Vikarabad
-
ఇళ్ల బాధితులకు ప్లాట్ల కేటాయింపు
కొడంగల్: పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోనున్న 39 కుటుంబాలకు చెందిన 61 మందికి గురువారం ఇంటి స్థలాలు కేటాయించారు. పట్టణ శివారులోని జాతర స్థలంలో ఆలయ ధర్మకర్తలకు చెందిన భూమిలో ప్లాట్లు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వసతులు కల్పించారు. లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ఇంటి స్థలంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో ఆర్థిక సాయం అందిస్తామని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ లోపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయ నిర్మాణ భూమిపూజ కోసం కొడంగల్కు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరనో!
దోమ: పరిగి, దోమ మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఇండస్ట్రియల్ పార్క్కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూ సేకరణ నోటిఫికేషన్ వచ్చింది మొదలు బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు తరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను లాక్కుంటే రోడ్డున పడతామని దోమ మండలం బట్లచందారం, కొండాయపల్లి, అనంతరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా బట్లచందారం గ్రామంలో ఆయా గ్రామాల రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2,145 ఎకరాల సేకరణకు.. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం పరిగి, దోమ మండలాల్లో 2,145 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పరిగి మండలం కాండ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 260 ఎకరాల పట్టా భూములు, 937 ఎకరాల లావాణి పట్టా భూములు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. దోమ మండలంలోని బట్లచందారం గ్రామంలో 235 ఎకరాల పట్టా భూములు, 12 ఎకరాల లావాణి పట్టా భూములు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. కొండాయపల్లిలో 371 ఎకరాల పట్టా, 25 ఎకరాల లావాణి పట్టా, అనంతరెడ్డిపల్లిలో 209 ఎకరాల పట్టా, 96 ఎకరాల లావాణి పట్టా భూములు సేకరించేందుకు సిద్ధమైంది. దీంతో ఆయా గ్రామాల రైతులు రోడ్డెక్కారు. తరతరాలుగా భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పరిశ్రమల పేరిట పంట పొలాలను తీసుకుంటే అన్యాయం అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్, సీపీఎం మద్దతు భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్, సీపీఎం నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటీవల బట్లచందారం గ్రామంలో రైతుల దీక్షకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సీపీఎం నేతలు సైతం సోమవారం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. రైతుల భూములను లాక్కోవద్దని ప్రభుత్వానికి సూచించారు. భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు అండగా ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పరిశ్రమల పేరుతో సాగు భూములు లాక్కోవడం సరికాదు. ఉన్న ఆరు ఎకరాలు తీసుకుంటే రోడ్డున పడతాం. భూమి లేకపోతే వలస పోవడం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వం వెంటనే భూ సేకరణను నిలిపివేయాలి. లేకుంటే చావే శరణ్యం. – బైకని వెంకటయ్య, బట్లచందారం నా పేరిట ఐదెకరాల భూమి ఉంది. అందులో పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వ చర్యలతో ఉపాధి కోల్పోతాం. భూ సేకరణ నోటిఫికేషన్ను వెంటనే నిలిపివేయాలి. లేకుంటే మా పరిస్థితి దయనీయంగా మారుతుంది. – వార్ల రాంచంద్రయ్య, బట్లచందారం భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటాం. నోటిఫికేషన్ను రద్దు చేసే వరకు అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తాం. పంట పొలాల్లో ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటు సరికాదు. బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఉరుకోం. – మల్లేశం, మాజీ వైస్ ఎంపీపీ, దోమ పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న రైతులు పది రోజులుగా పోరుబాట పరిగి, దోమ మండలాల్లో 2,145 ఎకరాల సేకరణకు రంగం సిద్ధం అన్నదాతలకు అండగా ప్రతిపక్షాలు ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల భూములు లాక్కోవాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాం. భూమి కోల్పోతున్న ప్రతి రైతు కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే. – కొప్పుల మహేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి -
ఉల్లి నేలచూపులు
వికారాబాద్: నెల రోజులుగా ఉల్లి రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ధర అమాంతం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. క్వింటాలు ధర రూ.800లకు పడిపోయింది. 60 కిలోల ఉల్లి బ్యాగు రూ.450 నుంచి రూ.500 చొప్పున అమ్ముడవుతోంది. రెండు నెలల క్రితం వరకు కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలికింది. ఇప్పుడు పూర్తిగా క్షీణించింది. నాడు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి నేడు రైతుకు కన్నీరు పెట్టిస్తోంది. ఆశలు ఆవిరి ఈ సారి ఉల్లి దిగుబడి బాగుండటంతో కష్టాలు తీరుతాయని రైతులు భావించారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోవడంతో వారి ఆశలు ఆవిరాయ్యాయి. పెట్టుబడులు కూడా రావడంలేదంటూ లబోదిబో మంటున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు విక్రయించారు. చిల్లరగా కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు. కానీ ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తీసుకెళ్తే నష్టాలు తప్ప ప్రయోజనం లేదని భావించిన రైతులు ట్రాక్టర్లలో గ్రామాలు తిరుగుతూ విక్రయిస్తున్నారు. పెరిగిన సాగు జిల్లాలో ఈ సారి ఉల్లి సాగు విస్థీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మూడు వేల ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి 4,500 ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. గతంలో ఎకరాకు 80 క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ సారి 100 నుంచి 130 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. హైబ్రీడ్ రకాల సాగు చేయటంతో దిగుబడి పెరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. కంటితుడుపు చర్యలు ధరలు పెరిగిన ప్రతిసారీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది. శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు రాయితీపై విత్తనాలు ఇచ్చారు.. ప్రస్తుతం అది కూడా అమలు చేయడం లేదు. గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు. దిగుబడి బాగున్నా ధర లేక దిగాలు క్వింటాలు రూ.800 నుంచి రూ.900 లోపే.. ప్రతి సీజన్లో ఇదే పరిస్థితి నష్టాల ఊబిలో రైతన్న -
భానుడి ఉగ్రరూపం
● జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ దాటిన ఉష్ణోగ్రతలు తాండూరు: భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడి గాలులతో సతమతమవుతున్నారు. వారం రోజులుగా ఆరెంజ్ అలర్ట్లో ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం రెడ్ జోన్కు చేరాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుద్యాల్ మండలంలో 40 డిగ్రీలు, కొడంగల్ మండలంలో 39.9 డిగ్రీలు, యాలాల మండలంలో 39 డిగ్రీలు, దౌల్తాబాద్ మండలంలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో డిగ్రీ దాటితో జిల్లాలో రెడ్ అలర్ట్ జోన్ పరిధిలోకి వెళ్ల నున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి కూలీలు ఉదయం మాత్రమే పనులు చేయాలని ఎండ తీవ్రత పెరిగిన వెంటనే ఆపేయాలని సూచించారు. -
‘ఇందిరమ్మ’ పేరిట ఇసుక దందా
● అనుమతి ఓ చోట.. తరలింపు మరో చోటికి ● చోద్యం చూస్తున్న అధికారులు ఈ ఫొటోలో కనిపిస్తున్న తాండూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్. మండలంలోని కరన్కోట్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు మంజుల పేరిట ఇసుక పర్మిట్ పొందారు. బుధవారం పాత తాండూరులోని ఇసుక రీచ్ నుంచి కరన్కోట్ గ్రామానికి లోడు వెళ్లాల్సి ఉంది. కానీ చెన్గేస్పూర్ గ్రామ శివారులోని ఓ ఫాంహౌస్కు ఇసుక తరలించారు. గ్రామస్తులు ట్రాక్టర్ను అడ్డుకొని కరన్కోట్ పోలీస్స్టేషన్కు తరలించారు. తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దందా జోరుగా సాగుతోంది. అనుమతి తీసుకున్న చోటికి కాకుండా మరో చోటికి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని చెన్గేస్పూర్, కరన్కోట్, వీరారెడ్డిపల్లి, మల్కాపూర్, అంతారం, కొత్లాపూర్, బెల్కటూర్, జినుగుర్తి గ్రామాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక పర్మిషన్ తీసుకోవాలి. ఇందు కోసం రూ.428 చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన పత్రాలు చూపి ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. లబ్ధిదారులకు రెండు ట్రిప్పుల ఇసుక తోలి ఆ తర్వాత పదుల సంఖ్యలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ యజమానులు, కొందరు నాయకులు ఇసుక మాఫియాగా ఏర్పాడ్డారు. చర్యలు తీసుకుంటాం ఇందిరమ్మ ఇంటి పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులు ఇస్తున్నాం. ఒకచోటికి వెళ్లాల్సిన ఇసుకను మరో చోటికి తరలిస్తే ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేస్తాం. భారీ జరిమానా విధిస్తాం. – తారాసింగ్, తహసీల్దార్, తాండూరు -
భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
523 క్వింటాళ్ల పీడీఎస్ రైస్, 69 క్వింటాళ్ల గోధుమలు సీజ్ పహాడీషరీఫ్: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో నల్లబజార్కు తరలించేందుకు నిల్వ ఉంచిన 523 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 69 క్వింటాళ్ల గోధుమలను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గోదాంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వ ఉంచిన విషయమై విశ్వసనీయ సమాచారం అందుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారి వనజాత, రాజేంద్రనగర్ ఏఎస్వో పుల్లయ్య, ఇన్స్పెక్టర్ మహేష్ల బృందం బాలాపూర్ పోలీసులతో కలిసి బుధవారం దాడులు చేసింది. ఈ సందర్భంగా 523 క్వింటాళ్ల బియ్యం, 69 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదయింది. -
ఆక్రమణలను అడ్డుకోండి
● కబ్జాకు గురవుతున్నప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి ● అధికారులకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు తాండూరు: ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కబ్జా కోరుల చేతిలో నుంచి విడిపించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. పట్టణలోని సర్వే నంబర్ 111లో విజయ విద్యాలయానికి కేటాయించిన భూమిని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం ఆర్డీఓ అనితకు ఫిర్యాదు చేశారు. ప్రధాన రోడ్డు పక్కన ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణానికి ఆనుకుని 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అక్రమ కట్టడం వెలుస్తున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికే సదరు సర్వేనంబర్లోని 14.04 ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. మిగిలిన భూమినైనా రక్షించాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఉన్నా యథేచ్ఛగా పనులు సాగుతున్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈర్షద్, జావీద్, యోగానంద్, అనిల్అర్మి ఆర్డీఓకు వివరించారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదర్రెడ్డి, తాండూరు తహసీల్దార్ థారాసింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్రుపటేల్, సంతోష్గౌడ్, అనంత్రెడ్డి, ఏజాజ్, రాజు తదితరులు ఉన్నారు. -
వైభవంగా భద్రేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
తాండూరు: పట్టణ పరిధిలో కొలువుదీరిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త సడ్గి భద్రణ్ణ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి పల్లకీ సేవ, శోభాయాత్ర నిర్వహించారు. పురంతయ్యల విన్యాసాలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గాంధీ చౌక్, రాచన్న ఆలయం వరకు పల్లకీ సేవ సాగింది. రాచన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. మున్సిపల్ చైర్మన్ పట్లోళ్ల నీరజ దంపతులు భద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. వీరశైవ సమాజం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. తాండూరు పట్టణ సీఐ పరమేష్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితం
● మాతాశిశు మరణాల రేటు తగ్గించాలి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితమని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్షిత మాతృత్వం ద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడం సాధ్యమవుతుందన్నారు. గర్భిణులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు చొరవ తీసుకోవాలని సూచించారు. హోం డెలివరీలను తగ్గించి ఇన్స్టిట్యూషనల్ డెలివరీలను పెంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆశలు, ఏఎన్ఎం గ్రామస్థాయిలో గర్భిణులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణకుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, డీఆర్డీఏ శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్లు రవీందర్, పవిత్ర, మహిళా సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి అధికారులు పాల్గొన్నారు. వసతులు కల్పించండి వికారాబాద్ రైతు బజారులో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని రైతు బజారును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయల విక్రయానికి షెడ్లు నిర్మించాలని సూచించారు. రోడ్లు, మంచి నీటి సౌకర్యం, మూత్ర శాలలు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి బంట్వారం: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కల్టెకర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం కోట్పల్లి ఎంపీపీఎస్, అన్సాసాగర్లోని ప్రీ ప్రైమరీ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్, మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తపల్లిలో ఆయిల్ పామ్ తోటను పరిశీలించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కోట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి అంచనాలు పంపాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్రెడ్డి, ఎంఈఓ చంద్రప్ప, హౌసింగ్ డీఈ సాజిద్, హార్టికల్చర్ ఆఫీసర్ కమల తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేసే వరకు పోరాటం
తుర్కయంజాల్: న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. బుధవారం రాగన్నగూడలోని ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్లుగా కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగంలోంచి తీసివేస్తామని బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమకు న్యాయం చేసే వరకు ఎంతటి పోరాటినికై నా సిద్ధమని ప్రకటించారు. 98 ఆర్టీజన్లు ఈ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమ్మెలో పాల్గొంటున్నామని వెల్లడించారు. -
తండాల అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ● రూ.6.10 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన తాండూరు రూరల్: నియోజకవర్గ పరిధి గిరిజన తండాలకు బీటీరోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దేముల్, తాండూరు మండలంలో ట్రైబల్ ఎస్డీఎఫ్ నిధులు రూ.6.10 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ– కర్ణాటక సరిహద్దు తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పెద్దేముల్ మండలం బుద్దారం నుంచి పెద్దేముల్తండాకు, బాయిమీదితండా నుంచి షాదిపూర్నకు లింకురోడ్లు వేస్తున్నామని తెలిపారు. అలాగే తాండూరు మండలం రాంపూర్మీదితండా నుంచి రాంపూర్కిందితండా, రాంపూర్ వరకు బీటీరోడ్డు వేస్తామన్నారు. లింకురోడ్లను అభివృద్ధి చేస్తే రవా ణా సౌకర్యం మెరుగు పడుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు కందనెల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలకు రూ.7 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, పార్టీ పెద్దేముల్, తాండూరు మండలాల అధ్యక్షులు గోపాల్, జన్నె నాగప్ప, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, సర్పంచులు వెంకట్రెడ్డి, డీవై నర్సింహులు, లక్ష్మప్ప, యాద మ్మ, పురుషోత్తంరెడ్డి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రశ్నించే యువతే దేశ భవిష్యత్
తుర్కయంజాల్: ప్రశ్నించే యువతే దేశ భవిష్యత్.. యువజన సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి కమ్మగూడలోని జేబీ క్రికెట్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బీపీఎల్ టోర్నమెంట్ను బుధవారం ఆయన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, నిరుద్యోగం, విద్యా వ్యాపారీకరణ, మాదక ద్రవ్యాల వ్యాప్తి వంటి సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత పెడదోవ పట్టకుండా బాధ్యతతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి పి.శివ కుమార్ గౌడ్, నాయకులు కాటం రాజు గౌడ్, గణేశ్, అజయ్, మధూకర్, భరత్, శివ తదితరులు పాల్గొన్నారు.ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర -
తల్లీకూతురు అదృశ్యం
పహాడీషరీఫ్: తల్లీకూతురు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన రత్లావత్ లక్ష్మణ్ చిన్న భార్య రాణి(30), కుమార్తె రిషిత(10) ఈ నెల 5వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోని వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేశారు. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడతో బుధవారం లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలన్నారు. ఎత్మార్పల్లిలో తల్లీపిల్లలు మొయినాబాద్రూరల్: తల్లీపిల్లలు అదృశ్యమైన ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని ఎత్మార్పల్లి గ్రామానికి చెందిన సునుగంటి నవీన్ ఈ నెల 6వ తేదీన సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో భార్య చందన(24)కు పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వచ్చిన తర్వాత మందలించాడు. మరుసటి రోజు భర్త బయటకు వెళ్లిన తర్వాత ఆమె తన పిల్లలు చేతన్(6), నిహాల్(4)ను తీసుకుని వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకాబు చేశాడు. అనంతరం గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సాయంత్రం 5 గంటలకు మెహిదీపట్నం బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బుధవారం నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పదేళ్లయినా.. మారని జిల్లా పేరు
అనంతగిరి: జిల్లాల పునర్విభజన జరిగి పదేళ్లు అయినా.. ఇంకా వికారాబాద్లో ఉమ్మడి జిల్లా రంగారెడ్డి పేరే దర్శనమిస్తోంది. వికారాబాద్ పట్టణంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ బోర్డుపై ఇప్పటికీ వికారాబాద్కు బదులు రంగారెడ్డి జిల్లా అక్షరాలే కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని పలువురు ఆరోపించారు. అధికారులు స్పందించి, బోర్డును మార్చాలని పట్టణ వాసులు కోరుతున్నారు. దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు మోమిన్పేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు. బుధవారం మండలంలోని రాళ్లగుడుపల్లి గ్రామంలో ఎంపీ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వర్త్య మహిపాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, అంగన్వాడీ, డ్వాక్రా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా నాటి నుంచి నేటి వరకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అశిరెడ్డి, నాయకులు అరుణ్కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గో సంరక్షుడిపై దాడి మీర్పేట: గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బుధవారం ఉదయం యాచారం నుంచి బొలేరో వాహనంలో ఆరు గోవులను నగరానికి తరలిస్తున్నారు. దీని వెనుక రక్షణగా మరో కారు ప్రయాణిస్తోంది. ఇది గమనించిన గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్ (24) బైక్పై వెంబడించాడు. మీర్పేట పోలీస్స్టేషన్ పరిధి మందమల్లమ్మ వద్దకు రాగానే ప్రేమ్కుమార్ బైక్ను వాహనానికి అడ్డు పెట్టగా, వెంటనే వెనుక కారులో నుంచి కొందరు వ్యక్తులు దిగి అతడిపై దాడి చేసి పారిపోయారు. ప్రేమ్కుమార్ స్థానికుల సాయంతో ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, ఇతర నాయకులు మీర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి గో సంరక్షకుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులను అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి యాచారం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని కోలన్గూడ గ్రామానికి చెందిన ఆదర్ల రాజు(33) మంగళవారం రాత్రి చింతుల్ల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు రాజును ఎవరో తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు ఆరోపించారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియాకు తరలించారు. -
‘పట్నం’లో విజిలెన్స్ దాడులు
● ఎంపీడీఓ కార్యాలయంలో రికార్టుల తనిఖీ ● ఉదయం నుంచిసాయంత్రం వరకు సోదాలు ఇబ్రహీంపట్నం: మండల పరిషత్ కార్యాలయంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం 10నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫైళ్లు, రికార్డులను తనిఖీ చేశారు. నిధుల వినియోగం, రికార్డుల వివరాలను పరిశీలించారు. రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ శిఖాగోయల్ ఆదేశానుసారం ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇద్దరే అధికారులు.. ఉదయం 10 గంటలకు విజిలెన్స్ అధికారులు తనిఖీలకు రాగా, కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, మరో అధికారి మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఎంపీడీఓ, సూపరింటెండెంట్, మిగితా సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఓ ట్రైనింగ్కు ఎంపీడీఓ, సూపరింటెండెంట్ సెలవులో ఉన్నట్లు సమాచారం. వివరాలు గోప్యం.. ఎంపీడీఓ కార్యాలయంలోని రికార్డులను, వివిధ ఫైళ్లను సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు వివరాలను మాత్రం గోప్యంగానే ఉంచారు. తనిఖీల్లో ఏమైనా విశేషాలు ఉన్నాయా అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. సుమారు ఎనిమిది మందితో కూడిన ఈ బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
తాండూరు రూరల్: విద్యుదాఘాతంతో ఇళ్లు కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధి మల్కాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెంది న బడ్గిరి రాజు నాపరాతి గనుల్లో కార్మికుడిగా పని చేసున్నాడు. భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్రిజ్ను ఆన్ చేయగా.. మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే తాండూరు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. వారు మంటలను ఆర్పేశారు. ఇంట్లోని సామగ్రి కాలి బుడిదయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం బంట్వారం: స్నానానికి వెళ్లి చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇందోల్కు చెందిన తలారి వెంకటయ్య(50) మంగళవారం చెరువులో ఈత కొడుతూ బురదలో చిక్కుకుని నీట మునిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం నీటిలో మృతదేహం పైకి తేలింది. శవాన్ని వెలికితీసి, పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు. మందుగుండు పేలి ఆవుకు తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం: అడవి పందుల షికారుకు పెట్టిన మందుగుండు సామగ్రి పేలి మేతకెళ్లిన ఆవుకు తీవ్రగాయాలైన సంఘటన శేరిగూడలో చోటుచేసుకుంది. శ్రీనివాస్రెడ్డి అనే రైతుకు నాలుగు ఆవులున్నాయి. సమీప అటవీ ప్రదేశంలో మేత కెళ్లిన ఆవుల్లో ఒకటి మందుగుండు సామగ్రిని నోటపట్టుకోవడంతో పేలి నోటికి మెడకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సుమారు రూ.60 వేల విలువచేసే ఆవు ప్రాణాపాయస్థితిలో ఉండటంలో మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్ చారిటబుల్ సొసైటీకి ఆ రైతు అప్పగించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్, ఫారెస్టు ఽఅధికారులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్: నకిలీపాస్పోర్టు, నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్ కేసులో చార్జిషీట్ సమర్పించేందుకు ఆర్జీఐఏ పోలీసు ఔట్పోస్టు సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి విదితమే. బుధవారం వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. వీరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ కనకయ్య ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.33.97 లక్షల నగదుతో పాటు కొన్ని ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
లేబర్ల సమస్యల పరిష్కారానికి కృషి
లేబర్ డిపార్ట్మెంట్ శంషాబాద్ డివిజన్ ఏఎల్ఓ వాల్యానాయక్ మొయినాబాద్రూరల్: కార్మికులకు సంక్షేమ పథకాలు అందేందుకు కృషి చేస్తానని లేబర్ డిపార్ట్మెంట్ శంషాబాద్ డివిజన్ ఏఎల్ఓ బి.వాల్యానాయక్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ లేబర్సెల్ ప్రధాన కార్యదర్శి తోల్కట్ట శివశంకర్గౌడ్, లేబర్ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి 1996లో చట్టం పరిధిలోని లబ్ధిదారులకు సంక్షేమ మండలి నుంచి లబ్ధి చేకూరేలా చూడాలని కోరారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైక్యల్యం కలిగిన వారికి రూ.4లక్షలు ఆర్థికసాయం అందేలా చూడాలని కోరారు. అనంతరం ఏఎల్ఓ బి.వాల్యానాయక్ మాట్లాడుతూ.. కార్మికులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనను కలిసిన వారిలో లేబర్ సెల్ షాబాద్ అధ్యక్షుడు ముక్కు రవికుమార్ ఉన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు మోమిన్పేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు. బుధవారం మండలంలోని రాళ్లగుడుపల్లి గ్రామంలో ఎంపీ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వర్త్య మహిపాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, అంగన్వాడీ, డ్వాక్రా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా నాటి నుంచి నేటి వరకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అశిరెడ్డి, నాయకులు అరుణ్కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి: యునైటేడ్ నేషన్స్ ఆర్గనైజేన్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో శంకర్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. నగరంలోని హయత్నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ‘మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి నందిని ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయికి వెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని సమాయత్తం చేసిన ఉపాధ్యాయురాలు వర సింధూరను ప్రత్యేకంగా అభినందించారు. కోఆర్డినేటర్ శ్రీనివాసులు షాద్నగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ ప్రత్యేక ప్రోగ్రాంను రూపొందించినట్లు వర్సిటీ కోఆర్డినేటర్ పాలాది శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ రూపొందించిన ఈ ప్రోగ్రాంకు సంబంధించి వాల్పోస్టర్లను బుధవారం షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటుగా, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో వివిధ ప్రోగ్రాంలను రూపొందించారని తెలిపారు. పరిశ్రమ ఆధారిత అప్రెంటిషిప్, రిటైల్ రంగ ప్రాక్టికల్ నైపుణ్యాలు, ప్రత్యక్ష వర్క్ప్లేస్ లెర్నింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటిలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.12,500–రూ.24 వేల స్టైఫండ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 18005 990101 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
శిలాఫలకం పంచాయితీ
● అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం ● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జోక్యంతో సద్దుమణిగిన వివాదం తాండూరు రూరల్: మండల కేంద్రమైన పెద్దేముల్లో బుధవారం శిలాఫలకం పంచాయితీ నెలకొంది. సర్పంచ్ పేరు శిలాఫలకంపై లేకపోవడం గొడవకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం బుద్దారం గ్రామ శివారు నుంచి పెద్దేముల్ తండా కెనాల్ వరకు ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైంది. బుధవారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చేతుల మీదగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పెద్దేముల్ తండా వద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. అందులో సర్పంచ్ డీవై చిన్న నర్సింలు పేరు లేకపోవడంతో ఆయన సంబంధిత అధికారుల తీరుపై మండిపడ్డారు. పెద్దేముల్ తండా పెద్దేముల్ జీపీ పరిధిలోకి వస్తోందని.. తన పేరు శిలాఫలకంలో ఎందుకు రాయలేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకుంటానని హెచ్చరించారు. దీంతో అధికారులు మరో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అందులో సర్పంచ్ పేరు ఉండేలా చూసుకున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్న నర్సింలు అధికారులు తనను అవమానించారని గొడవకు దిగాడు. ఎమ్మెల్యే కల్పించుకొని సర్పంచ్ను సముదాయించారు. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. -
ఈత రాక.. బావిలో మునిగి
● బాలుడి గల్లంతు ● సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు దౌల్తాబాద్: ఈత కోసం వెళ్లిన బాలుడు బావిలో మునిగి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండల పరిధి చంద్రకల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తగుట్టుతండాకు చెందిన రమేష్, లక్ష్మిబాయి దంపతుల కుమారుడు ఈశ్వర్(13), దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలోని మెథడిస్టు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం పుణె వెళ్లారు. చంద్రకల్ గ్రామం పక్కనే సందపూర్తండాకు చెందిన బాలుడి పెదనాన్న ఇక్కడ చదివిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం పాఠశాలకు ఒంటిపూట కావడంతో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి పాఠశాల పక్కనే ఉన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈశ్వర్ ఓ ప్లాస్టిక్ డబ్బా కట్టుకొని బావిలోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండి మునిగిపోయాడు. భయపడిన మిగతా ముగ్గురు విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. వారు వచ్చి చూసే వరకు బాలుడు ఆచూకీ తెలియలేదు. సహాయక ముమ్మరం విషయం తెలుసుకున్న కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ వేణుకుమార్ సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ట్రాక్టర్ల ఇంజన్ల ద్వారా నీటిని బయటకు తోడటానికి ప్రయత్నించారు. రెస్క్యూటీంను రప్పించారు. రాత్రి 8గంటల వరకు బాలుడి అచూకీ లభ్యం కాలేదు. గజ ఈతగాళ్లను రప్పించే యత్నం చేస్తున్నారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా నాయకుడు మొగులప్ప డిమాండ్ చేశారు. మధ్యాహ్నం బాలుడు బావిలో మునిగిపోతే.. ఘటనా స్థలంలో పాఠశాల యాజమాన్యం లేకపోవాడన్ని తప్పుపట్టారు. బాలుడి స్వగ్రామం మహబూబ్నగర్ నినియోజకవర్గం కావడంతో అక్కడి ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్రెడ్డి ప్రమాదం గురించి ఆరా తీశారు. కలెక్టరు, స్థానిక తహసీల్దారుతో మాట్లాడారు. సహాయ చర్యలు ముమ్మరం చేసి, బాలున్ని వెలికితీయాలని కోరారు. -
చున్నీతో గొంతు నులిమి.. ఆపై పెట్రోల్ పోసి..
