్ కన్నా, బయానంద్ తదితరులు పాల్గొన్నారు. గెలుపుకోసం కృషి చేయాలి మొయినాబాద్రూరల్: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ గెలుపుకోసమే అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మండలపరిధిలోని అమ్డాపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కట్టమైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు గొల్లపల్లి రవీందర్రెడ్డి, నోముల అంజిరెడ్డి, మధుసూధన్రెడ్డి, మహేందర్ముదిరాజ్, నారంరెడ్డి, బాత్కు శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పీజీ నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పరీక్షకు ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ, శ్రీఇందు, ఏవీఎన్, శ్రీఇందు, గురునానక్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కోసం 110 మందిని కేటాయించారు. పరీక్ష సమయానికి ముందుగానే చేరుకున్న గాంధీ మెడికల్ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్ నితిన్ పొరపాటున ప్రొవిజనల్ సర్టిఫికెట్ మర్చిపోయాడు. పరీక్ష సమయం దగ్గరపడుతుండడం.. సమీపంలో ఎక్కడా జిరాక్స్ కేంద్రాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి తన కారు ఇచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు పంపించి ప్రొవిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో నితిన్, ఆయన తల్లిదండ్రులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. -
వర్షాభావం కారణంగా భారీగా తగ్గిన వరిసాగు
● నిండని చెరువులు..పెరగని భూగర్భజలాలు ● నెలాఖరు వరకు సమయం ఉందంటున్న శాస్త్రవేత్తలు ● శాస్త్రీయ పద్దతులు పాటించాలని వ్యవసాయ శాఖ సూచన ఈ ఏడాది ఖరీఫ్(వానాకాలం) రైతులకు నిరాశే మిగుల్చుతోంది. గతేడాది 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది నేటికీ 40 వేల ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో మెజార్టీ స్థాయిలో చెరువులు నిండక.. భూగర్భ జలాలు పెరగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్: ఈ ఏడాది వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షాకాలంలో వచ్చిన మార్పులతో ఈ ఏడాది సాగు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోనే అత్యధికంగా పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూరు, కొడంగల్ పరిధిలోని బొంరాస్పేట్, దౌల్తాబాద్, దుద్యాల, తాండూరు పరిధిలోని యాలాల మండలాల్లో వరి అత్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా గత నాలుగేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది చెరువుల్లోకి నీరు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 1,187 చెరువులకు గాను 62 చెరువులు అలుగు పారుతుండగా మరో 194 చెరువులు 75 శాతం నుంచి వందశాతం నిండాయి. మిగతా చెరువులు ఇంకా నిండలేదు. భూ గర్భ జలాలు సైతం పెరగలేదు. ఆందోళనలో అన్నదాత సరిపడా వర్షాలు కురవక రైతులు వరి నాట్లు వేసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులంతా నారు పోసుకున్నా సగం కంటే తక్కువ మంది నాట్లు వేస్తున్నారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేస్తున్నప్పటికీ నీరు అడుగంటడంతో పంటలు పండుతాయా.. ఎండుతాయా..? అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఈ నెలాఖరు వరకు వరి నాట్లు వేసుకోవచ్చని సూచిస్తున్నారు. తమ సలహాలు, సూచనల మేరకు సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనలు ● బీపీటీ 5204, ఎంటీయూ 1010, ఎంటీయూ 1001, చిట్టిముత్యాలు తదితర రకాలవరివిత్తనాలు సాగుచేస్తున్నారు. ● సాంబమసూరి, భరణి, కాటన్ దొర సన్నాలు, సోమశిల, సింహపురి, తెలంగాణ సోనా రకాలను వానాకాలం సీజన్లో సాగుచేస్తే మంచి దిగుబడులు వస్తాయి. ● ఈ రకాలు ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుంది. యాసంగిలో మరో పది బస్తాల వరకు పెరుగుతాయి. ● ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాలు యాసంగిలో మంచి దిగుబడులు ఇస్తాయి. ● సెప్టెంబర్ మొదటి వారంలోపు వరినాట్లు వేసుకోవటం మంచిది. జాగ్రత్తలు ● వరి పంటను కాండం తొలుచు పురుగు, ఆకుముడత తెగులు, దోమపోటు, అగ్గితెగులు ఆశించే అవకాశాలు ఎక్కువ. ● కాండం తొలుచు పురుగు నివారణకు నారు మళ్లలో ఒకటిన్నర కిలోల గుళికల మందు చల్లుకోవాలి. ● నాట్లు వేశాక 20 రోజులకు ఎకరానికి 8–10 కిలోల వాసన రాని గుళికల మందు వేసుకోవాలి. ● ఆకుముడత తెగులు నివారణకు కోలరోపైరిపాస్ లేదా మోనొ క్రొటోపాస్ మందు పిచికారీ చేసుకోవాలి. ● దోమపోటు నివారణకు ఇమిడా క్లోరోఫిడ్, అగ్గి తెగులు నివారణకు ట్రై సోక్లోజోన్ మందులను పిచికారీ చేసుకోవాలి. ● ఈ మందులన్నీ సూచిచించిన మోతాదు మేరకే వాడాలి. అందుబాటులో ఎరువులు రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడుతున్నారు. దీంతో అనర్థాలు ఎక్కువ. యూరియా ఎక్కువగా వా డడంతో పైరు ఏపుగా పెరగి పచ్చగా మారడంతో పంటను ఆశించే పురుగులు, చీడపీడల శాతం పె రిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో రై తులకు సరిపడా ఎరువులు అందుబాటు ఉంచాం. – రాజారత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
సమానత్వమే సనాతన ధర్మం
తాండూరు టౌన్: సమానత్వమే సనాతన ధర్మమని శ్రీమాణికేశ మహాసంస్థానం ఆశ్రమ పీఠాధిపతి, విశ్వహిందూ పరిషత్ ప్రాంత సామాజిక సమరసత మార్గదర్శకులు శ్రీ శంకర్ స్వామీజీ అన్నారు. ఆదివారం ఆయన తాండూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్ సేవా బస్తీ, దళిత వాడలోని మునింగం లాలప్ప గృహంలో రుద్రాభిషేకం, మహా హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం అడ్డు గోడలను కూలుస్తూ, హిందువులను ఏకం చేయడం కోసం, అందరిలో సోదర భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గడప లోపలే కులం, గడప దాటితే హిందూ బంధువులం అనే భావనను ప్రజలంతా కలిగి ఉండాలన్నారు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, అందరిలో ఆధ్యాత్మిక భావనను జోడించేందుకే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అనంతరం దంపతులకు శివలింగం, సంస్థానం తరుఫున అమ్మవారి వస్త్రాలు అందజేశారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని బస్తీలో రాఖీలు కట్టారు. శ్రీమాణికేశ మహాసంస్థానం ఆశ్రమ పీఠాధిపతి శంకర్ స్వామీజీ -
ఫోన్ అప్పగింత
మహేశ్వరం: 108లో మరిచిన మొబైల్ ఫోన్ను.. అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువుకి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు. కందుకూరు మండలం మీర్కాన్పేట్ గ్రామానికి చెందిన నందిగామ లక్ష్మమ్మ(75) అనారోగ్యానికి గురి కావడంతో బంధువులు అంబులెన్స్లో చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో రోగి బంధువులు.. తమ ఫోన్ను వాహనంలో వదిలి వెళ్లిపోయారు. మండల కేంద్రం చేరుకున్న వాహన సిబ్బంది.. సెల్ను గమనించి రోగి బంధువులకు సమాచారం అందించి అప్పగించారు. దీంతో ఈఎంటీ కుమార్, ఫైలట్ యాదయ్యను వారు అభినందించారు. -
అవగాహన లేక.. అందిపుచ్చుకోక!
మోమిన్పేట: వ్యవసాయంలో యూరియాకు బదు లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నా దాని అమలుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. కేంద్ర సర్కారు రెండేళ్ల క్రితమే ప్రతిష్టాత్మకంగా నానో యూరియా, నానో డీఏపీలను(ద్రవ రూపం) విడుదల చేసినా దానిపై అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. దీని ఫలితంగా ప్రస్తుతం రైతులు యూరియా బస్తాల కోసం ఫర్టిలైజర్ షాపుల ఎదుట బారులు తీరు తున్న ఘటనలు ఉన్నాయి. నానో యూరియాపై సమగ్రంగా అవగాహన కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పంటలకు సోకిన తెగుళ్లు పత్తిలో వచ్చే తెగుళ్లు, పెను బంక, నల్ల, తెల్ల పెనులు వచ్చి పంటను ఎదగకుండా నాశనం చేస్తుంటే రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించడం మానేసి ఎరువుల షాపులను ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయాధికారులు పంటలపై వచ్చే తెగుళ్లు నివారణపై అవగాహన కల్పించడం లేదని స్పష్టంగా తెలుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఏదో ఏ పని ఉందని కార్యాలయాలు మాత్రం దాటడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాధికారులు విత్తనాలు విత్తుకొన్నది మొదలు పొలం బాట పట్టితే రైతుల సమస్యలు అర్థమవుతాయని అంటున్నారు. గత వారంలో అధికంగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో కొన్ని పంటలకు తెగుళ్లు సోకగా రైతులు మందుల దుకాణం యాజమానులను సంప్రదించారు. రైతుల ఆగ్రహం ముఖ్యంగా యూరియా కోసం నిత్యం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. నానో యూరియా, నానో డీఏపీలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కార్యాలయాలు దాటడం లేదు. రవాణా ఖర్చు, దూర భారం, ఏ మందులోనైనా కలిపి పిచికారీ చేసుకోవడం, ఒక బస్తా యూరియాకు ఒక లీటరు నానో యూరియా సమానమని రైతులకు అవగాహన కల్పిస్తే ఇబ్బందులు తప్పుతాయి. కానీ అధికారులు ఆ విధంగా ఆలోచించడం లేదని ఆరోపణలున్నాయి. ఎప్పుడు చూసిన వ్యవసాయాధికారులు కార్యాలయంలోనే ఉండటాన్ని రైతులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు పొలం బాట పట్టి రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించాలని కోరుతున్నారు.నానో యూరియా, డీఏపీ వినియోగంపై నీలినీడలు క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల అలసత్వం -
ఏం కొనలేం... ఏం తినలేం!
దౌల్తాబాద్: రోజురోజుకు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారుల పరిస్థితి కొనలేం..తినలేం అనట్టుగా మారింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూరగాయల సాగు తగ్గిపోవడంతో సప్లయ్ తగ్గింది. మార్కెట్లో డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. అందునా వ్యాపారులు ఇదే అదనుగా భావించి ధరలు రెండింతలు పెంచి అమ్ముకుంటున్నారు. దీంతో పేదలు ఎక్కువగా కూరగాయలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. రూ.200లతో మార్కెట్కు వెళ్తే నాలుగు రకాల కూరగాయలే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ప్రస్తుతం పప్పు, చింతపండుతో సరిపెట్టుకోవలసి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజల నేపథ్యంలో కూరగాయల వంటలకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో రేట్లు పెరిగే అవకాశం కూడా ఎక్కువే. ఈ విషయంలో అధికారులు స్పందించి రైతు బజార్లలో దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ధరలు ఇలా.. కిలో మిర్చి రూ.100, టమాట 40, బీరకాయ 80, దొండకాయ 80, బెండకాయ 80, గోబిపువ్వు 100, వంకాయ 80, ఆలు 60, కిలోచిక్కుడుకాయ రూ.80లుగా అమ్ముతున్నారు. భారంగా కూరగాయల ధరలు ఇబ్బందుల్లో వినియోగదారులు పట్టించుకోని అధికారులు -
ఫోన్ కాల్తో స్పందించారు..బాలికను కాపాడారు..
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్కుమార్కు శనివారం ఒడిశాలోని కటక్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. దక్షిణాసియా మహిళా ఫౌండేషన్లో ప్రోగ్రాం ఆఫీసర్గా పని చేస్తున్న తాన్వి సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఒడిశా రాష్ట్రం, కేంద్రపాడా జిల్లా, ఔల్ మండలం, సహిరా గ్రామానికి చెందిన బాలిక(16) అపహరణకు గురైందని, ఆమెను బాచుపల్లిలోని ఓ ఇంట్లో నిర్భందించినట్లు సమాచారం అందించాడు. దీంతో తక్షణమే స్పందించిన ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో కొద్ది గంటల్లోనే బాలికను ఇందిరానగర్లోని ఓ ఇంట్లో బంధించినట్లు గుర్తించి రక్షించారు. అనంతరం ఆమెను సూరారంలోని సఖి సెంటర్కు తరలించారు. ఆమె తలిదండ్రులు లేదా ఒడిశా పోలీసులకు అప్పగించే వరకూ తాత్కాలిక రక్షణలో ఉంచనున్నట్లు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఒడిశా నుంచి సమాచారం అప్రమత్తమై బాలికను కాపాడిన బాచుపల్లి పోలీసులు -
జాలీగా.. అ‘పూర్వ’ కలయిక
శంషాబాద్: మూడు దశాబ్దాల క్రితం పదో తరగతి చదువుకున్న అలనాటి స్నేహితులంతా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కలిశారు. నాటి స్నేహితులు ఒకే చోటి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని మురిసిపోయారు. శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1993వ సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై న తమ తోటి స్నేహితుడు సంకూరి జయప్రకాశ్ను ఘనంగా సన్మానించారు. శారీక వైకల్యంతో బాధపడుతున్న మరో స్నేహితుడు భాస్కరాచారికి ఆర్థికంగా సాయం అందజేసి మేమున్నామంటూ భరోసానిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది ఎస్.వెంకట్రెడ్డి, డాక్టర్ ఎ.కృష్ణ, భాగ్యలక్ష్మి, ఎన్.వరలక్ష్మి, సరిత, రజిత, బి.వరలక్ష్మి, పద్మావతి, ఎస్.కిరణ్, మహ్మద్ ఆసిఫ్, లక్ష్మణ్ప్రసాద్, టి.నర్సింహ, చందు, మహేందర్, దాసు,సురేష్, సాయిబాబా, సత్యనారాయణ, యూసుఫ్, నర్సింగ్రావు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాటారు.. నరికారు..
