Vikarabad
-
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ స్పెషలాఫీర్, అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని వార్డులకు మంజూరైన అభివృద్ధి పనులు, పురోగతి తదితరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధుల కింద కొనసాగుతున్న పనులు, నిలిచిన పనులు, నిధుల విడుదల్లో జాప్యం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్యం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ తదితర విభాగాల పనితీరుపై సమీక్షించామన్నారు. అనంతరం బసవన్న కట్ట వద్ద జంతు వ్యర్థాలను వేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. జనావాసాల నడుమ వ్యర్థాలు వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, చిలుకవాగు కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. కూల్చివేతలకు సహకరించాలి పట్టణ ప్రధాన రోడ్డు పనుల విస్తీర్ణానికి ప్రజలు, చిరు వ్యాపారులు సహకరించాలన్నారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తే నోటీసులు జారీ చేసి తొలగిస్తామన్నారు. పట్టణంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అక్రమ కట్టడాలను తొలగించక తప్పదన్నారు. వంద రోజుల ప్రణాళిక జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రజలు సహకరించాలన్నారు. మెప్మా, మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డుల్లో ర్యాలీ నిర్వహిస్తూ, తడి, పొడి చెత్త, పరిసరాల శుభ్రత, తాగునీటి వినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. వంద రోజుల ప్రణాళికతో సమస్యలు దూరం మున్సిపల్ స్పెషలాఫీసర్, అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ -
పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించండి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: అర్హులైన వారి నుంచి పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో రైతు ఆత్మహత్య కుటుంబాలు, వితంతు పెన్షన్లు అంశాలపై సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓ, రెవెన్యూ విభాగాల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వితంతు పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సాయం పొందేలా దరఖాస్తులు స్వీకరించి ప్రతిపాదనలు పంపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్ సమావేశంలో డీహెచ్ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరి, నేమత్ అలీ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ మహమూద్ అలీ, డీపీఎం నర్సింలు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లోనూ రాణించాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాందార్పూర్లో నిర్వహించిన బీపీఎస్ (బొంరాస్పేట ప్రీమియర్ లీగ్) నిర్వహించారు. తొమ్మిది జట్లలో బొంరాస్పేట్ కెప్టెన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆర్సీబీ బృందం రన్నరప్గా నిలిచింది. ఈ జట్లకు మంగళవారం కప్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, జయకృష్ణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’పై అవగాహన అవసరం
తాండూరు రూరల్: భూ భారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన ఎల్మకన్నె గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రికార్డుల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. భూ మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జత చేసినట్లయితే భవిష్యత్లోనూ భూ వివాదాలకు తావుండదని వివరించారు. చంద్రవంచలో డిప్యూటీ తహసీల్దార్ లలిత ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎల్మకన్నెలో 11 దరఖాస్తులు, చంద్రవంచలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. మ్యుటేషన్, విరాసత్, పాసు పుస్తకంలో రైతు పేర్ల తప్పులు, భూ విస్తీర్ణంలో సవరణపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపి, సిబ్బంది బాబు, నర్సింలు, అంజమ్మ, ప్రవీణ్, యాదయ్య, ఇంతియాజ్, ప్రదీప్, నరేశ్, ఉలేందర్, గోపాల్, మహేందర్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి బలవన్మరణం
దోమ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దోమ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. బాలాపూర్ గ్రామానికి చెందిన బాపురం దస్తయ్య(45) కొద్ది రోజుల క్రితమే కూతురు వివాహం ఘనంగా జరిపించాడు. మామిడి తోటల వ్యాపారం చేకుంటూ, చిట్టీలు నడుపుతూ, చిన్న హోటల్ కొనసాగిస్తున్నాడు. మామిడి, చిట్టీల వ్యాపారంలో నష్టంతో పాటు హోటల్ కూడా సరిగా నడవక ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో మానసింకగా కృంగిపోయిన ఆయన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య వెంకటమ్మ, కూతురు అంజలి, కుమారులు సాయి, హర్ష ఉన్నారు. -
సదస్సులు సద్వినియోగం చేసుకోండి
అనంతగిరి: భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. మంగళవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎర్రవల్లి, ఆలంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా, పీఓపీ, భూ విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, పాస్ పుస్తకాల అందజేత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పారు. సదస్సులో వచ్చిన ఆర్జీల రిజిస్టర్ను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్ మండల పరిధిలోని పెండ్లిమడుగులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్కుమార్, ఎంపీఓ దయానంద్, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపాలి కలెక్టర్ ప్రతీక్జైన్ -
రైతుల సంక్షేమమే ధ్యేయం
నవాబుపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లకొండ రైతు వేదికలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రైతులకు ఉచితంగా జొన్న, వరి, కంది విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మెన్ గీతాసింగ్నాయక్, ఏఆర్ఎస్ తాండూరు శాస్త్రవేత్త యమున, ఏడీఏ శంకర్రాథోడ్, ఏఓ జ్యోతి, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ప్రకాశ్, ఏఈఓలు ఆదిల్, లక్ష్మి, పవన్, మల్లేశ్, రమాదేవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
టీబీ పరీక్షలు తప్పనిసరి
యాలాల: రెండు వారాల పాటు ఎవరికై నా దగ్గు ఉంటే తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని అగ్గనూరు ఆరోగ్య ఉప కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి రుబియానాజ్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. రెండు వారాల పాటు దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాతిలో నొప్పిలాంటి లక్షణాలు కలిగిన 310 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వారికి స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 115 మందికి ఎక్స్రే తీసి వ్యాధిని గుర్తించినట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరునెలల పాటు ఉచితంగా మందులతో పాట పౌష్టికాహారం కోసం నెలకు రూ. వెయ్యి చొప్పున రోగి ఖాతాలో జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ సుశీల, సూపర్వైజర్లు శోభారాణి, పల్లె దవాఖాన వైద్యురాలు భువనేశ్వరి, ఎంఎల్హెచ్పీ వైష్ణవి, టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎంలు వీరమణి, రోజారమణి తదితరులు పాల్గొన్నారు. టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ -
సాగు సలహాలకు రైతు నేస్తం
జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి ధారూరు: రైతులకు సాగు సలహాలు ఇచ్చేందుకు రైతునేస్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం ధారూరు రైతువేదికలో వాతావరణ ఆధారిత సూచనలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు వేర్వేరు రకాల విత్తనాలు పంపిణీ చేశారు. కందిలో ఆశ, జొన్నలో పీవైపీఎస్–2, వరిలో ఆర్ఎన్ఆర్–15048 రకాల విత్తనాలు పంపిణీ చేశారు. వీటిని సాగు చేసే రైతుల పొలాలు తరచూ పరిశీలిస్తూ నాణ్యమైన ఉత్పత్తి వచ్చేలా చేయడం తమ బాధ్యత అని ప్రధాన శాస్త్రవేత్త కె.పవన్చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సూర్యప్రకాశ్, ఏఈఓలు సంతోశ్, సంజూరాథోడ్, మంజుల, మల్లేశ్, హరిప్రసాద్, రైతు నాయకులు పాల్గొన్నారు. -
కొడంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కొడంగల్: కొడంగల్ను రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మైనార్టీ మహిళలకు 2వేల కుట్టుమిషన్లు, ఎనిమిది మంది దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్లు, కడా కార్యాలయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.10వేల కోట్లతో పనులు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాల మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కొడంగల్ ప్రభుత్వాస్పత్రిని టీచింగ్ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన ఘతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడా అధికారి వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్అంబయ్య గౌడ్, నాయకులు ఓబెదుల్లా కోత్వాల్, మహ్మద్ యూసూఫ్, ప్రశాంత్, నయీమ్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ విజయ్కుమార్, మైనార్టీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా
ఇబ్రహీంపట్నం: నల్లకంచె ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తాచాటారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో గీతిక 905, నందు 1,956, అక్షయ 5,761, అనూష 2,504, రమ్య శ్రీ 5,416వ ర్యాంక్ సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థినులను అభినందించారు. మెరిసిన గిరిజన తేజం కేశంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మండల పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన గిరిజన విద్యార్ధిని వి.దీపన్విత ఆల్ ఇండియా 1,248వ ర్యాంక్ సాధించింది. తండాకు చెందిన బాలునాయక్ తన భార్యతో కలిసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. కుతూరు దీపన్విత 1వ తరగతిని తండాలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అనంతరం 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు షాద్నగర్ ఇంగ్లిష్ మీడియం పబ్లిక్ స్కూల్లో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్ను హైదరాబాద్లోని అల్మాస్గూడలో ఉన్న సంకల్ప్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్లో 734 మార్కులను సాధించిన దీపన్విత జేఈఈలో (హల్టికెట్ నంబర్ 256125077) ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు తండావాసులతో అభినందించారు. ఉన్నత చదువులకు దాతలు సహకరించాలని తండ్రి కోరాడు. -
నైపుణ్యం కలిగిన యువతతోనే వికసిత భారత్
శంషాబాద్ రూరల్: దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏమిటో ప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి.. నైపుణ్యం కల్గిన యువతరమే వికసిత భారతానికి బాటలు వేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో సోమవారం శిక్షణార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్టు శిక్షణార్థులు, భూభరతి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపై స్వర్ణ భారత్ ట్రస్టు ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. ఒక పూట అన్నం పెట్టడం కాకుండా.. స్వశక్తితో రోజూ ఆహారాన్ని సమకూర్చుకునేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగా, ధ్యానం, ఆరోగ్యకర ఆహారాన్ని జీవన విధానంగా చేసుకోవాలని సూచించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భూభారతి చట్టంతో సమస్యలు తొలగాలని ఆకాంక్ష -
ఉత్తమ కార్యదర్శిగా నర్సింలు
మోమిన్పేట: మండల పరిధిలోని ఏన్కతల పంచాయతీ కార్యదర్శి నర్సింలుకు ఉత్తమ కార్యదర్శి అవార్డుకు ఎంపికయ్యారు. మండలంలోని మోమిన్పేట, ఏన్కతల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. డీఎస్పీకి వినతిపత్రం అందజేత తాండూరు టౌన్: దళిత యువకుని పెళ్లి బారాత్ను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత నెల 18న బెల్కటూర్లో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. తల్లిదండ్రులు మందలించారని.. మనస్తాపంతో యువకుడి బలవన్మరణం కుల్కచర్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ ఉరేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన ఏముకంటి ఆంజనేయులు(26) తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో గత శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు, బంధువులను ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సోమవారం ఇప్పాయిపల్లి చెరువుకట్ట సమీపంలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి పరిశీలించగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి కుల్కచర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. గ్రామాల్లో శాంతియుత వాతారణం కొనసాగాలన్నా అధికారుల ప్రాత కీలకమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య అన్నారు. సోమవారం తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎస్ఐ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మార్కెట్ కమిటీ డైరక్టర్లు రాంచంద్రయ్య, ఎల్లయ్య, భరత్కుమార్ రెడ్డి, నాయకులు కృష్ణయ్య, వినోద్, శ్రీను, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, గిర్దవారులు ఖాజా, రవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల మండిపాటు కుల్కచర్ల: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రొటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించారని బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు బందయ్య, పార్టీ చౌడాపూర్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం అవతరణ వేడుకల అనంతరం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వరి, కంది విత్తనాల పంపిణీని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఉండటాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో కొంత హడావుడి నెలకొంది. అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి అధికారులు తీరును తప్పుబట్టారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, చెన్నయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా అవతరణ వేడుకలు
యాలాల: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఉదయం 9.30గంటల సమయంలో ఎంపీడీఓ పుష్పలీల జాతీయ జెండా ఆవిష్కరణకు ఇబ్బంది పడ్డారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రొఫెసర్జయశంకర్ సార్ చిత్రపటంతో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచాల్సి ఉండగా.. పాత చిత్రపటాన్నే ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ సైతం విషయం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల తీరుపై కాంగ్రెస్ నేతల గుర్రు ధారూరు: రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మండల పరిధిలో సోమవారం నామమాత్రంగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించకుండానే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సమయపాలన సైతం పాటించలేదని మండల పరిషత్ సముదాయంలో మినహాయిస్తే ఎక్కడా రాష్ట్ర గీతాన్ని ఆలపించలేదని మండిపడ్డారు. అలంకరణకు నోచుకోని కార్యాలయాలు బషీరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అధికారులు నామమాత్రంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఏ ఒక్క కార్యాలయం విద్యుత్ అలంకరణకు నోచుకోలేదు. తహసీల్ కార్యాలయం, మండల మహిళా సమాఖ్య ఎదుట తెలంగాణ తల్లి చిత్రపటం లేకపోవడంతో పక్కనే ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఉంచిన ఫొటో తీసుకువచ్చి ఆవిష్కరణ పూర్తి చేశారు. కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటంతో పాటు పాత తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచారు. పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి చిత్రపటం లేకుండానే జెండావిష్కరణలు చేశారు. మారని తెలంగాణ తల్లి చిత్రపటం.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు -
దుద్యాల్ తహసీల్కు అవార్డుల పంట
దుద్యాల్: తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ తహసీల్దార్గా కిషన్, ఉత్తమ ఉప తహసీల్దార్గా వీరేశ్బాబు, ఉత్తమ ఆర్ఐగా నవీన్, ఉత్తమ సర్వేయర్గా మహేశ్కుమార్ను ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వారిని కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఉత్తమ కార్యదర్శులుగా భాస్కర్, రాజిరెడ్డి కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడపూర్ కార్యదర్శులు భాస్కర్, రాజిరెడ్డి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. భాస్కర్ కుల్కచర్ల ఇన్చార్జి ఎంపీఓగా భాధ్యతలు నిర్వహిస్తుండగా, రాజిరెడ్డి చౌడాపూర్ ఇన్చార్జి ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంపీఓకు ఉత్తమ సేవా అవార్డు యాలాల: మండల పంచాయతీ అధికారి గాలి యాదయ్య సోమవారం ఉత్తమ సేవా అధికారి అవార్డును అందుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్పీకర్ ప్రసాద్కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆయనకు ఈ అవార్డు అందజేశారు. బీసీ బాలికల హాస్టల్ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మికి సైతం అవార్డును అందుకున్నారు. నలుగురికి ఉత్తమ అవార్డులు -
వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
అనంతగిరి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి వీడీడీఎఫ్(వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవెలప్మెంట్ ఫోరం)ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు రూరల్: నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో 60 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు. రాజీవ్ యువ వికాసం, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంగెంకలాన్ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు కూడా వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందు, నాయకులు వడ్డె శ్రీనివాస్, పండరి, శరుణు బసప్ప, రాజ్కుమార్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీ విజేత పెద్దేముల్ తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో బీఎమ్మార్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతగా పెద్దేముల్ జుట్ట, రెండో స్థానంలో గుంతబాసుపల్లి జట్లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యాక్రమంలో టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు రాము యాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దోమ: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని శివారెడ్డిపల్లికి చెందిన షరీఫా బేగం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. సోమవారం నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలను నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విత్తనాల పంపిణీ అనంతరం గ్రామంలోని రైతులకు ఎమ్మెల్యే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, కందులు, జొన్న విత్తనాలను ఏవో ప్రభాకర్ రావు తో కలసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా, ఏఈవోలు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి మంచాల: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. మండల పరిధిలోని ఆగాపల్లిలో నాగార్జునసాగర్– హైదరాబాద్ రోడ్డుపై మంచాల పోలీసులు ఏర్పాటు చేసిన వాహన తనిఖీ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. -
ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ● మున్సిపల్ అభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం తాండూరు టౌన్: ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు అనే నినాదంతో తాండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా, పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పరిరక్షణ, మొక్కలు నాటడం, పట్టణ సుందరీకరణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈఈ ఖాజహుస్సేన్, సిబ్బంది, మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు తదితరులు కార్యాలయం నుంచి ఇందిరాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ధారాసింగ్, మాజీ కౌన్సిలర్లు రత్నమాల, నీరజ, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
కడ్తాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి విద్యారంగాన్ని కాపాడుకుందామని టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల పరిధిలోని అన్మాస్పల్లిలో సోమవారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నిక
● ఇదే బీజేపీ నినాదం ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పరిగి: దేశంలో నిత్యం ఎన్నికలు జరగడం ద్వారా అభివృద్ధి కుంటు పడుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి పట్టణంలో ఒకే నేషన్.. వన్ ఎలక్షన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కోడ్ అమల్లోకి వచ్చి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. వీటన్నంటినీ దృష్టిలో ఉంచుకునే ఒకే సారి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశం ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీతోనే సాధ్య మైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే అర్హులైన వారికి పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ● ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ● పాల్గొన్న ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి వికారాబాద్: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో గ్రామ, పట్టణ, నగరాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి మిషన్కు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జిల్లాలో ఇప్పటి వరకు రూ.20.37 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 5,214 మందికి ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్రంలో ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేనివారు ఉండరాదన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,214 పేదలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకు న్న వారికి రూ.92లక్షలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 1,00,358 రైతులకు రూ.849 కోట్లు రుణ మాఫీ చేసినట్లు గుర్తుచేశారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 2,26,253 మంది రైతుల ఖాతాల్లో రూ.213 కోట్లు జమచేశామన్నారు. సన్న రకం వడ్లు 49,680 క్వింటాళ్లు కొనుగోలు చేసి బోనస్ కింద రూ. 2.48కోట్లు అందజేసినట్లు తెలిపారు. అలాగే 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.104 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో 19,888 లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.11.93 కోట్ల కూలీల ఖాతాల్లో జమ చేసామని తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందితెలిపారు. జిల్లాలో 1,603 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినట్లు వివరించారు.విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని స్పీకర్ ప్రసాద్కుమార్ పేర్కొన్నారు.జిల్లాలోని వికా రాబా ద్, పరిగి ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనట్లు తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 15,188 మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి రూ.41.65 కోట్లు అందజేశామని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. జూన్ 3 నుంచి కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ చట్టం అమలుకు ధారూరును పైలెట్ మండలంగా ఎంపిక చేశారని తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి, గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి 579 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 1,07,525 మంది పింఛనుదారులకు ప్రతి నెలా రూ.26.22 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కలాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద జిల్లాలోని 4,738 మంది లబ్ధిదారులకు రూ.47.43 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లా వ్యాప్తంగా 6,941 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు వీక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అదనపు ఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో వాసుచంద్ర, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దైవచింతనతో మానసిక ప్రశాంతత
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి మర్పల్లి: దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని పట్లూర్లో మూడు రోజులుగా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ముగింపు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని, ఇందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మండల అధ్యక్షుడు రామేశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు బలరాంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దర్శించుకున్నారు. వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ బాల్క్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల మాజీ అధ్యక్షులు ప్రభాకర్, రవిందర్, జిల్లా కార్యదర్శి సంజీవరెడ్డి పాలొన్నారు. -
చెరువులపై నిర్లక్ష్యపు నీడ
● ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం ● తగ్గిన నీటి సామర్థ్యం ● బీడుగా మారుతున్న ఆయకట్టు ● ఆందోళనలో రైతులు కొడంగల్: నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోక బోసిపోయి కనిపిస్తున్నాయి. సాగునీరు లేక ఆయకట్టు భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. పలు చెరువుల కింద వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా పంటలు పండగ పొలాలు నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలో వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. వర్షాధార పంటలపై ఆధారపడి ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది రైతులు బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నారు. కురిసిన కొద్దిపాటి వర్షం నీరైనా చెరువుల్లోకి వచ్చి చేరుతుందా అంటే కష్టమే. నోటీఫైడ్ చెరువులు.. కుంటల్లో మట్టి పేరుకు పోయింది. పాటు కాల్వలకు మరమ్మతులు లేవు. వరద నీరు చెరువుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గంలోని చెరువులకు గతంలో చేసిన పనులు నామమాత్రంగా జరిగాయి. నిజాం కాలంలో నిర్మించిన చెరువులకు మరమ్మతులు చేయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. హస్నాబాద్ చెరువుకు 950 ఎకరాల ఆయకట్టు, కొడంగల్ చెరువుకు 550 ఎకరాల ఆయకట్టు ఉంది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని చెరువులు, కుంటలు నిండటం లేదు. దీంతో పంటలు సాగు చేయడం లేదు. కొడంగల్ మండలంలో 5 నోటీఫైడ్ చెరువులు ఉన్నాయి. వందలాది మంది రైతులకు చెరువుల కింద ఆయకట్టు భూములు ఉన్నాయి. మిషన్ కాకతీయ పనులు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పటికై నా చెరువుల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జెండా ఆవిష్కరించనున్న స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10గంటలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ ప్రతీక్జైన్ పర్యవేక్షించారు. 10.05గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరణ, 10.10గంటలకు స్పీకర్ సందేశం, 10.25గంటలకు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 10.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటలకు గ్రామ పాలన అధికారుల నియామక ఉత్తర్వులు అందజేత, 11.10 గంటలకు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత, 11.20గంటలకు జాతీయ గీతంతో కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. నేటి ప్రజావాణి రద్దు అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వాసులు విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ‘డబుల్’ ఇళ్లు ఇవ్వండి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ అనంతగిరి: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న తమకు డబుల్ బెడ్రూం లేదా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం మున్సిపల్ కార్మికులతో సమావేశమై మాట్లాడారు. మధ్యలో నిలిచిన డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, బుచ్చయ్య, రాములు, లక్ష్మి, నర్సింలు, దశరథ, అనంతమ్మ, జ్యోతి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్తి విత్తనాల పట్టివేత● రూ.7.50 లక్షల విలువ చేసే 300 కిలోల నిషేధిత విత్తనాలు స్వాధీనం ● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు షాద్నగర్: గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేసిన వారిని పోలీసులు పట్టుకొన్న సంఘటన షాద్నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడుకు చెందిన జంపాని నాగేశ్వర్రావు కొంతకాలంగా వికారాబాద్ జిల్లా ద్యాచర్లలో రైతుల వద్ద కొంత పొలాన్ని కౌలు కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పల్నా డు జిల్లా అమరావతి మండలానికి చెందిన వీర వసంతరావు ద్వారా నకిలీ పత్తి విత్తనాలు తెప్పిస్తున్నాడు. మేలైన విత్తనాలు అని నమ్మించి చుట్టు పక్కల ఉండే రైతులకు విక్రయిస్తున్నా డు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి షాద్నగర్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. పట్టణ శివారులోని బక్కర్మన్ గార్డెన్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో నిషేధిత పత్తి విత్తనాలను కారులో తీసుకొచ్చి ముగ్గురు రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారం అందుకున్న షాద్నగర్ వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు నకిలీ విత్తనా లు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న వారిని పట్టుకొన్నారు. వారి నుంచి రూ.7.5లక్షల వి లువ చేసే 300కిలోల నకిలీ విత్తనాలను, కారు ను స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వర్రావు, వీర వసంతరావుతోపాటు వికారాబాద్ జిల్లా ఐయాన్పూర్కు చెందిన రైతు గంగారపు పాండు, దాచారం గ్రామానికి చెందిన టెక్నో సీడ్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాకలి రాములు, ఐనాపూర్కు చెందిన రైతు నెమలి రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో షాద్నగర్ ఇన్చార్జి ఏడీఏ నిషాంత్కుమార్, ఏఈఓ తేజ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్, మేడ్చల్ ఎస్ఓటీ ఎస్ఐ ధనుంజయ పాల్గొన్నారు. -
అనుమతులకు మించి తవ్వకాలు
పరిగి/దోమ: అనుమతులకు మించి అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపిన సాయి కృష్ణ స్టోన్ క్రషర్స్పై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రషర్లో పనిచేస్తున్న ఆరుగురిని రిమాండ్కు తరలించారు. పరిగి సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి శివారులో సర్వే నంబర్ 173లో దోమ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, కిష్టాపూర్కు చెందిన నాగిరెడ్డి పది ఎకరాలకు లీజు తీసుకుని మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో మే 21న సర్వే చేసిన అధికారులు 1.1 ఎకరాల్లో అదనంగా తవ్వకాలు జరిపి రూ.2కోట్ల వరకు ఆర్జించినట్లు గుర్తించారు. మే 31న తాండూర్ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అధికారి సత్యనారాయణ, దోమ డిప్యూటీ తహసీల్దార్ పోలీసు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆందోళన చెందిన క్రషర్ నిర్వాహకుడు రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపిన చోట పూడ్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మూడు హిటాచీలు, ఓ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు క్రషర్ యజమాని కొప్పల నాగిరెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. క్వారీలో పనిచేస్తున్న శ్రీశైలం, సుజిత్కుమార్ మెహతా, ఎండీ ఆజాద్, ప్రకాశ్కుమార్, సురేశ్సింగ్, రామకృష్ణను రిమాండ్కు తరలించామన్నారు. నాగిరెడ్డితో పాటు పలువురు పరారీలో ఉన్నారని వారి జాడకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దోమ ఎస్ఐ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడిపై కేసు ఆరుగురికి రిమాండ్ వివరాలు వెల్లడించిన పరిగి సీఐ శ్రీనివాస్రెడ్డి -
బీటీ రోడ్డుకు బ్రేక్!
