breaking news
Vikarabad
-
దళితులపై దాడులను అరికట్టండి
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. యాలా ల మండలం రాస్నం గ్రామంలోని దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసి, సీసీ రోడ్డును తవ్వేశారన్నారు. ఈ విషయం గురించి అడిగేందుకు వెళ్లిన దళితులను కులం పేరుతో దూషించారన్నారు. హాజీపూర్కు చెందిన రవికుమార్ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారన్నారు. అలాగే తాండూరు మండలం చెన్గేష్పూర్ గ్రామానికి చెందిన ఎరుకలి కులస్తులైన బస్వరాజ్ దంపతులపై పలువురు దాడి చేసి భభయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇలా నియోజకవర్గ పరిధిలో అగ్ర కులస్తులు.. దళితులపై అకారణంగా దాడులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్, సీఐటీయూ, పలు ప్రజా, దళిత సంఘాల నాయకులు మల్కయ్య, కె.శ్రీనివాస్, బాధితులు ఆశప్ప, అంజిలప్ప, భాస్కర్, లక్ష్మప్ప, వీరప్ప, అంజిలయ్య, రవి, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా, దళిత సంఘాల నేతల డిమాండ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన -
గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం
● ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి తుర్కయంజాల్: గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు చేపట్టనున్నట్టు ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు అలుగు పారే అవకాశాలు ఉండడంతో తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు, ఈదుల చెరువుల కాలువలను ఏఈ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. కాలువులు పూడిక తీయకంపోవడంతో పలు చోట్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వరద వచ్చినా సులువుగా ప్రవహించి, కాలనీలు ముంపునకు గురవకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. -
నషా ముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేద్దాం
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనన్నట్లు తెలిపారు. దీనిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అధికారులు సమన్వ యంతో పని చేసి వికారాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి, వాటి రవాణా, విక్రయాలు, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పెడదోవ పట్టకుండా కాపాడాలన్నారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేసి అవి క్రియాశీలకంగా పని చేసేలా చూడాలన్నారు. ఈ నెల 25న పాఠ శాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీఎస్పీ జానయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ షాద్నగర్: సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కమ్మదనం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ గత పాలకులు స్వార్థరాజకీయాలకు పాల్పడి, ప్రజా జీవితాలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని విమర్శించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన సూత్రధారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రంతో మాట్లాడారని, తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందో స్పష్టంగా వివరించారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి స్పష్టత ఉందన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, అశోక్గౌడ్, మోహన్సింగ్, విజయ్ భాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్య హక్కులు కల్పించాలి
● ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్అనంతగిరి: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బొంరాస్పేట మండలం దుప్చర్ల గ్రామ రైతుల తరఫున కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 200 ఏళ్ల నుంచి పెద్దవాగు సమీపంలో 40 ఎకరాల మిగులు భూమిని నిరుపేద దళితులు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆందోళన
దౌల్తాబాద్: పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు వరుణుడి కరుణ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా వానజాడ కనిపించడం లేదు. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలను దున్ని విత్తు వేశారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా వర్షాలు లేక ఎండుముఖం పట్టాయి. వేల రూపాయలు వెచ్చించి పత్తి, జొన్న, కంది, పెసర తదితర రకాల విత్తనాలు వేస్తే భూమిపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. మండల వ్యాప్తంగా దాదాపు 8 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలు ఉంటాయో ఎండుతాయా అనే ఆందోళనలో రైతన్న ఉన్నాడు. -
సగం
ఇంట్లో.. మట్టిలో..సీజన్ ప్రారంభమై నెల దాటినా 60శాతమే విత్తు ● ఊరిస్తున్న మేఘాలు ● చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు ● ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత ● పెసర, మినుము, జొన్న సాగు చేయొద్దంటున్న అధికారులు వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా రైతన్న ఇంకా ఆకాశం కేసి చూడాల్సి వస్తోంది. వరుణుడి కోసం 15 రోజులుగా ఎదురు చూపులు తప్పడంలేదు. వర్షాకాలం ప్రారంభమైంది మొదలు ఒక్కసారి కూడా పెద్ద వాన పడకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. మొదట్లో అడపా దడపా వర్షాలు కురవగా సగం మంది రైతులు విత్తనాలు వేశారు. ఆ వెంటనే వర్షాలు మొహం చాటేశాయి. వారం రోజులుగా మేఘాలు ఊరిస్తున్నా చిరుజల్లులకే పరిమితం అవుతున్నాయి. పూర్తిస్థాయిలో విత్తుకు సరిపడా పదును కావడం లేదు. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. జిల్లాలో 5.61లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. 60 మిల్లీ మీటర్ల మేర రెండు మూడు సార్లు వర్షాలు కురిస్తేనే విత్తుకు అనుకూలమని అధికారులు అంటున్నారు. అయితే రెండు మూడు మండలాలు మినహా తగినంత వర్షపాతం నమోదు కాలేదు. అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. తెచ్చుకున్న విత్తనాలు సగం ఇంట్లో.. సగం మట్టిలో అన్నట్లు పరిస్థితి తయారైంది. 2.90 లక్షల ఎకరాల్లో విత్తనాలు ఒక వేళ ముందుగా వర్షాలు పడితే రోహిణి కార్తెలో లేదంటే మృగశిర కార్తెలో విత్తనాలు వేస్తారు. ఈ ఏడాది మే 24న రోహిణి కార్తె ప్రారంభమైంది. నెల రోజులు కావస్తున్నా ఇంకా 60శాతం విత్తనాలే వేశారు. 40శాతం విత్తనాలు ఇళ్లలోనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో పెసర, మినుము, జొన్న పంటలు వేయకపోవడమే మంచిదని వ్యవసాయ శాఖ అఽధికారులు అంటున్నారు. జిల్లాలో మొత్తం 5.61లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తు వేశారు. ఓ పక్క మేఘాలు ఊరిస్తున్నా సాగుకు సరిపడా మాత్రం కురవడంలేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు విత్తనాలు వేయగా అవి మొలకెత్తుతాయా లేదా అనే ఆందోళనలో రైతన్న ఉన్నాడు. కొన్ని చోట్ల మొలకెత్తాక కూడా ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తలేదు. 16 పంటల సాగు జిల్లాలో మొత్తం 16 రకాల పంటలు సాగు చేస్తారు. వీటిలో సింహభాగం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలు. గతేడాది క్వింటాలు పత్తి రూ.8 వేలకు పైగా అమ్ముడుపోవడంతో ఈ సారి పత్తి సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.5లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది అంతకు మించవచ్చని అధికారులు అంచనా వేశారు. వరి, కంది సాగు సైతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూరగాయలు, వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. ఆ పంటలు వద్దు ప్రస్తుత సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం. సరిపడా వర్షాలు లేక సగం మేర విత్తనాలు వేయలేదు. మరో వారం రోజుల పాటు వర్షాలు పడకపోతే పెసర, మినుము, జొన్న సాగు చేయకపోవడం మంచిది. మిగతా పంటలు జూలై వరకు సాగు చేసుకోవచ్చు. – మోహన్రెడ్డి, డీఏఓ వర్షాల కోసం ఎదురుచూపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా సాగుకు సరిపడా వర్షాలు పడలేదు. మొదట్లో కురిసిన వర్షాలకు విత్తనం వేశాం. ఇప్పుడు వర్షాల జాడలేదు. సాయంత్రం కాగానే కారుమబ్బులు కనిపిస్తున్నాయి. కానీ చినుకులు పడటం లేదు. పొలంలో వేసిన విత్తనాలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే ఆర్థికంగా నష్టపోతాం. – గోవింద్రెడ్డి, రైతు, దౌల్తాబాద్ -
బయోమెట్రిక్ అమలుకు చర్యలు
● అధికారులు సమయపాలన పాటించాలి ● ప్రజావాణి దరఖాస్తులనుసత్వరం పరిష్కరించాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్అనంతగిరి: జిల్లా కేంద్రంతోపాటు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యల పరిష్కారం కోసం 146 దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు విధిగా సమయపాలన పాటించాలన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తి స్థాయిలో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వన్ మెడీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్, కాల్షియం, క్రియాటిన్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. నేడు కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు, ఉద్యో గులకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలించే దిశగా ప్రాథమిక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి , డీఎంహెచ్ఓ వెంకటరవణ, వన్ మెడీ హబ్ ఫౌండర్ సంతోష్, డాక్టర్ శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి పరిగి: మహిళల అఽభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని మహిళా నా యకులతో సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రా ష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాల నే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతి పథకంలో వారికి పెద్ద పీట వే స్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షురాలు సురేఖ, పట్టణ అధ్యక్షురాలు రజితరెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. స్వేరోస్ నెట్వర్క్ జిల్లా కమిటీ ఏకగ్రీవం అధ్యక్షుడిగా రాజేష్ పరిగి: స్వేరోస్ నెట్వర్క్ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్(మర్పల్లి), ఉపాధ్యక్షులుగా ముకుంద(కొడంగల్), నరేందర్, రాజు, అధికార ప్రతినిధిగా బిచ్చన్న, కోశాధికారిగా రాజేందర్ను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వేరోలు జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. అంబేడ్కర్, జ్యోతిరావుపూలే వంటి మహానీయులు చూపిన మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. యువతకు, విద్యార్థులకు వారి ఆశయాల సాధన దిశగా స్వేరోస్ ముందుకు వెళ్తుందన్నారు. చేనేత కార్మికులసమస్యలు పరిష్కరిస్తాం చేనేత శాఖ డీఎంఓ కళింగరెడ్డి దౌల్తాబాద్: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ డీఎంఓ కళింగరెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని బాలంపేట గ్రామంలో మండలంలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఇటీవల కార్మికులు వారి సమస్యలను కడా ప్రత్యేక అధికారి దృష్టికి తేవడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కార్మిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. సంఘాలను పునరుద్ధరించి కొత్త సొసైటీలను ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యుల ఆర్థిక ఎదుగుదలకు సహకరించాలని విన్నవించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ అధికారిణి ఇంద్ర, తహసీల్దారు గాయత్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు. అదనపు డ్యూటీలు రద్దు చేయాలి అనంతగిరి: అంగన్వాడీ టీచర్లతో బీఎల్ఓ అదనపు డ్యూటీలు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మిహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం వికరాబాద్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూని యన్ నాయకులు భారతి, మనోహర, విజయలక్ష్మి, నిర్మల, సంతోష, బుజ్జమ్మ, అండాలు, స్వరూపరాణి, కవిత పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
డీఈఓ రేణుకాదేవి అనంతగిరి: జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ఫిజియోథెరపీ చేసేందుకు అర్హులైన ఫిజియోథెపిస్టులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు, బషీరాబాద్, మర్పల్లి, బొంరాస్పేట, ధారూరు, చౌడాపూర్, కోట్పల్లి, బంట్వారం, కుల్కచర్ల మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన బీపీటీతో పాటు పామా మెడికల్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. పై అర్హతలు ఉన్న జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థులు తమ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
గ్రామ పంచాయతీగా వాల్యానాయక్ తండా
దుద్యాల్: సోమ్లానాయక్ తండా స్థానంలో వాల్యానాయక్ తండాను గ్రామ పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమ్లానాయక్ తండాలో జనాభా తక్కువగా ఉండడంతో వాల్యానాయక్ తండాకు అనుబంధంగా సోమ్లానాయక్ తండా, రక్తమైసమ్మ తండా, కస్న నాయక్ తండా, జీడిగడ్డ తండాలను అనుబంధ గ్రామాలుగా కలిపారు. ఈ మేరకు వాల్యానాయక్ తండా వాసులు ఎంపీడీఓ మహేశ్కుమార్, ఎంపీఓ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. అనతరం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు రవీందర్ నాయక్, హన్మంత్ నాయక్, వెంకట్ నాయక్, శ్రీనివాస్ నాయక్, అంబర్ సింగ్, శంకర్ నాయక్, మోహన్ నాయక్ పాలొన్నారు. -
రూ.7 కోట్ల విలువైన భూమికి ఎసరు!
షాద్నగర్ రూరల్: ధరణి లొసుగులు.. మీసేవ నిర్వాహకుల సహకారంతో తండ్రీకొడుకులు రూ.7 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమికి ఎసరుపెట్టారు. ప్రభుత్వం ఇటీవల చిల్కమర్రిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో తహసీల్దార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసేవ నిర్వాహకులతో కుమ్మకై ్క.. గ్రామానికి చెందిన కొత్తపల్లి వినోద, శ్రీనివాస్రెడ్డి దంపతులు. కొంత కాలం క్రితం శ్రీనివాస్రెడ్డి చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 2.8 ఎకరాల భూమి 2022లో వినోద పేరిట విరాసత్ జరిగింది. ఈ భూమిపై కన్నేసిన వినోద మామ సుభాన్రెడ్డి, బావ మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ఓ మీసేవ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. వినోదకు తెలియకుండా ఆమె ఫోన్కు వచ్చిన ఓటీపీని సంపాదించి దొంగ జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయింగా జీపీఏ ద్వారా ఇతరులకు మారిందని చెప్పారు. సదస్సులు ముగిసిన తర్వాత వినోద తహసీల్దార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇదే గ్రామంలో మరొకరి భూమిని ఇదే గ్రామానికి చెందిన కొత్తపల్లినర్సింహారెడ్డి, నవనీత దంపతులకు మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. నర్సింహారెడ్డి పేరిట 1.29 ఎకరాల భూమిని కాజేసేందుకు సుభాన్రెడ్డి, మధుసూదన్రెడ్డి ఆమె భార్య నవనీతను రంగంలోకి దింపారు. భర్త ఫోన్ నవనీత దగ్గరే ఉండడంతో ఓటీపీ తీసుకుని జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. సదరు భూమిని దేవిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి సేల్డీడ్ చేశారు. తహసీల్దార్ విచారణలో ఈ తతంగమంతా బయటపడింది. ఇద్దరు పట్టాదారులకు సంబంధించి రూ.7కోట్ల విలువైన దాదాపు నాలుగు ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. పోలీస్స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు పట్టాదారులకు తెలియకుండా భూములు చేతులు మారడంతో తహసీల్దారు పార్థసారధి సదరు భూముల రిజిస్ట్రేషన్పై విచారించారు. స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ తయారీ ఎక్కడ జరిగిందనే విషయాలను పరిశీలించారు. మీసేవ సెంటర్లో ఓటీపీలతో డాక్యుమెంట్ తయారు చేసినట్లు గుర్తించారు. సదరు మీసేవ నిర్వాహకులతో పాటుగా దొంగ జీపీఏ, రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిల్కమర్రి రెవెన్యూ సదస్సులో వెలుగులోకి.. అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని బాపన్చెరువుతండా పంచాయతీ పరిధిలోని బీక్యానాయక్ తండాలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింలుగౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి చంద్రప్ప, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, అంజిల్రెడ్డి, రాంచంద్రారెడ్డి, గుండప్ప, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, గోపాల్, చిన్న నర్సింలు, సాయిలు, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ బొంరాస్పేట: యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని బొట్లోనిగూడ తండా గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి కాపాడాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సిట్ విచారణకు హాజరు తాండూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలువురు స్థానిక వ్యక్తులు సిట్ విచారణకు హాజరవుతున్నారు. సోమవారం నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత డాక్టర్ సంపత్కుమార్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. 2023 నవంబర్ 15నుంచి 30 వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు చెప్పారన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న నర్సిరెడ్డి ఫోన్ను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే అంశంపై సిట్ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. రీల్స్ కోసం బైక్పై ప్రమాదకర స్టంట్ రాజేంద్రనగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రి క్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ మర్గంలో వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఇలాంటి స్టంట్ అర్ధరాత్రి వేళ జరుగుతుండటంతో పలువురు తమ ఎక్స్ వేదికల ద్వారా దీనిని సైబరాబాద్ పోలీసుల దృష్టి కి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని ఆర్జీఐ పోలీసు లకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన ప్రకారం... ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎని మిది మంది యువకులు బైక్పై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశా రు. ప్రమాదభరితంగా ఈ జాతీయ రహదారిపై స్టంట్ నిర్వహించారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. బైక్తో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవా రం సాయంత్రం అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి
ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పనిసరి తాండూరు రూరల్: ౖరెతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలని తాండూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రుద్రమూర్తి మాట్లాడుతూ.. రైతులు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్తో లింకు ఉన్న మొబైల్తో సంబంధిత ఏఈఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజసీ్ట్ర ఉంటేనే భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. అపోహలకు తావులేకుండా రైతులంతా ఫార్మర్ రిజిసీ్ట్ర చేసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలోని రైతుల వివరాలు మండలం రైతులు తాండూరు 14,804 పెద్దేముల్ 15,161 యాలాల 14,798 బషీరాబాద్ 14,512 -
దుండగులపై చర్యలు తీసుకోవాలి
పరిగి: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దేశ ద్రోహుల కిందే లెక్కగట్టాలన్నారు. పేదలు, దేశాభ్యున్నతికి పాటుపడిన మహనీయుడికి అవమానం జరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, వెంకటయ్య, ప్రశాంత్, రాము, ప్రభు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష నాయకుల ఆందోళన కుల్కచర్ల: మండల పరిధిలోని పుట్టపహాడ్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల నాయకులు పుట్టపహాడ్ నుంచి కుల్కచర్ల వరకు నిరసన పాదయాత్ర చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహనీయుడి విగ్రహంపై దాడి హేయనీయం అన్నారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మాజీ ఎంపీపీ సత్యమ్మ, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, ఏఐసీసీ నాయకులు రాములు, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి అనంతగిరి: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. విగ్రహ ధ్వంసం చేసిన సంఘం విద్రోహ శక్తులను ప్రోత్సహించే వ్యక్తులను, వ్యవస్థను రూపుమాపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠింనంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాములు, మొగులయ్య, శ్రీనివాస్, వినోద్కుమార్, భరత్కుమార్, శ్రీనివా స్, వెంకట్, బుగ్గన, బుచ్చన్న, నరేందర్, రాము లు, వెంకట్రాములు, కృష్ణ తదితరులు ఉన్నారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుచేటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య -
పొలాల వద్ద ఇసుక డంపులు
దోమ: ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ఆనంద్కుమార్ అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని అనుబంధ గ్రామమైన ఉదన్రావుపల్లికి చెందిన తొమ్మిది మంది రైతులు అక్రమంగా పాలేపల్లి–ఉదన్రావుపల్లి వాగు నుంచి ట్రాక్టర్ల సాయంతో ఇసుక తీసుకువచ్చి పొలాల వద్ద డంపులుగా నిల్వ చేసుకున్నారనే సమాచారం అందిందన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశామన్నారు. మంగళవారం తహసీల్దార్ గోవిందమ్మ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధిస్తామన్నారు. ఇసుక అవసరమున్న వారు తహసీల్దార్ వద్ద అనుమతులు తీసుకొని ట్రాక్టర్ల సహాయంతో తరలించుకోవాలని సూచించారు. ఈ దాడుల్లో ఆర్ఐ సుదర్శన్, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు పాల్గొన్నారు. సీజ్ చేసిన అధికారులు -
ఓఆర్ఆర్ పరిధిలోనూ భరోసా ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న మండలాలకు రైతు భరోసా విడుదల చేయాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బీఆర్ఎస్ ఎల్మినేడు గ్రామ అధ్యక్షుడు దొమకొండ నర్సింహ అధ్యక్షతన మహాధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృపేష్, బుగ్గరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు దఫాలుగా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వివక్ష చూపకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. రైతులపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, బుట్టి మహేశ్, నిట్టు జగదీశ్వర్, బాష, యాదయ్య, రాజు, విష్ణువర్ధన్రెడ్డి, రాంరెడ్డి, పలువరు రైతులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్మినేడులో ధర్నా -
నీటి గుంతలో పడి మహిళ మృతి
మొయినాబాద్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ దుస్తులు ఉతకడానికి వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందింది. ఈ సంఘటన మొయినాబాద్లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం రిబ్బన్పల్లికి చెందిన మంజుల(31) కుటుంబం కొన్నేళ్ల క్రితం మొయినాబాద్కు వలస వచ్చింది. కొంత కాలం క్రితం ఆమె భర్త రవికుమార్ మృతి చెందాడు. ముగ్గురు పిల్లలతో కలిసి సురంగల్ రోడ్డు పక్కన ఓ గుడిసె వెసుకుని నివాసముంటూ కూలీ పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం మొయినాబాద్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ నీటి గుంతలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయింది. సోమవారం అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గుంతలో తేలిన శవాన్ని గమనించి, మున్సిపల్ వార్డు అధికారి సుదర్శన్కు సమాచారం అందించాడు. సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గతంలో తండ్రి, ఇప్పుడు తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. -
మోదీ పాలనలో దేశం పురోగతి
చేవెళ్ల: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం అన్నారు. స్థానిక కేవీఆర్ గ్రౌండ్లో సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీ బూత్స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. మోదీ సారథ్యంలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. తల్లికి వందనంతో దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతీ బూత్లో కనీసం 50 మొక్కలు నాటాలని, నియోజకవర్గంలో 25వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వానం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, రాష్ట్ర నాయకులు విఠల్రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కుంచం శ్రీనివాస్, నాయకులు మధుసుధన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, మధుసుధన్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం -
రైతులకు మేలు చేసేందుకు చర్యలు
నవాబుపేట: పేదలకు, రైతులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాల మినీకిట్స్ (చిరు సంచులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంది సాగును ప్రోత్సహించేదుకు ఉచితంగా కంది విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, టీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
కేజీబీవీల్లో కొత్త రుచులు
కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ తీసుకువచ్చింది. నెలలో రెండుసార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు, ప్రతీ రోజు నెయ్యి ఉండేలా మెనూ ప్రకటించారు. దౌల్తాబాద్: నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా కేజీవీలు నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలు రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల బలోపేతానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. బాలిక ఆరోగ్యంపై సర్వే చేపట్టగా పౌష్టికాహారలోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కేజీబీవీల్లో మెస్ చార్జీలు పెంచి ఆహార మెనూలో మార్పులు చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారు. మెనూ ఇలా.. ఉదయం: టమాట కిచిడీ, సాంబార్, రాగిజావ, బూస్టు, పూరి, ఉప్మా, పులిహోరా, బోండా, వడ, చపాతీ, జీరారైస్, అరటిపండు మధ్యాహ్నం: టమాట పప్పుతో అన్నం, నేయి, రసం, పెరుగు, ఉడకించిన గుడ్డు, చికెన్ సాయంత్రం: ఉడికించిన శనగలు, బజ్జీలు, అల్లం టీ, మిల్లెట్ బిస్కెట్, పకోడి రాత్రి: అన్నం వివిధ రకాల కాయగూరలు, సాంబారు, మజ్జిగ వీటితో పాటు నెలలో రెండుసార్లు మటన్, ఐదుసార్గుల గుడ్లు, ప్రతీరోజు నెయ్యి ఇవ్వాల్సి ఉంటుంది. బాలికల పౌష్టికాహారం కోసం నూతన మెనూ నెలలో రెండు సార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు మెస్చార్జీలు పెంచిన ప్రభుత్వంకొత్త మెనూ ప్రకారమే.. విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచే మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నాం. ఇప్పటికే కొత్త మెనూ పక్కాగా అమలు చేయాలని ఎస్ఓలకు ఆదేశాలు జారీ చేశాం. కొత్త మెనూను ప్రదర్శనకు ఉంచాలని సూచించాం. – శ్రీదేవి, జీసీడీఓ, వికారాబాద్ -
నిధులు లేక కటకట
● పంచాయతీ నిర్వహణకుఅప్పులభారం ● ట్రాక్టర్ డీజిల్కు సైతం ఇబ్బంది ● సొంత నిధులు వెచ్చించలేమని కార్యదర్శుల ఆవేదన ● గ్రామాల్లో అటకెక్కిన పరిపాలన పరిగి: గ్రామాల్లో ప్రత్యేక పాలన వెక్కిరిస్తోంది. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో పాలన కార్యదర్శులకు రోజురోజుకూ భారంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నెలల తరబడి విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల పరిగి, దోమ మండలాల్లోని అన్ని గ్రామాల కార్యదర్శులు సమస్యల పరిష్కారానికి డబ్బులు లేవని ఎంపీఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేసి పంచాయతీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అదే బాటలో మిగతా కార్యదర్శులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న జీపీలు కుదేలు జిల్లాలో 20 మండలాలు ఉండగా 566 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడంతో విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వీధి దీపాల బిల్లులు, ట్రాక్టర్ నిర్వహణ, బోరు మోటార్ల మరమ్మతులు తదితర వాటికి కాసులు లేక అరిగోసలు పడుతున్నారు. పెద్ద పంచాయతీలకు వస్తున్న కొద్దిపాటి ఆదాయంతో అభివృద్ధి పనులు ఓ మోస్తరుగా సాగుతున్నాయి. కానీ చిన్న పంచాయతీల్లో మాత్రం ఎలాంటి పనులు జరగడం లేదు. రోజు రోజుకూ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దీనంగా మారుతుందని, అప్పుల కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాము గ్రామాల్లో సొంత ఖర్చులతో పనులు చేయలేమని కార్యదర్శులు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. కొరవడిన ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదల కావడం లేదు. గత 20 నెలలుగా గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇక రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులైతే 2022 నుంచి నిలుపుదల చేశారు. స్థానిక సంస్థల్లో పాలకవర్గం లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. కొంత కాలంగా పల్లెల్లో సమస్యలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేశాం గ్రామంలో నిత్యం ఎక్కడో ఒక చోట సమస్యలుంటాయి. తొలుత ప్రత్యేక పాలనలో ఇబ్బందులు రాకున్నా దినదినం భారంగా మారుతుంది. వచ్చే జీతం డబ్బులు కూడా గ్రామ సమస్యల కోసం ఖర్చు చేస్తున్నాం. అవి సరిపోకపోవడంతో అప్పులు చేశాం. ఊరిలో సమస్యలు పరిష్కరించాలంటే ఇక సొంత డబ్బులు ఖర్చు చేయలేము. – వేమారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రాఘవపూర్ -
మున్సిపల్ నిధులు పక్కదారి!