తాండూరు: మొక్కలు నాటి చెట్లను పెంచాలని ఓ వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. వనమహోత్సవం పేరిట తాండూరు మున్సిపాలిటీకి లక్ష్యం నిర్దేశించారు. కాని లక్ష్యం పక్కన పెట్టి అధికారులు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని చెట్లను నరకడం వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ కార్యాలయ భవనం వెనకల నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు చెట్లుగా మారాయి. కార్యాలయ ప్రాంగణంలో మాత్రం కారణం లేకుండానే నరకడం విమర్శలకు తావిస్తోంది. తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట చెట్ల నరికివేత -
మేమున్నామని..
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1983– 84 పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్లుగా చెక్కు చెదరని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకుంటూ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు ఇటీవల రూ.1.50 లక్షల విలువైన బెంచీలు, బీరువా తదితర సామగ్రిని అందజేశారు. మహిళా దినోత్సవం, ఫ్రెండ్షిప్ రోజున ఒక్కచోటకు చేరి పాత జ్ఞాపకాలను నెరమువేసుకుంటున్నారు. వృద్ధాప్యం ముంచుకువస్తున్నా తరచూ కలుస్తూ స్నేహనికి కన్న మిన్న లోకాన లేదురా అని చాటిచెబుతున్నారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
తాండూరు: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజారోగ్యాఽనికి పెద్ద పీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శనివా రం ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలో అనారోగ్యంతో కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలు పొందిన వారికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. 170 మంది లబ్ధి దారులకు రూ.56.60 లక్షలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గం ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆర్థికభరోసా కల్పిస్తోందన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
సీజనల్పై అప్రమత్తంగా ఉండాలి
అనంతగిరి: ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నమోదయ్యే అవకాశం ఉన్నందున వైద్యులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యులకు ఆస్పత్రిలో సేవల విస్తరణ కోసం తగు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని పాత ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మాతా శిశు సంరక్షణ సేవలను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో జరుగుతున్న మరమ్మతులు, మార్పులపై ఆరా తీశారు. అక్కడి నుంచి రామయ్యగూడ పీహెచ్సీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అందజేస్తున్న సేవలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. వైద్యులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, డాక్టర్ రాంచంద్రయ్య, ఆయా విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేందర్ కుమార్ -
40 ఏళ్ల బంధం
తాండూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన శ్రీదేవి, లలిత మంచి స్నేహితులు. బాల్యమంతా కడపలోనే చదువుకున్నారు. 6వ తరగతి నుంచే మంచి ఫ్రెండ్స్. వివాహ అనంతరం శ్రీదేవి తెలంగాణాలో.. లలిత కర్ణాటకలో స్థిరపడ్డారు. ప్రస్తుతం శ్రీదేవి తాండూరు మండలం జినుగుర్తి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నారు. లలిత బెంగళూరులోని నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉన్నారు. 40 ఏళ్లుగా వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఏదైనా శుభకార్యం జరిగినా, పండుగలు, వేసవి సెలవులు వచ్చినా కలుస్తారు. కుటుంబ సభ్యులతో సరదగా గడుపుతుంటారు. ప్రపంచంలో వెల కట్టలేనిది స్నేహం మాత్రమే అని శ్రీదేవి తెలిపారు. -
నిరుపేద కుటుంబానికి అండ
పరిగి: నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ ప్రకటించారు. పట్టణ కేంద్రానికి చెందిన నారాయణ, అతని కుమారుడు, కోడలు, మనవడు ఇల్లు లేక శ్మశానవాటికలో ఆరు నెలలుగా ఉంటుండంతో ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శనివారం వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలుడి వైద్య ఖర్చులకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నారాయణ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయిన నారాయణ మనువడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. పట్టణ కేంద్రంలో స్థలాన్ని సేకరించి కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు నిర్మించే విధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులను నిర్వహించాలని ఎలాంటి అవకతవకలు జరిగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఎంహెచ్ఓ లలితాదేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, తహసీల్దార్ వెంకటేశ్వరి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ -
సమాజహితం కోరి..
ఆమనగల్లు: ఆమనగల్లు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1994 – 95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులందరూ ‘స్నేహ హస్తం’ పేరిట సమాజ సేవ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో స్నేహ హస్తం ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ సీఐగా పనిచేస్తున్న గజ్జె చరమందరాజు, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ కొనసాగుతోంది. అనారోగ్యానికి గురైన బాల్య మిత్రులకు అండగా నిలుస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. -
స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే..
పరిగి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర నిర్వహిస్తోందని, కానీ అది జనరహిత పాదయాత్రగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. జనాల్లోకి వెళ్లకుండా బందోబస్తు నడుమ పాదయాత్ర చేస్తే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో దేన్నీ పూర్తిగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై జనాలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. యాభై ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు.. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అయ్యిందన్నారు. ఇందులో ఎక్కడా వెయ్యి మంది కూడా కనిపించలేదని, ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న పాదయాత్ర సీఎం రేవంత్రెడ్డికే ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్రావు, నాయకులు ప్రవీణ్రెడ్డి, సురేందర్, తహేర్ఆలీ, రవికుమార్, కృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాదయాత్రపైబీఆర్ఎస్ నేతల విమర్శలు అది జన రహిత పాదయాత్ర:మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సీఎం రేవంత్రెడ్డికే ఇష్టం లేదు: మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి -
దూసుకొచ్చిన మృత్యువు
డీసీఎం ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి పరిగి: సంతలో కూరగాయలు విక్రయించి ఇంటికి వెళ్తున్న దంపతులకు డీసీఎం మృత్యుపాశంగా మారింది. బైక్ను ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొనింటి లక్ష్మి(33), వెంకటయ్య(42) భార్యాభర్తలు. ఇద్దరూ నిత్యం సంతలో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం పరిగి సంత కావడంతో కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చి సాయ ంత్రం ఇంటికి బైక్పై బయలు దేరారు. మార్గమధ్యలో సుల్తాన్పూర్ గేట్ దగ్గర వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా వెంకటయ్య అపస్మరకస్థితిలోకి వెళ్లాడు. ఆయన్ని చికిత్స నిమిత్తం వికారాబాద్కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామానికి చెందిన శివ యాచారం పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జూలై 29న ఆయన భార్య సుజాత(42) శివను కలవడానికి యాచారానికి వచ్చింది. ఇద్దరు కలిసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో యాచారం ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో సుజాత బైక్పై నుంచి జారి పడి పోయింది. తీవ్ర గాయాలైన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. అదుపుతప్పి డివైడర్ను ఢీకొని కూలీ దుర్మరణం మహేశ్వరం: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సిరిగిరిపురం అర్బన్ ఫారెస్టు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగిరిపురం గ్రామానికి చెందిన తడకల బాలకృష్ణ(40) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన శనివారం సాయంత్రం మహేశ్వరం గేటు నుంచి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా అర్బన్ ఫారెస్టు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవ్వడంతో బాలకృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా రు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బంగారం అపహరణలో కేసు నమోదు నందిగామ: మండల పరిధిలోని మామిడిపల్లిలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య ఇంట్లో రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం విధితమే. బాధితుడు కృష్ణయ్య గత నెల 27న ఇంట్లో దాచిన బంగారం, నగదు కనబడక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
పాతికేళ్ల బంధం మాది
షాబాద్: కష్ట సుఖాల్లో తోడుగా నిలిచే వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి మిత్రుడే ఓంకార్. పాతిక సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటుంన్నాం. సమయం దొరికినప్పుడల్లా కలుస్తాం. ఇటీవల మరో స్నేహితుడు శ్రీనివాస్రెడ్డి రెండు కిడ్నీలు చెడిపోయి మృతి చెందాడు. ఆ కుటుంబానికి స్నేహితలందరూ అండగా నిలిచారు. రూ.7 లక్షలు సేకరించి శ్రీనివాస్రెడ్డి పిల్లల పేరిట బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. మా వాడి పిల్లలు అనాథలు కారాదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. స్నేహానికి కు ల, మత తారతమ్యాలు ఉండవు. అమ్మ నాన్న తర్వాత దేవుడిచ్చిన బహుమతే స్నేహితుడు. – బి.కాంతారెడ్డి, సీఐ, షాబాద్ ప్రతిఫలం ఆశించనిదే.. స్నేహబంధం ఎంతో విలువైంది. ఇంట్లో వారితో చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితులతో పంచుకోవచ్చు. స్నేహంతో బంధాలు ఎంతో బలపతాయి. ఫ్రెండ్స్తో ఉండే ఆనందం వెలకట్టలేనిధి. – సంగమేశ్వర్రెడ్డి, టీచర్, తాళ్లపల్లి పాఠశాల, షాబాద్ మండలం ఒకే గిన్నెలో తిన్నాం నేను నా స్నేహితురాలు స్వాతి ఇద్దరం కే దగ్గర చదువుకున్నాం. నేను ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నాను. స్వాతి వరంగల్లో టీచర్గా పని చేస్తోంది. మా స్నేహం విడదీయరానిది. మేము చదువుకునే రోజుల్లో ఇద్దరం ఒకే గదిలో ఉండి వాళ్లం. ఒకే గిన్నెలో తిన్నాం. ఇప్పటికీ అదే ఆప్యాయతతో కలిసి ఉన్నాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
దోస్త్
మేరాదోస్త్ పాతికేళ్ల ప్రయాణం శంకర్పల్లి: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్.ఇటిక్యాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడికి చెందిన రవి కుమార్ శెట్టి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరిదీ వేర్వేరు జిల్లాలైనా 2001లో సంగారెడ్డిలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. రవికుమార్ మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామ సెక్రెటరీగా పని చేస్తున్నారు. వీరి పాతికేళ్ల ప్రయాణంలో నిత్యం మాట్లాడుకోని రోజంటూ ఉండదు. మా స్నేహానికి హద్దులు ఉండవని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కష్టసుఖాల్లో కలిసే సాగుతామని పేర్కొన్నారు. సృష్టిలో వెలకట్టలేనిది స్నేహం చెప్పలేనంత ప్రేమ దుద్యాల్: మండలంలోని హస్నాబాద్కు చెందిన ప్రభాకర్(బాహుబలి చిత్రంలో కాళకేయ పాత్రలో నటించిన వ్యక్తి) సినీ రంగంలో స్థిరపడ్డారు. వినోద్ కుమార్(నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి). ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులంటే చెప్పలేనంత ప్రేమ. వారితోపాటు పాఠశాలలో చదువుకున్న మిత్రులను ఆప్యాయంగా పలకరిస్తారు. ఉన్నత స్థానంలో ఉన్నా ఎక్కడా వారి గొప్పతనాన్ని ప్రదర్శించరు. ఎప్పటిలాగే బాల్య మిత్రులతో సరదాగా గడుపుతారు. వీరు గ్రామానికి వచ్చిన ప్రతి సారీ స్థానికులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. ఫ్రెండ్షిప్కు వీరిచ్చే నిర్వచనమే వేరు.. -
గంజాయి విక్రేతల అరెస్టు
పరిగి: గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సంఘటన శనివారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గేట్ సమీపంలో చోటు చేసుకుంది. జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో లక్ష్మీదేవిపల్లి గేట్ సమీపంలో సోదాలు నిర్వహించారు. బైక్పై ఇద్దరిని తనిఖీ చేసి 260 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని పరిగి పట్టణ కేంద్రానికి చెందిన నీరజ్కుమార్, షాద్నగర్ మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన విపిన్ కాంకర్లుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న బైక్ను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎక్కడైన గంజాయి విక్రయించినా, తరలించినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆబ్కారీ అధికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న జోనల్ స్థాయి ఎంపిక