పరిగి: బంగారు నగల కోసం ఒంటరి వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. బుధవారం పరిగి సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కొత్తబావి వెంటకమ్మ(63) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె మెడలో సుమారు మూడు తులాల బంగారు గొలుసు ఉండటంతో గ్రామానికి చెందిన చీపిరి మంజుల, ఆమె భర్త బీరప్ప కన్ను పడింది. ఎలాగైన ఆమెను అంతం చేసి బంగారం కాజేయాలని పథకం పన్నారు. ఈ నెల 5న వెంకటమ్మ కుల్కచర్లలోని బ్యాంకుకు వెళ్లింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మంజుల, బీరప్ప దంపతులు వారి బంధువు అరుణ్కుమార్ వృద్ధురాలిని కలిసి మద్యం తాపించారు. ఆ తర్వాత తిర్మలాపూర్ అటవీ ప్రాంతంలోని పాడావులబండ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. వెంకటమ్మ మెడలోని బంగారు గొలుసు, వెండి నగలు, సెల్ఫోన్ తీసుకున్నారు. మృతదేహాన్ని రాళ్ల మధ్య వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మహబూబ్నగర్ జిల్లా పగిడాల గ్రామంలో ఉంటున్న లక్ష్మి తన తల్లి వెంటకమ్మకు ఫోన్ చేయగా లైన్ కలవలేదు. దీంతో ఆమె బండవెల్కిచర్ల గ్రామానికి వచ్చి తల్లి కోసం వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటకమ్మ సెల్ ఫోన్ నెట్వర్క్ ఆధారంగా విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మంజులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. ముగ్గురు కలిసి వెంటకమ్మను హత్య చేసినట్లు తేలడంతో బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై రమేష్ తెలిపారు. నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య కుల్కచర్ల మండలంలో ఘటన కేసు వివరాలు వెల్లడించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ -
క్రీడాపోటీలతో ప్రతిభ వెలుగులోకి
తుర్కయంజాల్: యువత క్రీడలపై ఆసక్తి చూపడం అభినందనీయమని.. క్రీడాపోటీలతో యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి మన్నెగూడలోని శివాజీ గ్రౌండ్స్లో టీం ఏఎన్ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖేలో ఇండియా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడలను నిర్వహిస్తున్న తుర్కయంజాల్ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహ రెడ్డిని అభినందించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ -
సెల్ టవర్ ఎక్కిన వ్యక్తికి ఏడు రోజుల జైలు
మోమిన్పేట: సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించారు. మంగళవారం ఎస్ఐ భరత్ భూషన్ తెలిపిన ప్రకారం.. మర్పల్లి మండలం సరిపురం గ్రామానికి చెందిన మధూకర్రెడ్డి తన స్నేహితులతో కలిసి మార్చి 28వ తేదీన మోమిన్పేటలోని ఏఎన్ఆర్ దాబాలో మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆయన స్నేహితులతో గొడవపడ్డాడు. అనంతరం ఇద్దరు న్యాయం చేయాలంటూ ఠాణాకు వచ్చారు. ఈ క్రమంలో మధూకర్రెడ్డి సమీపంలోని సెల్ టవర్ ఎక్కి మద్యం సేవిస్తూ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో కేసు నమోదు చేసి మంగళవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. కేసు పరిశీలించిన స్పెషల్ జ్యుడీషియల్ రెండవ తరగతి న్యాయమూర్తి మాయ బ్రహ్మనర్సింహ ఏడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అరెస్ట్టులు బీఆర్ఎస్కు కొత్తకాదు
అనంతగిరి: పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శిచేందుకు మాజీ మత్రులు హరీశ్రావు, సబితారెడ్డి రానున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఎక్కడి వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి పరిగి పర్యటనకు బయలు దేరడంతో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకుని శంషాబాద్ ఠాణాకు తరలించారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, కౌన్సిలర్ పాండు, నాయకులు షఫీ, తదితరులను పోలీసులను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. అరెస్ట్లు, కేసులు బీఆర్ఎస్కు కొత్తకాదన్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేసేది పోయి వారి భూములను లాక్కోవడం సరికాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ -
ఉర్సు ఉత్సవాలు ఐక్యతకు చిహ్నం
ఎమ్మెల్సీ రహమత్బేగ్ పరిగి: మున్సిపల్ పరిధిలోని సుల్తాన్నగర్లో వారం రోజులుగా జరుగుతున్న ఉర్సు ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఎమ్మెల్సీ రహమత్బేగ్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతకు ఉర్సు ఉత్సవాలు చిహ్నం అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు పాల్గొన్నారు. కుల్కచర్ల: అదృశ్యమైన వృద్ధురాలు అస్తిపంజరమై దొరికింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని బండవెల్కిచర్లకు చెందిన వెంకటమ్మ(63) శనివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె కూతురు లక్ష్మి తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం కుల్కచర్ల పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కాల్ లిస్ట్ ఆధారంగా పక్కింటి మహిళ మంజులను విచారించగా తన భర్త భీమయ్యతో పాటు బంధువుల వ్యక్తి బీరయ్యతో కలిసి చంపినట్లు తేలింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసం ఆమెను బైక్పై ఎక్కించుకుని తిర్మలాపూర్ గ్రామ సమీపంలోని పాండవుల బండపైకి తీసుకెళ్లి గొంతునులిమి చంపారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఎస్ఐ రమేశ్ తెలిపారు. బంట్వారం: చెరువులో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన మంగళవారం కోట్పల్లి మండలం ఇందోల్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శైలజ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి వెంకటయ్య (50) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో బురదలో చిక్కుకుని నీట మునిగాడు. స్థానికులు గమనించి విషయాన్ని కుటంబీకులకు సమాచారం అందించారు. చెరువులో గల్లంతైన వ్యక్తి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కేశంపేట: ఫోన్ పే నుంచి డబ్బులు ఎక్కడి పంపించావు అని తల్లి అడిగితే కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మండలంలోని మంగళిగూడ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏశమోని అంజయ్యయాదమ్మ దంపతులకు కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. గత నెల 26వ తేదీన ఆరోగ్యం బాలేదని దవాఖానాకు వెళ్లడాలని శ్రీకాంత్ను రూ.4వేలు ఇవ్వమని తండ్రి అడిగారు. ఫోన్ పే నుంచి డబ్బులు వెళ్లడం లేదని కొడుకు చెప్పారు. అదే సమయంలో డబ్బులు ఇవ్వకుండా ఫోన్ పే నుంచి రూ.వెయ్యి ఎవరికి పంపించావని తల్లి కొడుకును ప్రశ్నించింది. ఆ రోజు శ్రీకాంత్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బైక్పై వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని, అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
చర్చి నిర్మాణాన్ని అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోండి
యాలాల: మండల కేంద్రంలో చర్చి నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, పాస్టర్ కృపాకర్ పాల్ మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా కొన్ని దళిత కుటుంబాలు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి ప్రార్థనలు చేసుకుంటున్నారు. వారు ప్రార్థనలు చేసుకుంటున్న చర్చి శిథిలావస్థలోకి చేరడంతో ఇటీవల పునఃనిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి గతంలో పంచాయతీ నుంచి ఎన్ఓసీ తీసుకున్నామని గుర్తు చేశారు. కాగా కొందరూ కావాలనే చర్చి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి చర్చి నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని మానవ హక్కుల కమిషన్ను కోరామన్నారు. చర్చి నిర్మాణ పనులను అడ్డుకుంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మలిగేరి నర్సింలు, నర్సమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, చంద్రప్ప, పాపమ్మ, మహేశ్, శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు. మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు -
భూ సేకరణ ఉపసంహరించుకోవాలి
ధారూరు: పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం 2,100 ఎకరాల భూ సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేడియల్ రోడ్డు ఏర్పాటుకు రైతులు స్వచ్ఛందంగా సహకరించారని గుర్తు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరిట భూములు లాక్కునేందుకు యత్నించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను నిర్బధించడం సరికాదని మండిపడ్డారు. సోమవారం రాత్రి కాళాపూర్ గ్రామస్తులను నిర్భందించి వదిలిపెట్టారని విమర్శించారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేరిట భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సీఎం, అతని అనుచరులు భూదందా చేస్తున్నరని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ నిలిపివేయకుంటే రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. అనతరం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. భూ సేకరణ పేరుతో భూములు కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు సంపాదించి బీజేపీలో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో మోమిన్పేట్ మండలం ఎన్కతలలో 1,100 ఎకరాల భూమి సేకరిచింది ఉన్నదని, అక్కడే కంపెనీలు ఏర్పాటు చేయకుండా భూ సేకరణ ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు వేణుగోపాల్రెడ్డి, సుధాకర్గౌడ్, హఫీజ్, పోటరీ మహేశ్, చిన్నయ్యగౌడ్, జైపాల్రెడ్డి, రహమతుల్లాఖాన్, బాల్రాజ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి కోసం వెళ్తే అరెస్ట్
పరిగి: మండల పరిధిలోని కాళ్లాపూర్, రాపోల్ భూ బాధితులు ఇరవై రోజులుగా రిలే దీక్షలు చేపట్టారు. వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్రావు పర్యటించించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకు పోలీస్ పర్మిషన్ కోసం సర్పంచ్ పుల్లయ్య పలువురు భూబాధితులు సోమవారం రాత్రి ఠాణాకు వెళ్లారు. వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అర్ధరాత్రి గ్రామస్తులు, భూబాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్స్టేషన్కు వెళ్లారు. దీంతో పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనుమతి కోసం వచ్చిన వారిని పోలీస్ స్టేషన్ నిర్బందించడం ఎంత వరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రైతులు గేట్లు తెరవాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారికి మద్దతు తెలపడంతో ఆందోళన ముదిరింది. అనుమతి తమ పరిధిలో లేదని ఉన్నతాధికారులతో మాట్లాడాలని పోలీసులు నిరాకరించారు. రైతులను ఎలా నిర్బందిస్తారని రైతులు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాళ్లాపూర్ సర్పంచ్ పులిందర్ తన పిల్లలతో కలిసి స్టేషన్లో నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట కాళ్లాపూర్ గ్రామస్తులు రైతులను వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా పోలీసులు వదిలిపెట్టలేదు. దీంతో చేసేది ఏమి లేక రైతులు వెనుదిరిగారు. హరీశ్రావు పర్యటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. మహేశ్రెడ్డికి మద్థతు తెలిపేందుకు.. ధారూరు: బీఆర్ఎస్ నేత, పరిగి మాజీ ఎంఎల్ఏ మహేశ్రెడ్డికి మద్ధతుగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం మహేశ్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ధారూరు ఠాణాకు తీసుకువచ్చారు. విషయం తెలసుకున్న బీఆర్ఎస్ మండల నాయకులు వేణుగోపాల్రెడ్డి, హఫీజ్, రహమతుల్లాఖాన్, జైపాల్రెడ్డి, రవినాయక్, బాల్రాజ్నాయక్, వెంకట్రాంరెడ్డి, లక్ష్మయ్య తదితరులు పీఎస్కు చేరుకున్నారు. సీఐ రఘురామ్, ఎస్ఐ రాఘవేందర్ మాజీ ఎంఎల్ఏ మహేశ్వర్రెడ్డిని అక్కడి నుంచి వెంటనే బంట్వారం పీఎస్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులను అక్కడే నిర్భందించి సాయంత్రం సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. కాళ్లాపూర్ సర్పంచ్ కుటుంబాన్ని నిర్బంధించిన పోలీసులు అర్ధరాత్రి పీఎస్ ఎదుట ఉద్రిక్తత -
ముగిసిన మట్టి పరీక్షల శిక్షణ
దుద్యాల్: ఇక్రిసాట్లో కొడంగల్ నియోజకవర్గంలోని పలువురు రైతులకు ఇస్తున్న మట్టి పరీక్షల శిక్షణ మంగళవారంతో ముగిసింది. రెండు రోజుల పాటు మట్టి నమూనాలు సేకరించు విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఎండబెట్టు విధానం, ల్యాబ్లో పరీక్షలు తదితర అంశాలను వివరించారు. శిక్షణ కార్యక్రమానికి కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, వికారాబాద్ డీఏఓ రాజారత్నం, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ నాగరాజు రైతులు రవి నాయక్, కరుణాకర్, శివ కుమార్, శ్రీనివాస్, నరేశ్, జగదీశ్, మొగులయ్య, శ్రీకాంత్, గోపాల్తో పాటు నియోజకర్గంలోని దుద్యాల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు చెందిన 120 మంది రైతులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై చర్యలేవి?
దోమ: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఓ పంచాయతీ కార్యదర్శిని అధికారులు వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండల పరిధిలోని రాకొండ సెక్రటరీ రవి గ్రామ సర్పంచ్కు తెలియకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,15,025, ఈజీఎస్ నిధులు రూ.1,20,000 వేలు పక్కదారి పట్టించారు. ఈవిషయమై అన్ని ఆధారాలతో సర్పంచ్ మశ్చేందర్రెడ్డి ఎంపీడీఓ గ్యామకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినా, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సర్పంచ్ గత నెల 25న డీపీఓను కలిసి ఫిర్యాదు చేసినా, అధికారుల్లో చలనం లేదు. ఇదిలా ఉండగా సదరు కార్యదర్శి ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలున్నాయి. తమ నాన్న పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై మ్యుటేషన్ చేసేందుకు రూ.8 వేలు తీసుకున్న సెక్రటరీ నాలుగు నెలలుగా పని చేయడంలేదని గ్రామస్తుడు బండి అశోక్ తెలిపారు. అధికారిక వెబ్సైట్లో తప్పుడు సమాచారం.. కార్యదర్శి రవి మంగళవారం విధులకు డుమ్మా కొట్టాడు. అటు గ్రామ పంచాయతీకి రాకపోవడమే కాకుండా మండల కార్యాలయంలో సమావేశంలో ఉన్నట్లు అధికారిక వెబ్సైట్లో ఫొటో అప్లోడ్ చేశారు. కానీ అక్కడ ఎలాంటి మీటింగ్ నిర్వహించలేదు. ఈ విషయమై ఎంపీడీఓను వివరణ కోరగా సెక్రటరీ పనితీరుపై ఇప్పటికే నివేదిక పంపించామని, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు. రోజులు గడుస్తున్నా స్పందించని అధికారులు విస్తుపోతున్న సర్పంచ్, గ్రామస్తులు -
పేదలను ఇబ్బందిపెడితే చర్యలు
కొడంగల్: సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన 312 మంది లబ్ధిదారులకు రూ.1.61 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలువురు నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇక మీదట ఎవరైనా పేదలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, దౌల్తాబాద్ తహసీల్దార్ గాయత్రి, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ దౌల్తాబాద్: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం కడా అధికారి వెంకట్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి పంపిణీ చేశారు. 82 మంది లబ్ధిదారులు కల్యాణలక్ష్మి, 62 మంది బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాయత్రి, మండల నాయకులు వెంకట్రావు, వెంకట్రెడ్డి, వీరన్న, రాజశేఖర్రెడ్డి, దస్తప్ప తదితరులున్నారు.కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి -
సత్వరం పూర్తి చేయండి
తాండూరు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో పనులు ముందుకు సాగకపోవడంపై అసహనం వ్యక్తం చే శారు. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నిబంధనల మేరకు పనులు చేయని వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి -
ధాన్యం సేకరణ సజావుగా సాగాలి
అనంతగిరి: వరి ధాన్యం సేకరణ సజావుగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యాసంగి సీజన్ 2025 – 26కు సంబంధించి ధాన్యం సేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. సన్న రకం వడ్లకు రూ.500ల బోనస్ వస్తుందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చి.. తేమ 17 శాతం కంటే తక్కువ ఉంటే సేకరించాలన్నారు. సరిపడా టార్పాలిన్లు, తూకం, తేమ, తూర్పార యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, డీసీఎస్ఓ సుదర్శన్, నాగార్జున, డీఏఓ రాజరత్నం, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ శ్యామ్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ రియాజ్, అదనపు డీఆర్ఓ నర్సింలు, డీపీఎం కొమురయ్య, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వేగవంతంగా చేయాలి జెడ్పీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. మంగళవారం వికారాబాద్లో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలి కలెక్టర్ దీపక్ తివారి -
అందుబాటులో పశుగ్రాస విత్తనాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని పశు వైద్యశాలలో గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పశు సంవర్ధక శాఖ ఏడీ నోవా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకూ 5కిలోల చొప్పున పశుగ్రాస విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. 75శాతం సబ్సిడీతో 5 కిలోల బ్యాగుకు రూ.128.75 చెల్లించి తీసుకెళ్లాలని సూచించారు. గడ్డి విత్తనాలు కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. కొడంగల్ పశువైద్యశాలలో 300 కేజీల గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాండూరు: పట్టణంలో నాన్వెజ్ వ్యర్థాల సేకరణకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. చికెన్, మటన్, ఫిష్ లాంటి వ్యర్థాల సేకరించి తరలించేందుకు, స్లాటర్ హౌస్ నిర్వహణకు మున్సిపల్ చైర్మన్ పట్లోళ్ల నీరజ ఆధ్వర్యంలో వేలం జరిగింది. పట్టణానికి చెందిన అబ్దుల్ హమీద్ రూ.20 లక్షలకు వేలం దక్కించుకున్నారు. స్లాటర్ హౌస్ను మజిద్ ఖురేషి రూ.64 వేలకు సొంతం చేసుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. వేలం దక్కించుకున్న వారు గడువులోగా డబ్బు చెల్లించాలన్నారు. లేకుంటే వేలం హక్కులను రద్దు చేస్తామని చెప్పారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జీఎస్టీ సంస్కరణల జాతీయ సెమినార్ మంగళవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా ఐసీఎస్ఎస్ఆర్ డైరక్టర్ బి.సుధాకర్రెడ్డి హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త ఆలోచనలు, సంస్కరణలకు దోహదం చేస్తాయన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పీవీ గీతాలక్ష్మి పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ సదస్సుతో జీఎస్టీ, ఎంఎస్ఎంఈపై లోతైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వికసిత్ భారత్ 2047 దిశగా ముఖ్యమైన ముందడుగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా మొత్తం 74 పరిశోధన పత్రాలు ఆమొదం పొందాయి. కార్యక్రమంలో పీఎస్పీకే అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ బీపీ భరద్వాజ్, శివకుమార్రెడ్డి , తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.డాక్టర్.కప్ప కొండల్, సుధీర్, మునిస్వామి, ఆడెప్ప, కరీముల్లా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి బంట్వారం: సీఎం రేవంత్రెడ్డి భూ దోపిడీ ఆగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. పరిగి పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ముందస్తు అరెస్టు చేసి బంట్వారం ఠాణాకు తీసుకొచ్చి సాయంత్రం ఐదు గంటలకు వదలి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తోందని, ఇది సరికాదని హితవు పలికారు. రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలకులు దోచుకోవడం దాచుకోవడం తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులతో తమ ఉద్యమం ఆగదన్నారు. రైతులకు అండగా నిలబడి మరింతగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
భూసేకరణం
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇదీ నేపథ్యం వికారాబాద్: లగచర్ల తరహాలో రైతులు భూ పోరాటానికి సిద్ధమయ్యారు. పరిగి మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన పారిశ్రామికవాడకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారుతోంది. నెల రోజులుగా అధికార.. ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. భూ సేకరణ అంశం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గతంలో సీఎం సొంత నియోజకవర్గంలోని దుద్యాల్ మండలం లగచర్లలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు భూ సేకరణ విషయంలో అధికారులపై జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా పరిగి మండలం రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల పరిధిలో మరో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో భూములు కోల్పోతున్న రైతులు ఉద్యమబాట పట్టారు. నెలరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. వీరికి ప్రతిపక్షాలు మద్దతిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఉద్యమం.. ఉధృతం భూ సేకరణ నోటిఫికేషన్తో రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. తమ జీవనాధారం పోతుందని హైరానా పడుతున్నారు. సాగు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఉద్యమ బాట పట్టారు. నియోజకవర్గ కేంద్రం పరిగిలో రాస్తారోఖో, కలెక్టరేట్ ముట్టడితో తమ గళం వినిపించారు. పొలాల వద్ద టెంట్లు వేసుకొని దీక్షలు చేస్తున్నారు. వీరికి బీఆర్ఎస్ అగ్ర నాయకులు అండగా నిలుస్తున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి రైతుల పక్షాన పోరాడుతున్నారు. ఇటీవల రాపోల్, కాళ్లాపూర్ గ్రామాలను మాజీ మంత్రి సబితారెడ్డి సందర్శించి రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భూసేకరణ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సైతం బాధిత రైతులకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావు మంగళవారం ఆ గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హరీశ్రావు పర్యటన నేపథ్యంలో జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీంతో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టు హరీశ్రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పరిగి, ధారూరు తదితర పోలీస్టులకు తిప్పారు. పలువురు నాయకులు, రైతులను సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ను వికారాబాద్లో హౌస్ అరెస్టు చేశారు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని హైదరాబాద్లో హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలో మొత్తం 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళ్లాపూర్ సర్పంచ్ను సోమవారం అరెస్టు చేయడంతో ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పరిగి పోలీస్ ష్టేషన్కు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం వదిలేశారు. ఎస్పీ స్నేహమెహ్ర పరిస్థితి చేయిదాటకుండా నిరంతరం పర్యవేక్షించారు. పరిగిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న అన్నదాతలు లగచర్ల తరహాలో పోరాటానికిసిద్ధమైన రాపోల్, కాళ్లాపూర్ రైతులు ఉధృతమవుతున్న ఆందోళనలు హరీశ్రావు పర్యటన నేపథ్యంలోబీఆర్ఎస్ నేతల అరెస్ట్ పరిగి పారిశ్రామిక వాడకు అడ్డంకులునెల రోజుల క్రితం పరిగి మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,197 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 260 ఎకరాల పట్టా, 937 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాళ్లాపూర్ మండలంలో 159.25 ఎకరాల పట్టా భూమి, 428.05 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరించనున్నారు. రాపోల్ రెవెన్యూ పరిధిలో 101.08 ఎకరాల పట్టా భూములు.. 509 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంత సమీపం నుంచే ఔటర్, రీజినల్ రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్డు వెళ్లనుంది. మరో వైపు పరిగి – షాద్నగర్ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు టెండర్లు పూర్తి చేశారు. రాపోల్, కాళ్లాపూర్ శివారులో నిర్మించతలపెట్టిన పారిశ్రామిక వాడకు రోడ్డు కనెక్టివిటీ కూడా మెండుగా ఉండటంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ ఉపేక్షించదు. భూసేకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. బాధిత రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. వారి తరఫున పోరాటం చేస్తాం. పరిశ్రమల పేరిట పంట పొలాలను లాక్కుంటే చూస్తూ ఊరుకోం. – కొప్పుల మహేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి -
పల్నాడు ఎక్స్ప్రెస్ను పొడిగించాలి