యాలాల: మండల పరిధిలోని అడాల్పూర్ గ్రామానికి వేస్తున్న బీటీ రోడ్డు పనులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న మెటల్ రోడ్డు మార్గం అటవీశాఖ పరిధిలోని వస్తోందంటూ ఆ శాఖ అధికారులు పనులను అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రూ.2.30 కోట్ల నిధులు మంజూరు అడాల్పూర్కు వెళ్లేందుకు తాండూరు మండలం బిజ్వార్ శివారు నుంచి రాకపోకలకు ఉన్న మార్గంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం మీదుగా ఉంది. ఈ క్రమంలో 2012లో మెటల్ రోడ్డు నిర్మించారు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో ఈ మార్గం మీదుగా వెళ్లేందుకు గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో పంచాయతీ రాజ్ శాఖ నుంచి 3.25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గాను రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇదే మార్గంలో ఐదు చోట్ల కల్వర్టులున్నాయి. ఇటీవల కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి వచ్చి పనులు నిలిపివేయించారు. దీంతో గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి సమస్య వివరించి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. దరఖాస్తు చేసుకోవాలని సూచించాం బిజ్వారం శివారు నుంచి అడాల్పూర్ వరకు వేస్తున్న రోడ్డు అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. దీంతో 1.67 కిలోమీటర్ల భూభాగం కోల్పోతున్నాం. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని నాలుగు నెలల క్రితమే గ్రామస్తులకు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సూచించినా వారు పట్టించుకోలేదు. ఇప్పటికే అడాల్పూర్ నుంచి షేక్పీర్ల గుట్ట మీదుగా కమాల్పూర్ వరకు ఉన్న రోడ్డు సైతం అటవీశాఖ పరిధిలోనిదే. ఈ విషయంలో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనుమతి కోరుతూ నివేదిస్తే రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అనుమతులు వచ్చాక బీటీ రోడ్డు పనులు చేపట్టవచ్చు. – రాజేందర్, ఫారెస్టు రేంజ్ అధికారి నిలిచిన అడాల్పూర్ రోడ్డు నిర్మాణం అటవీశాఖ పరిధిలోకి వస్తుందని అడ్డుకున్న అధికారులు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని సూచన ఆందోళనలో గ్రామస్తులు -
ప్రారంభం కాని సరఫరా
యాలాల: మూడు నెలల రేషన్ ముందే పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆదివారం నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాలాల మండలంలో మాత్రం మొదటి రోజున బియ్యం పంపిణీ చేయలేదు. మండల పరిధిలో మొత్తం 36 రేషన్ దుకాణాలు ఉండగా జూన్కు సంబంధించిన బియ్యం కోటా ముద్దాయిపేట, రేళ్ల గడ్డ తండాకు మాత్రమే స్టాక్ పాయించట్ నుంచి రేషన్ దుకాణానికి చేరింది. మిగిలిన రేషన్ షాపులకు బియ్యం సరఫరా జరగకపోవడంతో లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభం కాలేదు. కాగా మూడు నెలల కోటాకు సంబంధించిన నిల్వ ఉంచుకునే ప్రదేశం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కోటాకు సంబంధించి ఈపాస్ మిషన్ నుంచి లబ్ధిదారుల వివరాల సేకరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డీలర్లు పేర్కొంటున్నారు. -
చదువుతోనే ఉన్నత శిఖరాలు
అనంతగిరి: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ అధ్యక్షుడు నూలి బస్వరాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం వికారాబాద్లో వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వీరశైవ జంగమ, లింగాయత్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో చదువుతోనే అన్ని సాధ్యమన్నారు. పోటీ ప్రపంచంలో టాప్ స్థాయిలో రాణిస్తేనే అవకాశాలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు కష్టపడి 500 పైగా మార్కులు సాధించడం గొప్ప విషయమన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించేవరకు విశ్రమించవద్దన్నారు. కష్టపడి చదివితే విజయం తప్పక వరిస్తుందన్నారు. విద్యార్థులకు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంచి స్థాయిలో స్థిరపడి తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, వీరశైవ సమాజం అధ్యక్షుడు అప్ప విజయ్కుమార్, కార్యదర్శివిద్యాసాగర్, బిచ్చప్ప, వీరకాంతం, విశ్వంపంతులు, యువదళ్ అధ్యక్షుడు కోటిలింగం, సభ్యులు వసంత్, అమర్, భాను, సుధీర్పటేల్, రాజేష్, బసవేశ్వర్, శంకర్, సంతోష్, ధన్శెట్టి తదితరులు పాల్గొన్నారు. జగజ్యోతి బసవేశ్వరవిద్యా సంస్థ అధ్యక్షుడు బస్వరాజు -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నవాబుపేట: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా ఇచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గంగ్యాడలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాది పేదల ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవిందమ్మ, నాయకులు మల్లేశం, రామచంద్రారెడ్డి, దాసుగౌడ్, కిష్టయ్య, మాణిక్యం, జంగయ్య, విట్టల్, నర్సింలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
యాలాల: మండలంలోని జుంటుపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. ఈ విషయమై ఆదివారం కాంగ్రెస్ నాయకులు కేంద్రం వద్ద కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు రైతులకు ముందస్తుగా 60 వేల గన్నీ బ్యాగులు అందించారన్నారు. తేమ శాతం ఉన్న 38 వేల బ్యాగుల వరి ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించిన ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేష్కుమార్, ఆశప్ప, ఆంజనేయులు, శాంతుకుమార్, రాంచందర్, ఎల్లప్ప పాల్గొన్నారు. -
అవయవదానానికి ముందుకు రావాలి
కేశంపేట: సమాజంలో ప్రతిఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని ఆల్ ఇండియా ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సోంటే శ్రీనివాస్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గుడూరు సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అవయవాలను దానం చేస్తున్నట్టు అంగీకారపత్రాన్ని గాంధీ మెడికల్ ప్రిన్సిపాల్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలను వదిలిపెట్టి మానవత దృక్పథంతో అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. మరణించిన తర్వాత శరీరాన్ని పూడ్చిపెట్టడం, కాల్చి వేయడంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందుకే అందరూ మరణాంతరం అవయవదానానికి ముందుకు రావాలని సూచించారు. -
‘జయ గ్రూప్స్’పై చర్యలు తీసుకోవాలి
పంజగుట్ట: తమ వద్ద ప్రీ లాంచింగ్ ఆఫర్లో ప్లాట్లు తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తామంటూ అందంగా బ్రోచర్లు ముద్రించి వందలాది మంది నుంచి దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన జయత్రి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (జయ గ్రూప్స్) సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు వర్మ కుమార్, మూర్తి శ్రీనివాస్, ప్రసాద్ శివపురం, గణేష్, ఫణిలు మాట్లాడుతూ .. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మరో 19 మంది డైరెక్టర్లతో కలిసి 2021 ఫిబ్రవరిలో కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేస్లో అన్ని హంగులతో కార్యాలయం ఏర్పాటు చేశారని మొదటి వెంచర్గా హిల్టన్ జయ డైమెండ్ పేరుతో వెంచర్ ప్రారంభించినట్లు తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తమకు పదేపదే ఫోన్లు చేసి చందానగర్ లోని గోపనపల్లిలో తక్కువ ధరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారన్నారు. కార్యాలయానికి వెళ్లగా హంగు, ఆర్భాటాలతో పాటు దాదాపు వంద మందికి పైగా ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారన్నారు. సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మి రూ. 20 లక్షల నుంచి రూ.1.80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టామన్నారు. రెండేళ్లలో ప్లాట్లు అప్పగిస్తామని చెప్పారని. గడువు ముగిసిన తర్వాత అడిగితే నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో తమకు చూపించిన స్థలం వద్దకు వెళ్లి ఆరా తీయగా సదరు ప్రాజెక్టు వేరే సంస్థకు చెందినదిగా తెలుసుకుని నివ్వెరపోయామన్నారు. మద్య తరగతికి చెందిన తాము పైసాపైసా కూడబెట్టుకుని ప్లాట్లు కోసం వెచ్చించామన్నారు. ఇదే సంస్థ గతంలో రాజమండ్రిలోనూ ఇదేతరహాలో మోసం చేసినట్లు తెలిసిందన్నారు. నిందితుడు కాకర్ల శ్రీనివాస్, మరో ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రస్తుతం బెయిల్పై దర్జాగా తిరుగుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు, ఈడీ కార్యాలయంలో, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సంస్థ బాధితుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో నిండా ముంచారు రూ.300 కోట్లకు పైగా వసూలు న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు -
సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం అపహరణ ఇబ్రహీంపట్నం: కూరగాయల కోసమొచ్చిన వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని ఓ దుండగుడు అపహరించుకొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(65) ఇబ్రహీంపట్నంలోని మార్కెట్కు ఆదివారం ఉదయం వచ్చింది. అక్కడ కూరగాయలు తీసుకొని తలపై పెట్టుకొని వెళుతుంది. ముఖానికి మంకి క్యాప్ ధరించిన దుండగుడు నడుచుకుంటూ వచ్చి ఆమె తలపై సంచిని కిందపడేసి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక ఏసీపీ కేపీవీ రాజు, సీఐ జగదీశ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మహిళ అదృశ్యం యాచారం: కూలీ పనికంటూ ఇంటి నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన దండుగుల శేఖర్ భార్య మమత(29) గత నెల 30న ఉదయం 7 గంటలకు కూలీకి పోతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లోని బంధువుల ఇళ్లల్లో వెతికినా జాడ లేదు. ఆదివారం మమత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్ ఒకరి దుర్మరణం ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. ముర్తుజపల్లి గేటు వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన రాయకుంట కృష్ణయ్య(35), ఆయన బంధువు శేఖర్ పని నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యలో పట్టణ సమీపంలోని ముర్తుజపల్లి గేటు వద్ద అతివేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శేఖర్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెరువులో మునిగిన యువతి! ఇబ్రహీంపట్నం: చెరువులోకి దిగిన యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నగరంలోని ఫలక్నుమాకు చెందిన రేష్మా(24) బాలపూర్కు చెందిన ఆమె స్నేహితుడు ఖాసీంతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు ఆటోలో వచ్చినట్లు తెలిసింది. ఖాసీం ఈత కొడుతుండగా రేష్మా కూడా చెరువులోకి దిగినట్లు సమాచారం. ఏమైయిందో ఏమోగాని ఆకస్మాత్తుగా యువతి చెరువు నీటిలో మునిగిపోయింది. చీకటి పడటంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాల పేరుతో టోకరా నిందితుడి అరెస్టు రాంగోపాల్పేట్: కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి బాపూజీనగర్కు చెందిన శ్రవణ్కుమార్ అమాయకులను ఎంచుకుని కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. 2009 నుంచి 2024 వరకు బేగంపేట, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీలేఖ అనే మహిళ నుంచి రూ.22వేలు తీసుకుని ఫుడ్ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. పవన్ అనే వ్యక్తి నుంచి రూ.35వేలు, విశాల్ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు, మరో వ్యక్తి నుంచి రూ.35వేలు, వేములవాడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకుని కంటోన్మెంట్ బోర్డులో ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు డిఫెన్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అత డిని ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీసులు అప్పగించారు. -
వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
అనంతగిరి: జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పట్టణంలోని అమర వీరుల స్తూపాన్ని, సభాస్థలి వేదికను పూలతో అందంగా అలంకరించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, నూతన రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ, గ్రామ పంచాయతీ అధికారులకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓ రేణుకాదేవికి సూచించారు. స్పీకర్ ప్రసాద్కుమార్ చేతులమీదుగా పతాకావిష్కరణ చేపట్టనున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అదనపు ఎస్పీ టి.వి.హనుమంత్ రావు, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ రాష్ట్ర అవతరణ వేడుకలపై అధికారులకు దిశానిర్ద్ధేశం -
కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం
పూడూరు: తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకుడు, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్పై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించరాదని హితవు పలికారు. బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, మాజీ అధ్యక్షుడు అనిల్, నాయకులు శ్రీశైలం, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి -
నో స్టాక్..!
శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో ఎరువుల కొరత ● ఫెర్టిలైజర్ దుకాణాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు ● దగ్గరపడుతున్న విత్తు సమయం ● ఆందోళనలో అన్నదాత 10లోuవికారాబాద్: జిల్లాలో ఎరువుల కొరత రైతన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫెర్టిలైజన్ దుకాణా ల్లో ఎరువుల కొరత ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సారి వర్షాలు ముందుగానే పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా విత్తుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కొనుగోలుపై దృష్టి సారించారు. ప్రస్తుత సీజన్కు అవసరమైన ఎరువుల్లో 15 శాతం కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం దుక్కి ఎరువుగా వాడాల్సిన డీఏపీ కొరత తీవ్రంగా ఉంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. అవసరం కొండంత.. ఉన్నది గోరంత జిల్లాలో ఎరువుల అవసరం కొండంత ఉంటే ఉన్నది మాత్రం గోరంతే. సాగుకు సరిపడా విత్తనాలు ఉండటం రైతులకు కొంత మేర ఉపశమనం కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్లో 5,61,719 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు 1,13,851 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 14,429 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత సీజన్కు 39,898 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 8,088 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. డీఏపీ 27,516 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 2,408 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంఓపీ 8,585 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 173 మెట్రిక్ టన్నులే ఉంది. కాంప్లెక్స్ ఎరువులు 35,305 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 3,530 మెట్రిక్ టన్నులు ఉంది. ఎస్ఎస్పీ ఎరువులు 2,547 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 230 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5.61లక్షల ఎకరాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.61లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయా పంటలు సాగు చేయవచ్చునని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతేడాది 2.57లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈ సారి 2.58 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందరి అంచనా వేసింది. వరి 1,31,075 ఎకరాల్లో, కందులు 1.10లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 26,908 ఎకరాల్లో సాగు చేయవచ్చని భావిస్తున్నారు. పెసలు 14,568 ఎకరాలు , మినుములు 5,716 ఎకరాలు జొన్నలు 2,572 ఎకరాలు, సోయాబీన్ 2,043 ఎకరాలు, ఇతర పంటలు 7275 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న, జీలుగ, జనుము, సోయాబీన్, కంది విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఫెర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో అవసరం మేరకు పత్తి విత్తనాలు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు ఆయా పంటలకు సంబంధించి 41,297 క్వింటాళ్ల విత్తనాలు, 5,16,426 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూస్రీల్ జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,61,719 ఎకరాలు అవసరమైన ఎరువులు 1,13,851 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 14,429 మెట్రిక్ టన్నులు అవసరమైన విత్తనాలు 41,297 క్వింటాళ్లు ప్రభుత్వానికి నివేదించాం ప్రస్తుత సీజన్కు ఏ మేరకు విత్తనాలు,ఎరువులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. సాగుకు సరిపడా విత్తనాల ను అందుబాటులో ఉంచాం. డీఏపీ కొంత మేర కొరత ఉంది. ఈ విషయా న్ని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రజలను చైతన్య పరచాలి
డీఈఓ రేణుకాదేవి అనంతగిరి: మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ఉపాధ్యాయులు తమ వంతుగా ప్రజలను చైతన్య పరచాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం వికారాబాద్లోని డైట్ కళాశాలలో కస్తూర్బా గాంధీ, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఉపాధ్యాయులు మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించాలన్నారు. మానవ అక్రమ రవాణా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100, 181, 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్వ చ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, సుప్రియ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగు పర్చుకోవాలి పూడూరు: ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మెరుగు పర్చుకుని బోధన చేయాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ వీరయ్య, కోర్సు డైరెక్టర్ సాయిరెడ్డి, మానిటరింగ్ అధికారి రామ్ మస్తాన్, సెక్టోరియల్ అధికారి రమేష్, డీఆర్పీలు రవికుమార్, బాల్రాజ్ పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
● వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర ● అమ్మవారి సేవలో ప్రముఖులుతాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్లో కొలువు దీరిన రేణుక ఎల్లమ్మ జాతర నెల రోజులగా వైభవంగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం, సిడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ నవీన్రెడ్డి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తెచ్చారు. సిడేను పూలతో అందంగా అలంకరించారు. రథోత్సవం, సిడే ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి, ఫైనాన్స్ కమిటీ సభ్యుడు రమేష్ మహరాజ్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ విఠల్రెడ్డి, ఏఎస్ఐలు రాజశేఖర్, పవన్కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఆలయ ఈవో శేఖర్ గౌడ్, మాజీ చైర్మన్ సందీప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: కాంగ్రెస్ అంటే పేదలు, రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్, మాజీ సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పరమేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మి,రెడ్డి, నాయకులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గానికి ఇరువైపులా వ్యాపారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. తాండూరు మీదుగా 167 (ఎన్) నేషనల్ హైవే వెళ్తుండటంతో ప్రధాన రోడ్డును ఇందుకు అనుగుణంగా విస్తరించనున్నారు. పనులు ఆలస్యం కావడంతో సదరు వ్యాపారులు ఇష్టానుసారంగా అనుమతి లేని చోట అక్రమంగా షెడ్డు, మెట్లు ఇతర కట్టడాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ అఽధికారులు పోలీసుల సహాయంతో కట్టడాలను కూల్చేశారు. తాండూరు బస్టాండు నుంచి చించోళి రోడ్డు మార్గంలో సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేందుకు సమాయత్తమయ్యా రు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు అధికారుల తీరును తప్పు పట్టారు. ఏమాత్రం సమయం ఇవ్వకుండా హుటాహుటిన కూల్చేయడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారమే అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎన్ఎంఆర్పై సమీక్ష అనంతగిరి: ప్రభుత్వ విభాగాల్లో వేతన సవరణ కమిటీ పరిగణనను బట్టి దినసరి కార్మికులకు జీత భత్యాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నాన్ మాస్టర్ రోల్ ఉద్యోగ వేతన స్థిరీకరణ (ఎన్ఎంఆర్)పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న హాజరు పట్టిక(ఎన్ఎంఆర్)లో లేని కార్మికులకు వేతన సవరణ కమిటీ సిఫారసు మేరకు కనీస వేతనాలను అందించాలన్నారు. నైపుణ్యం, నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం కలిగిన దినసరి కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాల పెంపునకు అనుగుణంగా అందించాలన్నారు. గ్రామీణ, మున్సిపల్ పరిధిల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వాల్యా నాయక్, డీహెచ్ఎస్ఓ సత్తార్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, విద్యుత్ శాఖ ఎస్ఈ రవి ప్రసాద్, డీబీసీడీఓ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు కేంద్రం అండ మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజీగూడ, రెడ్డిపల్లి గ్రామాల కిసాన్ కవన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సహకారంతో రైతులకు మందులు పిచికారీ చేసే సమయంలో వేసుకునే కిట్లు పంపిణీ చేశారు. -
అభివృద్ధిలో అగ్రగామి
● రూ.10 వేల కోట్లతో పనులు ● శరవేగంగా నిర్మాణాలు ● సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కొడంగల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ.10 వేల కోట్లతో నియోజకవర్గం దశ దిశ మార్చేలా పనులు సాగుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు మొదటి ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ, జూనియర్ కళాశాలలు మంజూరు చేశారు. కొడంగల్ పట్టణంలో 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రి పనులు చకచకా సాగుతున్నాయి. రూ.6 కోట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణ పనులు ఊపందుకున్నాయి. అభివృద్ధి పనుల్లో వేగం పెంచినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి తెలిపారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్
అబ్దుల్లాపూర్మెట్: నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయించి రైతులను మోసం చేసే డీలర్లపై కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తానమి వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అధీకృత డీలర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. డీలర్లు విధిగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారిణి పల్లవి, ఎస్ఐ భద్యానాయక్, డీలర్లు పాల్గొన్నారు. రైతులకు రసీదులు ఇవ్వాలి మహేశ్వరం: ఎరువులు, విత్తనాల దుకాణాదారులు రైతులకు అధిక ధరలకు విక్రయించరాదని మహేశ్వరం వ్యవసాయ శాఖ ఏడీఏ సుధారాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల దుకాణాదారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల డీలర్లు స్టాక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అనుమతిలేని మందులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవపాయాధికారి నాగమణి, డివిజన్ టెక్నికల్ అధికారి యాదగిరిగౌడ్, డీలర్లు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ సుజాత -
నర్సింగ్ హోం సీజ్
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో చేవెళ్లలోని విజయ్ నర్సింగ్ హోం (ప్రజావైద్యశాల)ను వైద్యాధికారుల బృందం శుక్రవారం సీజ్ చేసింది. మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కల్లెంల నర్సింలుకు విజయ్నర్సింగ్హోంలో ఆపరేషన్ చేశారు. వైద్య వికటించడంతో ఆయన గురువారం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనల చేపట్టారు. వైద్యాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారులు చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ వైద్య బృందాన్ని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నర్సింగ్ హోంకు వచ్చిన అధికారులు ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించారు. ఫోన్ సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో వైద్యాధికారుల బృందం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారుల విచారణ పూర్తయ్యే వరకు తాళం తీయొద్దని హెచ్చరించారు. గతంలోనూ ఈ నర్సింగ్హోంను వైద్యాధికారులు తనిఖీ చేసిన సమయంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని నోటీసులు జారీ చేసిన ఇప్పటీ వరకు స్పందించలేదన్నారు. ఈ తనిఖీల్లో మొయినాబాద్ వైద్యాధికారి అన్నపూర్ణ. చేవెళ్ల సబ్సెంటర్ వైద్యురాలు వేదశ్రీ తదితరులు ఉన్నారు. -
డీసీఎం ఢీకొని రైతు దుర్మరణం
నవాబుపేట: మద్యం మ త్తులో వాహనం నడిపిన డీసీఎం డ్రైవర్ ఓ రైతు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలోని వట్టిమీనపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్కుమార్, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల కిష్టయ్య(54) మధ్యాహ్నం పశువులను మేపేందుకు పొలానికి వెళ్తున్నాడు. శంకర్పల్లి నుంచి మద్యం మత్తులో డీసీఎంను నడుపుతున్న డ్రైవర్ రైతును ఢీకొట్టాడు. దీంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన రైతులు వాహనాన్ని వెంబడించగా మరింత వేగంగా వెళ్లి పులుమామిడి గేటు వద్ద కల్వర్టుని ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లి వాహనం నిలిచిపోయింది. డ్రైవర్ను పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య స్వరూప, కొడుకు మల్లేశ్, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తునికాకు కూలీలకు తిప్పలు
ధారూరు: పేదలకు తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరు. నలభై రోజులు అడవిలో తునికాకు సేకరించి కళ్లాల్లో విక్రయించిన కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంతో శుక్రవారం వారు నిర్వాహకుల ఇళ్లను ముట్టడించారు. దీంతో సదరు నిర్వాహకులు ఫారెస్ట్ అధికారుల వద్దకు పరుగులు తీశారు. మండల పరిధిలోని పలుగ్రామాల కూలీలు ఏప్రిల్ 21 నుంచి మే 30 వరకు 3,04,600 తునికాకు కట్టలు సేకరించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కళ్లాల్లో విక్రయించారు. ఇందుకు సంబంధించి ఒక్కో కట్టకు రూ.3.30 చెల్లించాల్సి ఉంటుంది. నాటి నుంచి కాంట్రాక్టర్ చెల్లిస్తాడని నిర్వాహకులు, ఫారెస్ట్ అధికారులు చెల్లిస్తారని కాంట్రాక్టర్ బదులిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి రూ.10.05లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూలీల బ్యాంకు ఖాతాలు తీసుకుని వివరాలు ఆన్లైన్ చేశామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. తమకు పోషణ భారమైందని అధికారులు త్వరితగతిన తమ డబ్బులు జమ చేయాలని కూలీలు కోరుతున్నారు. కూలి డబ్బుల చెల్లింపులో జాప్యం నిర్వాహకుల ఇళ్లను ముట్టడించిన కూలీలు -
సంత.. సమస్యల చింత
పరిగి: పట్టణంలోని మార్కెట్ యార్డులో ప్రతీ శుక్ర, శనివారం సంత కొనసాగుతుంది. ఇక్కడకు వచ్చే రైతులు, ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎటు చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. మార్కెట్ యార్డుకు ధాన్యం, కూరగాయాలు ఇతర పనులపై వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. లక్షల్లో ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పరిగి దోమ, కుల్కచర్ల, పూడూర్, బొంరాస్ట్ తదితర మండలాల నుంచి రైతులు, వ్యాపారస్తులు ప్రతదీ శుక్రవారం, శనివారాల్లో సంతలో ధాన్యం, కూరగాయల క్రయ, విక్రయాలకు వస్తుంటారు. ఇందుకు మార్కెట్ కమిటీకి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పశువుల సంతలో పశువులు కొనుగోలు చేసిన, అమ్మినా రైతులు, వ్యాపారస్తులు మార్కెట్కు డబ్బులు చెల్లించాలి. ఇలా వచ్చే సొమ్ములోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే అపవాదు లేకపోలేదు. కంపు కొడుతున్న మార్కెట్ యార్డు మార్కెట్ యార్డుతో ఎక్కడ చూసినా కంపు కొడుతోంది. మార్కెట్కు కూరగాయలు తెచ్చే రైతులు, వ్యాపారస్తులు కుల్లిన కూరగాయలు వదిలి వెళ్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. మార్కెట్ ఆదాయంపై దృష్టి సారిస్తున్న అధికారులు పారిశుద్ధ్య పనులపై అలసత్వం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమాచారం ఇచ్చినా కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆదాయం దండి మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తున్నా.. అధికారులు మౌలిక వసతలు కల్పన, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టడం లేదు. ధాన్యం విక్రయంలోనూ మార్కెట్ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కొంత మంది వ్యాపారస్తులతో కుమ్మకై ్క చిట్టీలు లేకుండానే పశువుల క్రయ, విక్రయాలు చేపట్టి మార్కెట్ ఆదాయానికి గండి కొడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో చిత్తడిగా మారిన మార్కెట్ యార్డు ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకోని పాలకులు అధికారులు పట్టించుకోవట్లే.. రైతులు క్రయ విక్రయాలు చేస్తేనే మార్కెట్కు ఆదాయం సమకూరుతుంది. కానీ రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పరిగి మార్కెట్ యా ర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోట్లలో ఆదాయం సమకూరుతు న్నా మార్కెట్ యార్డు అపరిశుభ్రంగానే ఉంటుంది. – మల్లేష్, రైతు, మిట్టకోడూర్ -
నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు
పూడూరు: రైతులకు నాసిరకమైన విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కుత్బుల్లాపూర్లో రైతులు కొనుగోలు చేసిన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు. గడ్డి మందును తట్టుకునే పత్తివిత్తనాల వల్ల నష్టాల గురించి రైతులకు వివరించారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రశీదులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ అధికారి లక్ష్మికుమారి, మండల అధికారి తులసీరాం, చన్గోముల్ ట్రైనీ ఎస్ఐ ప్రవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్రెడ్డి -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