ఎస్జీఎఫ్ క్రికెట్కు 18 మంది బషీరాబాద్: తాండూరు జోనల్ క్రీడాకారుల ఎంపిక బషీరాబాద్ బాలుర పాఠశాల మైదానంలో కొనసాగుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వివిధ క్రీడల్లో ఎంపిక చేస్తున్నారు. శనివారం అండర్ 14లో 200 మంది హాజరుకాగా, వీరిలో 18 మందిని జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక చేసినట్లు పీడీ అంబదాస్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు నెల రోజుల శిక్షణానంతరం జిల్లా స్థాయికి పంపుతామన్నారు. అయితే ప్రభుత్వం క్రీడాకారులకు మొదటి రోజు భోజన సౌకర్యం కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం బషీరాబాద్కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ జయ్రామ్ చారి 200మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు అనంతయ్య, శివ, రాజు, రవీందర్ రెడ్డి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బాత్రూంలో జారిపడి వలస కూలీ మృతి మొయినాబాద్: బతుకు దెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ బాత్రూంలో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన బంటి(27) అదే ప్రాంతానికి చెందిన పుష్పేందర్, గుజార్తో కలిసి మూడు నెలల క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్కు వలస వచ్చారు. గ్రామ సమీపంలోని పైప్లైన్ రోడ్డులో ఉన్న అవసా విల్లాలో టైల్స్, మార్బుల్స్ పనిచేస్తూ అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి 8 గంటలకు భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంటి బాత్రూంకు వెళ్లి అందులో జారి పడ్డాడు. అతని తలకు గాయమైంది. అతనితో ఉన్నవారు నీళ్లు తాగించి పడుకోబెట్టారు. ఉదయం 6 గంటలకు బంటిని నిద్రలేపినా లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్ల పట్టివేత కడ్తాల్: పరిమితికి మించి ఓవర్లోడ్తో రవా ణా చేస్తున్న రెండు టిప్పర్లను ఆర్టీఏ అధికారులు పట్టుకున్న సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఆర్టీఏ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే మున్ని ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్తో పాటు, ఓవర్లోడ్తో కంకరపొడిని తరలిస్తున్న మరో వాహనాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని వెహికిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీఏ కానిస్టేబుల్ జగన్, సిబ్బంది ఉన్నారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేశంపేట: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాలాల రాకేష్(40) మేసీ్త్ర పనులు చేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆయన గ్రామానికి చెందిన లేగలకాడి శ్రీనుతో కలిసి శివారులోని నాగుల చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాకేష్ మద్యం మత్తులో ఉండటంతో చెరువులో పడిపోయాడు. ఆయన్ని రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా విఫలమయ్యాయి. అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాంచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
బంట్వారం: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బంట్వారంలో శనివారం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి, నాయకులు మొగులయ్య, పురుషోత్తంరెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంఅనంతగిరి: నగరంలోని బేగంపేట్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం అర్హులైన షెడ్యుల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదన్నారు. విద్యార్థులు 01.6.2018 నుంచి 31.05.2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా షెడ్యుల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చన్నారు. పూర్తి చేయబడిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 8వ తేదీ లోపు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9573859268లో సంప్రదించాలన్నారు. కాగ్నా బ్రిడ్జి గుంతకు మరమ్మతులు యాలాల: మండల పరిధిలోని తాండూరు–కొడంగల్ ప్రధాన మార్గంలో ఉన్న కాగ్నా కొత్త బ్రిడ్జిపై గత వారం ఏర్పడిన గుంతకు మరమ్మతులు పూర్తయ్యాయి. గుంత పడిన ప్రదేశంలో మైక్రో కాంక్రీటుతో ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణలో మరమ్మతు పనులను శనివారం సాయంత్రం పూర్తి చేశారు. రెండేళ్ల క్రితమే ప్రారంభించిన కొత్త బ్రిడ్జిపై ఏర్పడిన గుంతతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై ఏర్పడిన గుంత మరమ్మతు విషయమై ప్రత్యేకంగా మైక్రో కాంక్రీటు పద్ధతిని ఉపయోగించి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనిని నిర్మాణ సంస్థ రెబ్కాన్కు అప్పగించి చేపట్టినట్లు ఆర్అండ్బీ ఇన్చార్జి డీఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. పది రోజుల్లో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అవకాశం ఉంటుందని వివరించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించాలి వికారాబాద్ సీడీపీఓ వెంకటేశ్వరమ్మధారూరు: బిడ్డ పుట్టిన గంట వ్యవధిలో ముర్రుపాలు తాగించాలని వికారాబాద్ సీడీపీఓ వెంకటేశ్వరమ్మ సూచించారు. ధారూరు, కేరెళ్లి అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. తల్లి పాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. వ్యాధులు రాకుండా బిడ్డను జీవితకాలం కాపాడుతుందన్నారు. తల్లి పాలను బిడ్డకు రెండేళ్ల వరకు కొనసాగించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు అనే నినాదాలు మార్మోగాయి. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనురాధ, రమాదేవి, అన్నపూర్ణ, అమృతమ్మ, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
రూ.వంద కోట్లతో శ్రీవారి ఆలయ అభివృద్ధి
వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పునఃనిర్మాణ పనులు ● రెండేళ్లలోపు పూర్తి చేస్తాం ● ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీశైలజా రామయ్యార్ కొడంగల్: పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ అన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా రెండేళ్లలోపు పునఃనిర్మాణ పనులు పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులతో కలిసి శనివారం ఆమె కొడంగల్కు వచ్చారు. ముందుగా కడా కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, వాస్తు నిపుణుడు సపతితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను పరిశీలించారు. దేవాలయ పునరుద్ధణకు సంబంధించిన వివరాలను వాస్తు శిల్పి సత్యనారాయణ మూర్తి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. డిజిటల్ స్క్రీన్పై అధికారులు వీక్షించారు. అనంతరం శైలజారామయ్యార్ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్తలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించారు. గోశాలను, మండపం, పుష్కరిణి, వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన వెంచర్ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయ అభివృద్ధి అనంతంర ఈ ఆప్రాంతం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నామన్నారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా కొడంగల్లోని ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ, ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, రత్నం, మధు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ పాల్గొన్నారు. దౌల్తాబాద్ ఆలయ సందర్శనదౌల్తాబాద్: దౌల్తాబాద్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యార్ అన్నారు. శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు. -
ఇప్పటికీ టచ్లో ఉన్నారు
మాది నల్లగొండ జిల్లా మారుమూల కుగ్రామం.. మా గ్రామంలో 3వ తరగతి వరకే ఉండేది.. పదో తరగతి వరకు పక్క గ్రామంలో చదివా.. నాలుగు కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లేవాళ్లం. వర్షం పడితే స్కూల్ మార్గంలోని వాగు పారేది.. దీంతో డుమ్మా కొట్టేవా ళ్లం. ఆ సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకునే వాళ్లం.. కలిసి చదువుకునే వాళ్లం.. రోజూ ఆడుతూ పాడుతూ స్కూల్కి నడుచుకుంటూ వెళ్లే స్నేహితులను ఇప్పటికీ మరచిపోలేను.. చాలా మంది మిత్రులు ఉన్నారు.. ఒకరిద్దరి పేర్లు చెబతే మిగతా వాళ్లను తక్కువ చేసినట్లవుతుంది. ఏది ఏమైనా చిన్ననాడు ఫ్రెండ్స్తో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను.. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ -
‘మధ్యాహ్న భోజనం’ బంద్
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం తింసాన్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు నిలిచిపోయింది. దీంతో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి సుమారు యాభై రోజులుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ రేణుకాదేవి శనివారం పాఠశాలను తనిఖీ చేశారు. కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం, బిల్లులు సరిగా రాకపోవడం, వంటి కారణాలతో ఏజెన్సీ నిర్వాహకులు భోజనం వండటం లేదు. గతంలోనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో డీఈఓ వారిని పిలిపించి భోజనం అందించా లని సూచించారు. బిల్లులు అందేలా తాను చూ స్తానని హామీ ఇచ్చారు. మరోసారి భోజనం పెట్టలే దని తెలిస్తే చర్యలు తప్పవని ఎంఈఓ నర్సింగ్రా వుతో పాటు ఉపాధ్యాయులను హెచ్చరించారు. తింసాన్పల్లి పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ ఏజెన్సీ నిర్వాహకులు, ఎంఈఓపై అసహనం వెంటనే అమలు చేయాలని ఆదేశం -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
స్వార్థం లేనిది స్నేహం ముందుగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. దేనిలోనైనా స్వార్థం ఉంటుందేమోకానీ స్నేహం విషయంలో ఉండదు. స్వార్థం ఉంటే స్నేహం అనిపించుకోదు.. నిజమైన స్నేహం ఏమీ ఆశించదు. అలాంటి వారు ఉంటే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలం.. అంతటి గొప్ప మిత్రులు నాకు ఉన్నారు. మా స్వగ్రామం తాండూరు.. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. సుదర్శన్గౌడ్, ప్రకాష్గౌడ్, రాములు యాదవ్, రమేశ్కుమార్, జగన్మోహన్, మధుకర్, వెంకటయ్య నా చిన్ననాటి స్నేహితులు.. బాల్యం మొత్తం వీరితోనే గడిపా. సమయం చిక్కినప్పుడల్లా వీరందిరితో మాట్లాడుతుంటా. చిన్నతనంలో చేసిన అల్లరి, సరదాగా గడిపిన రోజులు గుర్తుకు వస్తే మనస్సంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ అనుభూతే వేరు.. – గడ్డం ప్రసాద్కుమార్, శాసన సభ స్పీకర్ న్యూస్రీల్ -
వారు దేవుడిచ్చిన వరం
చేవెళ్ల: స్నేహం అనేది నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులే ముఖ్యం అని చేవెళ్ల తహసీల్దార్ బి.కృష్ణయ్య అన్నారు. చిన్ననాటి స్నేహితులు పి.శ్రీనివాస్, ఐ.కృష్ణయ్య, కె.నర్సింలు జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పరిగి మండలం రూప్ఖాన్ేపేటకు చెందిన మేమందరం పాఠశాల స్థాయి నుంచే స్నేహితులం. అంతేకాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కొనసాగుతున్నాం. ముగ్గురూ నాకంటే ఒక్క క్లాస్ సీనియర్లు.. మా మైత్రి పదో తరగతి వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ వేర్వేరు కళాశాలల్లో చదువుకున్నా రోజూ కలిసేవాళ్లం. వృత్తి రీత్యా వివిధ రంగాల్లో రాణిస్తున్నాం. నేను తహసీల్దార్గా, నర్సింలు హెడ్కానిస్టేబుల్గా. కృష్ణయ్య వ్యవసాయం, శ్రీనివాస్ వ్యాపారం చూస్తూ స్థిరపడ్డాం. ఆదివారం, సెలవు రోజుల్లో కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరి కుటుంబంలో సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటాం. మిత్రులందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు. – బి.కృష్ణయ్య, తహసీల్దార్, చేవెళ్ల -
దీపం కింద పడి ఇల్లు దగ్ధం
దౌల్తాబాద్: మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ఓ ఇల్లు దగ్ధమై రూ.2.50 లక్షల నగదు, 4 తులాల బంగారం కాలి బూడిదైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్రవిల్ల అనంతప్ప కుటుంబసభ్యులు శ్రావణమాస శనివారం కావడంతో ఇంట్లో దేవుడికి పూజ చేసి దీపం ముట్టించి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొగలు రావడం చూసి చుట్టు పక్కల వారు పైనబండలు తీసి మంటలు ఆర్పారు. ఇప్పటికే రూ.2.50 లక్షలు, 4 తులాల బంగారం మంటలకు కాలిపోయాయి. దీంతో కష్టపడి కూలి పనులు చేసి సంపాదించిన డబ్బులు, బంగారం కాలిపోవడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. దేవుడి దీపం కిందపడడంతో ఇల్లు అంటుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజుకుమార్, ఆర్ఐ సునీల్ పరిశీలించారు. రూ.2.50 లక్షలు, 4 తులాల బంగారం బూడిద -
బాల్య మిత్రులు.. ‘బాధ్యత’గా..
కొడంగల్: కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1990 బ్యాచ్కు చెందిన కొందరు విద్యార్థులు 16 ఏళ్ల క్రితం బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. వారు సంపాదించిన డబ్బులో కొంత సమాజసేవకు వినియోగిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేస్తున్నారు. కటుకం వెంకటేశ్, మురహరి వశిష్ట, శివకుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ జోషి, కిట్టుస్వామి, కృష్ణారావు, కొంతం సతీష్, నగేశ్, ఆనంద్ కుమార్ లాహోటీ, కానుకుర్తి రమేష్, వేణు, బాలరంగాచారి మంచి స్నేహితులు. ఫ్రెండ్షిప్కు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో పాలమూరు జిల్లాను వరదలు ముంచెత్తి నప్పుడు ప్రజల సహకారంతో రూ.2.5 లక్షల విలువ చేసే సరుకులు, మందులు, దుస్తులను మాగనూరు మండలంలోని కృష్ణా నది పరీవాహాక ప్రాంతంలో పంపిణీ చేశారు. -
A-Æý‡$á-ÌS…-§ýl-ÇMîS çÜ…„óSÐ]l$ ç³£ýlM>Ë$
మర్పల్లి: పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. కల్కోడ, ఘనాపూర్లో పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మండలంలోని అన్ని చెరువుల వివరాలు సేకరించి మరమ్మతులు చేపట్టి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, దరఖాస్తులు చేసుకుంటే చెత్తబుట్టలో పడేశారన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతాంగం కోసం గత యేడాదిన్నరలో లక్షా 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలిపారు. అనంతరం ఎనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గూడెం రాములుయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, వైస్ చైర్మన్ మల్లేశ్యాదవ్, సహకార సంఘం వైస్ చైర్మన్ ఫసియోద్దీన్, బ్లాక్ టూ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గణేష్, నాయకులు జగదీశ్వర్, రఘుపతి రెడ్డి, రామేశ్వర్, రాచన్న, శేఖర్యాదవ్, నర్సింలుయాదవ్, సర్వేష్, రఫీ, వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి, తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ సిటి జయరాం, స్పెషల్ ఆఫీసర్ మోహన్ కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ -
ముర్రుపాలు శ్రేష్టం పుట్టిన బిడ్డకు తొలి ఆహారం, మొదటి టీకా అమ్మపాలే. పిల్లలకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని వైద్యులు చెబుతున్నారు.