తాండూరు టౌన్: జిల్లా కేంద్రం వికారాబాద్లో నిలుపుతున్న పల్నాడు ఎక్స్ప్రెస్ రైలును తాండూరు వరకు పొడిగించాలని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు కోరారు. మంగళవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పల్నాడు ఎక్స్ప్రెస్ వికారాబాద్ స్టేషన్లో కొ న్ని గంటల పాటు నిలిచి ఉంటుందని, అట్టి ట్రైన్ను తాండూరు వరకు పొడిగిస్తే వేలాది మంది ప్రజలకు అనుకూలంగా ఉంటుందని కౌన్సిలర్లు నాగా రం నర్సింలు, కిరణ్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి ఎంపీకి విన్నవించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లకు వారివారి వార్డుల అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, ఆ మాటకు కట్టుబడి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వార్డు ప్రజల తరఫున ఎంపీకి కౌన్సిలర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికై న నాగారం మల్లేశంను ఎంపీ సన్మానించారు. బీజేపీ కౌన్సిలర్లు నర్సింలు, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి ఎంపీ కొండాకు వినతిపత్రం అందజేత -
భూములు లాక్కుంటే ఊరుకోం
పరిగి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల కోసమే నయా దందాను తెరమీదకు తెచ్చారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన నేపథ్యంలో మంగళవారం కాళ్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న నరేందర్రెడ్డి పోలీసుల కంట పడకుండా అటవీ ప్రాంతం మీదుగా రైతుల దీక్షా శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలు కేటాయించారని, వాటిని తీసుకోకుండా సీఎం కొత్త దందాకు తెర తీశారని విమర్శించారు. పేదల భూములు లాక్కోవాలని చూస్తే లగచర్ల కంటే పెద్ద పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందన్నారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ అన్నదాతలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని పక్కదారి పట్టించేందుకు కుట్ర చేస్తోందన్నారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే భూ సేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనిల్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, ఆంజనేయులు, సురేందర్, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కుటుంబ సభ్యుల కోసమే భూ దందా రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
తాండూరు టౌన్: రాష్ట్రంలో కొనసాగుతున్నది సీఎం రేవంత్రెడ్డి పాలనా? లేదా రజాకార్ల పాలనా అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ప్రశ్నించారు. మంగళవారం పరిగి నియోజకవర్గంలో భూ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి విపక్ష నాయకులందరినీ జైళ్లో పెట్టి నిరంకుశత్వాన్ని ప్రదర్శించిందని, నేడు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం రజాకార్ల తరహాలో నిరంకుశ, నిర్భంధ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించిన నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు. భూ నిర్వాసిత రైతులకు మద్దతు పలికేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, వెంకట్రెడ్డి, జావీద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ -
డీసీసీ ఉపాధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
బంట్వారం: కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎం కృష్ణారెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన నగరంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన పదవికి వన్నె తెచ్చేలా పని చేస్తాన పేర్కొన్నారు. రేపు తాండూరులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, మధు సోమవా రం ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల లోపు బాలబాలికలు ఎస్సెస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు మైదానానికి రావాలన్నారు. 100, 200, 400, 800, 1500, 3వేలు, 5వేల మీటర్ల రన్నింగ్ పోటీలు, షాట్పుట్, లాంగ్ జంప్లో సెలక్షన్స్ ఉంటాయన్నారు. వివరాలకు సెల్ నంబర్ల 9951343432, 6300075229లో సంప్రదించాలన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 11న వరంగల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● నీట మునిగి బాలుడి మృతి ● చౌడాపూర్ మండలంలో ఘటన కుల్కచర్ల: ఈత కోసం వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన చౌడాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మన్కాల్వ గ్రామానికి చెందిన నవాజ్ పాషా కుమారుడు శంషీర్(9), మరి కొందరు సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావిలో కొందరు ఈత కొట్టడానికి వెళ్లారు. శంషీర్ ఈత రాకున్నా బావిలోకి దిగాడు. నీట మునిగి అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబీకుల అక్కడికి చేరుకొని బోరున విలపించారు. శంషీర్ స్థానికంగా 4వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాష్ట్రంలో బీజేపీదే అధికారం ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి తాండూరు రూరల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలం వీర్శెట్టిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో కేవలం రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జర్నప్ప, నాయకులు తూర్పు శ్రీహరి, ఎర్ర శ్రీనివాస్, పరశురాం, నర్సింలు, హరీశ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి మోమిన్పేట: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్పేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్ భూషణ్ తెలిపిన ప్రకారం.. మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామానికి చెందిన కావలి శేఖర్(38), ఆదే గ్రామానికి చెందిన సంజీవులు వద్ద గడ్డి కోసే పనికి కుదిరాడు. సోమవారం మోమిన్పేట మండల పరిధి ఏన్కతల గ్రామ శివారు ఓ వెంచర్లో గడ్డి కోసేందుకు ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో వెంచర్లోని రోడ్డుపై శేఖర్ నడుస్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ రాజశేఖర్ మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా.. మృతుడికి భార్య యాదమ్మ, కూతురు కావేరి, కుమారుడు విష్ణు ఉన్నాడు. యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక కందుకూరు: మండల పరిధిలోని గూడూరు గేట్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అలేఖ్య జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు మహారాష్ట్ర, కర్ణాటకల్లో నిర్వహించిన 35వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన ఆ విద్యార్థిని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికై ంది. జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని అభినందించారు. చికిత్స పొందుతూ జీపీ కార్మికుడి మృతి చేవెళ్ల: గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన పంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామ పంచాయతీలో ఈనెల 1వ తేదీన చాకలి మల్లయ్య(57)పై దుండగులు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మృతి చెందాడు. మృతుడిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇంకా పోలీసులకు తెలియరాలేదు. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను శిక్షించాలి కార్మికుడిపై దాడి చేసి హత్యచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా సహా య కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. కమ్మెట గ్రామ పంచాయతీలో వాటర్మెన్గా, డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న మల్లయ్యపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి మృతి
శంకర్పల్లి: ట్రాక్టర్ బోల్తా పడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన సోమవారం శంకర్పల్లిలో చోటుచేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సింగపూర్ టవర్కి చెందిన మల్లేశ్ (50) రెండేళ్లుగా మున్సిపల్ కార్యాలయంలో రోజువారి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాధిరిగానే మల్లేశ్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. శంకర్పల్లికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. మున్సిపల్ ట్రాక్టర్ తీసుకొని అతివేగం, అజాగ్రత్తగా వెళ్తుండగా.. డంపింగ్ యార్డు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. మల్లేశ్ కింద పడగా ట్రాక్టర్ ట్రాలీ వెనుక టైరు మల్లేశ్పైకి ఎక్కింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు
దుద్యాల్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని హకీంపేట్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్ల మండలం కామన్పల్లి గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు కృష్ణయ్య, మల్లయ్య, అంజిలయ్య హకీంపేట్లో కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో వారు బైక్ కింద పడింది. దీంతో ముగ్గురూ గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేయడంతోనే ప్రమాదం జరిగిందని, అధికారులు స్పందించి సీసీరోడ్డు పనులు పూర్తి చేయించాలని పలువురు కోరారు. -
జీఎస్టీపై జాతీయ సెమినార్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణలు, ఎంఎస్ఎంఈలు, వ్యవస్థాపకతపై ప్రభావం అనే అంశంపై రెండు రోజులపాటు జాతీయ స్థాయి సెమినార్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొ. బాలకృష్టారెడ్డి జీఎస్టీ భాఽరత ఆర్థిక వ్యవస్థలో, విద్యారంగంలో కలిగిస్తున్న మార్పులపై విశ్లేషణాత్మకంగా వివరించారు. పరిశోధన, ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించి.. విధాన రూపకల్పనలో విద్యావేత్తల పాత్రను గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. గీతాలక్ష్మి పట్నాయక్, మల్లయ్య, సోమన్న, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ బోర్డు ముట్టడి
గన్ఫౌండ్రీ: వేసవి సెలవులలో పోటీ పరీక్షల పేరుతో కొనసాగుతున్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) డిమాండ్ చేసింది. సోమవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ.. నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కె.పృథ్వి మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే కొన్ని కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. -
రైతుల అభిప్రాయం తెలుసుకోండి
పరిగి: భూ సేకరణ సమయంలో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం రాపోల్, కాండ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారని ఆరోపించారు. రాకంచర్ల, నంచర్ల ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను తీసుకోకుండా, పంట పొలాలను తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలని సూచించారు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే వారి పక్షాన నిలబడి ఉద్యమాలు, పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
గూడులేని పంచాయతీలు!
‘గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు.అవి అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం’అన్న మహాత్ముడి మాటలకు.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి!. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా.. పంచాయతీల్లో కనీసం సచివాలయాలు లేక బడి,గుడి ఆవరణలోకార్యకాలపాలు కొనసాగుతున్నాయి. బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు సొంత గూడు కరువైంది. పల్లెలో అభివృద్ధి సాధ్యమని భావించిన గత ప్రభుత్వం 2018, నేటి కాంగ్రెస్ సర్కార్.. 23 అనుబంధ గ్రామాలకు పంచాయతీగా హోదా కల్పించింది. జీపీలుగా గుర్తించి ఏళ్లు గడుస్తున్నా.. పాలకవర్గాలకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కొత్త భవనాలు సమకూర్చాల్సిన ప్రభుత్వాలు తాత్సారం చేయడంతో ఉన్న కొన్ని సచివాలయాలు శిథిలా వస్థకు చేరగా, చాలా జీపీలు అంగన్వాడీలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇరుకు గదుల్లో.. బషీరాబాద్ మండలంలో 39 పంచాయతీలు ఉండగా.. వీటిలో 12 జీపీలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. 27 గ్రామాల్లో పరిపాలన అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఒక్కో పంచాయతీలో సర్పంచ్తో పాటు 10 నుంచి 15మంది వార్డు సభ్యులు ఉంటారు. అలాగే కార్యదర్శి, కో ఆప్షన్, ఏఎన్ఎం, ఫీల్డ్ అసిస్టెంట్తో కలిపి 20మంది వరకు సమావేశానికి హాజరుకాగా.. ఇరుకు గదుల్లో విధులు నిర్వహించడం సర్పంచులకు తలనొప్పిగా మారింది. కొన్ని పంచాయతీల్లో గుడి, బడుల ఆవరణలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని జీపీల్లో అద్దె ఇళ్లు దిక్కయ్యాయి. ఇస్మాయిల్పూర్, జలాల్పూర్, పర్వత్పల్లి, మర్పల్లి, బాబునాయక్తండా, ఇందర్చెడ్, క్యాద్గీరా, మాసన్పల్లి, కొత్లాపూర్, వాల్యానాయక్తండా, గొట్టిగఖుర్ధు గ్రామాల్లో కొత్త భవనాలు ఉపాధిహామీ పథకం కింద మంజూరయ్యాయి. ఒకటి రెండు మినహాయిస్తే మిగతా గ్రామాల్లో నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. 27 జీపీలకు భవనాల కొరత కొత్త నిర్మాణాలకు గ్రహణం శిథిలావస్థలో పాత కార్యాలయాలు అద్దె ఇళ్లలో వసతులు కరువు గుడి, బడుల ఆవరణలో సమావేశాలు -
మెరుగైన జీవనం
● కలెక్టర్ దీపక్ తివారి ● విద్యార్థులతో అవగాహన ర్యాలీ నాణ్యమైన ఆహారంతో అనంతగిరి: నాణ్యమైన ఆహారం తీసుకున్నప్పుడే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హెల్త్ వీక్.. ఈట్ రైట్ ష్టే హెల్తీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సంగం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందన్నారు. బయట లభించే కలుషిత, రసాయన కారక ఆహారం తీసుకోవడం ద్వారా చిన్న వయస్సులోనే క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జంక్ ఫుడ్కు స్వస్తి పలకాలన్నారు. తాజా కూరగాయలు, వేడి భోజనం, ఇంట్లో వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హోటళ్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్లలో లభించే తిను బండారాలు, భోజనాలు, అల్పాహారాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అంగన్వాడీ టీచర్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు వార్డెన్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, ఫుడ్ సేఫ్టీ అధికారి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను సోమవారం కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను కుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. కార్యక్రమములో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మినారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హలీ తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08416235291కు కాల్ చేసి నీటి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు పైనంబరులో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. గుర్తింపు పత్రాలు అందజేత ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ట్రాన్స్జెండర్లకు అధికారిక గుర్తింపు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమాజంలో సమాన హక్కులు కలిగిన వారేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 120 ఫిర్యాదులు ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 120 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్డీఓ మంగీలాల్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ
పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు కుల్కచర్ల: దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏకై క పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. సోమవారం కుల్కచర్లలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం మెచ్చిన నేత మోదీ అన్నారు. అవినీతి రహిత పాలన బీజేపీతో సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జి.వెంకటయ్య, సర్పంచ్ అంజిలయ్య, చాపలగూడెం సర్పంచ్ స్వప్న, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం చౌహాన్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అంజిలయ్య, మైపాల్, చంద్రలింగం, నాయకులు పాండురంగాచారి, కర్ణయ్య, రాజు, వెంకట్, రాంచంద్రయ్య, మహేశ్, రాములు, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
తల్లి కళ్లెదుటే చిన్నారి దుర్మరణం
కొడంగల్ రూరల్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు తల్లి చూస్తుండగానే లారీ చక్రాల కింద నలిగి చనిపోయింది. ఈ విషాద ఘటన పట్టణంలోని బస్టాండు ఎదుట సోమవారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని కార్గిల్ కాలనీకి చెందిన చాంద్పాషా, రెహనాబేగం దంపతులు. పెళ్లయి 30ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో తెలిసిన వారి నుంచి పాపను దత్తత తీసుకుని, ఆయేషా అని పేరు పెట్టి, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆయేషా (6)ను బస్టాండు సమీపంలోని ఆల్మాస్ పాఠశాలలో చేర్పించారు. ప్రతీరోజులాగే సోమవారం ఉదయం పాప చేయి పట్టుకుని తల్లి స్కూల్కు తీసుకెళ్తోంది. బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా రావులపల్లి నుంచి పరిగి వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. ఆయేషా అక్కడికక్కడే మృతి చెందగా, రెహనాబేగం స్వల్పగాయాలతో బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అంబేడ్కర్ చౌరస్తాలోని నాలుగు రహదారుల్లో అతివేగాన్ని అదుపు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్: పాత కక్షల నేపథ్యంలో తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. యషాహిన్నగర్ వాదే సాల్హె హీన్ కాలనీకి చెందిన మహ్మద్ సలీం కుమారుడు మహ్మద్ నసీర్ (22) ఎలక్ట్రీషియన్గా పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి నసీర్ స్నేహితులు మహ్మద్ దస్తగిర్, మహ్మద్ సుబాన్ద్దీన్ ఇంటికి వచ్చి దావత్ చేసుకుందామంటూ బయటికి తీసుకెళ్లారు. కాలనీ సమీపంలోని ఓపెన్ స్థలంలో అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో నసీర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని కాలనీకి చెందిన యువకుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించి నసీర్ మెడ, ఛాతి భాగాల్లో కత్తిపోట్లతో పాటు తలపై సిమెంట్ ఇటుకతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్ టీంను రప్పించి శాంపిళ్లు సేకరించారు. తాగిన మైకంలో పాత గొడవలను లేవనెత్తుకొని ఈ హత్యోదంతం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మహ్మద్ దస్తగిర్, మహ్మద్ సుబానుద్దీన్, మహ్మద్ ఇలియాస్, మహ్మద్ నదీం ఖాన్లే ఈ హత్యకు పాల్పడ్డారంటూ మృతుడి మేనమామ మహ్మద్ ఆరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
● నలుగురిని అదుపులోకితీసుకున్న పోలీసులు ● 300 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం అబ్దుల్లాపూర్మెట్: ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఓ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అఖిల్ అలియాస్ బబ్లూతో పాటు మహ్మద్ అమీర్ పాషా ఇద్దరు కలిసి ఆదేరామ్దాస్, మీర్ పుర్కాన్అలీఖాన్, జశ్వంత్రాయ్ల ద్వారా గ్రామాల్లో ఉండే ప్రజల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని రూ.10 చొప్పున కొనుగోలు చేసి మండలంలోని కవాడిపల్లి గ్రామ శివారులోని ఓ గోదాంలో నిల్వ చేసి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గోదాంపై పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేసి అఖిల్ మినహా మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 300 క్వింటాళ్ల బియ్యంతో కూడిన 510 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఓ కంటైనర్ లారీ, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించారు. కాగా ఛత్తీస్గఢ్లో ఈ బియ్యాన్ని కిలోకు రూ.18 నుంచి రూ.20 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. -
క్రమశిక్షణ అత్యంత కీలకం
ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శారీరక ధృఢత్వం, మానసిక వికాసం, క్రమశిక్షణ అత్యంత కీలకమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ పోలీసులకు వార్షిక మొబైలైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది అత్యవసర సమయాల్లో బందోబస్తు విధులో, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తారని, వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానం పోలీసులు ప్రశాంత వాతావరణంలో పనిచేయాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని మహావీర్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ఒత్తిడి మేనేజ్మెంట్, మానసిక బలం, మానసిక స్థైర్యం అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ రక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులు నిర్వహించే పోలీసులు మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేవలం శారీరక ధృడత్వం మాత్రమే సరిపోదని, మానసిక స్థైర్యం కూడా ఎంతో కీలకమన్నారు. విధి నిర్వహణలో వచ్చే ఒత్తిడిని అధిగమించి వృత్తిపరమైన బాధ్యతలకు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలనే విషయాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ నిపుణులు అశిష్ చౌహాన్, నిదా ఫాతిమా హజరి, ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, నర్సింగ్ యాదయ్య, వీరేష్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన టీఎస్ఎస్ఓ నేత
ఆమనగల్లు: టీఎస్ఎస్ఓ రాష్ట్ర మీడియా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మీసాల వర్షిత్ ఆ సంస్థకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మాజీమంత్రి హరీశ్రావు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ల సమక్షంలో వర్షిత్ బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు జీఎల్ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వర్షిత్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని చెప్పారు. -
ప్రపంచానికే ఆదర్శం
తాండూరు టౌన్: భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచానికే ఆదర్శనీయమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని సాయిపూర్ బస్తీ పరిధిలో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాల్లో ఉన్న ఐక్యత, ప్రేమానురాగాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవన్నారు. అందుకే ప్రపంచ దేశ ప్రజలు మన కుటుంబ వ్యవస్త, హిందూ ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. హిందువుల వృద్ధి రేటు ఒకటిన్నర శాతానికి పడిపోయిందని, ఇది భవిష్యత్లో ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఐష్టశ్వర్యాల్లో ముఖ్యమైన సంతాన లక్ష్మిని హిందూ మహిళలు దూరం చేసుకోరాదన్నారు. ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకోరాదన్నారు. సంతాన భాగ్యాన్ని స్వీకరించి పెద్ద కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నేటి మహిళలపై ఉందన్నారు. అన్యమతస్కులు లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను మోసం చేస్తూ, ధర్మాన్ని నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని, లవ్ జిహాద్ను అడ్డుకునే తత్వం ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. అనంతరం వివేకానంద సామాజిక సేవా సంస్థ ప్రచారకులు కృష్ణ స్వామి మాట్లాడుతూ.. హిందూ పండుగలు, పూజా విధానాలన్నింటిలో సైన్స్ దాగి ఉందన్నారు. హిందూ ధర్మం జీవన విధానాన్ని నేర్పిస్తుందన్నారు. అనంతరం వీహెచ్పీ జిల్లా కార్యదర్శి తూర్పు శ్రీలతారెడ్డి మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను మహిళ తన సంతానికి నేర్పించాలన్నారు. పాశ్యాత్య పోకడలకు పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోవాలన్నారు. వారిని సన్మార్గంలో నడిపే బాధ్యత ప్రతి మహిళపై ఉందన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన, కలరియ పట్టు విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వివేకానంద సామాజిక సేవా సంస్థ ప్రచారకులు కృష్ణ స్వామి, హిందూ సమ్మేళన ఉత్సవ సమితి సాయిపూర్ బస్తీ అధ్యక్షుడు ముదెళ్లి అశోక్, ఉపాధ్యక్షురాలు అనితా ఠాకూర్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది హిందూ పూజా విధానాలకు సైన్స్తో అనుబంధం లవ్ జిహాద్ను అరికట్టాల్సింది మనమే హిందుత్వం అంటే ఒక జీవన విధానం ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ -
వేడుకకు వెళ్లి.. అనంతలోకాలకు
చెరువులో పడి బీబీఏ విద్యార్థి మృతి శంకర్పల్లి: వారంతా చెరువుగట్టున సరదాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లారు. ఆహ్లాదభరితంగా సాగుతున్న సమయంలోనే అందులోని ఓ వ్యక్తి తటాకంలో పడి మృతి చెందడంతో అంతులేని విషాదం నెలకొంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మండలంలోని ప్రొద్దటూరులో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వెలిమల గ్రామానికి చెందిన ప్రణవ్రెడ్డి(21) శంకర్పల్లి మండలం దొంతాన్పల్లిలో ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తోటి స్నేహితుడి బర్త్డే ఉండడంతో పది మంది కలిసి సెలబ్రేట్ చేసేందుకుగాను ప్రొద్దటూరు చెరువు వద్దకు వెళ్లారు. వేడుకలు పూర్తయిన తర్వాత ఒక్కొక్కరు చెరువు వద్దకు వెళ్లి చేతులు కడుక్కుంటున్నారు. ప్రణవ్రెడ్డి సైతం వెళ్లగా చెరువు లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయాడు. ఈత రాకపోవడం, ఊపిరి అందకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు రప్పించి, మృతదేహన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఏడేళ్లుగా తిరుగుతున్నా..
కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ రెవెన్యూ సర్వే నంబర్ 44లో ఎకరం పట్టా భూమి ఉంది. 2018 వరకు నా పేరునే పట్టా ఉంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత నా భూమిని వేరే వారి పేరున నమోదు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. వేరేవాళ్లు తమ భూమి కాదని స్వయంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమి నాపేరున నమోదు కాలేదు. వేరే వారి మధ్య భూ వివాదం ఉండటం, వారు కోర్టును ఆశ్రయించడంతో సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. ఇందులో నా పట్టా భూమి కూడా ఉంది. దీన్ని తొలగించాల్సిందిగా కోరుతూ ఏడేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా. అయినా సమస్య పరి ష్కరించలేదు. ఆన్లైన్ దరఖాస్తులు, రవాణా ఖర్చులు, ఇతర చెల్లింపుల కోసం ఇప్పటికే రూ.2 లక్షలపైనే ఖర్చు చేయాల్సి వచ్చింది. – అబ్బి రామచంద్రయ్య, పాపిరెడ్డిగూడ -
ఇస్తే సరి..
లేదంటే కొర్రీ! సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితులకు క్షేత్రస్థాయిలోని పలువురు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నివేదికలు సిద్ధం చేసేందుకు చేయి చాస్తున్నారు. పట్టా భూములను అసైన్డ్గా నమోదు చేయడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహద్దు, సర్వే నంబర్లలో దొర్లిన తప్పుల సవరణ, భూస్వభావం, కేటగిరీ, యజమానుల పేర్లలో దొర్లిన తప్పులను సరి చేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఫైళ్లకు అనేక కొర్రీలు పెట్టి.. సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన వాటిని కూడా పెండింగ్లో పెట్టి బేరసారాలకు దిగుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ల వద్ద 7,480 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, 2,508 ఆర్డీఓల వద్ద ఉన్నాయి. ఇక అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వద్ద ఏకంగా 6,825 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కలెక్టర్ వద్ద 2,659 దరఖాస్తులు పెండింగ్లో ఉండటం విశేషం. ఒక్కో దశలో ఒక్కో రేటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 17 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటి వరకు మెజార్టీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’కి సగటున 60 నుంచి 100 వరకు అర్జీలు వస్తుంటాయి. అధికారులు ఆయా వినతులను క్షేత్రస్థాయికి పంపుతుంటారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజనిర్ధారణ చేసి తహసీల్దార్కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆయన తన ఆఫీసులో ఉన్న భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత నివేదికను ఆర్డీఓకు పంపుతుంటారు. ఆయన తన వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, తుది నివేదికను అదనపు కలెక్టర్/ కలెక్టర్కు పంపిస్తారు. అధికారుల తీరుతో అగ్గువకే అమ్మకం క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ఆధారంగానే కలెక్టర్లు వాటిని ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేస్తుంటారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ప్రభుత్వ పెద్దలు రంగప్రవేశం చేసి, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వాళ్లకు వారు ఆశించిన విధంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నిరాకరించిన వారి ఫైళ్లను కనీసం పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. అధికారుల తీరుతో ఎక్కడ భూమి తమకు కాకుండా పోతుందో అనే భయంతో బాధితులు కూడా మధ్యవర్తులను ఆశ్రయించి వారు అడిగినంత ముట్టజెప్పుతున్నారు. ఇలా ఆర్ఐ నుంచి అదనపు కలెక్టర్ వరకు ప్రతి దశలోనూ భారీ మొత్తం చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికే ఓ అదనపు కలెక్టర్ సహా పలువురు తహసీల్దార్లు, ఆర్ఐలు ఏసీబీకి పట్టుబడటం తెలిసిందే. ఇక ఆర్థిక స్థోమత లేని పేద రైతులు తమ భూములను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే! తహసీల్దార్ల వద్ద భారీగా పేరుకుపోయిన దరఖాస్తులు ఒక్కో అధికారి.. ఒక్కోలా వసూలు ఆర్ఐ నుంచి ఆర్డీఓల వరకు ఇదే తంతు భూ బాధితులకు చుక్కలుపెండింగ్లో ఉన్న దరఖాస్తులు డివిజన్ తహసీల్దార్లు ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్ చేవెళ్ల 1,957 491 1,373 830 ఇబ్రహీంపట్నం 1,866 820 1,979 439 కందుకూరు 1,643 644 1,799 634 రాజేంద్రనగర్ 834 123 674 358 షాద్నగర్ 1,180 430 1,000 398 -
అణగారిన వర్గాల గొంతుక బాబూజీ
అనంతగిరి: అనగారిన వర్గాల ఆశాజ్యోతి, అంటరాని వారి శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్రామ్. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్రామ్ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న స్పీకర్ ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమర యోధులు, సంఘసంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా, ఉప ప్రధానిగా సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. 1935లో అంటరానితనం పారదోలేందుకు, ప్రజలందరికి సమానత్వం కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంస్థ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్తో కలిసి సామాజిక న్యాయం కోసం పని చేసి రాజ్యాంగ ఫలాలు దేశంలోని అట్టడుగు వర్గాలకు అందడంలో ఆయన కీలక భూమిక పోషించారన్నారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాలకు అనుగుణంగా సేనలను నడిపించి బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆయన ప్రధానపాత్ర పోషించారన్నారు. హరిత విప్లవం విజయవంతం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆయన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, కులాల వారికి సమానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఫలాలు అందిస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. జ్ఞానాన్ని పెంపొందిచేందుకు వీలుగా స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఎంతో మంది మహనీయులు కృషి చేశారన్నారు. ముందుగా బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్పీకర్ ప్రసాద్ కుమార్, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. ఈ జయంత్యుత్సవాల్లో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఎస్సీడీడబ్ల్యూఓ జైపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి రామచంద్రయ్య, పుష్పా రాణి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, దళిత సంఘాల సీనియర్ నాయకులు భీమయ్య, రాజలింగం, ఆనంద్, పవన్, మైపాల్, కృష్ణ, సురేశ్, శ్రీ కాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం
అనారోగ్యంతో భార్య, గుండెపోటుతో భర్త మృతి మోమిన్పేట: మృత్యువులోనూ దంపతులు అనుంబంధం వీడలేదు. ఈ ఘటన మండల పరిధిలోని ఏన్కతల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్యాట లక్ష్మయ్య, భాగ్యమ్మ దంపతులు. భాగ్యమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందింది. సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భార్య మృతిని తట్టుకోలేక బాధపడుతున్న లక్ష్మయ్య రాత్రి 11గంటల సమయంలో గుండెపోటుతో మత్యువాత పడ్డాడు. వారికి ఒక కూతురు, కుమారుడు సంతానం. -
చలువ పందిరి.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయించింది.
పనిచేసే వారికే పదవులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ధారూరు: పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వాటంతట అవే వస్తా యని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అ న్నారు. ధారూరు, మోమి న్పేట్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ బాబా ఖాన్, సిరాజుద్దీన్ ఆదివారం స్పీకర్ ప్రసాద్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ కార్యదర్శులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి, పార్టీ పటిష్టతకు పాటుపడుతూ వచ్చామనన్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. స్పీకర్ను కలిసి వారిలో నాయకులు కల్వ కరణ్కుమార్, తిరుపతిగారి మల్లేశం, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు. -
అగ్గనూరు వాసికి ఆర్మీ లెఫ్టినెంట్ హోదా
యాలాల: మండల పరిధిలోని అగ్గనూరు గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు(పీడీ) పల్లె భరత్రెడ్డికి ఆర్మీ లెఫ్టినెంట్ హోదా లభించింది. ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలో ఎన్సీసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన నాగపూర్లో మూడు నెలల పాటు మిలటరీ శిక్షణ పొందారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న భరత్రెడ్డికి శనివారం లెఫ్టినెంట్ ర్యాంకు కార్డును బ్రిగేడియర్ నిరంజన్ జో అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బెటాలియన్ ఏఓ లెఫ్టినెంట్ కల్నల్ మంజుల్ శర్మ భరత్రెడ్డిని అభినందించారు. తనను ప్రొత్సహించిన హైదరాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ ప్రశాంత్కుమార్, ఏపీ, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ శైలానీకి భరత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్
తాండూరు రూరల్: గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన తాండూరు మండలం చంద్రవంచ గేటు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం...కరన్కోట్ గ్రామానికి చెందిన రషీద్ నాపరాతి కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రవంచ గేటు సమీపంలోని ఓ హోటల్ వద్ద రషీద్కు గుండె నొప్పి రావడంతో కింద పడిపోయాడు. అదే గ్రామానికి చెందిన శ్రీహరి గమనించి వెంటనే సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం రషీద్ను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. పూరి పీఠాధిపతి దుర్గానందస్వామి కొత్తూరు: సనాతన ధర్మం ఒక మతం మాత్రమే కాదని ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు దిక్సూచిలా దిశానిర్దేశం చేస్తుందని పూరి పీఠాధిపతి దుర్గానందస్వామి అన్నారు. మండలంలోని సిద్ధాపూర్లో ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత ఎల్లారం శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందువులందరినీ ఏకతాటి పైకి తీసుకురావడంతో పాటు సమాజ శ్రేయస్సు, వారిలో దేశభక్తి నింపడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన పూర్వీకుల నుంచి మనం ఆచరిస్తున్న సనాతన, హిందూ ధర్మాలు, ఆచారాలను భావితరాలకు అందించడం మన బాధ్యత అని వివరించారు. కులాల మధ్యన వైషమ్యాలను వీడి హిందువులందతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందూ సంఘం ప్రతినిధి పెండం శోభ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచారాలు, వారిపైన జరుగుతున్న దాడులను ఖండించారు. -
లీజ్ పూర్తి.. తైబజార్ వసూల్!
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పరిగి: పరిగి తైబజారులో అక్రమార్కులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మున్సిపల్ అధికారులే ప్రైవేటు వ్యక్తులను పెట్టి అక్రమంగా తైబజారు రుసుము వసూళు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా తైబజారును లీజ్ తీసుకున్న వ్యక్తి డబ్బు వసూలు చేయాల్సి ఉంటుంది. గత నెల ఆయన లీజ్ పూర్తవడంతో నాటి నుంచి మున్సిపల్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో తైబజార్ వసూలు చేస్తున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రతీ శుక్ర, శనివారం పట్టణ కేంద్రంలో ప్రత్యేకంగా సంత జరుగుతుంది. ప్రతి రోజు సుమారుగా రూ.20 వేల వరకు తైబజార్ వసూలవుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం ప్రభుత్వానికి రూ.3 వేలు మాత్రమే చూపుతున్నారనే అపవాదు ఉంది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితమే తైబజారు లీజు గడువు ముగిసినా ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈనెల 7న నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ను జారీ చేశారు. ● శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ● ఘనంగా బాబు జగ్జీవన్రామ్ జయంత్యుత్సవం రూ.20 వేలు వసూలైనా ప్రభుత్వానికి లెక్క చూపేది రూ.3వేలు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ -
ఐకమత్యంతోనే రాజకీయ లబ్ధి
షాబాద్: కురుమలు ఐకమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాపోల్ నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ గ్రామ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన కురుమ సంఘం మండల అధ్యక్షుడు మద్దూరు పాండుతో కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఎంపికై న కమిటీ సభ్యులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాపరంగా కురుమలకు రాజకీయ లబ్ధి రావడం లేదన్నారు. ఐకమత్యంగా ఉండి ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. సంఘం మల్లారెడ్డిగూడ గ్రామ అధ్యక్షుడిగా రంగం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు సంజీవ, రాజేందర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారులు భీమయ్య, కార్యదర్శి కుమార్, కోశాధికారి రాజేందర్, కార్యదర్శి రాఘవేందర్లను ఎనుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాణిక్యం, మాజీ ఉపసర్పంచ్ రంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు -
వైన్స్ షాప్నకు కన్నం
యాలాల: మండల కేంద్రంలోని ఓ వైన్స్లో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఎస్ఎల్వీ వైన్స్ పేరిట మద్యం దుకాణం ఉంది. శనివారం రాత్రి రోజు మాదిరిగానే వైన్స్ మూసేసిన నిర్వాహకులు ఆదివారం తెల్లవారుజామున దుకాణం తెరిచారు. షాపులోకి వెళ్లిన నిర్వాహకులకు పైకప్పు రేకుకు భారీ రంధ్రం ఉండడం చూసి చోరి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో నగదు, వస్తువులను పరిశీలించగా సుమారు రూ.5వేల నగదుతో పాటు రెండు క్వార్టర్లు, ఒక వాటర్ బాటిల్ చోరీ అయినట్లు గుర్తించారు. కాగా షాపులో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందనే ఆశతో చొరబడిన దొంగలకు రూ.10 నోట్ల కట్ట మాత్రమే లభించింది. దీంతో విసుగు చెందిన దొంగలు రూ.5వేల వరకు ఉన్న రూ.10 రూపాయల నోట్ల కట్టతో పాటు రెండు క్వార్టర్ బాటిళ్లు, ఒక వాటర్ బాటిల్ను తీసుకొని వెళ్లిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వైన్స్ షాపు నిర్వాహకులు ఈ విషయాన్ని యాలాల పోలీసులకు తెలపడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరు దొంగలు పైకప్పు రేకుకు రంద్రం వేసి లోపలికి వస్తున్నట్లు గుర్తించారు. గతేడాది జూలై 24న ఇక్కడ ఉన్న వైన్స్ షాపులో గోడకు రంద్రం వేసిన దొంగలు..రూ 40వేల నగదుతో పాటు నాలుగు ఫుల్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది. రూ.5వేల నగదు, రెండు క్వార్టర్ బాటిళ్లు అపహరణ -
69 బస్తాల రేషన్ బియ్యం సీజ్
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని కుల్కచర్ల పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు వారు పలు దుకాణాలపై దాడులు చేపట్టగా ముగ్ద రవితేజ వద్ద 31 సంచులు, అంగడి ప్రదీప్ వద్ద 38 బియ్యం బస్తాలు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత కుల్కచర్ల: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం కుస్మసముద్రం గ్రామానికి చెందిన దస్తయ్య ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని నిలిపి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని సమాధానం చెప్పాడు. దీంతో ట్రాక్టర్ను ఠాణాకు తరలించి దస్తయ్యపై కేసు నమోదుచేశారు. అదుపుతప్పి కారు బోల్తా దోమ: అడవి పంది అడ్డురావడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటన దోమ మండలం మోత్కూర్ గేట్ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంచర్ల గ్రామం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనం కుల్కచర్ల మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తోంది. అందులో డ్రైవర్తో పాటు ఓనర్ ఉన్నారు. ఈ క్రమంలో గేట్ సమీపంలోకి రాగానే వరాహం అడ్డువచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ దానిని తప్పించే యత్నంలో కారు.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులకు అండంగా ఉంటాం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి దోమ: మండల పరిధిలోని ఐనాపూర్లో జోగు చిన్న భీమయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదివారం మృతదేహాన్ని నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వృద్ధురాలు అదృశ్యం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అనంతగిరి: మున్సిపల్ పరిధి గిరిగేట్పల్లి రైల్వే గేట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. వికారాబాద్ రైల్వే పీఎస్ ఇన్చార్జి హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయి. శవం పూర్తిగా కుళ్లి పోయిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతుడికి తెలుపురంగు గడ్డం కలిగి, జుట్టు నెరసి ఉంది. ఒంటిపై తెలుపు రంగు ఫుల్ షర్ట్, నీలం కలర్ ప్యాంట్ కలిగి ఉండి.. షర్ట్ కాలర్పై ఎస్కే టైలర్స్ వికారాబాద్ అనే స్టిక్కర్ ఉంది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఎరువు కొరత.. తీరని వ్యథ
కుల్కచర్ల: రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం. వ్యవసాయ రంగాన్ని పండగ చేస్తాం అని ప్రభుత్వాలు, పాలకులు పదేపదే చెబుతున్నా.. అన్నదాతల యూరియా కష్టాలు తీరడం లేదు. డిమాండ్ను బట్టి సరిపడా ఎరువు అందుబాటులో ఉందంటూ అధికారులు పేర్కొంటున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. యూరియా పక్కదారి పట్టకుండా, కర్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ బుకింగ్ విధానం తెచ్చినా.. ఒక్క సంచి దొరకని పరిస్థితి. ఒక్క సంచి లేదాయె చౌడాపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు, వాటికి అనుబంధంగా సూమారు 40 గిరిజన ఆవాసాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువశాతం మందిది వ్యవసాయ ఆధారిత జీవనమే. గత ఏడాది యూరియా కొరత అధికంగా ఉండటంతో ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే మండలంలో రెండు ప్రభుత్వ అనుబంధ ఎరువుల దుకాణాలు ఉన్నాయి. శనివారం వరకు ఆయా షాపుల్లో ఒక్క యూరియా సంచి కూడా అందుబాటులో లేని దుస్థితి. ఆన్లైన్లో మండలంలోని దుకాణం చూపించకుండా.. కుల్కచర్ల మండలంలోని దుకాణాలను చూపించండం గమనార్హం. విధిలేక మండల పరిధి మరికల్, కల్మన్కాల్వ, చాకల్పల్లి, కొత్తపల్లి గ్రామాల రైతులు.. సూమారు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్కచర్లకు మండల కేంద్రానికి వెళ్లి ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కటి కావాలన్నా అక్కడికి వెళ్లాల్సి వస్తోందని కర్షకులు తెలిపారు. గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తుందంటున్నారు. దీంతో దూరభారంతో పాటు సమయం వృథా.. రవాణా ఖర్చు తడిసి మోపవుతోందని కర్షకులు పేర్కొంటున్నారు. రైతులకు యూరియా కష్టాలు ఆన్లైన్ విధానంతో తప్పని తిప్పలు చౌడాపూర్లో దుకాణాలు ఉన్నా.. కుల్కచర్లకు పరుగు ఇతరులకు ఇవ్వమంటున్న అక్కడి వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కర్షకులు పొరుగు వారికి ఇవ్వం మరికల్, చౌడాపూర్ ఎరువుల దుకాణంలో యూరియా లభించడం లేదు. దీంతో కుల్కచర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఒక సంచి అయినా రానుపోను రవాణా ఖర్చులే అధికమవుతున్నాయి. ఆన్లైన్ బుకింగ్ చేసినా.. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వమంటూ పొరుగు మండల వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. స్థానికంగా ఎరువు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శివకుమార్, యువరైతు, కల్మన్కాల్వ ఇండెంట్ పంపించాం చౌడాపూర్ మండలంలో రెండు ఎరువుల దుకాణాలు ఉన్నాయి. ఆ షాపుల్లో ఎరువు విక్రయించేందుకు ఇండెంట్ పంపించాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. సరిపడా యూరియా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – పరిమళ, వ్యవసాయాధికారి, చౌడపూర్ మండలం -
రెండు బైకులు చోరీ
మొయినాబాద్: ఇంటి ఎదుట పార్కుచేసిన రెండు బైకులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొయినాబాద్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మొయినాబాద్కు చెందిన మహమ్మద్ యూసుఫ్ టీఎస్ 11 ఈఎక్స్ 5870 నెంబరు గల యమహా బైక్ను ఈ నెల 1న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు. మొయినాబాద్కు చెందిన మెరుగు రమేశ్ టీఎస్ 06 ఈఎం 5046 నెంబరు గల స్ప్లెడర్ ప్లస్ బైకును ఈ నెల 1న రాత్రి తన ఇంటి ముందు పార్కుచేసి పడుకున్నాడు. గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి సమయంలో రెండు బైకులను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై బాధితులు శనివారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. యుద్ధ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయండి షాద్నగర్: సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతికోసం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం)నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విజయ్, రాఘవాచారి హాజరవుతారన్నారు. అన్నివర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యకరమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, రవీంద్రనాథ్, నర్సింలు, నర్సింలు, సత్యం, కృష్ణ, తిరుమలయ్య, ఈశ్వర్నాయక్, కృష్ణయ్య, సత్యనారాయణ, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి బలవన్మరణం శంకర్పల్లి: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రావులపల్లి కలాన్లో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రేశం బుచ్చయ్యకి ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మల్లేశం(34) పూల డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి ఎనిమిదేళ్ల క్రితం తాండూరుకి చెందిన నవనీతతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె సంతానం. ఏడాది క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నవనీత పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మల్లేశంకి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. తర్వాత కోలుకున్నప్పటికీ ఒంటరితనంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అభివృద్ధిలో అందలం మారుమూల ప్రాంతమైన గిరిజన గూడెం టేకులగడ్డతండా అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా నిలుస్తోంది.
భూ పరిశీలన చేసిన ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్దుద్యాల్: మండలంలోని హకీంపేట్లో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్ గ్రామంలో పర్యటించారు. రైతు వేదిక పక్కన ఉన్న అసైన్డ్ భూములను పరిశీలించారు. పారిశ్రామిక వాడ కోసం ఇంకా 56 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే రైతులు పరిహారం తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో అధికారులు జనరల్ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలో భూ సేకరణకు సిద్ధమయ్యారు. ఇక్కడ పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు కానున్న తరుణంలో మరి కొన్ని ప్రధాన కార్యాలయాలు రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హకీంపేట్కు ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేసింది. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేశ్, కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ ఆలయంలో చోరీ
శంకర్పల్లి: పట్టణంలోని వీర హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్నగర్ కాలనీలోని వీర హనుమాన్ ఆలయాన్ని శనివారం ఉదయం పూజారి హరిహరన్ తెరిచాడు. లోపల ఉన్న బీరువా తాళం పగిలిపోయి ఉండడంతో పాటు మిగతా సామగ్రి చిందరవందరగా పడిఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయంలోని మూడు గంటలు, ఒక శఠగోపురం, పంచలోహా దుర్గమాత విగ్రహం, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగుడు చోరీ చేస్తున్న దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్నంపై గులాబీ జెండా
చైర్మన్గా టేకుల సుదర్శన్రెడ్డి ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఆకుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి వైస్ చైర్ పర్సన్ శ్యామల (బీజేపీ)చైర్మన్ సుదర్శన్రెడ్డి (బీఆర్ఎస్)ఎట్టకేలకు వీడిన చిక్కుముడి మున్సిపల్ పీఠంకై వసం చేసుకున్న గులాబీ పార్టీ వైస్ చైర్పర్సన్ పదవిదక్కించుకున్న బీజేపీ చైర్మన్గా టేకుల సుదర్శన్రెడ్డి,వైస్ చైర్ పర్సన్గా ముత్యాల శ్యామల వాకౌట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన టిప్పర్
కరెంటు సరఫరాకు అంతరాయం తాండూరు రూరల్: ఎర్రమట్టి టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన పెద్దేముల్ మండలం రాంసింగ్ తండా వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండా సమీపంలో ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయి. క్వారీ నుంచి ఓ టిప్పర్ రోడ్డుపైకి వచ్చే క్రమంలో అతివేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వాహనం బోల్తా పడి స్తంభం విరిగి విద్యుత్ తీగలు రోడ్డుపై పడ్డాయి. దీంతో అడికిచెర్ల, పాషాపూర్, రాంసింగ్ తండా, ఊరేంటి తండా, బాయిమీదితండాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యాడు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. -
మీ కాళ్లు మొక్కుతా సారూ..