షాద్నగర్రూరల్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోగల బీబీజీ వెంచర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ దేవరాజ్ తెలిపిన ప్రకారం.. బీబీజీ వెంచర్లోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(28) మృతదేహం ఉన్నట్లు వెంచర్ నిర్వాహకులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, ఎముకలు తేలిపోవడం చూస్తుంటే 10 రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా..? గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంచర్ సూపర్వైజర్ ఇంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి అదృశ్యం పహాడీషరీఫ్: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పహాడీషరీఫ్కు చెందిన షేక్ మహబూబ్(70), షానవాజ్ బేగం దంపతులు దర్గా వద్ద నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా మహబూబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల క్రితం చివరగా కుమారుడు ముజఫర్తో ఫోన్లో మాట్లాడిన మహబూబ్ అనంతరం అందుబాటులోకి రాలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ముజఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి ఓయూలో తరగతులు ప్రారంభం ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్తో పాటు అనుబంధ, ప్రైవేటు కాలేజీలలో జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల వేసవి సెలవుల అనంతరం తిరిగి తరగతులను పునఃప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ క్యాంపస్లో కాలేజీలతో పాటు హాస్టల్స్, మెస్సులను కూడ పునఃప్రారంభించనున్నారు. అప్పు తీసుకుని చెక్కేశాడు ● ఇద్దరు మహిళల పేరుతో రూ. 25 లక్షల రుణం ● యువకుడిపై కేసు నమోదు వెంగళరావునగర్: ఓ వ్యక్తి ఇద్దరు మహిళల పేరున రూ.25 లక్షలు రుణం తీసుకుని మోసం చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదగిరినగర్కు చెందిన యూ ట్యూబర్గా పని చేస్తోంది. ఆమెకు పరిచయస్తురాలైన నాగరాణి అనే యువతి గత ఏడాది రాజశేఖర్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. అతను దీవెనకు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ అడిగి ప్రతినెల రూ. 20 వేలు నగదు డిపాజిట్ చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన స్నేహితురాలు నవజ్యోతికి వివరించి ఇద్దరి నెంబర్లు ఇస్తామని, ఇరువురికీ నగదు వేయాలని రాజశేఖర్ను కోరింది. అందుకు అంగీకరించిన అతను వారి నుంచి ఆధార్కార్డులు, వేలిముద్రలు, తీసుకుని వారి పేరున బ్యాంక్ ఖాతాలు తెరిచాడు. మూడు నెలల పాటు ఆయా అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసిన అతను, నాలుగో నెల వేయలేదు. దాంతో వారు బ్యాంకులకు వచ్చి ఆరా తీయగా దీవెన పేరున రూ. 10 లక్షలు, నవజ్యోతి పేరుతో రూ. 15 లక్షలు రుణం తీసుకున్నట్లుగా తెలిసింది. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు రాజశేఖర్పై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీలో చోటులేదు
ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కుంభకోణాలు చేసేవారికి అనంతగిరి: కుంభకోణాలు చేసే వారికి బీజేపీలో చోటు ఉండదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ రాజశేఖర్రెడ్డి అభినందన సభను గురువారం పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయ న కూతురు కవిత కాంగ్రెస్లోకి వెళ్తుందని, కొడుకు కేటీఆర్ బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలపై స్పందించారు. లిక్కర్ స్కాం, ఫార్ము లా ఈ రేస్ వంటి కేసుల్లో ఇరుక్కున్న వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ఎద్దేవా చే శారు. మనమంతా కష్టపడి పని చేస్తే భవిష్యత్లో జిల్లాలోని మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రధా ని మోదీ నిజమైన దేశభక్తి కలిగిన నాయకుడన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. జిల్లాలో అందరిని కలుపుకొని ముందుకు సాగాలన్నా రు. సమాజసేవలో ఉన్న ఓ డాక్టర్ను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సంతోషకరమన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర, జిల్లా ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలి పారు. జిల్లాలో అందరిని కలుపుకొని పోతా మని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శంకర్స్వామి, రామ్ధారి అఖండ పీఠాధిపతి శ్రీ వేదయోగి మహరాజ్, కృష్ణ యజుర్వేద పండితుడు డాక్టర్ మన్యురింద్ర శర్మ, జిల్లా ఇన్చార్జి పగడాకుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, సదానందరెడ్డి, రమేష్కుమార్, పరమేశ్వర్రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, నాయకులు వెంకటయ్య, పాండు గౌడ్, శ్రీధర్రెడ్డి, నరోత్తంరెడ్డి, నందు పాల్గొన్నారు. ఐటీఐని సందర్శించిన ఎంపీ మర్పల్లి: మండల కేంద్రంలోని ఐటీఐ కళాశాలను గురువారం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సందర్శిఽంచారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉన్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బీజేపీ మండల అధ్యక్షుడు రామేశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు బలరాంగౌడ్, అన్నపూర్ణ, మహేశ్వరి, శ్రీమంత్కుమార్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ జాతర
మెగా జాబ్మేళాకు వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు ● 63 కంపెనీల ప్రతినిధుల హాజరు ● ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4,200 మంది ● అర్హత సాధించిన వారు 4వేల మంది ● కార్యక్రమం విజయవంతం కావడంతో ఎమ్మెల్యే బీఎంఆర్ హర్షం తాండూరు: ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు లేని నియోజకవర్గ యువతకు గురువారం నాటి మెగా జాబ్మేళా సరికొత్త ఆశలు రేకెత్తించింది. ఈ ప్రాంతానికి చెందిన యువకులు ఉద్యోగాలు లేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాండూరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఉద్యోగ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికంగా నాపరాతి పరిశ్రమలు, గనులు ఉన్నాయి. వీటిని పని చేయడమంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దీంతో యువకులు అయిష్టత చూపుతున్నారు. చాలా కాలంగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ ఈజీఎంఎం సౌజన్యంతో గురువారం తాండూరు పట్టణంలో మెగా ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని యాలాల, పెద్దేముల్, కోట్పల్లి, బషీరాబాద్, తాండూరు మండలాల తోపాటు, తాండూరు మున్సిపాలిటీ నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 63 కంపెనీలు 11వేల ఉద్యోగాల భర్తీ కోసం అర్జీలు స్వీకరించాయి. అభ్యర్థులతో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. దాదాపు 8 నుంచి 9వేల మంది వరకు నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 4వేల మంది ఉద్యోగాలకు అర్హత సాఽధించారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి సాయం చేశారు. అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. అర్హత పొందిన వారికి నియామక పత్రాలు అందించారు. ఉద్యోగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే మెగా జాబ్మేళాలో ఉద్యోగాలు సాఽధించిన వారు ఆ రంగంలో రాణించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఈజీఎంఎం సౌజన్యంతో జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు నాలుగు వేల ఉద్యోగాలు రావడం తాండూరు చరిత్రలోనే ఇదే తొలిసారి అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య శాఖ అధికారులకు ధాన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాఽధించిన వారికి నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్ మహరాజ్, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, డీఆర్డీఓ కృష్ణన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ రవిగౌడ్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్రెడ్డి, మాధవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, ఉత్తమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది మెగా జాబ్మేళాలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. కొంత కాలంగా జాబ్ కోసం ఎవరిని సంప్రదించాలనే విషయం తెలియక ఇబ్బంది పడ్డా. ఇలాంటి సమయంలో జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు తెలిసి ఇక్కడికి వచ్చా. తనకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి రుణపడి ఉంటా. – గిరిజ, తాండూరు నెలకు రూ.20 వేల వేతనం జాబామేళాలో దరఖాస్తు చేసుకున్న గంట వ్యవధిలోనే ఉద్యోగం లభించింది. ప్రతి నెలా రూ.20 వేల వేతనం. నియామక పత్రం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగమేళా ఎంతో మేలు చేసింది. నిర్వాహకుల సేవను మరచిపోలేం. – సుప్రియ, కరన్కోట్, తాండూరు మండలం -
ఇవేం బదిలీలు..!
జిల్లాకు ఇటీవల ఐదుగురు తహసీల్దార్ల కేటాయింపు ● ఇందులో ఒకరు ఉద్యోగ విరమణ పొందిన వారు.. ● సస్పెన్షన్కు గురైన మరో అధికారి ● మిగిలిన ముగ్గురికి మండలాలు కేటాయించని వైనం ● పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు ● ఇబ్బందుల్లో ప్రజలు బషీరాబాద్: తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. పదిహేను రోజుల క్రి తం రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది తహసీల్దార్లను ప్ర భుత్వం బదిలీ చేసిది. ఇందులో భాగంగా మన జి ల్లా నుంచి ఐదుగురిని సంగారెడ్డి, నారాయణ పేట జిల్లాలకు బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని జిల్లాకు కేటాయించారు. ఇంత వరకు బాగా నే ఉన్నా వీరిలో ఒకరు ఉద్యోగ విరమణ పొందిన అధికారి అశోక్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన కిరణ్కుమార్ పేరు బదిలీ జాబితాలో ఉంది. మిగిలిన ముగ్గురు తహసీల్దార్లు షాహిదాబేగం, జే.బుచ్చయ్య, వెంకటస్వామిపది రోజుల క్రితం కలెక్టరేట్లో రిపోర్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు వారికి మండలాలు కేటాయించలేదు. ప్రస్తు తం బషీరాబాద్, నవాబుపేట, యాలాల మండలాల తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాలాల తహసీల్దార్ అంజయ్య గత నెల 30న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. డీటీలకు అదనపు బాధ్యతలు జిల్లాలో ఖాళీగా ఉన్న బషీరాబాద్, యాలాల, నవాబుపేట మండల తహసీల్దార్ పోస్టుల్లో టీడీలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వారే భూముల రిజిస్ట్రేషన్, ఇతర ముఖ్య బాధ్యతుల నిర్వహిస్తున్నారు. వీరిపై అదనపు భారం పడటంతో రెవెన్యూ సమస్యలు సకాలంలో పరిష్కారం కావడంలేదు. దీంతో ఆయా మండలాల్లో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బషీరాబాద్, యాలాల ఆర్ఐలకు డిప్యూటేషన్ బషీరాబాద్, యాలాల మండలాల రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను ఉన్నతాధికారులు మంగళవారం డిప్యూటేషన్ వేశారు. ఇక్కడ పనిచేసిన నాగార్జునరెడ్డిని యాలాల ఆర్ఐగా,అక్కడి ఆర్ఐగా పనిచేసిన శివ చరణ్ను బషీరాబాద్కు డిప్యూటేషన్పై బదిలీ చేశారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నవాబుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతుల మేలే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్నదాతలకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం నవాబుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హురులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తే బిల్లులు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ఎంపీడీవో అనురాధ, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీలత, ఎంపీఓ విజయ్కుమార్, ఏఈవోలు, మండల నాయకులు ప్రభాకర్, నరసింహారెడ్డి, రాజశేఖర్రెడ్డి, ఖదీర్, అనంతరామ్ పాల్గొన్నారు. సకాలంలో పూర్తి చేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తాం ఎమ్మెల్యే కాలె యాదయ్య -
అంకితభావంతో పనిచేయాలి
విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి అనంతగిరి: వికారాబాద్లోని డైట్ కళాశాలలో జరుగుతున్న తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ దోమ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. గురువారం దోమ మండలం ఐనాపూర్ కొనుగోలు కేంద్రాని సందర్శించి రైతులతో మాట్లాడారు. వర్షాలు పడుతుండటంతో ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో టీటీ నర్సింహులు, ఆర్ఐలు సుదర్శన్, రాంచంద్రరావు, ఐకేపీ సీసీ సుగుణమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యులు విజయ, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఫోర్ లేన్కు గ్రహణం వీడేనా?
ధారూరు: తాండూరు–వికారాబాద్ వయా ధారూ రు ఫోర్ లేన్ రహదారి నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. ఈ పనులు పూర్తయితే ధారూరు మండల కేంద్రంలోని 16వ కిలో మీటర్ నుంచి 17.5 కిలో మీటర్ పీఎస్ వరకు రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటవుతుంది. 20 మీటర్ల వెడల్పుతో రోడ్డును విస్తరించడానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కానీ పనులకు మాత్రం మోక్షం లభించలేదు. దీంతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇందుకోసం 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. రోడ్డు వేసిన అధికారులు సెంట్రల్ లైటింగ్ సిస్టంకు మంగళం పాడారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిధులు లేని కారణంగా పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. దీంతో మంజూరైన నిధులు ఏమయ్యాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
పంట మార్పిడితో మేలు
పరిగి: ఒకే రకమైన పంటల సాగుతో భూసారం క్రమంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా దిగుబడి క్షీణించి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఒకే నేలలో సాగు చేసే పంటలను తరచూ మార్చాలని సూచిస్తున్నారు. పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. సంవత్సరం పంట మార్పిడి చేయడంతో సాగు చేసిన పంట ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి దిగుబడిని ఇస్తుంది. నేలలో సైతం సమృద్ధిగా పోషకాలు వృద్ధి చెంది పంట దిగుబడులు పెరిగే ఆస్కారం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. చీడపీడలకు అడ్డుకట్ట ● ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉద్ధృతి అధికం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ● పురుగు జీవితచక్రం నిరాటంకంగా ముగించుకుని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది. ● పంట మార్పిడి చేసినప్పుడు పురుగు జీవితచక్రం ఛేదించబడుతుంది. ఎందుకంటే ఒక పంటపై ఆశించే పురుగులు మరొక పంటపై ఆఽశించడం సాధారణంగా జరగదు. ● వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగులను పంటమార్పిడి వల్ల అదుపులో పెట్టవచ్చు. ● ఒకే లోతు వ్యవస్థ కలిగిన పంటలను ఉదాహరణకు పత్తి, మిరప, మొదలైన వాణిజ్య పంటలను మార్పిడి చేయకుండా సాగు చేయడం వల్ల ఒకే లోతు పొరల నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల నిస్సారమవుతుంది. ● వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వంటి పైర్లు నేలపై పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి. ● నేల భౌతిక లక్షణాలు స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి చీడపీడల అభివృద్ధిని నిరోధించడానికి పంటమార్పిడి చేయాలి. ● అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. ప్రయోజనాలు ఇవే! ● వరి తర్వాత మినుము, పెసర, శనగ వేయడంతో సుడి దోమ, టుంగ్రో వైరస్ నివారించవచ్చు. ● పత్తి వేసిన పొలంలో మొక్కజొన్న, జొన్న, నువ్వులు, మినుములు వేస్తే లద్దె పురుగు, పచ్చపురుగుల బెడద ఉండదు. ● జొన్న, మొక్కజొన్న తర్వాత కంది సాగు చేస్తే కాయతొలుచు పురుగు ఉద్ధృతి తగ్గుతుంది. ● వరి సాగు చేసే పొలాల్లో ముందుగా పప్పు ధాన్యాలను సాగు చేయడంతో నేల సారవంతమవుతుంది. ● వేరుశనగలో ఆకు ముడతను నివారించేందుకు పప్పుజాతికి చెందిన పైర్లతో మార్పిడి చేయాలి. ● కంది మిరప పంటల్లో ఎండుతెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. ● నులి పురుగు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప వంటి పైర్ల సాగును కొన్ని పంట కాలాల వరకు ఆపాలి. ● ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ పైర్లను పప్పుజాతి పైర్లయిన పెసర, మినుము, వేరుశనగ, పంటలతో మార్పిడి చేయాలి. ● ఆహార వాణిజ్య పంటలను పశుగ్రాస పైర్లతో ఒకసారి పప్పుజాతి పైర్లతో మరోసారి మార్పిడి చేయడం లాభదాయకం. రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం నేలలో పెరగనున్న భూసారం వ్యవసాయ అధికారుల సూచన అధిక దిగుబడి రైతులు ఒకే పంటను తరచూ సాగు చేయరాదు. ఒకే రకమైన పంటలను సాగు చేయడంతో మొక్కలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడులు తగ్గిపోతాయి. అంతే కాకుండా రోగకారక పురుగుల జీవితచక్రం ముగించుకుని రోగాలు ఉద్ధృతి పెరుగుతుంది. అంతుకే రైతులు వరుసగా ఒకే రకమైన పంటను సాగు చేయరాదు. – లక్ష్మీకుమారి, ఏడీఏ, పరిగి -
రంగాపూర్లో డీపీఎం విచారణ
పరిగి: మండల పరిధిలోని రంగాపూర్లో మహిళా సంఘాల నుంచి విలేజ్ బుక్ కీపర్ డబ్బులు వసూలు చేస్తున్నారని సభ్యులు ఆందోళన చేయడంతో గురువారం డీపీఎం నర్సింహులు విచారణ చేపట్టారు. గ్రామంలోని 10 మహిళా సంఘాల సభ్యులతో వివరాలను సేకరించారు. అనంతరం డీపీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా విచారణ చేపట్టగా బుక్ కీపర్ ఎలాంటి డబ్బులు వసూలు చేసినట్టు తేలలేదన్నారు. ఒకరు తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని, తన సంతకం లేకుండానే బ్యాంకులో రుణం తీసుకున్నారని చెప్పడంతో ఆ మహిళా సంఘ సభ్యురాలు గ్రూపు డిఫాల్ట్లో ఉన్నట్టు తేలింది. గ్రామంలోని కొంత మందికి వ్యక్తిగత కారణాల వల్ల ఇలా జరిగిందని, తమ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గ్రూపు సభ్యులు ఎవరూ చెప్పలేరన్నారు. కార్యక్రమంలో గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి
కుల్కచర్ల: గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి చెందిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన సంటి అంజయ్య బుధవారం రోజులాగే తన పొలం దగ్గర పశువులతో పాటుగా మేకలను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి చూడగా ఓ మేక రక్తపుమడుగులో పడి చనిపోయి ఉంది. ఎక్కువ శాతం మాంసం తినేసింది. కాగా పరిసర ప్రాంతాల్లో చిరుత ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీధర్ ఘటనాస్థలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. రైతులు అటవీప్రాంతంలో పశువులను కట్టేయరాదని, ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
వర్షం తెచ్చిన తంటా
ధారూరు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించుకుపోతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గురువారం మధ్యాహ్నం వరకు జాడలేని వాన సాయంత్రం కాగానే చినుకుతో ప్రారంభమై విజృంభించింది. మండల పరిధిలో ఆరుబయట, కల్లాల్లో ఆరబెడుతున్న వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నా తేమ ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయడానికి నాగసమందర్ కేంద్రంలో నిర్వాహకులు మొండికేస్తున్నారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని రైతులు ఆరోపించారు. ఇప్పటికై నా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల దిగాలు -
పచ్చని చెట్లపై గొడ్డలివేటు
ధారూరు: అధికారుల అనాలోచిత చర్యతో పచ్చని చెట్లపై గొడ్డలివేటు పండింది. గురువారం మండల పరిధిలోని హరిదాస్పల్లి–చింతకుంట గ్రామాల మధ్యన విద్యుత్ తీగలకు తాకుతున్నాయన్న కారణంతో చెట్లను కాండం వరకు నరికేశారు. గతంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కలను నాటారు. ఆ సమయంలో ట్రాన్స్కో, ఉపాధిహామీ సిబ్బందికి సమన్వయం లోపించడంతో మొక్కల పైనుంచి విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెట్లు పెద్దవి కావడంతో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నరికేస్తున్నారు. నాటేటప్పుడే అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. -
ఎదురెదురు బైకుల ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు ధారూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్(35) హైదరాబాద్లోని లంగర్హౌస్ పీఎస్లో ట్రాఫిక్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్దేముల్లో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ధారూరుకు చెందిన రోహిత్, రాము, నర్సింహ అనే యువకులు ఒకే బైక్పై రుద్రారం వైపు వెళ్తూ.. మార్గమధ్యలో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద అబ్దుల్ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను వికారాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోహిత్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు సైతం గాయపడ్డారు. పోగొట్టుకున్న ఫోన్ల అందజేత నవాబుపేట: ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నవాబుపేట ఎస్ఐ అరుణ్కుమార్ సూచించారు. మండల పరిధిలోని ఆర్కతల గ్రామానికి చెందిన పవన్, బాల్రెడ్డిగూడకు చెందిన సునీతలు 15 రోజుల క్రితం వారి ఫోన్లు పోగొట్టుకున్నారు. సీఈఐఆర్ ద్వారా వారి ఫోన్లను రికవరీ చేసి గురువారం బాధితులకు ఎస్ఐ అందజేశారు. నేటి సాంకేతిక యుగంలో పోగొట్టుకున్న వస్తువులను తొందరగా తెలుసుకోవచ్చన్నారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్లాట పరిగి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకున్న ఘటన గురువారం పరిగి–వికారాబాద్ బస్సులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి– వికారాబాద్ మార్గంలో వికారాబాద్ డిపోకు చెందిన బస్సులు నడుస్తుంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువైనా బస్సులు పెంచకపోవడంతో నిత్యం కిటకిటలాడుతూ వెళ్తుంటాయి. గురువారం పరిగి నుంచి వికారాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కాడు. సీటు విషయంలో ఇరువురు గొడవ పడ్డారు. దీంతో రెండు కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులు, మరో ప్రయాణికుడు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ప్రయాణికుల రద్దీ కారణంగానే కొట్లాట జరుగుతుందని, బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. పిడుగుపాటుకు ఆవు మృతి దోమ: పిడుగుపాటుకు ఓ ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజమోని రాజు జీవనోపాఽధి కోసం ఆవులను కొనుగోలు చేశారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ ఆవుపై పిడుగు పడింది. గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లిన బాధిత రైతు ఓ ఆవు మృతి చెందడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం షాద్నగర్రూరల్: షార్ట్ సర్క్యూట్తో ఓ హోటల్ దగ్ధమైన సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలిచంద్రయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే హోటల్ను మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ కావడంతో హోటల్లోని సామగ్రి, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం తెల్లవారుజామున చంద్రయ్య చూడగా దట్టమైన పొగతో నిండిపోయింది. హోటల్లోని ప్రిడ్జ్లు, కౌంటర్లు, కంప్యూటర్, ప్రింటర్, సీసీ కెమెరాల ఎక్విప్మెంట్, ప్యాన్లు, కుర్చీలు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఆర్ఐ సలీం, పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ షార్ట్ సర్క్యూట్తో దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. -
నేడు మర్పల్లికి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
మర్పల్లి: మండల కేంద్రానికి గురువారం ఉదయం 11 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రానున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, మండల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. బడులకు పాఠ్య పుస్తకాలు దుద్యాల్: బడుల ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇదివరకే మండల విద్యావనరుల కేంద్రానికి నూతన పుస్తకాలు చేరాయి. దీంతో పాఠశాలలకు వాటిని పంపిణీ చేసే పనిలో సీఆర్పీలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే మండల పరిధిలోని చెట్టుపల్లి తండాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, హకీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు బుధవారం పంపిణీ చేశారు. రెండు పాఠశాలలకు కలిపి 2,400 పుస్తకాలు అందించినట్లు సీఆర్పీ రాందాస్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల పాఠశాలలకు వంట సామగ్రి సైతం పంపిణీ చేశారు. బిల్లు ఎక్కువ వేశారన్నందుకు ● లైట్లు ఆర్పి మహిళలపై దాడి ● జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో ఘటన బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మీనల్మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశ్నించింది. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన పబ్ నిర్వాహకులు సిబ్బందితో కలిసి పబ్లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య సికింద్రాబాద్: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువా రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కోటేశ్వర్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ట్రాలీ పాత్ వే రైల్వే ట్రాక్ ప్రక్కన బుధవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సుమారు 25 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్యహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై తెలుపు, నలుపు గల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేరళ లాటరీ పేరుతో రూ.7.55 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కేరళ లాటరీ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.7.55 లక్షలు స్వాహా చేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది. బాధితురాలికి (54) గత నెల 7న ‘కేరళ లాటరీ‘ ప్రతినిధి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు తమ లాటరీ ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పాడు. దీంతో ఆమె ఓ టికెట్ ఖరీదు చేశారు. అదే రోజు సాయంత్రం రూ.5 లక్షల లాటరీ గెల్చుకున్నట్లు ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఆ మొత్తం తీసుకోవాలంటే ముందుగా కొన్ని పన్నులు చెల్లించాలంటూ ఓ లింకు పంపాడు. బాధితురాలు దానిని క్లిక్ చేయగా... లాటరీ గెల్చినట్లు, వివిధ పన్నులు చెల్లించాలని ఉంది. బాధితురాలు చెల్లించిన మొత్తం నామ మాత్రమే నాన్ రిఫండబుల్ అని, మిగిలింది లాటరీ నగదుతో పాటు రిఫండ్ చేస్తామని నమ్మించారు. ఇలా ఆమె నుంచి రూ.7, 55,220 డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. -
పది సప్లిమెంటరీకి పక్కాగా ఏర్పాట్లు
అనంతగిరి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 5,308 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరిగి పట్టణంలో 3 కేంద్రాలు, తాండూరులో 7, కొడంగల్లో ఒకటి, వికారాబాద్లో 5, మోనిపేట్, కుల్కచర్లలో రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం ఇవ్వరాదన్నారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ -
భారీ వర్షం.. అతలాకుతలం
పరిగి: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల చెరువులు, కుంటల్లో వర్షం నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాలు ముందస్తుగానే కురుస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు మొలకెత్తుతున్నాయి. మరో రెండుమూడు రోజులు వర్షాలు కురిస్తే రైతులకు చాలా నష్టం వాటిళ్లుతుందని రైతులు వాపోతున్నారు. మర్పల్లిలో మోస్తరు మర్పల్లి: మండలంలోని బూచన్పల్లి, కొత్లాపూర్, మర్పల్లి, సిరిపురం, కోట్మర్పల్లితో పాటు పలు గ్రామాలలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పొలాల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలిగిందని రైతులు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మండలం వర్షపాతం(మి.మీ) 1.వికారాబాద్ 46.3 2.దోమ 43 3.బషీరాబాద్ 40.8 4.పూడూర్ 39.8 5.మోమిన్పేట్ 25.8 6.నవాబ్పేట్ 22.5 7.యాలాల్ 20.8 8.బొంరాస్పేట 20 9.మర్పల్లి 20 10.కోట్పల్లి 19.3 11.బంట్వారం 16.5 12.పెద్దేముల్ 15.5 13.కొడంగల్ 14.5 14.చౌడాపూర్ 13.5 15.కుల్కచర్ల 12.5 16.తాండూర్ 12.3 17.ధారూర్ 11 18.దౌల్తాబాద్ 8 19.పరిగి 5.5 జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతులకు తప్పని తిప్పలు -
పశువులకు వైద్యం అందించండి
పరిగి: పశువులకు సకాలంలో వైద్యం అందించాలని సంచార అంబులెన్స్ జిల్లా అధికారి భాగేష మిశ్రా సిబ్బందికి సూచించారు. బుధవారం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సంచార అంబులెన్స్లను మండల పరిధిలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, వైద్యులు ఎల్లప్పుడు అలర్ట్గా ఉండాలని సూచించారు. రైతులు పశువులకు ఏమైన సమస్య ఉందని కాల్ చేస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు. సంచార అంబులెన్స్ జిల్లా అధికారి భాగేష మిశ్రా -
50,406