8లోu9లోu గుర్తొస్తే ఒల్లు పులకరించి పోతుంది కాలంతో పాటు మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఎంతో మంది పరిచయం అవుతారు.. అందులో కొందరిని కాలక్రమేణా మరిచిపోతాం.. కొందరు మాత్రం కాలాన్నే మరిపిస్తారు.. వారే మనకు ఇష్టమైన స్నేహితులుగా గుర్తుండిపోతారు.. వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తారు.. స్కూల్, కాలేజీ లైఫ్లో ఏర్పడిన స్నేహబంధాలు ఎంతో బలపడతాయి.. మా స్వగ్రామం బాన్స్వాడ స్కూల్ డేస్లో ఇద్దరు మిత్రులు ఉండేవారు.. వారిద్దరూ పదో తరగతిలోనే చదువు మానేశారు. నేను 6 నుంచి ఇంటర్ వరకు నవోదయ స్టూడెంట్ని.. పీజీ వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నా. నా లైఫ్లో ఎక్కువ కాలం స్నేహితులతోనే గడిపా. నా ఎదుగుదలకు కూడా వారు ఎంతో దోహదపడ్డారు. ఏటా వారితో మీట్ అవుతా. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను.. ఆ సమయంలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఏదో తెలియని అనుభూతి చెందుతా. కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు నవ్వు ఆపుకోలేను. – జయసుధ, డీపీఓ -
రూ.100 కోట్లతో అభివృద్ధి కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
8లోu స్నేహం గొప్పవరం ఎవరికై నా స్నేహం అనేది గొప్ప వరం లాంటిది. మంచి స్నేహితులు దొరకడం మరింత అదృష్టమే.. ఈ ప్రపంచంలో ధనిక, పేద అనే తేడా చూడనది స్నేహం ఒక్కటే. దాన్ని దేనితో పోల్చలేము. వెలకట్టలేము.. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. స్నేహం చేయడం ముఖ్యం కాదు.. దాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.. ఆ ధ్యాస, తపన ఇద్దరిలోనూ ఉండాలి.. అప్పుడే అది కలకాలం పదిలంగా ఉంటుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా అది నిలబడదు.. సమయం దొరికినప్పుడల్లా చిన్ననాటి మిత్రులతో మాట్లాడతా. వారిని మీట్ అవుతా. – నారాయణరెడ్డి, ఎస్పీ -
విద్యారంగ బలోపేతం.. ఎస్టీఎఫ్ఐ లక్ష్యం
షాద్నగర్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) లక్ష్యమని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింహులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో ఫెడరేషన్ సీనియర్ నాయకుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన 25 సంఘాల టీచర్స్ యూనియన్లతో 2000 సంవత్సరంలో ఎస్టీఎఫ్ఐ ఏర్పడిందని తెలిపారు. విద్యారంగంలో శాసీ్త్రయ విధానాలను అనుసరించడం, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రస్తుతం ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని తగ్గించి రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని సూచించారు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్రం తెచ్చిన ఎన్పీఎస్, సీపీఎస్, యూపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్,ఎన్ఈపీ 2020 విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఈ నెల 8న కలకత్తాలో రజతోత్సవ సభలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సత్యం, లక్ష్మీ దేవమ్మ, రామకృష్ణ, వినీత్గౌడ్, శివ, రాజు, జేవీవీ నాయకులు కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
నూనె గింజల సాగుతో రాబడి
షాబాద్: నూనె గింజల సాగుతో అధిక దిగుబడి సాధించడంతో పాటు.. లాభాలు అదే విధంగా పొందవచ్చని నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్.కె.మథుర్, కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్రావు అన్నారు. శుక్రవారం భారతీయ నూనే గింజల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్లో 49వ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా సాగుపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గింజల సాగుతో అధిక దిగుబడి సాధించిన తిర్మలాపూర్, మల్లారెడ్డిగూడ రైతులు సుగుణమ్మ, నర్సమ్మ, మాణిక్యంలను సన్మానించారు. అనంతరం సంస్థ నుంచి అధిక దిగుబడి ఇచ్చే కుసుమ రకాలు, ఆదాయ మార్గాల గురించి వివరించారు. కార్యక్రమంలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, తిర్మలాపూర్, మల్లారెడ్డిగూడ, మిట్టకంకల్ రైతులు శ్రీనివాస్, మాణిక్యం, సుగుణమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీజీ మంజూరు చేయండి
ఎంపీ డీకే అరుణ కొడంగల్: కొడంగల్ నియోజకవర్గానికి ఎల్పీ జీ పెట్రోల్ పంపులు మంజూరు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్ పర్సన్ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హరిదీప్ సింగ్పూరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో ఎల్పీజీ పంపు లేదని మంత్రికి వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు ఎల్పీజీ, పెట్రోల్ పంపులు అందుబాటులోకి తేవాలని కోరారు. నేడు హిందూ ఉత్సవ సమితి భవనానికి శంకుస్థాపన తాండూరు: పట్టణంలో హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన రెండెకరాల స్థలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.50 లక్షలతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కుల సంఘాల సభ్యులు, హిందు ఉత్సవ సమితి ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు కోరారు. ఇసుక పర్మిషన్ ఇస్తాం తహసీల్దార్ గోవిందమ్మ దోమ: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక పర్మిషన్ను ఇస్తామని తహసీల్దార్ గోవిందమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో ఇందిరమ్మకు ఇసుక గండం అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు మండల రెవెన్యూ గిర్దవారు(ఆర్ఐ) సుదర్శన్తో పర్మిషన్ ఇస్తామని తహసీల్దార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అర్హులైన వారు పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈలతో సంతకాలు సేకరించి తమ వద్దకు వస్తే ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేషియల్ రికగ్నిషన్తో ఇబ్బందులుఅనంతగిరి: ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ముఖ ఆధారిత హాజరు) సిస్టంతో ఉపాధ్యాయులు అవస్థలు పడే అవకాశం ఉందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, అమర్నాథ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగేలా ఈ నియమం ఉందన్నారు. ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడే ఏ అంశానైనా స్వాగతిస్తామన్నారు. కానీ గురువుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంతో తొందర వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా హాదీ అనంతగిరి: ఎంఐఎం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ హాదీ ఎన్నికయ్యారు. పార్టీ అధినాయకుల సూచన మేరకు సమద్ బిన్ అబ్దాద్ సాబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా హాదీతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్ బేగ్, జాయింట్ సెక్రటరీలుగా బహౌద్దీన్ గుల్షాన్, అలీమోద్దీన్, అబ్దుల్ సమద్, మహ్మద్ అలీం, బుర్హాన్ జునైదీ, మోయిజ్ ఖురేషీ, కోశాధికారిగా ఎండీ మహబూబ్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులుగా ఎండీ సర్తాజ్ హుస్సెన్, ఎండీ ఇన్యాతుల్లా షరీఫ్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానన్నారు. -
భారతి సిమెంట్కు తిరుగులేదు
అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల చిట్టంపల్లిలో శ్రీ వేంకటేశ్వర డీలర్ షాపులో శుక్రవారం రాత్రి తాపీమేసీ్త్రలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని స్లాబ్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని తెలియచేశారు. ఈ సందర్భంగా తాపీమేసీ్త్రలకు రూ.లక్షతో కూడిన ప్రమాద బీమా బాండ్లను 30 మందికి అందజేశారు. అనంతరం డీలర్ వెంకటేష్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తాపీమేసీ్త్రలు, వినియోగదారులు, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ -
గాంధీజీ సిద్ధాంతమే మూలం
పరిగి: మహాత్మా గాంధీ సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకమని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా శుక్రవారం పరిగిలో ఆమె మహిళా కార్యకర్తతో మాట్లాడుతూ.. చెరకతో నూలు వడికి ఉత్సాహ పరిచారు. చరక ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ స్వయం ఉపాధికి చిహ్నమని సూచించారు. చెరక ఉపయోగించే విధానాన్ని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ద్వారా మహిళాల నాయకురాళ్లకు వివరించారు. చేనేత వస్త్రాలు వాడడంతో ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం దేశ ఆర్థిక పురోగతికి దోహదం అన్నారు. పుస్తకం అందజేత దోమ: మహాత్రియా రా రచించిన పోస్ట్ చేయని లేఖ(అన్పోస్టేడ్ లేటర్) పుస్తకాన్ని మీనాక్షి నటరాజన్కు దోమ మండల మాజీ ఎంపీపీ అనసూయ అందజేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో నిర్వహించి జనహిత పాదయాత్ర సభలో ఆమెకు ఈ బుక్ను బహూకరించారు. ప్రతి ఒక్కరూ అన్పోస్టేడ్లేటర్ను చదివేందుకు కృషి చేయాలని మాజీ ఎంపీపీ ఆశించారు.కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ -
అక్రమార్కులపై కొరడా
తాండూరు రూరల్: ఎర్రరాయి తరలిస్తున్న అక్రమార్కులపై అధికారులు కొరడా ఝళిపించారు. పెద్దేముల్ మండలం తట్టెపల్లి, పాషాపూర్ తండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలపై శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్లు, ఐదుగురు ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం అడికిచెర్ల, పాషాపూర్ తండా సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కొందరు ఎర్రమట్టిరాయిని తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాలతో టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమాతులు లేకుండా ఎర్రమట్టి రాయిని ట్రాక్టర్ల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇందులో జేసీబీ డ్రైవర్లు మన్నె ప్రవీణ్, రాథోడ్, ట్రాక్టర్ డ్రైవర్లు రాథోడ్ మోహన్, పెద్దేముల్ రవి, తల్వార్ శరణ్, చించోళి సుభాష్, మూర్తిలపై పెద్దేముల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెండు జేసీబీ, ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిరాయి అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల తండాకు చెందిన ఓ గ్రామస్థాయి మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ల సహాయంతో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్రరాయి తవ్వకాల అక్రమార్కులపై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించడంతో తట్టెపల్లి, పాషాపూర్తండాలో కలకలం రేగింది. ఎర్రరాయి తరలిస్తున్న వాహనాల పట్టివేత ఏడుగురిపై కేసు నమోదు పెద్దేముల్లో టాస్క్ఫోర్స్ దాడులు -
80 మంది కార్మికుల తొలగింపు
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్కోట్ గ్రామ శివారులో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఫ్యాక్టరీ ఎదుట కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలోని ప్యాకింగ్ ప్లాంట్లో 80 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. దీనిని వ్యతిరేకంగా ఫ్యాక్టరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పనుల్లో నుంచి తొలగిస్తే మా జీవితాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ యాజమాన్యం కల్పించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరణప్ప మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులతో వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు కూడా కార్మికులకు మద్దతు తెలిపారు. సీసీఐలో ఆందోళన చేపట్టిన వేతనజీవులు -
న్యాయవాదులందరూ ఏకమవ్వాలి
హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రఘునాథ్అనంతగిరి: అందరూ ఏకమైతే అడ్వకేట్ల రక్షణ చట్టం అమలవుతుందని హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్ బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులకు రక్షణ చట్టం అమలులో లేనందున దాడులు మరింత పెరిగాయని, ఎక్కడో ఒక చోట నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇచ్చే 41ఎ స్టేషన్ బెయిల్లతో న్యాయవాదులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ విషయంలో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బస్వరాజ్ పటేల్, ఉపాధ్యక్షుడు శంకరయ్య, సెక్రటరీ వెంకట్రెడ్డి, న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, సంపూర్ణనంద్, గోపాల్రెడ్డి, కమాల్రెడ్డి, శ్రీనివాసరావు, యాదవరెడ్డి, వసుందర, మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
క్షతగాత్రుడికి స్పీకర్ పరామర్శ
ధారూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పట్ల శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ధారూరు రైతు వేదికలో కొత్త రేషన్కార్డులను పంపిణీ చేసి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. అనంతగిరి చివరిగుట్ట రోడ్డు పక్కన ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కన్పించాడు. వెంటనే తన కాన్వాయ్ని నిలిపివేయించి క్షతగాత్రుని వద్దకు చేరుకుని ఆరా తీశారు. ముందుగా గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించి, 108కు ఫోన్ చేయించారు. అతనికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని డీఎస్పీ శ్రీనివాస్రెడ్డికి సూచించారు. అంబులెన్స్ తొందరగా రాకపోవడంతో క్షతగాత్రున్ని పోలీసు వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. -
కళాశాల కలను సాకారం చేస్తాం
● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ● లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ ధారూరు: మండల ప్రజల చిరకాల వాంఛ జూనియర్ కళాశాల అని దాన్ని అతి త్వరలో సాకారం చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం ధారూరు రైతు వేదికలో కొత్తగా మంజూరైన రేషన్కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్పల్లి వద్ద ఏర్పాటు చేయనున్న 220 కేవీ సబ్ స్టేషన్ ధారూరు మండలానికి కూడా ఉపయోగ పడుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద వికారాబాద్ నియోజకవర్గానికి రూ.15 కోట్లు తెచ్చానని, అందులో రూ.6 కోట్లు వెనక్కి వెళ్లినట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపితే ఆ నిధులు వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేస్తున్నరని తెలిపారు. మండలానికి 451 కొత్త రేషన్కార్డులు మంజూరైనట్లు చెప్పారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూనే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం మనదే అన్నారు. దెబ్బతిన్న రోడ్లను రూ.600 కోట్లతో బాగుచేయిస్తున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుదర్శనమ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం, డీటీ విజయేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఎంసీ చైర్మన్ భాస్కర్రెడ్డి, ఎంపీడీఓ నర్సింహులు, నాయకులు రాములు, కిరణ్, మహ్మద్ బాబాఖాన్, హన్మయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు బంట్వారానికి స్పీకర్ రాక బంట్వారం: మండల కేంద్రమైన బంట్వారానికి శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అధికారులు, పార్టీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. కుర్మ సంఘం భవనానికి శంకుస్థాపన అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బిల్లదాకలలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే కుర్మ సంఘం భవనానికి శుక్రవారం స్పీకర్ ప్రసాద్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు నుంచి రూ.కోటి మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, గొర్రె కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం, పీఆర్ ఈఈ ఉమేష్కుమార్, ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత నై..!
వికారాబాద్: పై ఫొటోలో కనిపిస్తున్న బ్రిడ్జి యాలాల మండల పరిధిలో తాండూరు – కొడంగల్ మార్గంలో తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడేళ్ల పాటు పనులు కొనసాగుతూ వచ్చాయి. రూ.16.80 కోట్లు వెచ్చించి రెండేళ్ల క్రితం (2022 చివరి నాటికి) పూర్తి చేశారు. నాటి నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల క్రితం బ్రిడ్జికి రంధ్రం పడింది. వందేళ్లపాటు ఉండాల్సిన వంతెన రెండేళ్లకే పాడవడం అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించి అధికారులు మరమ్మతులు చేయలేదు. బ్రిడ్జి నాణ్యతపై పూర్తి స్థాయి విచారణ జరిపించడంతోపాటు సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షించిన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పక్క ఫొటోని వంతెనను ఒక్కసారి పరిశీలిస్తే పనుల్లో నాణ్యత ఏ మేరకు పాటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పన క్కర్లేదు. తాండూరు డివిజన్ పరిధిలోని పెద్దేముల్ మండల కేంద్రానికి కిలో మీటరు దూరంలో గాజీపూర్ –బుద్దారం మార్గంలో రూ.3.30 కోట్లు వెచ్చించి ఈ వంతెన నిర్మించారు. ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభించి ఏడాదిన్నర క్రితం(2023 చివరి నాటికి) అందుబాటులోకి తెచ్చారు. కనీసం ఏడాది తిరక్కుండానే పాడైంది. బ్రిడ్జి మొత్తం సిమెంట్ ఊడిపోయి లోపలి స్టీల్ కనిపిస్తోంది. ఇవి ఉదాహరణకు మాత్రమే. జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన చాలా వంతెనలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. -
కార్యకర్తల కృషితోనే అధికారం
పరిగి/దోమ: కార్యకర్తల కృషి, శ్రమతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ పరిధిలోని గిరిజన బాలికల పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో కలిసి శ్రమదానం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ గురువారం సాయంత్రం పరిగికి చేరుకున్నారు. రాత్రి స్థానిక ఎస్ గార్డెన్లో బస చేశారు. ఉద యం బాలికల పాఠశాలను సందర్శించి మొక్క లు నాటారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యమని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ఎస్గార్డెన్ చేరుకొని చరకతో నూలు తయారు చేశారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గాన్ని అనుసరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్ గార్డెన్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో పార్టీ పటిష్టంగా ఉండాలంటే నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. భేదాభిప్రాయాలు లేకుండా అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. కార్యకర్తల సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఇందిరమ్మ కమిటీల్లో వారికి ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య త కార్యకర్తలదే అన్నారు. అందరూ శ్రమిస్తే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ఎమ్మెల్యేలు పర్నికారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, యాదయ్య, బుయ్యని మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఇక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పరిగి గిరిజన గురుకులంలో శ్రమదానం పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ -
‘జుంటుపల్లి’ అభివృద్ధికి రూ.5.71 కోట్లు మంజూరు
యాలాల: మండలంలోని జుంటుపల్లి ప్రాజె క్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.71 కోట్లను మంజూరు చేసింది. ఇరిగేషన్ శాఖ సాధారణ పరిపాలన విభాగం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుతోపాటు కుడి, ఎడమ కాల్వల మరమ్మతులు, అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. జిల్లా అధికారులు రూ.6.80 కోట్లతో ప్రతిపాదనలు పంపగా రూ.5.71 కోట్లు మంజూరయ్యాయి. భోజనం తయారీలో రాజీవద్దు కలెక్టర్ ప్రతీక్జైన్ నవాబుపేట: వసతి గృహాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, బీసీ వసతి గృహాన్ని సందర్శించారు. భోజనం, వసతులపై ఆరా తీశారు. భోజనం విషయంలో రాజీ పడరాదన్నారు. ఆగస్టు 15లోగా బీసీ వసతి గృహ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఇంగ్లిష్లో మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బుచ్చ య్య, ఎంపీడీఓ అనురాధ, ప్రిన్సిపాళ్లు కృష్ణకుమార శ్రీలత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి తాండూరు టౌన్: తాండూరు పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. డబుల్ ఇళ్ల ఆశ చూపి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కె.శ్రీనివాస్, మహిపాల్, సతీష్, రాములు, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతగిరి: నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బేగంపేట, రామంతాపూర్లోని స్కూళ్లలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 8లోపు దరఖాస్తులు పంపాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ల 86393 88553, 99085 98481లో సంప్రదించాలని కోరారు. నేడు కేంద్ర మంత్రి రాక యాచారం: కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి శనివారం మండలానికి రానున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త శ్రీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని వారాణాసిలో పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో వీడియో ప్రసంగం వీక్షించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొంటారని చెప్పారు. -
నేడు ఎమ్మార్పీఎస్ మహాగర్జన
కొడంగల్: పట్టణంలోని మురహరి ఫంక్షన్ హాల్లో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహా గర్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జాతీయ గౌరవ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ, పిల్లికండ్ల ఆనంద్ మాట్లాడారు. మహా గర్జనకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల నాయకులు ప్రకాశ్, అంజి, రమేష్బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్లో బహిరంగ సభ హాజరుకానున్న మందకృష్ణ మాదిగ విజయవంతం చేయాలని నేతల పిలుపు -
ఏం చేశారని పాదయాత్ర?