తాండూరు రూరల్: ‘సార్ మీ కాళ్లు మొక్కుతా. మా పట్టా భూమిని ఇతరుల పేరిట మార్చకండి’ అని ఓ మహిళా రైతు తహసీల్దార్ కాళ్లు పట్టుకొని వేడుకుంది. ఈ సంఘటన శనివారం పెద్దేముల్ తహసీల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బంట్వారం మండలం బోపునారం గ్రామానికి చెందిన నట్టల విమలమ్మకు.. పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 30బై అ2 బై ఆ సర్వే నంబర్లో 4 ఎకరాల 9 గుంటల పట్టా భూమి ఉంది. సోలార్ ప్లాంట్కు ఆనుకొని ఉండటంతో ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ.కోట్లలో పలుకుతోంది. ఆ భూమి విక్రయించాలని తనపై ఓ నాయకుడు ఒత్తిడి తెస్తున్నాడని మహిళా రైతు విమలమ్మ ఆరోపించారు. సదరు వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి, రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆ భూమిని ఇతరుల పేరిట మార్పించేందుకు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆమె తన కుటుంబ సభ్యులతో శనివారం తహసీల్దార్ వెంకట్ప్రసాద్ను సంప్రదించారు. తమ పేరిట ఉన్న భూమిని, వేరే వారి పేరిట ఎలా మార్పిడి చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిచర్డ్ సైమన్.. ఓ నాయకుడి వద్ద డబ్బులు తీసుకొని తమ భూమిని మార్చేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తమకు అన్యాయం చేస్తే.. ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పెద్దేముల్ ఆర్ఐ పోస్ట్ ఖాళీగా ఉందని, మరో ఆర్ఐ వచ్చిన తర్వాత విచారణ జరిపించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మా పట్టా భూమిని ఇతరుల పేరిట మార్చకండి తహసీల్ కార్యాలయంలో మహిళా రైతు ఆవేదన విచారణ చేయిస్తానన్న తహసీల్దార్ -
ఫీజుల పెంపు విరమించుకోవాలి
మొయినాబాద్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం సుజాత ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఫీజులు పెంచిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బ్యాగరి అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు, యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అధికారులను కోరుతామని హెచ్చరించారు. విద్యాధికారి పాఠశాలను సందర్శించి ఫీజులను పరిశీలించి వారికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చి పదిరోజుల్లో తల్లిదండ్రులతో కలిసి సమావేశమవుదామని చెప్పడంతో ధర్నా విరమించారు. పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా -
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దోమ: బాబు జగ్జీవన్ రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. యువత, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, చిన్న శ్రీశైలం యాదవ్, హైకోర్టు న్యాయవాది ఆనందం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: మండలంలోని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు క్రీడా పాఠశాలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ శనివారం తెలిపారు. 3వ తరగతి విద్యార్థి కోస్గి హరిప్రియ, పుట్టపహాడ్ అక్షర జిల్లాస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి క్రీడా పాఠశాలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థినులను అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సంతోష, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, దస్తయ్య అభినందించారు. ● పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి ● పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారాయుడు జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి కొడంగల్లో డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ దీపక్ తివారి -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బషీరాబాద్: తాండూరు మండలం గోనూరు నుంచి కాశీంపూర్కు ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ఈడ్గి రాంచంద్రయ్య గౌడ్కు చెందిన ట్రాక్టర్, ఎనికేపల్లికి చెందిన కుమ్మరి కిష్టప్ప ట్రాక్టర్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకొని ఠాణాకు తరలించారు. డ్రైవర్లు ఈడిగి నరేష్, కుమ్మరి రమేష్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాగునీటి సమస్య రానివ్వం బొంరాస్పేట: మండలంలోని రేగడిమైలారం ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని సర్పంచ్ చిట్టెమ్మ, ఉప సర్పంచ్ దాసరి చంద్రప్ప తెలిపారు. శనివారం గ్రామంలో బోరుకు మోటారు బిగించి నీటి సరఫరాను ప్రారంభించారు. ఇది వరకు గ్రామంలో నూతనంగా కడా నిధులతో బోరువేసి పైపులైన్ చేశారు. కార్యక్రమంలో వీఎస్ఎస్ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండప్ప, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ అంజిలయ్య, మాజీ వార్డు సభ్యుడు శేఖరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడి బలవన్మరణం శంకర్పల్లి: ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండా నర్సింలుకి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నవాడైన ప్రశాంత్ (24) నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ యువతిని పెళ్లి చేసుకుందాం అని అడిగే సరికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన అతను శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. రాత్రి 10గంటలు దాటినా ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికారు. చివరికి పొలంలోని మామిడి చెట్టుకి ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్: విధ్వంసక బ్యాటింగ్తో ‘కాటేరమ్మ కొడుకులు’గా ఐపీఎల్ అభిమానులు పిలుచుకునే సన్రైజర్స్ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ శనివారం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. నగరానికి వీరు ఎప్పుడొచ్చినా పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. -
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
యాచారం: పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. వెళ్లి చూడగా అల్మారాలో ఉన్న రూ.65 వేల నగదు, రెండున్నర తులాల బంగారం, 25 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
గడువు తీరినా.. ఆగని దందా
● కల్లు వాహనం అడ్డగించిన సర్పంచ్, సొసైటీ సభ్యులు ● చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ తాండూరు రూరల్: పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కల్లు ఎలా విక్రయిస్తారని చెన్గేస్పూర్ సర్పంచ్ ప్రవీణ్గౌడ్ ప్రశ్నించారు. గడువు ముగిసినప్పటికీ అమ్మకాలు చేపట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని కల్లు డిపోనకు సరఫరా చేసేందుకు వచ్చిన వాహనాన్ని సర్పంచ్, సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం సర్పంచ్ తదితరులు మాట్లాడారు. గ్రామంలోని కల్లు సొసైటీలో 36 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. సంఘం అనుమతితో రెండేళ్లుగా గ్రామంలో కల్లు విక్రయించేందుకు డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్ హక్కులు పొందారు. కానీ ప్రస్తుతం కాలపరిమితి తీరినప్పటికీ.. ఆయన దందా ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు పంచాయితీ ఎమ్మెల్యే మనోహార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా.. రవిగౌడ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమదందా గురించి ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సమస్యను ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
మతిమరుపుతో పట్టాలు దాటుతూ..
షాద్నగర్రూరల్: మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చిల్కమర్రి రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పోలెమోని పద్మమ్మ (66) మూడేళ్లుగా మతిమరుపుతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున చిల్కమర్రి గ్రామసమీపంలోని రైల్వేగేట్ను దాటుతుండగా అదే సమయంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పద్మమ్మను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పద్మమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. లోకో పైలెట్ సహకారంతో విషయం తెలుసుకున్న షాద్నగర్ స్టేషన్ మాస్టర్ అభిషేక్కుమార్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.రైలు ఢీకొని వృద్ధురాలి మృతి -
పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య
అనంతగిరి: తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూములిచ్చే ప్రసక్తే లేదు
పరిగి: పచ్చటి పొలాలను లాక్కోని పరిశ్రమ లు ఏర్పాటు చేయడం సరికాదని, వెంటనే భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాపోల్, కళ్లాపూర్ గ్రామాల్లో పది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏడాదికి మూడు పంటలు పండే పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. భూములను కాపాడుకునేందుకు రైతులు పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఓట్ల తో గెలిచి వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల గొంతు నొక్కేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల తరఫున కొట్లాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం 30వేల ఎకరాల భూమిని సేకరించారని, వాటి ని కేటాయించాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేలు రియల్ దందా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. త్వరలో కేటీఆర్, హరీశ్రావు వస్తారని పేర్కొన్నారు. బాధిత రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని.. రైతులు ధైర్యంగా పంటలు వేసు కోవాలని సూచించారు. ఎవరు ఆపు తారో చూద్దామన్నారు. అనంతరం రెండు గ్రామాల మహిళా రైతులు మాట్లాడారు. తాము పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా మా భూ ములు లాక్కొని రోడ్డున పడేయాలని చూస్తోందని ఆరోపించారు. తమతో చర్చించకుండా ఎలా నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించారు. ఎర్రమట్టిపై కన్ను అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతుల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఇక్కడ ఎర్రమట్టి ఉంది కాబట్టి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి ఈ భూములపై కన్ను పడిందన్నారు. ఎర్రమట్టి దందా కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్రెడ్డి, అరవింద్రావు, సురేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ధైర్యంగా సాగు చేసుకోవాలి ‘రేడియల్’తో తీవ్ర అన్యాయందోమ: రేడియల్ రోడ్డు, ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం పంట పొలాలను లాక్కోవాలని చూస్తోందని మండలంలోని బట్లచందారం రైతులు ఆరోపించారు. శుక్రవారం పరిగి మండలం రాపోల్ గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి సబితారెడ్డిని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల వెంకటనాగిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, మాజీ సర్పంచ్ రాములుతో కలిసి వినతిపత్రం అందజేశారు. మా గ్రామ పరిధిలోనే సుమారు 235 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కన్నీటిపర్యంతమయ్యారు. ఏళ్ల తరబడి పంటలు పండించుకుంటూ జీనవం సాగిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా భూములను తీసుకునేందుకు చర్యలు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగేలా చొరవ చూపా లని రైతులు సబితారెడ్డిని కోరారు. స్పందించిన ఆమె ధైర్యంగా ఉండాలని, మీ తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. -
వికారాబాద్లో భారీ వర్షం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు వాన పడింది. ప్రధాన రోడ్లు జలమయంగా మారాయి. కొద్దిరోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు చోట్ల వడగండ్ల వాన పడింది. వీధి కుక్కల దాడిలో జింక మృతి మర్పల్లి: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ఉదయం జింక వచ్చింది. దీంతో వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన జింక రోడ్డుపై కుప్పకూలింది. గమనించిన ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ నరేంద్రనాథ్ పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే జింక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తాండూరు ఎంఈఓగా హిందుప్రియ తాండూరు రూరల్: తాండూరు ఎంఈఓగా హిందుప్రియ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటయ్యగౌడ్ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సీనియారిటీ ప్రకారం పాత తాండూరు ఉర్డూ మీడియం పాఠశాల జీహెచ్ఎం హిందు ప్రియకు బాధ్యతలు అప్పగిస్తూ డీఈఓ రేణుకాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఉపాధ్యాయులు నారాయణగౌడ్, మహమ్మద్ ఖుద్దూస్, అబ్దుల్ రహ్మన్, ఒమర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావుకు ఘన స్వాగతం నేడు డయల్ యువర్ డీఎం షాద్నగర్రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్నగర్ డిపో మేనేజర్ ఉష శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని కోరారు. 99592 26287 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
10న వాణిజ్య దుకాణాల వేలం
● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మహేశ్వరం: మండలంలోని మన్సాన్పల్లి, మంఖాల్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం కాలనీలలో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాలను విక్రయించడానికి జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10న బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని మంఖాల్ ఫేజ్–2(తుక్కుగూడ దగ్గరలో) 35 దుకాణాలు వాటి విస్తీర్ణం 189 చ. అడుగుల నుంచి 231 చ.అడుగుల వరకు ఉంటుంది. ప్రతి చదరపు అడుగు రూ.2,500గా నిర్ణయించారు. మన్సాన్పల్లి ఫేజ్–1, 2(మహేశ్వరం దగ్గరలో) మొత్తం దుకాణాలు 57 వాటి విస్తీర్ణం 130 చదరపు అడుగుల నుంచి 266 చదరపు అడుగుల వరకు, ప్రతి చదరపు అడుగు రూ.2000 నుంచి 2200 వరకు ఉంటుందన్నారు. ఈఎండీ మొత్తం రూ.36 వేలు ఏదైన జాతీయ బ్యాంకు నుంచి జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) తీసీ వేలం పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు పీడీ హౌసింగ్ మేనేజర్ 9063191168, పీడీ హౌసింగ్ 8712032727, ఆర్డీఓ కార్యాలయం డీటీ 7601055677 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
వీరశైవ సమాజానికి.. సంపూర్ణ సహకారం
స్పీకర్ ప్రసాద్ కుమార్ అనంతగిరి: సమాజ సేవలో ముందుండే వీరశైవ సమాజానికి తన వంతు సహకారం ఉంటుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఎన్నేపల్లిలో కొత్తగా నిర్మించిన వీరశైవ బసవ భవనాన్ని శుక్రవారం ఆలంపల్లి కెంపిన, దుద్దిని పీఠాధిపతి డాక్టర్ చెన్న బసవప్రభు స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, విద్యా సంస్థ బాధ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకు తన వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా బసవ భవనాన్ని నిర్మించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యాసంస్థ అధ్యక్షుడు ఎన్.బస్వరాజ్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడి బోధనలు, ఇతర ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్యను ప్రాంత వాసులకు చేరువ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఈ విద్యా సంస్థ ఏర్పాటైందన్నారు. అంతకుముందు వీరశైవ ఆగమ పండితులు మఠాధిపతి సాంబశివశర్మ, బస్వరాజ్ స్వామి, విశ్వేశ్వర్, మఠం చంద్రశేఖర్, పులుమద్ది మల్లేశం, పార్వతయ్య స్వామి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బసవ భవన నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు ఆకుల మహేష్ కుమార్, విద్యాసంస్థ బాధ్యులు విజయకుమార్, వీరేశం, శుభప్రద్ పటేల్, ఆత్మలింగం, వీరన్న, సంపూర్ణ ఆనంద్, సంగప్ప, శివకుమార్, సమాజం బాధ్యులు విద్యాసాగర్, విజయకుమార్, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పి.. కారు పల్టీ
తుర్కయంజాల్: మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధి రాగన్నగూడ సాగర్ హైవేపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో కారును సైతం ఢీకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ నుంచి తుర్కయంజాల్ వైపునకు ఓ కారు వస్తుంది. మార్గమధ్యలో సబ్స్టేషన్ సమీపంలోకి వచ్చాక యూటర్న్ వద్ద వేగాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అకస్మాత్తుగా హ్యాండ్ బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టడంతో పాటు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ క్రమంలో డివైడర్ పైన ఉన్న మొక్కలు, ప్రకటన బోర్డును సైతం ధ్వంసం చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఇదిలా ఉండగా రెండు కార్లలో చిన్న పిల్లలతో కలిసి మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ట్రాఫిక్ జాం ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి పర్యటన బందోబస్తు ఉండడంతో ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో సాగర్ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు జరిపించి, వాహనాల రద్దీని క్లియర్ చేశారు. దీంతో గంట పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా బోధించాలి
పంజగుట్ట: విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా భాషా బోధన అందించాలి తప్ప బలవంతంగా పరభాషను రుద్దాలనే ప్రయత్నాన్ని చేయరాదని రౌండ్ టేబుల్ సమావేశంలోని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ లో ‘నూతన విద్యా పాలసీ– పర్యవసానాలు’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రొఫెసర్ వినాయక రెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు మాట్లాడుతూ.. గత కొంతకాలం క్రితం విద్యా కమిషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కేవలం నివేదిక మాత్రమే అని, దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 20 రోజులలో వెబ్సైట్ లో ఉంచుతామని, తదనంతరం వచ్చే సలహాలు సూచనలు స్వీకరించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీతాల పెరుగుదల ఉంటుంది తప్ప తగ్గించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ముగ్గురు వైస్ చాన్సలర్లతో పాటు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. విద్య వైద్యం విషయంలో ప్రభుత్వాలు బడ్జెట్లో పెద్దపీట వేసినప్పుడే సామాన్య ప్రజలకు అవి అందుబాటులోకి వస్తాయన్నారు. నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన విద్యా కమిషన్ కి ప్రత్యామ్నాయంగా పీపుల్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందరన్నారు. కార్యక్రమంలో లెక్చరర్ల సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారులు ఉపేందర్ రెడ్డి, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, పాల్గొన్నారు. -
కళాశాల అభివృద్ధికి కృషి
స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: డిగ్రీ కళాశాల అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టణంలోని డైట్ కళాశాల ప్రాంగణంలోకి మార్చారు. ఇదివరకు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలో ఆవరణలో కొనసాగేది. సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. మార్పు అనివార్యం అయింది. సొంత భవనం పూర్తయ్యే వరకు అక్కడ కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం తరగతులను స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.గీతాలక్ష్మి పట్నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్ పాల్గొన్నారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో మున్సిపల్ పార్కు సమీపాన ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతుడు బషీరాబాద్ మండల వాసిగా గుర్తించారు. వయసు 60 ఏళ్ల వరకు ఉంటుందని, భిక్షాటన చేస్తూ జీవించేవాడని తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాగుడుకు బానిసై అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించామని, ఇంకా ఫిర్యాదు అందలేని సీఐ రఘుకుమార్ తెలిపారు. ఫోర్జరీ సంతకంపై ఫిర్యాదు మంచాల: మహిళా పొదుపు సంఘాల్లో జరిగిన అక్రమాలపై పీడీ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని మంచాల ఏపీఎం శేఖర్ అన్నారు. మండలంలోని చెన్నారెడ్డిగూడ గ్రామంలో పద్మావతి పొదుపు సంఘానికి సంబంధించిన వీఏఓగా పని చేస్తున్న ఎండీ జహంగీర్బీని ఫోర్జరీ సంతకాలు చేసి ఓ మహిళ సభ్యురాలు ద్వారా బ్యాంకు నుంచి గతేడాది సెప్టెంబర్లో రూ.50 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు గ్రామసభలో మరోసారి ప్రస్తావించారు. అక్రమాల విషయంలో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై శుక్రవారం ఏపీఎం శేఖర్ మాట్లాడుతూ.. ఫోర్జరీ సంతకాలు చేసి అక్రమంగా డబ్బులు విషయం వాస్తవమే అన్నారు. తిరిగి ఆమె ద్వారా డబ్బులు చెల్లించిందని చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకు పీడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని చెప్పారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణపైసన్రైజర్స్ చిన్న చూపు ఎస్ఆర్హెచ్ కార్యాలయం ఎదుట ధర్నా సాక్షి, సిటీబ్యూరో: దేశవాళీ క్రికెట్ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని ఎస్ఆర్హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్ఆర్హెచ్ ప్రతినిధి నగేష్కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్ జార్జ్, అమన్రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్ఆర్హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్ఆర్హెచ్కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్ఆర్హెచ్ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల సమస్యలపై పోరు
చేవెళ్ల: అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుందని సంఘం జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్మాదిగ అన్నారు. మండలంలోని దేవరంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించి నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి శివశంకర్మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 31 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని సాధించిన ఏకై క సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్దే అన్నారు. అయితే సంఘం కేవలం మాదిగలకే పరమితం కాకుండా సమస్త పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని తెలిపారు. అనంతరం దేవరంపల్లి నూతన అధ్యక్షుడిగా ఎర్రవల్లి భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా ఎర్రవల్లి రమేశ్, కార్యదర్శిగా గడ్డమీది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు, కోశాధికారిగా శివయ్య, అధికార ప్రతినిధిగా నవీన్ ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్, బాలు, యాదయ్య, ప్రవీణ్, జంగయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శివశంకర్మాదిగ -
రోడ్డుపాలు చేయొద్దు
అవినీతి పగుళ్లు! జిల్లాలో రెండేళ్ల క్రితం నిర్మించిన పలు వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతోప్రజాధనం వృథా అయ్యింది. ● ఇండస్ట్రీయల్ పార్క్కు భూములివ్వం ● తేల్చి చెప్పిన రాపోల్ రైతులు ● రోడ్డుపై బైఠాయించి నిరసన పరిగి: ఇండస్ట్రీయల్ కారిడార్కు భూములు ఇచ్చేది లేదని రాపోల్ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. బుధవారం గ్రామపరిధిలోని పరిగి–షాద్నగర్ ప్రధాన రహదారిపై కట్టెలు వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగి మండలం రాపో ల్, కాళ్లాపూర్ గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రెండు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి పట్టడం లేదన్నారు. రెండు గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు తీరుతాయని భావించామని.. కానీ ప్రభుత్వ చర్యలు రైతులను భూస్థాపితం చేసేలా ఉన్నాయన్నారు. ధర్నా కారణంగా పరిగి – షాద్నగర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు చెప్పారు. దీంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ వెంకటేశ్వరి రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రియల్ ఎసే్ట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని కాళ్లాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బుధవారం మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులు కోల్పోయే భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. రైతులకు న్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
పరిగి: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రంగంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పద్మమ్మ(65) భర్త ఏఎస్సైగా రిటైరై, అనారోగ్యంతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇంట్లో పద్మమ్మ ఒంటరిగా ఉంటోంది. ఇదిలా ఉండగా బుధవారం చుట్టుపక్కల ఇళ్లకు దుర్వాసన రావడంతో పద్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి చూడగా మృతిచెంది కనిపించింది. మృతురాలి ఒంటిపై రక్తపు మరకలు, ఛాతిపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఎస్ఐ మోహనక్రిష్ణను వివరణ కోరగా హత్య కాదని, మృతి చెంది చాలా రోజులు కావడంతో రక్తం బయటకి వచ్చిందని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జాతీయ అవార్డుకు మోత్కుపల్లి జీపీ
బంట్వారం: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబర్చిన కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికై ంది. ఇందుకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. గుడ్ గవర్నెన్స్ విభాగంలో మెత్కుపల్లి జీపీ తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి సుస్థిర పరిపాలన లక్ష్య సాధనలో ముందంజలో నిలిచిన మోత్కుపల్లి జీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు అందుకోనుంది. ఈ నెల 24న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనుంది. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల మోత్కుపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
భార్యాకొడుకును చంపిన నిందితుడికి రిమాండ్
ఆమనగల్లు: ఆమనగల్లు మండలం సీతారాంనగర్తండా గ్రామ పరిధిలోని పులుగోనిపల్లితండాలో మంగళవారం భార్య, కొడుకును హత్య చేసిన నిందితుడు పులుగోనిపల్లితండాకు చెందిన బానావత్ రాందాస్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కుటుంబ కలహాలు, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రాందాసు మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భార్య కవిత, కుమారుడు హర్షరోహిత్, కుమార్తె ప్రణీతపై రోకలితో దాడి చేశాడని ఆయన వివరించారు. ఈ ఘటనలో కవిత, హర్షరోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా ప్రణీత తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. అనంతరం ఆమనగల్లు ఎస్ఐ సీతారాంరెడ్డి, ఏఎస్ఐ రాంరెడ్డి, పోలీసులు రజనీకాంత్, టైటస్ లక్ష్మణ్ నిందితుడు రాందాస్ను బుధవారం పట్టుకున్నారని ఆయన చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. వివరాలు వెల్లడించిన ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు -
ఎమ్మెల్యే ఎదుటే కల్లు పంచాయితీ
● చెన్గేస్పూర్ సొసైటీ సభ్యుల పరస్పర వాగ్వాదం ● రెండువర్గాలుగా విడిపోయిన సంఘం మెంబర్లు తాండూరు రూరల్: కల్లు విక్రయం విషయంలో ఇరువర్గాల వారు ఎమ్మెల్యే ఎదుటే పరస్పరం దూషించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని కొత్లాపూర్ ఎల్లమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్గేస్పూర్ గ్రామానికి సంబంధించిన కల్లు సొసైటీ సభ్యులు కొత్లాపూర్కు చేరుకున్నారు. ఈసారి గ్రామంలోనే కల్లు తయారు చేసుకుని విక్రయిస్తామని, రెండేళ్లుగా బయటి వ్యక్తులే కల్లు అమ్ముకుంటున్నారని సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే సొసైటీ సభ్యుల కోరిక మేరకే రవిగౌడ్ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చామని, ఇప్పుడు కాదంటే అంగీకరించేది లేదని అక్కడే ఉన్న మరికొందరు సభ్యులు తెలిపారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరగడంతో తర్వాత మాట్లాడుకుందామని చెప్పిన ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈవిషయమై చెన్గేస్పూర్ సర్పంచ్ ప్రవీణ్గౌడ్ మాట్లాడుతూ.. డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్ రెండేళ్లుగా తమ గ్రామంలో కల్లు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈసారి సొసైటీ మెజార్టీ సభ్యుల అంగీకారంతో తామే కల్లు అమ్ముకుంటామని ఎమ్మెల్యేను కోరామన్నారు. ఈవిషయమై రవిగౌడ్ తనను ఎమ్మెల్యే ఎదుటే బెదిరించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కల్పించుకుని సొసైటీకి న్యాయం చేయాలన్నారు. మెజార్టీ సభ్యుల అంగీకారం, సొసైటీ చైర్మన్ అనుమతితోనే తాను కల్లు విక్రయిస్తున్నానని రవిగౌడ్ తెలిపారు. -
అవినీతి పగుళ్లు!