తాండూరు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందని పనులకు అడ్డగోలుగా నిధులు వెచ్చించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికుల పేరిట, పాత స్టాక్ బ్లీచింగ్ పౌడర్ నిల్వలను చూపించి ఏకంగా రూ.15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒక్కో చీర రూ.1,800 తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులున్నాయి. దాదాపు 15 వేల గృహాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సుమారు 260 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేయిస్తారు. అందుకుగాను సిబ్బందికి శానిటరీ కిట్స్తో పాటు దుస్తులు పంపిణీ చేస్తారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది ఆయా సామగ్రిని తీసుకొచ్చారు. ప్రత్యేకాధికారి సుధీర్ అనుమతితో హాకా సంస్థకు నామినేషన్ పద్ధతిన ఈ కాంట్రాక్ట్ మొదట అప్పగించారు. అది కాదని స్థానిక కాంట్రాక్టర్ ద్వారానే సామగ్రిని కొనుగోలు చేయించారు. ఇందులో నాసిరకం దుస్తులకే అధిక ధరలు చెల్లించినట్లు బిల్లులు సృష్టించారు. పారిశుద్ధ్య పనులు చేసే మహిళలకు ఇచ్చే ఒక్కో చీర రూ.500 వరకు ఉంటే ఏకంగా రూ.1,800 వెచ్చించినట్లు చూపారు. ఒక టవల్ ఖరీదు రూ.100 వరకు ఉంటే దాన్ని రూ.600లకు కొన్నట్లు బిల్లులు రూపొందించడం గమనార్హం. పాత స్టాక్ చూపి నిధులు స్వాహా బ్లీచింగ్ పౌడర్ నిధులను మున్సిపల్ అధికారులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో బ్లీచింగ్ పౌడర్ 10 టన్నుల వరకు వినియోగం ఉంటుందంటూ రికార్డులు సిద్ధం చేశారు. అయితే క్వింటాలుకు సుమారు రూ.1,700ల వరకు పలుకుతోంది. అయితే పాత మున్సిపల్ కార్యాలయంలో బ్లీచింగ్ పౌడర్ పాత స్టాక్ నిల్వలున్నాయి. వాటినే చూయించి మున్సిపల్ అధికారులు నిధులను దారి మళ్లించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు ఈ ఏడాది జనవరి నెలలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో జరిగిన చివరి సమావేశంలో ఎజెండాలో శానిటేషన్ పనుల కోసం రూ.40 లక్షల నిధుల ఆమోదం కోసం తీసుకెళ్లారు. అయితే పలువురు కౌన్సిలర్లు బ్లీచింగ్ పౌడర్ పేరిట నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అంశాన్ని పక్కన పెట్టాలని కమిషనర్కు సూచించారు. ఆరు నెలల తర్వాత మున్సిపల్ అధికారులు రూ.40 లక్షలతో పాటు అదనంగా మరో రూ.10 లక్షలు పెంచి పారిశుద్ధ్య సామగ్రిని కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. రూ.10 లక్షల సామగ్రి కొనుగోలుకి రూ.50 లక్షల బిల్లు పాత బ్లీచింగ్ స్టాక్ చూయించి కాసులు నొక్కేసిన వైనం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వివరాలు తెలుసుకుంటాను మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం కొనుగోలు చేసిన సామ గ్రికి నిధులు ఎన్ని వెచ్చించారనే అంశం నా దృష్టికి రాలేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ను అడిగి వివరాలు తెలుసుకుంటాను. ప్రత్యేకాధికారి ఆదేశాల మేరకే సామగ్రి కొనుగోళ్లు జరిగాయి. – విక్రమ్సింహారెడ్డి, కమిషనర్, తాండూరు -
విద్యార్థులకు స్ఫూర్తి
కేశంపేట: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్ర యోగాల వైపు నడిపించి వారి ఆలోచనలకు పదు ను పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ‘ఇ న్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసె ర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి నామినేషన్లు స్వీకరిస్తోంది. ఎవరు అర్హులంటే.. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ● అప్పుడు విద్యార్థులు యూజర్ ఐడీకి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.పదివేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్పటిలోగా అంటే.. విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్లో అతిథ్యం.. స్వయానా రాష్ట్రపతితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు.. కానీ అందుకోసం విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. తమ తెలివికిపదును పెట్టాలి. జాతీయ స్థాయిలో ‘ఇన్స్పైర్ మనక్’ స్టూడెంట్స్ ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతిభ చూపినవారికి నగదు పురస్కారాలు ఆన్లైన్ ద్వారా సెస్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణగత విద్యా సంవత్సరం.. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయికి 1,881 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 198 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీటి నుంచి నాలుగు జాతీయ స్థాయికి వెళ్లాయి. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. -
నిబంధనలకు తూట్లు
తాండూరు టౌన్: పట్టణం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవే 167(ఎన్) డ్రైన్ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయి. అడిగేవారు లేరని సదరు ఆర్అండ్బీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బస్టాండు నుంచి చించోళి మార్గంలో నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ అధికారులు డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే రోడ్డుపై అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకుండానే పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం డ్రైన్కు లోపల ఉన్న విద్యుత్ సంబంఽధితమైనవి ఏవీ ఉన్నా వాటిని తొలగించిన తర్వాత నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే సదరు ఆర్అండ్బీ అధికారులు దీనికి భిన్నంగా ఎక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను అక్కడే ఉంచి ఇరుకుగా, వంకలు తిప్పుతూ పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద డ్రైన్ నిర్మిస్తున్నారు. దీంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తొలగించాలని విద్యుత్ అధికారులకు అర్జీ పెట్టుకుని, అందుకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ అవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి డ్రైన్ నిర్మాణ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా హైవే డ్రైన్ నిర్మాణ పనులు -
మహాసభ సభ్యత్వం తీసుకోవాలి
మున్నూరు కాపు సంఘం తాలూకా నాయకులు కొడంగల్: రాష్ట్ర మహాసభలో కులస్తులందరూ సభ్యత్వం తీసుకోవాలని మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బి.మల్లయ్య కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని కాచిగూడ కార్యాలయానికి మహాసభ అనుబంధంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కొడంగల్, ఉడిమేశ్వరం, పర్సాపూర్, దుద్యాల, అలిఖాన్పల్లి, పాత కొడంగల్, కొండారెడ్డిపల్లి గ్రామ కమిటీ సభ్యులతో పాటు కొడంగల్, దుద్యాల, దౌల్తాబాద్ మండల కమిటీలు, యువజన కమిటీలు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర మహాసభ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈనెల 26వ తేదీ వరకు సభ్యత్వం తీసుకోవడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పెద్ది పెంటయ్య, ప్రధాన కార్యదర్శి జైపాల్రెడ్డి సూచన మేరకు సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కులస్తులందరూ రాష్ట్ర మహాసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సిరుసని శ్యాంసుందర్, అరిగె ఓం ప్రకాశ్, కోశాధికారి కానుకుర్తి నర్సిరెడ్డి, ప్రచార కార్యదర్శి మున్నూరు బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘టెక్స్టైల్’ భూముల విక్రయానికి యత్నం!
నందిగామ: టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించేందుకు కొందరు డైరెక్టర్లు యత్నిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొందరు రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ వద్ద ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2002, 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కోసం చేగూరు రెవెన్యూ పరిధి నర్సప్పగూడ గ్రామ శివారులో 142 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 108 మంది సభ్యులు, 8 మంది డైరెక్టర్లతో ఒక సొసైటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ భూమిలో ప్రభుత్వ రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు, భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వివరించారు. కానీ అనుకున్న ఆశయం నెరవేరకుండా కొందరు డైరెక్టర్లు ఎవరికీ తెలియకుండా ఆ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. తామంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేశామని, మా భూములు మాకు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించి, పలువురికి ఉపాధి చూపుతామని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి, జాగల విక్రయానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పురుషోత్తం, గడ్డం దేవదాస్, వెంకటరమణ, శ్రీరాములు, సురేంద్ర, రవి, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.నిరసన వ్యక్తంచేసిన సొసైటీ సభ్యులు -
అర్ధరాత్రి గర్భిణీ అవస్థ
● 108కి కాల్ చేసినా స్పందన కరువు ● ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలింపు బషీరాబాద్: మెడికల్ అత్యవసర సేవలు పడకేశాయి. అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లడానికి 108కి కాల్ చేస్తే బిజీ అంటూ రెండు గంటల పాటు ఎదురు చూశారు. చివరకు అంబులెన్స్ రాకపోవడంతో ఓ ప్రైవేటు వాహనంలో గర్భిణీని తాండూరు మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పురిటి నొప్పులతో తల్లడిల్లిన ఆమెకి వైద్యులు కాన్పు చేశారు. ఈ ఘటన మండలంలోని నవల్గాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాశీంపూర్ శ్యామల నిండు గర్భిణీ. శనివారం రాత్రి 11.45 గంటలకు పురిటి నొప్పులు రావడంతో భర్త నరేష్ 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అవి ఇతర సేవల్లో బిజీ ఉన్నాయి. 30 నిమిషాలు ఆగాలని టీల్ ఫ్రీ సిబ్బంది చెప్పారు. తీరా అర్ధ గంట తర్వాతా చేస్తే బిజీ ఉన్నాయి.. తర్వాత చేయండని రెండు గంటల పాటు తమను వేచి ఉండేలా చేశారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రైవేట్ వాహనంలో తాండూరులోని మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. గర్భిణీకి అక్కడి వైద్యులు కాన్పు చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఉద్యోగి అనుమానాస్పద మృతి మీర్పేట: అనుమానాస్ప ద స్థితిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాలనీవాసులు, ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. ఏపీ కృష్ణా జిల్లా పెద్దమద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు(59) పదేళ్లుగా బడంగ్పేట సాయిప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయంతి, కుమారుడు రాజ్భరత్, కోడలు గౌతమితో కలిసి ఉంటున్నాడు. ఆయన ఆబిడ్స్లోని పేఅండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఆడిటర్గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వెంకటేశ్వరరావు నీటి సంపులో శవమై తేలాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు. మృతిపై అనుమానాలు కొంత కాలంగా తనను భార్య, కుమారుడు, కోడలు వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మృతుడు వెంకటేశ్వరరావు తరచూ తమతో చెప్పేవాడని కాలనీవాసులు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి ఉద్యోగం వస్తుందని, అందుకే మానసికంగా వేధిస్తున్నారని తెలిపినట్లు చెప్పారు. ఇక్కడే ఉంటే తనను చంపేలా ఉన్నారని, వారం రోజుల్లో మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్కు మారుతానని శనివారం రాత్రి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానం ఉందని, మృతుడి కుమార్తె ధరణిదేవి మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వేడుకగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం రాజేంద్రనగర్: బుద్వేల్లోని వీరభద్రస్వామి భద్రకాళి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అలంకరణ అనంతరం భక్తులకు వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. -
పర్యాటక శోభ
కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎండలు తగ్గడంతో కుటుంబసమేతంగా వచ్చిన సందర్శకులు ప్రాజెక్ట్ నీటిలో సందడిగా గడిపారు. యువతీ యువకులు బోటింగ్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. – ధారూరువికారాబాద్: గతంలో ఏడు జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 11 జిల్లాలకు విస్తరించింది. ఇందుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ట్రిపుల్ ఆర్కు ఐదు కిలో మీటర్ల ఆవలి వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పరిధిలోకి మన జిల్లా సైతం వచ్చేసింది. జిల్లా పరిఽధిలోని ఐదు మండలాలకు చెందిన 54 రెవెన్యూ గ్రామాలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా సమగ్రాభివృద్ధికి స్పెషల్ జీఓ రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా అభివృద్ధిలో అందరాని దూరంలో నిలిచిపోయింది. నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ నెట్టుకొస్తున్న జిల్లాకు ఏకకాలంలో ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు వరించాయి. సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి తొలుత కడా(కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేయడంతో అభివృద్ధి సొంత నియోజకవర్గానికే పరిమితం చేస్తారా అంటూ మిగిలిన జిల్లాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక జీఓ 190 విడుదల చేసిన విషయం విదితమే. వుడా(వికారాబాద్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ) పేరుతో జిల్లాను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మహానగరం మరింత విస్తరించనుంది. త్వరలో నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఆవల ఐదు కిలోమీటర్ల వరకు పరిధిని విస్తరించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభివృద్ధికి ఊపందుకోనుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వుడా పరిధిలో 493,హెచ్ఎండీఏలో 54 రెవెన్యూ గ్రామాలు జిల్లా సమగ్రాభివృద్ధికి మార్చిలో స్పెషల్ జీఓ 190 విడుదల చేయగా.. కడా పేరిట కొడంగల్ నియోజకవర్గంలో రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజా జిల్లాలోని పలు ప్రాంతాలు హెచ్ఎండీఏ పరిధిలోకి చేర్చడంతో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వుడా పరిధిలోకి నాలుగు మున్సిపాలిటీలు (వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్)తో పాటు, 493 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి ఐదు మండలాల నుంచి 54 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామాలు చేర్చే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని హైదరాబాద్తో పాటు శాటిలైట్ టౌన్షిప్ల డెవలప్మెంట్ కీలకం కానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను వేగిరం చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోకి జిల్లా ఐదు మండలాలు, 54 రెవెన్యూ గ్రామాలు, 20కి పైగా గ్రామాలు ఒక్క పూడురు నుంచే 23 రెవెన్యూ గ్రామాలు ఊపందుకోనున్న అభివృద్ధి హెచ్ఎండీఏ పరిధిలోని రెవెన్యూ గ్రామాలు మండలం రెవెన్యూ గ్రామాలు అంగడిచిట్టెంపల్లి, చన్గోముల్, చీలాపూర్, చింతల్పల్లి, కండ్లపల్లి, కంకల్, కెరవెళ్లి, కడ్మూర్, కొత్తపల్లి, మంచన్పల్లి, మన్నెగూడ, మేడిపల్లి, మిర్జాపూర్, మిట్టకంకల్, నిజామ్పేట్ మేడిపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు,కుద్భుల్లాపూర్, రేగడిమామిడిపల్లి, పోమన్గుర్తి, తిర్మలాపూర్, ఎన్కెపల్లి, తుర్కెన్కెపల్లి అక్నాపూర్, చించల్పేట్, గంగ్యాడ, గుబ్బడిఫతేపూర్, లింగంపల్లి, మాదిరెడ్డిపల్లి, ముబారక్పూర్, నవాబుపేట, పూలపల్లి, పులిమామిడి, ఎల్లకొండ వికారాబాద్(జిల్లా కేంద్రం) బూర్గుపల్లి, ధన్నారం, గెర్గెట్పల్లి, గుడుపల్లి, కొంపల్లి, మద్గుల్చిట్టెంపల్లి, పాతూరు, పీరంపల్లి, పులుసుమామిడి, సిద్దులూరు(చెంచలం), సిద్దులూరు(పాయాగ), సిద్దులూర్ (మునుగాల) మోమిన్పేట చీమల్ధరి, చక్రంపల్లి, దేవరంపల్లి పరిగి చిట్యాల్, మాదారం, రాపోల్, తొండపల్లి పూడూరునవాబుపేటవికారాబాద్ -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్కూల్ టీచర్ సమాఖ్య(ఎస్టీఎఫ్) తెలంగాణ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచయ్యకు ఓడీ సౌకర్యం లభించడంతో ఆయనను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దాంతో పాటే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్, ప్రతినిధులు విఠల్, రమేష్, రాంచంద్రయ్య, రాంచందర్, నర్సింహులు, లక్ష్మినారాయణ, దిలీప్, భగవత్గీత, రాజారావు, మొయినాబాద్ మండల అధ్యక్షుడు పి.సుధాకర్, వెంకటస్వామి, రజిత, సంతోష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య -
టైలరింగ్ శిక్షణతో ఉపాధి మార్గం
రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ధారూరు: ౖటెలరింగ్ నేర్పించడం అంటే ఉపాధి చూపినట్లేనని రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కేరెళ్లి శ్రీసత్యసాయి సార్వజనిక కేంద్రంలో ఆదివారం టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సత్యసాయి సేవా సంస్థల సేవలతో పేదలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సత్యసాయి సేవా సంస్థల కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, కేరెళ్లి శ్రీసత్యసాయి సార్వజినిక కేంద్రం అధ్యక్షుడు రఘునందన్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్కుమార్, కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సేవా సంస్థల బాధ్యులు సోమిరెడ్డి, నాగరాజు, బల్వంత్రెడ్డి, నర్సింలు, రవి, శ్రీకాంత్రెడ్డి మహిళలు పాల్గొన్నారు. టీఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఖదీర్ బంట్వారం: తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి(టీఎంహెచ్పీఎస్) జిల్లా అధ్యక్షుడిగా తొర్మామిడికి చెందిన ఖదీర్ పాషా నియమితులయ్యారు. ఆదివారం పెద్దేముల్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ సమక్షంలో ఖదీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖదీర్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనార్టీల హక్కుల సాధన కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం కల్పించిన రిజర్వేషన్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 14శాతం ఉన్న ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్కు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. రజకులను ఆదుకోవాలి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి కొడంగల్: రజకులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ తమ కులస్తులను ఆదుకోవాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్నారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా రజకుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన రజకుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రతీ గ్రామంలో దోబీఘాట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రవీందర్, అశోక్, వెంకటేశ్, మోహన్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయాన్ని దర్శించుకున్న వెన్నెల శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గుమ్మడి వెన్నెల గద్దర్ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యు లు ఆమెకి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మళ్లీ సమ యం తీసుకొని వస్తానని, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు మోహన్, హన్మంతు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసానికి యత్నం
కుల్కచర్ల: మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు, అంబేడ్కర్ సంఘాల నాయకులు గ్రామానికి చేరుకుని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహంపై దాడికి యత్నించడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమేశ్ తెలిపారు. ఆందోళనలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, పలువురు నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పరిగి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన -
విద్య మాటున వ్యాపారం
గెట్ల పంచాయితీ! దౌల్తాబాద్కు చెందిన ఓ రైతు ఆరు నెలల క్రితం భూమి కొలత కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు.8లోu9లోuతాండూరు: పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనే తల్లిదండ్రుల కోరికను ప్రైవేట్ పాఠశాలలు ఆసరాగా చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమ ప్రైవేట్ పాఠశాలలకు కాసుల వర్షం కురిపిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో న్యూ అడ్మిషన్లు, ఏడాది ఫీజు పేరిటప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా పుస్తకాలు తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారు. ఈ విద్యావ్యాపారాన్ని అరికట్టాలని బీసీ జేఏసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యాయరు. ప్రైవేట్ స్కూళ్లను హెచ్చరించాం ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొన్నారు. దీంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలను విక్రయించి నా, అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలిసినా అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించాం. – వెంకటయ్యగౌడ్, ఎంఈఓ, తాండూరు విద్యార్థుల పేరిట దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య, నోట్ పుస్తకాలు విక్రయిస్తున్నారు. పాఠ్య పుస్తకాల ధరలను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలే నిర్ణయిస్తున్నాయి. విద్యార్థుల పేరిట సాగిస్తున్న ఈ దోపిడీని అరికట్టాలి. ఈ విషయమై ఇప్పటికే విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశాం. – భాను ప్రసాద్, బీసీ జేఏసీ నాయకుడు, తాండూరు పాఠ్య, నోట్ పుస్తకాల విక్రయాల్లో ప్రైవేట్ పాఠశాలల మాయాజాలం తాము సూచించిన చోటే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు చీటీలు అడ్మిషన్ పేరిట రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు వసూళ్లు విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన బీసీ జేఏసీ సంఘం సభ్యులు పట్టించుకోని అధికారులురూట్ మార్చి విక్రయాలు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాలున్నాయి. విద్యాశాఖ వెల్లడించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 198 ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతుండగా 47,534 మంది విద్యార్థులున్నారు. తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి పట్టణాలలో ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్నాయి. గతంలో పాఠశాల్లోనే నోట్ పుస్తకాలు, యూనిఫాంలు విక్రయించేవారు. మూడేళ్లుగా విద్యార్థి సంఘాలు, బీసీ జేఏసీ సంఘాలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో విక్రయాలు నిలిచిపోయాయి. రూట్ మార్చిన యాజమాన్యాలు తాము సూచించిన షాపుల్లోనే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. 1వ తరగతి విద్యార్థికి పుస్తకాల సెట్కు రూ.6,500 నుంచి రూ.8 వేల వరకు, 2 నుంచి 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల సెట్కు ఒక్కో విద్యార్థికి రూ.7వేల నుంచి రూ.13 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అదే సెట్ ఇతర సెంటర్లలో కొనుగోలు చేస్తే సగం ధరకే వస్తున్నాయని చెబుతున్నారు. యూనిఫాంలు సైతం పాఠశాల యాజమాన్యాలు సూచించిన దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.5వేల వరకు ఫీజులు పెరిగాయని అడ్మిషన్ ఫీజు రూ.5వేల నుంచి రూ.10 వేలకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
ఆమనగల్లు: లారీ ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన మహేందర్నాథ్ అలియాస్ టిల్లు(23) బైక్పై వెళ్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి మధ్యప్రదేశ్కు పత్తిలోడ్తో వెళ్తున్న లారీ కాటన్మిల్లు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం బాటిళ్ల పట్టివేత అనంతగిరి: హర్యానా ప్రాంతానికి చెందిన 20 డిఫెన్స్ మద్యం బాటిళ్లను హైదరాబాద్కు తీసుకెళ్తున్న క్రమంతో రంగారెడ్డి జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వికారాబాద్లో పట్టుకున్నారు. ఒక కారులో డిఫెన్స్ మద్యం వస్తుందనే పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్చంద్ర తన సిబ్బందితో కలిసి ఎన్నెపల్లి చౌరస్తాలో శనివారం తనిఖీలు చేశారు. కారులో నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కార్ను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. -
ఆదివారం ఆగని దందా
షాద్నగర్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో సెలవురోజున పుస్తకాల దందా కొనసాగుతోందని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం బుక్స్ విక్రయిస్తుండగా.. ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదేమిటని ప్రశ్నించిన తమపై అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విద్యార్థుల తల్లితండ్రులకు ఫోన్చేసి రాత పుస్తకాలు తీసుకుంటేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామని మెలిక పెడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరలకు నోట్స్ను అంటకడుతూ డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. పాఠశాలల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే విషయమై గతంలో మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి.. బుక్స్, యూనిఫాంలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిల్, రఘు, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సెలవు రోజుల్లో పుస్తకాల విక్రయం నిబంధనలు పాటించని పాఠశాలలు చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్ -
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
అనంతగిరి: వంద రోజుల ప్రణాళికలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రధాన రోడ్డులో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. వీధి వ్యాపారులతో తినుబండరాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వంటకాల రుచులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఈ రాకేష్ రెడ్డి, మెప్మా పీడీ రవికుమార్, టీఎంసీ వెంకటేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రివర్గంలో అవకాశం కల్పించండి
ఖర్గేను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్ పరిగి: రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి ఈ మేరకు వినతి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పార్టీ మారకుండా పని చేశానని పేర్కొన్నారు. రెండు పర్యాయాలుగా డీసీసీ అధ్యక్షుడిగా సేవలందిస్తూ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల గెలుపునకు కృషి చేశానని చెప్పారు. 2017లో శక్తి కన్వీనర్గా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేశానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పని చేయని విధంగా తాను పరిగి నియోజకవర్గ ప్రజలకు అందుబాటు లో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి వెన్నెముక లాంటి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించి అందులో తనకు స్థానం కల్పించాలని కోరినట్లు రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
వికసించిన బ్రహ్మకమలాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని మహాదేవుని ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. వాటికి ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్క తొమ్మిది అడుగుల ఎత్తు పెరిగి రెండు పూలు పూసిందని స్థానికులు తెలిపారు. వీధి వ్యాపారులకు బీజేపీ అండ ఫుడ్ మేళాను సందర్శించిన పార్టీ నాయకులు తాండూరు టౌన్: వీధి వ్యాపారులకు బీజేపీ అండగా ఉంటుందని మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత అన్నారు. శనివారం పాత మున్సిపల్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ఫుడ్ మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో వీధిన పడిన వీధి వ్యాపారులకు చేయూతనిస్తూ, ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణా లు ఇచ్చి ఆదుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వమేనన్నారు. తాండూరు పట్టణంలో 4,623 మంది చిరు వ్యాపారులకు స్ట్రీట్ వెండర్ పథకం ద్వారా ఆదుకుందన్నారు. భవిష్యత్లో వీరంతా పెద్ద వ్యాపారులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్ లలిత, సతీష్ పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అనంతగిరి: హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో 2025 – 26 సంవత్సరానికి గాను సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉచిత శిక్షణ కోసం జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 7వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదన్నారు. జూలై 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి కలవారుదరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. చట్టాలపై అవగాహన ఉండాలి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు పరిగి: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు సూచించారు. ఽశనివారం పరిగి పట్టణంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల విద్యను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. వారిని బాగా చదివిస్తే ఉన్నత స్థానంలో నిలుస్తారని పేర్కొన్నారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే వారి ఆశయాలకు అడ్డుకట్ట వేసిన వారమవుతామని అన్నారు. ఎక్కడైన బాల్య వివాహాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్టాలపై అవగాహన ఉన్న వారు నేరాలు చేయరన్నారు. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంట్లో మద్యపాన నిషే ధం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగులశిల్ప, అంకిత స్వచ్ఛంద సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ డానియల్, జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్, లీగల్ ఎయిడ్ కాన్సిల్ అడ్వకెట్లు వెంకటేష్, రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వీఎంహోంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
హుడాకాంప్లెక్స్: శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే విధానమే యోగా అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం మైదానంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలకు ఎంపీతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. యోగా గురువులు ఆసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రశాంతంగా జీవించాలంటే యోగా అవసరమన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రాచీన ఆధ్యాత్మిక పతంజలి యోగాను నిత్యం అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుజీత, ఇన్స్పెక్టర్లు సైదిరెడ్డి, వినోద్కుమార్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
యోగా ఒక జీవన విధానం
అనంతగిరి: యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజ లు, విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలన్నారు. యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా మనిషిలో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. దేశంలో 2,500 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి ద్వారా యోగా వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి యోగా ప్రాముఖ్యతను గుర్తించి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. యోగా అన్ని వయస్సుల వారు చేయవచ్చని, గురువుల మార్గదర్శకంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవిస్తారని తెలిపారు. అనంతరం ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా క్రీడల శాక అధికారి అబ్దుల్ సత్తార్, ఎల్డీఎం యాదగిరి, అయుష్ సునీత పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేస్తా మన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి, డైరెక్టర్లు యాదగిరి, నర్సింలు, నాయకులు మొగులయ్య, రాములు యాదవ్, రఘుపతిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాములు, హరీశ్వర్రెడ్డి, ప్రభాకర్, నర్సింలు, స్పెషల్ ఆఫీసర్ కరు ణాకర్రెడ్డి, ఎంపీడీఓ రాములు పాల్గొన్నారు. కోట్పల్లిలో.. స్పీకర్ ప్రసాద్కుమార్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి కోట్పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. డబుల్ ఇళ్లు పూర్తి చేస్తాం ధారూరు: అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయించినట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ తెలిపారు. శనివారం ధారూరులో 356 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ధారూరులో అసంపూర్తిగా ఉన్న 120 డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ధారూరు మార్కె ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు భాస్కర్రెడ్డి, ఎల్.అశోక్ ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ నర్సింహులు, తహసీల్దార్ సాజిదాబేగం పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి -
11,801 దరఖాస్తులు
భూ సమస్యల పరిష్కారం కోసం భారీగా అర్జీలు ● జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు ● పీఓబీ, డేటా సవరణ సమస్యలే అధికం ● ఇందులో ఎక్కువగా కలెక్టర్ పరిధిలోకి వచ్చేవే.. ● కోర్టు కేసుల్లో ఉన్నవి అనేకం వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి ఈ నెల 2 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. 3వ తేదీ నుంచి గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 19 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగింది. ఈ నెల 20తో సదస్సులు ముగిశాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు కొంత కాలంగా శ్రమిస్తున్నా అనేక సమస్యలు మిగిలిపోయాయి. తాజాగా నిర్వహించిన భూ భారతి సదస్సులకు రైతుల నుంచి వచ్చిన అర్జీలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వ్యాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన అర్జీలను ఆగస్టు 14వ తేదీ నాటికి పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది కొంత కష్టసాధ్యమేనని క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు అంటున్నారు. పెండింగ్లో అనేక సమస్యలు కొంత కాలంగా అధికారులు భూ సమస్యల పరిష్కారం కోసం కుస్తీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. తన లాగిన్లో ఐదువేలు ఉన్న అర్జీలను 500 లోపు తెచ్చామని ఇటీవల కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసింది. రెవెన్యూ సదస్సులతో మళ్లీ వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్, సాదాబైనామా, అసైన్డ్ భూముల సమస్యలు, పీఓబీ, విరాసత్, మ్యుటేషన్, డేటా కరక్షన్ తదితర సమస్యలకు సంబంధించినవి అధికంగా వచ్చాయి. ధరణి చట్టం ప్రకారం మెజార్టీ భూ సమస్యల పరిష్కారం కలెక్టర్ లాగిన్లోనే ఉండగా తాజా చట్టంతో చాలా వరకు అధికార వికేంద్రీకరణ జరిగిందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. సగానికి పైగా సమస్యలు అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓలు పరిష్కరించేలా చట్టాన్ని రూపొందించారు. దీంతో భూ సమస్యల పరిష్కారం వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భారీగా దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా గడిచిన 19 రోజుల్లో 475 గ్రామాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతుల నుంచి 11,801 దరఖాస్తులు వచ్చాయి. 5,294 అర్జీలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. 1,141 మంది రైతులకు నోటీసులు కూడా అందజేశారు. ఇందులో 342 అర్జీలను అనుమతించగా ఆయా కారణాలతో 31 దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా వాటిని మ్యాన్యువల్ వర్క్ పూర్తి చేసి ఆన్లైన్లో పొందుపరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులుమండలం పేరు దరఖాస్తులు వికారాబాద్ 1,531 కుల్కచర్ల 1,424, పూడూరు 1,259 దోమ 1,104 మోమిన్పేట 1,018 యాలాల 137 బషీరాబాద్ 155 పెద్దేముల్ 205 సదస్సులు విజయవంతం అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేశాం. భూ సమస్యల పరిష్కారం కోసం పదివేలకు పైగా అర్జీలు వచ్చాయి. ప్రస్తుతం డేటా ఎంట్రీ ప్రక్రియ సాగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలను కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తాం. గతంలో రైతులు పెట్టుకున్న సాదాబైనామా సమస్యలకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నందున ఆ స్టే వెకెంట్ అయ్యాక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అవి పరిష్కరిస్తాం. ఇవి మినహా మిగతా సమస్యలన్నీ ఆగస్టు 14వ తేదీలోగా పరిష్కరిస్తాం. – ప్రతీక్జైన్, కలెక్టర్ -
నిండుగా నీళ్లు.. భూములు బీళ్లు
మోమిన్పేట: నందివాగు ప్రాజెక్టును పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో తూములు తుప్పుపట్టి, కాల్వలు పూడుకుపోయి, గండ్లుపడ్డాయి. 2,650 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు వైపు పాలకులు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా రైతు భూములన్నీ బీడుగా మారాయి. ఈ ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విదల్చక కాస్లాబాద్, బూర్గుపల్లి, మేకవనంపల్లి, రాళ్లగూడుపల్లి, మెదక్ జిల్లా, కొడాపూర్ మండల పరిధిలోని అనంతసాగర్, జాజిపురం, దాని అనుబంధ తండాల భూములు సాగుకు నోచుకోవడం లేదు. ఈ ఆయకట్టుకింద గతంలో రెండు పంటలు పండిచిన రైతులు.. 15 ఏళ్లుగా సాగునీరందక ఇబ్బంది పడుతున్నారు. కమిటీలు లేవు.. నిధులు రావు ప్రతీ సంవత్సరం బడ్జెట్లో నిధుల కేటాయిస్తారేమోనని ఎదురు చూడడం తప్పితే ప్రభుత్వాలు పట్టించుక్ను పాపాప పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు పూడికతీత, గండ్ల పూడ్చివేత, తూములు, పక్కగోడలు పూర్తిస్థాయిలో నిర్మించాలంటే రూ.10 కోట్లు అవసరమవుతాయని రైతులు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తేనే పంటలసాగుకు అవకాశం ఉంటుందని.. ప్రభుత్వంస్పందించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రూ.5 కోట్లతో ‘మిషన్ కాకతీయ’ మిషన్ కాకతీయలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 కోట్లతో పనులు చేపట్టినా పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించ లేకపోయింది. నిండుగా పూడుకుపోయిన శిఖంలో మట్టితీత పనులే ఎక్కువ చేయడం వలన కాల్వల మరమ్మతులు మిగిలిపోయాయి. పాలక వర్గాలు లేక ప్రాజెక్టు అతీగతి లేకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుగా నీరున్నా సాగుకు అందక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఎడమ, కుడి కాల్వలో పెరిగిన తుంగను సగం మేర తొలగించుకున్నా సరిగా నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టపై చెట్ల పొదలు ఏపుగా పెరిగాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నందివాగుపై నిర్లక్ష్యపు నీడ ఇబ్బంది పడుతున్న ఆయకట్టు రైతులు పట్టించుకోని పాలకులు, అధికారులు -
కులంపేరిట దూషించిన వారిపై చర్యలకు డిమాండ్
నందిగామ: తనను కులం పేరుతో దూషించిన వ్యక్తులపై నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మోత్కులగూడ గ్రామానికి చెందిన వానరాసి నర్సింలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను స్థానిక విలేకరులకు అందజేశాడు. ఈ నెల 4న గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్లాటు విషయమై అధికారులతో మాట్లాడుతున్న సమయంలో గ్రామానికి చెందిన జెట్ట శంకరయ్య, జెట్ట రవి, జెట్ట హరీశ్ తనను గ్రామస్తుల సమక్షంలోనే కులం పేరుతో దూషించి, అవమానపరిచి, బెదిరించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని రోజులుగా తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్న శంకరయ్య, రవి, హరీశ్లపై విచారణ జరిపి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు -
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జశ్వంత్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు,బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. దరఖాస్తుల ఆహ్వానం ఇబ్రహీంపట్నం రూరల్: న్యాయ పరిపాలనలో శిక్షణకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్చే గుర్తించిన ఇన్స్టిటూషన్స్, సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ లేదా ఇన్ కార్పొరేషన్ చేసిన లేదా స్థాపించబడిన దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి ఏదేని ఫ్యాకల్టీలో బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొందిన వారు అర్హులని తెలిపారు. వార్షికాదాయం రూ.2 లక్షలు మించొద్దని, అభ్యర్థి గత సంవత్సరంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉండకూడదని చెప్పారు. ఎంపికై న అభ్యర్థులు న్యాయ పరిపాలనలో మూడేళ్ల వ్యవధికి శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.3వేలు స్టయిఫండ్, మొదటి సంవత్సరం లా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జిల్లా కోర్టులు, మొబైల్ కోర్టులు, సెషన్ కోర్టు, డివిజన్ స్థాయి, తాలుకా స్థాయి కోర్టుల్లో గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 30న ఒరిజినల్ సర్టిఫికెట్లతో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు. -
ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం శేరిగూడలోని శ్రీదత్త విద్యా సంస్థల్లో శనివారం ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2024– 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు అత్యాధునిక టెక్నాలజీలో శిక్షణ ఇస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు వందశాతం ప్లేస్మెంట్ కల్పిస్తున్నామని తెలిపారు. 46 మల్టీ నేషనల్ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తూ పాటు వందశాతం ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్స్ డీన్ వెంకట అచ్యుతరావు, ప్రిన్సిపాల్ సెంథిల్కుమార్, డాక్టర్ మదుసూధన్రెడ్డి, టీపీఓ డాక్టర్ మయూరి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
కొడంగల్ రూరల్: వన మహోత్సవం కోసం గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీఓ ఉషశ్రీ అన్నారు. శనివారం ఆమె మండల పరిధిలోని అప్పాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనె వాతావరణం సమత్యుల్యంగా ఉంటుందన్నారు. వృక్షాలతో అటవీ సంపద పెంచడంతో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. యువకుడి అదృశ్యం కుల్కచర్ల: ౖహెదరాబాద్కు వెళ్లి పని చేసుకుంటానని చెప్పి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏముకంటి మురళి(29) హైదరాబాద్లో మొబైల్ షాప్లో పనిచేసేందుకు వెళ్తున్నాని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లాడు. నాటి నుంచి అతని ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళనతో తల్లిదండ్రులు వారి బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మురళి సోదరుడు నరేశ్ శనివారం కుల్కచర్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మూడు టిప్పర్లు, జేసీబీ సీజ్ పరిగి: నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు, జేసీబీని ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని పరిగి స్టేషన్కు తరలించారు. మండల పరిధిలోని సయ్యద్పల్లి శివారు హిరాపూర్ తండాకు వెళ్లే మార్గంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం అర్ధరాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు టిప్పర్లు, ఓ జేసీబీని పట్టుకుని పరిగి ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లోవోల్టేజీ సమస్యకు పరిష్కారం దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ తెలుగువాడలో కొన్నేళ్లుగా లోవోల్టేజీ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించగా అధికారులు స్పందించి లైన్మెన్ వెంకట్రాములు పర్యవేక్షణలో శనివారం నూతన ట్రాన్సఫార్మర్తో పాటు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెకరేషన్ గోడౌన్లో అగ్నిప్రమాదం పహాడీషరీఫ్: డెకరేషన్ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీలో వివాహాదిశుభకార్యాలకు వినియోగించే డెకరేషన్ సామగ్రి గోడౌన్ ఉంది. శనివారం సాయంత్రం పక్కనే ఉన్న చెత్తకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో గోడౌన్కు మంటలు వ్యాపించాయి. డెకరేషన్ సామగ్రిలో ప్లాస్టిక్, ఫైబర్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జనావాసాల నడుమ ఉన్న ఈ గోడౌన్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
షాద్నగర్: ఉపాధ్యాయులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలన్నారు. వారితో పనులు చేయించడం సరికాదన్నారు. ఇటీవల నేరేళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులతో మూత్రశాలలు కడిగించడం, పాటిగడ్డలో ఉపాధ్యాయులు విధులకు సెలవు పెట్టి సొంత పనులకు వెళ్లడం వెళ్ళడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతారన్నారు. అటువంటి ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు శివశంకర్, ఆదిల్, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ -
వ్యాపారవేత్తలుగా ఎదగాలి
వీధి వ్యాపారులతో ఫుడ్ మేళా ● పాల్గొన్న ఎమ్మెల్యే బీఎమ్మార్ తాండూరు టౌన్: వీధి వ్యాపారులు స్వయం శక్తితో వ్యాపార వేత్తలుగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట వీధి వ్యాపారులతో ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. స్టాల్స్ను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులు భవిష్యత్లో పెద్ద వ్యాపారులుగా అభివృద్ధి చెందాలన్నారు. పట్టుదల, శ్రమతో సాధించనిది ఏదీ లేదని, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అనేక మంది చిరు వ్యాపారులుగానే జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. వీధి వ్యాపారుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరశైవ సమాజానికి అండగా ఉంటా ఇటీవల షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురైన పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే బిఎమ్మార్ సందర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణం, ప్రమాదంలో సంభవించిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. మండపం మరమ్మతులకు ప్రభుత్వం తరఫున ఆర్థిర్ధికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి తెలంగాణ సిద్ధాంత కర్త.. స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కృషిని మరువలేమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం చివరి వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి అని, నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, నీరజ, నాయకులు పట్లోళ్ల నర్సింలు, హబీబ్ లాలా, సంతోష్, వేణు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయం యాలాల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రాస్నం గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అసైన్డ్ రైతుల భూముల్లో బోర్ల డ్రిల్లిండ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా రాస్నం గ్రామాన్ని ఎంపిక చేశారని తెలిపారు. గ్రామ పరిధిలో సుమారు 111 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని, 12 యూనిట్లుగా రైతులను ఎంపిక చేసి వారి భూముల్లో బోర్లు వేసినట్లు తెలిపారు. దీంతో 69 ఎకరాలకు పైగా నీరందుతుందని, 35 కుటుంబాలు లబ్ధిపొందుతాయని వివరించారు. ఇందు కోసం రూ.9.57 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. బోర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పుష్పలీల, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమప్ప, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ అధ్యక్షుడు మన్నాన్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అమృతప్ప, మాజీ సర్పంచులు హన్మంతు, మధుసూదన్రెడ్డి, నాయకులు ఆరిఫ్ హుస్సేన్, లక్ష్మీకాంత్రెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. మొగులయ్య సేవలు మరువలేని ఉపాధ్యాయ వృత్తిలో మొగులయ్య అందించిన సేవలు మరువలేనివని, ప్రతి ఉపాధ్యాయుడికి ఉద్యోగ విరమణ తప్పదని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అగ్గనూరు ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మొగులయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొగులయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీధర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, రాములు, మురహరినాథ్, ప్రభాకర్చారి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు కొత్త భవనాలు
యాచారం: ఈజీఎస్ పథకం నుంచి రూ.20 లక్షల చొప్పున నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన శిథిల భవనాల్లోనే ఇబ్బందుల నడుమ ప్రజాప్రతినిధులు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వర్షాలకు నీరంతా గదుల్లోకి చేరి విలువైన రికార్డులు తడిసిపోయేవి. తాజాగా పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంతన్గౌరెల్లిలో భవన నిర్మాణ పనులు జోరందుకున్నాయి. నందివనపర్తిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ, ధర్మన్నగూడ, కేసీతండా, తక్కళ్లపల్లి తండా, అయ్యవారిగూడెం గ్రామాల్లోనూ నూతన పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ గ్రామాల్లో ఏళ్ల కింద నిర్మించిన భవనాలుండగా కేసీతండా, ధర్మన్నగూడెం, అయ్యవారిగూడెం, తక్కళ్లపల్లి తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు గ్రామాల్లో ప్రభుత్వ భవనాల్లోనే పాలన కొనసాగుతుండగా, శాశ్వత భవన నిర్మాణాల కోసం నిధుల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కొత్త పంచాయతీలకు సైతం శాశ్వత భవనాలు ఉంటాయని మండల పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాలకు ఈజీఎస్ నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు మరో ఏడు గ్రామాలకు ప్రతిపాదనలు త్వరలో ప్రారంభిస్తాం నందివనపర్తిలో ఏళ్ల కింద నిర్మించిన ఇరుకై న గదిలోనే పాలన కొనసాగిస్తున్నాం. సమావేశాల సమయంలో ఇబ్బంది అవుతుంది. పంచాయతీ, రెవెన్యూ, వైద్య, ఇతర సిబ్బంది వచ్చినప్పుడు కష్టంగా విధులు నిర్వర్తిస్తున్నాం. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. – ఈర్లపల్లి శ్రీనువాస్, పంచాయతీ కార్యదర్శి, నందివనపర్తి -
ఇసుక తోడేళ్లు
కాగ్నా నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా ● రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా.. ● అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి తాండూరు రూరల్: నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రామాల మధ్య ఉన్న కాగ్నా వాగు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భజలాలు పడిపోతున్నాయని సమీప గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సిబ్బంది కొరత కారణంగా చేతులెత్తేస్తున్నారు.. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తాండూరు మండల పరిధిలోని గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రామాల మధ్య కాగ్నా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులో ఇసుక పుష్కలంగా ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. వర్షాలు పడకపోవడంతో ఇదే అదనుగా భావించిన కొందరు రాత్రి వేళ ట్రాక్టర్లతో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోనూర్కు చెందిన ఓ యువ నాయకుడి అండదండలతోనే ఈ తతంగం నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే నాయకులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో మాకెందుకులే అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని జరిమానా విధించి కేసులు నమోదు చేసినా దందా ఆగడం లేదు. చీకటి పడితే చాలు.. రాత్రి 9 గంటలైతే చాలు కాగ్నా వాగు నుంచిఇసుక తరలింపు మొదలవుతుంది. తెల్లవారుజమున ఆరు గంటల వరకు యథేచ్ఛగా తరలిస్తారు. ఇసుక ట్రా క్టర్ల కారణంగా రాత్రి నిద్ర పట్టడం లేదని గోనూర్, వీర్శెట్టిపల్లి ప్రజలు తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పలు ప్రాంతాలకు తరలింపు కాగ్నా నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్, మల్కాన్గిరి, రెడ్డిఘనాపూర్ తోపాటు తాండూరు పట్టణానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేల వర కు విక్రయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హైకోర్టు స్టే ఉన్నా.. గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రామాల శివారులోని కాగ్నా వాగు నుంచి ఇసుక అరలింపునకు అనుమతి ఇవ్వరాదని కొన్నేళ్ల క్రితం హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఇవ్వడం లేదు. కానీ అక్రమార్కులు ఇవేవీ లెక్క చేయడం లేదు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగిస్తున్నారు. జిల్లా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించి కట్టడి చేయాలని ఆ రెండు గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. లేకుంటే భూ గర్భజలాలకు ముప్పు తప్పదని వారు పేర్కొన్నారు. అనుమతి లేదు గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రా మాల శివారులోని కాగ్నా నది నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తున్నట్లుమా దృష్టికి వచ్చింది. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరత కారణంగా తనిఖీ చేపట్టలేకపోతున్నాం. ఇసుక అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం. – తారాసింగ్, తహసీల్దార్, తాండూరు -
‘నీట్, ఐఐటీ’కి సన్నద్ధం చేయండి
● జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్పరిగి: ఇంటర్ విద్యార్థులను నీట్, ఐఐటీ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్ సూచించారు.శుక్రవారం పరిగి పట్టణం తుంకుల్గడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా లో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకుందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్య తోపాటు స్కాలర్షిప్ సదుపాయం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల కంటే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయా లు తెలియజేసి కళాశాలలో చేర్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్, అధ్యాపకులు భాస్కర యోగి, రాజ్కుమార్, సతీష్, వరస్వామి, గోపాల్, ప్రభాకర్, రవి, వెంకటేశ్, గణేశ్, బాలగణేశ్, మమత పాల్గొన్నారు. -
బడిదుడుకులు
సమస్యలకు నిలయంగా సర్కారు స్కూళ్లు ● పెచ్చులూడుతున్న భవనాలు ● కొరవడిన శుభ్రత, ప్రహరీల కరువు ● జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,063 ● విద్యార్థులు 80వేల మంది మర్పల్లి: అపరిశుభ్రంగా బూచన్పల్లి పాఠశాల ఆవరణ వికారాబాద్: పాఠశాలలు పునఃప్రారంభమై వారం గడిచినా ఇంకా సమస్యలు కొలిక్కిరాలేదు. స్కూల్ భవనాలు, వసతుల కల్పన కోసం మన ఊరు – మన బడి, అమ్మా ఆదర్శ పాఠశాలలు పేరిట పనులు చేపట్టినా అనుకున్న మేర ఫలితం ఇవ్వలేదు. జిల్లా వ్యాప్తంగా 1,063 పాఠశాలలు ఉండగా ఇందులో 80వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 187 బడుల్లో వివిధ మరమ్మతు పనులు అవసరమని అధికారులు తేల్చారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగు చేశాయి. అనేక బడుల్లో పెచ్చులూడుతున్న పైకప్పులు కనిపించాయి. ప్రహరీలు లేకపోవడం, మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రతంగా దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేవు. చెడిపోయిన ట్యాప్లు కనిపించాయి. గేట్లు లేకపోవడంతో స్కూల్ వదిలాక ఆకతాయిలు చేరి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. పాఠశాలల ఆవరణల్లో గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. – వివరాలు 11లోu -
నేడు వికారాబాద్లో యోగా డే
అనంతగిరి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్కుమార్, కలెక్టర్ ప్రతీక్జైన్ హాజరుకానున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. నేడు బంట్వారానికి స్పీకర్ ప్రసాద్కుమార్ రాక బంట్వారం: మండల కేంద్రానికి శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ రానున్నట్లు ఎంపీడీఓ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కోట్పల్లిలో పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కోట్పల్లి ఎంపీడీఓ డానియల్ తెలిపారు. డయల్ యువర్ డీఎం నేడు తాండూరు: తాండూరు ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ సురేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10నుంచి 11 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బాధితులకు సెల్ఫోన్ల అప్పగింత యాలాల: పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఎస్ఐ గిరి తెలిపారు. మండలంలోని దేవనూరుకు చెందిన మెట్లి కృష్ణ, హాజీపూర్కు చెందిన ఇస్మాయిల్, మెట్లకుంటకు చెందిన బాల్రాజ్ ఇటీవల తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్నారు. యాలాల పీఎస్లో ఫి ర్యాదు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫో న్లను గుర్తించి స్వాధీనం చేసుకొని శుక్రవారం బాధితులకు అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు. కల్యాణ మండప పునర్నిర్మాణానికి సహకరిస్తా తాండూరు: వీరశైవ సమాజం సభ్యుల కోసం నిర్మించిన కల్యాణ మండపం అగ్ని ప్రమాదానికి గురి కావడం బాధాకరమని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్కుమార్తో కలిసి ప్రమాదానికి గురైన మండపాన్ని సందర్శించి అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మండప పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీర శైవ సమాజం అధ్యక్షుడు ఆర్ బస్వరాజ్, గౌరవాధ్యక్షుడు వాలి శాంతుకుమార్, నాయకులు టీ చంద్రశేఖర్, గణపురం శంకర్, ఎన్ చంద్రశేఖర్, రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు రఘు తదితరులు పాల్గొన్నారు. 27నుంచిధ్రువపత్రాల పరిశీలన అనంతగిరి: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైనట్లు వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ముందుగా కౌన్సిలింగ్ రుసుం చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డు, ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కెట్లు, టీసీ, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా
● విద్యార్థుల రవాణాలో నిర్లక్ష్యం వద్దు ● ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, వ్యాన్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ నారాయణ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించరాదని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సూచించారు. లైసెన్స్ ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించాలి ఆదేశించారు. ఫిట్నెస్ ఉన్న వాహనాలనే వినియోగించాలని లేకుంటే చర్యలు తప్ప వని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పర్మిట్, కాలుష్య నియంత్రణ పత్రం, పీయూసీ) సక్రమంగా ఉండాలన్నారు. లేకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్ల చిరునామా, ఫోన్ నంబర్లు, పోలీస్ వెరిఫికేషన్ నివేదిక తప్పనిసరిగా ఉంచుకోవాలని పాఠశాలల యాజమాన్యానికి సూచించారు. డ్రైవర్ల ప్రవర్తనపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదన్నారు. నిర్ణీత వేగంతో వాహనాన్ని నడపాలని సూచించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి వాహనంలో తప్పనిసరిగా మహిళా సహాయకులు లేదా కేర్ టేకర్ ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి హెల్ప్లైన్ నంబర్లను వాహనం వెలుపల స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని పాఠశాలల బస్సులు, వ్యాన్లను ఆర్టీఏ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. నిబంధనల ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు: ఎంవీఐ వీరేంద్రనాయక్ పరిగి: ప్రైవేటు స్కూల్ బస్సులకు అన్ని ధ్రువపత్రాలు ఉండాలని పరిగి ఎంవీఐ వీరేంద్రనాయక్ ఆదేశించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని కృష్ణావేణి టాలెంట్ స్కూల్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే సంబంధిత పాఠశాలలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కండీషన్లో లేని బస్సులను నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున ఫిట్నెస్ ఉన్న బస్సులనే విద్యార్థుల రవాణాకు వినియోగించాలని సూచించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిస్తే రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. ఆలస్యం చేస్తే సహించేది లేదన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడపాలన్నారు. హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్తే స్కూల్ బస్సులను నడపాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గడపకూ సంక్షేమం
● పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మోమిన్పేట: వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 7వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. శు క్రవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో 312 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, 27 మందికి కల్యాణలక్ష్మి, షా దీముబాక్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎన్నికల హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నట్లు పే ర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నాలుగు దశల్లో నిర్మాణ బిల్లులు రూ.5 లక్షలు జమ చేస్తామని వివరించారు. పేదలు కడుపునిండా అన్నం తినాలనే మంచి ఆశయంతో దేశంలోనే మొదటి సారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఐదు ఎకరాల వరకు రైతు భ రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అ వుతోందని తెలిపారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. త్వరలో పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరవుతాయని వివరించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రవీందర్, ఏఓ జయశంకర్, ఎంపీఓ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు శంకర్, నాయకులు సురేందర్, నరోత్తంరెడ్డి, మహంత్స్వామి, సిరాజొద్దీన్, నర్సింలు, విఠల్, మల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, మాణయ్య, రవి, వెంకటయ్య, చంద్రయ్య పాల్గొన్నారు. 263 మందికి పత్రాలుమర్పల్లి: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆకుల రాజేందర్ ఫంక్షన్ హాల్లో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్ కొండల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్రెడ్డితో కలిసి మండలంలోని 263 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మరో 40 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు ఇళ్లు మంజూరు చేసి వారి గుండెల్లో నిలిపోయారని గుర్తుచేశారు. అర్హలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, నాయకులు రాములు యాదవ్, సుభాష్ యాదవ్, ఖలీమొద్దీన్, శంకరయ్య గౌడ్, సంజీవరెడ్డి, గణేశ్, నాగేశ్, రవీందర్, ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రామేశ్వర్, సహకార సంఘం వైస్ చైర్మన్ ఫసి, మండల ప్రత్యేకాధికారి మోహన్కృష్ణ, తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ రాజ్మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొడంగల్ మున్సిపల్కు మహర్దశ
● రూ.300 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి ● అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపనలు ● సుందరంగా మారనున్న పట్టణం కొడంగల్: కొడంగల్ మున్సిపాలిటీకి మహర్దశ ప ట్టింది. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తాజాగా శుక్రవారం కొడంగల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బాలరాం నాయక్ తెలిపారు. పట్టణంలో ని వినాయక చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ నున్నట్లు తెలిపారు.తాగునీటి సరఫరాకు రూ.2.50 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.66. 72 కోట్లు, వర్షపు నీటి పారుదల వ్యవస్థకు రూ.57. 67 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థకు రూ. 7.09 కోట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.78 కోట్లు, ఇతర ఖర్చులు రూ.66.50 కోట్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు రూ.6.67 కోట్లు మంజూరు చేశారు. అభివృద్ధిలో ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గా న్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 వేల కోట్ల తో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు చేశారు.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తాం. – నందారం ప్రశాంత్, పార్టీ మండల అధ్యక్షుడు, కొడంగల్ -