దరఖాస్తులు మండలాల వారీగా.. మండలం పేరు వచ్చిన దరఖాస్తులు బంట్వారం 1,182 బషీరాబాద్ 2,125 బొంరాస్పేట్ 2,180 చౌడాపూర్ 1,741 ధారూరు 2,380 దోమ 3,136 దౌల్తాబాద్ 1,971 దుద్యాల్ 1,904 కొడంగల్ 2,156 కొడంగల్(మున్సిపల్) 760 కోట్పల్లి 1,141 కుల్కచర్ల 3,311 మర్పల్లి 1,964 మోమిన్పేట్ 1,804 నవాబుపేట్ 1,494 పరిగి 2,615 పరిగి(మున్సిపల్) 604 పెద్దేముల్ 3,200 పూడూరు 2,320 తాండూరు 3,456 తాండూరు(అర్బన్) 2,350 వికారాబాద్ 1,423 వికారాబాద్(అర్బన్) 2,903 యాలాల 2,286 మొత్తం 50,406 వికారాబాద్: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీడీఓల పర్యవేక్షణలో పరిశీలనను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రొసీడింగులు తయారీలో నిమగ్నమయ్యారు. జూన్ ఒకటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతకంతో కూడిన ప్రొసిడింగులు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా తాండూరు నుంచి.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నుంచి రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తులు స్వీకరించారు. అత్యధికంగా తాండూరు మండలంలో 3,456 మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 760 మంది మాత్రమే అర్జీలు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వచ్చిన వాటిని మండలాలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా విభజించి వెరిఫికేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల నుంచి 50,406 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధి దారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ధరను బట్టి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీపై రుణాలు అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాల వారికి ఒకే రకమైన రాయితీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.లక్ష వరకు 90శాతం రాయితీపై రుణాలు అందజేయనున్నారు. రూ.2 లక్షల వరకు 80శాతం రాయితీ వర్తించనుండగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందే వారికి 70 శాతం రాయితీ వర్తించనుంది. ఎంపికలో తర్జన భర్జన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ చేపడుతుండగా.. ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంకు సిబిల్ స్కోర్ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం ఏమీలేదని.. అంతా పారదర్శకంగా చేపడుతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొంటున్నారు. అయితే నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తు చేసుకున్న యువకులు ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ.3లక్షలు, రూ.4 లక్షల యూనిట్లు మంజూరు చేయాలంటే తమ చేతులు తడపాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన అర్జీలు వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి మండలస్థాయిలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రొసీడింగుల తయారీలో అధికారులు బిజీ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పథకం అమలు ఒక్కో యూనిట్కు గరిష్టంగా రూ.4 లక్షల వరకు.. 70 నుంచి 90శాతం వరకు రాయితీ -
ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తాం
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ● నేడు తాండూరులో మెగా ఉద్యోగమేళా తాండూరు: నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పనకు మెగా ఉద్యోగమేళాను గురువారం నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో మెగా ఉద్యోగమేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా 54 కంపెనీలను సంప్రదించి మెగా ఉద్యోగమేళాతో 11 వేల ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవ చ్చని అన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రభు త్వం ఈజీఎంఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం పాల్గొంటుందన్నారు. తాండూరులో నిర్వహించే మెగా ఉద్యోగ మేళాను ఆదర్శంగా చేసుకొని జిల్లాలోని కొడంగల్, వికారాబాద్లలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధమవుతున్నారన్నారు. మేళాలో ఉద్యోగాలు వచ్చిన వారికి నెల రోజుల పాటు వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా అందిస్తారన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, పార్టీ బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్చంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు నర్సింహులు, లొంక నర్సింహులు, జుబేర్లాల, ప్రభాకర్గౌడ్, రామ కృష్ణ, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 3నుంచి కంది విత్తనాల పంపిణీ
తాండూరు: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో 365 క్వింటాళ్ల కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. జూన్ 3న సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. టీడీఆర్జీ 59 రకం కంది విత్తనాలు 350 క్వింటాళ్లు, ఆశ ఐసీపీఎల్ 87119 రకం 15 క్వింటాళ్లు ఉన్నాయన్నారు. 4 కిలోల బస్తాను రూ.600కు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశ రకం నల్లరేగడి, నీటి వసతి ఉన్న భూముల్లో విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ రకం ఎండు తెగులు, వెర్రి తెగులు, గొడ్డు తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వివరించారు. విత్తనాలు కావాల్సిన రైతులు జూన్ 3న తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. మహనీయుడు వీర సావార్కర్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి తాండూరు టౌన్: బ్రిటీష్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా దేశంలోని హిందువులను ఏకం చేసిన మహనీయుడు వీర సావార్కర్ అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం అన్నారు. బుధవారం తాండూరులో పార్టీ ఆధ్వర్యంలో సావార్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత సంపూర్ణ స్వాతంత్య్రం కోసం యూకేలో చదువుతున్న ఆయన పలు విప్లవ సంస్థలతో సంబంధాలు ఏర్పర్చుకుని బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులను ఏకం చేశారన్నారు. దీంతో బ్రిటీష్ వారు ఆయనను అరెస్టు చేసి ఇండియాకు తీసుకువచ్చి అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు పంపారన్నారు. జైలు నుంచి విడుదలైన ఆయన హిందూ జాతీయ వాదాన్ని సమర్థిస్తూ స్వాతంత్య్రం కోసం పోరాడాడన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రజినీ కాంత్, మంతటి రాజు, ప్రకాష్, ప్రహ్లాద్, షాబుద్దీన్, శివాజీ, తాండ్ర నరేష్ పాల్గొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలి మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి తాండూరు: క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలియంమూన్ మైదానంలో జీఎంకే బిల్డర్ అండ్ డెవలపర్స్ అధినేత ముజీబ్ఖాన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. సమాజ సేవ అలవాటు చేసుకోవాలన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా నేరం
అనంతగిరి: బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను నిరోధించాలని ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న బక్రీద్ పండుగ ఉన్నందున పశువులను అక్రమ రవాణా చేయకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 8 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చట్టవిరుద్ధంగా పశువులను రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పశువుల క్రయ విక్రయాలు జరిపే రైతులు, వ్యాపారులు సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ అధికారులచే ధ్రువీకరించిన రశీదులను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణా విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అధికారి సదానందం, వికారాబాద్, తాండూరు, పరిగి డివిజన్ల డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు ఎస్పీ నారాయణరెడ్డి -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
తాండూరు రూరల్: గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచ, మిట్టబాసుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చంద్రవంచ గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. హనుమాన్ ఆలయ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని.. భర్తీ చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల తర్వాత చైర్మన్ పదవిని భర్తీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మిట్టబాసుపల్లిలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. అలాగే మసీదు నిర్మాణానికి సహకరించాలని విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్కుమార్, అంజిలప్ప, అనంతప్ప, నర్సింలు, ఎల్లప్ప, జగదీష్, మల్లప్ప, ఇస్మాయిల్, పెద్ద ఇస్మాయిల్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మోతీనగర్: భవన నిర్మాణ పని చేస్తున్న మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సఫ్దార్నగర్లో నిర్మాణంలో ఉన్న భవనంలో గుంపు అనసూయ (45) అనే మహిళ కూలీ పని చేస్తోంది. బుధవారం ఆమె మెటీరియల్ లిఫ్ట్ వద్ద పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయింది. తోటి కూలీలు ఆమెను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. యజమాని నిర్ల క్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రైతులకు నష్టం కలిగించొద్దు
అనంతగిరి: వర్షాలు పడుతున్నందన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ధాన్యం తడిసి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత మనపై ఉందని అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం సేకరణ, రవాణాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా అన్నదాతలకు నష్టం జరగకుండా సేకరించిన వడ్లను మిల్లర్లకు తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం లారీలు, హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎంసీఎస్ రాము, రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, ట్రాన్స్పోర్టర్లు పాల్గొన్నారు. తడిసినా కొనుగోలు చేయాలి ధారూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ధాన్యం తడిసినా సేకరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. బుధవారం ధారూరు వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరిస్తున్న హరిదాస్పల్లి పీఏసీఎస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే సేకరించిన వడ్ల బస్తాలను వెనువెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, సీఈఓ రవి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం బస్తాలను తక్షణం మిల్లులకు తరలించండి కలెక్టర్ ప్రతీక్ జైన్ -
సర్కారు వరం.. సన్న బియ్యం
కొడంగల్: నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లక్షన్నర మందికి ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారని, వారికి ఇబ్బంది లేకుండా ఒకేసారి చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు నియోజకవర్గంలో 90 రేషన్ దుకాణాల ద్వారా నెలకు 979 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 2,937 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు. బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ పాస్తో పంపిణీ కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో 90 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 38,395 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,46,700 మంది లబ్ధిదారులు ప్రతి నెలా 979 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపాస్) యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఐరిష్, వేలిముద్రలు సరిగ్గా ఉంటేనే సరుకులు ఇస్తారు. సిగ్నల్స్ సమస్య.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే రేషన్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. పట్టణాల్లో సెల్ఫోన్ టవర్స్ ఉండడం వల్ల సమస్య లేదు. గ్రామాల్లో సిగ్నల్స్ అందక ఈ పాస్ యంత్రాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా రావడం లేదని లబ్ధిదారులు, డీలర్లు చెబుతున్నారు. అతికష్టం మీద సిగ్నల్ వస్తే సర్వర్ డౌన్ అవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోందన్నారు. కూలీ పనులు వదిలేసి బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. అన్ని దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశా రు. దీంతో సరుకులు పంపిణీ చేస్తున్నారు. లక్షన్నర మందికి ఒకేసారి మూడు నెలల రేషన్ జూన్లో పంపిణీకి శ్రీకారం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఇబ్బంది లేకుండా.. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి జూన్ నెలలో పంపిణీ చేయడానికి ప్రభు త్వం చర్యలు తీసుకుంది. డీలర్లు సకాలంలో దుకాణాలను తెరిచి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మూడు నెలల బియ్యాన్ని ఇవ్వాలి. – విజయ్కుమార్, తహసీల్దార్ -
కార్పొరేట్కు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
పరిగి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. పరిగి పట్టణానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయడం సంతోషించ దగ్గ విషయమన్నారు. తుంకుల్గడ్డలో భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్చైర్మన్ అయూబ్, దోమ పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడడి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు రాజపుల్లారెడ్డి పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కుల్కచర్ల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్లలో రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్య క్షుడు రాంచందర్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్కుమార్ రెడ్డి, నాయకులు రాంరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి దోమ: ప్రభుత్వ సబ్సిడీపై ఇచ్చే పచ్చి రొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండలం దిర్సంపల్లి రైతు సేవ కేంద్రంలో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవ కేంద్రంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. బస్తాకు రూ.2,140 ధర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ యాదయ్యగౌడ్, కాంగ్రెస్ నేతలు సత్తయ్యగౌడ్, రాములుగౌడ్, బందయ్య, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, అఖిల్పాష, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
దళిత రైతుపై దౌర్జన్యం సరికాదు
బొంరాస్పేట: మండల పరిధిలోని బాపన్చెరువుతండాకు వేసిన బీటీ రోడ్డు నిర్మాణంలో రేగడిమైలారానికి చెందిన దళిత రైతు కడంపల్లి బాలయ్యపై కాంట్రాక్టర్ హన్మంత్రెడ్డి దాడి చేయించడాన్ని ప్రజాసంఘాల నేతలు తప్పుబట్టారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు దస్తయ్య ఆధ్వర్యంలో క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలయ్యకు చెందిన 10 గుంటల పట్టా భూమి రోడ్డు నిర్మాణంలో కోల్పోవడంతో రూ.15 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. దీనిపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై అట్రాసిటి కేసు నమోదు చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంఘాల పక్షాన ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, అంబేడ్కర్ ప్రజాసంఘాల తాలుకా అధ్యక్షుడు రమేష్బాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం నాయకుడు కొత్తురు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, బాలరాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
దుద్యాల్: రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో జీలుగ విత్తనాలను వ్యవసాయ అధికారి నాగరాజ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంటయ్య, ఏఈఓలు భావన, రేణుక, మాణికేశ్వరి, జ్యోతి, పీఏసీఎస్ డైరెక్టర్ ఖాలీల్ పాషా, నాయకులు సీతారాంనాయక్, వెంకటయ్య, శ్రీశైలంగౌడ్, ఖాజా, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
ధారూరు: మండల పరిధిలోని నాగసమందర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిస్తే కొనమంటూ నిర్వాహకులు పేర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోల వడ్లు అదనంగా ఇస్తేనే రైస్మిల్లు యజమాని తీసుకుంటారని వెలుగు సీసీ యాదయ్య సూచించండంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ కలుగజేసుకొని విషయాన్ని సద్దుమణిగించారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ట్రయినీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి అనంతగిరి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) తెలంగాణ వారి ఆధ్వర్యంలోని వివిధ క్రీడా అకాడమీ మరియు వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి గాను అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, సైక్లింగ్, రెజ్లింగ్, హాకీ, హ్యాండ్ బాల్, వాలీబాల్ విభాగాల్లో బాలబాలికల ప్రవేశాల కోసం ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అర్హులైన, ఆసక్తి గల బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చదువుతున్న స్కూల్, కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, 10 పాస్ ఫోర్టు సైజ్ ఫొటోలు, ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఉదయం 7గంటలకు ఎంపిక ప్రదేశాలకు హాజరు కావాలన్నారు. వాలీబాల్కు సంబంధించి జూన్ 1 సిద్దిపేట జిల్లా వాలీబాల్ అకాడమీలో, జూన్ 10న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో, రాజన్న సిరిసిల్ల మినీ స్టేడియం, వాలీబాల్ అకాడమీలో, జూన్ 12, 13న మహబూబ్నగర్ మెయిన్ స్టేడియం మైదానంలో, ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. జూన్ 10, 11న సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ వెలోడ్రోమ్, ఓయూ క్యాంపస్, హైదరాబాద్, ప్రాంతీయ క్రీడా వసతి గృహం, హన్మకొండలో, జూన్ 10, 11 తేదీల్లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్ జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ, హన్మకొండలో ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 12న హాకీ అకాడమీ, వనపర్తి డా.బాలకృష్ణయ్య మినీ స్టేడియం, వనపర్తిలో హాకీ ఎంపిక అదేవిధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఖమ్మంలో జూన్ 12న అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 10 నుంచి 12 సంవత్సరాల వారికి జిమ్నాస్టిక్ మరియు స్విమ్మింగ్ ఎంపిక, 12 నుంచి 16 సంవత్సరాల వారికి అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్ విభాగాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు. -
పట్టాలెక్కని పర్యాటకం
వికారాబాద్: జిల్లాలో పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది.. వికారాబాద్ సమీపంలో అనంతగిరి కొండలు, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు, బుగ్గ రామేశ్వర ఆలయం వంటి చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అనంతగిరి కొండలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. మెఘా సంస్థ రూ.1,000 కోట్లతో అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అందరరూ భావించారు. రెండేళ్ల క్రితం డీపీఆర్ తయారి బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేశారని గతంలో అధికారులు చెప్పారు.. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. 213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికి రూ.110 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశారు. ప్రస్తుతం మెఘా సంస్థతో రూ.1,000 కోట్లతో ఒప్పందం కుదరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతగా రూ.33 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అడ్వెంచర్ టూరిజం స్పాట్గా.. సాధారణంగా పర్యాటక కేంద్రాలను రెండు రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఒకటి సాధారణ పర్యాటకం.. ఇందులో అడవుల అందాలను వీక్షించడం, ఆలయాల సందర్శన వంటివి ఉంటాయి..రెండోది అడ్వెంచర్ టూరిజం(సాహస పర్యాటకం). ఇందులో యువత ఇష్టపడే సాహస కృత్యాలను డెవలప్ చేస్తారు. ట్రిక్కింగ్, రోప్ వేలు వంటివి ఉంటాయి. అనంతగిరుల్లో ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఎకో పార్క్, కన్వెన్షన్ హాళ్లు, ట్రెక్కింగ్, రోప్ వేస్, హోటల్స్, ఆలయాల అభివృద్ధి, వ్యూ పాయింట్స్, గార్డెన్లు, డైనింగ్ హాల్స్, పక్షులు, జంతువులను వీక్షించిందేకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 213 ఎకరాలను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రోజుకు 5వేల మంది పర్యాటకులు వచ్చేలా.. వెయ్యి మంది ఇక్కడ బస చేసేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 500 మంది నుంచి 1000 మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. అనేక అనుకూలతలు అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో పర్యాటకంగా తీర్దిద్దాడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాంతం హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే గంటలో నగర వాసులు ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు, ముంబై హైవేల నుంచి కూడా గంటలోపు ఇక్కడికి రావచ్చు. రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే కేవలం 15 నిమిషాల్లో అనంతగిరులకు రావొచ్చు. దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, రోడ్డు మార్గంలో అందమైన మలుపులు, గుట్టపై చారిత్రాత్మకమైన అనంతపద్మనాభ స్వామి ఆలయం, ట్రెక్కింగ్ స్పాట్లు, అనేక రకాల పక్షిజాతులు, జంతు జాతులు ఈ అడవిలో ఉన్నాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన కాటేజీలు, బుగ్గ రామేశ్వర ఆలయం, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు, అందులో బోటింగ్ ఇలా అనేక రకాలు అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనుకూల అంశాలు ఉన్నాయి. అనంత పద్మనాభస్వామి ఆలయం213 ఎకరాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అనుమతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రణాళిక అనంతగిరుల బాధ్యతలు మెఘా సంస్థకు.. రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వంతో ఎంఓయూ స్వదేశీ దర్శన్ కింద.. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పేరుతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రెండో విడతలో మన జిల్లాలోని అనంతగిరిని, యాదాద్రి జిల్లాలోని భువనగిరి కొండను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భావించింది. అనంతగిరి కొండలు, సమీప అటవీ ప్రాంతం.. పరిసర ప్రాంతాల్లోని సర్పన్పల్లి, కోట్పల్లి ప్రాజెక్టులకు పర్యాటకంగా తీర్చిదిద్దాడానికి ప్రణాళికలు రూపొందించారు. రెండేళ్లు కావస్తున్నా ముందుకు పడని అడుగు -
అన్నదాతకు వరుణ గండం
దుద్యాల్: ముందస్తు నైరుతి రుతుపవనాలతో మండలంలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం వరి పంట కోతకు వచ్చింది. ఇప్పటికే చాలా మంది రైతులు కోతలు పూర్తి చేసి దిగుబడిని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అక్కడ తూకం వేయడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల కారణంగా మరికొంత మంది కోతలు ఆపేశారు. వానలు తగ్గితే తప్ప కోతలు సాధ్యం కాదని అంటున్నారు. దీంతో పొలాల్లో అలాగే వదిలేశారు. లక్షల పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు దుద్యాల్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. లారీలు సకాలంలో రాకపోవడంతో వడ్ల బస్తాలను మిల్లులకు తరలించడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచారు. పంట దిగుబడిని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం బస్తాలను త్వరగా మిల్లులకు తరలించాలని వారు కోరుతున్నారు. ఇళ్ల మధ్య వర్షపు నీరు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని హస్నాబాద్ ఎస్సీ వాడ జలమయంగా మారింది. ఇళ్ల మధ్య భారీగా నీరు చేరింది. నడిచేందుకు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ సమీపంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కల్వర్టు నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతుండటంతో వర్షపు నీరు ముందుకు వెళ్లడం లేదని స్థానికులు తెలిపారు. దంచికొడుతున్న వానలు కోతకు వచ్చినా పొలాల్లోనే వరి పంట కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం బస్తాలు అన్ని విధాలా నష్టపోతున్న రైతన్న ఆదుకోవాలని విన్నపం మట్టి వేయడంతోనే.. కాలనీ సమీపంలో రోడ్డు పను లు జరుగుతున్నాయి. కాలనీ నుంచి వర్షపు నీరు దిగువకు పో కుండా కాలువకు అడ్డంగా మ ట్టి పోశారు. దీంతో ఇళ్ల మధ్య నీరు నిలిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు చేపట్టాలి. లేకుంటే ఇళ్లల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. – దశరథ్, ఎస్సీ కాలనీ వాసి, హస్నాబాద్ -
కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి
అనంతగిరి: ప్రజా సమస్యలపై ఈ నెల 30న తలపెట్టిన కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందజేయాలని కోరారు. అలాగే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహిపాల్, జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ, వెంకటయ్య, చంద్రయ్య, సతీశ్, శ్రీనివాస్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. టీబీ నివారణకు కృషి జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి రవీందర్యాదవ్ దౌల్తాబాద్: టీబీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి రవీందర్యాదవ్ అన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ ఆధ్వర్యంలో మంగళవారం మాటూరు గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధి ఉన్న వారికి జ్వరం, దగ్గు, నీరసం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు ఉన్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరంలో 360మందికి పరీక్షలు చేయగా 63 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు ఇవ్వన్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి అమూల్య ప్రియదర్శిని, సంతోష్, మాధవి, సూపర్వైజర్ రఫీ, రాహత్శ్రీధర్, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తుల పాల్గొన్నారు. ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలి ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్ తాండూరు టౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేసిందని దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వామపక్ష ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ చౌక్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత పేరుతో అమాయక గిరిజనులను, సానుభూతి పరులను హత్య చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఆపరేషన్లో మృతి చెందిన మావోయిస్టులవి బూటకపు ఎన్కౌంటర్లేనని, వీరి మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంజి, మహేష్, ఆనంద్, పకీరప్ప, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
రహదారి పనులకు నిధులు మంజూరు
కుల్కచర్ల: బండమీదితండా గ్రామ పంచాయతీలో పొలాలకు వెళ్లేందుకు రహదారికోసం మంజూరైన రూ.12లక్షలతో ఏపీఓ చంద్రశేఖర్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరూ ఒక్కతాటిపై ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉండే పనులను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పొలాలకు దారులు ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యవసాయ పంటలను మార్కె ట్లకు తరలించేందుకు, వ్యవసాయ పనుల నిర్వహణకు ట్రాక్టర్లను ఇతర వాహనాలను తీసుకవెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజు, వినోద్కుమార్, మోతిలాల్, ఆంజనేయులు, దశరత్, శివాజీ, నర్సింలు, శ్రీను పాల్గొన్నారు. -
3,022 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు
మోమిన్పేట: మోమిన్పేట పీఏసీఎస్ ఆధ్వర్యంలోని 3,022 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో కోటి రూపాయలు జమ చేశామని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటి వరకు 170 మంది రైతుల నుంచి 3,022 క్వింటాళ్ల కొనుగోలు చేశామన్నారు. సేకరించిన జొన్నలను తాండురులోని డీసీఎంఎస్ గోదాంకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు దళారులకు పంట దిగుబడి విక్రయించి మోసపోరాదని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. రైతులకు సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు వివరించారు. పంట రుణాలు, ధీర్ఘకాలిక రుణాలు, బంగారు నగలపై రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 750 మంది రైతులు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ.15లక్షలు అవుతుందని.. బ్యాంక్ తన వాటాగా మరో రూ.15 లక్షలు వారి పేరిట డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. ఈ డబ్బుతో సంఘం సభ్యులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని సూచించారు. పీఏసీఎస్లో ఉన్న వాటా మూలధనంపై డెవిడెంట్లు ఇవ్వాలని చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి డీసీఓను కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, సీఈఓ శేఖర్, జిల్లా సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో రూ.కోటి జమ చేశాం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున -
సిద్ధమవుతున్న యూనిఫాం
స్కూళ్లు తెరిచే నాటికి అందజేస్తాం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన దుస్తులను కుట్టాల్సిన బాధ్యత మహిళ సంఘాలకు అప్పజెప్పాం. అయితే ఇప్పటి వరకు 80శాతం పూర్తయ్యాయి. స్కూళ్లు తెరిచే నాటికి యూనిఫాంలను సకాలంలో పూర్తిచేసి ఎంఈఓకు పంపిస్తాం. – హరినారాయణ, ఇన్ఛార్జి ఏపీఎం దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రారంభంలోనే నూతన యూనిఫాం అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యూనిఫాం కుట్టు పనులను ఈ ఏడాది నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం సమస్య తీవ్రంగా ఉండేది. కాంట్రాక్టర్లకు కుట్టుపని బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా సరిపడా యూనిఫాంలు అందించేవారుకాదు. అంతేకాకుండా కొలతల్లో హెచ్చు తగ్గులు ఉండడంతో వాటి వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్త్రాలను కొనుగోలు చేసి యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నారు. ఫిబ్రవరిలోనే వీఓఏలు, ప్రధానోపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కొలతలు సేకరించారు. వాటిని పూర్తి చేయించే పనిలో సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 3,250 మంది విద్యార్థులకు.. దౌల్తాబాద్ మండలంలో ఎనిమిది ఉన్నత, ఏడు ప్రాథమికోన్నత, 24 ప్రాథమిక పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 3,250 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మండలంలో నందారం, ఈర్లపల్లి, దౌల్తాబాద్, కౌడీడ్ గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు యూనిఫాంలు కుడుతున్నారు. ఇప్పటి వరకు 80శాతం పూర్తయినట్లు తెలిపారు. ఇంకా చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలాయని వివరిస్తున్నారు. కుట్టు పనులను ఐకేపీ అధికారులు, ఎంఈఓ వెంకట్స్వామి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాలకు కుట్టుపని బాధ్యతల అప్పగింత పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు అందజేసేలా ప్రణాళిక -
మట్టితో పూడ్చేసి!