అనంతగిరి: జిల్లాకు ఏం చేశారని పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం సొంత జిలా్ల్ వికారాబాద్కు చేసిందేమీలేదని ఆరోపించారు. శుక్రవారం వికారాబాద్లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఏ ఎజెండాతో పాదయాత్ర చేస్తున్నారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి కాకుండా మీరేందుకు పాదయాత్ర చేస్తున్నారు అనే దానిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయన్నారు. అనంతగిరి టూరిజం అభివృద్ధిపై ఏమైనా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ – మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులు ఎందుకు కావడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. మీరు పాదయాత్ర చేసే మార్గంలో నేషనల్ హైవే కాకుండా గుంతలు లేని రోడ్డు చూపించగలరా అని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర ప్రజల్లో విశ్వాసం కోల్పొయినందుకా.. లేక ప్రజాదారణ తగ్గిందని చేస్తున్నారా అనే సందేహం చాలా మందిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మదని, కుటుంబ పాలనను నమ్ముతుందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏమయ్యిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో దళారీ వ్యవస్థ పెరిగి రైతులకు యూరి యా కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు, ఉద్యోగాల భర్తీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నవీన్కుమార్, పార్లమెంట్ కో– కన్వీనర్ అమరేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, జిల్లా నాయకులు రాజు, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి మీనాక్షి నటరాజన్కు ప్రశ్నల వర్షం -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న వారందరికీ న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలోని కడా కార్యాలయంలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తరణలో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న ప్రైవేటు స్థలాన్ని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. 96 మంది నుంచి 8,736 గజాల స్థలం సేకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇల్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లిస్తామన్నారు. ఆర్అండ్బీ అధికారులు ఇంటి విలువను లెక్క కడతారని తెలిపారు. స్థలం, భవనం విలువ లెక్క కట్టి పరిహారం చెల్లిస్తామన్నారు. దీనికి అదనంగా రూ.5 లక్షల సాయం, ఒక ఏడాది కుటుంబ అవసరాల కోసం రూ.40 వేలు, ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి అయ్యే ఖర్చు (ట్రాన్స్పోర్ట్)రూ.60 వేలు, పశువుల దొడ్డి నిర్వహణకు రూ.25 వేలు, చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి రూ.30 వేలు, ఇతర ఖర్చుల కోసం రూ.60 వేలు చెల్లిస్తామన్నారు. పట్టణంలోని జాతర స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెంచర్లో ఇంటి స్థలం కేటాయిస్తామని, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషన్ బలరాం నాయక్, ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, రత్నం, మధు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విస్తరణకు సర్కారు సానుకూలత పేదల తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ సానుకూలంగా ఉంది. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి టీటీడీ తోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మాఢ వీధుల విస్తరణపై దృష్టి పెట్టారు. క్యూ లైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వాటిని నిర్మిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావు, వాస్తు నిపుణుడు సపథి, ఇతర ఉన్నతాదికారులు శనివారం కొడంగల్ శ్రీవారి ఆలయానికి రానున్నట్లు ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి తెలిపారు. ఇళ్లు కోల్పోయే వారికి స్థలం.. పరిహారం చెల్లిస్తాం కొడంగల్ శ్రీవారి ఆలయ విస్తరణకు సహకరించాలి అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ నేడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాక -
బాల కార్మికులకు విముక్తి
తాండూరు రూరల్: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా తాండూరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 54 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. గురువారం మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. 54 మంది బాల కార్మికులను గుర్తించామని, ఇందులో ఏడుగురు బాలికలు, 15 మంది ఇతర రాష్ట్రాల చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 11 మంది షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించామన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెలేర్ కమిటీ సభ్యులు ప్రకాష్, సంగమేశ్వర్, ఎస్ఐ గిరి, లీగల్ ఆఫీసర్ నరేష్కుమార్, కౌన్సిలర్ లక్ష్మణ్, సూపర్వైజర్ ఆనంద్, స్వచ్ఛంద సంస్థ నాయకురాలు అంకిత, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బస్వరాజ్, సంతోష్, మమత, కార్మిక శాఖ అధికారి సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ 54 మంది చిన్నారుల గుర్తింపు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం -
రుణ లక్ష్యాన్ని పూర్తి చేయండి
తాండూరు: వంద రోజుల ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు నిర్ధేశించిన రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్తో కలిసి ఆర్పీలు, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 600 మహిళా సంఘాలకు రూ.80 కోట్ల రుణాలను ఆగస్టు నెలాఖరుగా అందించాలన్నారు. అలాగే కొత్త సంఘాలు, వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాండూరు మున్సిపాలిటీకి 44 సంఘాల ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్థేశించడం జరిగిందన్నారు. ప్రతి సంఘంలో 5 మంది వీధి వ్యాపారుల నుంచి 20 మంది వరకు సభ్యులుగా చేర్చాలన్నారు. ఇప్పటికే 5 మంది వీధి వ్యాపారులతో 20 సంఘాలను ఏర్పాటు చేయడంపై టీఎంసీ రాజేంద్రప్రసాద్ను అభినందించారు. మరో 24 సంఘాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. గొల్ల చెరువు ప్రాంతంలో మొక్కలను నాటాలన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో మహిళా సంఘాల ఉత్పత్తి మేళాను మూడు రోజుల పాటు ఏర్పాటు చేయాలన్నారు. మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ -
నేటి నుంచి ఎస్జీఎఫ్ సెలక్షన్స్
సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్న పోటీలుతాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పాఠశాలల విద్యార్థులకు పలు క్రీడల్లో జోనల్ లెవల్ ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. తాండూరు, పెద్దేముల్, కొడంగల్, పరిగి, వికారాబాద్ జోన్ల పరిధిలో ఈ ఎంపిక ఉంటుంది. తాండూరు, బషీరాబాద్, యాలాల మండలాలు తాండూరు జోన్ పరిధిలో ఉండగా, పెద్దేముల్ మండలం మాత్రం వికారాబాద్ జోన్ పరిధిలో ఉంది. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో అండర్ –14, –17 విభాగాల్లో బాలబాలికలు వేర్వేరుగా పోటీ పడనున్నారు. తాండూరు జోన్ పరిధిలో నేటి నుంచి క్రీడాకారుల ఎంపిక బషీరాబాద్లో ఉంటుందని జోనల్ సెక్రటరీ జె.అంబదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల ఎంపిక విషయాన్ని అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్తో హాజరుకావాలన్నారు. పారదర్శకత పాటించాలి జోనల్ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ జిల్లా, ఆపై స్థాయిల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్యం గల క్రీడాకారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. సొంత ఇల్లు ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లాకు ఇప్పటివరకు 11,785 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. 5,778 గ్రౌండింగ్ అయ్యాయని, 882 పూర్తయినట్లు పేర్కొన్నారు. హౌసింగ్ పీడీకి ఘన వీడ్కోలు ఉద్యోగ విరమణ పొందుతున్న హౌసింగ్ శాఖ పీడీ కృష్ణయ్యకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సేవలను కలెక్టర్ కొనియాడారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటే హౌసింగ్ స్కీంను ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, హౌసింగ్ శాఖ అధికారులు ముక్రం బాబా, సయ్యద్ సాజిద్, తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసిన సేవలే గుర్తుండిపోతాయి విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న హోసింగ్ పీడీ కృష్ణయ్యకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, టీజీఓ సెక్రటరీ మహమ్మద్ సత్తార్, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ హామీ నిలబెట్టుకోవాలి
ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ దోమ: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన పింఛన్ హామీని నిలబెట్టుకోవాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని బొంపల్లిలో ఎంఎస్ఎఫ్ ఏపీ అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్ మాదిగ, మండల ఉపాధ్యక్షుడు డి.వెంకటేశ్తో కలిసి దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 2న కొడంగల్ పట్టణంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పింఛన్ డబ్బు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ, గ్రామ అధ్యక్షుడు టి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, దివ్యాంగుల సంక్షేమ సంఘం గ్రామ అధ్యక్షుడు కె.ఆంజనేయులు పాల్గొన్నారు. -
స్కిల్ డెవలప్మెంట్తో భవిష్యత్తు
మర్పల్లి: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. గురువారం మండలంలోని పట్లూర్ గ్రామంలో పవర్ మేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధునాతన మిషనరీ, కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రంగాల్లో అనుభవం ఉన్న యువతకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. పవర్ మేక్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. తమ సెంటర్లో వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రిషన్ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కోర్సుల ఆధారంగా 30 నుంచి 90 రోజుల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 8వ తరగతి పాస్ అయి ఉండి ఐటీఐ, లేదా ఇంటర్ పాస్ అండ్ ఫెయిల్ అయిన వారు శిక్షణకు అర్హులన్నారు. కార్యక్రమంలో పవర్ మేక్ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మి, పవర్ మేక్ ఫౌండేషన్ అధినేత కిషోర్ బాబు, ప్రిన్సిపాల్ విమల్ కుమార్, నందకిషోర్, ప్రభాకర్, భరత్ పురోహిత్, పట్లూర్ గ్రామస్తులు అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ -
విదేశీ వాణిజ్య ఒప్పందం ప్రమాదకరం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏఎ)పై సంతకం చేయడమంటే అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోవడమేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శించారు. గురువారం వికారాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యామయ్య అధ్యక్షతన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, పాడి, ఆహార, మార్కెట్ రంగాలకు ద్వారాలు తెరవడంతో దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలను వ్యతిరేకించాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఉపాధ్యక్షులు మహిపాల్, సతీష్, లక్ష్మయ్య, వల్యనాయక జమాలొద్దీన్, అనసూయ లక్ష్మి, రాజు, బస్వరాజు, శ్రీనివాస్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు
● సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్కుమార్ ● బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై ఆగ్రహం తాండూరు టౌన్: బీసీ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలన్నీ డ్రామాలు ఆడుతున్నాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు పాసై, గవర్నర్ వద్ద ఆమోదం కోసం ఎదురు చూస్తోందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ, కేవలం 29శాతం విద్య, ఉద్యోగాల్లో, 21శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు వెనకాడిన ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శిస్తోందన్నారు. బీసీ కులగణన వివరాలను, సర్వే డాటాను ప్రజలకు అందుబాటులో పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కాంగ్రెస్ తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలైతే ముస్లింలు లాభపడతారని బీజేపీ ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ఇలా ప్రతి రాజకీయ పార్టీ వారి స్వప్రయోజనాల కోసం వ్యవహరించకుండా, ఏకతాటిపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
పాలమూరు పూర్తి చేస్తాం
పరిగి: ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయత్ర గురువారం పరిగి మండలం రంగాపూర్ నుంచి పరిగి పట్టణం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్రంతో కొట్లాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పరిగి ప్రాంతం రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంలో మనమే ఆదర్శం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. పట్టణంలో జనహిత పాదయాత్ర అట్టహాసంగా సాగింది. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, పార్టీ జిల్లా, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, మండల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ‘ప్రాణహిత– చేవెళ్ల’ను రద్దు చేసింది జనహిత పాదయాత్రలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ఇందిరమ్మకు ఇసుక గండం
దోమ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సీఎం రేంవత్రెడ్డి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం విధితమే. కానీ దోమ మండల అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక పర్మిషన్ కోసం టోకెన్ ఇవ్వాలని తహసీల్దార్ వద్దకు వెళితే.. అనుమతి లేదంటూ తిప్పిపంపిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. దీంతో లబ్ధిదారులకు ఇసుక దొరకక ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. అధికారులు మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. ఈ ఊరికి మొత్తం 185 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 96 ఇళ్లు పనులు జరుగుతుండగా 89 ఇండ్లు ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. దీంతో పనులు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక సమస్య తలనొప్పిగా మారింది. కాసులు దండుకుంటున్న దళారులు మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనంత ఇసుక దొరుకుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. దిర్సంపల్లి, మైలారం, గొడుగోనిపల్లి వాగులతో పాటు కాకారవాణి ప్రాజెక్టులో భారీ స్థాయిలో ఇసుక ఉంది. దాన్ని కొంత మంది వ్యాపారులు ట్రాక్టర్లలో పొలాల దగ్గరకు తెచ్చుకొని డంపులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ డంపులను అధికారులు పట్టుకోకపోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారు ఇష్టారీతిన అధిక రేట్లకు విక్రయిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి రూ.5 లక్షలు కేటాయిస్తుంది. దీంట్లో స్టీల్, సిమెంట్, ఇటుకలు తెచ్చుకోవాల్సి ఉంది. వాటి ధరలు సైతం అధికంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చి ఇందిరమ్మ ఇళ్లకు అందించాలని అధికారులను ఆదేశించింది. కానీ ఽఅధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. డస్ట్తో కట్టుకుంటున్నాం ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. పకడ్బందీగా నిర్మించుకుందామనుకుంటే ఇసుక దొరకలేని పరిస్థితి నెలకొంది. దీంతో డస్ట్తో ఇల్లు నిర్మించుకుంటున్నాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలని కోరితే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. – బాలునాయక్, శివారెడ్డిపల్లితండా ఎలాంటి ఆదేశాలు లేవు ఇందిరమ్మ ఇళ్లయినా, మరే ఇతర అవసరాలకై నా ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తెచ్చుకునేందుకు టోకన్లను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – గోవిందమ్మ, తహసీల్దార్, దోమ టోకెన్ అనుమతులు లేవంటున్న అధికారులు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన -
సేవలే చిరస్థాయిగా ఉంటాయి
అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా ఉంటాయని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్లో ఎస్ఐగా సేవలందించి, పదవీ విరమణ పొందిన ఎండీ శయిదుద్దీన్కు గురువారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఎండీ శయిదుద్దీన్ను సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ సేవలను, అంకితభావాన్ని క్రమశిక్షణను కొనియాడారు. 38 ఏళ్లకు పైగా ఎలాంటి రిమార్క్ లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు. పోలీస్ ఉద్యోగం సవాలుతో కూడుకున్నదని, కుటుంబ సభ్యుల సహకారం లేనిదే ఇంత సుదీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మురళీధర్, ఏఓ జ్యోతిర్మయి, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ అశోక్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి -
వామ్మో.. ఇదేం బస్టాండ్!