తాండూరులో 296 అర్జీలు
తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. మండలంలో 33 గ్రామాల్లో 14 రోజుల పాటు తహహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ బృందాలుగా ఏర్పడి దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం ఆఖరు రోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద పట్టణంలోని పాత తాండూరు, మల్రెడ్డిపల్లి, సాయిపూర్ ప్రాంతంలోని రైతుల నుంచి అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 296 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీటీ లలిత, ఆర్ఐ గోపి, సిబ్బంది పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి.. బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కోట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎన్నారం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అందజేసిన 21 దరఖాస్తులను తహసీల్దార్ స్వీకరించి పరిశీలించారు. క్షేత్ర స్థా యిలో విచారణ జరిపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పెద్దేముల్లో 205 దరఖాస్తులు తాండూరు రూరల్: పెద్దేముల్ మండలంలో రెవెన్యూ సదస్సుల్లో 205 దరఖాస్తులు వచ్చినట్లు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ చెప్పారు. పెద్దేముల్, రుద్రారం గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 14 రోజుల పాటు ఆయా గ్రామాల్లో తహసీల్దార్, డీటీలు రెండు బృందాలు ఏర్పడి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బొంరాస్పేటలో 425 బొంరాస్పేట: మండలంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో శుక్రవారం ముగింపునాటికి 425 దరఖాస్తులు వచ్చాయి. ముగింపురోజు మండల పరిధిలోని ఏర్పుమళ్ల గ్రామంలో నిర్వహించిన సదస్సులో 123 దరఖాస్తులు అందాయి. ఇందులో తహసీల్దారు పద్మావతి, ఆర్ఐలు శిరీష, రవి, సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ సదస్సులకు స్పందన కుల్కచర్ల: రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన వచ్చిందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులుముదిరాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అల్మాస్ఖాన్పేట్లో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన సదస్సులలో 1424 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్చక్రవర్తి, డీటీ చంద్రశేఖర్, గిర్దవరులు ఖాజ, రవి, నాయకులు గోపాల్నాయక్, శ్రీనివాస్, భరత్కుమార్రెడ్డి, కృష్ణయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు. ముగిసిన రెవెన్యూ సదస్సులు -
దళిత శ్మశానవాటిక రోడ్డు ధ్వంసం
యాలాల: దళిత శ్మశానవాటికకు వేసిన సీసీ రోడ్డును ధ్వంసం చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన దళిత సంఘం నేతలతో కలిసి శుక్రవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ.. మండలంలోని రాస్నం గ్రామంలో సర్వే నంబరు 129లో ఎకరా భూమిలో దళితుల శ్మశానవాటిక ఉందన్నారు. దానికి గతంలో సీసీ రోడ్డును ప్రభుత్వ నిధులతో వేసినట్లు చెప్పారు. అదే గ్రామానికి చెందిన కొందరూ వ్యక్తుల ప్రోద్బలంతో రఫీక్, యూసుబీ, మక్తర్, ముఖీద్లు దౌర్జన్యంగా అర్ధరాత్రి వేళ జేసీబీ సాయంతో శ్మశానవాటిక సీసీ రోడ్డును ధ్వంసం చేశారన్నారు. దీన్ని అడ్డుకోబోయిన వారిపై కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశప్ప, బాలప్ప, నర్సింహులు, సాయిలు, అంజిలప్ప, భాస్కర్, లక్ష్మప్ప, వీరప్ప, అంజిలయ్య తదితరులు ఉన్నారు. నిందితులపై అట్రాసిటీ నమోదు చేయాలని కేవీపీఎస్ నాయకుల డిమాండ్ -
ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం
కుల్కచర్ల: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందని పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, పార్టీ చౌడాపూర్ అధ్యక్షుడు అశోక్కుమార్, ఏఎంసీ చైర్మన్ రామ్మోహన్శర్మ పేర్కొన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండలం చాకల్పల్లి, నీర్సాబ్ తండా, కొత్తపల్లి తండాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించడంతో పాటుగా పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్రెడ్డి, చంద్రశేఖర్, శేఖర్, వెంకటయ్య, విజయకుమార్ పాల్గొన్నారు. నోట్ పుస్తకాల అందజేత పరిగి: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన శ్రీశైలం శుక్రవారం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రి అందజేశారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తాను నిరంతరం కృషి చేస్తానని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం దోమ: మండల పరిధిలోని దిర్సంపల్లి, గుండాల సబ్స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులకు విద్యుత్లో అంతరాయం కల్గుతుందని ఏఈ జి.వినయ్కాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని 132 కేవీ నుంచి రాపోల్లోని 33 కేవీ సబ్స్టేషన్ వరకు చెట్ల కొమ్మలు తొలగింపు జరుగుతున్న కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గుతుందన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని తెలిపారు. కొడంగల్ను అభివృద్ధి చేయండి ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బి.గుల్షన్ కొడంగల్ రూరల్: గజ్వేల్, సిరిసిల్ల మాదిరిగా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బి.గుల్షన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొడంగల్లోని అంబేడ్కర్ చౌరస్తా, వినాయక చౌరస్తాలను విస్తరిస్తామని నామమాత్రపు పనులతో చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. శిథిలావస్థకు చేరిన షాదీ ఖానాను నూతనంగా నిర్మిస్తామని నిధులు మంజూరైనట్లు ప్రొసీడింగ్ చూయిస్తూ మభ్యపెడుతున్నారన్నారు. రూ.కోట్లాది మంజూరు చేస్తున్నామంటున్న ప్రభుత్వం కొడంగల్లో అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. వెలగని హైమాస్ట్ లైట్లు దుద్యాల్: హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో మండలంలోని హస్నాబాద్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట స్థానిక గాంధీ చౌక్లో ఉన్న హైమాస్ట్ దీపాలు పనిచేయకపోవడంతో అంధకారం అలుముకుంది. దీంతో దైనందిన కార్యక్రమాలకు అవరోధంగా మారాయి. కారు చీకట్లలో ఏం పనులు చేయాలన్న పెద్ద సమస్యగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్యాంక్ నిండి.. వృథాగా పారి పూడూరు: మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పూడూరు మండల కేంద్రానికి వెళ్లే రోడ్డులో ఉన్న ట్యాంకు నిండి తరచూ నీరు రోడ్డుపైనే పారుతుంది. కుళాయిల్లో నీరు రాక ఇబ్బందులు పడుతూ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఈ రోడ్డుపై నుంచి వెళ్లే అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పట్టించుకుని కాలనీకి నీరు ఇవ్వాలని కోరుతున్నారు. -
టీబీ ముక్త్ అభియాన్ను వినియోగించుకోవాలి
కొడంగల్ రూరల్: టీబీ ముక్త్ అభియాన్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు బుస్రా సూచించారు. శుక్రవారం పట్టణంలోని వడ్డెరగల్లీ కాలనీలో నిర్వహించిన క్యాంపులో ఆమె సలహాలు, సూచనలు అందించారు. షుగర్, బీపీ, క్యాన్సర్ వచ్చినవారు, పాత టీబీ పేషంట్లు, కుటుంబసభ్యులు, పొగాకు తాగేవారి నుంచి శాంపిల్స్ తీసుకున్నామన్నారు. మొత్తం 110మంది స్క్రీన్ చేసి 38మందికి ఎక్స్రే చేశామన్నారు. దీంట్లో టీబీ పాజిటివ్ వచ్చిన వారికి 6 నెలలపాటు ఉచితంగా మందులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీ డాక్టర్ అమృత, హెల్త్ అసిస్టెంట్ మధు, టీబీ సూపర్వైజర్లు రాహత్అలీ, సుశీల, ఏఎన్ఎం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
పోలేపల్లికి పోటెత్తిన భక్తులు
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లిలో స్వయంభూగా వెలిసిన రేణుక ఎల్లమ్మ దేవాలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన జనాలు అమ్మవారికి బోనాలు, కోడి పుంజులు, మేకపోతులతో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజులలో అమ్మవారిని దాదాపు ఐదు వేలకు పైగా మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు ఆలయ ఈవో రాజేందర్రెడ్డి తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు నిండిపోయారు. -
బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం
తాండూరు: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనులకు రాజ్యాధికారం సాకారమవుతోందని ఈ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని చంద్రశేఖర్ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ సెంట్రల్ కో ఆర్డినేటర్ దాగిల్లా దయానందరావు, విశిష్ట అఽతిథులుగా లింగంపల్లి యాదగిరిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలలో ఒక సామాజిక వర్గం మాత్రమే ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. తాండూరు నియోజకవర్గంలో బహుజనుల సంఖ్య 70 శాతం ఉప్పటికి విద్యా, ఉద్యోగం, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనుల హక్కులు అందుతాయన్నారు. అందుకు కార్యకర్తలు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జగన్, సయ్యద్అమీర్, ప్రభుకుమార్, బాల్రాజ్, అమ్జద్అలీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ముదిరాజ్ -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
మోమిన్పేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైన సంఘటన మోమిన్పేటలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. మండల పరిధిలోని చీమల్ధరి గ్రామానికి చెందిన మ్యాతరి పర్మయ్య పని నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధమైంది. గమనించిన చుట్టు పక్కల వారు మంటలను ఆర్పారు. అప్పటికే ప్రమాదంలో తులం బంగారు నగలు, రూ.3.5లక్షల నగదుతో పాటు, విలువైన డాక్యుమెంట్లు కాలిపోయాయని బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. ప్రైవేట్ బడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పరిగి: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని మాస్టర్మైండ్ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్య లను కూడా ఏర్పాటు చేయకుండా ఎలా స్కూళ్లను నడుపుతారని ప్రశ్నించారు. అధికారులు పాఠశాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయిగణేష్, అఖిల్, సాయి తదితరులు పాల్గొన్నారు. వైన్స్ ఎదుట సెల్ఫీ తీసుకున్న యువకుడిపై దాడి మొయినాబాద్: వైన్ షాపు ఎదుట సెల్ఫీ తీసుకున్న ఓ యువకుడిపై యజమానితోపాటు సిబ్బంది దాడి చేశారు. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన యువకుడు రాఘవేందర్రెడ్డి గురువారం సాయంత్రం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పెద్దమంగళారం రోడ్డులో ఉన్న వైన్స్కు వెళ్లాడు. షాపు ముందు సెల్ఫీ తీసుకున్నాడు. అది గమనించిన సిబ్బంది అతనిపై దాడి చేశారు. అంతలోనే యజమాని శ్రీనివాస్గౌడ్ సైతం వచ్చి ఫొటో ఎందుకు తీశావంటూ దాడిచేయడంతో సిబ్బంది రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టారు. కర్రలతో కొట్టడంతో వీపు, కాళ్లు వాతలతో కమిలిపోయాయి. ముఖంపై గాయాలయ్యాయి. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వైన్స్ యజమానితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కేంద్ర పథకాలను ప్రచారం చేయండి
దోమ: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చి నేరుగా అందిస్తున్నారని తెలిపారు. ఉచిత రేషన్ బియ్యం, ఆయుష్మాన్ భారత్, రైతులకు మద్దతు ధర, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్బీమా యోజన తదితర వాటిని అందిస్తుందన్నారు. కార్యకర్తలు సమష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక పరుగులు
రైతుల నిర్బంధాలు, ప్రతిఘటనలు, నిరసనగళంతో గతంలో అట్టుడికిన దుద్యాల్ మండలంలో ప్రస్తుతం పారిశ్రామికవాడ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో సింహభాగం భూ సేకరణ జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. దుద్యాల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోని హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, పులిచర్లతండా, రోటిబండతండా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. నిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ఉద్యోగులు వచ్చి భూములకు హద్దులు నిర్ధారిస్తున్నారు. ఎన్నో ఆటంకాల మధ్య సాగిన భూ సేకరణ చివరి దశకు చేరుకుందని వారు తెలుపుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారులు పారిశ్రామికవాడ భూములను పరిశీలించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం 1,177.35 ఎకరాలకు నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. అధికారులు నేటివరకు 658 మంది పట్టాదారులకు సంబంధించిన 914.12 ఎకరాల భూమిని సేకరించారు. పోలేపల్లి గ్రామంలో 48 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం టీజీఐఐసీకి అప్పగించారు. వాటికి పరిహారంగా దాదాపు రూ.180 కోట్ల వరకు చెల్లించారు. భూ సేకరణ పోలేపల్లిలో పూర్తి కాగా లగచర్ల, హకీంపేట్ రెవెన్యూ గ్రామాల్లో ఇంకా 263.23 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇక కంపెనీల ఏర్పాటు ఇప్పటివరకు సేకరించిన భూముల్లో ప్రభుత్వం త్వరలో కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఫార్మా ఏర్పాటు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాంటి కంపెనీలు ఏర్పాటు చేస్తారో అనే చర్చ కొనసాగుతోంది. కాలుష్య రహిత కంపెనీలు ఏర్పాటు చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఉపాధి పండుగ కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభమైతే నియోజకవర్గంలోని కూలీలకు, 10వ, ఇంటర్ స్థాయిలో చదువుకున్న వారికి సూపర్వైజర్లుగా ఉపాధి లభిస్తుంది. స్థానిక కాంట్రాక్టర్లకు సైతం చేతినిండా పనులు దొరుకుతాయని భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణ దశలో వేల సంఖ్యలో కూలీలు అవసరం ఉంటుందని, ఇక్కడి ప్రాంత వాసులు ఇరత ప్రాంతాలకు వెళ్లి పనులు చేయాల్సిన అవసరం లేదనే సంతోషంలో ఉన్నారు. భూ సేకరణలో వేగం పెంచిన అధికారులు నిర్ధారించిన హద్దులకు రంగులు ఇప్పటి వరకు సేకరించిన భూమి 914.12 ఎకరాలు మిగిలింది మరో 263.23 ఎకరాలే.. త్వరలో కంపెనీలకు అప్పగించే అవకాశం! పరిశీలించిన టీఎస్ఐఐసీ అధికారులుసేకరించిన భూ వివరాలు పారిశ్రామవాడ ఏర్పాటుకు ప్రభుత్వం 1,177.35 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా పోలేపల్లి గ్రామంలో 38 మంది రైతుల నుంచి 73.39 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు 48 ఎకరాల ప్రభుత్వ భూమిని అదనంగా స్వాధీనం చేసుకున్నారు. హకీంపేట్లో 172 మంది రైతులకు సంబంధించి 261.33 ఎకరాల అసైన్డ్, 143.21 ఎకరాల పట్టాభూమి, లగచర్ల రెవెన్యూ పరిధిలో 64 మంది రైతులకు సంబంధించి 72.26 ఎకరాల అసైన్డ్, 212 మంది రైతుల నుంచి 314.13 ఎకరాల పట్టా భూమిని అందించారు. ఇప్పటికే 862.02 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 263.23 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. సేకరణకు రైతులు అనుకూలం రైతులతో మాట్లాడుతున్నాం. త్వరలో మిగిలిన భూమి సేకరిస్తాం. రైతులు అనుకూలంగా ఉన్నారు. అన్నదమ్ముల, తాతల భాగాల్లో తేడా ఉన్నందున సరి చేసుకుని ఇస్తామని చెబుతున్నారు. వారితో నిరంతరం మాట్లాడుతున్నాం. – కిషన్, తహసీల్దార్ దుద్యాల్ -
నాలుగు విడతల్లో నగదు జమ
అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని.. నాలుగు విడతల్లో బిల్లులు ఎప్పటికప్పుడు ఖాతాలో జమ అవుతాయని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం ఆయన వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణంలో 359 మంది, మండల పరిధిలో 254 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా అందరికీ ఏక కాలంలో ఇళ్లు ఇవ్వలేక పోతున్నామని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పేదలు కడుపు నిండా అన్నం తినాలనే సదాశయంతో రాష్ట్రంలో సన్నబియ్యం ప్రారంభించామన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధికి అధికంగా నిధులను కేటాయిస్తోందన్నారు. తొమ్మిది రోజుల్లో భరోసా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదే అన్నారు. ఉద్యోగులు పేదలకు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. వానాకాలం పంటల సాగుకు రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నిన్నటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతులకు అందాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది రోజులలో రూ.9వేల కోట్లు రైతులకు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న భూములలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయని వివరించారు. అనంతగిరిని పర్యాటకంగా రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని.. ఈ ప్రాజెక్టుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 613 మంది లబ్ధిదారులకు ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత స్టాల్ ప్రారంభం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిర మహిళా శక్తి మన దుకాణం స్టాల్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. -
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండి
దుద్యాల్: ఈర్లపల్లి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం వారు కొడంగల్లోని కడా కార్యాలయంలో వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 26 మహిళాసంఘాలకు గాను డ్వాక్రా భవనం, పీర్ల ఏర్పాటుకు మసీద్, ముస్లింలకు కబరస్తాన్ కోసం ఎకరా స్థలం కేటాయించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు సరిత, గ్రామస్తులు విజి బాయి, రవినాయక్, మొగులయ్య, బాష, మహమ్మద్, గుడ్ సాబ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ప్రవేశ పోటీలకు 14 మంది బాలలు కుల్కచర్ల: తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా గురువారం మండల కేంద్రంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ప్రవేశ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి హబీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. మండల పరిధిలో 10 మంది బాలురు, నలుగురు బాలికలను జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షకు ఎంపిక చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు ప్రవీణ్, కవిత, కేశవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు రూ.లక్ష విలువైన వస్తువుల వితరణ అనంతగిరి: ప్రతీ ఒక్కరు సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సిద్ధులూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ మండలం సిద్ధలూరు జెడ్పీహెచ్ఎస్కు రిటైర్డ్ జీహెచ్ఎం పురుషోత్తం శాస్త్రి రూ.లక్ష విలువైన సామగ్రి అందజేశారు. విద్యార్థులకు ప్లేట్లు, బెల్టులు, ఐడీ కార్డులు, పాఠశాలకు మైక్సెట్, ప్రింటర్, టేబుల్స్, కుర్చీలు తదితర సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పురుషోత్తం శాస్త్రి ఈ ప్రాంతంలో పనిచేసినప్పడి నుంచి పాఠశాల అభివృద్ధికి పరితపించారన్నారు. ప్రతీ సంవత్సరం పాఠశాలకు ఏదో విధంగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం పురుషోత్తంశాస్త్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందజేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. రామకృష్ణారెడ్డి ఎక్కడ పనిచేసిన ఆ పాఠశాల అభ్యున్నతికి పాటుపడుతారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్, వెంకటేశ్, రమేశ్, రాజు, సంగీత, శ్రీదేవి, మీనాకుమారి, ఆంజనేయులు, నరేశ్, నాగలత పాల్గొన్నారు. నాణ్యమైన పాలే సేకరించాలి టీజీడీడీసీఎఫ్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత కడ్తాల్: పాడి రైతుల నుంచి నాణ్యమైన పాలు సేకరించాలని తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య (టీజీడీడీసీఎఫ్) చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత సూచించారు. కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని సొసైటీల అధ్యక్షులు, వేతన కార్యదర్శులతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ డెయిరీ ద్వారా సేకరించే పాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకే సబ్ప్లాన్ నిధులు
అనంతగిరి: ప్రతీ మూడు నెలలకు ఓసారి డీవీఎంసీ (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నుంచి వివిధ శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు వెచ్చిస్తున్న నిధులపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. జనాభా ప్రాతిపదికన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు పరిష్కారం చూపాలన్నారు. జూలై నుంచి ప్రతీ నెల చివరి శనివారం పౌర హక్కుల దినం నిర్వహించి ఈ కార్యక్రమానికి తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పక హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్జైన్కు సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల్లోనూ వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ల పథకాల్లో అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్, రాంబాబు నాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, డీవీఎంసీ సభ్యులు పెండ్యాల అనంతయ్య, గోవింద్ నాయక్, దస్తప్ప, ఎస్.రాజలింగం, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల సందర్శన వికారాబాద్కు విచ్చేసిన బక్కి వెంకటయ్య కొత్తగడి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కిచన్, స్టోర్రూంను పరిశీలించి భోజన సదుపాయాలపై ప్రిన్సిపాల్ సాయిలత. డీఎస్సీడీఓ కమలాకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు. తేనీటి విందు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబునాయక్, శంకర్, వికారాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ నివాసానికి వెళ్లి తేనీటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమ కాలం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజలింగం, మాజీ కౌన్సిలర్ కిరణ్పటేల్, సురేశ్గౌడ్, దేవదాసు, కేదార్నాథ్, శాంత్కుమార్, రుకుం, సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడులు అరికట్టండి తాండూరు రూరల్: తాండూరు ప్రాంతంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. తాండూరులో పర్యటించి దళితులకు అండగా నిలవాలని చైర్మన్ను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ కార్యదర్శి మల్కయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జినుగుర్తి నర్సింలు ఉన్నారు. దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు ప్రతీ నెల చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
సదస్సుల్లోనే సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సుల్లోనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు సూచించారు. గురవారం ఆయన వికారాబాద్ మండలం అత్వెల్లి, కొత్రేపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కార వేదికలుగా ఉపయోగపడుతున్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులు స్వీకరించి వాటికి రసీదులు ఇవ్వాలని... ఆన్లైన్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ స్థాయిలో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
పాపం పసి పాప
దౌల్తాబాద్: కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న చిన్నారి గొంతులో మెంతో ప్లస్ ప్లాస్టిక్ బిల్ల ఇరుక్కుని, ఊపిరాడక చనిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని ఈర్లపల్లికి చెందిన ముశ్రీఫాబందెప్ప, కళ్యాణి దంపతులు బుధవారం రాత్రి తమ తొమ్మిది నెలల చిన్నారి జ్ఞానేశ్వరితో కలిసి నిద్రించారు. ఈ సమయంలో చిన్నారి చేతికి తగిలిన మెంతోప్లస్ బిల్లను నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుంది. పాప ఏడుపు వినిపించడంతో మేల్కొన్న తల్లిదండ్రులు.. గొంతులో ఇరుక్కుపోయిన బిల్లను చేతులతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. చిన్నారి గొంతులో ఇరుక్కున్న మెంతోప్లస్ ప్లాస్టిక్ బిల్ల ఊపిరాడక మృతి -
ఫోన్ ట్యాపింగ్ ప్రకంపణలు
తాండూరు: నియోజవర్గంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. శాసన సభ ఎన్నికల సమయంలో నియోజవకర్గంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ట్యాపింగ్ గురైన ఫోన్లకు సిట్ అధికారులు ఫోన్లు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో పాటు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి పేరు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. నిగ్గు తేల్చేందుకు స్టేట్మెంట్ రికార్డులు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తాండూరులో ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం పలువురు నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సిట్ బృందానికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పలువురు నేతలను సిట్ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొదట రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత భర్త డాక్టర్ సంపత్కుమార్ ఫోన్ ట్యాపింగ్పై సిట్ అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఫోన్ చేసి స్టేట్మెంట్ ఇచ్చేందుకు నగరానికి రావాలని కోరారు. ఈ విషయాన్ని డాక్టర్ సంపత్కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సోదరుడు ఆర్బీఎల్ కంపెనీ చైర్మన్ బుయ్యని శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్తో పాటు పలువురు యువ నాయకులకు సిట్ నుంచి కాల్స్ వస్తున్నాయి. పలువురు మీడియా ప్రతినిధులకు చెందిన ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. పట్నం అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ తాండూరు నియోజవకర్గంలో 2023లో బీఆర్ఎస్లో ఉన్న మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పట్నం ప్రధాన అనుచరులకు సిట్ నుంచి కాల్స్ను అందుకున్నారు. సిట్ అధికారుల విచారణలో విస్తుపోయే విషయాలు తాండూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఫోన్లతో పాటు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫోన్ ట్యాప్ విచారణకు హాజరుకావాలని పలువురికి కాల్స్ చేసిన సిట్ బృందం -
కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం
దుద్యాల్: కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. మండల పరిధిలోని గౌరారం గ్రామంలో ఓ ఫాంహౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేందర్రెడ్డి వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విసిగిన ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓట్లు వస్తేనే రైతులు గుర్తుకు వస్తారన్నారు. యాసంగి రైతు భరోసాకు లేని నిధులు స్థానిక సంస్థల ఎన్నికల ముందు వానాకాలం పంటలకు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పార్టీ నేతలకే అందిస్తున్నారని ఆరోపించారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు గ్యారంటీ కార్డు చూపి నిలదీయాలన్నారు. కుదురుమల్ల గ్రామానికి చెందిన మడిగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంత మంది పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దుద్యాల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండల అధ్యక్షులు చాంద్ పాషా, యాదగిరి, మహిపాల్, దామోదర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు బొగమోని సురేశ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నరేశ్ గౌడ్, నాయకులు మధుసూదన్ యాదవ్, నారాయణరెడ్డి, బుగ్గప్ప, బాబర్, రమేశ్ బాబు, కేశరెడ్డి, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గులాబీ గూటికి చేరినహస్తం, బీజేపీ శ్రేణులు -
గంజాయి.. జంగ్
వికారాబాద్: జిల్లా కేంద్రంలో గంజాయి లొల్లి దుమారం రేపుతోంది. పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కారులో గంజాయి ప్యాకెట్ లభ్యమైందని పోలీసులు పేర్కొంటున్నారు. పట్టణ కేంద్రంలో రాష్ట్ర పోలీస్ డీజీపీ జితేందర్ విలేకరుల సమావేశంలో డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యమని ప్రకటించిన రోజునే వైద్యుడి కారులో గంజాయి పట్టుబడింది. దీంతో ప్రజలు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తుండగానే కేసు పక్కదారి పట్టింది. మంగళవారం రాత్రి వైద్యుడి కారులో గంజాయి లభించగా.. ఇదే విషయమై డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో పలువురు వైద్యులు బుధవారం ఎస్పీ నారాయణరెడ్డిని కలిశారు. పోలీసులు దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయం ప్రస్తుతం పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. కొందరు పోలీసులను ప్రశంసిస్తుండగా.. వైద్యుల వాదనలు విన్నాక పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వీడియో రికార్డు బయటపెట్టండి ఉదయం ఎస్పీ నారాయణరెడ్డిని కలిసిన వైద్యుల సంఘం సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులే తమ వాహనంలో గంజాయి ప్యాకెట్ పెట్టి తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారన్నారు. ఒక వేళ గంజాయి లభ్యమై ఉంటే వీడియో రికార్డు ఉంటుందని.. అది బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను బయట పెట్టాలని కోరుతున్నారు. లేడీ డాక్టర్పై ఆరోపణలు తాము రాత్రి 8.30గంటల నుంచి వాహనాల తనిఖీ చేపట్టామని 9.30–10గంటల ప్రాంతంలో ఎస్ఐ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే డాక్టర్ కారు రావడంతో డిక్కీలో తనిఖీ చేయగా ఓ బ్లాక్ కవర్లో గంజాయి లభ్యమైందని పోలీసులు పేర్కొంటున్నారు. వైద్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపడేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యురాలే ఈ మొత్తం ఘటనకు కారణమని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉండే ఓ డివిజన్ స్థాయి పోలీస్ అధికారి తన కింది స్థాయి సిబ్బందితో ఈ డ్రామా ఆడించారని ఆరోపిస్తున్నారు. పరిగి ఘటన మాదిరిగానే.. పరిగిలో ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడికి చెందిన కారులో గంజాయి ఉందనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. కాగా మెడికల్ షాప్ నిర్వాహకుడు కావాలనే తన కారులో గంజాయి పెట్టి తనను ఇరికించేందుకు యత్నిస్తున్నాడని మరో యువకుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారించగా.. చివరకు వేరే వ్యక్తి కారులో గంజాయి ఉంచినట్లు సీసీ పుటేజీలో బయటపడింది. కాగా పోలీసులే ప్రమోషన్ కోసం తనతో గంజాయి పెట్టించారని యువకుడు ఆరోపించాడు. దీన్ని పోలీసులు ఖండించారు. ఓ డాక్టర్ కారులో లభ్యమైన ప్యాకెట్ పోలీసులే పెట్టారంటూ వైద్యుల ఆరోపణలు పోలీస్ వర్సెస్ వైద్యులుగామారిన పంచాయితీ ఎస్పీని ఆశ్రయించిన డాక్టర్ల సంఘంవైద్యుడిపై కేసు సాధారణ తనిఖీల్లో భాగంగానే మంగళవారం రాత్రి వికారాబాద్ పట్టణంలో వాహనాల తనిఖీ నిర్వహించాం. ఆ సమయంలో వైద్యుడు ప్రదీప్ తన కారులో ప్రయాణిస్తుండగా ఎస్ఐ వాహనాన్ని తనిఖీ చేశారు. నేను కూడా సమీపంలోనే ఉన్నాను. కారు డిక్కీలో ఓ బ్లాక్ కవర్ ఉండడం గమనించి బయటకు తీసి చూడగా గంజాయి లభించింది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – భీంకుమార్, సీఐ, వికారాబాద్ -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ మండల అధ్యక్షురాలు అనసూయ పరిగి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ సూచించారు. బుధవారం మండల పరిధిలోని గడిసింగాపూర్, రూప్ఖాన్పేట్ గ్రామాల్లో బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్లలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలో భాగంగా ప్రపంచ దేశాలకు సవాలు విసురుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్డు, ఇతర పనులు మొత్తం కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యంతో సింహభాగం కేంద్రానిదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాముయాదవ్, నాయకులు రమేష్, వీరేష్, అశోక్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత శూన్యం!