నాలాపై కన్నేసిఇబ్రహీంపట్నం రూరల్: దాతర్చెరువు కాల్వపై కన్నేసిన అక్రమార్కులు మట్టితో నింపి కబ్జా చేశారు. అర కిలోమీటర్ మేర నాలాను ఆక్రమించి రెండున్నర ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ప్రస్తుత మార్కెట్లో దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిబట్ల మున్సిపల్ పరిధి కొంగరకలాన్లోని దాతర్ చెరువు నిండితే.. అలుగు పారి పులందరి వాగులోకి చేరుతుంది. దాతర్ చెరువును ఆనుకుని ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేసింది. ప్రస్తుతం దీని పక్కనే ఉన్న భూములను కొనుగోలు చేస్తోంది. దాతర్ చెరువు నాలా రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది. భారీ ప్రవాహం ఉండే చారిత్రక ఆనవాళ్లు కలిగిన నాలాను కొంతమంది రాత్రికి రాత్రే చెరబట్టారు. వేలాది ట్రిప్పుల మట్టి నింపి దాదాపు 500 మీటర్ల పొడవునా కాల్వను కనుమరుగు చేశారు. చెరువు కట్టను సైతం చీల్చి దాదాపు రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేశారు. మార్కెట్లో దీని విలువ రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వందల ఏళ్ల నాటి కాల్వను పూడ్చేసిన అక్రమార్కులు ప్రత్యామ్నాయంగా కొత్త కాల్వ తవ్విస్తున్నారు. దీనికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఫిర్యాదుతో విచారణ కబ్జా విషయమై కొంగరకలాన్కు చెందిన నీళ్ల హరిబాబు అనే వ్యక్తి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఏఈ హరిత క్షేత్ర సందర్శనకు వచ్చారు. గ్రామ నక్షా, కాలువ విస్తీర్ణం తదితర అంశాలను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదిక రూపొందించి, ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. రాత్రికి రాత్రే దాతర్చెరువు కాల్వ ఆక్రమణ రెండున్నర ఎకరాల భూమికి ఎసరు పూర్తిస్థాయి విచారణకు ఇరిగేషన్ డీఈఈ ఆదేశం కబ్జా నిజమని తేలితే.. నాలా ఆక్రమణ విషయమై మాకు ఫిర్యాదు అందింది. అధికారులు, సిబ్బందిని ఫీల్డ్ విజిట్కు పంపించాం. పూర్తి స్థాయి విచారణ, సర్వేకు ఆదేశించాం. కాల్వను పూడ్చారని, కబ్జా వాస్తవమేనని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – చెన్నకేశవరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ -
ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
నవాబుపేట: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన బక్కని ఏసు కొడుకు సందీప్(23), వికారాబాద్లో ఐటీఐ చదువుతున్నాడు. ఏడాది క్రితం పట్టణానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ గత సోమవారం సాయంత్రం తమ పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఉపాధి కూలీ మృతి యాలాల: ఉపాధి పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ కూలీ మృతిచెందాడు. వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అన్నారపు హన్మంతు(38) భూమి చదును పనుల్లో పాల్గొన్నాడు. ఈసమయంలో ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా కుప్పకూలి, అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. సమాచారం అందుకున్న ఉపాధి సిబ్బంది, అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని తెలిపారు. బ్యాటరీల దొంగ దొరికాడు కేశంపేట: మండలంలో ఇటీవల చోరీ అయిన బ్యాటరీలను పోలీసులు రికవరీ చేశారు. మండల పరిధిలోని లేమామిడి, కేశంపేట, బైర్కాన్పల్లి గ్రామాల్లో ఇటీవల వాహనాల బ్యాటరీలతో పాటు జనరేటర్ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇదే విషయమై బాధితుల నుంచి పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందాయి. పోలీసులు బ్యాటరీ దొంగతనాలను ఛేదించేందుకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమోరాల్లో నమోదైన పుటేజీలతోపాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించారు. హైదరాబాద్ విద్యానగర్లోని లక్ష్మీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మేగిశెట్టి నాగేశ్వర్రావు బ్యాటరీలను దొంగిలించినట్టు గుర్తించారు. అతడి నుంచి 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
గడువులోగా యూనిఫాం అందించాలి
కేశంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గడువులోగా యూనిఫాం అందించాలని డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యారావు అన్నారు. మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య భవనంలో మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు షర్టుల కోసం వచ్చిన క్లాత్ను కట్టింగ్ చేస్తున్న విధానాన్ని, మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కుడుతున్న టైలరింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభంలోగా అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా టైలరింగ్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఈపీఎం బాలరాజ్, ఏపీఎం భగవంతు, సీసీలు పాల్గొన్నారు. -
అటవీ భూమిని ఆక్రమిస్తే చర్యలు
బొంరాస్పేట: మండలంలోని తిర్మలాపూర్లో అటవీ భూమిని ఆక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ నెల 24న సాక్షి దినపత్రికలో అటవీ భూ మి ఆక్రమణ అనే శీర్షికన ప్రచురితమై కథనంపై ఆ యన స్పందించారు. మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అటవీ భూమిని ఆక్రమించిన ఘటనపై ఈ నెల 23న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఎన్కేపల్లికి చెందిన పూజారి నర్సింలు 1.30 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. నరికిన చెట్ల స్థలంలో కొత్తగా మొక్కులు నాటించి, వాటిని సంరక్షించే బాధ్యత నర్సింలుకు అప్పగిస్తున్నామని చెప్పారు. అక్రమార్కులు అడవిలోకి ప్రవేశించకుండా ట్రెంచింగ్ పనులు చేయించామని పేర్కొన్నారు. అడవుల సంరక్షణ మన బాధ్యత యాలాల: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యతఅని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగాయిపల్లి తండాలో అడవుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ భూముల్లో చెట్లు నరకడం నేరమన్నారు. అటవీ భూమిని ఉపగ్రహ ఛాయా చిత్రాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ కిరణ్కుమార్, ఎస్ఐ గిరి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్, సెక్షన్ ఆఫీసర్లు కనకరాజు, శంకర్, బీట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ భూమి కజ్జా చేసిన వ్యక్తిపై కేసు -
జాబ్మేళాను సక్సెస్ చేయాలి
అనంతగిరి: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాబ్మేళాపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 52 పరిశ్రమల్లో 11 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సంకల్పం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో జాబ్మేళా ఉంటుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్, జేడీఎం సతీష్, తాండూరు సీడీపీఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్ రూరల్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరి అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చేగూరి రాజు, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్చారి, గణేశ్, సుదర్శన్, బుచ్చన్న, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
తాండూరు రూరల్: వీర్శెట్టిపల్లి గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టపగలు వాగులో నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం వీర్శెట్టిపల్లి గ్రామానికి చెందిన పరుశురాం వాగులో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో గోనూర్ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్కు ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో పాటు నంబర్ కూడా లేదు. దీంతో ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి యజమాని పరశురాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కేసులకు భయపడేది లేదు తాండూరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. ఈ ఘటనలో పట్టణ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో హాజరైన అనంతరం బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, పట్టణాధ్యక్షుడు సందీప్ రెడ్డి, నాయకు లు వినోద్, నర్సింహులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత కేసులు బనాయించడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. నివాళి బషీరాబాద్: ఏకాంబరి రామలింగేశ్వర ఆలయ ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేసిన ఆచారి నర్సిములు(75) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. నీళ్లపల్లికి చెందిన ఆయన ఆలయ పరిసరాల్లో ఇల్లు నిర్మించుకుని చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు. శాసన మండలి చైర్మన్ పట్నం మహేందర్రెడ్డి నీళ్లపల్లికి చేరుకొని నర్సిములు మృతదేహానికి నివాళులర్పించారు. గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు మూసాపేట: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి కూకట్పల్లిలోని హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన దీక్షిత్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అభినయ్, మంచిర్యాలకు చెందిన అన్షు అతడి స్నేహితులు. గంజాయికి అలవాటు పడిన వీరు గంజాయిని కొనుగోలు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారికి పరిచయమైన అనురాగ్, వినయ్ కూడా వారితో జత కలిశారు. దీంతో వారు 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. కూకట్పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక టీస్టాల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుల్లో ఒకరైన అభినయ్ 2024లో బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, మిగిలిన ముగ్గురూ ఖాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అనురాగ్, వినయ్ కోసం గాలిస్తున్నామన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముందస్తు అరెస్టులు బాధాకరం
కుల్కచర్ల: ముందస్తు అరెస్టులు బాధాకరమని మాజీ సర్పంచులు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను ఇవ్వాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేయించడం సబబు కాదని కుల్కచర్ల మండల, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మణ్, తుల్జ్యా తదితరులు పేర్కొన్నారు. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని లేనియెడల ఉప ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక పోలీస్ అధికారులు మంగళవారం వారిని ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలనలో సర్పంచులుగా తాము ఎంతో కృషి చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తమను ప్రత్యేకంగా గుర్తించకపోగా తమను అరెస్టులు చేయడం ఏంటని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన వారిలో రవి, లోక్య పాల్గొన్నారు. అరెస్టులు అప్రజాస్వామికం దోమ: గత ప్రభుత్వంలో అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అప్రజాస్వామికమని సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండలం నుంచి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,600 పైచిలుకు గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ. పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలే వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల విడుదల చేసిన నిధులు ఏ గ్రామ పంచాయతీకి విడుదలయ్యాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్నారు. దాదాపు పది వేల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటికి నేటికి కూడా పరిగి నియోజకవర్గానికి ఒక్క రూపాయి విడుదల కాలేదని విమర్శించారు. ఇప్పటికై నా మాజీ సర్పంచుల బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
గోవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
తాండూరు టౌన్: అక్రమంగా ఆవులను, లేగ దూడలను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 7వ తేదీన బక్రీద్ ఉన్నందునా ఆవులు, లేగ దూడలు కాకుండా ఇతర పశువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రశీదులను కొనుగోలుదారులు తప్పకుండా కలిగి ఉండాలని పేర్కొన్నారు. పశువులను విక్రయించే సమయంలో వెటర్నరీ వైద్యుడు లేదా పంచాయతీ కార్యదర్శి నుంచి విక్రయదారులు అనుమతి తీసుకోవాని సూచించారు. గోరక్షక్ సేవా సమితి లేదా ఇతరులకు ఆవులను తరలిస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం చేరవేయాలన్నారు. యాలాల: గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్ఐ గిరి హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. ప్రధాన మార్గంలో వెళ్లే గూడ్స్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాల పత్రాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. గోవుల అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎవరైనా గోవులను రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
TS: ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ
వికారాబాద్: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ విషయమై కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున డువుతో సంబంధం లేకుండా లబి్ధదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమస్యలను అధిగమిస్తేనే.. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచి్చన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
శిక్షణలో సమస్తం నేర్చుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్జైన్ ● లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం అనంతగిరి: క్షేత్రస్థాయిలో వాస్తవికతను పరిశీలించి నివేదిక అందజేయాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంటుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టానికి అనుగుణంగా భూముల సర్వే నిమిత్తం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో వికారాబాద్ జిల్లాలో 151 మందికి లైసెన్స్డ్ సర్వేయర్లను శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా భూ సర్వే ప్రక్రియ చేపట్టేందుకే శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ సమయంలో అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న వారు భూ భారతి చట్టంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. భూ వివాదాల జోలికి వెళ్లరాదని, అలాగే ప్రభుత్వ భూములను గుర్తించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ సామగ్రి కిట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కేశవ్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుపత్రాల అందజేతపరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో 320 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. త్వరలో రెండో విడత లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, నాయకులు భీంరెడ్డి, సత్యహరిశ్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
కోటా
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి కసరత్తు ఒకేసారి మూడు నెలల వికారాబాద్: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున గడువుతో సంబంధం లేకుండా లబ్ధిదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమస్యలను అధిగమిస్తేనే.. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చిన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 2,48,745 రేషన్ కార్డులుజిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.30లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా యాసంగిలో 90వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసే సమయంలో జిల్లాలో పండిన వడ్ల ద్వారా సీఎంఆర్ రూపంలో సేకరించినవి సరిపోయేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నందున జిల్లాలో వచ్చే దిగుబడి సరిపోవడంలేదు. కొనుగోలు కేంద్రాలకు ఐదు శాతానికి మించి సన్నరకం వడ్లు రావడం లేదు. ఇవి కేవలం మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే సారి మొత్తం బియ్యం ఇచ్చేస్తే ఆ తర్వాత పంపిణీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 2,48,475 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 5,782 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం అంటే 17వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన సన్నరకం వడ్లను ఎక్కువ శాతం బహిరంగ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. దీంతో సన్నబియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడక తప్పడంలేదు. ప్రస్తుతం మూడు నెలల కోటాకు సంబంధించి మన పక్క జిల్లాలు అయిన నారాయణపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. జూన్ ఒకటి నుంచి 30వరకు సరఫరా ఐదు జిల్లాల నుంచి బియ్యం దిగుమతి ప్రతి నెలా ఇచ్చేది 5,782 మెట్రిక్ టన్నులు మూడు నెలల కోటాకు 17 వేల మెట్రిక్ టన్నులు అవసరం స్టాక్ నిల్వకు గోదాముల కొరత అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి మూడు నెలల రేష న్ బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులకు మూడు నెలల కోటా బియ్యం అందజేస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: తాండూరు పట్టణం ఆదర్శ తులసీ నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. ఉదయం 6గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించారు. ధ్వజారోహణం, గణపతి హోమం, అభిషేకం, భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం భక్త సురేష్చే ప్రవచనం, పలువురు పేరిణి శివతాండవంతో అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు. గోవుల అక్రమ రవాణా నేరం తాండూరు రూరల్: గోవులను అక్రమంగాతరలిస్తే కఠిన చర్యలు తప్పవని కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని తాండూరు – చించోళి మార్గం గౌతా పూర్ సమీపంలో పోలీస్ చెక్పోస్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 7న బక్రీద్ పండుగ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోవులు, లేగ దూడల తరలింపు నేరమన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా పెంచామని తెలిపారు. ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లేష్ పరిగి: కేంద్ర ప్రభుత్వం కావాలనే మావోయిస్టులపై కాల్పులు జరిపించి.. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లేష్, మహేందర్ ఆరోపించారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సోమవారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 500 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అమాయక ఆదివాసులపై దాడులు చేసి హతమార్చడం సరికాదన్నారు. మావోయిస్తు జాతీయ కార్యదర్శి కేశవరావును పట్టుకుని కాల్చి చంపి ఎన్కౌంటర్ పేరుతో కథలు అల్లుతున్నారని విమర్శించారు. అడవి సంపదను ఇతర దేశాలకు తరలించే కుట్రలో భాగంగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయన్నారు. వీటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, శ్రీశైలం, నర్సింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్ తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో రేపు (28వ తేదీ బుధవారం) జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఉపాధ్యక్షుడు రాము సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8, 10, 12 ఏళ్ల వయసు గల బాల బాలికలకు రన్నింగ్, లాంగ్జంప్, షార్ట్పుట్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు తహసీల్దార్చే జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో నేరుగా రేపు ఉదయం 9గంటలకు మైదానానికి రావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 89782 34447, 63000 75229లలో సంప్రదించాలన్నారు. -
బ్యాంక్లో పరిహారం సందడి
పారిశ్రామికవాడ భూ బాధితులతో కిటకిట● నిత్యం కోట్ల రూపాయలలావాదేవీలు ● ఫిక్స్డ్ డిపాజిట్లు మేలంటున్న బ్యాంకర్లు దుద్యాల్: దుద్యాల్ మండలం హకీంపేట్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిత్యం రైతులతో కిటకిటలాడుతోంది. పారిశ్రామికవాడ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇటీవల పరిహారం అందజేసిన విషయం తెలిసిందే. హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, పులిచర్లకుంట తండాకు చెందిన రైతుల ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉన్నాయి. ఇక్కడే పరిహారం చెక్కులు డిపాజిట్ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందడంతో వందల మంది రైతులు వారివారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు. దీంతో నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న మొత్తం సరిపోక ప్రధాన బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తెస్తున్నట్లు తెలిసింది. క్రాప్ లోన్ కట్టాలి పారిశ్రామికవాడ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన పంట రుణాలు పెండింగ్లో ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో కడితినే ఖాతాదారుల సిబిల్ స్కోర్ పడిపోకుండా ఉంటుందని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లోన్లు పొందేందుకు ఆస్కారం లేకుండా పోతుందని రైతులకు సూచిస్తున్నారు.డిపాజిట్లు చేసుకోవడం ఉత్తమం హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, పులిచర్లకుంట తండాకు చెందిన రైతులకు పరిహారం డ బ్బు అందింది. వచ్చి న డబ్బు ద్వారా ఆస్తు లు కొనుగోలు చేస్తే మంచిది. లేకుంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావు. – హరీష్కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్, హకీంపేట్ -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమంలో జనం ఇచ్చి న అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం 125 అర్జీలు వచ్చాయని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం
● సర్కారు బడుల్లోనే పిల్లలను చేర్పించాలి ● డీఈఓ రేణుకాదేవి ● విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని డీఈఓ రేణుకాదేవి తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. పౌష్టికాహారం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అనంతరం పాఠశాల హెచ్ఎం శ్రీశైలం మాట్లాడారు. ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోకుండా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు 500ల పైచిలుకు మార్కులు సాధించారని తెలిపారు. అనంతరం పదో తరగతిలో 538 మార్కులు సాధించిన విద్యార్థిని భవానీని సన్మానించి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బాబు సింగ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేశం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి
● మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరిన నాగారం దళితులు ధారూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన దళితులు కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి నేటి వరకు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించలేదని తెలిపారు. 70 సంవత్సరాల నుంచి తమకు రిజర్వేషన్ సౌకర్యం లేక సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామంలో 1,500 జనాభా ఉండగా ఎస్సీలు 400మంది ఉన్నారని, రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి సీతక్క, ఎన్నికల కమిషన్ అధికారి సానుకూలంగా స్పందించారని నాయకులు సుకుమార్, శ్రీనివాస్, లక్ష్మణ్, గణేశ్, నాగరాజ్ తెలిపారు. -
రోడ్డు అంచు.. ప్రమాదపు ఉచ్చు!
బషీరాబాద్: మండల పరిధిలోని నీళ్లపల్లి మైల్వార్ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డును డబుల్గా విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ దారిని ఓ పక్కన తవ్వి వదిలేశాడు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక్కడ కనీసం ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేయలేదు. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అదుపుతప్పినా అంతే సంగతులు. ఇలా ఇప్పటికే పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం ఆందోళనలో వాహనదారులు -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
బంట్వారం: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఎన్నారం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కోట్పల్లికి చెందిన సుదర్శన్, విజయలక్ష్మి దంపతులు మోటారు సైకిల్పై మర్పల్లి వైపు వెళ్తున్నారు. ఎన్నారం సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇరువురికీ తీవ్రగాయాలయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ తన కారులో అటుగా వెళ్తున్నారు. గాయపడిన దంపతులను చూసి వెంటనే తన వాహనంలోని మెడికల్ కిట్ను తీసి, ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కోట్పల్లి ఎస్ఐ అబ్దుల్గఫార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ అదుపు తప్పడంతో ఘటన క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు -
మేకులు కొట్టి.. బ్యానర్లు కట్టి!