ఆవరణ మొత్తం చెత్తమయం ● ప్రయాణికులు కూర్చోలేని పరిస్థితి ● నిర్వహణను గాలికొదిలేసిన ఆర్టీసీ అధికారులు ధారూరు: లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ధారూరు బస్టాండ్ దారుణంగా తయారైంది. మేకలు, పందులు, కుక్కలు మలమూత్ర విసర్జన చేయడంతో ప్రయాణికులు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బస్టాండ్ ఆవరణ మొత్తం కంపు కొడుతోంది. తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ దీని పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నా ఒక్కసారి కూడా పరిశీలించిన పాపానపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారూరుకు వస్తుంటారు. బస్టాండ్లో చెత్తాచెదారం వల్ల ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేక పోతున్నారు. వర్షాల కారణంగా ఆవరణ మొత్తం చిత్తడిగా మారింది. అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. బస్సులు సైతం బస్టాండులోకి రావడం లేదని ప్రయాణికులు తెలిపారు. రోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, బస్సులు బస్టాండ్ లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
పన్నెండేళ్లకు పచ్చజెండా!
సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్– సికింద్రాబాద్లను కలిపే బేగంపేట్ రోడ్– రాణిగంజ్ క్రాస్రోడ్స్ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్పీ రోడ్ –నెక్లెస్ రోడ్ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్ఓబీ (ఫ్లై ఓవర్) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సమన్వయం, సహకారం లోపంతో.. ● ఇక్కడి ఆర్ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్, సెక్రటేరియట్ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్– ట్యాంక్బండ్– ప్యారడైజ్కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది. ● ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తయితే అటు ఎస్పీ రోడ్, ఇటు ఎంజీ రోడ్లోనూ ట్రాఫిక్కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్పై రెండు వైపులా క్యారేజ్వేలతోపాటు ఫుట్పాత్లు, సెంట్రల్ మీడియన్లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు. ఫ్లైఓవర్ ఫ్లాష్బ్యాక్ ఇలా.. 2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వలేదు. హెచ్ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్ మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. బేగంపేట్లో తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు త్వరలో పాటిగడ్డ– నెక్లెస్ రోడ్డు ఆర్ఓబీ పనులు పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు -
కూతురి పెళ్లికి దాచితే.. దోచేశారు!
నందిగామ: కూతురి పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని మండలంలోని మామిడిపల్లికి చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించినా స్పందన కరువైందని లబోదిబోమన్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య కొందుర్గు మండలంలోని మహదేవ్పూర్లో ఉన్న భూమిని గతంలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతో కొంత అవసరాల కోసం వాడుకున్నాడు. కూతురుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో 16 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి, రూ.15 లక్షల నగదును ఇంట్లో భద్రపరిచాడు. ఇటీవల రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో ఇంట్లో చూడగా నగదు, బంగారం కనబడకపోవడంతో లబోదిబోమన్నాడు. డబ్బులు, పసిడి దోచుకుపోయిన విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చర్చించాడు. ఎక్కడ నుంచి కనీస సమాచారం లేక పోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. గురువారం తిరిగి బాధితులు పోలీస్ స్టేషన్కు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సజ్జపై దాచిన డబ్బులను తెలిసిన వారే దోచుకుపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేయని పోలీసులు మామిడిపల్లిలో ఇంత పెద్ద చోరీ జరిగినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇన్స్పెక్టర్ ప్రసాద్ను వివరణ కోరగా.. బాధితులను విచారించామని, ఏసీపీ శుక్రవారం వస్తారని, మరోసారి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు. మామిడిపల్లిలో భారీ చోరీ రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారం అపహరణ -
పారిపోయిన విద్యార్థి అప్పగింత
కుల్కచర్ల: చదవడం ఇష్టం లేక పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన గుడిసె అఖిల్ ముజాహిద్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ స్థానికంగా బీసీ వసతిగృహంలో ఉంటున్నాడు. బుధవారం అతడు పాఠశాల సమయంలో బయటకు వచ్చి కుల్కచర్లకు వచ్చి బస్సులో షాద్నగర్ వెళ్లాడు. అక్కడ పోలీసులు బాలుడిని గమనించి వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడి చిరునామా తెలుసుకుని స్థానికుల ద్వారా కుల్కచర్ల పోలీస్స్టేషన్కు పంపించారు. గురువారం ఉదయం ఎంఈఓ హబీబ్ అహ్మద్ సమక్షంలో అఖిల్ను కుటుంబీకులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సతీష్, వసతిగృహ ప్రత్యేకాధికారి విజయ్కుమార్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
చెరవీడని సర్కారు భూమి!
బషీరాబాద్: ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి విడిపించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. బషీరాబాద్– తాండూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని కాశీంపూర్ శివారులోని విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతానికి గురైందని తేల్చినా స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. బషీరాబాద్, యాలాల, తాండూరు మూడు మండలాలను కలిపే శివారు కావడంతో కొన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సమీప రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తంచేయడం, పత్రికల్లో ఇందుకు సంబంధించిన కథనాలు రావడంతో స్పందించిన యంత్రాంగం గత నెల జూలై 10న సర్వేచేసింది. జుంటివాగు బ్యాక్వాటర్ నిలిచే నది ప్రాంతాన్ని మట్టితో పూడ్చేసిన అక్రమార్కులు 200 మీటర్ల పొడవున, ఐదు మీటర్ల మేర భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు. దీనికి తోడు తాండూరు మండలం మాచనూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32/2లో సుమారు 20 గుంటల భూమి అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించారు. అనంతరం యాలాల, తాండూరు రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు మరోసారి సంయుక్తంగా సర్వే చేశారు. కబ్జా వాస్తవమేనని తేల్చినప్పటికీ సర్కారు భూమిని మాత్రం చెర నుంచి విడిపించలేదు. ఇదిలా ఉండగా భూమిని చెరబట్టిన వ్యక్తులు ఇటీవల ప్రభుత్వ స్థలంలోనే ట్రాన్స్ఫార్మర్ బిగించారు. దీనికితోడు బషీరాబాద్– తాండూరు ప్రధాన రోడ్డు నుంచి వీరి పొలాల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వ భూమిని వారి సొంత స్థలంలా వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా అక్రమార్కుల ఆట కట్టించి, ప్రభుత్వ భూమిని కాపాడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు.. ఈవిషయమై యాలాల తహసీల్దార్ వెంకటస్వామిని వివరణ కోరగా.. జుంటివాగు కబ్జాపై ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సమగ్రంగా సర్వే చేశామన్నారు. తాండూరు మండల పరిధిలో 5 మీటర్ల మేర భూమి కబ్జాకు గురైనట్లు తేలిందని చెప్పారు. యాలాల పరిధిలోకి వచ్చే చెక్డ్యాం వెనకవైపున 200 మీటర్ల పొడవునా ఆక్రమించారని తెలిపారు. ఇక్కడ నిర్మిస్తున్న గది తాండూరు పరిధిలోకి వస్తుందన్నారు. ఆక్రమణకు గురైన స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయడంతో పాటు భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. మరోవైపు ఇరిగేషన్ డీఈ కిష్టయ్య మాట్లాడుతూ.. జుంటివాగు కబ్జాపై ఇప్పటికే కలెక్టర్కు నివేదిక ఇచ్చామన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. కబ్జాకు గురైనట్లు తేల్చినా స్వాధీనం చేసుకోని వైనం ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు -
కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!
వికారాబాద్: తనను వివాహం చేసుకుంటానని భర్త నుంచి దూరం చేసిన ప్రియుడు ఆ తర్వాత మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ విషయమై మంగళవారం తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని, తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఇదే ఊరికి చెందిన మరో యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం ఆమెను కర్ణాటకకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత సదరు యువతి భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పాడు. దీంతో యువతిని ఆమె భర్త వదిలేశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన సదరు వ్యక్తి, కాలయాపన చేస్తూ మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ఇదిలా ఉండగా యువతి పీఎస్కు వచి్చన మాట వాస్తవమేనని పోలీసులు తెలిపారు. బుధవారం వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వెళ్లిపోయారని చెప్పారు. -
సమాచారం లేకుండా శిలా ఫలకాలా!
యాలాల: మండలంలోని దౌలాపూర్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు పేదల భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమని కేవీపీఎస్, దళిత సంఘం నాయకులు అన్నారు. మంగళవారం వారు బాధిత రైతులతో కలిసి మాట్లాడుతూ.. చెన్నారం గ్రామానికి చెందిన అశోక్, కొనిగేరి చంద్రప్ప, కొనిగేరి మాదరప్ప తదితరులకు ప్రభుత్వం సర్వే నెంబర్లు 73, 73/5/3 నెంబర్లలో రెండెకరాల భూమిని కేటాయించింది. 50 ఏళ్లుగా బాధిత కుటుంబాలు భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాగా తమకు కేటాయించిన భూమిలో ఎటువంటి సమాచారం లేకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. 2013భూ సేకరణ చట్టం ప్రకారం.. బాధిత రైతుకు భూమికి భూమి, పరిహారం ఇవ్వాలని ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యకాస జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, రైతులు వెంకటమ్మ, రాములమ్మ, చంద్రప్ప, మాదరప్ప, సిద్దు తదితరులు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య -
భట్టి పర్యటనలో ప్రొటోకాల్ రగడ
యాలాల: మండల పరిధిలోని దౌలాపూర్ సమీపంలో మంగళవారం చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. హాజీపూర్తో పాటు మరో ఐదు ప్రాంతాల్లో కొత్తగా ఆరు సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయమై కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎంతో పాటు స్పీకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ఫొటో లేకపోవడాన్ని గమనించిన ఆయన వర్గీయుడు రఘు, సంబంధిత శాఖ అధికారులను నిలదీశారు. పట్నం ఫొటో వేయకూడదని ఎవరైనా చెప్పారా? ప్రొటోకాల్ తెలీదా అంటూ ట్రాన్స్కో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారుల తీరు సరిగా లేదని పట్నం వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎంకు నిరసన సెగ కాగా దౌలాపూర్లో శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకుని తాండూరు వెళుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. రెండు రోజుల క్రితం కాగ్నా కొత్త బ్రిడ్జిపై రంధ్రం పడటంతో పాటు అధ్వాన్నంగా తయారైన రోడ్ల విషయమై బీజేపీ నాయకులు ఆయన కాన్వాయ్కు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. ఫ్లెక్సీలో మండలి చీఫ్ విప్ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం అధికారులను నిలదీసిన పట్నం వర్గీయులు -
పాదయాత్రకు తరలిరండి
పరిగి: కాంగ్రెస్ భావజాల్లాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31న రంగాపూర్ నుంచి పరిగి పట్టణ కేంద్రం వరకు సాయంత్రం 5 గంటలకు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంటుందన్నారు. శుక్రవారం తుంకుల్గడ్డలో శ్రమదాన కార్యక్రమం, ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేర మేలు చేకూరుస్తున్నాయని తెలుసుకువడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు దిశానిర్దేశంపై చర్చిస్తామన్నారు. బీసీలకు ఇచ్చిన హమీ ప్రకారం 42శాతం రిజర్వేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే కేంద్రం అడ్డుపడుతోందన్నారు. కేంద్రంపై కొట్లాడేందుకు ఆగస్టు 5,6,7వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపు రంగాపూర్ నుంచి ప్రారంభం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ధారూరు: మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎరువుల నిల్వలను మంగళవారం వికారాబాద్ వ్యవసాయ సంచాలకుడు వెంకటేశం తనిఖీ చేశారు. ధారూరు, హరిదాస్పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో, మోమిన్ఖుర్దులోని ఆగ్రో సెంటర్లో ఎరువుల నిల్వలు, విక్రయానికి సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరం మేరకు యూరియా కోసం వెనువెంటనే ఇండెంట్లు పెట్టుకోవాలని.. యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని దుకాణదారులకు సూచించారు. అనంతరం మున్నూరు సోమారం గ్రామ సమీపంలో సాగుచేసిన పత్తి పొలానికి ఎరువు వేసే ప్రక్రియను పరిశీలించారు. పత్తికి పైపాటుగా యూరియా వేయడం వలన గాలిలో కలిసిపోయి మొక్కకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదని చెప్పారు. పత్తి మొక్కలకు ఆరు ఇంచుల దూరంలో మట్టితీసి యూరియా వేశాక కప్పివేయాలనీ ఆయన రైతులకు సూచించారు. ఏడీఏ వెంట ఏఈఓ సంజూరాథోడ్ ఉన్నారు. ప్రజలకు రక్షణ కల్పించండి పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బొంరాస్పేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. వార్షిక సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన బొంరాస్పేట్ ఠాణాను సందర్శించారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకునేలా చూడాలన్నారు. -
పట్టుకోండి చూద్దాం!
పరిగి: వాహన తనిఖీల్లో పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాత్రి పట్టణ కేంద్రంలో సుల్తాన్పూర్ గేట్ సమీపంలో పోలీసులు డ్రంకెన్డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన ఓ బైక్పై కొడంగల్ నుంచి ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కనిపించడంతో పోలీసులు వారిని నిలువరించి తనిఖీ చేశారు. వారిని వద్ద ఉన్న సంచిలో ఏముందని అడగడంతో కంగారు పడ్డారు. వారి వద్ద నుంచి సంచిని లాక్కొని పరిశీలించగా నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు పోలీసులను తోసేసి సుల్తాన్పూర్ వైపు పొలాల్లోకి పరుగులు తీశారు. పోలీసులు వెంబడించినా వారి దొరక్కుండా పరారయ్యారు. అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. కర్ణాటక పాసింగ్ బైక్, నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజాసంఘాల ఆగ్రహం చేతికి చిక్కిన దుండగులు పోలీసుల కళ్ల ఎదుటే పరారవుతుంటే పట్టుకోవడంలో విఫలమయ్యారని ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పరిగి పరిసర ప్రాంతాల్లో నిత్యం చోరీల ఘటనలకు కారణం అంతరాష్ట్ర ముఠాలే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను పట్టుకోవాల్సిన పోలీసులు బురద, పొదలుండడంతో వెనుకడుగు వేశారని స్థానికులు వాపోతున్నారు. పరుగెత్తుతున్న వారిని పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చోరీలకా.. హత్యకా..? సంచిలో కత్తులు, నాటు తుపాకీ, స్క్రూ డ్రైవర్లను తీసుకెళ్తున్న దుండగులు చోరీల కోసమా.. లేదంటే ఎవరినైనా హత్య చేసేందుకా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల చోరీలు, హత్యలు జరుగుతుండడంతో ఈ ఘటన వల్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైక్ నంబర్, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలు పరార్ పోలీసులను తోసేసిపొలాల్లోకి పరుగులు బైక్, నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం గాలింపు కొనసాగిస్తున్నాం దుండగుల కోసం గాలింపు చర్యలు కొసాగిస్తున్నాం. వారి నుంచి నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్, బైక్ను స్వాధీనం చేసుకున్నాం. బైక్ నంబర్, టెక్నికల్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. – మోహన్ కృష్ణ, ఎస్ఐ, పరిగి -
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
యాలాల: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అని యాలాల పీహెచ్సీ వైద్యాధికారి రుబియా నాజ్ అన్నారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం జిల్లా ఇన్చార్జి డాక్టర్ గోపాల్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు వేడి భోజనంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పీహెచ్సీలో పరీక్షలు చేసుకుని మందులు తీసుకోవాలన్నారు. అనంతరం వసతి గృహంలోని వంట సరుకులు, బియ్యం, కూరగాయలను పరిశీలించి వసతి గృహ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ చంద్రప్రకాశ్, పీహెచ్ఎన్ సుశీల, సూపర్వైజర్ శోభారాణి, పల్లె దవాఖాన డాక్టర్ స్రవంతి, ఏఎన్ఎం లక్ష్మీ తదితరులు ఉన్నారు.పీహెచ్సీ వైద్యాధికారి రుబియా నాజ్ -
పేరుకే పైలెట్ ప్రాజెక్ట్
కొందుర్గు: ధరణి లోపాలను సరిదిద్దుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంతోనైనా తమ సమస్యలు తీరుతాయని ఆశించిన రైతుల కల లు కల్లలయ్యాయి. ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని చెప్పిన పాలకుల ప్రసంగాలు విని సంతోషించారు. ప్రభుత్వం జిల్లా లో కొందుర్గు మండలాన్ని పైలెట్గ్రామంంగా ఎంపిక చేసింది. దీంతో మే 30న నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ప్రసంగిస్తూ మండలంలో భూ సమస్యలన్నింటికి పరిష్కారం చూపి రోల్మోడల్గా నిలపాలని అధికారులకు సూచించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సదస్సులు పూర్తయి రెండు నెలలు గడిచినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు విన్నవించినా కదలని ఫైల్ భూభారతి అవగాహన సదస్సులో భాగంగా మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డికి పలువురు రైతులు తమ సమస్యలు వివరించారు. ● కొందుర్గు తూర్పు, పడమర రెండు రెవెన్యూ గ్రామాలుగా ఉండడంతో తమ భూములు నిషేధిత జాబితాల్లో చేరాయని గ్రామానికి చెందిన పెరుమాళ్ల శేఖర్ ఫిర్యాదు చేశారు. ● చెర్కుపల్లిలో 48 మంది భూములు అకారణంగా నిషేధిత జాబితాలో పడ్డాయని పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి వాపోయారు. ● 1954 ఖాస్రా పహణి రికార్డుల ప్రకారం చెర్కుపల్లికి చెందిన సర్వే నంబర్లు 119, 260, 271, 272, 274, 277, 280, 281, 282, 295లలో 79 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమి వేంకటేశ్వర స్వామి ఆలయం పేరిట పట్టా చేశారు. ● 1958లో భూములను రీ సర్వేచేయడంతో శివారులోని 1, 2, 4, 12, 67, 100, 107, 108, 146, 147, 148, 158, 159, 172, 318, 348, 252, 354, 357, 358, 359 లలో విస్తీర్ణం 79 ఎకరాల భూమిని వెంకటేశ్వరస్వామి పేరున పట్టా మార్చారు. ఆగం చేసిన ధరిణి పోర్టల్ ధరణి పోర్టల్ ఏర్పాటు సయమంలో రీసర్వేకు ముందు, తర్వాత మొత్తంగా 158 ఎకరాలను ఆలయ భూమిగా చూపుతూ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో 48 మంది రైతులకు చెందిన భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ఈ విషయమై బాధిత రైతులు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చినా సమస్యల పరిష్కారం అవ్వలేదు. ఇందుకు స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు పూర్తైన వెంటనే సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతాం. కొందుర్గును రాష్ట్రానికే దిక్చూచిగా మార్చుతాం అంటే సంతోషపడ్డారు. కానీ నేటికి సమస్యలు తీరలేదు. పేరుకుపోయిన సమస్యలు భూ భారతిలోనూ ధరణి తప్పిదాలు ఇదేనా రోల్మోడల్ అంటూ రైతుల అసహనం రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు మొత్తం దరఖాస్తులు 573 అమోదం పొందిన దరఖాస్తులు 38 ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్ 56 అడిషనల్ కలెక్టర్ వద్ద పెండింగ్ 70 రిజెక్ట్ అయిన దరఖాస్తులు 120 సమస్య తీరేలా లేదు తాతల కాలం నుంచి పట్టా భూములు సాగుచేసుకుని బతుకుతున్నాం. తమకు ఆపద వచ్చి ఓ గుంట భూమిని అమ్ముకుందామని వెళితే మీ భూములు దేవుడి పేరున ఉన్నాయి. అమ్మడానికి వీలుకాదని అధికారులు చెబుతున్నారు. భూ భారతి చట్టంతోనైనా మా సమస్య తీరుతుంది అనుకున్నాం. కాని ఏమి లాభం లేదు. మేము సచ్చినా సమస్య తీరేలా లేదు. – వడ్డె చంద్రయ్య, రైతు, గంగన్నగూడ త్వరలో పరిష్కారంవీలైనంత త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇప్పటికే దాదాపు సమస్యలకు పరిష్కారం చూపాం. వివిధ స్థాయిల్లో కొన్ని ధరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే పరిష్కారం కావచ్చు. – రమేశ్ కుమార్, తహసీల్దార్, కొందుర్గు -
సదస్సును జయప్రదం చేయండి
బొంరాస్పేట: వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేయూత పింఛన్లు వెంటనే పెంచాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్మాదిగ కోరారు. మంగళవారం మెట్లకుంటలో దివ్యాంగులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ మొత్తం పెంచుతామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్లో ఆగస్టు 13న మహాగర్జన ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 2వ తేదీ కొడంగల్లో సన్నాహక సదస్సు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నరసింగరావు, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ ప్రకాశ్ మాదిగ, వీహెచ్పీఎస్ నాయకులు వెంకటయ్య, మల్లేశ్, యాదయ్య, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ -
అభివృద్ధి, సంక్షేమం
అప్పులు కడుతూనే సమర్థవంతంగా అమలు తాండూరు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులు కడుతూనే సమర్థవంతంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో రూ.7.32 కోట్ల విలువ చేసే సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ఖాంజాపూర్ వద్ద స్వాగత ముఖద్వార పనులను ప్రారంభించారు. ఆ తర్వాత జీపీఆర్ గార్డెన్లో నియోజకవర్గంలోని 22,292 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, మంత్రి మాట్లాడారు. తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ ప్రతిపాదనలతో తమ వద్దకు వస్తున్నట్లు తెలిపారు. ఆయన చొరవతో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అధిక నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే పథకాలు అందుతున్న నవ్వులు ప్రజల్లో కనిపిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వారిని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతారని హితవు పలికారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాండూరు అంటే సీఎం జిల్లా అన్నారు. ఇక్కడ మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్ లాంటి పెద్ద నేతలు ఉన్నారని పేర్కొన్నారు. షాబాద్ స్టోన్ అంటే యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. తాండూరు నాపరాతి పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో మాట్లాడతానని పేర్కొన్నారు. తాండూరు బైపాస్ పనులకు రూ.30 కోట్లతో ప్రతిపాదనలు అందాయన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సమర్థులు కాబట్టే గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. సీఎం జిల్లా కావడంతో పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. కోట్పల్లి ప్రాజెక్టుకు రూ.90 కోట్లు మంజూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు మండలి చీఫ్విప్ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహరాజ్, వైశ్య కార్పొరేష్ చైర్పర్సన్ కల్వ సుజాత, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన యాలాల: మండలంలోని దౌలాపూర్ శివారులో రూ.230 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, రూ.30 కోట్లతో హాజీపూర్, తాండూరు, బెల్కటూరు, నారాయణపూర్, పాషపూర్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేపట్టారు. అంతకుముందు జుంటుపల్లి రామస్వామి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. డిప్యూటీ సీఎం కళాశాల స్నేహితుడు శ్యాంసుందర్రావు ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటీ విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజేందర్రెడ్డి, హన్మంతు, అక్బర్బాబా, భీమ ప్ప, ఖాసీం, నాగప్ప, హాజీపూర్ మాజీ సర్పంచ్ బాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు సీఎం రేవంత్రెడ్డి సమర్థతతో ప్రగతి వైపు అడుగులు డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్కుమార్ తాండూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం స్నేహితుడి ఇంట్లో భోజనం తాండూరు రూరల్: తాండూరు పర్యటనకు వచ్చి న మంత్రి శ్రీధర్బాబు తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన నరేందర్రెడ్డి కుమారుడు శ్రీకాంత్రెడ్డి మంత్రి శ్రీధర్బాబు మంచి స్నేహితులు. ఆయన ఆహ్వానం మేరకు మంత్రి శ్రీధర్బాబు తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మరి కొందరు శ్రీకాంత్రెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. -
ఆయిల్పాంతో అధిక లాభాలు
వికారాబాద్: ఆయిల్ పాం సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయశాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం కొత్రెపల్లిలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో కలిసి ఆయిల్పాం మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంత భూములు ఈ తరహా సాగుకు ఎంతో అనుకూలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో సాగు చేస్తే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ పంట ఒక్కసారి సాగు చేస్తే 40 ఏళ్లపాటు దిగుబడి వస్తూనే ఉంటుందన్నారు. ఎకరాకు ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. నాలుగేళ్లపాటు అంతర పంటల సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని వివరించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట రేవంత్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్ వ్యవసాయ రంగానికి కేటాయించిందన్నారు. రూ.21 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. రైతు భరోసా, సన్నరకం వడ్లకు బోనస్ తదితర ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఆయిల్పాం సాగుకు మన జిల్లా భూములు ఎంతో అనుకూలమన్నారు. గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ డైరక్టర్ హాస్మిన్బాషా, డిప్యూటీ డైరక్టర్ నీరజగాంధీ, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం, ఆర్డీఓ వాసుచంద్ర, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి సాగు చేస్తే 40 ఏళ్లపాటు లబ్ధి అంతర పంటల సాగుకు రాయితీలు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం వ్యవసాయశాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పర్తాని మృతి
బషీరాబాద్కు నాలుగు సార్లు ఏకగ్రీవం బషీరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, బషీరాబాద్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పర్తాని(93) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. 1971–1989 బషీరాబాద్ సర్పంచ్గా నాలుగు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృస్టించారు. అనంతరం కుటుంబం తాండూరుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మంగళవారం తాండూరులో ఆయన అంత్యక్రియలు జరిపించారు. పర్తాని మృతిపై ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వారి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ బీషీరాబాద్ సీనియర్ నాయకులు వెంకటేశ్ మహరాజ్, అజయ్ప్రసాద్, మాణిక్రెడ్డి, పవన్ఠాకూర్, జగన్నాథ్, పలువురు వ్యాపారవేత్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కుల్కచర్ల: కుటుంబ ఉన్నతికి గృహ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా మారాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బోయిన ప్రభాకర్(35) గృహనిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. ప్రభాకర్ మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ భవన నిర్మాణంలో పనిచేస్తుండగా విద్యుత్వైర్లు తగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంతోష, కూతురు సహస్ర(7), కుమారుడు రిత్విక్(5) ఉన్నారు. తప్పిపోయిన బాలుడు కుటుంబీకుల చెంతకు పూడూరు: తప్పిపోయిన బాలుడిని చన్గోముల్ పోలీసులకు తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. మొయినాబాద్కు చెందిన బాలుడు ప్రవీణ్(7) మంగళవారం చేవెళ్ల బస్ స్టేషన్లో తాండూరు డిపో బస్సు ఎక్కాడు. కండక్టర్ టికెట్ అడగడంతో బాలుడు డబ్బు లేదని చెప్పాడు. తండ్రి పేరు అడగ్గా ఎల్లప్పగా చెప్పాడు. దీంతో కండక్టర్ చన్గోముల్ ఠాణాలో అప్పగించాడు. పోలీసులు విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో మెయినాబాద్కు చెందిన ఎల్లప్ప దంపతులు పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మళ్లీ ట్రెక్ పార్కులోకే వచ్చిన చిరుత మణికొండ: మంచిరేవుల ట్రెక్ పార్కు నుంచి రాందేవ్గూడ మిలిటరీ ప్రాంతంలోకి వెళ్లిన చిరుత పులి ఒక రోజులోనే తిరిగి ట్రెక్ పార్కుకే చేరుకుంది. సోమవారం తెల్లవారుజామున రాందేవ్గూడలోని మిలిటరీ ప్రాంతంలో రహదారి దాటుతూ అక్కడి సీసీ కెమెరాలో కనిపించిన విషయం తెలిసిందే. అక్కడ దానికి అనువుగా ఉండకపోవటంతో అది తిరిగి సోమవారం అర్ధరాత్రి 12.25 గంటలకు ట్రెక్ పార్కుకు చేరుకుని ట్రాప్ కెమెరాలో చిక్కిందని అటవీ రేంజ్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ప్రశాంతమైన అటవీ ప్రాంతాన్నే చిరుత ఇష్టపడుతుందన్నారు. మిలిటరీ ప్రాంతంలో దానికి ఆహారం లభించకపోవటం, వాహనాల శబ్దా లు అధికంగా రావటంతోనే తిరిగి ట్రెక్ పార్కు కు వచ్చి ఉంటుందని చెప్పారు. ట్రెక్ పార్కులో దానికి ఇష్టమైన అడవిపందుల వంటి ఆహారం లభిస్తుండటం, ఎలాంటి అవాంతరాలు లేకపోవటంతో మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దానికి సరైన ఆహారం లభించనప్పుడే బోన్లో ఎరగా పెట్టిన మేకను తినేందుకు వచ్చి చిక్కే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు ట్రెక్ పార్కును మూసి ఉంచుతామని, ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీసు రోడ్డులో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని లక్ష్మణ్ సూచించారు. -
ఆదరణేది!
కొడంగల్: గత ప్రభుత్వం రవాణా సౌకర్యం మెరు గు పరిచేందుకు 11 బస్సులతో కోస్గి ఆర్టీసీ డిపోను ప్రారంభించింది. నాడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ డిపోను ప్రారంభించారు. ఏళ్లు దాటినా బస్సు సర్వీసులు పెంచకుండా అరకొర బస్సులతోనే నిర్వహణ కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాద్, మహబూబ్నగర్, తాండూరు ప్రధాన రూట్లలో సరిపడా సర్వీసులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఉన్న బస్సులు సైతం ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి. మూడేళ్ల క్రితం మరోసారి ప్రారంభం గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి డిపో ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికై నా గ్రామాలకు బస్సులు వస్తాయని ఆశించిన నియోజకవర్గ ప్రజలు ఆశించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్రెడ్డి కోస్గి డిపోకు కొత్తగా బస్సులు కేటాయించి హైదరాబాద్కు నడిపిస్తున్నారు. పల్లెలకు బస్సుల సౌకర్యం లేక ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. సౌకర్యాల లేమి ● డిపో ఏర్పాటు చేసినా డిపో మేనేజర్ నియామకం చేపట్టలేదు ● డిపోలో కనీస సౌకర్యలు కల్పించలేదు. ● బస్సులను శుభ్రం చేసేందుకు స్టాండ్ ఏర్పాటు చేయలేదు. ● డిపోలే డీజిల్ ఫిల్లింగ్ సౌకర్యం ఏర్పాటుకు నోచుకోలేదు. ● పూర్తిస్థాయి మెకానిక్లు నియమించలేదు. ● సిబ్బంది నియామకం నామమాత్రమే పాఠశాలలకు ఆలస్యం ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాండూరు, మహబూబ్నగర్ లాంటి పట్టణాలకు ఒకేసారి ఒకే సమయంలో ఐదారు సర్వీసులు నడుపుతున్నారు. ఆ బస్సులు వెళ్లాయంటే మళ్లీ గంట వరకు బస్సులు రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రార్థనకు ఆలస్యంగా వెళ్లడంతో టిఫిన్స్ అందడం లేదు. పాఠశాల సమయానికి విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు వేయాలని డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ఎంఈఓ రాంరెడ్డి ఆరోపించారు. రుద్రారం, నీటూరు, అప్పాయిపల్లి, చిట్లపల్లి, సంగాయిపల్లి, అంగడిరాయిచూర్, లక్ష్మీపల్లి, టేకుల్కోడ్, అన్నారం, నాగారం, ధర్మాపూర్, పాటిమీదిపల్లి గ్రామాల విద్యార్థులకు ప్రతి రోజూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. విస్తరణకు నోచుకోని కొడంగల్ బస్టాండ్ 1979 అక్టోబర్ 24 అప్పటి రవాణా శాఖ మంత్రి వెంగళ్రావు శంకుస్థాపన చేసిన కొడంగల్ బస్టాండ్ను 1981 డిసెంబర్ 19న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య, రవాణా శాఖ మంత్రి రోశయ్య ప్రారంభించారు. నాటి నుంచి ఈ బస్టాండ్ విస్తరణకు నోచుకోలేదు. కొడంగల్ నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేదు. వికారాబాద్కు వెళ్లాలంటే రెండు బస్సులు మారాల్సిందే. వికారాబాద్ వెళ్లాలంటే పరిగి మీదుగా నుంచి 52 కిలోమీటర్లు, తాండూరు మీదుగా 63 కిలోమీటర్ల ప్రయాణించాల్సిందే.కోస్గి డిపోపై పాలకుల నిర్లక్ష్యం బస్సు సర్వీసులు లేక ప్రజల ఇబ్బందులు పాఠశాల సమయానికి చేరుకోలేకపోతున్న విద్యార్థులు -
పచ్చిమిర్చి కిలో రూ.100
కొడంగల్: మార్కెట్లో పచ్చి మిర్చి ధర కిలో రూ.వంద దాటింది. నిత్యావసరమైన మిరపకాయల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనలేకపోతున్నారు. మిర్చితో పాటు పెరిగిన కూరగాయల ధరలు సాధారణ కుటుంబాల్లో దడ పుట్టిస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు తగ్గి, ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో కూరలు వండలేకపోతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. కొడంగల్లో మంగళవారం పచ్చి మిరపకాయలు కిలో రూ.100, కాప్సికం రూ.80, బీర రూ.80, చిక్కుడు రూ.80, గోరు చిక్కుడు రూ.80, టమాటా రూ.50, బెండ రూ.50, ఆలుగడ్డ కిలో రూ.50 ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకుకూరల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దళారులు, వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నానే విమర్శలు ఉన్నాయి. -
బీసీ బిల్లుకు కేంద్రం అడ్డంకులు
తాండూరు: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ విషయమై త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నట్లు చెప్పారు. బీసీ బిల్లు ఆమోదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్రానికి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి భట్టి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ శివారులోని జీపీఆర్ గార్డెన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో విసిగిపోయిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించామన్నారు. 95 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకుగాను 95 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రేషన్ కార్డు కలిగిన వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తున్నామని భట్టి తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ పథకం కింద పేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు మంజూరు చేశామన్నారు. పేద విద్యార్థుల దశదిశ మారుతుంది యాలాల మండలం దౌలాపూర్ శివారులో రూ. 250 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ భవన నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 104 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. పోటీ ప్రపంచంలో నిలబడేలా ఇందులో విద్యార్థులను తీర్చిదిద్దుతామని.. తద్వారా పేద, బలహీన వర్గాల విద్యార్థుల దశ, దిశ మారుతుందన్నారు. తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ సీఎం చెన్నారెడ్డి, మాణిక్రావు, చంద్రశేఖర్రావు వంటి వారు తమదైన ముద్రవేశారని గుర్తుచేశారు.కాన్వాయ్ ఆపి.. చిరు వ్యాపారిని పలకరించి.. ధారూరు: తాండూరు పర్యటన ముగించుకొని మంగళవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి ధారూరు మండలం అనంతగిరి చివరి గుట్ట వద్ద తన కాన్వాయ్ను ఆపి మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్న మహ్మద్ చాంద్ వద్దకు వెళ్లి కంకులు కొనుగోలు చేశారు. రోజుకు ఎంత సంపాదిస్తావని అతన్ని అడగ్గా కూలీ సైతం గిట్టడం లేదని చాంద్ ఆవేదన వ్యక్తంచేశాడు. దీనిపై స్పందించిన భట్టి మీలాంటి చిరు వ్యాపారులకు త్వరలోనే ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
వికలాంగుల పింఛన్ పెంచాలి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ యాచారం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వికలాంగుల పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. యాచారం మండలం గునుగల్ గ్రామంలో సోమవారం సమితి మండల అధ్యక్షుడు మహేశ్ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్సీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పింఛన్ను రూ.4 వేలకు పెంచాలని కోరారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి, ఎంతో మంది పేదలకు న్యాయం చేశామని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి, హామీ ప్రకారం పింఛన్ డబ్బులు పెంచాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సదరం సర్టిఫికెట్లు లేక అర్హులైన వికలాంగులకు పింఛన్ మంజూరు కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు జంగయ్య, వెంకటేశ్, వై.జంగయ్య, సతీష్, సుధాకర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వికారాబాద్కు మంత్రి తుమ్మల
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట సమీపంలో మంగళశారంచేపట్టనున్న ఆయిల్ పాం ప్లాంటేషన్ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. స్పీకర్ ప్రసాద్కుమార్తో కలిసి మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. 2న కొడంగల్కు మంద కృష్ణ కొడంగల్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగస్టు 2న కొడంగల్కు రానున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్తో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర్రావు, అందె రాంబాబు, భీంరాజ్, మున్నంగి నాగరాజు, ప్రశాంత్, ఆనంద్, మల్కప్ప, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు తప్పనిసరి ఎస్పీ నారాయణరెడ్డి మర్పల్లి: మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, దుకాణాల వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక వ్యాపారులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు, దోపిడీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో సహకరిస్తాయని చెప్పారు. ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రవూఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అభయహస్తం
సంక్షేమ పథకాల అమలుపై దృష్టిసారించిన ప్రభుత్వం● ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగిరం ● చురుగ్గా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ● మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీపై సిలిండర్లు ● స్థానిక నేతల‘అభివృద్ధి పర్యటనలు’ వికారాబాద్: స్థానిక ఎన్నికలకు కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమంపై ఫో కస్ పెట్టింది. అభయహస్తం హామీలో భాగంగా ఆరు పథకాలపై దృష్టిసారించింది. ప్రధానంగా రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై ప్రత్యేక నజర్ పెట్టింది. వీటిని లబ్ధిదారులకు అందించే పనుల్లో యంత్రాంగం తలమునకలైంది. భూభారతి సమస్యల పరిష్కారంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. కలెక్టర్ ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆయా శాఖల హెచ్ఓడీలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ప్రసాద్కుమార్తో పాటు మంత్రులు శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, పొంగులేటి, కొండా సురేఖ, చీఫ్ విప్ మహేందర్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. స్థానిక పోరులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 22,503 కొత్త కార్డులు ప్రజా పాలన కార్యక్రమంతో పాటు ఆన్లైన్లో 35వేల పైచిలుకు కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టిన అధికారులు అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందించారు. ఇప్పటి వరకు 22,503 కుటుంబాలకు ప్రభుత్వం కార్డులు మంజూరు చేసింది. దీనికితోడు పాత కార్డులలో కొత్త సభ్యుల వివరాల నమోదు, తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 70,685 కొత్త సభ్యులు రేషన్ కార్డుల్లో చేరారు. జిల్లాలో మొత్తం 2,75,224 రేషన్ కార్డుల ద్వారా 9,91,562 మంది సభ్యులకు సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. 11,785 ఇందిరమ్మ ఇళ్లు.. ఇందిరమ్మ పేరుతో రూ.5 లక్షల నిధులతో ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేస్తోంది. తొలి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 11,785 గృహాలకు మంజురు పత్రాలు అందజేయగా 5,506 ఇళ్లకు హౌసింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. వీటిలో 605 బేస్మెట్ లెవెల్, 70 రూఫ్లెవల్లో ఉండగా 25 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తి చేశారు. ఆయా స్థాయిలలో 438 మంది లబ్ధిదారులకు నిధులు విడుదలయ్యాయి. 1,16,990 గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో జనరల్ కనెక్షన్లు 19,358 (డబుల్), 69,902(సింగల్), 3,209 కమర్షియ ల్, 35,193 దీపం, 38,753 ఉజ్వల్, 21,260 సీఎస్ఆర్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన 1,16,990 మందికి మహాలక్ష్మి పథకం కింద రూ.500 సిలిండర్ అందుంతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం.. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ డిపోల పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. మూడు డిపోల్లో కలిపి ఇప్పటివరకు 3.98 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకుగానూ ప్రభుత్వం రూ.142 కోట్లు ఖర్చు చేసింది. రైతుకు భరోసా... జిల్లాలోని మొత్తం 539 రెవెన్యూ గ్రామాలు, 20 మండలాల పరిధిలో 3,18,447 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున రైతు భరోసా నిధులు జమచేస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున 2,71,785 మంది రైతులకు రూ.358,17,08, 533 ఖాతాల్లో జమచేసింది. నిరంతర ప్రక్రియ ప్రభుత్వ పథకాల అ మలు నిరంతర ప్రక్రి య.అర్హులైన వారికి రే షన్ కార్డులు, ఇందిర మ్మ ఇళ్లు,గృహజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయా ణం తదితర పథకాలన్నీ అందుతాయి. దర ఖాస్తు చేసుకున్న వెంటనే క్షేత్ర స్థాయి అధికారులతో విచారణ పూర్తి చేయించి, లబ్ధిదారులకు అందేలా చూస్తున్నాం. – ప్రతీక్జైన్, కలెక్టర్ -
త్వరగా పూర్తి చేయండి
కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఆస్పత్రిలో మరమ్మతు పనుల పరిశీలన అనంతగిరి: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొనసాగుతున్న మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. వికారాబాద్లోని ఆస్పత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, వాష్రూంలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెయింటింగ్, మరమ్మతు పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ ఉమేశ్, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.