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025సన్నబియ్యం..8లోuబషీరాబాద్: ప్రభుత్వం ఆహార భద్రత కింద పేదలకు అందజేస్తున్న సన్నబియ్యంలో నాణ్యత కొరవడింది. తెల్లపురుగులు, నూకలు, ఉల్లెడ వస్తున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లాకు నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి, మహబూబ్నగర్ ప్రాంతాల నుంచి 1,600 మెట్రిక్ టన్నులకు పైగా సన్నబియ్యం ఇప్పటికే సరపరా అయ్యాయి. అయితే నిజామాబాద్ నుంచి వచ్చే సన్నబియ్యంలో నాణ్యత లోపించిందని.. వనపర్తి బియ్యం కావాలని డీలర్లు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. 2.64 లక్షల మంది లబ్ధిదారులు ఉగాది పర్వదినం రోజున ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 2.64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతీ నెలా 5,604 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా అందజేస్తోంది. కాగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి ఇవ్వాలనుంచి జూన్ 1వ తేదీ నుంచి సరఫరా షురూ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 1,432 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందజేసింది. నిజామాబాద్ నుంచి వచ్చిన బియ్యాన్ని నిరాకరిస్తున్న డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ బియ్యంలో 25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ నిజమాబాద్ నుంచి వచ్చే సన్నబియ్యంలో 25 శాతం కంటే అధికంగా నూకలు ఉన్నట్లు లబ్ధిదారులు, డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులు ఉల్లెడపట్టిన, పురుగుల బియ్యం ఎలా తినాలి అంటూ డీలర్లతో గొడవకు దిగుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యమే పంపిణీ చేస్తున్నామని.. ఏదైనా ఉంటే అధికారులకు చెప్పుకోవాలని సూచిస్తున్నారు. న్యూస్రీల్రేషన్ బియ్యంలో 25 శాతానికి మించి నూకలు పురుగు, ఉల్లెడ వస్తున్నాయని లబ్ధిదారుల ఆగ్రహం పట్టించుకోని పౌరసరఫరాల శాఖ జిల్లాలో 1,432 మెట్రిక్ టన్నుల రైస్ సరఫరా -
పంద్రాగస్టులోగా పరిష్కారం చూపండి
కొడంగల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు దరఖాస్తులు చేసుకున్న సమస్యలకు పంద్రాగస్టులోగా పరిష్కారం చూపాలని తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని 18 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో 348 మంది రైతులు భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారని.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆగస్టు 15 లోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ఐఐటీ పేరుతో దందా’.. తాండూరు టౌన్: ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాలలో ఐఐటీ, నీట్ కోచింగ్ పేరుతో కొనసాగుతున్న దందాను అడ్డుకోవాలని ప్రజా, విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ సాధారణ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలో ఐఐటీ, నీట్, సీఏ, సీపీటీ బోధిస్తామని సంకల్ప్ ఏసీ అకాడమీ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ కోచింగ్ పేరిట విద్యార్థుల నుంచి రూ.60 నుంచి రూ.70వేలు వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కళాశాలలో కోచింగ్ సెంటర్ నిర్వహించడం సరికాదన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను కోచింగ్ పేరిట మోసగిస్తున్న భాష్యం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేయడంతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి కళాశాల ఎదుట ఆందోళన చేస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, స్వేరో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు. తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ -
ట్రాన్స్ఫార్మర్ను కప్పేసిన చెట్లు
విద్యుత్ను నియంత్రించే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లపొదలు పెరిగి ఆన్ ఆఫ్ చేసేందుకు అవరోధంగా మారింది. వర్షాకాలంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో స్థానికులు కలవరపడుతున్నారు. ఈ దుస్థితి మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో దర్శనమిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. – మోమిన్పేట21న యోగా దినోత్సవం కొడంగల్: ప్రపంచ యోగా దినోత్సవాన్ని శనివారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ నుంచి తనకు బుధవారం ప్రొసీడింగ్స్ వచ్చాయని ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. ఉదయం 6.30 నుంచి 7.45 గంటల వరకు యోగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రాథమిక, ఉన్నత, జిల్లా పరిషత్, కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులతో యోగా చేయించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. నియోజవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నియమాలకు లోబడి ఫీజులు వసూలు చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్, దుస్తులు, నోట్ పుస్తకాలు తదితర సామగ్రిని పాఠశాలలో అమ్మరాదని హెచ్చరించారు. ఎంఈఓ రాంరెడ్డి -
పారిశుద్ధ్యంపై దృష్టిసారించండి
ఇబ్రహీంపట్నం: వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన ప్రజలు పడకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వి.సురేష్మోహన్ సూచించారు. బుధవారం దండుమైలారం గ్రామ పంచాయతీని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. నర్సరీ, డంపింగ్యార్డును, వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో ఈగలు, దోమలు వ్యాప్తిచెంది వ్యాధులు ప్రబలే అవకాశముంటుందన్నారు. క్రమంతప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయించాలని సూచించారు. ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎస్ రఘు, పంచాయతీ కార్యదర్శి పి.శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డీపీఓ సురేష్మోహన్ దండుమైలారంలో పర్యటన -
ఆర్థిక బాధ్యతలు మోయలేం
దోమ: నిధుల లేమి, ఆర్థిక వనరులు లేని పంచాయతీల నిర్వహణ బాధ్యతలను తాము మోయలేమని పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని 36 జీపీలకు సంబంధించిన సెక్రటరీలు.. బుధవారం పంచాయతీ కార్యాలయాలు, ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ గ్యామాకు అందజేశారు. ఆర్థికపరమైన విధు లు చిరుద్యోగులైన తమకు తలకు మించిన భారంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీటినుంచి తప్పుకొంటున్నామని ఎంపీడీఓకు తెలిపారు. విధులు బహిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు జీపీ కార్యాలయాలు, ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓకు అప్పగింత -
నేడు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
దుద్యాల్: విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఎంఈఓ విజయ రామారావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2024–2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన ఉత్తమ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో మొదటి, ద్వితీయ పురస్కారాలు అందిస్తామని చెప్పారు. మండలంలో కుదురుమల్ల, దుద్యాల్, హకీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. పాము, కుక్క కాటుకు మందులు హకీంపేట్ పీహెచ్సీ డాక్టర్ వందన దుద్యాల్: పాము, తేలు, కుక్క కాటుకు హకీంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ వందన తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక పీహెచ్సీలో ప్రభుత్వం అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో రైతులు అధికంగా పొలం పనులకు వెళ్తుంటారన్నారు. చలువతో పాము, తేలు కాటుకు గురవుతుంటారు. అలాంటి బాధితులకి పీహెచ్సీలో చికిత్స అందుతుందని పేర్కొన్నారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత బొంరాస్పేట: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సన్నబియ్యం పక్కదారి పడుతోంది. తప్పుడు లెక్కలతో సన్నబియ్యం పోగు చేసుకొని అక్రమదందాకు ఒడిగడుతున్నారు. బుధవారం తాండూరుకు చెందిన వడ్ల మోహన్ బొలేరో వాహనంలో సన్నబియ్యంతో వెళ్తుండగా స్థానిక పోలీసులు పట్టివేశారు. సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. -
రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు
తాండూరు రూరల్: మండల పరిధి కొత్లాపూర్ శివారులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో మే మొదటి వారం నుంచి జూన్ 13న ఏరువాక పౌర్ణమి వరకు జాతర కొనసాగింది. బుధవారం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నవీన్చందర్రెడ్డి, ఈఓ శేఖర్ మాట్లాడుతూ.. రూ.4.47లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు రాజు, లాలయ్యగౌడ్, లక్ష్మి, లాల్య నాయక్, శాంతప్ప, ఈశ్వరమ్మ, పరిశీలకులు శాంత్కుమార్, సిబ్బంది రవి, గ్రామస్తులు రేణుక తదితరులు పాల్గొన్నారు. పెంచిన బస్పాస్ చార్జీలు తగ్గించాలి తాండూరు టౌన్: పెంచిన స్టూడెంట్ బస్పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ.. ఏబీవీపీ నాయకులు బుధవారం ఆర్టీసీ తాండూరు డిపో మేనేజర్ సంతోశ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తుంటారని.. వారి బస్పాస్ చార్జీలు పెంచడంతో భారమైందన్నారు. పలువురు చదువుకు దూరమవుతున్నారన్నారు. వెంటనే బస్పాస్ చార్జీలు పెంచకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్, జిల్లా కన్వీనర్ హరీశ్రావు, ఆకాశ్, ఆర్యన్, రాకేశ్ తదితరులు హెచ్చరించారు. ప్రభుత్వ కళాశాలలోనే చేరండి ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాధికారి శంకర్నాయక్ దౌల్తాబాద్: పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చేరాలని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాధికారి శంకర్నాయక్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నత శిఖరాలను అధిరోహించారని.. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని రాణించాలని సూచించారు. కళాశాలకు 12 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయని వివరించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇంగ్లిష్, తెలుగు మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్స్వామి, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీహరిరెడ్డి తదితరులున్నారు. నాణ్యమైన విద్యుత్ కోసం బీఆర్ఎస్ ధర్నా ఆమనగల్లు: వ్యవసాయానికి కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు రైతులతో కలిసి గట్టుప్పలపల్లి సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలివీచినా గంటల తరబడి సరఫరా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ వీసీ వీఎల్వీఎస్ఎస్.సుబ్బారావు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషిచేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్ రంగానికి చెందిన కంపెనీలతోపాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యాయరని తెలిపారు. 142 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జె.సుధాకర్, బీఎఫ్ఎస్ఐసీఓఓ సౌమ్యారంజన్, బీఎఫ్ఎస్ఐ ట్రైనర్ శ్రీనాథ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ టి.రాంబాబు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాస్, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ సుబ్బారావు -
అర్హులందరకీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.84 లక్షలతో బాలసదనం భవనం ప్రారంభించి మాట్లాడారు. రూ.25 కోట్లతో సీసీ రోడ్లు పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులుముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు లాల్కృష్ణ, హన్మంతు, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులతో పరిష్కారం
నవాబుపేట: రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని చంచల్పేట గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, మాజీ సర్పంచులు రవీందర్రెడ్డి, ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ ఎక్బాల్, ప్రధానోపాధ్యాయుడు పాండు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య -
లారీకి లోపం.. వాహనదారులకు శాపం
అనంతగిరి: వికారాబాద్ రైల్వే బ్రిడ్జిపై బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ట్రాఫిక్ జాం అయింది. అటుగా వెళ్తున్న ఓ లారీ సాంకేతికలోపంతో ఆగిపోవడంతో ఒక్కసారిగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. కాగా అరగంటకు పైగానే వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం పూడూరు: భారీ వర్షానికి మండలంలోని వికారాబాద్–మన్నెగూడ దారిలో హిట్స్ కాలేజీ సమీపంలో బుధవారం ఓ వృక్షం నెలకొరిగింది. చెట్టు పడిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుపై భారీ చెట్టు పడటంతో గంటకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నాణ్యత లేకుంటే సహించం టేకులగడ్డతండా పాఠశాలకు జిల్లా సివిల్ సప్లై అధికారులు బొంరాస్పేట: నాసిరకం భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ‘సర్కారు బడికి.. నాణ్యత లేని సన్నబియ్యం’ అనే శీర్షికక ప్రచురించిన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని టేకులగడ్డతండా ప్రాథమిక పాఠశాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్కృష్ణ, డీఎం మోహన్బాబు, డీసీడీఎం గణపతి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయిన సన్నబియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యంలో పురుగులు కనిపించి అవాక్కయ్యారు. స్థానిక ఎంఈఓ హరిలాల్, హెచ్ఎం గోపాల్ను కారణాలు అడిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం నాణ్యత లేకుంటే సహించేది లేదంటూ హెచ్చరించారు. పాత స్టాక్ కింద మిగిలి ఉన్న సన్నబియ్యాన్ని తిరిగి పంపించాలని సివిల్ సప్లై అధికారులు ఎంఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జూనియర్ అసిస్టింట్ శ్రీనివాస్గౌడ్, సీఆర్పీ సోమ్లా, హెచ్ఎం గోపాల్ ఉన్నారు. మేకల దొంగలకు రిమాండ్ పూడూరు: మేకల దొంగలను రిమాండ్కు తరలించిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోతిరెడ్డిగూడలో వారం క్రితం మేకలు అపహరణకు గురవడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టి విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ఏకేందర్సింగ్, మహమ్మద్ వాజీద్, షేక్సోహెల్ ముగ్గురు కలిసి కారును అద్దెకు తీసుకుని నగరం చుట్టుపక్కల సంగారెడ్డి, షాద్నగర్, ఆదిబట్ల, చెన్గోముల్ ప్రాంతాల్లో తిరుగుతూ మేకలను కారులో ఎత్తుకెళ్లేవారని తెలిపారు. వాటిని జియాగూడలో విక్రయించి జల్సా చేసేవారు. ఈ క్రమంలో బుధవారం దొంగతనం చేసేందుకు వస్తుండగా మన్నెగూడ చౌరస్తాలో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా కారులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. నాలుగు మేకలు, రూ.42వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రుణానికి ఎదురుచూపులు!
దౌల్తాబాద్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువవికాసం పథకం అమలు జాప్యమవుతుంది. యువతకు స్వయం ఉపాధి మార్గంలో నడిపించే సదాశయంతో యువవికాసం పథకాన్ని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించాలని హడావుడి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అర్హుల ఎంపిక పూర్తి చేశారు. జూన్ 2న మంజూరు పత్రాలు అందిస్తామని ప్రకటించిన అధికారులు ప్రభుత్వ నిర్ణయంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు మంజూరు పత్రాలు అందిస్తారో ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. సబ్సిడీ ఇలా పథకంలో రూ.50 వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 80శాతం సబ్సిడీ, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీ, ప్రభుత్వం అందించనుంది. ఈ నాలుగు కేటగిరీల్లో రూ.50వేలు, రూ.లక్ష యూనిట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ చాలా మంది రూ.2 నుంచి రూ.4లక్షల యూనిట్లు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రూ.50 వేలకు స్థిరమైన ఉపాధి కల్పన సాధ్యం కాదని నిరుద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. సిబిల్కే బ్యాంకర్ల ప్రాధాన్యం యువ వికాసం దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పరిశీలించారు. తొలుత మండల కమిటీల ఆమోదం తర్వాత జిల్లా కమిటీలకు జాబితా చేరింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఈ పథకం మంజూరు చేస్తారు. గతంలో ఏదైనా కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారా..? బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్నారా? అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అయితే ప్రభుత్వం సిబిల్ స్కోర్ పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించింది. మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల కింద 1,900 దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎవరికి అందుతాయోనని దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అమలులో తీవ్ర జాప్యం దరఖాస్తులు, విచారణ పూర్తయినా ముందుకు సాగని వైనం నిరాశ చెందుతున్న నిరుద్యోగులు ఆదేశాలు రావాలి మండలంలో యువవికాసం కింద 1,900 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో ఉన్నతాధికారుల సూచనల మేరకు అర్హుల ఎంపిక కూడా జరిగింది. ఈ పథకం అమలు నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
సొసైటీ సేవలు అభినందనీయం
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తాండూరు టౌన్/తాండూరు రూరల్: యువతీ యువకుల కోసం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ సేవలు అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ కొనియాడారు. బుధవారం ఆయన సొసైటీ ఆధ్వర్యంలో యువతులకు కొనసాగుతున్న కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, విద్యార్థులకు ఎప్సెట్, టెట్, డీఎస్సీ కోచింగ్, మెహందీ, కుట్టు మిషన్ శిక్షణ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు కమాల్ అతర్, ఉపాధ్యక్షుడు బాసిత్ అలీ, కార్యదర్శి మహ్మద్ యూనిస్, కోశాధికారి సిరాజ్, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, ఖయ్యూమ్ అతర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేక.. ఆగిన రోడ్డు
దౌల్తాబాద్: అసంపూర్తి రోడ్డుతో మండలవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దౌల్తాబాద్ నుంచి రావల్పల్లి వెళ్లే దారిలో, కౌడీడ్ నుంచి దౌల్తాబాద్ వెళ్లే మార్గంలో అటవీశాఖ అనుమతులు లేక రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దౌల్తాబాద్ నుంచి రావల్పల్లికి నాలుగు వరుసల రహదారి మంజూరైంది. రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, అటవీ ప్రాంతం ఉన్న కిలోమీటర్ మేర అనుమతులు లేక నిలిచిపోయాయి. అలాగే బాలంపేట– అల్లాపూర్, గుండేపల్లి– అల్లాపూర్ మీదుగా గుముడాల వరకు ఉన్న అటవీ ప్రాంతంతో కూడా అనుమతులు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో అటవీశాఖ అధికారులతో మాట్లాడి అనుమతులు ఇప్పించి, రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
తాండూరు రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై మండల పరిధిలోని చెన్గేస్పూర్ గ్రామంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విచారణ చేపట్టారు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఎరుకల శారద బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేశ్గౌడ్, నరేందర్గౌడ్, నానిగౌడ్, నరేష్గౌడ్, పవన్గౌడ్ కులంపేరుతో దూషించి దాడి చేశారని కరన్కోట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. డీఎస్పీ సంఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆయన వెంట కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి ఉన్నారు. -
మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం
● తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ● మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాతో కలిసి కుట్టు మిషన్ల పంపిణీ తాండూరు: మహిళ లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకా లు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మైనార్టీ కార్పొ రేషన్ చైర్మన్ ఒబేదుల్లా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్ మహరాజ్తో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు రుణాలు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాలతో ఆర్థికంగా మేలు చేకూరుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి నాయకులు తదితరులున్నారు. ఉచితంగా కంది విత్తనాలు రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయనఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గంలోని రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీచేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంది పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం నాణ్యమైన కంది విత్తనాలను ఉచితంగా అందిస్తోందన్నారు. రైతులు గ్రామాలలోని రైతు వేదికల వద్దకు వెళ్లి విత్తనాలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీసభ్యులు ధారాసింగ్, శ్రీనివాస్రెడ్డి, నాయకులు, రైతులు తదితరులున్నారు. మహిళలను మహారాణులను చేస్తాం బషీరాబాద్: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి బాధ్యత అప్పగించాలమని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వ్యాపారులుగా తయారు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ అల్పసంఖ్యాక మహిళ శక్తి –రేవంత్ అన్నాకా భరోసా పథకం ద్వారా 18 మంది ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ కరుణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ల జిల్లా అధికారులు బాబుమోజెస్, రాజేశ్వరి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శాంతిభాయి. నాయకులు శంకరప్ప, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్రావు, సురేష్, మాణిక్రావు, సతీష్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అనంతగిరి: ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లో పార్టీ ఆధ్వర్యంలో పేదరికం లేని దేశంగా అభివృద్ధి చెందాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నేడు యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో సంఘటన సంరచనా ప్రభారీ పడాకుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, పార్టీ పట్టణ అద్యక్షురాలు యాస్కి శిరీష, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
● గడిచిన ఏడాదిలో 30వేల కిలోల గంజాయి సీజ్ చేశాం ● రాష్ట్రంలో గంజాయిలేదు.. పక్క రాష్ట్రాల నుంచి సరఫరా అవుతోంది ● సైబర్ నేరాల అదుపులో మనమే ముందున్నాం ● రూ.185 కోట్లు రికవరీ చేశాం ● డీజీపీ జితేందర్ వెల్లడి వికారాబాద్: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం.. అని డీజీపీ జితేందర్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రమాదాల నివారణ, ఇసుక అక్రమ రవాణా, మతపరమైన ఘర్షణలు, నివారణ చర్యలు తదితర వాటిపై సమీక్ష చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఏడాది కాలంలో 30వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి లేదని.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా సరఫరా అవుతోందన్నారు. దీన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. సైబర్ నేరాల అదుపులో దేశంలోనే రాష్ట్రం ముందుందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ధ్రవీకరించిందన్నారు. దీంతో మన పోలీసులపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి రెండు వందల మందికిపైగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో సైబర్ మోసాల ద్వారా కోల్పోయిన రూ.185 కోట్లు రాబట్టామని, ఈ సొమ్మును బాధితులకు తిరిగి అప్పగించామన్నారు. సైబర్ నేరాల అదుపులో మన పోలీసులు దేశానికే రోల్ మోడల్గా నిలిచారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డయల్ 100 ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల ఓ సింగర్ తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇసుక మాఫియా, జూదం, మట్కా, పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అట్రాసిటీ కేసుల విషయంలో పకడ్బందీగా దర్యా ప్తు చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఐజీ సత్యనారాయణ, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీ హన్మంతరావ్, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఏఆర్ డీఎస్పీ, వీరేశ్, సీఐలు పాల్గొన్నారు. డీజీపీని కలిసిన కలెక్టర్ అనంతగిరి: వికారాబాద్ పర్యటనకు వచ్చిన డీజీపీ డాక్టర్ జితేందర్ను కలెక్టర్ ప్రతీక్జైన్ స్వాగతం పలికారు. ఆయన వెంట ఎస్పీ నారాయణరెడ్డి ఉన్నారు. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
యాలాల: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పగిడియాల ఉన్నత పాఠశాల జీహెచ్ఎం క్రిష్ణయ్య అన్నారు. మంగళవారం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిట్ల శ్రీనివాస్ తన కుమారుడు పిట్ల ప్రణయ్కుమార్ను ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎం మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పిట్ల శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పల్లె రవి తదితరులు పాల్గొన్నారు. -
సదరం సర్టిఫికెట్లు అందజేయండి
అనంతగిరి: సదరం క్యాంపుల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని, ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సదరం/యూడీఐడీ శిబిరాల నిర్వహణపై డీఆర్డిఓ, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు సదరం, యూడీఐడీ శిబిరాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజే యాలన్నారు. 689 మంది పరీక్షలు పూర్తి చేసుకొని పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అందజేయాలని సూచించారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకర ణ పత్రాలను అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, కొడంగల్, వికారాబాద్ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు పద్మ, మ ల్లికార్జున్, డీపీఎం నర్సింలు, ఏపీఎం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ -
విద్యార్థులకు ఉచిత బస్పాస్లు ఇవ్వాలి
ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ తాండూరు టౌన్: విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా బస్పాస్లు ఇవ్వాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు తాండూరు ఆర్టీసీ డిపో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థుల బస్పాస్ చార్జీలను 20 శాతం మేర పెంచడం సమంజసం కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సమీపంలోని పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులపై బస్పాస్ చార్జీల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీధర్, నాయకులు ప్రకాష్, రాజు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కొడంగల్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాంరెడ్డి మంగళవారం సూచించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలలకు మూడు అంచెల్లో ఎంపిక విధానం ఉంటుందన్నారు. జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి ఎంపిక, జూన్ 23 నుంచి 26వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ఎంపిక, జులై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక ఉంటుందన్నారు. మూడు పాఠశాలల్లో బాలికలకు 60 సీట్లు, బాలురకు 60 సీట్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఉచితంగా పుస్తకాలు, దుస్తులు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తాం హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్ తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే త్వరగా బిల్లులు అందజేస్తామని హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్ అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు నిర్మించుకునే వారికి నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు. పునాది పనులు పూర్తి కాగానే మొదటి బిల్లు రూ.లక్ష, గోడలు కట్టిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష అందజేస్తామని తెలిపారు. అధికారులు సూచించిన ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రహీం, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
● రైతు వేదికల్లో ఏఈఓలు అందుబాటులో ఉండాలి ● జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి మోమిన్పేట: విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించమని, వ్యవసాయాధికారులు తప్పని సరిగా సమయపాలన పాటించాలని డీఏఓ మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో ఏఈఓలు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటల సాగుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఇక్క డికి వస్తుంటారని, అధికారులు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అప్పటికే చాలా మంది అన్నదాతలు రైతు భరోసా కోసం దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చారు. కొంత మంది ఏఈఓలకు ఫోన్ చేసినా వారు అందుబాటులోకి రాలేదు. అరగంట తర్వాత ఒక్కొక్కరుగా రైతు వేదిక వద్దకు వచ్చారు. ఏఈఓలు ఆలస్యంగా రావడంపై డీఏఓ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆలస్యంగా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రైతు వేదికలో ఉండాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారని అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ జయశంకర్ తదితరులు ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికే సదస్సులు
దుద్యాల్: భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని హకీంపేట్లో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. రెవెన్యూ సదస్సులకు మంచిస్పందన వస్తోందని పేర్కొన్నారు. హకీంపేట్ నుంచి తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. మండల వ్యాప్తంగా 310 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో డీటీ వీరేశ్ బాబు, సిబ్బంది పక్కిరప్ప, ఊషప్పతదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోనిరాకమకొండ వేంకటేశ్వర స్వామిని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త రాకం యాదయ్య ఆయన్ను సన్మానించారు. సద్వినియోగం చేసుకోవాలి పరిగి: గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు.మంగళవారం మండలంలోని గోవిందపూర్లో నిర్వహించిన సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనందర్రావు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు -
పుస్తకాల దందాను అడ్డుకోండి
తాండూరు టౌన్: నిబంధనలకు విరుద్ధంగా పుస్తకా లు విక్రయిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలపై చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరలను నిర్ణయించడంతో పాటు, నేరుగా వారే విక్రయిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల పుస్తకాల విక్రయ దందాను అడ్డుకో వాలని డిమాండ్ చేశారు. ఎంఈఓను కోరిన బీసీ జేఏసీ నాయకులు -
సర్కార్ బడికి.. నాణ్యత లేని సన్న బియ్యం
బొంరాస్పేట: రాష్ట్రమంతా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం సర్కార్ బడులకు మాత్రం నాణ్యతలేని బియ్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చేది అతిసారకాలం.. ఆహారత పదార్థులు, పాత్రలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణంంలో నాసిరకం బియ్యం సరఫరా అవుతోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు. భోజనం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అల్పాహారానికి ట్రస్టు సహకారం హరేరామ హరేకృష్ణ చారిటబుల్ ట్రస్టు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నిత్యం ఉచితంగా అల్పాహారం సరఫరా చేస్తున్నారు. గతేడాది నుంచి ఇడ్లీ, బోండా, వడ, ఉప్మా, పొంగలి, పులిహోర అందజేస్తున్నారు. ఆకస్మిక తనిఖీ మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఎంఈఓ, ఎంపీడీఓ, తహసీల్దారు, ఏఓ తదితరులు ఉంటున్నారు. పాఠశాల స్థాయిలో హెచ్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఏఏపీసీ చైర్మన్, అంగన్వాడీ కార్యకర్తలతో కూడిన కమిటీలున్నాయి. వారి పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని టేకులగడ్డతండా పాఠశాలలో గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ పర్యవేక్షించారు. బియ్యం పరిశీలించిన వెంటనే ఆయన ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వంటపాత్రలు, గదుల శుభ్రతను తెలియజేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చర్యలు తీసుకుంటాం నాణ్యత లేని బియ్యం నిల్వపై హెచ్ఎంల నుంచి వివరాలు తీసుకున్నాం. పౌష్టిక ఆహారం, పరిశుభ్రతపై ఇటీవల పాఠశాల ఏజెన్సీ మహిళలకు, హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చాం. కమిటీల పర్యవేక్షణకు ఆదేశిస్తాం. ఫుడ్పాయిజన్ సంఘటనలు ఎక్కడున్నా అందరిపై చర్యలు తీసుకుంటాం. –హరిలాల్, ఎంఈఓ, బొంరాస్పేట పురుగులు వస్తున్నాయి పాఠశాలలో 2018 నుంచి మధ్యాహ్న పథకంలో ఏజెన్సీ మహిళగా పనిచేస్తున్నాను. సన్నబియ్యం సరఫరాతో నాణ్యత ఉంటుందని ఊహించుకుంటే పురుగుల బియ్యం వస్తున్నాయి. నాణ్యమైన సన్నబియ్యాన్ని సరఫరా చేయాలి. – సోమ్లీబాయి, ఏజెన్సీ మహిళ, దరికిందితండా ఉమ్మడి మండలంలో సన్నబియ్యం సరఫరా ఇలా టేకులగడ్డ తండాలో మధ్యాహ్న భోజన పరిశీలన నాణ్యతాలోపంపై ఎంఈఓకు వివరించిన గ్రామ పరిపాలన అధికారి -
దైవ దర్శనానికి లిఫ్ట్ అడిగి అనంతలోకాలకు
కొడంగల్: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బయలుదేరిన ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి కొడంగల్ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్కు చెందిన శివకుమార్ చారి(26) కోస్గి బయలుదేరాడు. అక్కడి తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిగి వరకు బస్సులో వచ్చిన శివకుమార్ అక్కడ నుంచి కొడంగల్కు రాత్రి వేళ బస్సులు లేకపోవడంతో ఓ కారును లిఫ్ట్ అడిగి బయలుదేరాడు. కొడంగల్ శివారుకు చేరుకోగానే కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ముందు భాగంలో కూర్చున్న శివకుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారును నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుక సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక మాఫియాను కట్టడి చేయండి
బీజేపీ నాయకుల వినతి తాండూరు టౌన్: కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బీజేపీ నాయకులు తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ను కోరారు. ఈ మేరకు వారు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతి లేకుండా కాగ్నా నది నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని చెప్పారు. అడ్డుకున్నవారిపై ఇసుక మాఫియా సభ్యులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. సహజసంపదను అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి భద్రేశ్వర్, పట్టణాధ్యక్షుడు మల్లేశంమాజీ కౌన్సిలర్ లలిత, కృష్ణ, రాజు, సంగమేశ్వర్, ప్రకాశ్, కిరణ్, సతీశ్, బాబు తదితరులు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందుల కారణంగా..