ధారూరు: వివిధ ప్రైవేటు కంపెనీలు, షాపుల నిర్వాహకులు రోడ్ల పక్కన ఉన్న చెట్లను ప్రచార సాధనాలుగా వాడుకుంటున్నారు. వీటికి ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. ఫైబర్, ప్లాస్టిక్, ఐరన్తో తయారు చేసిన షీట్లను కొడుతున్నారు. ఇందుకోసం మేకులు వినియోగిస్తున్నారు. దీనిద్వారా మొక్కలు, వృక్షాలు ఎండిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. మనిషి శరీరంలో ఇనుప వస్తువు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందని, ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోకపోతే క్రమేణా పుండుగా మారుతుందని చెబుతున్నారు. ఇలాగే చెట్లకు కొట్టిన మేకుల కారణంగా వాటికి పుండ్లవంటి గాయాలు ఏర్పడి ఈదురు గాలులకు విరిగిపోతున్నాయని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బ్యానర్లు, పోస్టర్లు కట్టిన, అతికించిన ఆయా ప్రైవేటు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల పక్కన చెట్లను ప్రచార సాధనాలుగా వాడుతున్న కంపెనీలు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు -
భారీ వర్షానికి తడిసిన ధాన్యం
● కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తిప్పలు ● తూకం వేయడంలో జాప్యం యాలాల: ఆరుగాలం శ్రమించిన అన్నదాతల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చిన ధాన్యం తడిసి అపార నష్టాన్ని మిగిల్చింది. తూకం వేయడంలో జాప్యం కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొంటున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలు నీటిమీద రాతలుగా మారాయని ఆరోపించారు. మొలకెత్తిన వడ్లు మండలంలో ఎక్కువగా వరి పంటను సాగు చేస్తుంటారు. ఇటీవల డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ సమయానికి సంచులతో పాటు తూకాలు, ధాన్యం తరలింపులో జాప్యం జరగడంతో కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాశారు. సోమవారంతోపాటు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెన్నూరు, రాస్నం, సంగెంకుర్దు, తిమ్మాయిపల్లి, యాలాల, లక్ష్మీనారాయణపూర్, అగ్గనూరు, దేవనూరు తదితర కేంద్రాల్లో ధాన్యం తడిసింది. దీనికితోడు పలు కేంద్రాల్లో తేమ కోసం ఆరబెట్టిన ధాన్యం మొలకెత్తింది. ప్రభుత్వ మద్దతు ధర కోసం రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన సకాలంలో తూకం, తరలింపు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన వడ్ల విషయంలో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. షరతుల్లేకుండా కొనాలి ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన వడ్లను ప్రభుత్వ మద్దతు ధరతో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకాలు, రవాణా తదితర విషయాల్లో అధికార యంత్రాంగం విఫలమైంది. బెన్నూరు, లక్ష్మీనారాయణపూర్, యాలాల తదితర కేంద్రాల్లో రైతుల ధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తింది. యంత్రాంగం స్పందించి షరతులు లేకుండా ఽకొనుగోలు చేయాలి. – శివకుమార్, ఈజీఎస్, స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యుడు నష్టపోతున్న రైతులు పరిగి: ఇటీవల కురుస్తున్న వర్షానికి కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో మోస్తరు వాన కురిసింది. కల్లాల్లోని ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం కావడంతో నష్టపోతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు అమలు కావడం లేదని కర్షకులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
బాల్య వివాహాలు నేరం
● ప్రోత్సహించినా, సహకరించినా చర్యలు తప్పవు ● ధారూరు ఎస్ఐ అనిత ధారూరు: సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ధారూరు ఎస్ఐ అనిత సూచించారు. కేరెళ్లిలోని సత్యసాయి సార్వజనిక కేంద్రంలో సోమ వారం కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవగాహన లేక అనేక మంది సైబర్ నేరాల బారిన పడి నష్టపోతున్నారని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, వీటిని ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వివాహాలు చేసుకునే యువతీ, యువకులకు 18, 21 సంవత్సరాలు నిండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సార్వజనిక కేంద్రం సభ్యులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కుక్కకాటు నిర్లక్ష్యానికి ప్రాణం బలి తాండూరు రూరల్: రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం ఇందూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రవీణ్(32) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం కుక్క కాటుకు గురయ్యాడు. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు రావడంతో ఆదివారం ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. పరీక్షించి వైద్యులు ప్రవీణ్కు రేబిస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు సోమవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
నేలమాలిగలు
ఉల్లి నిల్వకు ● ధర లేకపోవడంతో పంట స్టోరేజీకి ప్రాధాన్యం ఇస్తున్న రైతులు ● పొలాల్లోనే నేలమాలిగల తయారీ ● ప్రభుత్వమే షెడ్లు నిర్మించాలని అభ్యర్థన మోమిన్పేట: సరైన ధరలు లేకపోవడంతో ఉల్లి పంటలను నిల్వ చేసేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు స్టోరేజీల్లో నిల్వ చేసేందుకు ఎక్కువ ఖర్చవడం వంటి కారణాలతో పొలాల వద్దే నేలమాలిగలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తయారీ ఇలా.. చుట్టూ గుంజలు(బలమైన కట్టెలు) పాతి, నిలువుగా కంది కట్టె కడుతారు. మధ్యలో గ్రానైట్ రాళ్లు పెట్టి, వీటిపైనుంచి కట్టెలు పెడుతారు. ఆతర్వాత కంది పొరక, వరి గడ్డితో నింపుతారు. అనంతరం ఉల్లిగడ్డ వేసి, గడ్డి, ఆకులతో కప్పు వేస్తారు. దీనిపైనుంచి టార్పాలిన్ వంటి కవర్లతో కప్పేస్తారు. ఇలా అన్ని దిక్కుల నుంచి వెలుతురు, గాలి తగిలేలా చూసుకుంటారు. ఆగస్టు, సెప్టెంబర్లో బయటకు మేకవనంపల్లి, రాళ్లగుడుపల్లి, కాస్లాబాద్, ఏన్కతల, దేవరంపల్లి, మోమిన్పేట, ఏన్కెపల్లి, కోల్కుంద గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. జనవరిలో నాటిన ఉల్లిని ఏప్రిల్ చివరన, మే మొదటి, రెండో వారంలో బయటకు తీస్తారు. ఈ సమయంలో మంచి రేటు పలికితే ఆరబెట్టి మార్కెట్కు తరలిస్తారు. లేదంటే నేలమాలిగల్లో నిల్వ చేస్తారు. మంచి ధర పలికే సమయంలో బయటకు తీసి విక్రయిస్తారు. సుమారు మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచుతారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అమ్మేస్తారు. అప్పుడు కూడా సరైన ధర లేకపోతే మరికొంత సమయం వేచి చూస్తారు. తక్కువ ఖర్చు... ఎకరా పొలంలో సాగు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు నేలమాలిగలు తయారు చేసేందుకు సుమారు రూ.4 వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. స్వయంగా పనిచేసుకుంటే ఇది మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పలుకుతోందని ఈ సమయంలో అమ్ముకుని నష్టపోయేకన్నా.. ఇలా చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. వర్షాలు, తుపాన్లతో ఇబ్బంది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన తీరులో నిల్వ చేయకపోతే పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసినా, రోజుల తరబడి తుఫాన్ ఉన్నా ఇబ్బందే. దీనికి తోడు నేలమాలిగలకు అగ్ని ప్రమాదాలతో నష్టం కలుగుతుంది. బీడీ, సిగరెట్ ముక్కలు కాల్చి పడేయటం వలన ఇలాంటివి సంభవిస్తుంటాయి. షెడ్లు నిర్మిస్తే మేలు మహారాష్ట్రలో మాదిరిగా ఉల్లి సాగు చేసే రైతులకు ప్రభుత్వమే అండర్ గ్రౌండ్ షెడ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో వీటిని నిర్మించడం ద్వారా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. రైతులకు కూడా పంట నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ధర తక్కువగా ఉండటంతో.. నేను రెండెకరాల్లో ఉల్లి సాగు చేశా. సుమారు 22 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ధర లేకపోవడంతో నేలమాలిగ తయారు చేయించా. ఇందులో నిల్వ చేసి ధర పెరిగిన తర్వాత విక్రయిస్తా. – నారాయణరెడ్డి, రైతు, ఏన్కతల -
పాఠ్య పుస్తకాల పంపిణీ
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్స్వామి మాట్లాడుతూ.. మండలంలో అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిందన్నారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇప్పటికీ మండలంలో 80శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. మిగతావి కూడా త్వరలో రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సీఆర్పీ నారాయణ ఉన్నారు. -
పిడుగు పడి గేదె మృతి
యాలాల: పిడుగు పడి ఓ గేదె మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని విశ్వనాథ్పూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం తన పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. కొంత దూరంలో గడ్డి మేస్తున్న గేదె సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని పశువైద్య శాఖ అధికారులకు తెలియజేయడంతో సోమవారం ఘటన స్థలానికి చేరుకొని, పంచనామా నిర్వహించారు. జీవనాధారమైన గేదె మృతితో తనకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. -
రైతులతో మమేకం.. సాగుకు సన్నద్ధం
కొడంగల్ రూరల్: రైతులకు మేలైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా వానాకాలం సాగుకు సమాయత్తం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం(తాండూరు ఏరువాక కేంద్రం) ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులను నియోజకవర్గంలో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. సదస్సులకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులతో ఆధునిక వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, భూసార పరీక్షలు, పంట మార్పిడి పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలతోపాటు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పంటల సాగులో మెలకువలపై సూచనలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ నెల 13వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆరుసూత్రాలతో సాగు బాగు రైతులు తక్కువ ఖర్చుతో ఆరు సూత్రాలను ఆచరించి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడితోపాటు ఆర్థికంగా లాభాలు గడించే అవకాశం ఉంటుందని సదస్సుల ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చు తగ్గించుకోవడం, అవసరమైనంతలోనే రసాయనాలను వినియోగించడం, రశీదులను భద్రపరచడం, కష్టకాలంలో నష్ట పరిహారం పొందడం, సాగునీరు ఆదా చేయడం, భావి తరాలకు అందించడం, పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందడం, పొలం గట్లపై చెట్లను పెంచడం పర్యావరణ సమతుల్యత కాపాడడం వంటి ఆరు సూత్రాలతో అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ సదస్సులను నిర్వహిస్తున్నారు. దీంతో వ్యవసాయ పద్ధతుల్లో విశేష మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆరుగాలం శ్రమించిన కర్షకులు పేర్కొంటున్నారు.ఉత్సాహంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వానాకాలం సాగుపై అవగాహన గ్రామాల్లో కొనసాగుతున్న సదస్సులు విశేష స్పందన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో వ్యవసాయాధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతులకు మేలైన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరిస్తున్నాం. సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – శంకర్ రాథోడ్, ఏడీఏ, కొడంగల్ -
గుండెపోటుతో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
తాండూరు: ఎకై ్సజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పీబీ శ్రీనివాస్(55) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. మహబూబ్నగర్కు చెందిన ఆయన ఆరేళ్లుగా తాండూరు సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం సెలవు పెట్టి మహబూబ్నగర్లోని ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి మణికొండ: గుర్తు తెలి యని వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట ఎగ్జిట్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కోకాపేట సెక్టార్ ఎస్ఐ మురళీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోకాపేట ఎగ్జిట్ వద్ద ఓ వ్యక్తి రోడ్డుపై గాయాలతో పడి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అతడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు గుర్తించారు. అతని వివరాలు తెలియకపోవటంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీ ఏర్పాటు
అనంతగిరి: బీజేపీ వికారాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష తెలిపారు. పట్టణ ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, అశోక్ ముదిరాజ్, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్చారి, ప్రధాన కార్యదర్శులుగా ఉప్పు అమర్నాథ్, వెంకట్, కార్యదర్శులుగా ప్రశాంత్, గిరిజ, వినోద్, సువానీ, కోశాధికారిగా రాంమోహన్తో పాటు పలువురిని కార్యవర్గ సభ్యులుగా నిమించినట్లు ఆమె తెలిపారు. ధాన్యం మిల్లులకు తరలించండి అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ధారూరు: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని గట్టెపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం బస్తాలు తడిసే అవకాశం ఉందని, వెంటనే మిల్లులకు తరలించాని ఆదేశించారు. ఈసెట్లో సత్తా చాటిన విద్యార్థులు అనంతగిరి: పాలిటెక్నిక్ పూర్తి చేసి నేరుగా ఇంజనీరింగ్లో ప్రవేశం పొందడానికి ప్రభుత్వం నిర్వహించిన ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే రవీందర్ తెలిపారు. ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు గొల్ల శ్రీశైలం 3వ ర్యాంక్, గొల్ల స్వామి 62వ ర్యాంక్, అక్షయ 95వ ర్యాంక్, డి.అక్షయ్ రెడ్డి 103 ర్యాంక్, టి.సందీప్ 131 ర్యాంక్, ఎం.పృథ్విరాజ్ 158వ ర్యాంక్ సాధించారు. వీరిని ప్రిన్సిపాల్తో పాటు ఈసీఈ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ, అధ్యాపకుడు జయచంద్రారెడ్డి అభినందించారు. దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం పూడూరు: దేశ రక్షణతో పాటు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్ అన్నారు. ప్రధాని మోదీ తలపెట్టిన మన్కీబాత్ కార్యక్రమాన్ని ఆదివారం పూడూరులో స్థానిక నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజలకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, నాయకులు శ్రీశైలం, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా గ్రామపాలన అధికారి ఎంపిక పరీక్ష అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన గ్రామపాలన అధికారి ఎంపిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షకు 150 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 143 మంది వచ్చారని తెలిపారు. అంతకుముందు అధికారుల సమక్షంలో పరీక్ష పేపర్లకు సబంధించిన సీల్ ఓపెన్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, డీటీడీఓ కమలాకర్రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్ నేహామత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి
కొడంగల్: నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ పథకంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా మిషన్ భగీరథ అధికారుల్లో చలనం లేదు. రెండేళ్లుగా మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కోసారి రెండు మూడు రోజులు నీటి సరఫరా ఉండదు. సరఫరా చేసే రోజుల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. నల్లాల్లో నామమాత్రంగా నీరు వస్తోందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు నీరు వస్తుందో.. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతమెంతో ఘనం గతంలో మిషన్ భగీరథకు మంచి పేరు ఉండేది. రెండేళ్లుగా పథకం పని తీరులో మార్పు వచ్చింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని ఇంటింటికీ మంచినీటి సరఫరా జరిగేది. చాలా గ్రామాల్లో దాహర్తి తీరింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి వచ్చే నీటి సామర్థ్యం తగ్గింది. దీంతో కొడంగల్కు నీటిని సరఫరా చేసే స్థితిలో లేదు. పథకం ప్రారంభించిన కొత్తలో ఉదయం 6నుంచి 8 గంటల వరకు నీరు వదిలేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉదయం ఆరున్నర నుంచి గంట కూడా సరిగ్గా రావడం లేదని మహిళలు వాపోతున్నారు. కొన్ని కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. సుదూరం నుంచి.. శ్రీశైలం నుంచి కొడంగల్కు నీటి సరఫరా జరుగుతుందంటే మొదట్లో ఎవరూ నమ్మలేదు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది నుంచి మిషన్ భగీరథ పథకంలో కొడంగల్కు వచ్చిన నీటిని చూసి జనం ఆశ్చర్యపోయారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ కొడంగల్కు వస్తుంటే జనం పులకరించి పోయారు. పట్టణ శివారులోని సిద్దనొంపు సమీపంలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్లుటీపీ) నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ మేలు చేసిందని జనం మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఏమి జరిగిందో కానీ పూర్తి స్థాయిలో నీటి సరఫరా కావడం లేదనే అపవాదును మూటగట్టుకుంది. ఈ విషయంపై మిషన్ భగీరథ అధికారులను వివరణ కోరగా శ్రీశైలం నుంచి నీరు రావడం లేదని అంటున్నారు. ఒక్కోసారి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో నీరు రాకపోవడం వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. మిషన్ భగీరథలో సాంకేతిక సమస్యలే కారణం పట్టించుకోని అధికార యంత్రాంగం -
కరుణించమ్మా
ఇందిరమ్మా.. రెండు విడతల్లోనూ స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లుడబుల్ ఇళ్లు కేటాయించాలి గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. స్థలాలు లేని వారు ఆ ఇళ్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు 5,740 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. 2016లో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత వీటి సంఖ్యను 3,800కు కుదించారు. ప్రస్తుతం 2,257 నిర్మాణ దశలో ఉండగా 1,031 ఇళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. 512 ఇళ్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ధారూరులో 120 ఇళ్లు, మర్పల్లిలో 120, యాలాల మండలం కోకట్లో 180, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్లో 30 డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన కూడా ఏడాదిన్న క్రితమే పూర్తయ్యింది. కానీ ఇళ్ల కేటాయింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం స్థలాలు కూడా లేని తమకు ఈ డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని పలువురు పేదలు కోరుతున్నారు. వికారాబాద్: ప్రభుత్వం ఏదైనా నిరుపేదలను పట్టించుకోవడంలేదు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ వారికి ఇదే అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం ఇళ్లు లేని పేదలను రెండు కేటగిరీలుగా విభజించింది. ఇందులో స్థలం ఉండి ఇళ్లు లేని వారు.. రెండో కేటగిరీలో స్థలం కూడా లేని అత్యంత పేదలు.. సాధారణంగా ఎలాంటి గూడు లేని పేదలను సంక్షేమంలో ముందు వరుసలో కూర్చోబెట్టాలి. కానీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. స్థలాలు ఉన్న వారిని మొదటి విడతలో ఎంపిక చేయగా.. కనీసం కాసింత జాగా లేని వారిని ప్రాధాన్యతా క్రమంలో వెనక్కి నెట్టారు. రెండు విడతల్లోనూ స్థలాలు ఉన్నవారినే ఎంపిక చేశారు. దీంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు అయోమయంలో పడ్డారు. ఏడాది క్రితం ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా నుంచి 2.57లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు 1,48,668 మంది అర్హులని తేల్చారు. వీరిలో స్థలాలు కూడా లేని పేదలు 54,806 మంది ఉన్నట్లు గుర్తించారు. నత్తను తలపిస్తున్న ఇళ్ల నిర్మాణం ఏడాది గడిచినా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రక్రియ మూడు అడుగులు ముందుకు ఏడు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇళ్ల పథకాన్ని ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రారంభించారు కానీ వాటి నిర్వహణ విషయం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 14వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 2,285 ఇళ్లకు అనుమతులు మంజూరయ్యాయి. 300 నిర్మాణాలకు హౌసింగ్ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. 77 మంది పునాది పనులు పూర్తి చేయడంతో వారికి రూ.లక్ష చొప్పున అందజేశారు. మిగతా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. రెండో విడతలో మరో 14వేల ఇళ్లు మంజూరు కాగా.. 2,929 మందిని ఎంపిక చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు.. నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇంజనీర్ల కొరత కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జిల్లా మొత్తంలో ఈ పథకం అమలు చేసేందుకు ఒక పీడీ, నలుగురు డీఈలు, ముగ్గురు ఏఈలు మాత్రమే ఉన్నారు. జిల్లాకు మొదటి విడతలో మంజూరైన ఇళ్లు 14వేలు ఎంపిక చేసిన లబ్ధిదారులు 2,285మంది రెండో విడతలో మరో 14వేల ఇళ్లు ఎంపికై న వారు 2,929 మంది జిల్లాలో స్థలం లేని నిరుపేదలు 54,806 మంది ఆందోళనలో అర్హులు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని విన్నపంనేడు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు కుల్కచర్ల: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సోమవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన పత్రాలు అందజేయనున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. -
కాంగ్రెస్లో పదవుల పందేరం!
బషీరాబాద్: అధికార పార్టీలో పదవుల పందేరం మొదలైంది. పార్టీ సంస్థాగత నిర్మాణానికి టీపీసీసీ ఆదేశాలు జారీ చేయడంతో మండల కమిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. నేటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవారే మండల అధ్యక్ష పదవులకు అర్హులని అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పార్లమెంట్ ఎన్నికల సయమంలో కూడా బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు హస్తం గూటికి చేరారు. వీరు సైతం మండల పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ నిర్ణయంతో వారికి పదవులు దక్కే అవకాశం లేదు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ అధ్యక్ష, కార్యదర్శుల పదవుల్లో కొత్తవారికి చోటు ఇవ్వాలని టీపీసీసీ సూచించింది. ఇదిలా ఉండగా పార్టీ, నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతోనే తాము కాంగ్రెస్లో చేరినట్లు తాండూరుకు చెందిన ఓ నాయకుడు తెలిపారు. ఇప్పుడు కొత్త, పాత అని షరతులు పెట్టడమేంటని ప్రశ్నించారు. పార్టీ పదవుల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్టానం ఇప్పటికే సూచించింది. మండల అధ్యక్ష పదవులు ఎవ్వరికి ఇవ్వాలనే విషయాన్ని మండలాల వారీగా ముఖ్యనాయకులు సమావేశమై ముగ్గురు పేర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ద్వితీయశ్రేణి నాయకులకు సూచించారు. దీంతో ఆశావహులు పైరవీలు మొదలు పెట్టారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికే మండల అధ్యక్ష పదవులు కొత్తవారికి అనుబంధ కమిటీల్లో చోటు నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానంఅందరికీ న్యాయం జరగాలి పార్టీ పదవుల్లో పాత, కొత్త నాయకులను కలుపుకొని అందరికీ న్యా యం జరిగేలా అధి ష్టానం చర్యలు చేపట్టాలి. పార్టీ కోసం పనిచేస్తున్న వారందరినీ సమన్వయం చేస్తూ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తే మంచిది. – మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, బషీరాబాద్ -
భూములు లాక్కొని పొట్టకొట్టొద్దు
తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 187/1లో 50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోందని పలువురు రైతులు వాపోయారు. కొహెడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కొని తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో రెవెన్యూ అధికారులు 288 ఎకరాలకు ప్రీకాస్ట్ వాల్ ఏర్పాటు చేశారని, సుమారు 100కుపైగా రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు భూమి లేని కుటుంబాలు వ్యవసాయం చేసుకుని బతకడానికి కుటుంబానికి ఎకరం, రెండు ఎకరాల చొప్పున కేటాయించాయని.. అప్పటి నుంచి ఆ భూముల్లో పలు రకాల పంటలు పండిస్తున్నామని తెలిపారు. భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అధికారులు భూములను లాక్కునే ప్రయత్నాలు మానుకుని పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రైతుల ఆందోళన -
యథేచ్ఛగా మూడు ముక్కలాట
పరిగి: పరిగి నియోజకవర్గంతో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు జూదం ఆడుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు పరిగి పట్టణానికి వచ్చి పేకాట ఆడుతున్నారు. పట్టణాలతోపాటు ఆయా గ్రామాల శివారుల్లోని వ్యవసాయ పొలాలు, శిథిల భవనాలను అడ్డాగా చేసుకుంటున్నారు. ఫాంహౌస్లు, లాడ్జిల్లో.. వేసవి సెలవులు కావడంతో కొంత మంది గ్రూపులుగా ఏర్పడి పేకాట ఆడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. బడాబాబులు రహస్య ప్రదేశాల్లో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. చీకటి పడింది మొదలు అర్ధరాత్రి వరకు ఇదే తంతు కొనసాగిస్తున్నారు. పరిగి పట్టణంలోని ఓ లాడ్జిలో నిత్యం పేకాట ఆడుతున్నట్లు సమాచారం. అలాగే పట్టణ శివారులోని ఫాంహౌస్లు, మన్నెగూడ పరిసర ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకున్నట్లు సమాచారం. జూదంలో డబ్బులు పోగొట్టుకొని పలువురు రోడ్డున పడుతున్నారు. మరి కొంత మంది జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జూదాన్ని అరికట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో జోరుగా జూదం చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు వీధిన పడుతున్న కుటుంబాలు పట్టించుకోని పోలీసులుచర్యలు తీసుకుంటాం పేకాట స్థావరాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి.. తమకు సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో జూదం ఆడుతున్న వారిపై నిఘా ఉంచాం. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, సీఐ, పరిగి -
బస్సు చక్రం కింద పడిన మహిళ
తాండూరు రూరల్: ఆర్టీసీ బస్సు చక్రం కింద పడి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కరన్కోట్లో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాయమోళ్ల బాలమణి ఆదివారం ఉదయం కరన్కోట్ బస్టాండ్ వద్ద తన తల్లిని తాండూరు పట్టణానికి పంపించేందుకు వచ్చింది. ఆర్టీసీ బస్సులో వృద్ధురాలైన తన తల్లిని ఎక్కించి కిందికి దిగుతుండగా.. డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు కదిపాడు. దీంతో బాలమణి కింద పడడంతో ఎడమకాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లింది. స్థానికులు వెంటనే ఆమెను పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అటునుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక -
సిరులు కురిపిస్తున్న మూసీ!
నవాబుపేట: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రధాన జల వనరైన మూసీ నది మే నెలలో సైతం నీటితో కళకళలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గతంలో ఎన్నడూ లేనంతగా నది పారుతుంది. దీంతో పరీవాహక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే పశువులకు సైతం చుక్క నీరు లభించని మూసీ వాగులో ప్రస్తుతం జల సిరులు సందడి చేస్తున్నాయి. దీంతో ఎందరో రైతుల బతుకులకు భరోసా ఏర్పడింది. నవాబుపేటమండలంలో సుమారు 20 కిలో మీటర్ల పొడవునా మూసీ ప్రవహిస్తుంది. ఏటా సంక్రాంతి వచ్చే సరికి వాగులో చుక్క నీరు ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం వేసవిలో భారీ వర్షాలు కురవడంతో నది(వాగు) ఇంకా పారుతుంది. ఆ నీటిని సాగుకు ఉపయుక్తంగా స్థానిక కర్షకులు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. 500 ఎకరాల్లో కూరగాయల సాగు మండలంలోని చించల్పేట, అత్తాపూర్, చిట్టిగిద్ద, అక్నాపూర్, పులుమామిడి, నారెగూడ, లింగంపల్లి, గొల్లగూడ, గంగ్యాడ, ఎల్లకొండ, గుబ్బడిపత్తేపూర్, ముబారక్పూర్ గ్రామాల భూములు మూసీ నది పక్కన ఉన్నాయి. దీంతో ఆయా రైతులు మూసీ నది కింద దాదాపు 500లకు పైగా ఎకరాల్లో వరి, జొన్న, పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈసారి వేసవిలో సైతం అప్పుడప్పుడు భారీ వర్షాలు కురవడంతో ప్రస్తుతం మూసీలో నీటి నిల్వలు ఉన్నాయి. ఫలితంగా రైతులు ఆ నీటిని ఉపయోగించుకుంటూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాలు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నాయి. వేసవిలోనూ ఇంకిపోని నది పంటలతో కళకళలాడుతున్న పరీవాహక ప్రాంతాలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు -
నేడు ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: పట్టణంలోని ఆదర్శ తులసీనగర్లో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, 7 గంటలకు ధ్వజారోహణం, 8 గంటల వరకు అభిషేకం, 9.30 గంటల వరకు భగవద్గీత పారాయణం, గణపతి హోమం, 10.30 గంటల నుంచి భక్త సురేష్ ప్రవచనం, అనంతరం పేరిణి శివతాండవం నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి మహాప్రసాద వితరణ జరుపనున్నట్లు తెలిపారు. కావున భక్త జనులందరూ వార్షికోత్సవానికి హాజరై స్వామి వారి కరుణాకటాక్షాలు పొందాలని కోరారు. రేపు టీబీ ముక్తభారత్ అభియాన్ దౌల్తాబాద్: మండలంలోని మాటూరు గ్రామంలో ఈనెల 27న మంగళవారం టీబీ ముక్తభారత్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నివారణపై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిణి అమూల్య తెలిపారు. ఈ శిబిరంలో వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. రెండు వారాలు జ్వరం, ఛాతిలో నొప్పి ఉన్నవారు పరీక్షించుకోవాలన్నారు. ఈ శిబిరానికి జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి రవీందర్యాదవ్ హాజరవుతారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మందుల పిచికారీతో ఎండిన పంట పరిగి: ఫర్టిలైజర్ మందుల దుకాణదారుడి నిర్వాకంతో ఓ రైతు పంటను ఎండ బెట్టుకున్న సంఘటన మండల పరిధిలోని రాఘవపూర్లో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు తనకున్న 15 గుంటల పొలంలో కొత్తిమీరను సాగు చేశాడు. పంట చేతికి వచ్చిన సమయంలో ముందు జాగ్రత్తగా శనివారం పట్టణ కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో మందులను కొనుగోలు చేసి పంటపై పిచికారీ చేశారు. మరుసటి రోజు కొత్తిమీర ఎండు ముఖం పట్టింది. దీంతో రైతు దుకాణదారుడి దగ్గరకు వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో నిర్వాహకులు రైతుతో వాగ్వాదానికి దిగి బెదిరించారు. చేతికి వచ్చిన పంట నాశనం అయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి కందుకూరు: రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. ఈ సంఘటన శనివారం రాత్రి శ్రీశైలం హైవే రాచులూరు గేట్ సమీపంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న గుమ్మడవెల్లి అటవీ శాఖ అధికారి విజయ్భాస్కర్ సిబ్బందితో ఆ జింకను రాచులూరు పశువైద్యశాలకు తరలించారు. కాగా పశువైద్యుడు డాక్టర్ షాహీన్షేక్ ఆ జింకకు పోస్టుమార్టం నిర్వహించి, అటవీ అధికారులకు అప్పగించగా దానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, దండు రామకృష్ణలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు అడగ్గా డ్రైవర్లు లేవని చెప్పడంతో పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఘనంగా సామూహిక కుంకుమార్చన
కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయంలో ఆదివారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ భజన మండలి ఆధ్వర్యంలో లింగాష్టక పారాయణం, అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీమాణికేశ మహాసంస్థాన్ పీఠాధిపతులు శంకర్ స్వామిజీ ఆధ్వర్యంలో పార్వతీమాత అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి 201మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన చేశారు. భక్తిభావవనతో ఏదైనా సాధ్యం భారతదేశం సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయమని శ్రీమాణికేశ మహాసంస్థాన్ పీఠాధిపతులు శంకర్ స్వామిజీ అన్నారు. భక్తిభావనతో ఏదైనా సాధించవచ్చని, ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయం ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో గత 5 నెలలుగా పర్యటిస్తూ ఇప్పటివరకు 6వేలకు పైచిలుకు విగ్రహాలను పంపిణీ చేసినట్లు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ 16వందల విగ్రహాలు, ఆదివారం కొడంగల్లోని శ్రీమహాదేవుని ఆలయంలో 201విగ్రహాలను మహిళలకు అందించినట్లు ఆయన తెలిపారు. భగవంతుని భక్తితో ఆరాధిస్తే శక్తిసామర్థ్యాలు పెరుగుతాయని అన్నారు. సాయంత్రం వీరశైవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్.గురునాథ్రెడ్డి కుటుంబసభ్యులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు నారాయణ, రవికిరణ్, పుండరీక, వెంకటయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, కొడంగల్ వీహెచ్పీ, హిందూవాహిని కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహాదేవుని ఆలయంలో శ్రీమాణికేశ మహాసంస్థాన్ పీఠాధిపతి ప్రత్యేక పూజలు -
గాల్లో వేలాడుతున్న ప్రమాదం
చేవెళ్ల: విచ్చలవిడిగా వెలుస్తున్న హోర్డింగ్లు, బ్యానర్లతో ప్రమాదాలు పొంచి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం ఓ హోర్డింగ్కు కట్టిన బ్యానర్ గాలికి చిరిగిపోయి విద్యుత్ హైటెన్షన్ వైర్లపై పడి ఇలా ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం గాలి అధికంగా వీచినా పెను ప్రమాదం సంభవించే ఆస్కారం లేకపోలేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చినిగిపోయిన బ్యానర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
నత్తనడకన నిర్మాణ పనులు
దౌల్తాబాద్: నత్తనడకన సాగుతున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులతో అధికారులు, గ్రామస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలనే సంకల్పంతో గత ప్రభుత్వ హయాంలో దౌల్తాబాద్ మండలంలోని ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున 21 పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులను 8 పంచాయతీల్లో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టారు. 12 పంచాయతీల్లో అసలు పనులే ప్రారంభించలేదు. నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే పనులు వదిలేశారని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో సమావేశాలు నిర్వహించడానికి, పంచాయతీల్లోని రికార్డులు భద్రపర్చుకోవడానికి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంతలోనే ప్రభుత్వం మారడంతోపాటు సర్పంచుల పదవీకాలం ముగియడంతో భవన నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మంజూరైన గ్రామ పంచాయతీలు అల్లాపూర్, బండివాడ, గుముడాల, కుప్పగిరి, లొట్టికుంటతండా, నందారం, నంద్యానాయక్తండా, నీటూరు, పోల్కంపల్లి, చంద్రకల్, సుల్తాన్పూర్, సురాయిపల్లి, దేశాయిపల్లి, యాంకి, చల్లాపూర్, ఇండాపూర్, కౌడీడ్, ఈర్లపల్లి, ఊరగుంట, నాగసార్, సంగాయిపల్లి గ్రామపంచాయతీలకు 2022లో ప్రభుత్వం పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేసింది. అయితే 21 పంచాయతీల్లో నంద్యానాయక్తండా, ఎల్జీతండా, సురాయిపల్లిలో మాత్రమే పూర్తయింది. మిగిలిన 12 పంచాయతీల్లో పనులు ప్రారంభం కాలేదు. 6 పంచాయతీల్లో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పోల్కంపల్లిలో పిల్లర్ల వరకు నిర్మించారు. నందారంలో స్లాబ్ వరకు పనులు జరిగాయి. ఇలా కొన్ని గ్రామాల్లో అసంపూర్తి దశలో ఉన్నాయి. ఈ విషయమై పీఆర్ఏఈ నాగేంద్రకుమార్ను వివరణ కోరగా.. ఎన్ఆర్ఈజీఎస్లో మంజూరైన భవనాలు నిర్మించడం లేదన్నారు. ప్రస్తుతం కడాలో మంజూరు చేయించి పూర్తి చేయిస్తున్నాం. త్వరలో పూర్తయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. నిధులలేమితో పంచాయతీ భవనాలకు గ్రహణం అవస్థలు పడుతున్న గ్రామస్తులు, అధికారులు -
భవనం పైనుంచి పడి మేసీ్త్ర మృతి
కుల్కచర్ల: బతుకుదెరువు కోసం వలస వెళ్లిన భవన నిర్మాణ మేసీ్త్ర ప్రమాదవశాత్తు భవనం నుంచి కిందపడి మృతి చెందిన ఘటన కుల్కచర్ల మండలంలో విషాదం నింపింది. స్థానికుల వివరాల ప్రకారం.. గోరిగడ్డ తండా గ్రామపంచాయతీలోని అంతిగానికుంటకు చెందిన టిక్యానాయక్(40) తన భార్య లక్ష్మి, కుమారులు సునీల్, విశాల్లతో కలిసి పూణెలోని వర్ాధ్యరాంనగర్ ప్రాంతంలో భవన నిర్మాణంలో మేసీ్త్రగా పనిచేసేందుకు 25 ఏళ్ల క్రితం వెళ్లారు. అప్పటి నుంచి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు టీకీబాబు, బద్రియానాయక్ల దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇటీవల టిక్యానాయక్ అన్నకూతురి పెళ్లికి వచ్చి తిరిగి పూణె వెళ్లారు. ఆదివారం ఉదయం ఆయన 14 అంతస్తుల భవన నిర్మాణంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. ఆర్థిక ప్రగతి కోసం ఉన్న ఊరును వదిలి వెళ్లిన ఆయన విగత జీవిగా రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
పచ్చిరొట్ట ఎరువుల జాడేది?
● జీలుగ, జనుము, పిల్లిపెసరు విత్తనాల ఊసెత్తని ప్రభుత్వం ● ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు దుద్యాల్: పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి జనుము, జీలుగ, పిల్లిపెసరు వంటి వివిధ రకాల విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట సీజన్ ప్రారంభమైన తరుణంలో వ్యవసాయశాఖ అధికారులు సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంపై కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడిలో ప్రభావం చూపే ఎరువుల విషయంలో నిర్లక్ష్యం తగదని పేర్కొంటున్నారు. మెండుగా ప్రయోజనం పశువుల పేడ, వర్మి కంపోస్టు ఎరువులు ఉపయోగిస్తే ఆశించిన మేర దిగుబడి పొందే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అలాంటి ఎరువులు అందుబాటులో లేని వారు మాత్రం పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లుకుంటున్నారు. ముఖ్యంగా వరి పండించి పొలంలో జీలుగ, జనుము, పిల్లి పెసరు వంటి వాటిని వేసి ఎరువుగా మలుచుకుంటున్నారు. పంట సాగు చేసే ప్రారంభ సమయానికి పచ్చి రొట్ట పైరు ఏపుగా పెరిగి పూత దశకు చేరుకోవాలి. అప్పుడే మొక్కలు ఎరువుగా తయారవ్వడానికి ఉపయోగపడుతాయి. అంటే ప్రధాన పంట వేసే రెండు నెలల ముందే పచ్చిరొట్ట పైరు విత్తనాలు పొలంలో విత్తుకోవాలి. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత యంత్రంలో కలియ దున్నాలి. భూమిలోనే మరిగిపోయి ఎరువుగా మారుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
మొక్కల ఎదుగుదలను గమనించండి
ఎంపీడీఓ విజయలక్ష్మి మోమిన్పేట: నర్సరీల్లో మొక్కల ఎదుగుదలను గమనించాలని ఎంపీడీఓ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని దుర్గంచెర్వులో పర్యటించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటాల్సిన అవసరం ఉంటుందని.. నర్సరీల్లోని మొక్కల్లో ఎదుగుదల కనిపించడం లేదన్నారు. అనంతరం పంచాయతీల్లో రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శద్ధ్ర చూపాలని చెప్పారు. చికిత్స పొందుతున్న యువకుడి మృతి కుల్కచర్ల: చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం.. పుట్టపహాడ్ గ్రామానికి చెందిన హరివర్దన్(18) మంగళవారం రాత్రి పుట్టపహాడ్ శివారులో ఆగిఉన్న లారీని ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సపొందుతున్న యువకుడు శుక్రవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. సెల్ఫోన్ రికవరీ కుల్కచర్ల: సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సహకారంతో దొంగిలించబడిన సెల్ఫోన్ను రికవరీ చేయవచ్చునని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ అన్నారు. గ్రామానికి చెందిన చాకలి మహేశ్ వద్ద గతేడాది జూన్ 1న ఎస్బీఐ బ్యాంకు ఎదుట గుర్తు తెలియని దొంగ సెల్ఫోన్ చోరీ చేశారు. దీంతో పోలీసులు సీఈఐఆర్ విధానంలో ఫోన్ను గుర్తించారు. శుక్రవారం బాధితుడికి ఫోన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రఘు తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులపై కేంద్రం తీరు సరికాదు పరిగి: మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యహరిస్తోందని సీపీఐ డివిజన్ కార్యదర్శి పీర్మహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించినప్పటికీ అక్కడి సీఎం కావాలనే ఎన్కౌంటర్ పేరిట అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మనుషుల ప్రాణాలను తీసే విధానా లను విజయంగా చూసే పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సాయుధ బలగాలను వెనక్కి రప్పించి, మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు. రావి ఆకుపై ‘కాలకేయుడు’ దౌల్తాబాద్: మండలంలోని యాంకి గ్రామానికి చెందిన చిత్రకళాకారుడు సున్నపు అశోక్ రావి ఆకుపై సినీనటుడు కాలకేయ ప్రభాకర్ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం నగరంలోని ప్ర భాకర్ ఇంటికి వెళ్లి ఆయనకు బహూకరించారు. -
పరీక్షకు ‘ఆధార్’ తప్పనిసరి
● కలెక్టర్ ప్రతీక్ జైన్అనంతగిరి: జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామ పాలన అధికారి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని, పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కింది సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు. ● అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, అందులో వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. పరీక్ష కేంద్రం చిరునామాను గుర్తించుకోవాలి. ● అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి. వాటిలో ఒక ఫొటోను హాల్ టికెట్పై అతికించి నియంత్రణాధికారి(కంట్రోలింగ్ ఆఫీసర్)తో సంతకం చేయించాలి. మరో ఫొటోను పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. ● పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, డిజిటల్ వాచ్లులు, పెన్డ్రైవ్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. కావున ఎవరూ తీసుకురాకూడదు. ● అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలి. జెల్ పెన్ను ఉపయోగించరాదు. ● పరీక్ష గదిలో అభ్యర్థులు నిశ్శబ్దంగా ఉండాలి. పర్యవేక్షకుల సూచనలు పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు ఉంటాయి. ● అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ధేశించిన సమయానికి రావాలి: ఉదయం 10:00 గంటలలోపు కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. ● ఎంప్లాయ్ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. -
నష్టం అంచనాకు సర్వే
● పారిశ్రామికవాడ కోసం రైతులు ఇచ్చిన పొలాల్లో పర్యటించిన అధికారులు ● వ్యవసాయ బోర్లు, పశువుల పాకలు, చెట్లు, ఫామ్ హౌస్ల లెక్కింపు ● ప్రత్యేక పరిహారం అందిస్తాం: తహసీల్దార్ కిషన్ ● పర్యవేక్షించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ దుద్యాల్: పారిశ్రామికవాడకు భూములు ఇచ్చి న రైతుల పొలాల్లో శుక్రవారం అధికారులు పర్యటించారు. దుద్యాల్ మండలం హకీంపేట్, లగచర్ల, పులిచర్లకుంట తండాల్లో సర్వే నిర్వహించారు. రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన పొలాల్లోని వ్యవసాయ బోర్లు, పశువుల పాకలు, ఇళ్లు, విలువైన చెట్లను పరిశీలించారు. ఆయా గ్రామాలకు చెందిన 140 మంది రైతుల పొలాల్లో పైపేర్కొన్న వాటికి విలువ కట్టారు. ఆర్అండ్బీ అధికారులు పొలాల్లోని ఇళ్లు, ఫామ్ హౌస్ల విలువను అంచనా వేశారు. హార్టి, సిరి కల్చర్ అధికారులు పండ్ల తోటల ను, అటవీ శాఖ అధికారులు పెద్ద పెద్ద చెట్లను, ఎకై ్సజ్ అధికారులు ఈత చెట్లను, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు బోర్ల విలువ ను అంచనా వేశారు. ఈ ప్రక్రియ రెండు రోజు ల పాటు సాగుతుందని తహసీల్దార్ కిషన్ తెలి పారు. ప్రక్రియ పూర్తికాగానే ఏ రైతు పొలంలో ఏ మేరకు నష్టం జరుగుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, అనంతరం పరిహారం మంజూరవుతుందని తెలిపారు. పది రోజుల క్రితం హకీంపేట్ గ్రామా నికి చెందిన కొంత మంది రైతులకు ఈ తరహా పరిహారం అందజేసినట్లు ఆయన తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య.. లగచర్ల ఘటన నేపథ్యంలో హకీంపేట్, లగచర్ల, పులిచర్లకుంట తండాల్లో పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు. సర్వే అధికారికి ఒక ఎస్ఐ, కొంత మంది పోలీసులను కేటాయించారు. ఇలా గ్రూపులుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ ను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పరిగి సీఐ శ్రీనివాస్రెడ్డి, కొడంగల్ ఎకై ్సజ్ సీఐ వెంకటేశ్వరులు, దుద్యాల్, కొడంగల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్ ఎస్ఐలు యాదగిరి, సత్యనారాయణ, రహూఫ్, రవిగౌడ్, కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు,మహిళా పోలీసులు, ఆర్ఐ నవీన్ కుమా ర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు
బీబీనగర్: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మొయినాబాద్కు చెందిన చేగూరి రామస్వామిగౌడ్(60), లక్ష్మి దంపతులు వారి కోడళ్లు భూమిక, మనీషతోపాటు వీరి పిల్లలు అక్షిత్, అక్షయ్, శ్రీయాంక, సహస్రలతో కలిసి గురువారం సాయంత్రం కారులో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బీబీనగర్కు రాగానే జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ సమీపంలో కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్లో వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా రామస్వామి, లక్ష్మితోపాటు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామస్వామి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
‘ఆపరేషన్ సిందూర్’లో టెర్రరిస్ట్ స్థావరాలు నేలమట్టం
పూడూరు: ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలను కూల్చేసిన కల్నర్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ భూమిక ప్రధాన పాత్ర పోషించి విజయవంతం చేయడం జాతికి గర్వకారణమని జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ అన్నారు. శుక్రవారం మాడల్ స్కూల్లో ఉపాధ్యాయ శిక్షణ అనంతరం ఎక్స్ సర్వీస్మెన్ గోవర్ధన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులను సాహస నారీమనులుగా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ -
తెలుగు పద్యంతో సృజనాత్మకత
అనంతగిరి: తెలుగు పద్యం విద్యార్థులకు ఏకాగ్రత, సుజనాత్మకతను పెంచుతుందని ప్రముఖ శతావధాని, సాహితీవేత్త డాక్టర్ మలుగ అంజయ్య అన్నారు. వికారాబాద్లోని డైట్ కళాశాలలో తెలుగు భాషోపాధ్యాయుల శిక్షణ కేంద్రంలో పద్య వైభవం అనే అంశంపై శుక్రవారం ఆయన విస్తృత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు పద్యం క్రీ.శ 6వ శతాబ్దం నుంచి ఉన్నదని, నన్నయ కాలం మహాభారతం తరువాత లయబద్ధమైన పద్యం వచ్చిందన్నారు. పద్యంలో కావ్యాలు, శతకాలు, ఖండ కావ్యాలు, రామాయణ, భారత భాగవతాలు తెలుగు భాషలో వచ్చాయన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత పెంచడానికి పద్యం ఉపయోగపడుతుందన్నారు. ఒకనాటి కవులు సాహితీ లోకంలో పద్యమే ప్రాణంగా భావించారన్నారు. కార్యక్రమంలో శిక్షణ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ మున్నూరు రాజు, సెక్టోరియల్ ఆఫీసర్ రజిత, డీఆర్పీలు సుధాకర్ గౌడ్, ఎన్నారం శ్రీనివాస్, ఘనపురం పరమేశ్వర్, రాజ్ కుమార్, శేఖర్, బుర్రి శేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి దుద్యాల్: ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, ప్రతి రోజు కొత్త విషయం తెలుసుకోవాలని ఉపాధ్యాయ జిల్లా రిసోర్స్ పర్సన్ వీరేశం గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వీరేశంగౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే అని గుర్తు చేశారు. అందుకు తగినట్టుగా తరగతి బోధన ఉండాలని సూచించారు. అనంతరం మండల విద్యాధికారి విజయరామారావు మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తి గుర్తించి వారికి తగిన విధానంలో బోధన చేయాలని.. ఉపాధ్యాయుడి భోదన, భాష విద్యార్థిని ఆకట్టుకునేట్టుగా ఉండాలని సూంచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్, వెంకటయ్య, సంపత్, శంకరప్ప, అస్మాసుల్తాన, ఆర్షియా బేగం, తేజస్విని, సక్కుబాయి తదితరులు ఉన్నారు. ప్రముఖ సాహితీవేత్త మలుగ అంజయ్య -
మా‘మిడి’!
● ఈసారి భారీగా తగ్గిన పండ్ల దిగుబడి ● అరకొరగా కాసిన తోటలు ● ముంచిన అకాల వర్షాలు, ఈదురు గాలులు పూడూరు: ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే 25శాతం చెట్లు మాత్రమే కాపు కాసాయి. దీనికితోడు వరుస అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో తోటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పండ్ల ధరలు భారీగా పెరిగాయి. నోరూరిస్తున్న ఫలాలు మార్కెట్లో విక్రయానికి పెట్టిన మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. మండల పరిధిలోని మన్నెగూడ ప్రాంతం మామిడి పండ్లకు ప్రసిద్ధి గాంచింది. పూడూరు, ఎన్కేపల్లి, మన్నెగూడ, గొంగుపల్లి,బాకాపూర్,మీర్జాపూర్ తదితర గ్రామా ల్లోని వేలాది ఎకరాల్లో ఈ తోటలు సాగవుతు న్నాయి.వీటిలో దశేరి, చిన్నరసాలు, పెద్దరసా లు, బేనిషాన్,మల్గోబా,బంగిన్పల్లి,తోతాపరి, లంగ్డా, సఫేదా తదితర రకాలున్నాయి. ఈ ప్రాంతంలోకాచే మామిడికి వికారాబాద్ మహమూదా అని పేరు పెట్టారు.గతంలో కాయలు కోసం కార్బైడ్ వేసి మాటు వేసే వారు. ప్రభు త్వం దీన్ని నిషేధించడంతో తక్కువ మోతాదులో ఉన్న రసాయనాలతో సహజసిద్ధమైన పండ్లను విక్రయిస్తున్నారు. ఆయా రకాలనుబట్టి కిలోకు రూ.80 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. తాజాగా, ప్రకృతిసిద్ధంగా దొరికే పండ్లు కావడంతో వినియోగదారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దారి పొడవునా దుకాణాలే.. మధుర ఫలంగా పేరున్న మామిడిని తినేందుకు అన్ని వయసుల వారు ఆసక్తి చూపుతారు. ఈక్రమంలో మన్నెగూడ సమీపంలోని హైదరాబాద్– బీజాపూర్ హైవే పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. జిల్లా ప్రజలతో పాటు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించే వారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. స్థానిక తోటల్లోని దిగుబడులు మహబూబ్నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, దుబాయ్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. దిగుబడి లేదు ఈసీజన్లో చాలా తోటలకు పూత, కాత రాలేదు. లక్షల రూపాయలు పెట్టి తోటలు కొనుగోలు చేశాం. ఈదురు గాలులకు తీవ్రంగా నష్టపోయాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ సహజసిద్ధమైన పండ్లను విక్రయిస్తున్నాం. – రహీస్, మామిడి పండ్ల వ్యాపారి -
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం
తాండూరు: నియోజకవర్గంలోని ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగ కల్పనే లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ నెల 29న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నర సమయంలోనే స్థానిక పరిశ్రమల్లో యువత ఉద్యోగాలు కల్పించామన్నారు. జిన్గుర్తి పారిశ్రామిక వాడ పనులు సైతం వేగంగా కొనసాగతున్నాయన్నారు. తాండూరు నాపరాతి పాలిషింగ్ యూనిట్లకు కేంద్రంగా ఉండేదని గత పాలకుల స్వార్థంతో నాపరాతి పరిశ్రమలు కర్ణాటకకు తరలిపోతున్నాయన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 50 కంపెనీలలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ నెల 29న తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేగా ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రెండు నెలల క్రితం నిర్వహించిన మహిళా జాబ్ మేళా ద్వారా 120 మంది మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్రెడ్డి, మాధవరెడ్డి, బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్చంద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, మండలాల అధ్యక్షులు నర్సింహులు, గోపాల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. భూ బాధితులకు పరిహారం తాండూరు పట్టణ శివారులో నర్సింగ్ కళాశాల నిర్మాణంలో భూమి కోల్పోయిన ఇద్దరు మహిళా రైతులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి నష్ట పరిహారం అందించారు. బషీర్మియా తండాకు చెందిన కేతావత్ మల్కిబాయి, కేరిబాయిలకు సర్వేనెంబర్ 52/7లో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం స్వాధీనం చేసుకొంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో వారికి రూ.54 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
పేదరిక నిర్మూలనకు కృషి
● తెలంగాణ సమ్మిళిత జీవనోపాధిని జయప్రదం చేయాలి ● సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కొడంగల్: తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల పాత్రపై సభ్యులకు పేదరిక నిర్మూలనపై అవగాహన కల్పించాలని, అందుకు తగినట్లు కార్చాచరణ రూపొందిస్తూ అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యదర్శి(సెర్ప్ సీఈఓ) దివ్య దేవరాజన్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని కడా కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్, అడిషనల్ కలెక్టర్ సుధీర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, మండల మహిళా సమాఖ్య, వికారాబాద్ మహిళా సమాఖ్య సభ్యుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సీఆర్పీల సహకారంతో పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తూ వారికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహిస్తూ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమాన్ని వివరించారు. ఇందులో ఎంపిక చేసే అత్యంత పేదరికం కుటుంబాలకు ఆయా శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. శాఖల అధికారులకు సెర్ఫ్ ఆధ్వర్యంలో పూర్తి సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అంగడిరాయిచూర్ గ్రామంలో మహిళా శక్తి కుట్టు కేంద్రంను కలెక్టర్ ప్రతీక్జైన్, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, సెర్ఫ్ సీఓఓ రజిత, టీజీఐఎల్పీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జయరాం, రవీందర్రావు, సెర్ఫ్ డీపీఎం రామ్మూర్తి, శ్రీనివాస్, ఆర్ఎం ఉదయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు టౌన్: తాండూరు పట్టణ శివారులోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల ప్రిన్సిపాల్ ప్రవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురుకులంలోని ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ బోధించుటకు, కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజి బోధించుటకు అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను ఈనెల 30వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా గురుకులంలో అందజేయాలని కోరారు. జాబ్మేళానుసద్వినియోగం చేసుకోవాలి యాలాల: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్, మార్కెటింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్ యాలాల మండల అధ్యక్షుడు వీరేశం ముదిరాజ్ శుక్రవారం కోరారు. ఎమ్మె ల్యే మనోహర్రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్మేళా ఉంటుందన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సైన్స్పై ఆసక్తి కలిగేలా బోధన సాగాలి జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పూడూరు: శాసీ్త్రయ దృక్ఫథాన్ని పెంపొందిస్తూ విద్యార్ధులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా బోధన చేయాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎన్కేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఘన ప్రదార్థాలలో ధ్వని ప్రసరణ వేగవంతం జరుగుతుందనే ప్రయోగాన్ని వివరించారు. సెల్ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ ఎలా మాట్లాడుతున్నామనే దాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్ రవికుమార్ నాయక్, లాలయ్య, అకాడమిక్ మానిటరింగ్ అధికారి రామ్మస్తాన్, సెక్టోరియల్ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, రిసోర్సు పర్సన్లు రాందాస్, బాల్రాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిని కట్టడి చేద్దాం టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ కొడంగల్ రూరల్: క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ కట్టడికి కృషి చేయాలని టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. శుక్రవారం మండలంలోని రుద్రారం గ్రామ రైతు వేదికలో అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో టీబీ అనుమానితులతోపాటు, డయాలసిస్, షుగర్, బీపీ, హెచ్ఐవీ తదితర వ్యాధులకు సంబంధించి 120మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 41మందిని కొడంగల్ ఆస్పత్రికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నా, సాయంత్రం సమయంలో జ్వరం వచ్చినా, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచిచారు. అవగాహన అవసరం దోమ: టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన ఉండాలని జిల్లా టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్ అన్నారు. శుక్రవారం దోమ మండల కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సీహెచ్ఓ విజయలక్ష్మి, పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్ అఖిల్తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ ప్రభులింగం, డీపీఓ హైదర్ అలీ, ఎస్టీఎల్ఎస్ నవీన్గౌడ్, రాజు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రైతు నోట్లో ఎర్రమట్ట్టి!