వికారాబాద్: జిల్లాలోని ఆయా మార్గాల్లోని వంతెనలు ప్రమాదకరంగా మారాయి. అధికారులు.. కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం పనులపై సాక్షి దినపత్రికలో పలుసార్లు కథనాలు వచ్చాయి. ఆ సమయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులు, అప్పటి కలెక్టర్ ఽథర్డ్పార్టీ ఎంకై ్వరీకి ఆదేశించారు. బ్రిడ్జిలను పరిశీలించిన ప్రత్యేక అధికారులు నివేదికలు ఇచ్చారు. అవి బుట్టదాఖలయ్యాయి. వాటిని బయట పెట్టలేదు. పర్యవేక్షణాధికారులు, కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంట్రాక్టర్లకు అధికారులు వంతపాడటం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. రంధ్రాలు పడినంత మాత్రన నాణ్యత లేనట్టు కాదని.. ఇంజనీరింగ్ లోపం ఉన్నట్లు చెప్పలేమని ఈఈ స్థాయి అధికారే అనడం గమనార్హం. ఏ లోపం లేకపోయినా అప్పుడప్పుడు బ్రిడ్జిలు కూలుతుంటాయని సెలవిచ్చారు. పాడైన వాటికి పైన సిమెంట్ పూత పూసి చేతులు దులుపుకొంటున్నారు. నాణ్యతకు తిలోదకాలు.. అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పూర్తిగా కంట్రోల్ తప్పుతోంది. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో నాణ్యత మచ్చుకై నా కనిపించడంలేదు. వందేళ్లు నిలవాల్సిన నిర్మాణాలు ఏడాది.. రెండేళ్లకే పాడవుతున్నాయి. పనులు ఏవైనా పర్సెంటేజీలే పరమావధిగా వ్యవహారం సాగుతోంది. కింది స్థాయి ఉద్యోగులు వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ మొదలు డీఈలు, ఈఈ స్థాయి అధికారులు, చివరకు క్వాలిటీ కంట్రోల్ అధికారుల వరకు అంతా మామూళ్ల మత్తులోనే మునిగి తేలుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇసుకకు బదులు డస్టు వినియోగిస్తున్నారు. చాలా చోట్ల 20 శాతం ఇసుక 80 శాతం డస్టు కలపడం వల్ల నాణ్యత ఉండటం లేదు. ఇంకొన్ని చోట్ల వంద శాతం డస్టే వాడుతున్నారు. మార్కెట్లో లారీ డస్టు రూ.9 వేల నుంచి రూ.10 వేల లోపు దొరుకుతుంది. అదే ఇసుక అయితే రూ.40 వేల నుంచి రూ.50 వేలకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు డస్టు వాడి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు స్టీల్, ఇతర సామగ్రి కూడా వాడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజాధనం వృథా ప్రతి ఏటా వంతెనలు, బ్రిడ్జిలు, బీటీ, సీసీ రోడ్లు, భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం వందల కోట్లు విడుదల చేస్తోంది. పనులు ఏళ్లపాటు సాగడంతో నిర్మాణ వ్యయం కూడా రెట్టింపు అవుతోంది. పనులు నత్తనడకన సాగితే నాణ్యత లేకపోవడంతో తక్కువ వ్యవధిలో దెబ్బతింటున్నాయి. దీంతో వందల కోట్ల ప్రజా ధనం వృథా అవుతోంది. ప్రారంభించిన రెండేళ్లకే దెబ్బతింటున్న వంతెనలు కాంట్రాక్టర్లు చేసిందే పని.. వారు చెప్పిందే వేధం ఎవరి లోపం లేదంటున్న అధికారులు కొన్ని చోట్ల ఇలా జరగడం సహజమేనంటున్న ఈఈ థర్డ్ పార్టీ నివేదిక బుట్టదాఖలు కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా పై ఫొటోలో కనిపిస్తున్నది తాండూరు – కొడంగల్ మార్గం యాలాల మండల పరిధిలోని బ్రిడ్జి. తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణ పనులు చేపట్టారు. ఏడేళ్ల పాటు పనులు సాగాయి. 2022 చివరి నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకోసం రూ.16.80 కోట్లు వెచ్చించారు. రెండేళ్లుగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్ని మాసాల క్రితం బ్రిడ్జికి రంద్రం పడింది. వందేళ్లపాటు ఉండాల్సిన వంతెన రెండేళ్లకే దెబ్బతినడం చూస్తే నాణ్యత ఏమేరకు పాటించారో ఇట్టే అర్థం అవుతుంది. దెబ్బతిన్న వంతెనను పరిశీలించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగ్నాపై రూ.16.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించిన రెండేళ్లకే కుంగిన వైనం గాజీపూర్ – బుద్దారం వాగుపై రూ.3.30 కోట్లతో వంతెన ఏడాదిన్నరకే పాడైన బ్రిడ్జి -
సమయపాలన పాటించాలి
జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి పూడూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి అన్నారు. బుధవారం మండలంలోని చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సూచించారు. పాము, తెలు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఏఎన్ఎంకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మహమూద్ ఫారూకీ, ఆస్పత్రి సిబ్బంది రవికుమార్, దాసు తదితరులు పాల్గొన్నారు. ఖైదీలకు వైద్యం అభినందనీయం జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్ పరిగి: ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం ముద్దాయిలు, ఖైదీలు, సిబ్బందికి ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిగి సబ్జైలులో శ్రీ సాయి డెంటల్ ఆస్పత్రి, కళాశాల వికారాబాద్ వారి సహకారంతో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ పీఆర్ఓ రవీందర్గౌడ్, వైద్యులు వివేక్, విశ్వప్రియ, కేజీయా, గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్గా అనిల్యాదవ్ అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్లీడర్గా 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మున్సిపల్లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికై పాటు పడుతానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, ముఖ్య నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆకులమైలారం మాజీ సర్పంచ్ మృతి కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్(60) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. ఆయనకు భార్యతో పాటు కుమారై ఉన్నారు. కొంత కాలంగా చిక్సిత పొందుతున్న ఆయన బుధవారం ఉదయం మరణించారు. స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్తో పాటు వివిధ పార్టీల నాయకులు ఎస్.సురేందర్రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, ఎస్.కృష్ణనాయక్, ఈశ్వర్గౌడ్, గోపాల్రెడ్డి, చిర్ర సాయిలు, మంద సాయిలు, ఆనంద్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబీకులకు సానూభూతి తెలిపారు. -
ఏజెంట్ల నియామకంపై శ్రద్ధ తీసుకోండి
అనంతగిరి: బూత్స్థాయి ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్ పునఃపరిశీలన(ఎస్ఆర్ఐ)లో భాగంగా బూత్స్థాయి ఏజెంట్ల నియామకం, మ్యాపింగ్ ప్రక్రియ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, మసక బారిన ఫొటోలు తదితర వాటిపై కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు ఉండొద్దన్నారు. జిల్లాలో 1,133 వార్డులు ఉన్నాయని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఏప్రిల్ 3వ తేదీ నాటికి ఏజెంట్ల జాబితాను సమర్పించాలని సూచించారు. గ్రామాల్లో బూత్స్థాయి అధికారులను సంప్రదించి బోగస్, డబుల్, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓలు వాసుచంద్ర, కె.అనిత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలి కుల్కచర్ల: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. బుధవారం చౌడాపూర్ ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అంతకుముందు ఫర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి ఎరువుల అమ్మకాల్లో నిబద్ధత పాటించాలని ఆదేశించారు. రేషన్ దుకాణంలో బియ్యం ఎందుకు తక్కువగా ఉన్నాయని కలెక్టర్ ఆరా తీయగా ఇంకా రావాల్సి ఉందని డీలర్ సమాధనం చెప్పారు. జెడ్పీ పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంట తయారీని పరిశీలించి ఇలా చేయడం సరికాదని సూచించారు. కిచెన్షెడ్ మంజూరైనా ఎందుకు కట్టలేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్ నవీన్కు సూచించారు. గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల నిర్వహించాలి కొత్తగా ఏర్పాటైన చౌడాపూర్ మండల కేంద్రానికి ప్రాథమిక పాఠశాల మంజూరు కాగా గ్రామం బయట ఉన్న జెడ్పీ పాఠశాలలోకి మార్చారు. పిల్లలను అంత దూరం పంపడం కష్టాంగా ఉందని తల్లిదండ్రులు కలెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రాంచందర్, ఇన్చార్జ్ ఎంపీఓ రాజిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి -
తప్పిన పెను ప్రమాదం
డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ తాండూరు టౌన్: పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలో చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. నాపరాయి లోడ్తో కొడంగల్ మార్గం నుంచి పట్టణంలోకి ఫ్లై ఓవర్ మీదుగా వచ్చిన లారీ, అతి వేగంగా బస్టాండు ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేదా అతి వేగం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు
● నాణ్యమైన ఆహార పదార్థాలే విక్రయించాలి ● టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా పరిగి: ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటం ఆడితే సహించేది లేదని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యానగర్ కాలనీలో మటన్ షాపులో నిర్వహిస్తున్న యజమాని ఇంట్లో 35 కిలోల కుళ్లిన మాంసాన్ని సీజ్ చేశారు. కృష్ణ అనే వ్యక్తి వద్ద సిలిండర్లు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేసి 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఐస్క్రీం దుకాణాలపై దాడులు చేసి కల్తీ సామగ్రిని సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
యువత దేశానికి వెన్నెముక
● డ్రగ్స్కు బానిసలు కావొద్దు ● ఎస్పీ స్నేహ మెహ్ర కొడంగల్: నేటి యువత దేశానికి వెన్నెముకలా వ్యవహరించాలని, యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ –అలైన్, డ్రగ్స్ నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రతిరోజూ ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడమే అర్రైవ్–అలైన్ ప్రాజక్టు ప్రధాన లక్ష్యమని అన్నారు. వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండడం అత్యంత కీలకమన్నారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. తద్వారా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములునాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఎంవీఐ వసంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదం
చందానగర్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో విద్యుదాఘాతం ఏర్పడటంతో కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆటో, రెండు ద్విచక్రవాహనాలకు మంటలంటుకుని దగ్ధమయ్యాయి. పక్కన ఉన్న రెండు భవనాలు మంటలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే బస్తీ ప్రజలు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ సంఘటనాస్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి త్వరతగతిన విద్యుత్ను పునరుద్ధరించాలని కోరారు. -
నిధుల బాధ్యత నాది
● వికారాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం ● మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ అనంతగిరి: వికారాబాద్ మున్సిపాలిటీకి అధిక నిధులు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం జరిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికై న పాలక కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి, స్వర్గీయ జైపాల్రెడ్డితో మాట్లాడి వికారాబాద్ పట్టణానికి రూ.2,300 కోట్లతో శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించినట్లు తెలిపారు. దేశంలో మొత్తం ఏడు శాటిలైట్ ప్రాజెక్టులు మంజూరైతే అందులో మనది ఒకటన్నారు. ప్రభుత్వాలు మారడంతో మెజారిటీ నిధులు రాలేదన్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో మూడు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉందని, నిధుల మంజూరు కోసం రైల్వే శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. శివసాగర్ చెరువును పూర్తిగా ఆధునీకరిస్తామని చెప్పారు. మున్సిపల్ అభివృద్ధికి నిధులు తెచ్చే బాధ్యత తనదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాణహిత – చేవెళ్ల, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తేవాలని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పాలమూరు పథకం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతగిరిని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడారు. ప్రతి వార్డులో పర్యటించి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2026 – 27బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలిపారు, సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, కమిషనర్ విక్రం సింహారెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, కౌన్సిలర్లు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైలెవల్ వంతెనతో ప్రయోజనం ధారూరు: మండలంలోని రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపై హైలెవల్ వంతెన నిర్మాణంతో ఎంతో మేలు జరుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ప్రతి ఏటా వానాకాలంలో అలుగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు స్తంభిస్తుంటాయని తెలిపారు. హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తయితే ధారూరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, కోట్పల్లి, బంట్వారం, మర్పల్లి, పెద్దేముల్, కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ముంబై హైవేకి చేరుకోవడం దగ్గరవుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మాజీ వైస్ ఎంపీపీ వరద మల్లికార్జున్ ఈ సమస్యను తరచూ తన వద్దకు తెచ్చేవారని తెలిపారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.86.50 కోట్లు మంజూరు చేయించామని, పనులు శరవేగంతో సాగుతున్నాయని వివరించారు. మరో రూ.28 కోట్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో రూ.600 కోట్లతో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ రాజేశ్వరీ, ఆర్అండ్బీ సీఈ వసంత్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, నాయకులు పి.రాములు, బాబాకాన్, రుద్రారం, నాగసమందర్ సర్పంచులు పాల్గొన్నారు. వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేత ఐదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు చెందిన 286 మంది వార్డు సభ్యులు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు పాలనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, సర్పంచులు పాల్గొన్నారు. హామీలు అమలు చేస్తున్నాం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రూ.2 కోట్ల 4 లక్షల వ్యయంతో కూడిన ఉచిత ప్రయాణం చేశారన్నారు. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి పెంపు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్టీఏ మెంబర్ జాఫర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ రాకేష్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకీ, ఆర్టీసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితులకు రిమాండ్
మొయినాబాద్రూరల్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను దొంగలించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 26న రాత్రి బి.శ్రీనివాస్ అలియాస్ శ్రీను, మేకల శివకుమార్ కలిసి కాశీంబౌలిలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మొయినాబాద్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. -
తాగునీటి సమస్య రానివ్వం
వికారాబాద్: ‘జిల్లా జనాభాకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయి.. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం.. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాం’. అని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కలెక్టర్గా బాధ్యతలు తీసుకొని నెల రోజు లు అవుతున్న సందర్భంగా పలు అంశాలను పంచుకున్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యలు, ఎంచుకోవాల్సిన ప్రాధమ్యాలపై అవగాహన వచ్చిందన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. ప్రజలతో పాటు పశు పక్ష్యాదుల దాహర్తిని తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రోజుకు 22గంటల పాటు నీటి శుద్ధి జిల్లాలో రెండు చోట్ల నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. పరిగి మండలం జాఫర్పల్లి వద్ద ఉన్న ప్లాంట్ రోజుకు 135 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. కొడంగల్లో 17 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ అందుబాటులో ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు 18 గంటల పాటు నీటిని శుద్ధి చేసేవారం. వేసవి దృష్ట్యా 22 గంటలు శుద్ధి చేస్తున్నాం. జిల్లాలో సుమారు పది లక్షల జనాభా ఉండగా రోజుకు వారికి 130 ఎంఎల్డీ నీరు అవసరం అవుతాయి. రెండు ప్లాంట్ల ద్వారా 145 ఎంఎల్డీ నీటిని పంపింగ్ చేస్తున్నాం. తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఆర్థిక సంఘం నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉన్న వనరులు, వ్యవస్థలను సమర్థవంతగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 24 గంటల్లో మరమ్మతులు జిల్లాలో పైప్లైన్ లీకేజీలు, బోర్ వెల్స్, బోరు బా వులు పాడైన 24 గంటల్లో బాగు చేయించి అందుబాటులోకి తెచ్చేలా సిబ్బందిని అప్రమత్తం చేశాం. అవసరం ఉన్న చోట కొత్త బోర్లు వేసేందుకు చర్య లు తీసుకుంటాం. అనుకోకుండా ఏదైనా సమస్య తలెత్తినా.. పంపింగ్ సిస్టంకు ఇబ్బందులు ఎదురైనా జిల్లా వాసులకు నీటి కష్టాలు రానివ్వం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. గ్రామ పంచాయతీల్లో పశువుల దాహర్తి తీర్చేందుకు నీటితొట్లను అందుబాటులోకి తేచ్చాం. వాటిలో నీళ్లు నింపాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించాం. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. సన్నాల సాగును ప్రోత్సహిస్తాం ప్రభుత్వ ప్రాధమ్యాలైన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సకాలంలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. త్వరలో జనాభా లెక్కలు, ఎస్ఐఆర్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తాం. సన్నరకం వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కౌన్సిలర్లు, అధికారులను అప్రమత్తం చేస్తాం. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రథమిక ఆరోగ్య కేంద్రాలను, విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎంపిక చేసిన కేజీబీవీల్లో ఐఐటీ ఫౌండేషన్ కూడా అందించాలని ఆదేశించాం. ఇందులో భాగంగా ఖాన్ అకాడమి వారితో కలిసి విద్యాశాఖ పనిచేసేలా చర్యలు చేపడుతున్నాం. జనాభాకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయి -
సర్పంచులకు సహకరించండి
మర్పల్లి: గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు సర్పంచులకు సహకరిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎంపీడీఓ శ్రీనివాస్ సూచించారు. ఐదు రోజులుగా మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు ఇచ్చిన శిక్షణ శిబిరం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పేదలకు అందే విధంగా పంచాయతీ పాలన కొనసాగాలన్నారు. గ్రామంలో ఏవైన సమస్యలు ఉంటే సర్పంచ్ దృష్టికి లేదా పంచాయతీ కార్యదర్శి దృష్టికి వార్డుసభ్యులు తీసుకు రావాలన్నారు. అనంతరం శిక్షణ శిబిరంలో పాల్గొన్న వార్డు సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రీచ్లపై నిఘా
● అక్రమంగా రవాణా చేస్తే చర్యలు ● తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి బీషీరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచామని తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. కాగ్నానది ఇసుక రీచ్ల నుంచే అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంగళవారం బషీరాబాద్ ఠాణాను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను ఛేదించాలని ఎస్ఐ శ్రీశైలం యాదవ్కు సూచించారు. మండలంలోని నావంద్గీ, గంగ్వార్, మంతట్టి ఇసుక రీచ్లతో పాటు ఎక్మాయి పెద్దవాగు, కంసాన్పల్లి వాగు, దామర్చెడ్, మైల్వార్ గ్రామాల్లో ఇసుక రవాణాపై బ్లూకోట్ పోలీస్ టీంలతో నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. రెండో సారి పట్టుబడితే ట్రాక్టర్లను జప్తు చేసి కోర్టుకు రాయడమే కాకుండా వాటి యజమానులపై క్రిమిల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఆర్టీఏ నిబ్బంధలను ఉలంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ఈ విషయంలో ప్రయాణికులకు సైతం అవగాహన చేయాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
సీనియారిటీ ప్రకారం విధులు కేటాయించాలి
తాండూరు రూరల్: ఉపాధ్యాయుల సీనియార్టీ ప్రకారం జనగణన విధులు కేటాయించాలని తపస్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ వెంకట్ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు వేయొద్దన్నారు. వీరిలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్, నరహరిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల అనిల్, నాయకులు మహేశ్, విజయలక్ష్మి, అలివేలు తదితరులు పాల్గొన్నారు. వెండి విగ్రహం అందజేత కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్లలో కొలువుదీరిన పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ భక్తుడు వెండి విగ్రహం బహూకరించారు. మంగళవారం షాద్నగర్కు చెందిన షాలిని అమర్నాథ్ దంపతులు 95 తులాల వినాయక విగ్రహం అందజేశారు. అంతారం గ్రామానికి చెందిన మరో భక్తుడు బాసుపల్లి శాంతిరెడ్డి దంపతులు 50 కిలోల ఇత్తడి గంటను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పాండుశర్మ మాట్లాడుతూ.. రామలింగేశ్వరుడికి భక్తులు కానుకలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని అన్నారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులే కీలకం డీఎల్పీఓ సంధ్యారాణి బంట్వారం: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని డీఎల్పీఓ సంధ్యారాణి అన్నారు. కోట్పల్లి మండల వార్డు సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి మంగళవారం హాజరై మాట్లాడారు. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, చేపట్లాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్రెడ్డి, ట్రైనర్లు పాల్గొన్నారు. పుట్టపహాడ్ తైబజార్ వేలం కుల్కచర్ల: గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులను పెంచేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజిలయ్య అన్నారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో సంతకు వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన అంజమ్మ రూ.50 వేలకు వేలం హక్కులు పొందారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాస్త్రి, పంచాయతీ కార్యదర్శి కవిత, వార్డుసభ్యుడు వెంకట్రాములు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. డాక్టరేట్ ప్రదానం షాద్నగర్ రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుడిగా మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండీ వాజీద్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి సత్కరించారు. -
అప్రమత్తతే రక్ష
తాండూరు టౌన్: అప్రమత్తతతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తాండూరు ఫైర్ స్టేషన్ ఇన్చార్జ్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని అభ్యాస్ హైస్కూల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వెలువడితే తడి దుప్పటితో ఆర్పేయడం, పొగతో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశం నుంచి బయటకు వెళ్లడం, ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యలపై పలు ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుందన్నారు. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి తాగిన అనంతరం ఆర్పేయకుండా పడేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వంటిట్లో గ్యాస్ సిలిండర్ వినియోగించే వారు తరచూ రెగ్యు లేటర్, గ్యాస్ పైపును సరిచూసుకోవాలన్నారు. వంట పూ ర్తయిన తర్వాత గ్యాస్ సరఫరాను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది శ్రీనివాస్, ఇబ్రహీం, రఘుపతి రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడిలో మేకలు మృత్యువాత
చేవెళ్ల: మేకల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 18 మేకలు మృతి చెందాయి. మరో నాలుగు త్రీవంగా గాయపడ్డాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు కకంటి శ్రీశైలం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిఎర్రవల్లికి చెందిన కంకంటి శ్రీశైలం తనకున్న 23 మేకలను మేపుకొంటూ జీవిస్తున్నాడు. గ్రామ సమీపంలోని పొలం వద్ద షెడ్లో ప్రతిరోజు రాత్రి వాటికి కాపలాగా పడుకునేవాడు. సోమవారం రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్న అతడు వర్షం పడే సూచన ఉండటంతో షెడ్కు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి 18 మృతి చెంది, మరో నాలుగు గాయాలతో కనిపించాయి. వీధి కుక్కలు దాడి చేసి మేకలను ఇష్టానుసరంగా కొరికి చంపేశాయి. బాధితుడు లబోదిబోమంటూ వెట ర్నరీ వైద్యులకు సమాచారం అందించాడు. చేవెళ్ల వెటరర్నీ వైద్యుడు డాక్టర్ తిరుపతిరెడ్డి వచ్చి పరిశీలించాడు. గాయపడ్డ వాటికి వైద్యం చేశారు. వాటి పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలిపారు. రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. -
మున్సిపల్ అభివృద్ధే లక్ష్యం కావాలి
పరిగి: మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు రవికుమార్, రవీందర్, శ్రీనివాస్, నరేష్, చంద్రకళ బల్దియా లావాదేవీలపై సమాధానం చెప్పాలని అధికారులను కోరారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వార్డులను అభివృద్ధి చేయడం నా బాధ్యత అని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, డైనేజీ వ్యవస్థ, తాగునీటి తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రతి వార్డుకూ సమానంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. పార్టీలను పక్కన పెట్టి పట్టణాభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కౌన్సిలర్లకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ హన్మంతు, కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై త్వరలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. బడ్జెట్ సమావేశ అనంతరం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం(ప్రత్యేక అధికారుల పాలన)లో దాదాపు రూ.2 కోట్ల మేర నిధుల దుర్వినియోగమైనట్లు తెలిపారు. నిధులు కాజేసిన అధికారులను కాపాడేందుకు అధికార పార్టీ నాయకులు చూడటం సిగ్గు చేటన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు రవికుమార్, శ్రీనివాస్, శివనోళ్ల చంద్రకళ భాస్కర్, శ్రీనివాస్, నరేష్, షమీనాబేగం, సునీత, రవీందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
రేపటి నుంచి గ్రామసభలు
● ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. మంగళవారం నగరం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు వేసవి కాలంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08416235291ను ఆయన ప్రారంభించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు తాగునీటి సమస్యలపై పైనంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమములో పంచాయతీ రాజ్ ఈఈ రవికుమార్ పాల్గొన్నారు. -
చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయి
అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం ఆవరణలో మహిళా పీఎస్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన చంద్రయ్యకు మంగళవారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. చంద్రయ్యను పూలమాలలు, శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. 38 ఏళ్ల పాటు సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. పోలీస్ శాఖ పట్ల అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, మహిళా పీఎస్ సీఐ సరోజ, ఆర్ఐ శ్రీశైలం, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ తదతరులు పాల్గొన్నారు. -
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంపై మంగళవారం తాండూరు ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళా ప్రయాణికులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను సీఎం రేవంత్రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఆర్టీసీ డీఎం సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కోత్లాపూర్ ఎమ్మెల్యే ఆయల కమిటీ ప్రమాణం
తాండూరు రూరల్: మండల పరిధిలోని కోత్లాపూర్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్గా పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు నూతన చైర్మన్తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రోడ్డు నిర్మాణానికి రూ.289 కోట్లు ● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ పురుషోత్తంరావు తాండూరు: నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్ల నిధులతో అభివృద్ధి జరగడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు మంగళవారం పేర్కొన్నారు. 102 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.289 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. మే నెలలో సీఎం రేవంత్రెడ్డి తాండూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. సీఎంతో పాటు ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిల హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కోకట్ గ్రామంలో కాగ్నానది బ్రిడ్జి నిర్మాణ పనులను సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేస్తారన్నారు. కోకట్ నుంచి చిలుకవాగు వరకు డివైడర్తో పాటు 13.83 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులకు రూ.63 కోట్లు మంజూరయ్యాయన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇప్పించండి సారూ.. అనంతగిరి: తనకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఇప్పించాలని మోమిన్పేట మండలం కోలుకుంద గ్రామానికి చెందిన నవాబ్ రాఘవేందర్రెడ్డి కోరారు. మంగళవారం వికారాబాద్లో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 10న తరకు సీఎంఆర్ఎఫ్ చెక్ వచ్చినట్లు మేసేజ్ వచ్చిందన్నారు. కాగా అట్టి చెక్ ఎక్కడ ఉందో.. ఎవరి దగ్గర ఉందో తనకు సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంఆర్ఏ కార్యాలయం చుట్టూ తిరిగిన ఎవరూ సమాధానం చెప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని చెక్ ఇప్పించగలరని ఆయన కోరారు. -
అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం
కుల్కచర్ల: అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని మందిపల్ సర్పంచ్ నాగరాజు యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాందాస్ నాయక్ అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండల కేంద్రంలో చలో కిష్టాపూర్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత అంబేడ్కర్ మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల 4న దోమ మండలం కిష్టాపూర్లో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. బహుజన వాదులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, అంబేడ్కర్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అశోక్, డీజే కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
తైబజార్ వేలం రూ.6,50,810
ధారూరు: ధారూరు తైబజార్కు సోమవారం వేలం నిర్వహించగా అవుసుపల్లికి చెందిన కోడిగంటి షాబాద్ శ్రీనివాస్ రూ.6,50,810కు పాట దక్కించుకున్నారు. ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ ప్రమీలగౌడ్ ఆధ్వర్యంలో కార్యదర్శి అంజానాయక్ వేలం నిర్వహించారు. గత ఏడాది కూరగాయల మార్కెట్ ద్వారా పంచాయతీకి రూ.6,01,000 ఆదాయం సమకూరింది. తాజాగా వేలం దక్కించుకున్న శ్రీనివాస్ ప్రతి శనివారం మార్కెట్లో కూరగాయలు విక్రయించే వారి నుంచి నిర్ణీత రుసుం వసూలు చేసుకోవచ్చు. వేలం పాటలో ఎంపీఓ షఫీఉల్లా, ఉప సర్పంచ్ జహంగీర్, వార్డు మెంబర్లు, వ్యాపారులు పాల్గొన్నారు. తుంకిమెట్లలో.. బొంరాస్పేట: మండలంలోని తుంకిమెట్లలో ఆదివారం సంతకు సోమవారం వేలం నిర్వహించారు. సర్పంచ్ ఎల్లమ్మ ఆధ్వర్యంలో డీఎల్పీఓ ప్రవీణ్కుమార్, ఎంపీఓ రవినాయక్ సమక్షంలో వేలం జరిగింది. గ్రామానికి చెందిన చాకలి నర్సింలు రూ.3.65లక్షల వేలం దక్కించుకున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 2027 మార్చి చివరి వరకు రుసుం వసూలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఆయిల్ పామ్తో స్థిర ఆదాయం
● తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ● కొడంగల్ రైతులకు ఖమ్మం జిల్లాలో శిక్షణ కార్యక్రమం ● పాల్గొన్న కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి దుద్యాల్: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, సాగు కూడా సులవని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీలను వివరించారు. కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల నుంచి వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి మాట్లాడారు. కొడంగల్ రైతులు ఆయిల్ పామ్ సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ పంట సాగుతో స్థిరమైన ఆదాయం పొందచ్చని తెలిపారు. అనంతరం అధికారులు సాగు విధానం గురించి అవగాహన కల్పించారు. చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత దూరం ఉండాలి, ఎన్ని సంవత్సరాల పాటు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు, ఏయే పంటలు వేసుకోవచ్చు అనే విషయాలను క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో కొడంగల్ డివిజన్ హార్టీకల్చర్ అధికారి సురేంద్రనాథ్, విస్తరణ అధికారి బాబ్యానాయక్, వ్యవసాయ విస్తరణ అధికారులు జ్యోతి, లోకేశ్, దేవేందర్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ దుద్యాల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, యూత్ విభాగం మండల అధ్యక్షుడు మెరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాల సెగ!