వ్యక్తి అదృశ్యం కేశంపేట: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజ్కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన మామిడి శివ అలియాస్ సిటీ కేబుల్ శివ(32) ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సెలఫోన్ లొకేషన్ ఆధారంగా వరంగల్లో ఉన్నట్లు తెలుసుకున్న కుటంబ సభ్యులు అక్కడికి వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. శివ ఆత్యహత్య చేసుకుంటున్నాంటూ పెట్టిన సెల్ఫీ వీడియో చూస్తూ కుటుంబీకులు, మిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శివ తల్లి అనుసూయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పు చేస్తే క్షమించండి ‘హలో.. హయ్.. ఇన్ని రోజులు నాకు సహకరించిన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులు, స్కూల్, ఇంటర్ ఫ్రెండ్స్, అమ్మనాన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు. అభివృద్ధిలో ఆర్ధికంగా అన్ని రకాలుగా సహకరించిన ప్రతాపన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్స్ మీఅందరిని వదిలేసి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది. తెలిసీతెలియక మీతో అమర్యాదగా మాట్లాడి ఉంటే, తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి’అంటూ స్పెల్పీ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూస్తూ మిత్రులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతం అయ్యారు. -
కల్యాణ మండపంలో షార్ట్ సర్క్యూట్
రూ.15 లక్షల ఆస్తి నష్టం తాండూరు టౌన్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కల్యాణ మండలంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఫైర్ సేఫ్టీ అధికారి జలంధర్రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో ఉదయం ఒక్కసారి గా మంటలు చెలరేగినట్టు సమాచారం అందడంతో సిబ్బంది కలిసి ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాం. ప్రమాద కారణంగా ఫర్నిచర్తో పాటు పలు వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఘటనా సమయంలో హాల్ లో ఎటువంటి కార్యక్రమం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు వీరశైవ సమాజ సభ్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎన్నికల హామీలు అమలు చేయండి కిసాన్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్కుమార్ పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కిసాన్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్కుమార్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. రుణమాఫీ పూర్తిగా కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రైతు భరోసా కాలయాపన చేయొద్దని విన్నవించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న రైతు భరోసాను రైతుల ఖాతాల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి దౌల్తాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తిర్మలాపూర్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవిగౌడ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నబాయి జైపాల్(32) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల కిత్రం స్వగ్రామానికి వచ్చిన జైపాల్ ఆదివారం గ్రామంలోని జానకి చెరువులో చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం చెరువుగట్టుపై బట్టలు చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చెరువులోని ఓ గుంటలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు సంతానం. ఫోన్ ట్యాపింగ్తో టార్గెట్ చేశారు ● వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి షాద్నగర్రూరల్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన ఫోన్ ట్యాపింగ్చేసి, టార్గెట్ చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్తో తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడించాలనే ఆలోచనతో తాను మాట్లాడిన మాటలను ట్యాపింగ్ చేశారని, తనతో మాట్లాడిన నాయకులు, కార్యకర్తల సంభాషణలను బహిర్గతం చేసి ఏం సాధించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్థానిక నాయకుల పాత్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాదని ముందుగానే ప్రచారం చేశారంటే ఫోన్ ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. చివరికి తన భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడిన మాటాలను కూడా ట్యాపింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు మోహన్సింగ్, లష్కర్నాయక్, మహేందర్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, బాల్రెడ్డి, అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటుదాం.. భవిష్యత్ను కాపాడుదాం
కుల్కచర్ల: మొక్కలు నాటి భవిష్యత్ను కాపాడుకుందానమి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సౌమ్యారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చెల్లాపూర్లో బీజేపీ 11 వసంతాల పాలన విజయవంతంగా కొనసాగుతున్నందున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతికి మొక్కలు ఎలా జీవనాధారమో సనాతన ధర్మాన్ని కాపాడడం, శత్రుదేశాల నుంచి దేశాన్ని రక్షించుకోవడం బీజేపీ పాలనలోనే సాధ్యమన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధిస్తుందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు మరింత శ్రమించి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రామకృష్ణ, వెంకటేశ్, మహేశ్, రాంచంద్రయ్య, పి.అంజి, చెన్నయ్య, కృష్ణయ్య, సి.వెంకటయ్య, సి.అంజిలయ్య, బాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి -
నిరుత్సాహం వద్దు!
బొంరాస్పేట: నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం, అనుబంధ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఉచిత నైపుణ్య శిక్షణతో నేరుగా ఉద్యోగం పొందేలా తర్ఫీదునివ్వనున్నారు. వారి ఆసక్తికి అనుగుణంగా వారు కోరుకునే విధంగా నైపుణ్యం పెంపొందించుకుని ఎదగవచ్చు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఇదొక సువర్ణావకాశమని కొడంగల్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన వివరించారు. యంగ్ ఇండియా సహకారంతో.. హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లో యంగ్ ఇండియా సహకారంతో నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. కొడంగల్ ప్రాంతంతో ఇంటర్ ఆపై చదివుకున్న నిరుద్యోగులకు ఈ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ఇలా.. స్కిల్ యూనివర్సిటీ(నైపుణ్యాల విశ్వవిద్యాలయం)ద్వారా శిక్షణలుంటాయి. బీఎఫ్ఎస్ఐ తదితర రంగాల్లో వారం పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. లాజిస్టిక్స్ శిక్షణ, ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నారు. అమేజాన్, స్విగ్గీ తదితర కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు. రేపు జాబ్మేళా ఈ నైపుణ్యాల శిక్షణపై పట్టణ సమీపంలోని బండల ఎల్లమ్మ ఆలయం వద్దనున్న ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఈనెల 18న బుధవారం నిర్వహించనున్న జాబ్మేళాలో ఉచిత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియెట్ పూర్తిచేసినవారు, డిగ్రీ రెండో సంవత్సరం లేదా డిగ్రీ పూర్తయిన వారు అర్హులంటున్నారు. నైపుణ్య శిక్షణతో ఉద్యోగం సొంతం 24 ఏళ్ల లోపు యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ రేపు కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సీఎం నియోజకవర్గంలో సరికొత్త శిక్షణ యువతకు సదావకాశం నైపుణ్యాల శిక్షణ యువత కు సదవకాశం. పేద, మఽ ద్య తరగతి యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ నైపుణ్య శిక్షణపై యంగ్ ఇండియా వీసీ, హైదరాబాద్ ప్రొఫెసర్లు అవగాహన కల్పించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మెమోలను డిగ్రీకశాళాలలోని డాక్టర్ మనోహర్ హాలులో అందజేయాలి. – డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొడంగల్ -
పనులను వేగిరం చేయండి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్ను అదనపు గదులను పరిశీలించి పనులను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫాం, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ప్రిన్సిపాల్ శ్రీలత, నాయకులు వెంకట్రెరెడ్డి, ప్రభాకర్, ఎక్బాల్, రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు వినియోగించుకోండి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్త్ను రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తహసీల్దార్ బుచ్చయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత పాల్గొన్నారు. -
కమ్మేసిన పొగమంచు
ధారూరు: మండల కేంద్రంలో సోమవారం పొగమంచు ప్రజల్ని, ప్రయాణికులను ఇబ్బందుల పాలుచేసింది. పొలాలను సైతంపొగమంచు ఆవరించింది. రోడ్లను కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. విద్యార్థులకు వేడి భోజనం అందించాలి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బలక్ష్మి మోమిన్పేట: విద్యార్థులకు నిత్యం వేడి భోజ నం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశించారు. సో మవారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నిత్యం వేడిగా రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. హాస్టల్ పరిసరాలు, గదులు, కిచెన్ షెడ్డును శుభ్రంగా ఉంచుకో వా లని సూచించారు. పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులను కనిపెట్టుకొని ఉండాలని, రోజూ పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ శుక్ర వర్ధన్రెడ్డి, హెచ్ఓ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం స్పెషల్ ఆఫీసర్ పల్లవిరెడ్డి బంట్వారం: కోట్పల్లి కేజీబీవీ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ పల్లవీరెడ్డి సోమవారం తెలిపారు. ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఎంపీహెచ్డబ్ల్యూ 1,ఎంఎల్టీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వికారాబాద్ జిల్లా నివాసులై ఉండాలన్నారు. మెరిట్, డెమో, ఆయా విభాగాల్లో సంవత్సరం పాటు బోధన చేసిన అనుభవం ఉండాలన్నా రు. తాత్కాలిక పద్ధతిని నియమించడం జరు గుతుందన్నారు.ఆసక్తి గల మహిళా అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్ ఫొ టోలు, ఇతర ధ్రువ పత్రాలతో ఈ నెల 18వ తేదీలోపు కోట్పల్లి కేజీబీవీలో సమర్పించాలన్నారు. మిగతా వివరాలకు సెల్ నంబర్ 8328 415565ను సంప్రదించాలని సూచించారు. 19న ప్రవేశ పరీక్ష కుల్కచర్ల: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎంఈఓ హబీబ్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2025 –26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం కుల్కచర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎగ్జామ్ రాయాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా పీఈటీ ప్రవీణ్ సెల్ నంబర్ 9948640187లో సంప్రదించాలని సూచించారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు అనంతగిరి: వికారాబాద్లో సోమవారం న్యా యవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈనెల 14న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంబంధించిన న్యాయవాదులు నారాయణ, శైలేష్ సక్సేనాలపై దాడి ఘటనను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూలి బస్వరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మాధవరెడ్డి, ఆనంద్, శంకరయ్య, కమాల్రెడ్డి, గోపాల్రెడ్డి, లవకుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే దరఖాస్తు..!
బొంరాస్పేట: మండలంలోని దుప్చర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల కోసం రెవెన్యూ అధికారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సాయంత్రం కార్యక్రమం ముగిసే సమయంలో ఒకే దరఖాస్తు వచ్చింది. రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించకపోవడమా? భూ సమస్యలే లేవా? భూభారతి చట్టంపై అపనమ్మకమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం మండలంలోని సాలిండాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ అనంతగిరి: వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్ కార్యక్రమాన్ని రైతులు, అధికారులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తాండూరు రూరల్: మండల పరిధిలోని చెన్గేస్పూర్లో ఎరుకల కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం గౌతపూర్ సమీపంలోని కరన్కోట్ పోలీస్స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెన్గేస్పూర్లో నివాసముంటున్న శారద బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేష్గౌడ్, నరేందర్ గౌడ్, నానిగౌడ్, నరేష్గౌడ్, పవన్గౌడ్ దాడి చేశారన్నారు. దాడిచేసిన వారిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బెల్కటూర్లో దళిత యువకుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే చెన్గేస్పూర్లో ఎరుకల కుటుంబంపై దాడి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో దళితులు, ఎస్టీలపై దాడులు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణ, చంద్రప్ప, సాయిలు, శారద, బస్వరాజ్, లక్ష్మి, కిష్టప్ప తదితరులు ఉన్నారు. మంత్రి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే బీఎంఆర్ తాండూరు: మంత్రి వాకిటి శ్రీహరిని సోమవారం నగరంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వాకిటి శ్రీహరి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీతోనే తండాల అభివృద్ధి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్నాయక్ కడ్తాల్: బీజేపీతోనే గిరిజన తండాల అభివృద్ధి సాధ్యమని గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్నాయక్, నాగర్కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లే పూర్తయిన సందర్భంగా సోమవారం మండల పరిధిలోని మైసిగండిలో పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్ దోనాదుల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. -
50శాతం రిజర్వేషన్లు కల్పించాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ బంట్వారం: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం బంట్వారంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో బీసీలకు రాజకీయంగా కనీస ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణంకాల ప్రకారం చట్ట సభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాట లేదన్నారు. దేశ జనాభాలో 56 శాతంబీసీలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ కనినిస్తుందని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రధానిని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యంగ బద్దమైన హక్కులు కల్పించాలన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లపై త్వరలోనే వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఆయన పేర్కొన్నారు. -
స్టయిఫండ్ చెల్లించాలంటూ ధర్నా
● విధులు బహిష్కరించి నిరసన తెలిపినహౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థులు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహావీర్ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థులు స్టయిఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా కళాశాల యాజమాన్యం స్టయిఫండ్ చెల్లించడం లేదని పేర్కొన్నారు. జీవో నంబర్ 59, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్లకు నెలకు రూ.25,906, పీజీ విద్యార్థులకు రూ.58.289 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ కళాశాల యాజమాన్యం నాలుగు నెలలుగా ఈ మొత్తం ఇవ్వడం లేదన్నారు. వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కొడంగల్: మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్పల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎంఈఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జీఓ నంబర్ 46 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన పేద బలహీన వర్గాలకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు పెంచుతూ పాఠ్య పుస్తకాలు, అడ్మిషన్ ఫీజులు అంటూ వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, సికిందర్, భాను తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్తు.. కసరత్తు
● పార్టీ గుర్తుపై ఎలక్షన్కు వెళ్లేందుకే ప్రభుత్వం మొగ్గు ● జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు వికారాబాద్: మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో అన్నింటికంటే ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం జీపీలకు బదులుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో పార్టీ గుర్తుతో నిర్వహించే ఎన్నికలకే వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 సెన్సెస్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉండాలనే దానిపై అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలు, మండలాల నుంచి మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలను పరిగణలోకి తీసుకొనిమండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను నిర్ణయించారు. కొత్త గా ఏర్పాటు చేసిన మండలాల్లో సెతం ఎంత మంది ఎంపీటీసీలు ఉండలానే విషయంలోనూ కసరత్తు పూర్తి చేశారు. ఈ లెక్కలు ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్కు అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ‘ప్రత్యేక’ పాలన గ్రామ పంచాయతీల పదవీ కాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే జీపీ ఎన్నికలు సైతం పూర్తి కావాల్సి ఉండగా ప్రభుత్వం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. జిల్లాలో మొత్తం 221 మంది ఎంపీటీసీలు ఉండగా వారి పదవీ కాలం గతేడాది జూలైలోనే ముగిసింది. ఇక జెడ్పీటీసీలు 18 మంది ఉండగా వారి పదవీ కాలం కూడా అదే నెలలో ఒక్కరోజు తేడాతో ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీ కాలం సైతం ముగిసిన విషయం తెలిసిందే. జీపీలు, మండల, జిల్లా పరిషత్లతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేకాధికారులు కొనసాగుతున్నారు. గతంలో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశాంచింది. ఓటరు జాబితాసిద్ధ చేయాలని, బీసీ కమిషన్ నివేదికతో రెడీగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. దాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. దీంతో అందరి దృష్టి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై పడింది. ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు పెరిగిన స్థానాలుజిల్లాలో 2019 మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మండల పరిషత్, ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల 18 మండల పరిషత్లకు ఎన్నికలు నిర్వహించగా కొత్త గా ఏర్పాటైన చౌడాపూర్, దుద్యాల్ మండలకు ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మండల పరిషత్ల సంఖ్య 20కి చేరింది. గతంలో 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం వీటి సంఖ్య ఆరు పెరిగి 227కు చేరింది. మన జిల్లా పరిధిలోని బొంరాస్పేట్, నారాయణపేట్ జిల్లా పరిధిలోని కోస్గి మండలం నుంచి కొన్ని గ్రామాలను తీసుకుని కొత్త మండలంగా దుద్యాల్ను ఏర్పాటు చేశారు. కుల్కచర్ల మండలానికి చెందిన కొన్ని గ్రామాలు గతంలో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో కలిసిన మరి కొన్ని గ్రామాలతో చౌడాపూర్ మండలాన్ని ఏర్పాటు చేశారు. పరిగి మండలం నుంచి కొన్ని గ్రామాలు పరిగి మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ నవాబుపేట, కోస్గి మండలాల నుంచి కొన్ని గ్రామాలు మన జిల్లాలో కలవడంతో ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. వీటన్నింటికీ ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రభుత్వ బడులను ఆదరిద్దాం
● కలెక్టర్ ప్రతీక్జైన్ ● వికారాబాద్లో బడిబాట కార్యక్రమం అనంతగిరి: తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయు లు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలను జ్యోతి ప్రజల్వ న చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువు చెప్పే ఉపా ధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల ని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్య క్రమం ద్వారా విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు దోహదం చేస్తుందని వివరించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలు తారబాయిని గుర్తు చేసుకున్నారు. ఆమె చదువు చెప్పడంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొ న్నా రు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూ చించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫా మ్స్, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన టీఎల్ఎం స్టాల్స్ను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి బాబుసింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం, ఎస్ఎంసీ చైర్మన్ విజయలక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పథకాలు ప్రజలకు అందేలా చూడాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బడిబాట కార్యక్రమం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మండల అధికారులకు సూచించారు. రేషన్ దుకాణాల్లో మూడు నెలల సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ సమస్యల పరిష్కా రం కోసం 84 దరఖాస్తులు వచ్చాయని తెలిపా రు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు
దోమ: ౖరెతునేస్తం కార్యక్రమంతో కర్షకులకు మేలు చేకూరుతుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నాడు. సోమవారం ఆయన మండల పరిధిలోని శివారెడ్డిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దిగుబడులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఏడీఏ సౌభాగ్యలక్ష్మి కుమారి, ఎంపీడీఓ గ్యామా, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు, తదితరులు పాల్గొన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతు భరోసా తాండూరు రూరల్: భూమి ఉన్న ప్రతి రైతుకూ ప్రభుత్వం రైతు భరోస నిధులు విడుదల చేస్తుందని తాండూరు సబ్కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం మండలంలోని అంతారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి నిబంధనలు లేకుండా పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, ఏడీఏ రుద్రమూర్తి, తహసీల్దార్ తారాసింగ్, ఏవో కొమరయ్య, ఏఈవో తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: వ్యవసాయం పండుగ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నాడని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని కుస్మసముద్రం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాగులో ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రతీ మంగళవారం శాస్త్రవేత్తలో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో నివృత్తి చేసుకోవచ్చునన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుస్మసముద్రం, కుల్కచర్ల, చౌడాపూర్ గ్రామాల్లోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయాధికారి వీరస్వామి, ఏఈఓలు బాబు, నిఖిత, కార్యదర్శి జీవామృతం, నాయకులు రాములు, లక్ష్మయ్య, భీమయ్య, కృష్ణయ్య, అంజిలయ్య, కృష్ణారెడ్డి, సాయన్న, ఎల్లయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం ప్రసంగాన్ని వీక్షించిన రైతులు ధారూరు: వ్యవసాయ వర్సిటీలో సోమవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను అన్ని రైతు వేదికల్లో రైతులు, అధికారులు వీక్షించారు. ధారూరు రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం, రైతులు హాజరైయ్యారు. కేరెళ్లి రైతు వేదికలో నూతనంగా వీడియో కాన్ఫరెన్స్ను ఎంపీడీఓ నర్సింలు, ఏఓ సూర్యప్రకాశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఈఓలు సంతోశ్, సంజూరాథోడ్ పాల్గొన్నారు. దేవర్ఫసల్వాద్లో.. దౌల్తాబాద్: వ్యవసాయ వర్సిటీలో సోమవారం ముఖ్యమంత్రి రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోని దేవర్ఫసల్వాద్లోని రైతువేదికలో రైతులు వీక్షించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈఓలు వైశాలి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు భరోసాపై హర్షం యాలాల: రైతు భరోసాతో పాటు ప్రభుత్వ పథకాలపై సోమవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. మండలంలోని రాస్నం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి, ఏఈఓ శిరీషలు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. వానకాలం రైతు భరోసా నగదు జమ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జనార్ధన్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నర్సింలుగౌడ్, నాయకులు ఆరీఫ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
‘రైతు నేస్తం’ను సద్వినియోగం చేసుకోండి
● అడిషనల్ కలెక్టర్ సుధీర్మోమిన్పేట: రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అన్నదాతలకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. సోమవారం మండలంలోని మేకవనంపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో మోమిన్పేటలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించే వారమని దీన్ని మరో రెండు చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. సేంద్రియ ఎరువుల వాడకంపెంచాలన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకుడు సురేందర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రవీందర్,ఏఓ జయశంకర్, ఏఈఓలు పెంటయ్య, శ్రీనివాస్, చంద్రిక, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. రైతులను ఆదుకుంటాం కొడంగల్: రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని.. వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్తో కలిసి సోమ వారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రావులపల్లి, చిట్లపల్లి, పర్సాపూర్ గ్రామాల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి రైతు భరోసా అందిస్తామని మంత్రులు పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి (జిల్లా అటవీ శాఖాధికారి) జ్ఞానేశ్వర్, తహసీల్దార్ విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, ఎంపీడీఓ ఉషశ్రీ, మండల వ్యవసాయాధికారి తులసీ, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి
తెలంగాణ కిసాన్ సంఘ్ వ్యవస్థాపకఅధ్యక్షుడు విజయ్కుమార్ అనంతగిరి/పరిగి: రైతులందరికీ రుణమాఫీ పథకం అమలు చేయాలని తెలంగాణ కిసాన్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్కుమార్ కోరారు. సోమవారం ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సగం మందికే రుణమాఫీ అమలు చేయడం సరికాదన్నారు. రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టారని మండిపడ్డారు. దీంతో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత సీజన్కు సంబంధించి పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వక్తం చేశారు. పొలం ఉన్న ప్రతి రైతుకూ రైతు భరోసా డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశారు. -
కేంద్ర పథకాలతో నిరుపేదలకు మేలు
కందుకూరు: కేంద్రంలో ఏన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలు నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్, కడారి జంగయ్యయాదవ్, మండల ఇన్చార్జి పోరెడ్డి అర్జున్రెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, జిల్లా నాయకులు జిట్టా రాజేందర్రెడ్డి, పి.శ్రీనివాస్గౌడ్, ఎస్.మల్లారెడ్డి. ఎ.సత్తయ్య, ఎన్.నర్సింహారెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
లగచర్లలో ప్రశాంతంగా రెవెన్యూ సదస్సు