మైనింగ్ తవ్వకాల నుంచి వస్తున్న దుమ్ము ప్రభావం పంటలపై పడుతోంది. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసినా పంటలు చేతికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడూరు: పంట పొలాల మధ్య మైనింగ్ తవ్వకాలు చేపట్టి రైతుల కష్టాన్ని కాలరాస్తున్నారు. కొందరు అక్రమార్కులు మైనింగ్ అధికారులతో చేతులు కలిపి లాటరైట్(ఎర్రమట్టి)ను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. లాటరైట్ను సిమెంట్ తయారీలో ముడి పదార్థంగా వాడడంతో రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. విషయం తెలిసినా మైనింగ్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని మీర్జాపూర్లో పంట పొలాల మధ్య తవ్వకాలు చేపట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ మొత్తంలో అనుమతులు తీసుకునిచుట్టూ ఉఉన్న భూమిలోనూ మట్టి తవ్వకాలు చేపట్టి సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాల మధ్య లోతైన గుంతలు తవ్వడంతో భూగర్బజాలు తగ్గి బోర్లలో నీరు రావడం లేదని పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలపై ఎర్రమట్టి దుమ్ము పడి పంటలు దెబ్బతింటున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదగలేక ఎండిపోతున్న పైర్లు అనుమతులకు మించి తవ్వకాలు పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులు -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
● కలెక్టర్ ప్రతీక్ జైన్దౌల్తాబాద్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నతశిఖరాలు చేరుకోవాలని కలెక్టర్ ప్రతీక్జైన్ యువతకు సూచించారు. మండల కేంద్రంలో రూ.68 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దౌల్తాబాద్లో అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఇక్కడ చిన్న పిల్లలకు, నిరుద్యోగ యువతకు, అన్ని వర్గాల వారికి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పిల్లలకు ఆట వస్తువులు, కంప్యూటర్లు ఉన్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు కంప్యూటర్పై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని యువకులు, పిల్లలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వికారాబాద్, నారాయణపేట జిల్లాల చైర్మన్లు రాజేశ్రెడ్డి, వార్ల విజయ్కుమార్, తహసీల్దార్ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనివాస్, నాయకులు వెంకట్రావు, వీరన్న, వెంకట్రెడ్డి, విజయ్కుమార్, ప్రమోధ్రావు, రెడ్డి శ్రీను రాజశేఖర్రెడ్డి, రాజు, నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
దుద్యాల్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని నాజుఖాన్పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బండమీది నర్సమ్మ (50) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. వాటిని భరించలేని ఆమె పొలం వద్దకు వెళ్లి చీరతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్తాకు 41 కిలోలే ఫైనల్
● ఎక్కువ ధాన్యం తూకం వేస్తేకఠిన చర్యలు ● అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బషీరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు 41 కిలోలే వడ్లు తూకం వేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ నిర్వాహకులను ఆదేశించారు. అంతకంటే ఎక్కువ తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో మిల్లర్ల మాయాజాలం.. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మండలంలోని కాశీంపూర్, మైల్వార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తాలు సాకుతో ఒక్కో బస్తాకు 42 నుంచి 42.50 కిలోలు ధాన్యం తూకం ఎందుకు వేశారని కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించారు. వాస్తవానికి ఒక్కో బస్తాకు 40.650కిలోలే తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైన తాలు ఉంటే బస్తాకు 41కిలోలు తూకం వేయాలని సూచించారు. మిల్లర్లు చెప్పారని 42 కిలోలపైన తూకం వేయడంపై ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందిపై మండిపడ్డారు. ఇక నుంచి ధాన్యం శుభ్రపరచడానికి జిల్లాకు 50 ప్యాడీ క్లీనర్ యంత్రాలు వచ్చినట్లు వివరించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు 24లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అందనంగా 25లారీలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 45వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బషీరాబాద్ డీటీ రుక్సానా బేగం, ఏపీఎం పద్మరావు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. -
అటవీ భూమి ఆక్రమణ!
చెట్లు నరికి మట్టి రోడ్డు ఏర్పాటు ● వారం రోజుల క్రితం డీఎఫ్ఓకు ఫిర్యాదు ● ఆలస్యంగా వెలుగులోకి.. బొంరాస్పేట: ఒక చెట్టు ఒక మనిషితో సమానం అని చెప్పే అటవీశాఖ అధికారులు చెట్లను నరికి అడవిని కబ్జా చేస్తున్నా పట్టించుకోవడంలేదు. అటవీ భూమి ఆక్రమణపై కొంత మంది రైతులు డీఎఫ్ఓకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొంరాస్పేట మండలం ఎన్కేపల్లి, రేగడిమైలారం, వడిచర్ల గ్రామాల శివారులో రెవెన్యూ రికార్డుల ప్రకారం తిర్మలాపూర్ అనే గ్రామం ఉంది. ఇక్కడ చాలా కాలం నుంచి జన సంచారం లేకపోవడంతో అటవీప్రాంతంగా మారిపోయింది. గతంలో టెనెంట్ పట్టా కింద గ్రామ శివారులో ఎన్కేపల్లికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన పలువురు దాయాదులకు సర్వే నం.13, 15, 19లో పట్టా భూమి ఉంది. అందులో వీఎస్ఎస్ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పూజారి నర్సింలుకు సైతం 4.9ఎకరాల భూమి ఉంది. దీనికి సమీపంలోని అటవీ భూమిని కబ్జా చేస్తూ వచ్చాడు. అడవిలోని ఆలయాలకు మట్టి రోడ్డు వేస్తున్నట్లు అక్కడి రైతులను నమ్మించాడు. అనంతరం తన పొలానికి.. ఆక్రమించిన అటవీ భూమిలో మట్టి రోడ్డు వేశాడు. అక్కడి నుంచి తిర్మలాపూర్ శివారులోని అటవీప్రాంతం(ఆర్ఎఫ్)లోకి ప్రవేశించి జేసీబీతో ట్రెంచింగ్ను పూడ్చివేసి, మట్టిని తవ్వి, చెట్లను నరికి రోడ్డు ఏర్పాటు పనులు చేపట్టాడు. ఇందుకోసం దాదాపు 200ల చెట్లను నరికేసినట్లు సమాచారం. 20 లారీల మట్టి తవ్వి సుమారు అర కిలోమీటరు మేర మట్టి రోడ్డు వేశాడు. తన పొలం పక్కన ఉన్న నాలుగు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో నర్సింలుపై నష్టపరిహారంతోపాటు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అటవీ భూమిని ఆక్రమించి రోడ్డు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్ఓ సవిత తెలిపారు. అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు మట్టిరోడ్డును తొలగిస్తామని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పరిశీలన అటవీ భూమి కబ్జా, మట్టి రోడ్డు ఏర్పాటుపై ఈనెల 15న కొంత మంది రైతులు డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు స్పందన కనిపించలేదు. ఈ విషయం అటవీశాఖ ఉన్నత స్థాయి అధికారులకు తెలియడంతో శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ కబ్జాకు గురైన భూమిని పరిశీలించేందుకు వచ్చింది. కఠిన చర్యలు తప్పవు అటవీ భూమిని ఆక్రమించడం, మట్టి రోడ్డు వేయడం వాస్తవం. ఇది చట్టరీత్యా నేరం. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. ఇప్పటికే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశాం. జరిమానా విధించడం తోపాటు అడవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయిస్తాం. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటాం. – జ్ఞానేశ్వర్, డీఎఫ్ఓ -
వికారాబాద్లో తనిఖీలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాల్లో బుధవారం డాగ్ స్క్వాడ్, బీడీ టీంలు తనిఖీలు చేపట్టాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. కడ్తాల్ ఎస్ఐకి ఉత్తమ పోలీసు అధికారి అవార్డు కడ్తాల్: నేర పరిశోధన విభాగం 2024 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కడ్తాల్ ఎస్ఐ వరప్రసాద్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్నారు. పీఎస్ పరిధిలో నమోదైన పలు కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతో, ఉత్తమ సేవలకు గానూ బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎస్ఐ వరప్రసాద్తో పాటు బెస్ట్ హోంగార్డుగా అవార్డు తీసుకున్న పాండును సీఐ గంగాధర్, పోలీసులు అభినందించారు. ప్రేమ పేరుతో మోసం సాఫ్ట్వేర్ ఉద్యోగికి రిమాండ్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన దుబ్బాక సాగరిక ఆదిబట్ల టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2022లో కోల్కటా టీసీఎస్లో పని చేసిన సమయంలో సహోద్యోగి పత్లావత్ సంజీవతో ఆమెకు పరియచం ఏర్పడింది. ప్ర స్తుతం వీరిద్దరూ ఆదిబట్ల టీసీఎస్లో ఉద్యో గం చేస్తూ సహజీవనంలో ఉన్నారు. ఈక్రమంలో సాగరిక గర్భం దాల్చింది. దీంతో సంజీవ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు, బుధవారం అతన్ని రిమాండ్కు తరలించారు. సాగరికకు అబార్షన్ చేసిన తుర్కయంజాల్లోని మహోనియా ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వం
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ యాలాల: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు బెన్నూరు, లక్ష్మినారాయణపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశా రు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా, తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తూకం వేసిన ధా న్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. లారీల కొరత ఉందని ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ వేణు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టీబీ ముక్త్ అభియాన్ అనంతగిరి: జిల్లాలో ఈ నెల 22 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్. వెంకటరవణ, జిల్లా టీబీ ప్రొగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రోజులు పాటు క్షేత్రస్థాయిలో టీబీ రోగులకు గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ప్రత్యేకంగా పోర్టబుల్ ఎక్స్రే మిషన్ వచ్చిందన్నారు. 2030 నాటికి దేశంలో టీబీని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం, చికిత్స మధ్యలో ఆపివేయకుండా చూసుకోవడంతో వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. చికిత్స పొందుతున్న రోగులకు ఆరు నెలల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పోషకాహారం కోసం ఇవ్వనున్నట్లు వివరించారు. పాఠశాల పునర్నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పాత శిశుమందిరం పునర్నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు. బుధవారం పాఠశాల పూర్వ విద్యార్థి చంద్రశేఖర్రెడ్డి తనవంతుగా రూ.10 లక్షలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును పాఠశాల విద్యాపీఠం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అభినందించారు. ఏపీఎంపై డీఆర్డీఓకు ఫిర్యాదు నందిగామ: నందిగామ మండల మహిళా సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్న యాదగిరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీసీ యాదయ్య జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి సంఘంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా రూ.3 లక్షలు చెక్కురూపంలో నిధులను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్లస్టర్లో సీసీగా పనిచేస్తున్న తనకు ఈ విషయం తెలియడంతో ఏపీఓను ప్రశ్నించగా తననే దూషించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఏపీఎం యాదగిరిని వివరణ కోరగా.. అందులో తన ప్రమేయం లేదని, అకారణంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజానిజాలు విచారణలో తేలుతాని స్పష్టంచేశారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐపై వేటు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్పై వేటు పడింది. ఆయనను మల్టీజోన్ రేంజ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో మంచాల ఎస్ఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ ఓ యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితమే ఆయన ఇబ్రహీంపట్నం పీఎస్ నుంచి రిలీవ్ అయినట్లు సమాచారం. -
కాగ్నా.. ఖాళీ!
యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపుఇటీవల తాండూరు మండలం వీర్శెట్టిపల్లి శివారులోని కాగ్నా నది నుంచి అర్ధరాత్రి వేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అదే గ్రామానికి చెందిన జర్నప్ప డయల్ 100కు కాల్ చేసి చెప్పాడు. అరగంట వ్యవధిలో జర్నప్ప వద్దకు అగ్గనూర్కు చెందిన ఓ నాయకుడు తన అనుచరులతో వచ్చాడు. పోలీసులకు సమాచారం ఇస్తావా అంటూ దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తే ఇసుక వ్యాపారులు రావడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఈ ఒక్క సంఘటన చాలు ఇసుక మాఫియాకు పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటో అనేది అర్థమవుతుంది. జర్నప్ప ఒక్కడిమీదే కాదు ఇసుక అక్రమ రవాణాకు అడ్డు వచ్చే వారు ఎవరైనా దాడులకు గురికావడం నిత్యకృత్యంగా మారింది. గతేడాది ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఎస్ఐలు, సీఐలపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. తాండూరు: నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తాకుతూ కాగ్నానది ప్రవహిస్తుంది. వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భూగర్భ జలాల పెంపునకు ఈ నది ఎంతగానో దోహదం చేస్తుంది. తాండూరు పట్టణంతోపాటు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తుంది. కొడంగల్ నియో జకవర్గానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అలాంటి కాగ్నాపై రాబందుల్లా ఇసుక వ్యాపారులు విరుచుకపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఇసుక రవాణాకు అడ్డంకి లేకుండా చూసుకుంటున్నారు. రెండు నెలల క్రితం వీర్శెట్టిపల్లికి చెందిన జర్నప్ప ఇసుక అక్రమ రవాణాపై డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసుల ద్వారా ఆ సమాచారం ఇసుక మాఫియాకు చేరింది. సదరు వ్యక్తిపై అక్రమార్కులు దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. అనుమతి లేకుండానే.. ఉదయం 11 గంటల ప్రాంతంలో కాగ్నానది నుంచి ఇసుక లోడ్తో ట్రాక్టర్లు తాండూరు పట్టణానికి రావడం కనిపించింది. నది నుంచి వరుసగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు బయటికి వచ్చాయి. అనుమతి పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే మా ఓనర్ వద్ద ఉన్నాయంటూ ట్రాక్టర్ డ్రైవర్లు సమాధానం చెప్పారు. ఇసుక తవ్వుతున్న చోట రెవెన్యూ సిబ్బంది కనిపించలేదు. చెక్ డ్యాం పక్కనే తవ్వకాలు తాండూరు పట్టణ శివారులో కాగ్నా నదికి సంబంధించిన చెక్డ్యాం ఉంది. ఇక్కడి నుంచి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతుంది. చెక్ డ్యాం ద్వారా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడి పంప్ హౌస్కు ఇరువైపులా ఇసుక తోడేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెక్ డ్యంకు 3 కిలోమీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేయరాదు. కానీ ఇసుక వ్యాపారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అన్ని మండలాల్లో ఇదే తంతు తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. ఇసుక వ్యాపారులు మాఫియాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. పెద్దేముల్ మండలం రేగొండి, రుక్మాపూర్, మంబాపూర్, మన్సాస్పల్లి, పెద్దేముల్, మంబాపూర్ గ్రామాల్లో ఇసుక రవాణాకు అడ్డూఅదపు లేకుండా పోయింది. యాలాల మండలం విశ్వనాథ్పూర్, కో కట్,సంగెంకుర్దు, దేవనూర్, అగ్గనూర్ గ్రామాలు.. బషీరాబాద్ మండలం ఎక్మాయి, జీవన్గి, క్యాద్గిరా, ఇందర్చెడ్, దామర్చెడ్, మంతట్టి, రెడ్డిగణపూర్, గొట్టిగకలాన్ గ్రామాలు, తాండూరు మండలంలో పాత తాండూరు, బిజ్వార్, చిట్టిగణపూర్, చంద్రవంచ, నారాయణపూర్, వీర్శెట్టిపల్లి గ్రామా లు ఇసుక రవాణాకు కేంద్రంగా మారాయి. తాండూరు పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నా ఇసుక రవాణాను కట్టిడి చేయలేకపోతున్నారు. రోజూ 300ల ట్రాక్టర్లతో..కాగ్నానది నుంచి నిత్యం 300ల ట్రాక్టర్లతో పదుల ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం ప్రాంభమవుతుంది. వర్షాలు పడితే ఇసుక సేకరణకు అవకాశం ఉండదు. దీంతో అక్రమార్కులు వీలైనంత వరకు ఇసుకను తోడేసి ఖాళీ స్థలాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయం పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక టన్ను నాణ్యమైన ఇసుకకు మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3వేల ధర పలుకుతోంది. ట్రాక్టర్కు రూ.4వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. టిప్పర్కు రూ.50 వేలు తీసుకుంటున్నారు. రాత్రి వేళ ట్రాక్టర్ల మోతఅర్ధరాత్రి వేళ ఇసుక ట్రాక్టర్ల కారణంగా కంటిమీద కునుకు లేకుండా పోతోందని పాతతాండూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత తాండూరు మీదుగా రెండు మార్గాల ద్వారా కాగ్నానదిలోకి దారి ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల తిరుగుతున్నాయి. వాటి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. నిత్యం 300ల ట్రాక్టర్లతో వేల ట్రిప్పులు రూ.లక్షల్లో వ్యాపారం ఫిర్యాదు చేసే వారిపై దాడులకు తెగబడుతున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కాగ్నానది నుంచి రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలి స్తున్నారని డయల్ 100 కు ఫోన్ చేశా. ఇసుక వ్యాపారులు ఇంటికి వచ్చి నాపై దాడి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశా. నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. – జర్నప్ప, వీర్శెట్టిపల్లి, తాండూరు మండలంఆ ప్రాంతాల్లోనే తవ్వకాలు చేయాలి కాగ్నానదిపరీవాహక ప్రాంతంలో ఆరు చోట్ల ఇసుక త వ్వకాల కోసం పాయింట్ల ను గుర్తించాం. ఇసుక అవసరం ఉన్న వారు రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే అనుమతులు ఇస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇసుక సేకరించాలి. – సత్యనారాయణ, ఏడీ, గనుల శాఖ కేసులు పెడుతున్నాం కాగ్నానది నుంచి ఇసుక అ క్రమ రవాణాను అడ్డుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమో దు చేశాం. అనుమతి పత్రాలు ఉంటేనే ఇసుకను తరలించాలి. ఇసుక రవాణాపై సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నాం. – బాలకృష్ణారెడ్డి, డీఎస్పీ, తాండూరు సబ్డివిజన్ -
పనిచేసే కార్యకర్తలకే పదవులు
● పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్రెడ్డి ● నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే పదవులు ఇస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటిపెట్టుకొని ఉన్నవారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. పార్టీకి సేవ చేసిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువవికాసం వంటి వాటిపై ఇంటింట ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభి వృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఈ ప్రాంతానికి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ స్పోక్స్ పర్సన్ నరేందర్ యాదవ్, పీసీసీ సభ్యుడు రితిక్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పూడూరు, దోమ, చౌడాపూర్ మండలాల అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’
తాండూరు టౌన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారం సైతం పరీక్ష కొనసాగనున్నది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, సింధు బాలికల, తెలంగాణ మైనారిటీ బాలికల కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జనరల్ విభాగంలో ఫస్టియర్ 2,965 మంది, సెకండియర్ 952 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 454 మంది, సెకండియర్ 292 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కస్టోడియన్ కృష్ణయ్య తెలిపారు. పరీక్షల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఒకే కేంద్రంలో పరీక్షలు కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు కేంద్రం లోపలికి అరగంట ముందు అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు. తాండూరులో నాలుగు పరీక్ష కేంద్రాలు -
కొనసాగుతున్న శిక్షణ తరగతులు
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం రెండో రోజు శిక్షణలో పలు విషయాలు తెలియజేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్పీలు సాయిలు, భీమప్ప చెప్పారు. గణితం, తెలుగు సామాన్యశాస్త్రం సబ్జెక్టులపై శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో గేదె మృతి కుల్కచర్ల: విద్యుదాఘాతంతో ఓ గేదె మృతిచెందిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కల్మన్కాల్వ గ్రామం పెద్దోళ్ల రాజేందర్రెడ్డికి చెందిన గేదె తన పొలంలో గాలికి తెగిపడిన విద్యుత్తు వైరుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు రూ.లక్ష వరకు నష్టపోయామని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అదుపుతప్పి కారు బోల్తా మొయినాబాద్: అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జేబీఐటీ కళాశాల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్వాలీస్ కారు అతివేగంతో వెళ్తూ అమ్డాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో సైకిళ్ల అందజేత కందుకూరు: లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులు సురక్షిత, ప్రవీణకు బుధవారం ఈ–సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ జి.మహేంద్రకుమార్రెడ్డి చేతుల మీదుగా బాలికలకు అందించి ఒక్కో సైకిల్ ధర రూ.10 వేలు ఉంటుందని కోశాధికారి కె.వెంకటేశ్వర్లుగుప్తా తెలిపా రు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
కుల్కచర్ల: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పుట్టపహాడ్ గ్రామానికి చెందిన హరిశ్చందర్ బుధవారం రాత్రి 9 గంటలకు వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్పై మహబూబ్నగర్ వెళ్తున్నాడు. మార్గమధ్యలో గ్రామ శివారు దాటక ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి 108 అంబులెన్స్లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట నిఘాచేవెళ్ల: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయని, అన్ని కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చేవెళ్ల ఎస్ఐ వనం విరీష చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరై ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్రెడ్డి కథనం ప్రకారం.. స్ఫూర్తి కళాశాల సమీపంలో నాదర్గుల్లో నివాసం ఉండే మడను అవినాష్(20) అనే యువకుడు కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. వృక్తి అదృశ్యం యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ(50) ఈ నెల 7న పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా జాడలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి కడ్తాల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పుల్లేర్బోడ్తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ గోపాల్నాయక్కు ఉన్న పాడి ఆవు మేత మేసుకుంటూ పక్క పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. దీంతో విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు బాధిత రైతు తెలిపారు. ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. -
పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు
మొయినాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేల ఆరోగ్యం, నీటి వినియోగం, పర్యావరణ రక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట పైర్లు సాగుచేసి భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఖర్చులు తగ్గించాలని.. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను అవలంబించాలన్నారు. పర్యావరణ రక్షణకు చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ సునీల్కుమార్, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప -
ఆధునిక పద్ధతుల్లో బోధన చేపట్టాలి
కొత్తూరు: మారుతున్న విద్యావ్యవస్థ, పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్దతుల్లో మార్పులు చేసుకోవాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్పీడీ) రమేశ్ సూచించారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో సీఆర్పీ, ఎస్జీటీ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి, శ్రద్ధ పెంచేందుకు ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. బడిబాటలో భాగంగా బడిఈడు పిల్లను బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులకు స్థానికులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ అంగూర్నాయక్, ఉపాధ్యాయులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రమేశ్ -
విరిగిన చెట్ల కొమ్మలు
మొయినాబాద్: అకాల వర్షం ఆగమాగం చేసింది. మొయినాబాద్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచింది. మున్సిపల్ కేంద్రంతోపాటు అజీజ్నగర్ చౌరస్తా, హిమాయత్నగర్ చౌరస్తా, గండిపేట చౌరస్తా, కనకమామిడి గేటు సమీపంలో రోడ్డుపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బలమైన ఈదురుగాలులకు ముర్తుజాగూడలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. సుమారు నాలుగు గంటలపాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
తుక్కుగూడ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలల గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో హామీలు నెరవేర్చలేదన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు, తులం బంగారం అందజేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ బంగారం అందలేదని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వాగ్దానాలు ప్రకటించారని మండిపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వాణి, ఏఎంసీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, లబ్ధిదారులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