వికారాబాద్: జిల్లాలో ఎటు చూసినా అన్నదాతల ఆందోళనలే కనిపిస్తున్నాయి. మా భూములు లాక్కోవద్దంటూ సోమవారం పరిగి మండలం రాపోల్ గ్రామస్తులు కలెక్టరేట్ను ముట్టడించారు. వికారాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో దళారుల జోక్యాన్ని తగ్గించాలంటూ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలంటూ ఆశ వర్కర్లు బీఆర్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా కాక పంటలు దెబ్బతింటున్నాయని పలు చోట్ల అన్నదాతలు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇలా జిల్లా అంతటా ధర్నాలు.. రాస్తారోకోలు జరిగాయి. మండలాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సీఎం జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కడం ఆందోళన కలిగిస్తోంది. చావనైనా చస్తాం కానీ.. పరిగి మండలం రాపోల్, కళ్లాపూర్ గ్రామాల రెవెన్యూ పరిధిలో 1,170 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వ, పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం పెద్ద సంఖ్యలో రాపోల్ రైతులు కలెక్టరేట్కు తరలివచ్చారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో లోపలికి చొచ్చుకెళ్లి ఆందోళనకు దిగారు. తమ ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. సీఎం డౌన్డౌన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. వికారాబాద్ సీఐ రఘు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. కలెక్టర్ బయటకు రావాలంటూ నినదించారు. ఆర్డీఓ వాసుచంద్ర వచ్చి రైతుల నుంచి వినతిపత్రం తీసుకోవడంతో ధర్నా విరమించి వెళ్లిపోయారు. కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో.. వికారాబాద్ మార్కెట్ యార్డు వద్ద కిసాన్ సంఘ్ నాయకులు ఆందోళనకు దిగారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులను కట్టడి చేయటంతో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆశవర్కర్ల నిరసనలుతమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కొన్ని రోజులుగా ఆశవర్కర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కలెక్టరేట్కు చేరుకొని ధర్నా చేశారు. అధికారులు రాకపోవడంతో ర్యాలీగా కలెక్టరేట్ లోపలికి వెళ్లి ఎండలో బైఠాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీలో మీరు.. ఎండలో మేమా..? అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ వేతనం ఇవ్వాలని ఈ మొత్తాన్ని రూ.18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆశలు హెచ్చరించారు. వీరి తరఫున బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు కృష్ణ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాస్తారోకోలు, నిరసనలతో దద్దరిల్లిన సీఎం జిల్లా -
చెత్త వాహనాలతో పెట్రోల్ బంక్ ముట్టడి
తాండూరు టౌన్: ఆస్తి పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నేటితో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో మొండి బకాయిల వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా తాండూరులోని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఐదేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సోమవారం చెత్త సేకరణ వాహనాలతో బంక్ను ముట్టడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని విలియంమూన్ చౌరస్తాలో ఇలాహి పెట్రోల్ బంక్ ఉంది. దాని యజమాని ఐదేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. రూ.82 వేల వరకు బకాయి ఉంది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో ఉదయం చెత్త వాహనాలతో మున్సిపల్ అధికారులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో యజమాని లేకపోవడంతో అక్కడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పన్ను చెల్లించే వరకు పెట్రోల్ బంక్ వద్దకు చెత్త వాహనాలు వస్తుంటాయని తేల్చి చెప్పారు. పన్ను బకాయిల వసూలుకు ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టడంతో అధికారులు ఇళ్లు, దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. నేటి(మంగళవారం) సాయంత్రంలోగా కచ్చితంగా పన్ను కట్టాలని ఆదేశిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణం అభివృద్ధి చెందాలంటే పన్నులే ముఖ్యమన్నారు. ఏళ్ల తరబడిగా చెల్లించకపోతే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలు పన్నులు చెల్లించి సహకరించాలని ఆయన కోరారు. ఆస్తి పన్ను వసూలుకు మున్సిపల్ అధికారుల వినూత్న యత్నం -
ప్రమాదాల నివారణకు కృషి చేద్దాం
కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర తాండూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కరన్కోట్ సీసీఐ టౌన్ షిప్లో అరైవ్ అలైన్ కార్యక్రమం నిర్విహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అంతకుముందు సీసీఐ టౌన్ షిప్ వద్ద కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజాబాల్రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, సర్పంచ్ రాజ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, సీసీఐ అధికారులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉండాలి యాలాల: పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వసతి గృహాల్లో సబ్జెక్టు టీచర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం మండలంలోని కోకట్ శివారులో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. మెనూ చార్ట్ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ సందేహాలను టీచర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అనిత, తాండూరు తహసీల్దార్ తారాసింగ్, ప్రిన్సిపాల్ సరస్వతీ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో పరిష్కరించాలి అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 186 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కృత్రిమ కొరతను నివారించాలి
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యడు వెంకటయ్య పరిగి: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించడంతోపాటు కృత్రిమ కొరతను నివారించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యడు వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం పరిగి పట్టణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిలిండర్ ధర పెంచడం ద్వారా దేశ ప్రజలపై రూ.60 వేల కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పేరుతో ధరలు పెంచడం సరికాదని హితవు పలికారు. విశ్వగురువని చెప్పుకునే ప్రధాని మోదీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలన్నారు. తక్షణం ఇంధన కొరత లేకుండా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు హబీబ్, సత్తయ్య, అక్బర్, రాఘురాం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ముఠా అరెస్ట్ శంకర్పల్లి: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఓటీ, స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన పొన్నాల సిద్దార్థ్(27) సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్కు అలవాటు పడిన సిద్దార్థ్ గోవా నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి పబ్లు, క్లబ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ చలవాడి హిమంత్ కృష్ణవంశీ(30) హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా.. సిద్దార్థ్కు పరిచయమయ్యాడు. వీరికి నాచారానికి చెందిన రొయ్యల వ్యాపారి అవదూత విష్ణుతేజ(36) జతయ్యాడు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి గోవా నుంచి 39.72 గ్రాముల కొకై న్, 3గ్రాముల గంజాయి తీసుకుని మోకిల పీఎస్ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ మీదుగా వెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా, ముగ్గురూ డ్రగ్స్తో పట్టుబడ్డారు. వీరి నుంచి మాదకద్రవ్యాలతో పాటు కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, సోమవారం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు. -
సమస్యలు పరిష్కరించాల్సిందే
అనంతగిరి: ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సాయిలు అన్నారు. సోమవారం వికారాబాద్ డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుందరికీ విద్యుత్ శాఖలో ఒకే సంస్థ ఒకే రూల్స్ ఉంటుందని.. కానీ మన శాఖలో మాత్రం చట్టానికి విరుద్ధంగా రెండు రూల్స్ అమలు చేయడం అన్యాయమన్నారు. కార్మికులతో యాజమాన్యం వెట్టి చాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. ప్రమోషన్స్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ మోసం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రంలో కమిటీ సభ్యులు వికారాబాద్ మహేష్, బిచ్చిరెడ్డి, అక్తర్ అలి, బాల్రాజు, సుభాన్, వెంకటయ్య, అశోక్, కిరణ్, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. ● లేదంటే సమ్మెకు వెళ్తాం ● ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సాయిలు -
నేడు మున్సిపల్ బడ్జెట్ సమావేశం
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం మంగళవారం ఉదయం 11గంటలకు చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశా రు. ఇప్పటివరకు బాధ్యతలు తీసుకోని నలుగురు బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లారీ దగ్ధం తాండూరు టౌన్: పట్టణ పరిధిలోని విలియంమూన్ చౌరస్తాలో నిలిపి ఉన్న ఓ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ చాలా వరకు కాలిపోయింది. ఈ విషయమై పట్టణ సీఐని వివరణ కోరగా లారీ పాడైపోవడంతో మరమ్మతుల అక్కడ ఉంచినట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో కాలిపోయి ఉంటుందని తెలిపారు. -
వేటేస్తారా.. వేచి చూస్తారా?
వికారాబాద్: డ్రగ్స్ కేసులో పేరు రావడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువు శుక్రవారంతో ముగిసింది. అతని నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో వేటు వేస్తారా..? వేచి చూస్తారా? అనే విషయంపై చర్చ మొదలైంది. ఇటీవల మొయినాబాద్ సమీపంలోని రోహిత్రెడ్డి ఫాంహౌస్లో రేవ్ పార్టీ జరుగుతుండగా టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం సభ్యులు దాడి చేసి పైలెట్తో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టారం వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ రోహిత్రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గడువు ముగిసిన నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ నాయకులల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సస్సెండ్ చేస్తే లాభమా.. నష్టామా..? ఒకవేళ పైలెట్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు.. పార్టీకి జరిగే లాభ నష్టాలపై బీఆర్ఎస్ అధిష్టానం బేరీజు వేసుకుంటున్నట్లు తెలిసింది. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రోహిత్రెడ్డిని మందలించి పార్టీలో కొనసాగిస్తే తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని అన్నది పెద్ద సమస్యగా మారనుంది. అవకాశం వచి్చన ప్రతిసారీ డ్రగ్స్ కేసు ఉదంతాన్ని తెరమీదకు తెచ్చి ప్రతిపక్షాలు లాభం పొందుతాయనే భయం కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని అడ్డం పెట్టకుని కేటీఆర్తో పాటు మొత్తం పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉందనే వాదన పార్టీ సీనియర్లు తెరమీదకు తెస్తున్నట్టు సమాచారం.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలెట్ను పార్టీ దూరం చేసుకుంటే అతను ఏమైనా లొసుగులు బయటపెట్టి పారీ్టని, పార్టీ పెద్దలను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తాడా..? అనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పారీ్టలో ఉంచాలా తొలగించాలా అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలోనూ పలు సందర్భాల్లో రోహిత్రెడ్డి అతని సోదరుడిపై డ్రగ్స్ ఆరోపణలు రాగా ప్రత్యర్థులు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారనే అభియోగాల నేపథ్యంలో అధిష్టానం అతనిపై వేటు వేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. రేసులో ముగ్గురి పేర్లు పైలెట్ను తప్పిస్తే తాండూరు బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో రోహిత్రెడ్డి తర్వాత అంత స్థాయి ఉన్న నాయకులు లేకపోవడం పారీ్టకి లోటుగా కనిపిస్తోంది. మరో నేత శ్రీశైల్రెడ్డి ఉన్నా రోహిత్రెడ్డికి చిన్నాన్నే కావడంతో ఆయనకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. ఇన్నాళ్లు పార్టీలో ఉంటూ వచ్చిన పట్నం కుటుంబం ఎన్నికలయ్యాక అధికార పార్టీ గూటికి చేరడం, మరో నాయకుడు మురళీకృష్ణ కూడా పార్టీని వీడటంతో నియోకవర్గ బాధ్యతలు మోసేంత సమర్థులు కనిపించడంలేదు. ఇప్పటికే దిగుమతి నేతలతో నిండిన తాండూరుకు మరో నేతను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకునే పరిస్థితి వద్దనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా తాండూరు టికెట్ ఆశిస్తూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్న ఉద్యమ నాయకుడు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. షాబాద్ తాజా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డికి అక్కడ పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయనకు బాధ్యతలు ఇస్తే మహేందర్రెడ్డి వర్గాన్ని అక్కున చేర్చుకొని బీఆర్ఎస్కు లాభం జరగే అవకాశాలున్నాయి. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి తనయుడు కొప్పుల అనీల్రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని అన్ని విధాలుగా ఎదుర్కోగలిగిన నేత కోసం బీఆర్ఎస్ అధిష్టానం గాలిస్తున్నట్లు సమాచారం. -
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
● ఎస్పీ స్నేహ మెహ్ర మోమిన్పేట: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు విధిగా పాటించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్లో ‘అరైవ్ అలైన్’లో భాగంగా మోమిన్పేట పోలీసుల ఆధ్వర్యంలో మహవీర్ జనరల్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు నియమాలను పాటించాలన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో స్పష్టమైన కంటి చూపు ఉండటం అత్యంత అవసరమన్నారు. అందుకోసమే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేయించి అద్దాలను ఇస్తున్నామన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితిలో వాహనం నడిపించకూడదని చెప్పారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారులో ఉన్నవారు సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాత పోలీస్స్టేషన్ను కూల్చి వేయాలని సర్పంచ్ సంధ్య ఎస్పీ స్నేహమెహ్రకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచు సంధ్య శుభాశ్గౌడ్, సీఐ వెంకట్, ఎస్ఐలు భరత్ భూషన్, గిరి, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పైలెట్కు ఇచ్చిన గడువు పూర్తి వివరణ ఇవ్వని మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చర్యలు ఉంటాయా లేదా అన్నదానిపై చర్చ కొనసాగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందనే వాదన వేటు వేస్తే తాండూరు బాధ్యతలు ఎవరికో? వినిపిస్తున్న ముగ్గురు నాయకుల పేర్లు -
నక్ష బాటల పునరుద్ధరణ
మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్కుమార్ కొడంగల్ రూరల్: రైతుల సౌకర్యార్థం నక్ష బాటల పునరుద్ధరణ చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణశివారులోని బీసీ గురుకుల విద్యాలయ సమీపంలో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తిర్మలాపూర్ అడవిలోని అమ్మవారి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీటి రోడ్డు నిర్మాణం జరిగితే ఇబ్బందులు తొలుగుతాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డిల ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణ పనులు షురూ అయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ జోషి, డాక్టర్ హీరాలాల్, నర్సింలు, సాయిలు, ఊట్కూర్ రాజు, రాములు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ సర్పంచ్ సహా కుమారుడి మృతి పరిగి: ఆస్తి కోసం మండలంలోని రూప్సింగ్తండాలో కన్న తండ్రిని, సొంత కుటుంబ సభ్యులను ఓ వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో చిక్సిత పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఈనెల 24న అర్ధరాత్రి సర్పంచ్ రమణిబాయి(52) కుటుంబంపై ఆమె సవతి కొడుకై న అనార్సింగ్ పెట్రోల్ పోసి నిప్పటించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో సర్పంచ్ సహా ఆమె భర్త హన్మంతునాయక్, కుమారులు వెంకటేశ్, శివలకు తీవ్ర గాయాలయ్యాయి. నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు(గవాజు)పై నుంచి పెట్రోల్ పోసి నిందితుడు నిప్పటించాడు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి వెంకటేశ్(24) మృతి చెందాడు. ఆదివారం ఆయన అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే రమణిబాయి సైతం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హన్మంతు, చిన్న కుమారుడు శివలకు ప్రాణాపాయం లేదని కుటుంబీకులు తెలిపారు.వెంకటేశ్ (ఫైల్)రమణిబాయి (ఫైల్) -
తాగునీటికి తండ్లాట చౌడాపూర్ మండలం పుర్సంపల్లి గ్రామంలో వారం రోజులుగా తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రశాంతంగా అసెస్మెంట్ టెస్ట్అనంతగిరి: ఉల్లాస్ అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్న ఎఫ్ఎల్ఎన్ఏటీ(ఫండమెంటల్ లిట్రసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్) ఎన్ఐఓఎస్ పరీక్షను ఆదివారం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షను సెర్ప్, మెప్మా, ఎస్హెచ్జీ సంఘాలు మహిళా సంఘాల సభ్యుల కోసం చేపట్టారు. జిల్లాలో విద్యాశాఖ, డీఆర్డీఓ, మెప్మా, సెర్ప్ అధికారుల సమన్వయంతో పరీక్షను నిర్వహించారు. మొత్తం 566 పరీక్ష కేంద్రాల్లో 20,451 మంది అభ్యాసకులు నమోదు కాగా వారిలో దాదాపు 16 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించమే లక్ష్యమని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 3వ తరగతి సమాన స్థాయి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. నూతన అక్షరాస్యులుగా గుర్తించబడుతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వయోజన విద్యా జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ తెలిపారు. చిలుకూరు బాలాజీకి వాహన సేవలు మొయినాబాద్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బాలాజీ స్వామి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారిని మొదటగా గోపవాహనంపై, తరువాత హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, మురళి, కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మన్కీ బాత్తో ఐక్యత సాధ్యం
బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు కుల్కచర్ల: దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే మహత్తర వేదిక మన్కీ బాత్ అని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆది వారం మండల కేంద్రంలో మన్కీ బాత్ కా ర్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని అసాధారణ వ్యక్తులను ప్రపంచ దృష్టికి తీసుకురావడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇది ప్రతి ఒక్కరిలో జాతీయభావాలు పెంపొందిస్తున్నారన్నారు. మన్కీబాత్ అనేది ఒక కార్యక్రమంలా కాకుండా కుటుంబాలను కలిపే ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్ అంజిలయ్య, దిశ జిల్లా కమిటీ సభ్యులు జానకీరాం చౌహాన్, ఉప సర్పంచ్ విజయకుమార్, నాయకులు మైపాల్, చంద్రలింగం, కర్ణయ్య, ఆంజనేయులు, మహేశ్నాయక్, ప్రభునాయక్, ఆంజనేయులు, నర్సింలు పాల్గొన్నారు. తాగిన మైకంలో కత్తితో దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు ధారూరు: తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడికి తెగబడిన సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె రమేశ్ పాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఆయన మద్యం తాగినప్పుడల్లా ఎదుటి వారితో గొడవకు దిగేవారు. శనివారం బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో ఫుల్గా తాగిన మైకంలో రమేశ్ పశువుల పాకకు వచ్చారు. అక్కడే ఉన్న మహిపాల్, నాగార్జునలతో ఘర్షణకు దిగి కత్తితో దాడి చేశారు. విచక్షణ రహితంగా నరకడంతో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ ఆదివారం తెలిపారు. -
బయో మాస్ పెల్లెట్స్ పంపిణీ
మొయినాబాద్: ఎల్పీజీ గ్యాస్ కొరతకు ప్రత్యా మ్నాయంగా బయో మాస్ పెల్లెట్స్ తయారు చేస్తున్నట్టు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ను మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో ఆదివారం ప్రారంభించారు. స్థానిక హోటల్ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తయారు చేసిన బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ బాగా పనిచేస్తుందని.. చాలా మందికి నచ్చి ప్రొడక్షన్ పెంచాలని అడుగుతున్నారన్నారు. ఈ గ్యాసిఫియర్ ప్రైమరీ ఫైర్, సెకండరీ ఫైర్ రెండు రకాలుగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ వ్యర్థాలు బయో వుడ్ గ్యాసిఫియర్ ఇందనంగా వాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ షాబాద్ కిషన్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్గౌడ్, మాజీ సర్పంచ్ రత్నం, నాయకులు మోర నర్సింహారెడ్డి, రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
బొంరాస్పేట: మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి శివారులో గుట్టపై స్వయంభుగా వెలసిన పార్వతీ సమేత పరమేశ్వర ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం కనులపండువగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఊరేగింపుతో శివపార్వతుల విగ్రహాలను గుట్టకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం అభిషేకం, రుద్రహోమం, మధ్యాహ్నం పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం పల్లకీసేవ, పెరుగుబసంతం, రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సుప్రభాతం, వీడ్కోలు సభలుంటాయని నిర్వాహకులు, పూజారి శాంతకుమా ర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కేశవులు, వెంకటేశ్, దేవ్సింగ్, భీంరెడ్డి, రాయన్న, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు. -
తాగు నీటి సమస్యను అధిగమిస్తాం
మంచాల: గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆరుట్ల సర్పంచ్ మానుపాటి శోభ కుమార్ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించారు. 40 బోరు బావులను గుర్తించారు.నీటి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజల సహకారంతో నీటి వనరులు ఉన్న చోట బోరు బావులకు మోటార్లు బిగిస్తున్నామని తెలిపారు. నీటిని పొందుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు పున్నం రాము, బాలమణి, పద్మ, జంగయ్య, మౌనిక, మమత, నాయకులు జానీ పాష, చిందం రఘుపతి, జంగయ్య, పాండు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
దుద్యాల్: మండల పరిధిలోని సంట్రకుంటతండాలో ఆదివారం గ్రామ సర్పంచ్ మాణిక్యనాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి సహకారంతో ఈజీఎస్ నిధులు రూ.5లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవినాయక్, నాయకులు సాల్యనాయక్, రాహుల్నాయక్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు మేలు మోమిన్పేట: పేదల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 56 మంది బాధితులకు రూ.24.96 లక్షల చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పేదలు అనారోగ్యానికి గురైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచులు అశోక్, సుభాష్గౌడ్, సిరాజోద్దీన్, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా మట్టల ఆదివారం మర్పల్లి: మండల పరిధిలోని బూచన్పల్లి, మర్పల్లి తదితర గ్రామాల్లో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ పండుగకు ముందు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాస్టర్ల సమక్షంలో ఈత మట్టలను ప్రత్యేకంగా అలంకరించి ఏసుప్రభు చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. బూచన్పల్లిలో చర్చీ ప్రాంగణం నుంచి ప్రధాన వీధుల గుండా చిన్నారులు చేపట్టిన ర్యాలీ గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో మత పెద్దలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: యువ క్రికెటర్లు క్రమశిక్షణ, కఠినశ్రమ, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అండర్ –19 భారత జట్టు ఆటగాడు అక్షత్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి బ్రాహ్మణపల్లి, జేబీ బృందావన్ కాలనీలోని స్మార్టీ క్రికెట్ అకాడమీలో ఆదివారం నూతన క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మంచి క్రికెటర్లు తయారు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ కొంతం మధుసూదన్ రెడ్డి, ప్రొఫెషనల్ సీనియర్ కోచ్లు ఎస్.మల్లేశ్ యాదవ్, రమేష్ గౌడ్, అజయ్ రైనా, దయానంద్ పటేల్, పలువురు అండర్–19, హెచ్సీఏకి ప్రాతనిధ్యం వహించిన క్రికెటర్లు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాలలో గౌడసంఘం గ్రామ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తిరుమణి రాఘవేందర్గౌడ్ను నియమించారు. అనంతరం అధ్యక్షుడిని సంఘం సభ్యులు సన్మానించారు. -
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇస్తాం
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంచాల: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గుండెమోని మల్లేశ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మతండా గ్రామస్తులు ఆయనను కలిశారు. గ్రామంలో గాడివంపు ప్రాజెక్ట్ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన వారిందరికి పింఛన్లు మంజూరు చేయాలని, సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలను నిధులు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే తండాకు రూ.35 లక్షలకు పైగా నిధులు ఇచ్చామని, మరిన్ని ఇస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్నాయక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమర్ నాథ్, వార్డు సభ్యులు నరేష్ నాయక్, బాలు నాయక్, నాయకులు హరికిషన్ నాయక్, వసురాం, హీరలాల్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పెద్దేముల్లో గ్రామసభ
తాండూరు రూరల్: పెద్దేముల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ చిన్న నర్సిములు అధ్యక్షతన సోమవారం గ్రామ సభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి లాలప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ దుకాణ సముదాయం, తైబజార్, వాటర్ఫిల్టర్ల వేలం నిర్వహిస్తారని తెలిపారు. కావున వేలంలో పాల్గొనేవారు హాజరు కావాలని కోరారు. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేటు భూమిలోకి అక్రమంగా చొరబడి భయబ్రాంతులకు గురి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. నాదర్గుల్ సర్వే నంబర్ 613లో కోహినూర్ వెంచర్లోకి అదే ప్రాంతానికి చెందిన మహేశ్, రాజు, భాస్కర్, ప్రభాకర్, తిరుపతి భాస్కర్, శివప్రసాద్తో పాటు మరి కొందరు ఆదివారం మధ్యాహ్నం చొరబడి సెక్యూరిటీ వారిని బెదిరింపులకు గురి చేశారు. మహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైభవంగా ఉత్సవాలు ప్రారంభం కడ్తాల్: మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో విజయ గణపతి, జ్ఞాన సరస్వతి, సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీశైలం చంద్రశేఖర శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో పాటు, అంగడి మఠం భువనేశ్వర్స్వామి, శివశ్రీ జ్ఞానేశ్వర శాస్త్రి, శ్రీమాన్ శ్రీరంగం అరేష చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ఆలయ ప్రవేశం, మహాగణపతి విశ్వక్సేన ఆరాధన, గౌరిపూజ, పుణ్యాహవాచనం, శివుడి రుద్రాభిషేకం, అఖండ దీపారాధన మహా మంగళహారతి, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు బస్వారాజ్ రాజమణి దంపతులు, అర్చకులు రామశర్మ, నాయకులు సంతోష్, మల్లేశ్, భక్తులు పాల్గొన్నారు. -
తగ్గేదేలె..!
● ఇసుక అక్రమ రవాణాకు ఖాకీల రాచమార్గం ● మామూళ్ల మత్తులో జోరుగా దందా ● ఎక్మాయి, నావంద్గీ నుంచి తరలింపు బషీరాబాద్: ఇసుక అక్రమ రవాణా బషీరాబాద్లో మరింత జోరందుకుంది. వారం రోజుల కిందట పోలీసుల వాహనాన్ని ఇసుక ట్రాక్టర్లతో ఢీకొట్టిన ఘటన తరువాత సైతం అక్రమార్కులు తగ్గేదేలె అంటూ వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సి వారే మామూళ్ల మత్తులో అక్రమార్కులకు రాచమార్గం వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మండలంలో అక్రమ రవాణా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. రాజీ ప్రయత్నం విఫలం మండలంలోని నావంద్గీ దగ్గర కాగ్నా నది, ఎక్మాయి దగ్గర పెద్ద వాగు నుంచి చీకటి పడితే చాలు ట్రాక్టర్ల మోత మోగుతుంది. భవన నిర్మాణాలకు అనుమతి రాకపోవడంతో ఇసుకకు మండలంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్క ఇసుక ట్రాక్టర్ రూ.4 వేల నుంచి రూ.5 వేలు పలుకుతుంది. దీంతో అక్రమార్కులు అడ్డదారి తొక్కుతున్నారు. మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ఆ అధికారితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. సదరు నాయకుడు అక్రమార్కుల తరఫున మాట్లాడి ఇసుక అక్రమ రవాణాకు అనుమతులు ఇప్పిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యే పోలీసు జీపును ఢీకొట్టిన కేసులోనూ రాజీ కుదుర్చేందుకు సదరు నాయకుడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. విషయం మీడియాలో రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. మూడు ట్రాక్టర్లను పట్టించిన గ్రామస్తులు ఎక్మాయి పెద్ద వాగు నుంచి గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి ట్రాక్టర్తో పాటు కంసాన్పల్లి(బి) గ్రామానికి చెందిన వడిచర్ల బస్వరాజ్, హరిజన్ తుల్జప్ప అనే ముగ్గురు ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆదివారం ఉదయం గ్రామస్తులు బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎక్మాయి గట్టు సమీపంలో బస్వరాజ్, తుల్జప్ప ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను, నీళ్లపల్లి సమీపంలో ఎక్మాయి గ్రామ లీడర్కు చెందిన ట్రాక్టర్ను పట్టుకున్నారు. ఈ మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. వీటిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
రోడ్డు నిర్మించాలని నిరసన
ధారూరు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా మూడు నెలలుగా రోడ్డు నిర్మాణ పనులు సాగడం లేదని మండల పరిధిలోని కేరెళ్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఆదివారం తాండూరు–వికారాబాద్ ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి రెండు వైపులా సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఉన్న బీటీ రోడ్డును గతంలో తవ్వేశారు. మూడు నెలలవుతున్నా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాల దుమ్ము ఇళ్లలోకి చేరుతుందన్నారు. వృద్ధులు, చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఆరోపించారు. త్వరితగతిన రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డుపైకి గ్రామస్తులు చేరుకొని వాహనాలను ఆపేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పారు. అనంతరం ట్రాఫిక్ జాంను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. -
తాగునీటికి తండ్లాట
● వారం రోజులుగా నిలిచిన సరఫరా ● పంచాయతీ ట్యాంకరే దిక్కు ● వేసవితాపానికి అల్లాడుతున్న పుర్సంపల్లివాసులు సమస్యను పరిష్కరించాలి గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పొలం దగ్గరకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. అధికారులకు ఫోన్లు చేసి నా స్పందించడం లేదు. స్థానిక అధికారులకు విషయం చెప్తే ట్యాంకరును ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ఎర్రం శ్రీనివాస్, గ్రామస్తుడు, పుర్సంపల్లి కుల్కచర్ల: వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. చౌడాపూర్ మండలం పుర్సంపల్లి గ్రామంలో వారం రోజులుగా తాగునీటి ఎద్దడి కలవరపాటుకు గురి చేస్తోంది. నెలరోజుల నుంచి మిషన్ భగీరథ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వేసవి నేపథ్యంలో గ్రామంలోని బోర్లు సైతం పాడైపోవడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ట్యాంకరు ఒక్కటే దిక్కుగా మారింది. కానరాని భగీరథ అధికారులు ప్రస్తుతం వేసవి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన మిషన్ భగీరథ అధికారులు ఎక్కడా కనిపించడంలేదు. ఫోన్ చేసినా స్పందించడం లేదని మండలప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా చర్యలు కరువయ్యాయి. కనీసం గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని సైతం గ్రహించడంలేదని గ్రామస్తుతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాడైన పోయిన బోర్లు మిషన్ భగీరథ నీరు రాకపోవడం అదేవిధంగా గ్రామంలోని జీపీ బోర్లు పాడవటంతో గ్రామస్తుల ఇబ్బంది మరింత తీవ్రంగా మారింది. తాగేందుకు గ్రామానికి వచ్చే ఫిల్టర్ నీరు తీసుకుంటూ.. అవసరాలకు సమీప పొలాల వెంబడి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక ట్యాంకరు ఏర్పాటు చేసినా అది కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. దాని కోసం మహిళలు కుస్తీలు పట్టుకునే దుస్థితి నెలకొంది. -
మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే
మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నిరంజన్రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నాణ్యమైన ఆహారం తీసుకుంటూ.. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు’ అని ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. డివిజన్లో ఆదివారం మర్రి ఆధ్వర్యంలో శ్యామ్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా 240 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, 2డీఎకో, రక్త పరీక్షలు చేశారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆహార నాణ్యతలేమితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి మరింత ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కలమ్మ జంగయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్, ఇబ్రహీంపట్నం జెట్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్రీశైలం, వైద్యులు రంగరాజ్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి
కొడంగల్ రూరల్: నిరక్షరాస్యులైన మహిళా సంఘం సభ్యులకు ఇటీవల చదవడం, రాయడం, గణితం తదితర అంశాలపై(శిక్షణ) అందించారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో శిక్షణ పొందిన సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. అంగడిరాయిచూర్, రావులపల్లి, పర్సాపూర్ తదితర గ్రామాల్లోని పరీక్ష కేంద్రాలను డీఆర్డీఏ డీపీఎం నర్సిములు పరిశీలించారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 345 మంది మహిళా సంఘాల సభ్యులు 3వ తరగతి పరీక్షలు రాశారని ఏపీఎం గోపాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు అంజమ్మ, సీసీలు బసంత్కుమార్, వాణిశ్రీ, జి.రాములు, అరవింద్, గ్రామాల్లోని బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు. అమ్మకు అక్షరమాల నిర్వహణ అనంతగిరి: అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది కేంద్రాల్లో పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 183 మంది మహిళా సంఘలా నిరక్షరాస్యులు నమోదు చేసుకోగా అందులో 178 మంది పరీక్షలకు హాజరయ్యారని జిల్లా మెప్మా అధికారి గుజ్జరి రవికుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను వయోజన విద్యా జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, మెప్మా టీఎంసీ వెంకటేష్, కో–ఆర్డినేటర్ నటరాజు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరీక్షకు హాజరైన మహిళా సంఘాల సభ్యులు -
అందరికీ చదువు తప్పనిసరి
ఇబ్రహీంపట్నం రూరల్: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి అన్నారు. సెర్ప్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఉల్లాస్ అమ్మకు అక్షరమాల పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంరద్భంగా అన్ని పంచాయతీల పరిధిలో మహిళలకు అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు నేర్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని నాగన్పల్లిలో కార్యక్రమాన్ని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరికీ చదువు తప్పనిసరి అని పేర్కొన్నారు. వేలి ముద్రలు వేయకుండా సంతకాలు చేయాలని సూచించారు. చదువే జ్ఞానం చదువే వెలుగని, గ్రామాల్లో ఎక్కడ చూసినా చదువుకున్న వారే కనిపించాలన్నారు. కనీసం అక్షర అవగాహన ఉంటే మంచిదన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, అశోక్, ఆనంద్, జంగమ్మ, హరిలాల్, వీఓఏలు, గ్రామ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి
తాండూరు: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ను తాండూరు క్వారీ ఓనర్స్, స్టోన్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్కడ లైమ్ స్టోన్, షాబాద్ స్టోన్ భూగర్భ నిక్షేపాలున్నాయని, పరిశ్రమపై ఆధారపడి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. పరిశ్రమను మైనర్ మినరల్ జాబితాలో చేర్చాలని కోరారు. మేజర్ మినరల్లో చేర్చడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మరోవైపు రాయల్టీ, ఇతర పన్నులు కర్ణాటకతో పోల్చితే ఇక్కడి గనులపై అధిక భారం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీని పాత పద్ధతిన కొనసాగించాలన్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.ఇందులో క్వారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, స్టోన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ నయీమ్, ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ సోమాని, అన్వర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి జుబేర్ పాష ఉన్నారు. మంత్రి వివేక్కు అసోసియేషన్ ప్రతినిధుల వినతి -
రాజీపడు.. విముక్తి పొందు
● జిల్లా న్యాయమూర్తి సీహెచ్ చంద్రకిశోర్ ● జిల్లాలో 38,097 కేసుల పరిష్కారం అనంతగిరి: లోక్ అదాలత్లో రాజీపడి.. కేసుల నుంచి విముక్తి పొందాలని జిల్లా న్యాయమూర్తి సీహెచ్.చంద్రకిశోర్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో నిర్వహించిన అదాలత్లో ఆయన మాట్లాడారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించు కోవాలని చెప్పారు. ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా గ్రామాలు, కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 కోర్టుల్లో కలిపి మొత్తం 38,097 కేసులకు రాజీతో మార్గం దొరికిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, ఎస్పీ స్నేహమెహ్రా, పీపీలు మేరాజ్ పెర్దోష్, అన్వేష్సింగ్, సమీనాబేగం, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
ఈత నేర్పించేందుకు వెళ్లి మృత్యువాత
● పిల్లలు చూస్తుండగానే నీట మునిగిన తండ్రి ● పెద్దేముల్ మండలం ఇందూర్లో ఘటన తాండూరు రూరల్: ఈత నేర్పించేందుకు పిల్లలను బావి వద్దకు తీసుకెళ్లిన తండ్రి, వారు చూస్తుండగానే నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఇందూర్ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ జగన్(46), జగ్గమ్మ దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి నలుగురు కూతుర్లు. పెపద్ద కూమార్తె అశ్విని వివాహం జరిగింది. మిగతా ముగ్గురు అక్షిత, అంకిత, శృతిలు ఉన్నారు. వీరిలో అక్షిత పదో తరగతి పరీక్ష రాస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం కుమార్తెలతో గ్రామ శివారులోని ఓ బావి వద్దకు వెళ్లారు. వారిని ఒడ్డున ఉంచి, ఈత ఎలా కొట్టాలో చూపించేందుకు తొలుత జగన్ బావిలోకి దుకాడు. ఎంతకూ అతను బయటకు రాలేదు. దీంతో భయాందోళన చెందిన చిన్నారులు ఇంటికి వెళ్లి కుటుంబీకులకు విషయం చెప్పారు. వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. కొందరు స్థానికులు బావిలోకి దూకి చూడగా.. అప్పటికే జగన్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ యువకుడి మృతి ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. మారుతి షోరూం ఎదురుగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో పల్లపు చరణ్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని మంగళపల్లి చెన్నకేశవ కాలనీకి చెందిన చరణ్ స్థానిక పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కాగా ఆయన బైక్పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతులు చేస్తుండటంతో ఒకవైపు రోడ్డును మూసి ఉంచి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. -
ఆటను ఆస్వాదించాలి
● బెట్టింగ్కు దూరంగా ఉండాలి ● సీఐ రఘుకుమార్ అనంతగిరి: ఆటలను ఆస్వాదించాలే కానీ.. బెట్టింగులకు పాల్పడి జీవితాలను ఆగం చేసుకోవద్దని వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్ అన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అక్రమ మార్గం ఎంచుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్కు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్కు పాల్పడి, డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై.. నేరాల బాట పట్టిన వారు లేకపోలేదన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తుండాలని చెప్పారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే.. 8712670030కు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యక్తి ఆత్మహత్య బంట్వారం: ఆరోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం బంట్వారం మండల పరిధి బొప్పునారంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విమల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య(61), వ్యవసాయం చేసేవాడు. అనారోగ్యంతో చాలాకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మానసికంగా కృంగిపోయిన అంజయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. 169 కేసులు పరిష్కారం ఇబ్రహీంపట్నం: స్థానిక న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 169 కేసులు పరిష్కారమయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో 77, మంచాల పరిధిలో 23, యాచారం పరిధిలో 27, ఫార్మాసిటీ పరిధిలో 8, మాడ్గుల పరిధిలో 34 కేసులు పరిష్కారం అయినట్లు 15వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ప్రవీణ్కుమార్ తెలిపారు. -
గ్రామ పాలనపై దృష్టి సారించండి
అనంతగిరి: గ్రామ పాలన, సీసీ రోడ్లు, ఎన్ఆర్ఈజీఎస్, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామసభల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరెట్లోని సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 2వ తేదీ ప్రతి గ్రామంలో సభ నిర్వహించాలన్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. గ్రామ పాలనను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
నెలాఖరులోగా రుణాలు చెల్లించాలి
ధారూరు/మోమిన్పేట: ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు నెలాఖరులోగా చెల్లించాలి జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టార్ భవానీ విక్రమ్ అన్నారు. లేకుంటే కొత్త రుణాలు వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస వడ్డీతో బంగారంపై రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కావాల్సిన రైతులు సొసైటీ సీఈఓ నర్సింహులును సంప్రదించాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్లో డ్రోన్ కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయరాదన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, హెచ్డీసీసీబీ సూపర్ వైజర్ విజయేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎఫ్పీఓ సభ్యత్వంతో ప్రయోజనం మోమిన్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ప్రతి సభ్యుడూ ఎఫ్పీఓ(ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకోవాలని మోమిన్పేట పీఏసీఎస్ ప్రత్యేకాధికారి మాధవి తెలిపారు. శనివారం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎఫ్పీఓలో రూ.2 వేల రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ.2 వేలు జమ చేస్తుందని తెలిపారు. ఈ మొత్తంతో పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రోన్లు వంటి యంత్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. వాటిని అద్దెకు తీసుకెళ్ల వచ్చని చెప్పారు. సహకార సంఘం నుంచి ఇప్పటికే కామన్ సర్వీస్ సెంటర్ నడిపిస్తున్నట్లు చెప్పారు. త్వరలో డ్రోన్ కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి ఉంచుతామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల విక్రయం ద్వారా రూ.5,67,533 లాభం ఆర్జించినట్లు తెలిపారు. రైతులకు రూ.19.35కోట్ల దీర్ఘకాలిక రుణాలు, బంగారంపై రూ.34 లక్షలు, స్వల్ప కాలిక రుణాలు రూ.18.12 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటి 35 శాతం దీర్ఘకాలిక రుణాలను రికవరీ చేశామన్నారు. ప్రతి సభ్యుడు సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఈఓ శేఖర్, మాజీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్రిజిస్ట్రార్ భవానీ విక్రమ్ -
ఏజెన్సీ రద్దు చేసి.. జీతాలు చెల్లించి
అనంతగిరి: ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి.. నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చరణ్సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమైన ఉద్యోగులను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్సింగ్ మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేరుగా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టి, సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, ఔట్ సోర్సింగ్ జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, నాగేందర్రెడ్డి, వినోద్, దావూద్ పాల్గొన్నారు. మార్కెట్ బీట్ల పరిశీలన ధారూరు: వ్యవసాయ మార్కెట్లో శనివారం నిర్వహించిన బీట్లను ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి పరిశీలించారు. ఉత్పత్తుల కొనుగోలుపై ఆరా తీశారు. శనగలు, పసుపు, వేరుశెనగ, మొక్కజొన్నలు విక్రయించేందుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ, డైరెక్టర్లు అమరేశ్వర్రావు, రవీందర్రెడ్డి, రాములు, కమీషన్ ఏజెంట్లు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు మంచాల: ఫాంహౌస్పై పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలో చేటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. లింగంపల్లి గ్రామంలోని జీఆర్ ఫాంహౌస్లో శుక్రవారం రాత్రి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఇందులో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2.28 లక్షల నగదు, 17 మొబైళ్ల స్వాధీనం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
లక్ష్యాన్ని అధిగమిద్దాం
అనంతగిరి: రబీ సీజన్కు సంబంధించి వరి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అధిగమించాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రావొద్దన్నారు. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున కాంటాలు, గన్నీ బ్యాగులు, ఎప్పటికప్పుడు ధాన్యం రవాణాకు లారీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, పది వేల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్ల సేకరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్కృష్ణ, జిల్లా రవాణా అధికారి వెంకట్రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డీఆర్డీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచుల పాత్ర కీలకం
అనంతగిరి: ఆదర్శ గ్రామ పంచాయతీలే లక్ష్యంగా పాలన సాగాలని కలెక్టర్ దీపక్ తివారి సర్పంచ్లకు సూచించారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లిలో సర్పంచుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. జీపీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత మీపై ఉందన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పంచాయతీల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఇంటి, దుకాణాల పన్నులతో పాటు ఇతర ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు, నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు, సామాజిక రుగ్మతలు, రోడ్ల ప్రమాదాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చర్యలు చేపట్టాన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామంలో సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతుబంధు, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలను చర్చించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీపీఓ జయసుధ, మాస్టర్ ట్రైనీలు(ఎంపీడీవోలు) వినయ్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డ్యూటీ రిజిస్టర్, ప్రశ్న పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, మెడికల్ సిబ్బంది గురించి ఆరా తీశారు. మందులను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఈఓ రేణుకాదేవి, చీఫ్ సూపరింటెండెంట్ రాజు తదితరులు ఉన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి -
చిరువ్యాపారులను ఆదుకోండి
కొడంగల్ రూరల్: రోడ్డు విస్తరణలో డబ్బాలు తొలగించడంతో జీవనోపాధి కోల్పోయిన చిరువారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. చిరు వ్యాపారుల సమస్యలను చైర్మన్కు వివరించారు. స్పందించిన చైర్మన్ బాధితులకు అండగా ఉంటానని, వారం రోజుల్లో కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ను చిరువ్యాపారులు, గుల్షన్ సన్మానించారు. కార్యక్రమంలో ఎండీ సర్తాజ్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, ఎండీ జహంగీర్, ఎండీ అక్తర్, ఎండీ కబీర్, నారాయణ, సుందర్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి ఆస్తి ఇవ్వడం లేదని కొడుకు ఆత్మహత్య
మోమిన్పేట: తండ్రి తనకు ఆస్తి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన ఓ కొడుకు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం కేసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. గ్రామానికి యాదయ్య కుమారుడు నాగరాజు అలియాస్ (నరేందర్) (40) పదిహేనేళ్ల క్రితం ఏపీలోని గుంతకల్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఒంటరిగా గ్రామానికి వచ్చిన నాగరాజు.. తండ్రి పేరున ఉన్న 15 గుంటల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తమ భూమిని, ఇంటిని ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ అలా కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్తిని తిరిగి స్వా«దీనం చేసుకుంటానంటూ శుక్రవారం నోట్ రాసి పంచాయతీ కార్యాలయానికి అందజేశాడు. ఆ తర్వాత శనివారం ఉదయాన్నే మద్యం తాగి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. తండ్రి ఆస్తిని తన పేరున రిజి్రస్టేషన్ చేస్తేనే దిగుతానని, లేదంటే ఇక్కడే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు. అతనితో మాట్లాడిన స్థానికులు భూమి ఇప్పిస్తామని చెప్పినప్పటికీ టవర్పై ఉన్న ఓ తీగతో ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్, ఎస్ఐ భరత్భూషణ్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని దించారు. కొడుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందున ఆస్తి ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో.. నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు.