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్లలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు ప్రశాంతంగా కొనసాగిందని తహసీల్దార్ కిషన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. రైతు సమస్యల పరిష్కరించుకునేందుకు గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు చక్కని స్పందన లభిస్తోందన్నారు. రెవెన్యూ సదస్సులో 31 ఫిర్యాదులు అందినట్లు ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నవీన్ కుమార్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఫకీరప్ప, ఊషప్ప, లాలాప్ప, పంచాయతీ కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి మోమిన్పేట: ధరణి తప్పిదాతలను సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దేవరంపల్లి, ఏన్కతల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు దరఖాస్తులు చేసుకుంటే అధికారులు రికార్డులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్ కుమార్, ఆర్ఐలు గోవర్ధన్, సరిత, కార్యదర్శి నర్సింలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. భూ భారతితో రైతులకు మేలు కుల్కచర్ల: భూ భారతి రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు చేకూరుతుందని కుల్కచర్ల తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా పెండింగ్ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల మేలుకోసం నిర్విరామంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిర్దవరి రవి, ఖాజా రెవెన్యూ సిబ్బంది అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు స్వీకరించిన తహసీల్దార్ పరిగి: భూ భారతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తహసీల్దార్ ఆనంద్రావు సూచించారు. సోమవారం మండల పరిధిలోని గడిసింగాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరేందర్, పంచాయతీ కార్యదర్శి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సీజనల్ వ్యాధులపై అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి 68 అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన వినతులను పెండింగ్లో పెట్టొద్దని అన్నారు. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి, బాధితులకు తగిన పరిష్కార మార్గం చూపించాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీధుల్లో చెత్త పేరుక పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, మురుగు నీటి కాల్వల్లోని వ్యర్థాలను తొలగించి, వరద నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్ రోగాల బారినపడే ప్రమాదం ఉందని, వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి -
ప్రక్షాళన.. పూర్తయ్యేనా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దేవాలయాల భూములకు రక్షణ లేకుండా పోతోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరగడంతో కేటుగాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చివరికి వివాదాలు కోర్టులు, ఎండోమెంట్ ట్రిబ్యూనల్స్కు చేరుకుంటున్నాయి. ఈ వివాదాల పరిష్కారంలో నిజాం కాలం నాటి ఉర్దూ భాషలో ముద్రించిన ముంతకబ్ రికార్డులు కీలక సాక్షంగా నిలుస్తున్నాయి. వందల ఏళ్ల క్రితానికి చెందిన ఈ రికార్డులు ప్రస్తుతం అవసాన స్థితికి చేరుకున్నాయి. ముట్టుకుంటే చిరిగిపోతున్నాయి. నాటి ఉర్దూను అర్థం చేసుకోవడం నేటి అధికారులకు ఇబ్బందిగా మారింది. ఆలయ ఈఓలకు ఉర్దూపై కనీస పట్టు లేదు. దేవాలయ భూములపై అవగాహన లేకపోవడంతో కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి. విలువైన ఆలయ భూములు చేజారిపోతున్నాయి. అంతే కాదు ముంతకబ్ రికార్డుల్లోని దేవాలయాల పేర్లు, ట్రస్టీ, ఫౌండర్ల గోత్ర నామాలు గుర్తించలేని స్థితికి చేరుకున్నాయి. వివాదాల పరిష్కారంలో కీలకమైన ఈ రికార్డులను భద్రపరచడంతో పాటు ఉర్దూ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని లోకాయుక్త సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెరిగిపోతున్న ఎండోమెంట్ పెండింగ్ కేసులు విచారణలో కీలక సాక్ష్యాలుగా మారిన ముంతకబ్ రికార్డులు నాటి ఉర్దూను అర్థం చేసుకోవడంలో అధికారుల ఇబ్బంది ఇంగ్లిష్లోకి అనువదించాలని లోకాయుక్త ఆదేశాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని తర్జుమా ప్రక్రియ అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములుదేవాదాయశాఖ భూములు (ఎకరాల్లో) జిల్లా మొత్తం భూమి అన్యాక్రాంతం మేడ్చల్ 4,125.03 2,888.18 రంగారెడ్డి 9,360.01 1,148.15 హైదరాబాద్ 5,718.01 2,374.25 వికారాబాద్ 2,294 444.16ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు 2010 నుంచి ఇప్పటి వరకు నమోదైనవి 2,100 ఇప్పటి వరకు పరిష్కారమైనవి 1,365 ఇప్పటికీ పెండింగ్లో ఉన్నవి 735 హైదరాబాద్లో ఉన్న పెండింగ్ కేసులు 140 సికింద్రాబాద్లో పెండింగ్లో ఉన్న కేసులు 66 రంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు 249 ఇప్పటి వరకు తర్జుమా అయిన ముంతకబ్లు 1,013 అనువాదం పూర్తికాని రికార్డులు 1,000పైనే -
పద్మమ్మకు నివాళి
ధారూరు: మండల పరిధిలోని చింతకుంటలో ఆదివారం దివంగత ఇంద్రారెడ్డి సోదరి పద్మమ్మ దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితారెడ్డి హాజరై నివాళి అర్పించారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మాజీ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్ తదితరులు హాజరయ్యారు. విద్యుదాఘాతంలో ఆవు మృతి తాండూరు రూరల్: విద్యుదాఘాతంలో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన పెద్దేముల్ మండలం ఎర్రగడ్డతండాలో ఆదివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన శాంతబాయి రోజు మాదిరిగానే ఆవులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో తండాశివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.50 వేలు ఆర్థికంగా నష్టపోయానని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతోంది. పశువుల నీటి తొట్టి ధ్వంసం బషీరాబాద్: పశువుల దాహార్తిని తీరుస్తున్న నీటితొట్టిని గ్రామానికి చెందిన ఓ నాయకుడు ధ్వంసం చేయించాడు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం కాశీంపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం.. ఉపాధి నిధులతో పదిహేనేళ్ల క్రితం తొట్టిని నిర్మించింది. తొట్టి ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ జాతీయ పార్టీకి చెందిన యువ నాయకుడు జేసీబీతో ధ్వసం చేయించాడు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన సదరు వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవా లని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు కుల్కచర్ల: పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని, అర్హులందరికీ ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధి ముజాహిద్పూర్లో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు షర్పొద్దీన్, సోమలింగం, రాములు, అంబదాస్, కిష్టయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 198 మందికి వైద్య పరీక్షలు యాలాల: మండల పరిధిలోని విశ్వనాథ్పూర్లో ఆదివారం తాండూరు వాసవి ఆస్పత్రి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన 198 మంది ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు ఆస్పత్రి యజ మాని సతీశ్ కుమార్, వైద్యుడు విజేందర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. కాడెద్దు అపహరణ ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాడెద్దును తరలించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బైకని పర్వ తాలు యాదవ్.. పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పొలం వద్ద ఐదు ఆవులు, రెండు కాడెడ్లను ఉంచాడు. ఆమనగల్లు– షాద్నగర్ రహదారి పక్కనే పశువుల పాక ఉండటంతో.. దుండగులు రూ.లక్ష విలువ చేసే ఎద్దును అపహరించారు. ఆదివారం ఉదయం పాక లో ఓ ఎద్దు లేదని గుర్తించిన బాధిత రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
మోహన్రెడ్డి సేవలు చిరస్మరణీయం
దౌల్తాబాద్: ప్రజా సంక్షేమానికి పరితపించిన నాయకుడు మోహన్రెడ్డి అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి అన్నారు. ఆదివారం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోహన్రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద వారు పార్టీ శ్రేణులతో కలిసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల రాజకీయంలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన ఆయన ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోహన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గురునాథ్రెడ్డి -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం.. ఆ పార్టీ భవనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ నారాయణయాదవ్ అధ్యక్షతన స్థానిక వైష్ణవిగార్డెన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ -
బీసీలు శాసించే స్థాయికి ఎదగాలి
బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ షాద్నగర్రూరల్: బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని ఎన్హెచ్–44 హోటల్లో ఆదివారం బీసీసేన జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలైన బీసీలు సమాజంలో గణనీయమైన వాటా కలిగి ఉన్నారని అన్నారు. జనాభా ప్రకారం అత్యధికంగా ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగుబలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని తెలిపారు. జనాభా ప్రకారం అధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికార సాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీసేన జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్యాదవ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీసీసేన నాయకులు సుధాకర్, చంద్రశేఖర్, వరలక్ష్మి, శారద, వెంకటేశ్, దేవేందర్, సౌజన్య, జక్కుల జలజ, స్రవంతిరాజ్, భాగ్యలక్ష్మి, అనిత, శ్రీనివాస్, శివకుమార్, మహేష్, వరప్రసాద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కుల్కచర్ల: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్, చౌడాపూర్ తదితర గ్రామాల్లో 242మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలకు లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నారన్నారని వివరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరక్టర్ రామ్మోహన్ శర్మ, చౌడాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్పాటి అశోక్కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, సలీం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత దోమ: మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి దాదాపూర్ రైతు వేదికలో 249 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు అనసూయ, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, శాంత్ కుమార్, బద్రి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి, యాదయ్యగౌడ్, అంతిరెడ్డి, బాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజు, బసన గౌడ్, మొగులయ్య గౌడ్, శేఖర్, చెనయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
నేడు లగచర్లలో రెవెన్యూ సదస్సు
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ భూ సమస్యల పరిష్కారానికి ఈ రెవన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తోందన్నారు. రైతులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు సమాచారం. ఘనంగా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలు అనంతగిరి: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జన్మదిన వేడుకలు వికారాబాద్లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. కిషన్రెడ్డి విద్యార్థినేత నుంచి నేడు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. పార్టీలో క్రమశిక్షణగల నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా అహర్నిషలు ప్రజలకోసం పరితపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి, మోహన్రెడ్డి, రాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీని కలిసిన బీసీ సంఘం నేతలుఅనంతగిరి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. ఆపరేషన్ కగార్ వెనుక కుట్ర సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహ్మద్ పరిగి: కేంద్రం మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్ కగార్ వెనుక కుట్ర కోణం దాగి ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహ్మద్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అటవీ సందపను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నా కావాలనే వరుస దాడులు కొనసాగిస్తోందన్నారు. ఆపరేసన్ కగార్కు వ్యతిరేకంగా ఈ నెల 17న నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పేదలను ఇబ్బంది పెట్టొద్దు మాజీ మంత్రి సబితారెడ్డిహుడాకాంప్లెక్స్: రాజకీయాల కోసం పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హితవు పలికారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు తమ సమస్యలను ఆదివారం ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలోని పేదలకు దాదాపు 5వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఆన్లైన్ లక్కీడీప్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లకు చెందిన 1,800 మందికి డ్రా ద్వారా కేటాయించామన్నారు. స్థానికులకు 10 శాతం కేటాయించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులకు పట్టాలు ఇచ్చామని వివరించారు. కొంతమంది కావాలని కోర్టులకు వెళ్లి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులతో చర్చించి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
బోనస్ సున్నా
సన్నాలకు పరిగి: వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు సన్నాలు సాగు చేపట్టి ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ధాన్యం విక్రయించి నెల రోజులు కావస్తున్న బోనస్ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 7,500 మెట్రిక్ టన్నుల సన్నాలకు గాను రూ.3.75కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు జమ చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఆలస్యమైనా అక్కడే విక్రయం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తూకం వేయడంలో ఆలస్యం చేస్తున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే కారణంగా రైతులు ఆలస్యమైనా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. మే మొదటి వారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించినా చెల్లింపుల్లో ఆలస్యంగా అవుతున్నాయి. సన్న రకం విక్రయించిన రైతులకు ముందుగా క్వింటాల్కు రూ.2,320 చొప్పున చెల్లించి తరువాత బోనస్ వేస్తున్నారు. బోనస్ మినహా మిగత డబ్బులు చాలా మంది రైతుల ఖాతాలో జమ అయ్యాయి. పెరిగిన సాగు జిల్లా వ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్లో రైతులు దొడ్డురకంతో పాటు సన్నాలు సైతం ఎక్కువగానే సాగు చేశారు. వానాకాలం సీజన్లో సాగు చేసిన సన్నాలకు బోనస్ డబ్బులను ప్రభుత్వం ఆలస్యంగా వేసిందని అప్పట్లో అధికారులు మొదటి సీజన్ కావున కొంత ఆలస్యం అవుతాయని చెప్పారు. యాసంగిలో బోనస్ను త్వరగా అందిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్ డబ్బులు ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నెల రోజులు దాటినా జమకాని రూ.500 ప్రోత్సాహకం రైతులకు తప్పని ఎదురుచూపులు నెల రోజులైంది ఐదెకరాల్లో సన్న రకం వరిసాగు చేయగా 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల క్రితం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించా. బోనస్ డబ్బులు రూ.32 వేలు రావాల్సి ఉంది. నేటికీ జమ చేయలేదు. ప్రభుత్వం బోనస్ జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – మేకల శ్రీనివాస్, ఐనాపూర్ ప్రభుత్వానికి నివేదించాం ఇప్పటి వరకు 7,500 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను రెండు రోజుల వ్యవధిలోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలోనే రైతుల ఖాతాలో జమ అవుతాయి. – మోహన్ కృష్ణ, పౌరసరఫరాల శాఖ డీఎం, వికారాబాద్ -
పత్తి సాగుకు సమయమిదే..
నవాబుపేట: పత్తి సాగుకు సరైన సమయమిదేనని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే రైతులకు తెల్లబంగారం లాభాలు ఆర్జించి పెడుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతులు అధికంగా పత్తి సాగుకు మొగ్గు చూపుతారు. కానీ ఏడాది గతంతో పోల్చితే తగ్గే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాది సరైన సమయంలో వర్షాలు కురువక దిగుబడులు తగ్గడం.. ఖర్చులు పెరగడంతో ఆశించిన లాభాలు రాలేదు. దీంతో మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలం మండల పరిధిలో 21,539 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. మొక్క జొన్న 744 ఎకరాలకే పరిమితమైంది. ఈ సీజన్లో 19,230 ఎకరాల్లో పత్తి 2,317 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. నల్లరేగడి భూములు అనుకూలం పత్తి సాగుకు నల్లరేగడి భూములు అనుకూలమైనవి. నీటి సదుపాయం కలిగిన సారవంతమైన ఎర్రనేలల్లోనూ వేసుకోవచ్చు. సమస్యాత్మక భూములు తరుచుగా నీటి ఎద్దడికి గురయ్యే నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం లేని నేలల్లో సాగు చేపట్టొద్దు. తొలకరి వర్షాలు పడిన తర్వాత పొలాన్ని రెండు నుంచి మూడుసార్లు కలియ దున్నుకోవాలి. విత్తనాలు ఏ పద్ధతి లో వేసుకోవాలన్నది విత్తన రకం, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఆఖరి దుక్కిలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు వేయాలి. చివరి దుక్కిలోనే 150 కిలోల సింగల్ సూపర్పాస్పేట్ వేసి కలియదున్నాలి. భూమి బాగా తడిసిన తర్వాత అంటే 60 నుంచి 70 మీల్లీటర్ల వర్ష పాతం నమోదైన ఐదు రోజుల తర్వాత విత్తనాలు వేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో 60 నుంచి 70 శాతం తేమ ఉంటేనే ఎర్రనేలల్లో 50 నుంచి 60 శాతం తేమ ఉంటే విత్తనం వేసుకోవచ్చు. విత్తన ఎంపిక పత్తిలో చాలా రకాలున్నాయి. నమ్మకమైన కంపెనీలు, డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. పత్తిలో సూటి, సుంకర రకాలున్నాయి. చాలా మంది బీటీ పత్తినే సాగు చేస్తున్నారు. మైకో, నూజివీడు, కావేరి, బ్రహ్మ, బోల్గార్డ్, అజీత్, ఇలా చాలా కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరికి నచ్చిన విత్తనాలు వాల్లు విత్తుకోవాలి. పంటకాలం పూర్తయ్యే వరకు రసీదులు భద్రపరుచుకోవాలి. ఎరువులు వేయడం ఎకరాకు 60 నుంచి 80 కిలోల నత్రజని, 25 నుంచి 35 కిలోల భాస్వరం, 25 నుంచి 35 కిలోల పొటాష్ వేసుకోవాలి. భాస్వరం, పొటాష్లను మూడు సమభాగాలుగా చేసుకొని విత్తిన 30 రోజులకు , 60 రోజులకు, 90 రోజులకు వేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా సిపారస్సు చేసిన ఎరువులు వాడితే పోషకాలు సమపాళ్లలో అందడంతో ఖర్చు తగ్గుతుంది. విత్తన నమోదు ఎకరానికి 650 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. నేలసారాన్ని బట్టే విత్తే దూరం ఎంచుకోవాలి. బలమైన నల్లరేగడి నేలల్లో 90 ప్లస్ 90 సెంటీ మీటర్లు, మధ్యస్థ నేలల్లో వరుసల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు, మొక్కల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు ఉండేట్లు విత్తుకోవాలి. బీటీ పత్తి చుట్టూ రెండు నుంచి నాలుగు వరుసలు నాన్బీటీ పత్తిని ఖచ్చితంగా విత్తుకోవాలి. విత్తన రకం, నేల స్వభావమే ప్రధానం భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడాలి మండల వ్యవసాయాధికారి జ్యోతి -
అలుగు ఆధునికీకరణ ఎప్పుడో!
కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపై సీసీ బెడ్ నీటి ప్రవాహ ఉధృతికి చిత్తడిగా మారింది. 2021లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండి నీటి ఉధృతి అలుగుపై పారడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. అప్పట్లో మరమ్మతు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడంతో తిరిగి శిథిలమైంది. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.110 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా పనుల్లో పురోగతి లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ శాఖ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – ధారూరు -
కలెక్టర్ పాలన.. విజయ పథాన
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. బొంరాస్పేట–బుర్రితండా డబుల్ రోడ్డు నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.8లోu9లోuవికారాబాద్: ఓ పక్క సంక్షేమ పథకాలను ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల వద్దకు చేర్చడంతో పాటు మరో పక్క పాలన గాడిన పెట్టడంలో కలెక్టర్ ప్రతీక్జైన్ చాలా వరకరు సక్సెస్ అయ్యారు. మొదటిసారి వికారాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. చివరకు తేరుకుని పాలన గాడిలో పెట్టారు. నేటితో ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుండటంతో జిల్లాపై ఆయన వేసిన ముద్ర ఎదుర్కొన్న సమస్యలు, లోటుపాట్లపై ఓ పరిశీలిద్దాం.. అధికార యంత్రాంగం పనితీరుపై.. జిల్లాలో ప్రధానంగా కలెక్టరేట్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కంకణం కట్టుకున్న కలెక్టర్ వచ్చీ రాగానే అన్ని శాఖల యంత్రాంగం సేవలు ప్రజలకు అందడంలో ఇబ్బందులు, జాప్యంలేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి జిల్లా అధికారుల వరకు అన్ని శాఖల యంత్రాంగం పనితీరును మెరుగపరిచేందుకు తీసుకున్న చర్యలు సత్ఫాలితాలిచ్చినట్లే కనిపిస్తున్నాయి. తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణను బలోపేతం చేయటంలోనూ సఫళీకృతమయ్యారు. ధరణి నుంచి భూ భారతి సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతూ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. 4,500 ధరణి సమస్యలు పరిష్కారం జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న ధరణి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు తీసుకున్నది మొదలు రోజుకు 150 సమస్యలకు తక్కువ కాకుండా ధరణి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయటంతో పాటు సేవలు మెరుగుపర్చారు. ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో మండల స్థాయిలో తహాసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వస్తున్నారు. సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. 5 వేల వరకు ఉన్న ధరణి దరఖాస్తులు నేడు 400లోపే వచ్చాయి. విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించంలో తనదైన ముద్ర వేశారు. ప్రతీ హాస్టల్కు తనే స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నిధులు కేటాయించి వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆస్పత్రులను తరచూ విజిట్ చేస్తూ వైద్య సేవలు అందరికి అందేలా చొరవ చూపారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేశారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై దృష్టి సారించి ప్రజలకు అందించడంలో ప్రత్యేక చొరవ చూపారు. భూసేకరణలో సక్సెస్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో ఆయనతో పాటు ఇతర అధికారులు, పోలీసులపై జరిగిన దాడి ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ ఘటన నుంచి సాధ్యమైనంత తొందరగానే బయటపడిన ఆయన తిరిగి పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించే విషయంలో సక్సెస్ అయ్యారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా చూడడంలో ఆయన శ్రమ ఫలించింది. ప్రతీక్జైన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి సంక్షేమం దిశగా పరుగులు పెట్టించేందుకు తనదైన మార్క్ -
మృత్యుపాశాలు!
నెత్తినసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ తీగలు.. పౌరుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. నెత్తిన మృత్యుపాశాల్లా వేలాడుతున్న వైర్లు ఎప్పుడు.. ఎవరిపై తెగిపడతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఎలాంటి ఈదురు గాలులు, వర్షాలు లేకపోయినప్పటికీ.. వైర్లు తెగిపడుతుండటాన్ని పరిశీలిస్తే.. డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా ప్రమాదాలు తగ్గడంలేదు. తాజాగా సరూర్నగర్ డివిజన్ చింతల్కుంట ఫీడర్కు సంబంధించిన 11 కేవీ పోల్పై పాలిమర్ పిన్ ఇన్సులేటర్లోని మెటల్ రాడ్డు విరిగిపడి, హైటెన్షన్ విద్యుత్ కేబుల్ తెగిపడటంతో.. సాగర్ రింగ్రోడ్డు సమీపంలోని ఓ దేవాలయం ఫుట్పాత్పై నిద్రపోతున్న ఓ మహిళ, పురుషుడు (యాచకులు) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. విద్యుత్ ఇంజినీర్లు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు గుర్తు తెలియని ఓ వాహనం స్తంభాన్ని ఢీకొనడంతోనే వైర్లు తెగిపడినట్లు చెబుతున్నారు. నిర్వహణ లోపంతోనే.. ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే ఉన్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజు లైన్లు సరి చేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను మార్చడం, డీటీఆర్ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. కంపెనీ కేటాయించిన నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి తప్ప.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఎప్పటికప్పుడు లైన్ టు లైన్, పోల్ టు పోల్ తిరిగి ప్రమాదకరంగా మారిన వాటిని గుర్తించి, వాటి స్థానంలో కొత్త వైర్లు, స్తంభాలు, పిన్ ఇన్సులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మల తొలగింపు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపాదనలకే సరి.. వేలాడుతున్న వైర్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం ఇటీవల బెంగళూరులో పర్యటించి భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను పరిశీలించి వివరాలను సేకరించింది. 3,400 కిలోమీటర్ల 33 కేవీ, 11,500 కిలోమీటర్ల 11 కేవీ లైన్లలో యూజీ కేబుళ్లు లైన్లు, 15 వేల కిలోమీటర్ల ఏబీ కేబుల్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందు కోసం రూ.13,600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. బకాయిలు భారీగా పేరుకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో డిస్కం ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధుల్లేవంటూ చేతులెత్తేసింది. కేంద్రం దయతలచి ఏదైనా స్కీం ప్రకటిస్తే గాని.. ఈ పనులు ఇప్పట్లో పూర్తికాని పరిస్థితి నెలకొంది.ప్రాణాంతకంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తరచూ తెగిపడుతున్న వైర్లు లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు అయినా మెరుగుపడని పంపిణీ వ్యవస్థ -
‘అపూర్వ’ సమ్మేళనం
32 ఏళ్ల తర్వాత కలుసుకున్న చించల్పేట్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వికారాబాద్: ఆత్మీయం.. అపురూపం అన్నట్టుగా మారింది.. ఆ సమ్మేళనం..32 వసంతాల సుదీర్ఘ కాలం తరువాత కలిసిన ఆ పూర్వ విద్యార్థులు నాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యేలా చేశాయి. నవాబుపేట మండలం చించల్పేట్ జెడ్పీహెచ్ఎస్లో 1992–93లో పదో తరగతి చదవిన విద్యార్థులు ఆదివారం వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో కలిశారు. నాడు వారికి విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, విష్ణుచిత్తం, సత్యనారాయణరెడ్డి, గోవర్ధన్, యూసెఫ్లతో పాటు ప్రస్తుతం ఆ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాడు పాండును ఘనంగా సన్మానించారు. పాతికేళ్ల అనంతరం.. బొంరాస్పేట: పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాతికేళ్ల తర్వాత ఆదివారం కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులకు పాదిభివందనాలు చేసి తరించారు. 1997–98లో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన 56మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయతను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన వెంకట్రాములుగౌడ్, నర్సప్ప, చెన్నబసప్ప, సాయన్నగౌడ్, సాయిబన్న, చంద్రశేఖర్గౌడ్లను శాలువాలతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్ పాల్గొన్నారు. -
కొడుకు జ్ఞాపకాలతో విరాళం
ఆలయ అభిృద్ధికి హామీ బొంరాస్పేట: కొడుకు లేడన్న బాధను దిగమింగుకొని, పుత్రుడి జ్ఞాపకాలతో ఓ తండ్రి.. ఫాదర్ డే రోజు ఆదివారం ఆలయానికి రూ.10 వేలతో గంట, గేటు చేయించాడు. మరో నాలుగేళ్లలో పురాతన ఆలయానికి మరమ్మతు పనులు చేయిస్తానని హామీ ఇచ్చాడు. మండల పరిధి రేగడిమైలారానికి చెందిన గుర్మిట్కల్ హన్మిరెడ్డి కొడుకు నవీన్కుమార్రెడ్డి.. గతేడాది పొలం పనులకు వెళ్తూ విద్యుదాఘాతంతో చనిపోయాడు. కొడుకు అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి.. తన బిడ్డ చనిపోలేదని, నేరుగా శివుడి వద్దకు చేరాడని పేర్కొనడం గమనార్హం. కొడుకు చనిపోయాడన్న బాధలో ఉండి కూడా.. ఆలయానికి తనకు తోచిన విరాళం అందజేసిన దాత హన్మిరెడ్డికి ఆలయ పూజారి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జగదీశ్వరయ్య కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థి అదృశ్యం
పహాడీషరీఫ్: విద్యార్థి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పో లీసులు తెలిపిన ప్రకారం.. మామిడిపల్లి ముదిరాజ్ కాలనీకి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాకోటి మురళీమోహన్ కుమారుడు దివ్యసాయి(19) నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ నెల 9న తల్లిదండ్రులు పనిమీద బయటికి వెళ్లి మధ్యా హ్నం వచ్చి చూడగా దివ్యసాయి కనిపించలేదు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఠానాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గానీ, 87126 62367 నంబర్లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. పరీక్ష రాసేందుకెళ్లి.. ఇబ్రహీంపట్నం: పరీక్ష రాసేందుకని వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. శంషాబాద్కు చెందిన విద్యార్థిని (23) ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి పరిధిలోని ఏవీఎన్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు పరీక్ష రాసేందుకు కళాశాలకు బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీలోకి స్వప్న?
తాండూరు: మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ కాంగ్రెస్ను వీడి కాషాయదళంలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది తాండూరులో హాట్టాపిక్గా మారింది. పలువురు మాజీ కౌన్సిలర్లు సైతం స్వప్న బాటలో నడవనున్నట్లు సమాచారం.మహేందర్రెడ్డి వర్గం నుంచి..2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పట్నం మహేందర్రెడ్డి వర్గం నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా స్వప్న రేసులోకి వచ్చారు. మరో వైపు ఇదే పార్టీ నుంచి రోహిత్రెడ్డి వర్గం తరఫున పట్లోల్ల దీపనర్సింహులు చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేశారు. 36 వార్డులున్న తాండూరులో మహేందర్రెడ్డి వర్గీయులు ఎక్కువమంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. దీంతో చైర్పర్సన్ కుర్చీ కోసం పోటీ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నాయకులు కల్పించుకుని, చైర్పర్సన్ పదవీకాలాన్ని ఇద్దరూ చెరి సగం పంచుకోవాలని సూచించారు. మొదటిసారి స్వప్నకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో దీపకు వైస్ చైర్పర్సన్ కుర్చీ ఇచ్చి బుజ్జగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పదవీ కాలమంతా స్వప్ననే కొనసాగారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ప్రతీసారి గొడవలే జరిగాయి.రాష్ట్ర కమిటీ ఎన్నిక తర్వాతే..గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వప్న కాంగ్రెస్లో చేరారు. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆమెకు ఆహ్వానం ఆగిపోయింది. ఈ విషయమై తన సన్నిహితుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కమిటీ నియామకం తర్వాతే కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. -
కేసుల పరిష్కారానికి రాజీయే మార్గం
సీనియర్ సివిల్ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, శ్యాంకుమార్ చేవెళ్ల: రాజీమార్గం ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, జె.శ్యాంకుమార్, రిటైర్డ్ జడ్జి కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణల కారణంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. భార్యాభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, భూ సంబంధిత విషయాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని చెప్పారు. 1,271 కేసులకు రూ.16.62లక్షల జరిమానాలు చేవెళ్ల కోర్టు ఆవరణలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన లోక్ అదాలత్లలో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించామన్నారు. ఆరు రోజుల్లో 1,271 కేసులు పరిష్కరించగా రూ.16,62,690 జరిమానా విధించామన్నారు. ట్రాఫిక్ విభాగానికి సంబంధించి 766 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. సివిల్, క్రిమినల్, పిట్టి కేసులకు సంబంధించి పరిష్కరించుకునేందుకు వీలున్న అన్ని కేసులకు పరిష్కారం చూపామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్లు ఈ.మహిపాల్, బి.కృష్ణవేణి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.కుమార్. సీఐ భూపాల్శ్రీధర్, ట్రాఫిక్ ఏఎస్ఐ చందర్నాయక్, అడ్వకేట్స్ బి.కృష్ణ గౌడ్, బి.మల్లేశ్గౌడ్, నర్సింలు, ఉపేందర్, శేఖర్, సిబ్బంది అనిల్కుమార్, నర్సింలు, ఆనంద్కుమార్ తదితరులు ఉన్నారు. 152 కేసులకు పరిష్కారం ఆమనగల్లు: పట్టణంలోని జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 152 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ స్వరూప కాటం మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీపడి పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ కార్తీక్, సీఐ జానకీరాంరెడ్డి, గంగాధార్, వేణుగోపాల్, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐలు వెంకటేశ్, శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ కేసులు డ్రంకెన్ డ్రైవ్ 544 రూ.10,76,500 లైసెన్స్, రిజిస్ట్రేషన్ 222 రూ.2,96,500 -
మామిడి పండ్ల లారీ బోల్తా
కొత్తూరు: మామిడి పండ్ల లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చేగూరు కూడలి జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నుంచి మామిడిపండ్ల లోడ్తో ఢిల్లీ వెళ్తున్న లారీ చేగూరు కూడలి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా తిమ్మాపూర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డులో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. లారీ బోల్తా పడగానే పలువురు వాహనదారులు, ప్రజలు మామిడి పండ్లను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో లారీను తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై ఏలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు. పెంజర్ల కూడలిలో.. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ లారీ పెంజర్ల కూడలి సమీపంలో అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు. డ్రైవర్కు గాయాలు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ -
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం
షాబాద్: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారు సర్వే నంబర్ 8లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆయన కూల్చివేయించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యాపారాలకు అనుగుణంగా కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కనిపిస్తే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 111 జీవోలో కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓకు సమాచారం అందించామని స్పష్టంచేశారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు. షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హైతాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత -
రాజీయే రాజమార్గం
పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. శనివారం వివిధ కేసులపై మెగా లోక్ అదాలత్ నిర్వహించా రు. లోక్ అదాలత్లో ఇరువురి రాజీ ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శి ల్ప మాట్లాడుతూ పంతాలకు పోయి గొడవలు పెంచుకోవద్దని సూచించారు. క్షణికావేశంలో చేసిన తప్పులు పలు కేసులకు దారితీస్తాయన్నారు. కావు న ఎలాంటి కేసులైన లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక్కడ పరిష్కారమైన కేసులను అంతిమ పరిష్కారంగా పరిగణిస్తారన్నారు. కావున కేసులు ఉన్న వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలముకుందర్, బార్అసోసియేషన్ అధ్యక్షుడు ఇబ్రాహింఖాన్, న్యాయవాదులు పాల్గొన్నారు.పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప -
నేడు తాండూరుకు అజారుద్దీన్
తాండూరు: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మ ద్ అజారుద్దీన్ ఆదివారం తాండూరుకు రానున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారి ముజీ బ్ఖాన్ ఆధ్వర్యంలో విలియంమూన్ మైదానంలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ ఫైన ల్ దశకు చేరుకుంది. ఈ సందర్భంగా శాసనమండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. 108లో గర్భిణి ప్రసవం కొడంగల్ రూరల్: మండల పరిధిలోని చిట్లపల్లితండాకు చెందిన వాణిశ్రీ శుక్రవారం రాత్రి 108 అంబులెన్స్లో ప్రసవించింది. గ్రామంలో ఉన్న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. ఆమెను వాహనంలో కొడంగల్ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో తాండూరు ఆస్పత్రిలో జాయిన్ చేశామని వాణిశ్రీ బంధువులు తెలిపారు. వీధి కుక్కల దాడిలో రైతుకు గాయాలు దోమ: వీధి కుక్కల దాడిలో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఈ ఘటన దోమ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బోయిని కిష్టప్ప ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ గుంపులుగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కవ ఉందని వాటిని జనవాసాలనుంచి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ రోడ్డుపై జారిపడి చిన్నారి మృతి దిర్సంపల్లిలో ఘటన దోమ: ఇంట్లో నుంచి వెళ్తున్న బాలుడు ప్రమా దవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన దోమ మండల పరిధి లోని దిర్సంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగీత, రమేశ్కు వేణుమాధవ్(4), అనూష(2) సంతానం. ఉదయం 10 గంటల సమయంలో ఆడుకునేందుకు బయటకు వస్తుండగా వాకిట్లోని సీసీ రోడ్డుపై కుప్పకూలి ప్రాణం కోల్పోయాడు. ఇది గమనించిన పక్కింటి మహిళ పరుగున వెళ్లి సంగీతకు చెప్పింది. తల్లి వచ్చి బాలుడిని కదపగా ఉలుకు, పలుకు లేకపోవడంతో లబోదిబోమని రోదించింది. చుట్టు పక్కల వారు అక్కడి చేరుకునిపరిశీలించేసరికే చిన్నారి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రుత్విక్ జ్యోషికి 557 ర్యాంకు కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన రాము జ్యోషి కుమారుడు రుత్విక్ జ్యోషి నీట్లో ఆలిండియా లెవల్లో 557 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు రుత్విక్ను అభినందించారు. -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మున్సిపల్ మాజీ చైర్మన్
కొడంగల్: మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మార్యద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసానికి వెళ్లి కొడంగల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. భారీ మొత్తంలో నిధులతో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నీట్లో సత్తాచాటిన మండల విద్యార్థి జాతీయ స్థాయిలో 660 ర్యాంక్ సాధించిన హరీష్ యాలాల/తాండూరు టౌన్: నీట్ ఫలితాల్లో మండల విద్యార్థి సత్తాచాటారు. బెన్నూరు గ్రామానికి చెందిన కరణం లక్ష్మీకాంతరావు, విద్యారాణి దంపతుల కుమారుడు కరణం హరీష్ గౌతం గత మేలో నిర్వహించిన నీట్ జాతీయ స్థాయి అర్హత పరీక్షలకు హాజరయ్యాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 660వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 416వ ర్యాంకు సాధించారు. నీట్ పరీక్షలో అన్ని సబ్జెక్టుల్లో 99శాతం ఉత్తీర్ణతతో హరీష్ మార్కులు సాధించడం విశేషం. హరీష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. టీపీయూఎస్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. నీట్లో ప్రతిభ చాటిన హరీష్కు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. రక్త దానం ప్రాణదానంతో సమానం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ తాండూరు టౌన్: రక్తదానం ప్రాణ దానంతో సమానమని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో కేక్ కట్ చేసి, రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో, అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో కావాల్సిన రక్త గ్రూపు లేక పోవడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన రక్తనిఽధి కేంద్రంలో యువత, పెద్దలు రక్తదానం చేసి రక్త నిల్వలను పెంచాలన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యకరమైన అంశమని, అలాగే ఇతరులు ప్రాణాలను నిలబెట్టిన వార వుతారన్నారు. కార్యక్రమంలో వైె ద్యులు ఆనంద్ గోపాల్ రెడ్డి, రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధారూరు మార్కెట్కు 2,358 బస్తాల మక్కలు ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్కు శనివారం 2,358 బస్తాల మొక్కజొన్నలు వచ్చాయని ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. బీట్లలో వ్యాపారులు క్వింటాలు మొక్కజొన్నలకు తక్కువగా రూ.2,140, మధ్యస్తంగా రూ.2,170 ఎక్కువగా రూ.2,290 వరకు ధర పలికిందని తెలిపారు. 1010 రకం ధాన్యం 1,045 బస్తాలు రాగా క్వింటాలుకు రూ.1,870, రూ.1,880, రూ.1,950 వరకు, సోనారకం వడ్లు 291 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,050, రూ.2,100, రూ.2,150 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని ఆమె వివరించారు. -
జన్మన్ జాడేదీ..!
● పథకం అమలులో నిర్లక్ష్యపు నీడ ● చెంచుల అభ్యున్నతికి కేంద్రం తెచ్చిన ప్రత్యేక స్కీం ● ప్రారంభించి ఏడాది గడిచినా సాగని పనులు ● జిల్లాలో 22 ఆవాసాల్లో చెంచుల నివాసం ● 740 కుటుంబాలు, 2,554 మంది జనాభా వికారాబాద్: చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జన్మన్ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసి న్యాయ అభియాన్ (పీఎం జన్మన్) పేరుతో కేంద్రం గతేడాది క్రితం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. చెంచు గూడేలు, వారి జీవితాల్లో సమూల మార్పులు తేవడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. స్కీం ప్రారంభించే ముందు వారి స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. జిల్లాలో 22 ఆవాసాల్లో చెంచులు నివసిస్తుండగా 740 కుటుంబాలు, 2,554 మంది ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 42 అంశాలపై సర్వే నిర్వహించి వివరాలు సేకరించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. కార్యక్రమం కాస్త సర్వేకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకంలో పొందుపర్చిన అంశాలు పీఎం జన్మన్ పథకంలో చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక అంశాలను పొందుపర్చారు. ముందుగా వారి వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు 42 అంశాలతో కూడా సమాచారం సేకరించారు. ప్రధానంగా వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సదుపాయాల్లో ఇప్పటి వరకు ఏవేవి కలిగి ఉన్నారు..? ఇంకా ఏవేవి కల్పించాల్సి ఉంది..? అనే అంశాలను ఈ సర్వే ద్వారా తెలుసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. చెంచు కుటుంబాలకు పక్కా ఇళ్లు ఉన్నాయా..? ఇంటికి కులాయి ఉందా లేదా..? లాంటివి తెలుసుకున్నారు. ప్రతి చెంచు ఆవాసానికి రహదారి, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, అందరికి నాణ్యమైన విద్య లాంటివి ఈ పథకం ద్వారా అందించాలని నిర్ణయించారు. వృత్తి విద్యా నైపుణ్యం, అందరికీ ఆరోగ్యం, పోషణ, మెరుగైన టెలీఫోన్ సౌకర్యం తదితర కార్యక్రమాల ద్వారా జీవనోపాధి మెరుగు పర్చడం లాంటివి ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. ఉచిత నిత్యావసరాలు, ఉచిత ఎల్పీజీ కనెక్షన్, గర్భిణులకు ఆర్థిక సాయం, సుకన్య సంవృద్ధి యోజన, వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నీ అందుతున్నాయా లేదా..? తెలుసుకుని వాటన్నింటిని అందేలా చూడటం ఈ పథకం ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని తెలంగాణతోపాటు 28 రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.24 వేల కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే స్కీం ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా కార్యక్రమాలేవి చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది. వైఫల్యాలు పునరావృతం కాకుంటేనే.. చెంచుల అభ్యున్నతి కోసం తపపెట్టిన ఈ పథకంలో గత అనుభవాలు, వైఫల్యాలు పునరావృతం కాకుండా చూసుకోగలిగితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలోనూ ప్రభుత్వాలు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు తీసుకువచ్చినా ఆ కుటుంబాలల్లో ఆశించిన మార్పు రాలేదు. వారు అన్ని రంగాల్లో రాణించాలంటే మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిలో సామర్థ్యాల పెంపుదలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని పలువురు అభిప్రాయపడ్డారు.. లేకుంటే ఇలాంటి ఎన్ని పథకాలు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండన్నారు. -
సత్తాచాటిన కీర్తన
బడంగ్పేట్: బడంగ్పేటకు చెందిన గుడ్ల రాధ, శ్రీనివాస్ దంపతుల కూతురు కీర్తన నీట్ ఫలితాల్లో 468 ర్యాంకుతో సత్తాచాటింది. ఉస్మానియా, లేదా గాంధీ మెడికల్ కాలేజీలో తనకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను అభినందించారు. గంజాయి విక్రేత అరెస్టు కేపీహెచ్బీకాలనీ: మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదర్నగర్లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద బ్యాగులో ఉన్న 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతంలో నివాసం ఉండే బచ్చల లోకేష్ (22) సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో కలిసి గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్ వద్ద నల్లటి బ్యాగులో అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. భర్తను హత్య చేసిన భార్య ఇనుపరాడ్తో కొట్టడంతో తీవ్రగాయాలతో మృతి సైదాబాద్: భర్తకు మద్యం తాగించి..మత్తులో ఉన్న అతడిపై భార్య ఇనుపరాడ్తో దాడి చేయటంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన జీషాన్ అలీ (45) నగరానికి వలస వచ్చి 18 ఏళ్ల క్రితం చంద్రా అలియాస్ అయేషా పర్వీన్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చాలా కాలం ఎల్బీనగర్లో నివసించిన వీరు తమ ఐదుగురు సంతానంతో ఇటీవల సింగరేణి కాలనీలో అద్దెకు దిగి పూల వ్యాపారం చేసేవారు. జీషాన్ అలీ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడు. యూపీలోని శరన్పూర్లో నివసించే అతని సోదరుడు షకీర్ అలీ వారిని ఫోన్లో సముదాయించే వాడు. అయితే అయేషా ఇటీవల మరొకరితో చనువుగా ఉంటుందని జీషాన్ అలీ భార్యతో గొడవపడటం ఎక్కువైంది. ఈ నెల 11న అయేషా తన భర్తను ఇనుప రాడ్తో విచక్షణారహితంగా కొడుతుండగా వారి ఇంటి నుంచి వచ్చిన శబ్దాలు విని స్థానికులు వెళ్లి ఆమెను అడ్డుకొని జీషాన్ను పడుకోబెట్టి వెళ్లి పోయారు. మరుసటి రోజు అయేషా తన భర్తను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియాకు తీసుకెళ్లమన్నారు. అక్కడికి వెళ్లగా..అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు షకీర్ అలీ శుక్రవారం యూపీ నుంచి నగరానికి వచ్చి ఓజీహెచ్లో తన అన్న మృతదేహాన్ని గుర్తించాడు. తన సోదరుడిని కొట్టి చంపిన అయేషాపై సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సాగు.. పిరం! ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు.
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 20258లోuషాద్నగర్: వేలు పట్టి నడిపించాడు... అక్షర ప్రపంచాన్ని పరిచయం చేశాడు.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అండగా నిలిచాడు.. తాను ప్రస్తుతం లేకపోయినా నా నీడగా ఉంటూ నన్ను గెలిపించాడు.. అంటూ తన తండ్రి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సివిల్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఐఆర్ఎస్ సాధించిన కొర్రావత్ శశికాంత్. తన తండ్రి ప్రస్తుతం భౌతికంగా లేకున్నా తన హృదయంలో తనకు జీవితాన్ని, భవితవ్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుంటాడని చెబుతున్నాడు ఈ ఐఆర్ఎస్ అధికారి. సొంతూరిని విడిచి.. మాది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిధిలోని చాకలిదాని తండా. తల్లిదండ్రులు రాములు నాయక్, సీతమ్మలకు రెండవ సంతానం. తనకు అన్న నీలిమ, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం షాద్నగర్కు తీసుకొచ్చాడు. హాస్టల్లో వార్డెన్గా విధులు నిర్వహిస్తూ చదివించాడు. తమను భవిష్యత్లో ఉన్నత స్థానంలో చూడాలన్నది ఆకాంక్ష. అందుకు ఆయన ఎంతో శ్రమించారు. అపుడే నిర్ణయం తీసుకున్నా నాన్న ప్రతి రోజు నా వెంట పాఠశాలకు వచ్చేవారు. చదువుల్లో రాణించి మంచి మార్కులు సాధించాలని చెప్పేవారు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే ఉపాధ్యాయులను అడగాలని సూచించేవారు. ఎంతో గారాబంగా పెంచారు. 8వ తరగతి వరకు షాద్నగర్లో పూర్తి చేసిన తర్వాత 9,10 వట్టెం నవోదయలో చేర్పించాడు. అప్పుడే నేను సివిల్స్ వైపు దృష్టి సారించాను. నాన్న ఆశయాలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను. అనంతరం ఇంటర్ హైదరాబాద్ వికాస్లో, బీటెక్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశా. గెలుపు చూడకుండానే విడిచి వెళ్లిపోయాడు తనను ఉన్నత స్థానంలో నిలిపేందుకు నాన్న అన్నివిధాలా ప్రోత్సహించారు. 2008 బీటెక్ చదువుతుండగా ఆయన అకాల మరణం కలిచివేసింది. నాన్న లేరనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మ ప్రోత్సాహంతో సివిల్స్లో ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉద్యోగం సాధించా. నేను సాధించిన లక్ష్యాన్ని నాన్న చూసి ఉంటే ఎంతో సంతోష పడేవాడు. న్యూస్రీల్ నాన్న నడిపించాడు.. నన్ను గెలిపించాడు -
● తండ్రి కష్టాలు చూస్తూ పెరిగాం
యాలాల: ఒక వైపు పేదరికం.. మరోవైపు కుటుంబ భారం.. అయినా బెదరకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తండ్రి. నాన్న పడిన కష్టానికి ప్రతిఫలంగా నేడు ఆయన పిల్లలు ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నారు. యాలాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ, భారతి దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, పాల బూత్ను నిర్వహిస్తూ పిల్లలను చదివించారు. నేడు నలుగురూ ఉన్నత స్థాయిలో నిలిచారు. పెద్ద కొడుకు కేశవ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, శివ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, కమల్ హాసన్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా, విజయ్ రతన్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి కంటి విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలమే తాము అని నలుగురు కుమారులు పేర్కొన్నారు. -
● ఆయన కష్టమే ఈ జీవితం
దుద్యాల్: మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య –మాసనమ్మ దంపతులకు కొద్దిపాటి భూమి ఉంది. దీన్ని సాగు చేసుకుంటూ మరోవైపు వీఆర్ఏ ఉద్యోగం చేస్తూ ముగ్గురు కుమారులను బాగా చదివించారు. ప్రస్తుతం వారు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు తిరుపతి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. రెండో కుమారుడు గోపాల్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా బొంరాస్పేట్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కొడుకు శ్రీనివాస్ అబ్కారీ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. నాన్న కష్టమే ఈ రోజు తాము ఉన్నతమైన జీవనం సాగిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. -
సాగు.. పిరం!
కొడంగల్: ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. అడపాదడపా వర్షాలు సైతం కురుస్తున్నాయి. దీంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ధరల పెరుగుదలపై నియంత్రణ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. వ్యవసాయం పండుగలా మారిన రాష్ట్రంలో రైతన్నలకు సాగు ఖర్చులు పెరిగి పోయాయి. పెట్టుబడి పెట్టలేక ఎరువులు కొనలేక అవస్థల పాలవుతున్నారు. విత్తనాలు వేసే క్రమంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఖర్చులు పెరిగాయి.. రైతు భరోసా పథకం కింద ఎకరాకు గత ప్రభుత్వం రూ.5 వేలు ఇచ్చేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు ఇస్తోంది. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి సుమారు 40 వేల హెక్టార్లలో రైతులు పలు రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉంది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు వాటి నాణ్యతా ప్రమాణాలను బట్టి ఒక్కో ధర ఉంది. విత్తనాల ధరలు ఎక్కువే బహిరంగ మార్కెట్లో విత్తనాల ధరలు అధికంగానే ఉన్నాయి. కిలో కంది విత్తనాల బ్యాగు రూ.250 ఉంది. జొన్నలు 3 కిలోల బస్తా రూ.550, వరి బస్తా రూ.900, పెసర విత్తనాల బస్తా రూ.800 పత్తి విత్తనాలు 475 గ్రాములకు రూ.850 పలుకుతోంది. యంత్రాలతో విత్తనం.. నియోజకవర్గంలోని రైతులు ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. గతంలో ఉన్న కూలీ రేట్లకు ఇప్పటి రేట్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడి రాకపోతే నష్టపోతున్నామని రైతులు భావిస్తున్నారు. ఆధునిక సేద్యం చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకొని యంత్రాల వినియోగంతో పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పూణే నుంచి సాగు యంత్రాలను కొనుగోలు చేసి తెస్తున్నారు. వీటితో కంది, పెసర, మినుము, కుసుమలు, జొన్న విత్తనాలు వేస్తున్నారు. రోజుకు 8 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు వేయవచ్చని రైతులు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో పంటలు పండించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా మేరకు ఈ యంత్రాలను కొనుగోలు చేసినట్లు రైతులు చెప్పారు. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు ఇదే దారిలో కూలీ రేట్లు ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ ఎరువులు విత్తనాలకు డిమాండ్ రైతు భరోసా కోసం ఎదురు చూపు ఎరువు ధర డీఏపీ రూ.1,350 కాంప్లెక్స్ రూ. 1,370 గ్రోమోర్ రూ.1,700 10.26.26 రూ.1,470 ఎమ్ఓపీ రూ.1,535 యూరియా రూ.266 ఖర్చులు పెరిగాయి గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు ఖర్చులు పెరిగాయి. కూలీల ధరలతో పాటు ఎరువులు విత్తనాల ధరలు అధికంగా ఉన్నాయి. ఎరువులు కొనడానికి రైతులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం సాగు ఖర్చుల కోసం రైతు భరోసా ఇస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతు భరోసా డబ్బులు వస్తే మేలు జరుగుతుంది. – చుక్కప్ప, కొడంగల్ -
● ‘సెవెన్ స్టార్’ బిచ్చన్న
కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన బిచ్చన్న – విజయలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. దర్జీ వృత్తి చేస్తూ పిల్లలను చదివించారు. ఆ కాలంలో ఏడుగురిని చదివించడమంటే ఆషామాషీ కాదు.. కానీ బిచ్చన్న బెదరలేదు.. పేదరికాన్ని జయించి కొడుకులను ఉన్నత స్థానంలో నిలిపారు. మొదటి కుమారుడు సత్యకుమార్ హైదరాబాద్లో పీహెచ్డీ, ఐఐసీటీ.., సౌత్ఆఫ్రికాలో పోస్టు డాక్ చేశారు. ప్రస్తుతం మస్కట్ దేశంలో యూనివర్సిటీ ఆఫ్ నిజ్వాలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ రీసర్చ్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు ప్రవీణ్కుమార్ ఐఐటీ బాంబే, ఎంఎస్సీ గణితం పూర్తి చేసి ప్రస్తుతం మస్కట్ దేశంలో హలీ బ్యాంకులో పని చేస్తున్నారు. మూడో కుమారుడు రవికుమార్ దౌల్తాబాద్ పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. నాల్గో కుమారుడు అనిల్కుమార్ మద్రాస్ ఐఐటీలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రస్తుతం కెనడియన్ కంపెనీలో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటర్ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఐదో కుమారుడు శివకుమార్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రముఖ నగల దుకాణంలో సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు. ఆరో కుమారుడు మనోజ్కుమార్ ఐఐఐటీ పూర్తి చేసి ఫీడెక్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా రాణిస్తున్నారు. ఏడో కుమారుడు నవీన్కుమార్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసి అపెక్స్ కోవంటెజ్ ఎల్ఎల్సా, యూఎస్ కంపెనీలో డాటా ప్రోగ్రామర్గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో బిచ్చన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
● తల్లిలేని లోటు తీర్చాడు..
కుల్కచర్ల: అదో మారుమూల గ్రామం.. అందులో ఒక నిరుపేద రైతు కుటుంబం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో నాన్నే సర్వంగా మారి తనను ఉన్నత స్థానంలో నిలిపాడు.. ఆయనే నాకు స్ఫూర్తి అని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ పేర్కొన్నారు. కొందుర్గు మండలం కాస్లాబాద్కు చెందిన వన్నెగూడ సత్యయ్యకు ఒక కుమారుడు. భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది.. కొడుకు రమేష్ను బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అందుకోసం ఎంతో శ్రమించారు. తండ్రి శ్రమను గుర్తించిన రమేష్ అంతే పట్టుదలతో చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించారు. తన ఎదుగుదలకు నాన్నే కారణమని, ఆయన స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పారు. రమేష్ ప్రస్తుతం కుల్కచర్ల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. నాన్న చూపిన మార్గంలోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు.