breaking news
Vikarabad
-
హెచ్ఎం వేతనంలో కోత
విధులకు ఎగనామం బషీరాబాద్: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఎక్మాయి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుప్రియ వేతనంలో అధికారులు కోత పెట్టారు. ఎవరి అనుమతి తీసుకోకుండానే బుధవారం ఆమె స్కూల్కు రాలేదు. మరో టీచర్ సౌమ్య కూడా సెలవులో ఉండడంతో పాఠశాల మూతపడింది. ఉదయమే వచ్చిన విద్యార్థులు ఆవరణలో ఆడుకుంటూ కనిపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. టీచర్లు రాలేదని చెప్పడంతో, ఫోన్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైల్వార్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటయ్య ఎక్మాయి ప్రైమరీ పాఠశాల(హరిజన్వాడ)కు చేరుకుని విచారణ జరిపారు. హెచ్ఎం సుప్రియ రాలేదని తెలుసుకున్న మరో టీచర్ సౌమ్య మధ్యాహ్నం విధులకు హాజరయ్యారు. కనీస సమాచారం ఇవ్వకుండా, విధులను నిర్లక్ష్యం చేసిన సుప్రియ వేతనంలో ఒకరోజు జీతం కోత విధించామని, ఎంఈఓ ఆదేశంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు సరిగ్గా రాకుండా తమ పిల్లల జీవితాలలో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. -
ప్రణాళికతో పనులు చేపట్టాలి
ఎంపీడీఓ శ్రీనిజ యాలాల: గ్రామాల్లో అభివృద్ధిని ప్రణాళిక(జీపీడీపీ)తో చేపట్టేలా పాలకమండలి సభ్యులకు సూచించాలని ఎంపీడీఓ శ్రీనిజ అన్నారు. బుధవారం మండల పరిషత్ సమావేశ హాలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యయం తెలిపేలా వారికి చెప్పాలన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్లకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని, ఆదాయం, వ్యయ నివేదిక, పన్ను వసూలు, భవన అనుమతులు, వ్యాపార లైసెన్సులు, పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వన నర్సరీలు, ప్లాంటేషన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జాబ్ కార్డుల పంపిణీ, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనుల గురించి సమీక్షించారు. ఎంపీఓ ఆనంద్కుమార్, ఏపీఓ జనార్దన్, ఈసీ శ్రావణ్కుమార్, టీఏ, ఎఫ్ఏ తదితరులు ఉన్నారు. -
ఇన్స్ట్రక్టర్ నియామకంపై ఫిర్యాదు
బషీరాబాద్: ప్రీ ప్రైమరీ నూతన విద్యావిధానంలో కొత్తగా నియమిస్తున్న ఇన్స్ట్రక్టర్ పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని నావంద్గీ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ బుధవారం డీఈఓ రేణుకాదేవికి విన్నవించారు. ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం కోసం గ్రామానికి చెందిన అభ్యర్థులు సంగీత, పింకీ, లక్షి, గౌరి దరఖాస్తు చేసుకున్నారని, వీరెవరికీ కాకుండా హెచ్ఎం మధు మద్దతుతో బషీరాబాద్కు చెందిన ఆర్.లక్ష్మి అనే అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. బషీరాబాద్కు చెందిన సదరు అభ్యర్థి నావంద్గీ గ్రామ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ పెట్టారని, ఆమె నియామకాన్ని రద్దు చేసి, స్థానికుల్లో అర్హులైన అభ్యర్థిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రామక్రిష్ణగౌడ్, రంగారెడ్డి, రాజేందర్రెడ్డి, కొండారెడ్డి, రమేశ్ ఉన్నారు. -
అంగన్వాడీ టీచర్లకు అండగా ఉంటాం
బషీరాబాద్: అంగన్వాడీలను నిర్వీర్యం చేసి, టీచర్ల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎప్పటికప్పుడు ఎండగడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. కర్షక, కార్మికుల పట్ల చేపట్టే వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను కాపాడుకోవడానికి టీచర్లతో కలసి పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయనను అంగన్వాడీ టీచర్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రతకల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనికాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పెరిగిన నిత్యావసరా సరకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. అంగన్వాడీ టీచర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై న బాలమణిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీచర్లు రామానుజమ్మ, వాణి, శశికళ, శోభ వసంత, రమ పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ -
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రాందాస్పల్లి రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 41 పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ ఆధ్వర్యంలో బుధవారం రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం వారు కలెక్టర్తో రైతుల సమ్యలు వివరించారు. వారందరూ చిన్న, సన్నకారులేనని వారి భూములను నిషేధిత జాబితాలో ఉంచడం బాధాకరమన్నారు. యేండ్ల తరబడి ఈ సమస్య ఉందని, రెవెన్యూ సదస్సుల్లో కూడా రైతులందరూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. వందల మంది రైతులు తమ భూములను సాగు చేసుకోలేక, అవసరాల కోసం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. కనీసం రైతుబంధు, రైతుబీమా కూడా మంజూరు కావడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ను కోరిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
తగ్గేదేలే.. తవ్వుడే!
● రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ● వాగులు, వంకలనుతోడేస్తున్న అక్రమార్కులు ● రాత్రింబవళ్లు ట్రాక్టర్లతో రవాణా ● అడ్డుపడితే దాడులకు తెగబడుతున్న వైనం ● ‘మామూలు’గా చూస్తున్న పోలీసులు బషీరాబాద్: జిల్లా సరిహద్దు మండలమైన బషీరాబాద్లో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నెల రోజులుగా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు జారీ చేయకపోవడంతో వీరి పంట పండుతోంది. కాగ్నానదితో పాటు ఎక్మాయి పెద్దవాగు, చిన్నవాగు వాడుకల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. వీరిని నిలువరించాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్మాయి అడ్డాగా దందా.. మండలంలోని కాగ్నానది పరివాహక గ్రామాలైన మంతట్టి, రెడ్డిఘణాపూర్, కంసాల్పల్లి(ఎం), జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్, నావంద్గీ. ఇందర్చెడ్లో ఇసుక తోడేస్తున్నారు. వీరికి ఎక్మాయి గ్రామం అడ్డాగా మారింది. ఇక్కడ సుమారు 20 మంది ట్రాక్టర్ల యజమానులు ముఠాగా ఏర్పడి పెద్దవాగును లూటీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు నిలిపేయడంతో గ్రామాల్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా నిత్యం ఇసుక తోడి.. ఎక్మాయి, మైల్వార్, కంసాన్పల్లి, నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్, బషీరాబాద్, మంతన్గౌడ్, ఇందర్చెడ్ గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా పోలీసుల సహకారంతోనే సాగుతోందనే ఆరోపణలున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, సర్కారు ఖజానాకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. అడ్డుకుంటే అంతే.. ● రాత్రివేళల్లో ఓవర్ స్పీడ్తో తరలివెళ్లే ఇసుక ట్రాక్టర్లను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే, వారిపైకి ఎక్కించేందుకు కూడా వెనకాడటం లేదు. ● గతంలో ఇందర్చెడ్ వద్ద ఇసుక ట్రాక్టర్ను ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ పైకి తీసుకెళ్లడంతో అతని కాలు విరిగింది. ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ను అరెస్టు చేశారు. ● రెండు నెలల క్రితం నంద్యానాయక్తండా వద్ద ఇసుక ట్రాక్టర్ను అడ్డుకోబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లపైకి వాహనం దూసుకెళ్లింది. రెప్పపాటులో అప్రమత్తమైన పోలీసులు పక్కకు దూకడంతో ప్రాణాపాయమే తప్పింది. ● కొద్ది రోజుల క్రితం కంసాన్పల్లిలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఇద్దరు రైతులపై దాడి చేయగా, వారు తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే రైతులై తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● ఎక్మాయి గ్రామానికి చెందిన మోహన్ రెరండు రోజుల క్రితం ట్రాక్టర్ ద్వారా ఎక్మాయి వాగు నుంచి మైల్వార్కు ఇసుక రవాణా చేశాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. బేరం కుదరడంతో ట్రాక్టర్ను వదిలేశారు. కానీ, వెనకాలే వస్తున్న మీడియా ప్రతినిధులను గమనించి, డ్రైవర్ను అప్రమత్తం చేశారు. వారి సూచన మేరకు ఇసుకను రోడ్డు పక్కనే పారబోసిన డ్రైవర్.. పోలీసులకు దొరకుండా ట్రాక్టర్తో ఉడాయించినట్లు కలరింగ్ ఇచ్చాడు. ముఠాగా ఏర్పడిన ఇసుక తోడేళ్లు ముఠాగా ఏర్పడిన ఇసుక అక్రమ వ్యాపారులు మండలంలో ఇసుక ఉన్న చోట గద్దల్లా వాలిపోతున్నారు. ఎక్మాయి గ్రామానికి చెందిన సుంకరి రమేశ్, జీడి శ్యామప్ప, ఎరుకలి ఆనంద్, మహిమూద్, నాదీర్గా మోహన్, పాండు(నావంద్గీ), బషీరాబాద్కు చెందిన జమీల్, బాలేసాబ్ తదితరులు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇటీవలి కాలంలో వీరిపై ఆరోపణలు, ఫిర్యాదులు పెరిగాయని, వీరి కదలికపై నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వీరి కనుసన్నల్లో ఇసుక రవాణా చేస్తున్న ఎంతో మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. దొరికిన వారిని జరిమానా కోసం తహసీల్దార్ వద్దకు పంపిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. డీడీ రూపంలో రూ.5 వేల ఫైన్ చెల్లిస్తున్న అక్రమార్కులు మరుసటి రోజునుంచే దందా కొనసాగిస్తున్నారు. ప్రత్యేక నిఘా పెట్టాం అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న పలు ట్రాక్టర్లను సీజ్ చేశాం. ఇసుక తరలిస్తున్నారంటూ పలు గ్రామాల నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయి. కాగ్నా, పెద్దవాగు, రోడ్ల కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాం. సీసీ కెమెరాల ద్వారా ట్రాక్టర్లను గుర్తించి కేసులు పెడుతాం. అక్రమ రవాణాపై 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. ఇటీవల గోనూర్ వద్ద ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఓ యువకుడు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అలా చేస్తే చర్యలు తప్పవు. – ప్రవీణ్కుమార్రెడ్డి, సీఐ, తాండూరు రూరల్ -
నాడు ఆదరణ.. నేడు కనుమరుగు
● కానరాని గ్రీటింగ్ కార్డుల జాడ ● సామాజిక మాధ్యమే వేదికగా శుభాకాంక్షలు దుద్యాల్: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం మన ఆనవాయితీ. అలాగే పండుగలు, వివాహ వార్షికోత్సవాలు, ప్రేమికుల రోజు ఇలా రకరాల ప్రత్యేక రోజుల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేవారు. అయితే ఇందులో గతంలో గ్రీటింగ్ కార్డులు ముఖ్య పాత్ర పోషించేవి. అందమైన కార్డులను సేకరించి, నచ్చిన సందేశాలను అక్షర రూపంలో పొందుపరచి, కవర్లో పెట్టి, పోస్టుద్వారా సన్నిహితులకు పంపేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు.. క్రమేనా అవి కనుమరుగయ్యాయి. అంతా ఆన్లైన్ మయం కావడంతో వాటి గురించి మాట్లాడే వారే లేరు. సాంకేతికతను అందిపుచ్చుకొని, సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు, అభినందనలను తెలుపుకొంటున్నారు. -
మాటతప్పం.. హామీలు నెరవేరుస్తాం
● తొలుత తాగునీటి సమస్యపై దృష్టి ● అనంతరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం: సర్పంచులు‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. మాట తప్పకుండా విడతల వారీగా అమలు చేసాం’ అని సర్పంచులు అన్నారు. బుధవారం నూతన పాలకవర్గ సభ్యులు వారివారి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతగిరి: గ్రామస్తుల సహకారంతో ఊరును అభివృద్ధి చేస్తానని బురాన్పల్లి సర్పంచ్ రాందాస్ నాయక్ అన్నారు. గ్రామంలో బోర్కు కొత్త మోటారు బిగించడంతో పాటు పలు చోట్ల విద్యుత్ దీపాలను అమర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత తాగునీటి సమస్య తీర్చానని చెప్పారు. క్రమంగా విద్యుత్ దీపాలు, శానిటేషన్పై దృష్టి సారిస్తాని తెలిపారు. రానున్న ఐదేళ్లలో హామీలన్ని నెరవేర్చుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అభిషేక్ తివారీ, కార్యదర్శి స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోర్లకు మరమ్మతు ధారూరు: మరమ్మతులకు గురైన బోర్లను పీసీఎంతండా సర్పంచ్ బాలునాయక్ వినియోగంలోకి తెచ్చారు. బుధవారం మూడు బోర్లకు మరమ్మతు చేయించి, నీటి సమస్య తీర్చానని ఆయన తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. పిచ్చిమొక్కల తొలగింపు కుల్కచర్ల: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయరాదని కుస్మసముద్రం సర్పంచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. గ్రామశివారులో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను బుధవారం తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తామన్నారు. గ్రామాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు మొక్కలను విరివిగా పెంచడంతో పాటు, మురుగుకాల్వలు శుభ్రంగా ఉండేలా చూస్తామని చెప్పారు. లక్ష్మయ్య, మల్లేశ్ ఉన్నారు. -
గిరిజన తండాల అభివృద్ధికి కృషి
డీసీసీ ఉపాధ్యక్షుడు బీంరెడ్డి కుల్కచర్ల: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు బీంరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధి దీప్లానాయక్తండాలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తండాకు మొదటి సర్పంచిగా ఎన్నికై న అంజలి చరిత్రలో నిలిచిపోనున్నారని పేర్కొన్నారు. తండాల అభివృద్ధికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అనంతరం అంజలితో ప్రత్యేకపూజలు, చేయించి, సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, నాయకులు రవి, భరత్, దేవుజానాయక్, సువ్వాలిబాయి, రవీందర్, శ్రీనివాస్, భరత్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా!
●ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ●గ్రామాల్లో సర్పంచ్ల రాకతో సమస్యల పరిష్కారంపై ఆశలు ●ఈ ఏడాది లక్ష్యాల సాధనపై ప్రజాప్రతినిధుల గురినూతన ఏడాది సరి కొత్త పనులకు ప్రణాళిక వికారాబాద్: నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం రాత్రి ‘డిసెంబర్ 31’కు ఘనంగా వీడ్కోలు పలికి అంతే ఘనంగా 2026 కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. మొదటి రోజు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన నలుగులు ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఒకరు సీఎంగా, మరొకరు సభాపతిగా ఉన్నారు. నూతనంగా 594 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఎన్నికై ఇటీవల కొలువుదీరారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆసక్తితో పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో తమ సమస్యలు తీరనున్నాయని ఆశగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఏడాది శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సరంలో నిర్వహించబోయే ప్రాధాన్యతా అంశాలను ఉన్నతాధికారులు, స్పీకర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. దేవాలయాల వద్ద ఏర్పాట్లు కొత్త ఏడాది అంతా మంచే జరగాలని కోరుతూ.. ప్రజలు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించే అవకాశం ఉండడంతో జిల్లాలోని అన్నిచోట్ల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అనంతగిరి అనంత పద్మనాభస్వామి ఆలయం, బుగ్గరామేశ్వర, పీరంపల్లి పరమేశ్వరగుట్ట ఆలయాల వద్ద నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు. పూడూరు మండలంలోని దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం, కుల్కచర్ల మండలంలోని పాంబండ దేవాలయం, దోమలోని మైలారం వేంకటేశ్వర ఆలయం, పరిగిలోని వేంకటేశ్వర, నర్సింహాస్వామి, శివాలయం, పరిగి మండల పరిధిలోని లొంకహనుమాన్ దేవాలయం, కొడంగల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పోలెపల్లి ఎల్లమ్మ ఆలయం, తాండూరు నియోజకవర్గ పరిధిలోని భూకై లాస్, నీల్లపల్లి శివాలయం, నవాబుపేట మండలం ఎల్లకొండ శివాలయం తదితర ఆలయాలు మొదటి రోజున భక్తులతో కిటకిటలాడనున్నాయి. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. గతేడాది విజయాలు, లోటుపాట్లను సరిదిద్దుకొని ఈ 2026 సంవత్సరం ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ప్రగతి పథంలో ముందుకు సాగాలి. ఉమ్మడి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – పట్నం మహేందర్రెడ్డి, మండలి చీఫ్ విప్ ముందుగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాదిలో ఎప్పుడు లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కోట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి అభివృద్ధి పనులు పూర్తి చేయటం, మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. – గడ్డం ప్రసాద్కుమార్, శాసనసభాపతి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వ ప్రాథమ్యాలను ముందుకు తీసుకెళ్తాం. ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తాం. యంత్రాంగానికి తగు సూచనలు చేసి సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తాం. కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనాపరంగా, ప్రభుత్వ తరఫున అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. అందరి సహకారంతో జీపీ ఎన్నికలు సాఫీగా నిర్వహించాం. – ప్రతీక్జైన్, కలెక్టర్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు సాగుతాం. చట్టాన్ని గౌరవించే వారిని పోలీసులు ఎప్పుడు గౌరవిస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం. ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. పోలీసుల పరంగా ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో వాటిని నెరవేరుస్తాం. – స్నేహమెహ్ర, ఎస్పీ పరిగి ప్రాంత ప్రజలకు సాగు నీరు అందించే లక్ష్యంగా పని చేస్తా. కొత్త సంవత్సరంలో కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూ సేకరణ ప్రారంభిస్తాం. పరిగి నుంచి షాద్నగర్, వికారాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. నియోజకవర్గ ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఏటీసీ సెంటర్ను ప్రారంభిస్తాం. – రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి నియోజకవర్గంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలి. కోట్పల్లి ప్రాజెక్టు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన బైపాస్ రోడ్డు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. వాటర్ ట్యాంక్లను వేగంగా పూర్తి చేయించడంతో పాటు పాత తాండూరులోని కాగ్నా నది పంప్హౌస్ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గ్రామాల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటా. – మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు -
నేడు మహాద్వార దర్శనం
● చిలుకూరుకు తరలిరానున్న భక్తజనం ● భారీగా ఏర్పాటు చేస్తున్న అర్చకులు, పోలీసులు మొయినాబాద్: నూతన సంవత్సరం మొదటి రోజు గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 1న సుమారు లక్షకు పైగా భక్తులు బాలాజీని దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అర్చకులు, పోలీస్ శాఖ తగిన ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్, భక్తుల క్యూలైన్లుకు సంబంధించి తగిన ఏర్పాటు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ఆలయ సమీసానికి వచ్చేలా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలయ ప్రాంగణంతోపాటు బయట భక్తుల క్యూలైన్ల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనానికి నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ మహాద్వార దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారు జామున 4గంటల నుంచే భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు. 22 ఎకరాల్లో పార్కింగ్ చిలుకూరుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా వాహనాల పార్కింగ్కు అనువైన స్థలాలను గుర్తించారు. ఆలయ అర్చకులు, పోలీసులు కలిసి ఆలయ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి అందులో వాహనాలు పార్కింగ్ చేసేందుకు చదును చేయించారు. ఆలయం సమీపంలో సుమారు 22 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అదనపు సర్వీసులు నూతన సంవత్సరం మొదటి రోజు చిలుకూరు బాలాజీ ఆలయానికి టీజీఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజు మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి 12 బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతీ 12 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. గురువారం అదనంగా మరో పది బస్సులను 50 ట్రిప్పులు నడుపుతామని మెహదీపట్నం డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. భారీ బందోబస్తు చిలుకూరు బాలాజీ ఆలయానికి గురువారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వంద మంది పోలీసులతోపాటు మరో వంద మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు జనవరి 1న చిలుకూరు బాలాజీని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. మహా ప్రదక్షిణలు ఉండవు. భక్తులు నాలుగు వరసల్లో మహాద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. –రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు -
ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
మహేశ్వరం: వచ్చే ప్రాదేశిక ఎన్నికల్లో మహేశ్వరంలో గులబీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ సర్పంచ్ పోతుల మల్లమ్మ, పాలకవర్గ సభ్యులు నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా బీఆర్ఎస్ మద్దతుదారులనే గెలిపించారన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్లు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్, వార్డు సభ్యులను ఆమె సన్మానించి అభినందించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
ముగిసిన పత్రీజీ ధ్యాన మహాయాగం
కడ్తాల్: మండల కేంద్ర సమీపంలోని కై లాసపురి మహేశ్వర మహాపిరమిడ్ క్షేత్రంలో పదకొండు రోజుల పాటు కొనసాగిన పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గురుమాత స్వర్ణమాల పత్రి ప్రసంగిస్తూ.. పత్రీజీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ధ్యాన సంబురాలను విజయవంతం చేసిన ప్రతీ పిరమిడ్ మాస్టర్కు, ధ్యానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధ్యానులందరికి నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 డిసెంబర్లో పత్రీజీ మౌన ధ్యాన మహాయాగం మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం పిరమిడ్ ట్రస్ట్ సభ్యులను, ధ్యాన గురువులను, మాస్టర్లను, సంగీత విధ్వాంసులను, కళాకారులను, ట్రస్ట్ చైర్మన్, సభ్యులతో పాటు పరిణిత పత్రి ఘనంగా సన్మానించారు. సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దాట్ల హన్మంతరాజు, సభ్యులు దామోదర్రెడ్డి, శ్రీరాంగోపాల్ హనుమంతరావు, మాధవి, లక్ష్మి, నిర్మల, బాలకృష్ణ, సాగర్, శివప్రసాద్ ఉన్నారు. ఈ ఏడాది మౌనధ్యాన మహాయాగం -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
దోమ: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజేశ్వరి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని దిర్సంపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని డీఎస్ఓ సుదర్శన్తో కలిసి ఆమె సందర్శించి ధాన్యం తేమను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైన రైతులకు గొనే సంచులు ఇచ్చి అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. తేమ శాతం సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతుల ధాన్యాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేసి వెంటనే బిల్లులు వేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజేశ్వరి -
శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ప్రసాద్కుమార్
విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తెండి కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టరేట్కు వచ్చే వారు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకరావద్దని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వాటి స్థానంలో పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు ఇతర సామగ్రి ఇవ్వాలన్నారు. చలికాలం కావడంతో దుప్పట్లు ఇస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి దోమ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండలం బొంపల్లి తండాలో భవానీ మాత ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల వెంకట నాగిరెడ్డి, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బొంపల్లి తండా సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములు, నేతలు సంగయ్య, వెంకటయ్య, మాన్యనాయక్, హరి తదితరులు పాల్గొన్నారు. నేరాలను నియంత్రిద్దాం కర్ణాటక రాష్ట్రం కలుబుర్గి ఎస్పీ శ్రీనివాస్ తాండూరు రూరల్: నేరాల నియంత్రణకు కలిసి పనిచేద్దామని కర్ణాటక రాష్ట్రం కలుబుర్గి ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ – కర్ణాటక సరిహద్దు పోలీసుల సమావేశం చించోళి తాలూకా కర్చకాలం సమీపంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతే అంతిమ లక్ష్యం రైల్వే ఎస్పీ చందనాదీప్తి అనంతగిరి: రైల్వేలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనాదీప్తి అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్లోని రైల్వే పోలీస్స్టేషన్ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతే అంతిమ లక్ష్యం కావాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి తరలించడానికి అక్రమార్కులు రైళ్లను ఎంచుకుంటున్నారని ఈ విషయంలో ఆర్పీఎఫ్, ఎకై ్సజ్ శాఖ అధికారులతో కోఆర్డినేషన్తో పనిచేసి వాటి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కుల్కచర్ల: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం కుల్కచర్ల మార్కెట్ యార్డులో రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పాంబండ ఆలయ చైర్మన్ మైపాల్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కనకం మొగులయ్య, చౌడాపూర్ మండల అధ్యక్షుడు ఎల్పాటి అశోక్కుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయంలో పీఆర్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ అబీబ్ అహ్మద్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మండల అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బస్వరాజు, గౌరవ అధ్యక్షుడే నర్సింలు, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, ఉపాధ్యాయ సంఘం నాయకులు వెంకటయ్య, కృష్ణయ్య, ఆనంద్, మహేష్, తిరుపతిరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వో ప్లాంట్ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే టీఆర్ఆర్ తదితరులు -
హానికర ఫ్యాక్టరీలు మాకొద్దు
మోమిన్పేట: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఏ ఫ్యాక్టరీ మాకొద్దని ప్రజలు ముక్త కంఠంతో పేర్కొ న్నారు. మంగళవారం మోమిన్పేటలో సువీర బయో ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సుధీర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు మాట్లాడారు. పరిశ్రమలో ఉత్పత్తయ్యే ఇథనాల్తో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని పేర్కొన్నారు. క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందన్నారు. ఇలాంటి పరిశ్రమలతో రైతులు, నిరుద్యోగులకు ప్రయోజనం లేదన్నారు. తమను కాదని ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజలకు ఉపాధినిచ్చే పరిశ్రమలు నెలకొల్పితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజలకు ఇష్టం లేనప్పుడు తాము పరిశ్రమను ఏర్పాటు చేయబోమని ఫ్యాక్టరీ డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రక్షణకు పటిష్ట చట్టాలు
అనంతగిరి: మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించేలా చేయడం.. పని ప్రదేశంలో భద్రత, న్యాయం అందించడం కోసం ప్రభుత్వం ఈ చట్టం రూపొందించిందన్నారు. పది లేక అంతకన్నా ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు . యూరియా కొరత లేదు జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ప్రతీక్ జై న్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4,026 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నా రు. డీలర్ల వద్ద 1,432 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల వద్ద 342 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ గోదాముల్లో 2,252 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందని తెలిపారు. జనవరి మాసానికి గాను 1,922 మెట్రి టన్నుల యూరియా అవసరమని, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిప్పారు. సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 75 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్ఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలతో మమేకమవ్వండి
ధారూరు/బంట్వారం: ప్రజలతో మమేకం కావడంతోపాటు మర్యాదగా మెలగాలని ఎస్పీ స్నేహ మెహ్ర పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ధారూరు సీఐ, ఎస్ఐ కార్యాలయాలు, కోట్పల్లి, బంట్వారం పోలీస్స్టేషన్లనుసందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. కేసులను పెండింగ్లో ఉంచరాదన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఉంచాలని తెలిపారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో సీఐ రఘురామ్, బంట్వారం, కోట్పల్లి ఎస్ఐలు విమల, ఎం.శైలజ పాల్గొన్నారు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు అనంతగిరి: సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున గాలి పటాలు ఎగురవేస్తుంటాని, ఇందు కోసం చైనా మాంజాను ఉపయోగించరాదని ఎస్పీ స్నేహ మెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందన్నారు. దీన్ని వాడటం వల్ల ద్విచక్ర వాహనదారులకు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందన్నారు. ఎవరైనా ఈ మాంజాను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గాలి పటాలు విక్రయించే దుకాణాలపై నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా చైన మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
యూరియా విక్రయంపై ప్రత్యేక నిఘా
అదనపు కలెక్టర్ సుధీర్ అనంతగిరి: జిల్లాలో యూరియా విక్రయంపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎలాంటి అవకతవకలు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. సోమవారం నగరం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో యూరియా నిల్వలు, విక్రయాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. సాగుకు సరిపడా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఉద్యానవన అధికారి సత్తార్, డీసీఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
కొడంగల్ రూరల్: వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకొని పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పురోహితులు, ధర్మకర్తలు తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు వాయి ధ్యం, 5గంటలకు సుప్రభాత సేవ, 5.30గంటలకు శ్రీమాన్ ధరూరి శ్రీనివాసాచార్యుల వారిచే తిరుప్పావై పారాయణం, ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణార్థం యోగనిద్ర నుంచి మేల్కొనే పవిత్ర దినమే వైకుంఠ ఏకాదశిగా పురాణహితోక్తి అని, ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకునే పవిత్రమైన రోజును ముక్కోటి ఏకాదశిగా నామకరణం చేశారని తెలిపారు. తిరుపతి శ్రీరంగాధి దివ్యక్షేత్రాల్లో వైకుంఠ ద్వార దర్శన ఉత్సవం జరుపుకొంటారని, ఇదే సంప్రదాయాన్ని కొడంగల్ ఆలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల పెద్ద సంఖ్యలో వచ్చే అవకావం ఉండటంతో అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. -
పురోగమనం
జిల్లాలో వేగం పుంజుకున్న అభివృద్ధి పనులువికారాబాద్: జిల్లా అభివృద్ధి దిశగా సాగుతోంది. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, కళాశాలలు, పారిశ్రామిక వాడ, ఇతర మరమ్మతు పనులకు నిధులు మంజూరు కావడంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పట్టాలెక్కుతోంది. వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు జరగ్గా, మరి కొన్ని ప్రారంభోత్సవాలను నోచుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలు జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధికి నిధుల వరద పారింది. కడా (కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసి రూ.వేల కోట్లు విడుదల చేశారు. అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 594 గ్రామ పంచాయతీలను కలుపుతూ వుడా(వికారాబాద్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసి ఏడాది కాస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పురపాలికలు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఒక్కో మున్సిపల్కు రూ.15కోట్ల నుంచి రూ.20 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ పనులు శంకుస్థాపన దశలోనే ఆగిపోయాయి. జిల్లాలో అంతర్గత రోడ్లు, బ్రిడ్జీలు అధ్వానంగా మారాయి. వీటి మరమ్మతులకు నిధులు కేటాయించాలనే డిమాండ్ ఉంది. సీఎం సొంత నియోజకవర్గంలో.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు విడుదల చేశారు. రోడ్లు, భవనాలు, విద్య, వైద్యం, ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడ, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్లు కేటాయించారు. దుద్యాల్ మండలంలో మల్టీ పర్పస్ ఇండ్రస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పరిగి నియోజకవర్గం పూడూరులో నేవీ రాడార్ స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రానికి ఆనుకుని వెళ్లేలా ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు డిజైన్ చేయడం, ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 14 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 12వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. చాలా చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవంటూ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించలేదు. రోడ్లకు భారీగా నిధులు కొడంగల్కు నిధుల వరద మిగిలిన మూడు నియోజకవర్గాల్లో.. -
మైనింగ్ పాలసీలో మార్పులు చేయాలి
అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: కొత్త మైనింగ్ పాలసీలో మార్పులు చేయకపోతే తాండూరు ప్రాంత నాపరాతి వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారని ఎమ్మె ల్యే మనోహర్రెడ్డి అన్నారు.సోమవారం అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం రావడంతో నియోజవకర్గంలోని పలు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. తాండూరు నాపరాయి షాబాద్ స్టోన్గా ఎంతో ప్రసి ద్ధి చెందిందని, ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. కొత్త మైనింగ్ పాలసీతో చిన్నచిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాయల్టీ అధికంగా ఉండటం, విద్యుత్ బిల్లులు పెంచడంతో పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు నాపరాతితో కట్టుకునేందుకు ప్రత్యేక జీఓ జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే తరహాలో ప్రత్యేక జీఓ తెస్తే గని కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. తాండూరు మున్సిపాలిటీ ది నదినాభివృద్ధి చెందుతున్నందున తాగునీటి అవసరాల కోసం కొత్త పంప్హౌస్,పైప్లైన్ ఏర్పాటు చే యాల్సి ఉందన్నారు. ఇందుకోసం రూ.40 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. భూ నిర్వాసితులకు రూ.30 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండటంతో బైపాస్ రోడ్డు పనులు ఆగిపోయాయని వెంటనే చర్యలు చేపట్టాలని ఆయా శాఖల మంత్రులను కోరారు. తాను సభ దృష్టికి తెచ్చిన అంశాలను సంబంధిత శాఖల మంత్రులు రికార్డు చేసుకున్నట్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. తాండూరు నాపరాయి పరిశ్రమపై ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంపై క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, స్టోన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నయిం కృతజ్ఞతలు తెలిపారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే టీఆర్ఆర్ పరిగి: టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. టెట్ పరీక్ష లేని సమయంలో ఉపాధ్యాయ పరీక్ష రాసి విధుల్లో చేరానని తెలిపారు. ఇప్పుడు అన్ని రకాల సబ్జెక్ట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత కావాలని ఎన్సీఆర్టీ చెప్పడంతో ఉపాధ్యాయులకు సమస్యగా మారిందని సభ దృష్టికి తెచ్చారు. టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. -
మతసామరస్య పరిమళం
కొత్తూరు: పెంజర్లలో స్వయంభువుగా వెలిసిన శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. సుమారు 800 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఆలయాన్ని దాతల సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. కొత్తూ రు జాతీయ రహదారి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోలు, జీపులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ముల్నర్వలో వెలిసిన జహంగీర్ పీర్ దర్గా రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచింది. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. -
విండ్ పవర్.. బోటింగ్
పరిగి: మండలంలోని లక్నాపూర్ ప్రాజెక్టు, విండ్ పవర్(పవన విద్యుత్) పాంట్లు, కాళ్లాపూర్ సమీపంలోని లొంక పుణ్యక్షేత్రం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సెలవు రోజులు, వారాంతంలో నగరవాసులు ఇక్కడ విడిదికి వస్తుంటారు. లొంక సప్తముఖి ఆంజనేయస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ మీదుగా పరిగికి చేరుకుని వీటిని చేరుకోవచ్చు. కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్లలో ఏకఽశిలపై వెలిసి పాంబండ రామలింగేశ్వరస్వామి భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాడు. -
ధాన్యం తూకంలో మోసం
● బస్తాకు మూడు కిలోలు అదనం ● నిర్వాహకుల ఇష్టారాజ్యం ● ఆందోళనలో రైతులు ధారూరు: ధాన్యం విక్రయించేందుకు సోమవారం రైతులు గురుదోట్ల కొనుగోలు కేంద్రానికి వచ్చారు. ఒక్కో బస్తాను 40 కిలోల 600 గ్రాముల చొప్పున తూకం వేయాల్సిన నిర్వాహకులు.. ఏకంగా 43 కిలోల తూకం వేశారు. ఇదేమని ప్రశ్నించిన రైతులకు.. నిర్వాహాకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మిల్లర్లకు నిర్ణీత బియ్యం రావటం లేదట. అదనంగా 3 కిలోల ధాన్యం ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే లారీని వెనక్కి పంపిస్తా’ అని మిల్లర్లు చెబుతున్నారని అక్కడి ఇచ్చార్జి చెప్పారు. దీంతో ఏం చేయాలో తోచక.. మోసాన్ని చూస్తూ మౌనం వహించడం వారి వంతయింది. ఈ సందర్భంగా కొందరు అన్నదాతలు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో ఇలా అదనంగా తూకం వేస్తూ దగా చేస్తున్నారని వాపోయారు. మిల్లర్లతో కేంద్రం నిర్వాహకులు చేతులు కలిపి, మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, మోసాన్ని అరికట్టాలని కోరుతున్నారు. -
ఆధ్యాత్మికం.. పర్యాటకం
తాండూరు: దివ్య క్షేత్రాలకు నిలయం తాండూరు ప్రాంతం. కాగ్నానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున శివాలయాలు వెలిశాయి. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పట్టణంలోని భావిగి భద్రేశ్వరాలయం, జుంటుపల్లిలోని రామచంద్రస్వామి దేవాలయం, నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన రామలింగేశ్వరాలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు, పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలసిన ఏకాంబర రామలింగేశ్వరాలయం అన్ని మతాల వారికి ఆదర్శంగా నిలిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. ఇక్కడి పుష్కరిణి మధ్యలో రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. దీనికి పక్కనే యాకూబ్సాబ్ దర్గాలున్నాయి. -
పుణ్యక్షేత్రమైన పులిలొంక!
మోమిన్పేట: ఒకప్పుడు పులులు సంచరించే ప్రాంతం.. ప్రస్తుతం ఆధ్యాత్మిక క్షేత్రమై విరాజిల్లుతోంది. 60ఏళ్ల క్రితం వరకు ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఓ మేకల కాపరి, నిత్యం తన మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఈక్రమంలో 20 ఏళ్ల పాటు ఒంటరిగా శ్రమించి ఓ గుట్టను గుహగా మలిచాడు. సుమారు 20 మీటర్ల పొడవు, 4మీటర్ల వెడల్పుతో గుహను తీర్చిదిద్ది లోపల వేంకటేశ్వరస్వామి విగ్రహం, గుహ ప్రారంభంలో లక్ష్మీనారసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో పులి లొంక.. పుణ్యక్షేత్రమైంది. మేకల కాపరి పర్మయ్య.. పరమదాసుగా మారాడు. చుట్టూ ఎతైన గుట్టలు, దట్టమైన అడవి, ఆహ్లాదమైన ప్రదేశం, పచ్చని చెట్లు, చల్లని గాలులతో ఇక్కడి వాతావరణం భక్తుల మనసులను కట్టిపడేస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి గుడి, శివాలయం, గుహలో వేంకటేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మార్గం ఇలా.. హైదరాబాద్ నుంచి 68 కిలోమీటర్లు, మోమిన్పేటకు 9కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే మార్గంలో, వెల్చాల్ బస్టాండు వద్ద బస్సు దిగి, 2కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఆటోల్లో చేరుకోవచ్చు. ప్రతీ 20 నిమిషాలకు ఓ బస్సు ఉంటుంది. వికారాబాద్, జహీరాబాద్ నుంచి రైలు సదుపాయం ఉంది. వెల్చాల్ సమీపంలో సదాశివపేట రోడ్డు స్టేషన్లో రైలు దిగితే ఆటోలో వెళ్లవచ్చు. -
కొడంగల్లో ‘పేదల తిరుపతి’
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పేదల తిరుపతిగా పేరు గాంచింది. ఇక్కడ తిరుమల తరహాలో ఉత్సవాలు, నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారికి చేసే వాహన సేవలు, గరుడోత్సవం, లంకా దహనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే రెండేళ్లకోసారి పవిత్రోత్సవాలు జరుగుతాయి. స్థానిక ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో ఈఆలయాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.110 కోట్లు మంజూరు చేశారు. వైకుంఠ ఏకాదశి, ఇంగ్లిష్ నూతన సంవత్సరం నేపథ్యంలో భక్తులకు భారీగా తరలివస్తారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. విశేష అలంకరణలో శ్రీవారి మూలమూర్తి -
కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం తగదు
అనంతగిరి: కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, రోహిత్రెడ్డి మండిపడ్డారు. ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. సోమవారం పార్టీ నాయకులతో కలసి ఎస్పీ స్నేహమెహ్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గతంలో ఇలాంటివి జరగలేదన్నారు. కొందరు పోలీసులు ఆ పార్టీ నాయకులకు అండగా ఉన్నారని, అందుకే వారు ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట చెరువు కబ్జాకు కొందరు పాల్పడుతున్నారని, తగిన ఆధారాలతో బయటపెడతామని పేర్కొన్నారు. పోలీసులు అందరినీ సమాన దృష్టితో చూడాలని సూచించారు. ఇందులో బీఆర్ఎస్ కోట్పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్, మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ అనంత్రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్రెడ్డి -
అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం
మంచాల: ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రంగా వెలుగొందిన జాపాల్– రంగాపూర్ నక్షత్రశాల నగరానికి కూత వేటు దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది ఉస్మానియా యూనివర్సీ టికి అనుబంధంగా పని చేస్తోంది. 1963లో ఆస్ట్రానమీ డైరెక్టర్ కేడీ అభయాంకర్ సూచన మేరకు, కాలుష్యానికి దూరంగా నగరానికి 51 కిలోమీటర్ల దూరంలో, జాపాల్– రంగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎత్తై న ప్రదేశంలో దీన్ని నిర్మించారు. 220 ఎకరాల్లో విస్తరించిన ఉన్న పరిశోధన కేంద్రం 1968లో అందుబాటులోకి వచ్చింది. 1980 ఫిబ్రవరి16న స్కైలాబ్ను ఇక్కడ నుంచే పరిశీలన చేశారు. 1986 ఫిబ్రవరి 9న హేలీ తోక చుక్కలు, ఇతర పాలపుంత లను ఇక్కడి నుంచే గమనించారు. 1994 జూన్16 నుంచి 21 వర కు వేర్వేరు తోక చుక్కలు, బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టిన చిత్రాలు, గ్రహాలపై ఏర్పడిన మచ్చల ఛాయాచిత్రాలను కూడా ఇక్కడి నుంచే తీశారు. -
బైక్ ఢీ, ఒకరి మృతి
పరిగి: బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చేకూరి సుభానయ్య(42) ఆటో నడుపుకొంటూ జీవనం కొనసాగించేవాడు. రోజులాగే పత్తిలోడుతో గ్రామం నుంచి మార్కెట్ వచ్చాడు. అన్లోడ్ అనంతరం.. ఆటోను స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి, కిరాయి తీసుకునేందుకు రోడ్డు దాడుతుండగా.. బస్టాండ్ నుంచి హైదారాబాద్ వైపు వెళ్తున్న టీఎస్34కె 2552 నంబరు గల బైక్ అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడంతో.. క్షతగాత్రున్ని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నగరానికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు, కూతురు ఉంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
‘లోకల్’ పర్యాటకం!
నూతన సంవత్సర వేడుకలను సరదాగా జరుపుకొనేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టి రావాలని భావిస్తున్నారు. కొద్దిపాటి సమయం, తక్కువ ఖర్చుతో.. మనచెంతే ఆహ్లాదం పొందగలిగే జిల్లాలోని టూరిజం స్పాట్లపై ఓ లుక్కేద్దామా.. వికారాబాద్: జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో అనంతగిరి గుట్ట, ఫారెస్ట్ ఉంది. ఇక్కడ భారీ హనుమాన్ విగ్రహం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, కోనేరుతో పాటు చుట్టు పక్కల రిసార్టులు ఉన్నాయి. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలతో చూపరులను కట్టిపడేస్తుంది. గుట్టపై చారిత్రక అనంత పద్మనాభస్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ ట్రెక్కింగ్ స్పాట్లు, వందలాది రకాల పక్షులు మనసుకు హాయిగొల్పుగాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన కార్టేజీలు, పక్కనే బుగ్గ రామేశ్వరాలయం ఉన్నాయి. ధారూరు మండల పరిధిలోని కో ట్పల్లి ప్రాజెక్టులో, అనంతగిరి సమీపంలోని సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వికారాబాద్ అనంతగిరి కొండలు మనచెంతే ఆహ్లాదం టూరిజం అభివృద్ధి దిశగా అడుగులు రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకులు ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు ఆరుట్లలో ‘దక్షిణ కాశీ’ మంచాల: రాచకొండ రాజుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడం శ్రీబుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం. రేచర్ల పద్మనాయక వంశస్తులైన సింగ భూపాలుడి కాలంలో, మంచాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలో దీన్ని నిర్మించారు. రాచకొండ గుట్టలను అనుసరించి ఊరికి దూరంగా పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం ఉంది. ఇక్కడ తూర్పునుంచి పడమర వైపు నీరు ప్రవహిస్తూ దక్షిణం వైపు వెళ్లిపుతుంది. దీంతో ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు.పోలేపల్లిలో.. ఎల్లమ్మతల్లి కొడంగల్: దుద్యాల మండలం పోలెపల్లిలో స్వయంభువుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం పర్యాటకులు, భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.పచ్చని పంట పొలాల మధ్య వెలిసిన అమ్మవారి కనువిందు చేస్తుంది. ఇక్కడ నిర్వహించే పెద్దజాతర ఈప్రాంతంలోనే అతిపెద్ద వేడుక. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. యాటలు.. కోళ్లతో మొక్కులు సమర్పించుకుని, విందు చేసుకుంటారు. ఇక్కడ నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవం సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. -
నిబంధనలు పాటించాలి
అనంతగిరి: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కచ్చితంగా పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వికారాబాద్, తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య పరిరక్షణకు ప్రైవేట్ వైద్యులు సహకరించాలన్నారు. ప్రతి హాస్పిటల్లో వైద్యుల వివరాలు, అందించే సేవలు, చారీలు వివరాలు రోగులకు కనిపించేలా ప్రదర్శించాలన్నారు. సమావేశంలో వైద్యులు సాధు సత్యానంద్, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్, ప్రదీప్ గౌడ్, అనిల్ కుమార్, ఎం జయప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు వైద్యంపైపర్యవేక్షణ కరువు!
నగరంలో గల్లీగల్లీలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడుతోంది. గల్లీగల్లీలో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లు వెలుస్తున్నాయి. ఇందులో కొన్నింటికి శాఖాపరంగా ఎలాంటి అనుమతులు ఉండటం లేదని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో రిజిస్టర్ చేసుకున్న వైద్యులు ఉండటంలేదు. కేవలం పేర్లుమాత్రమే ఉంటున్నాయి. పెద్దపెద్ద ఆసుపత్రులు సైతం నామమాత్రపు బెడ్స్తో లైసెన్స్ తీసుకుని పెద్ద సంఖ్యలో బెడ్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ అక్రమ దందా వైద్యారోగ్య శాఖాధికారులకు తెలిసే జరుగుతుందని, చర్యలు తీసుకోకుండా ఉండటానికి ము డుపులు ముట్టజెబుతున్నారని సమాచారం. ఏదైనా సంఘటనా జరిగినపుడు హడావుడి చేయడం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. ● జీహెచ్ఎంసీ పరిధిలోని ఆసుపత్రుల అనుమతులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారుల పరిధిలో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టడం, లోపాలను గుర్తించి, చర్యల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదించడం, ఇతర పర్యవేక్షణా కార్యక్రమాలు ఆయా జిల్లాల డెమో సెక్షన్ చూస్తుంటుంది. ఆయా సెక్షన్లలో పనిచేస్తున్న సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఖచ్చితమైన సమాచారంతో తనిఖీలు చేపడితే అనధికారికంగా నిర్వహించే క్లినిక్లు, అందులో కొనసాగుతున్న అక్రమ బాగోతాలు బయటపడుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మెడికల్ కౌన్సిల్ సుమారు 450 కేసులు నమోదు చేసింది. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయడం, అనుమతులు లేకుండా క్లినిక్లు నిర్వహించడం, మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, అబార్షన్ కిట్లు వంటివి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు ఆసుపత్రి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నపుడు వైద్యుల సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు మాత్రం కనిపించడం లేదు. సంబంధం లేని వ్యక్తులు చికిత్సలందిస్తున్నారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై తదుపరి చర్యల కోసం ఆయా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులకు అప్పగించింది. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేసినపుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్రమంగా మెడికల్ దుకాణాలను నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా, పెద్ద వ్యవస్థ ఉన్న వైద్యారోగ్య శాఖధికారులు మాత్రం తమ కంటికేమీ కనిపించడం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వార్షిక నివేదికల్లో అంతా సక్రమంగానే ఉంది. పద్దతిగా ప్రాక్టీస్ చేస్తున్నారంటూ రాసుకుంటున్నారు. దీనికి ప్రతిఫలంగా ఆయా యాజమాన్యాలు అధికారులను ‘లక్ష’ణంగానే చూసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలకు మీనమేషాలు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా ఊహించని సంఘటన జరిగినపుడు ఇప్పటి వరకు తమకు తెలియదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. నాలుగు రోజులు తనిఖీలు, ఆదేశాలు, చర్యలు అంటూ హడావుడి చేస్తున్నారు. అనంతరం పరిస్థితులు మారిపోతున్నాయి. మెడికల్ కౌన్సిల్ కేసుల విషయంలోనూ చర్యలు తీసుకోవడానికి కొంత మంది వైద్యారోగ్యశాఖ సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారని టీజీఎంసీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. వాళ్లు గుర్తించరు. మేం సమాచారం ఇచ్చినా దానిపై యాక్షన్ తీసుకోవడానికి సాగదీస్తారంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు, వాస్తవ పరిస్థితులకు సంబంధం ఉండదు వసూళ్లకే పరిమితమవుతున్నవైద్యారోగ్య శాఖ సిబ్బంది ఏదైనా సంఘటన జరిగితే హడావుడి -
గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని
నెక్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలస్వామిఅబ్దుల్లాపూర్మెట్: గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నెక్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ సేవలో డాక్టర్ బాలస్వామి 50 వసంతాల, స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా పెద్దఅంబర్పేటలోని తెలంగాణ ఫౌల్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలస్వామి మాట్లాడుతూ తల్లి పాల తర్వాత బలమైన ఆహారం గుడ్డు మాత్రమేనన్నారు. కంప్యూటర్ యుగంలో కల్తీ అనేది సర్వ సాధారణమైందన్నారు. కోడి గుడ్డును మాత్రం ఎవరు కల్తీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రతీరోజు ఆహారంలో గుడ్డు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. కోడి గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, ఒబెసిటీ వంటి అనేక రకాల రోగాల బారిన పడకుండా ఉండొచ్చన్నారు. అనంతరం పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను డాక్టర్ బాలస్వామి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర రావు, పౌల్ట్రీ ఇండియా మాజీ అధ్యక్షుడు చక్రధర్ రావు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నెక్ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావార్తో పాటు పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి అడిగినన్ని నిధులు
స్పీకర్ ప్రసాద్కుమార్ బంట్వారం: అభివృద్ధి పనులకు అడిగినన్ని నిధులు మంజూరు చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. సల్బత్తాపూర్ సర్పంచ్ బుర్నాపూర్ బాలయ్య ఆదివారం నగరంలో స్పీకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ వారిని అభినందించారు. గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమించాలని, తనవంతు సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. సమస్యలు వివరించగా.. స్పీకర్ సానుకూలంగా స్పందించారని సర్పంచ్, నాయకులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చేవెళ్ల: గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..ఆదివారం చేవెళ్లలోని ఓ రోడ్డుపక్కన గోడకు ఆనుకొని కదలలేని వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే పోలీసులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అయితే అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు? మృతుని వద్ద కూడా ఎలాంటి గుర్తింపు ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు దాదాపు 35నుంచి 45 ఏళ్ల వయసుఉంటుందని, నీలి రంగు షర్టు, ఖాకీ రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 7901099443, 8712554143లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ శిరీష తెలిపారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మిద్దె తోటకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు శంకరి గార్డెన్లో సంబురాలు తాండూరు టౌన్: మిద్దె తోటకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు ప్రకృతి ప్రేమికులు. పట్టణంలోని సావుకార్పేటకు చెందిన మంతటి శంకరమ్మ, సంగమేశ్వర్ దంపతులు టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. శంకరమ్మకు చిన్ననాటి నుంచే మొక్కలంటే మక్కువ. తన తండ్రి ప్రోద్భలంతో 1975 నుంచి మిద్దైపె మొక్కలను పెంచుతున్నారు. ఈ తోటకు శంకరి గార్డెన్ అని నామకరణం చేశారు. ఈ టెర్రస్ గార్డెన్ నిర్వహణ చేపట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె చిన్ననాటి మిత్రులను పిలిచి ఆదివారం కేకు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ.. తన తండ్రి స్ఫూర్తితో 8వ తరగతి నుంచి మిద్దైపె పలు రకాల పూలు, పండ్లు, జౌషధ, కూరగాయల మొక్కలను పెంచుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా శంకరమ్మ దంపతులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ సైంటిస్ట్ డాక్టర్ సుధారాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ బీజేపీదే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ యాచారం: రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు విసుగుచెందారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. యాచారం మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన 50 మందికి పైగా వివిధ పార్టీల కార్యకర్తలు ఆదివారం సీనియర్ నాయకులు నడుకుడి కృష్ణ, నాయిని పాండు, శ్రీనగరం రమేశ్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఓరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్నాయక్, సీనియర్ నాయకులు అంబోజ్ జగదీష్ యాదవ్, నాగరాజు పాల్గొన్నారు. -
దొంగకు రిమాండ్
17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం మీర్పేట: ద్విచక్ర వా హనాలు దొంగతనం చేస్తున్న వ్యక్తిని మీ ర్పేట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్కు చెందిన కొలుపురి శ్రీను (39) మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. అతను వైన్షాపులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో, పార్కు చేసిన వాహనాలను చోరీ చేసేవాడు. ఆదివారం మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని అదుపులోకి తీసుకుని సంబంధిత వివరాలు సేకరించారు. చేసిన తప్పులను ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు ద్వితీయస్థానంలో రంగారెడ్డి కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకుంది. రన్నరఫ్గా రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్ ట్రోఫీలు ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాణించిన మాస్టర్ అథ్లెట్లను జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. చాంపియన్ మేడ్చల్.. పోటీల్లో రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. పురుషుల విభాగంలో మేడ్చల్ 250 పాయింట్లతో, మహిళల విభాగంలో మేడ్చల్ 331పాయింట్లతో చాంపియన్ షిప్ కై వసం చేసుకున్నాయి. -
తాండూరు బాలికలు.. క్రికెట్ రాణులు
● ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు, బీసీసీఐ ట్రోఫీకి ఇద్దరు ఎంపిక ● హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, క్రీడాభిమానులుతాండూరు టౌన్: క్రికెట్లో తాండూరు బాలికలు దూసుకెళ్తున్నారు. జాతీయ స్థాయి, బీసీసీఐ ట్రోఫీలకు అర్హత సాధించారు. పట్టణానికి చెందిన రామబ్రహ్మం, కవిత దంపతుల కూతురు సాయి సుదీష్ణ శెట్టి అండర్–19 బాలికల విభాగంలో ఎస్జీఎఫ్ తరపున జాతీయ స్థాయి పోటీలుకు బౌలర్గా, రమాకాంత్ పండిట్, జ్యోతి పండిట్ల కూతురు ఆంచల్ పండిట్ బ్యాట్స్విమెన్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు తాండూరులోని సహారా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మధ్యప్రదేశ్లోని శివపురిలో నిర్వహించనున్న ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సాయి సుదీష్ణ శెట్టిని ఆదివారం సహారా క్రికెట్ అకాడమీ కోచ్లు జగన్నాథ్ రెడ్డి, సతీశ్, శరత్సింగ్, ఆర్బీఓఎల్ ఎండీ, సీఈఓ బుయ్యని సరళ, సెయింట్ మేరీస్ పాఠశాల యాజయాన్యం ఘనంగా సన్మానించారు. బీసీసీఐ ట్రోఫీకి మరో ఇద్దరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)ఆధ్వర్యంలో ప్రకటించిన బీసీసీఐ మహిళల అండర్–15 విభాగంలో పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలకు చోటు దక్కింది. కరుణాకర్ రెడ్డి, మమత దంపతుల కుమార్తె భవిష్య రెడ్డి ఆల్రౌండర్గా ఎంపికై ంది. గౌరీ, పాండు దంపతుల కూతురు ప్రతీక కీపర్, బ్యాట్స్విమెన్గా ఎంపికై ంది. వీరిద్దరూ జనవరి 2వ తేదీ నుంచి విజయనగరం వేదికగా జరుగనున్న బీసీసీఐ అండర్–15 టోర్నీలో పాల్గొననున్నారు. భవిష్య రెడ్డి వరుసగా రెండోసారి బీసీసీఐ టోర్నీకి ఎంపికవడం విశేషం. ఈ ఘనత సాధించిన భవిష్య రెడ్డి, ప్రతీకను లెజెండ్ క్రికెట్ అకాడమీ కోచ్లు ఎండి సాహిల్, ఎండి సోహైల్తో పాటు పలువురు పట్టణవాసులు అభినందించారు. -
కబడ్డీ విజేతలు వీరే..
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కబడ్డీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజలు పాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యపేట జిల్లా జట్టు ఛాంపియన్షిప్ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయస్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకిమరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్లోని పటాన్చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని, ఇక్కడ రాణించిన క్రీడాకారులను తెలంగాణ జట్లకు ఎంపిక చేస్తామని కబడ్డీ సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డితెలిపారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, సంఘం జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అమిత్ కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు. రన్నర్గా రంగారెడ్డి జిల్లా ముగిసిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పోటీలు -
చౌడా‘పూర్’
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన మండలం.. అభివృద్ధిలో వెనుకబాటుకు గురైంది. ఒకే సమయంలో ఏర్పడిన దుద్యాలలో అభివృద్ధి పరుగులు పెడుతుండగా.. చౌడాపూర్లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’నన్న చందంగా మారింది. కుల్కచర్ల: పరిపాలన సౌలభ్యం కోసం కుల్కచర్ల మండలంలోని చౌడాపూర్ గ్రామాన్ని 24 ఏప్రిల్ 2021లో మండలంగా గుర్తించి, ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని నవాబుపేట మండలం నుంచి 7 రెవెన్యూ గ్రామాలు, కుల్కచర్ల నుంచి 7 రెవెన్యూ గ్రామాలను కలుపుకొని మొత్తం 24 పంచాయతీలతో మండలాన్ని ఏర్పాటు చేసింది. సొంత భవనాలు కరువు మండలం ఏర్పడి నాలుగేళ్లు అయినప్పటికీ.. ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క సొంత భవనం కూడా నిర్మించలేదు. తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసులను.. ప్రాథమిక పాఠశాలను మరోచోటికి మార్చి, ఆ గదుల్లో కొనసాగిస్తున్నారు. ఆ భవనం ఆ కార్యాలయాల కార్యకలాపాలకు అనుగుణంగా లేకపోవడంతో.. సమావేశాలను వరండాలో నిర్వహిస్తున్నారు. మండల కార్యాలయానికి మండల పరిధి సర్పంచులు ఒకేసారి వస్తే.. కనీసం కూర్చునేందుకు సరిపడా స్థలం లేదు. దుద్యాల్లో అభివృద్ధి.. చౌడాపూర్ మండలం ఏర్పడిన సమయంలోనే సీఎం నియోజకవర్గమైన కొడంగల్లో దుద్యాల్ మండలం ఏర్పాటు అయింది. కానీ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం అలాంటివేవీ జరగడం లేదు. ఇప్పటికే దుద్యాలలో పోలీస్స్టేషన్ను నిర్మించారు. సైనిక్ స్కూల్, సమీకృత గురుకుల పాఠశాల, మెడికల్ కళాశాల, పశువైద్యకళాశాల, ఇండోర్ స్పోర్ట్స్కాంప్లెక్స్, క్రికెట్ మైదానంతో పాటు వివిధ ప్రభుత్వ రంగ కార్యాలయాలు, భవనాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. చౌడాపూర్ మండలం మాత్రం నిర్లక్ష్యానికి గురైంది. కుల్కచర్లలోనే కేజీబీవీ చౌడాపూర్ మండలానికి మంజూరైన కేజీబీవీ పాఠశాలకు సరిపడా స్థలం, పక్కా భవనం లేకపోవడంతో కుల్కచర్లలో కొనసాగిస్తున్నారు. ఇలాంటి దుస్థితిని చూసిన మరికల్, కల్మన్కాల్వ, చాకల్పల్లితదితర గ్రామాల ప్రజలు తాము పాలమూరుజిల్లాలోనే ఉంటామని, లింగంపల్లి, అడవివెంకటాపూర్ తదితర గ్రామాల వారు కుల్కచర్ల మండలంలోకి వెళ్తామని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, మండల అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధికి నోచుకోని మండలం నాలుగేళ్లయినా సొంతభవనాలు కరువు పాఠశాల భవనంలో ఎంపీడీఓ, తహసీల్ కార్యాలయాలు సమీక్ష సమావేశాలు వరండాల్లోనే.. -
నారు దశ.. జాగ్రత్తలతో రక్ష
దుద్యాల్: యాసంగి సీజన్ మొదలైంది. పైరు దృఢంగా పెరగాలంటే విత్తనం బలంగా ఉండాలి. రైతులు ప్రస్తుతం దమ్ము చేయడం, నారుమడుల పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో ప్రస్తుతం చెరువులు, కుంటలు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు వెదజల్లే పద్ధతిని అవలంబిస్తున్నారు. నారు మడుల విధానంలో మొలక శాతం తక్కువగా ఉన్నట్లైతే వరి నారు కొరత ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రతలు తీసుకోవడంతో పాటు విత్తనాల్లో మొలక శాతాన్ని పరిశీలించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 80 గింజల కంటే ఎక్కువగా రైతులు మొలక కట్టేముందు విత్తనాలను ఎంపిక, నాణ్యతను పరిశీలించాలి. విత్తనాలను ముందుగా పలుచని గుడ్డ తీసుకుని నాలుగు మడుతలుగా చేసి 100 వరి గింజలను తీసుకుని 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత పొడి గుడ్డలో వేసి గాలి తగలకుండా చూడాలి. నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత పరిశీలిస్తే 80 గింజల కంటే ఎక్కువగా మొలకెత్తితే అని నాణ్యమైన విత్తనంగా భావించాలి. మేలైన రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారానే పైరు ఆరోగ్యంగా పెరిగి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, వికారాబాద్ వరిలో నారుమడే కీలకం విత్తనాల ఎంపికతో మేలైన దిగుబడులు -
ఉద్దేశపూర్వకంగానే మార్పు
● ఉపాధి పథకానికి గాంధీ పేరునుకొనసాగించాలి:కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ● కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలుపూడూరు: దేశ వ్యాప్తంగా నిరుపేదల కడుపు నింపుతున్న జాతీయ ఉపాధిహామీ పథకం పేరునుకేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే మార్చిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ఆరోపించారు. ఆదివారం మండల పరిధి మన్నెగూడ కూడలిలో కేంద్రానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి పథకం పేర్పు మార్పు సరికాదని, గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్, అజీంపటేల్, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, కిజర్పాషా, వీరేష్ పాల్గొన్నారు. కుల్కచర్లలో.. కుల్కచర్ల: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పథకం పేరు మార్పును నిరసిస్తూ.. కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశారు. ఇందులో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించండి
తుర్కయంజాల్: ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నించాలని ఆదివారం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెనిగె విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.నరేంద్ర గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షుడు నక్క జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ధ్యాన మహాయాగాలు
కడ్తాల్: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఎనిమిదో రోజు వైభవంగా కొనసాగాయి. వరుసగా సెలవులు రావడంతో పాటు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధ్యాన గురువు పరిణిత పత్రి మాట్లాడుతూ.. బ్రహ్మర్షీ పత్రీజీ చెప్పిన విధంగా మానవుల్లో ఎనిమిది స్థితులుంటాయని తెలిపారు. పిరమిడ్ మాస్టర్ డాక్టర్ యుగంధర్ ధ్యానం విశిష్టతను వివరించారు. పిరమిడ్ మాస్టర్లు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
డిజిటల్ పల్లెలుగా మారాలి
● తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులదే ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● ఉమ్మడి జిల్లా సర్పంచులకు సన్మానం శంషాబాద్: ‘మీ గ్రామంలో ప్రతి సమాచారాన్ని మీ పంచాయతీలో కంప్యూటర్లో పొందుపర్చండి.. ఎవరికి ఏం కావాలి.. ఏ సంక్షేమం ఎవరికి అందింది.. అందని లబ్ధిదారులెవరు.. అనే ప్రతి సమాచారాన్ని సంక్షిప్తం చేసుకుని వాటి పరిష్కరించే విధంగా పాలన సాగాలి.. అందుకు ప్రభుత్వం మీ వెంట ఉండి అన్ని రకాలుగా ప్రొత్సహిస్తుంది.. మీ గ్రామాలన్నీ డిజిటల్ గ్రామాలుగా మరాలి’ అని ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపర్చి గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సర్పంచులు పనిచేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధితోనే రాష్ట్రం, దేశం బాగుపడుతాయన్నారు. గత ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు సైతం ఇవ్వకుండా సతాయించిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కనుమరుగు చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇప్పటికే మొదలు పెట్టిందన్నారు. సర్పంచులకు త్వరలోనే శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, వికారాబాద్ అధ్యక్షుడు ధారాసింగ్, శంషాబాద్ పట్టణ అధ్యక్షుడు పి.సంజయ్యాదవ్, మండల అధ్యక్షుడు, నర్కూడ సర్పంచ్ శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సెన్స్లేని ట్రిపుల్ ఆర్ నిర్మాణం వద్దు
ఆమనగల్లు: సెన్స్లేని ట్రిపుల్ ఆర్ నిర్మాణం వద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసీ్త్రయ అలైన్మెంట్తో గతంలో ఏర్పాటు చేసిన విధంగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లిలో ట్రిపుల్ ఆర్ నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం శాటిలైట్ సర్వేతో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి అలైన్మెంట్ చేశారని గుర్తుచేశారు. అప్పట్లో ట్రిపుల్ఆర్ నిర్మాణం ప్రభుత్వ భూములు, సాగుకు యోగ్యం కాని భూముల నుంచి ఉండేలా చూశారని, రైతులకు ఎక్కువ అన్యాయం జరగకుండా అలైన్మెంట్ నిర్ణయించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు నాలుగు సార్లు అలైన్మెంట్ మార్చి సన్న, చిన్నకారు రైతుల భూముల నుంచి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సన్న, చిన్నకారు రైతుల భూములను లాక్కోవడాన్ని తెలంగాణ జాగృతి వ్యతిరేకిస్తోందన్నారు. జనవరి 5న హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 8 జిల్లాల భూ నిర్వాసితులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు. 8 జిల్లాలకు చెందిన భూ నిర్వాసితులతో వెళ్లి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. డంపింగ్యార్డును తరలించాలి ఆమనగల్లులో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్యార్డును తరలించాలని కవిత డిమాండ్ చేశారు. పట్టణంలోని గుర్రంగుట్ట సమీపంలో ఉన్న డంపింగ్యార్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నివాస గృహాల మద్య డంపింగ్యార్డు ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు దారమోని గణేశ్, తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. మైసిగండి మైసమ్మ సన్నిధిలో.. కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం ఉదయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత ఆలయంలో అమ్మవారికి పట్టు చీర, వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, షాదనగర్ నియోజకవర్గ ఇన్చార్జి రమేశ్కుర్మ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిరాథోడ్, మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
అంబేడ్కర్ మార్గం అనుసరణీయం
మహేశ్వరం: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన బాటలో పయనించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని సిరిగిరిపురంలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, కేవలం జ్ఞానంతో సాధించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టారని, 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహా న్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. అంతకు ముందు గ్రామంలో అంబేడ్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు, మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ నాగరాణి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
పరిగి: ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. వీబీ–జీ రామ్ జీ బిల్లుకు నిరసనగా ఆదివారం పట్టణ కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతిపిత పేరును తొలగించడం సరికాదన్నారు. పేదల కోసం కొత్త పథకాలు తీసుకురాకుండా ఉన్న పథకాల పేర్లు మార్చుతూ పబ్బంగడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణ కేంద్రంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో పార్టీలు ఎన్ని వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న విలువ వేరు అన్నారు. తరాలు మారిన దేశంలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపును చెరపలేరన్నారు. పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పీఆర్టీయూ–2026వ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపుపై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. ప్రతి పేద వాడికి నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మండల అధ్యక్షుడు బుగ్గయ్య, ఉస్మాన్అలీ, రాకేశ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
ఏడిపించిన ఎవుసం
నాగలి కంట కన్నీరు పెట్టింది.. అందరి ఆకలి తీర్చే రైతన్న పంట పండించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా సాగు సమరమైంది. వికారాబాద్: ఈ ఏడాది ఎవుసం ఏడిపించింది.. తొలుత వర్షాలు సానుకూలంగా ఉండడంతో రైతులు ముందుగానే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. వరుణుడు ముఖం చాటేయడంతో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తక కన్నీరు పెట్టుకున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన అధిక వర్షాలు కర్షకుడిని తేరుకోనివ్వలేదు. 2025లో జిల్లాలో వ్యవసాయ రంగం పూర్తిగా ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాలుగైదేళ్లుగా అతివృష్టి, అనావృష్టి సమస్యలతో సతమతమైన రైతుకు ఈ ఏడాది సైతం గత అనుభవాలే ఎదురయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, వానాకాలం ఆరంభం నుంచి వరుణుడు విరుచుకుపడటంతో నష్టాలపాలయ్యారు. మర్పల్లి, మోమిన్పేట, వికారాబాద్, నవాబుపేట, పరిగి, దోమ, ధారూరు, బొంరాస్పేట, యాలాల, దౌల్తాబాద్ తదితర మండలాల్లో పంటలు చేతికందకుండా పోయాయి. జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటల దిగుబడులు పూర్తిగా తగ్గాయి. గత యాసంగి సీజన్లో కొనుగోళ్లలో తలెత్తిన ఇబ్బందులు రైతును కుదేలయ్యేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో నిర్వహకుల కొర్రీలతో పండించిన పంటలో 50 శాతం దళారులకే విక్రయించాల్సి వచ్చింది. రుణమాఫీకి ఎదురుచూపులు సగం మంది రైతులకు రుణమాఫీకాగా మిగిలిన వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో మూడు విడతల్లో కలిపి సగం మంది రైతులే రుణ విముక్తులయ్యారు. జిల్లాలో 2.50లక్షల మంది రైతులు 5.90లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. గతేడాది (2023–24) 1,78,522 మంది రైతులు పలు బ్యాంకుల నుంచి రూ.2,582 పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీలో ప్రభుత్వం కుటుంబాన్ని యూనిట్గా స్వీకరించడంతో మూడు విడతల్లో 91,956 మంది రైతులకు రూ.865 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు ముందుగా రూ.2 లక్షల పైన ఉన్న బకాయి బ్యాంకుల్లో నగదు జమ చేస్తే రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. తీరా నగదు జమచేసిన తర్వాత ప్రభుత్వం చేతులెత్తేసింది. అధిక వర్షాలతో ఆగం విత్తనాలు విత్తుకుంది మొదలు మొక్కజొన్న రైతుకు గడ్డు పరిస్థితి ఎదురైంది. వర్షాలు ఆలస్యంగా కురిసి విత్తనాలు పాడయ్యాయి. పలు చోట్ల రెండుసార్లు విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన అఽధిక వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి రైతుకు సైతం కష్టాలు తప్పలేదు. జిల్లాలోని 20 మండలాల్లో 1,45,000 మంది కర్షకులు 2.60లక్షల ఎకరాల్లో తెల్లబంగారం సాగు చేపట్టారు. ఎకరాకు 10 నుంచి 16 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. అధిక వర్షాల కారణంగా నాలుగు నుంచి ఆరు క్వింటాళ్లకే పరిమితమైంది. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయ పంటలకూ నష్టం వానాకాలం సీజన్లో 25వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో కాపునకు వచ్చిన టమాటా, క్యారెట్, బీట్రూట్ పంటలు అధిక వర్షాలు, వడగళ్లు కడగల్లు మిగిల్చాయి. ధరలు పెరగడంతో వినియోగదారుడు సైతం కొనలేక తినలేక ఇబ్బందులు పడుతున్నారు. పూల తోటలు సైతం పాడై రైతులు నష్టపోయారు. పాడైన పంటలకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం సైతం ఇవ్వడం లేదు. ఆయిల్పామ్ సాగుకు ఆసక్తి ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు దిశగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 50వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. ఆయిల్ పామ్ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను విధించింది. 35,000 ఎకరాల నేలలు అనుకూలంగా ఉన్నట్లు ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో కనీసం 2వేల ఎకరాల్లో పంట సాగు చేసేలా రైతుల ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని చేరుకున్నారు. వానాకాలం నుంచే రైతుకు సాగు కష్టాలు వర్షాలకు పంట నష్టపోయిన కర్షకులు పరిహారం అందించని సర్కార్ యాసంగి సాగుకు అందని రైతు భరోసా తుఫాన్ల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టం వాటిళ్లడంతో 1,350 మంది రైతులు 1,500 ఎకరాలు నష్టపోగా ప్రభుత్వం ఎటువంటి పరహారం అందలేదు. ప్రతీ ఏడాది జిల్లాలో రూ.320 కోట్ల వరకు రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం ఎకరాకు రూ.12వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా వానాకాలం పంటకు పెట్టుబడి సాయం అందగా.. యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు నగదు జమకాలేదు. -
మాస్టర్ అథ్లెటిక్స్లో తాండూరు మహిళ సత్తా
● రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు గోల్డ్మెడల్స్ సాధించిన సంతోషి ● జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక తాండూరు టౌన్: 12వ తెలంగాణ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్లో తాండూరు మహిళ సత్తా చాటింది. శని, ఆదివారాల్లో కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ (30–100 ఏళ్ల వయసు) పోటీల్లో ఏకంగా మూడు గోల్డ్మెడల్స్ సాధించింది. పట్టణానికి చెందిన మంకాల్ సంతోషి కుమారి 50ఏళ్ల పైగా వయసు విభాగంలో వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ వరకు అజ్మీర్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్కు రాష్ట్రం తరుపున బరిలో దిగనున్నారు. ఈ ఘనత సాధించిన సంతోషి కుమారిని తాండూరు వాసులు అభినందించారు. క్రీడలకు, ఫిట్నెస్కు వయసుతో సంబంధం లేదని, ఆరోగ్య జీవనానికి నిత్యం వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలని చెప్పారు. దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ రాకమకొండ స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 4 వరకు ఉత్తర ద్వారా దర్శనం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు రాకం అరుణ, యాదయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరు రోజుల పాటు ఈ దర్శనాలు ఉంటాయని చెప్పారు. బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్రెడ్డి అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని బూరుపల్లి, గంగారం వార్డుల్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడేవారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పార్టీ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, అమర్నాథ్, వెంకట్, వినోద్, గోవర్ధన్, మోహన్రెడ్డి, బుచ్చిరెడ్డి, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీజీహెచ్ఎంయూ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ అనంతగిరి: తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం(టీజీహెచ్ఎంయూ) జిల్లా అధ్యక్షుడిగా జి.శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వికారాబాద్లో నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా రూప్సింగ్, గౌరవ అధ్యక్షుడిగా సి.రాజు, కోశాధికారిగా కోటిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కరుణాకర్, విజయ్కుమార్, బుద్దదేవ్, కార్యదర్శులుగా వెంకటయ్య, పూర్ణచందర్, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా వసంతలక్ష్మి, ఇతర కార్యవకర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ నజీమొద్దీన్, కార్యదర్శులు మహేంద్ర బహద్దూర్, రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తాండూరు: కాగ్నా నది కాలుష్యంపై సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు చైన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ని ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన ఎన్జీటీ సంబంధిత అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 13 అంశాలతో కూడిన ఆర్డర్ను వెలువరించింది. కాగ్నా నది ప్రక్షాళన సంబంధిత అధికారులదేనని.. 2026 ఫిబ్రవరి 9వరకు సమస్యను పరిష్కరించాలని సూచించింది. లేదంటే అధికారులు ట్రిబ్య్రునల్ రావాల్సి ఉంటుందని నోటీసు జారీ చేసింది. -
రేవంత్రెడ్డివి మూర్ఖపు మాటలు
వికారాబాద్: రేవంత్రెడ్డి మూర్ఖపు మాటలు సీఎం పదవికే కళంకం(మచ్చ) తెచ్చి పెడుతున్నారని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఒక్కసారి బయటికి వచ్చి మాట్లాడితేనే సీఎం తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు ఇవ్వాలనే ప్రణాళికతో కేసీఆర్ ముందుకెళ్లారని తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం పూర్తి చేసి, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.35 వేల కోట్లు కేటాయించారని, రూ.27 వేల కోట్లతో తొంభైశాతం పనులు పూర్తి చేశారని వివరించారు. మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లివ్వడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు పథకానికి 90 టీఎంసీల వాటర్ కేటాయిస్తే 45 టీఎంసీలే సరిపోతాయనడం ఏమిటని ప్రశ్నించారు. ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారు? బీఆర్ఎస్ హయాంలో ఉద్దండాపూర్ రిజర్వాయర్కు రూ.7 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే సీఎం ఎందుకు రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కొడంగల్కు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అటు వెళ్లి పాలమూరు బిడ్డను అంటాడు.. ఇటు వికారాబాద్ వచ్చి జిల్లా వాసిని అంటాడు.. కానీ రెండు ప్రాంతాలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరానికి మరమ్మతులు, పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరుకు తీవ్ర అన్యాయం పాలమూరు పథకాన్ని పక్కకు పడేసిన ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆరోపించారు. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు. పాలమూరు పథకాన్ని పూర్తి చేయకపోతే ఉద్యమం తప్పదని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్రెడ్డి సరిపోడని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్, క్యామ మల్లేశ్, నాయకులు ప్రవీణ్రెడ్డి, ఆంజనేయులు, సురేందర్, భాస్కర్, గోపాల్, అనంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన వ్యాఖ్యలు సీఎం పదవికే కళంకం బీఆర్ఎస్ హయాంలోనే ‘పాలమూరు’ 90శాతం పూర్తి మిగిలిన పది శాతం పూర్తి చేసి నీళ్లివ్వడానికి ఇబ్బందేంటి? సమాధానం చెప్పలేక కేసీఆర్పై విమర్శలా! మాజీ మంత్రి సబితారెడ్డి ఫైర్ -
శ్రీవారి నిజరూప దర్శనం
● కొడంగల్ వేంకటేశ్వరస్వామికి ఘనంగా అభిషేకం ● జనవరి 16 వరకు ధనుర్మాసపూజలు, తిరుప్పావై కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కలియుగ దైవమైన స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీవారి మూలమూర్తికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పలు రకాల పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ధనుర్మాసాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ధరూర్ శ్రీనివాసాచార్యులు తిరుప్పావై పారాయణం చదివి వినిపిస్తున్నారు. ఈనెల 16నుంచి జనవరి 14 వరకు నిత్యం ధనుర్మాసపూజలు, తిరుప్పావై కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సన్నాయి, 5 గంటలకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, 6 గంటలకు తిరుప్పావై ప్రవచనం ప్రసాద వితరణ ఉంటుంది. ఈనెల 30న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం, 16న కనుమ, నీరాటోత్సవం, అలంకార తిరుమంజనం నిర్వహిస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోంగా పూజలు కొనసాగుతాయన్నారు. -
ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు
రాజ్యసభ్యుడు ఆర్.కృష్ణయ్యకడ్తాల్: పంచాయతీ ఎన్నికల్లో యువజన సంఘాల ఐక్యవేదిక నుంచి తనతో పాటు వసంత, పూలమ్మ వార్డు సభ్యులుగా విజయం సాధించారని యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ అన్నారు. శనివారం ఆయన రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. పోరాటం చేసే వారిని ప్రజలు గుర్తిస్తారని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజల అభిమానాన్ని మరింత చూరగొనాలని, భవిష్యత్లో గొప్ప నాయకుడిగా ఎదగాలని ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్ను, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభినందించి సన్మానించారు. ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 3.31శాతం ఎక్కువ ● దొంగతనాలు, రాబరీలు, హత్యలు, హత్యాయత్నం వంటి కేసులు అధికం ● సివిల్ తగాదాల్లో పోలీసుల ప్రమేయం ● ఇసుక అక్రమ రవాణాలోనూ ఆరోపణలు ● తగ్గిన రోడ్డు ప్రమాదాలు నేరాలు పెరిగాయ్ప్రధాన నేరాలు ఫిర్యాదులు బుట్టదాఖలు ఇసుక మాఫియాతో.. సంచలన తీర్పులు -
గజగజా వణికిస్తున్న చలి
● తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ● ఇబ్బంది పడుతున్న జనం దౌల్తాబాద్: చలిపులి గజగజా వణికిస్తోంది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలితో పాటు, దట్టమైన పొగమంచు, బలంగా శీతల గాలి వీస్తుండటంతో బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అవస్థపడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళలో చాలామందిచలిమంట కాగుతున్నారు. విధుల నిమిత్తం కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు నిండుగా ఉలన్ దుస్తులు ధరించి ప్రయాణం కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పాము కలకలం కొట్టి చంపిన సిబ్బంది తాండూరు రూరల్: ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. రెండురోజుల సెలవు అనంతరం శనివారం ఉదయం కార్యాలయంను తెరచిన సిబ్బందికి బాత్రూంలో కట్లపాము కనిపించింది. దీంతో భయాందోళన వారు.. కర్రతో సర్పాన్ని కొట్టి చంపారు. ఈ మధ్య కాలంలో వరుసగా పాములు ఆఫీసులోకి వస్తున్నాయని, దీనికి కారణం చుట్టుపక్కల అపరిశుభ్రత, పిచ్చిమొక్కలేనని తెలిపారు. కొన్ని నెలలుగా నాలుగైదు సర్పాలను చంపేశామని సిబ్బంది పేర్కొన్నారు. కార్యాలయం ఎదుట ఉన్న పార్కులో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత బషీరాబాద్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధి రెడ్డిఘణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అల్తాఫ్.. తన రెండు ట్రాక్టర్ల ద్వారా శనివారం తెల్లవారు జామున ఇసుక రవాణా చేస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అలాగే అగ్గనూరు గ్రామానికి చెందిన మరో ట్రాక్టర్.. గోనూరు వాగునుంచి నవల్గాకు ఇసుక తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు ఎస్ఐ విఠల్ తెలిపారు. డ్రైవర్లు అశ్వాక్ అలీ, కుర్వ కిరణ్ కుమార్, పిట్టలి సుమంత్ కుమార్లపై కేసునమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయి సేవిస్తున్న నలుగురికి రిమాండ్ 400 గ్రాముల గంజాయి స్వాధీనంకందుకూరు: గంజాయి మత్తులో తూగుతున్న నలుగురు బీహారీలను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కందుకూరు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. కందుకూరు చౌరస్తా హీరోహోండా షోరూం పక్కన ఉన్న గదిలో గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దీంతో ఆగదిలో 400 గ్రాముల గంజాయి లభ్యమైంది. బీహార్ రాష్ట్రం భగల్పూర్ జిల్లా పిర్పింటికి చెందిన మహ్మద్ చోటు(20), షేక్ రాజు(46), మహ్మద్ ఆలమ్(36), మహ్మద్ రేహాన్(20) గంజాయి మత్తులో ఉన్నారు. వీరిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వీరంతా స్థానికంగా మేస్త్రీలు, కూలీలుగా పని చేస్తున్నారు. ఎస్ఐ పరమేశ్ కేసు దర్యాప్తు చేపట్టారు. సర్పంచ్లు బాధ్యతగా పనిచేయాలి రాష్ట్ర మంత్రి సీతక్కఆమనగల్లు: సర్పంచ్లు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం తలకొండపల్లి మండలం వీరన్నపల్లి సర్పంచ్ కడారి రామకృష్ణ యాదవ్ శనివారం నగరంలోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ని ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ను అభినందించిన సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకా లకు అర్హులకు అందే లా చూడాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉప సర్పంచ్ రాఘవేందర్, మాజీ సర్పంచ్ లింగం గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, వినయ్, అనిల్ తదితరులున్నారు. -
రూ.60 కోట్లతో 60 ఫీట్ల రోడ్డు
కొడంగల్: కొడంగల్ లాహోటీ కాలనీలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఇంటి నుంచి వినాయక చౌరస్తా మీదుగా బాపల్లి వరకు పట్టణ ప్రధాన రహదారిని విస్తరించనున్నారు. ఇందులో భాగంగా కోల్పోతున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలు, ఖాళీ స్థలాలను ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు శనివారం పరిశీలించి, పరిహారం చెల్లింపు కోసం కొలతలు తీసుకున్నారు. రోడ్డు మధ్య నుంచి అటు 30, ఇటు 30 మొత్తం 60 ఫీట్ల రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. 16 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసింది. పరిహారం చెల్లింపుల అనంతరం పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. హైవే పనుల్లో జాప్యం.. పట్టణంలోని వినాయక చౌరస్తా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. మహబూబ్నగర్– చించోలీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వినాయక చౌరస్తాను విస్తరిస్తున్నారు. దీనికి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పాటు హాస్టుళ్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది విద్యార్థులు రాకపోకలతో ఈప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈమార్గంలో ఆగే ఆర్టీసీ బస్సులతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మహబూబ్నగర్– చించోలీ (ఎంసీ) అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా మార్చింది. మహబూబ్నగర్ నుంచి కొడంగల్, తాండూరు మీదుగా కర్నాటక రాష్ట్రం చించోలీ వరకు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారికి 167ఎన్గా పేరు పెట్టారు. బెంగళూరు, ముంబై జాతీయ రహదారులను కలిపే ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. మహబూబ్నగర్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా చించోలి, మన్నాకెళ్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చౌరస్తాను వెడల్పు చేస్తున్నారు. కొడంగల్ ప్రధాన రహదారికి నిధులు మంజూరు సీఎం ఇంటి నుంచి బాపల్లి వరకు నిర్మాణం భూ బాధితులకు త్వరలోనే పరిహారం ఆవెంటనే పనులు ప్రారంభం త్వరగా పూర్తి చేయాలి కొడంగల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి. రోడ్డు విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. పట్టణ ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న మురుగు కాల్వల పనులను త్వరగా పూర్తి చేయాలి. వ్యాపారాలు లేకపోవడంతో దుకాణదారులు అద్దెలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. – మురహరి వశిష్ట, లయన్స్క్లబ్ అధ్యక్షుడు, కొడంగల్ -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పిస్తామంటూ..
కొందుర్గు: అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఘటన కొందుర్గులో ఆలస్యంగా వెలుగులోచి వచ్చింది. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన సిమెంట్ డీలర్ గండేటి వేణుగోపాల్ తన ఫేస్బుక్లో నవంబర్ 25న అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు ప్రకటన చూసి లింక్ ఓపెన్ చేశాడు. నవంబర్ 28న 95026 73232 నంబర్ నుంచి వంశీ అనే అపరిచిత వ్యక్తి ఇంటికి వచ్చి అగ్రిమెంట్ ఫారం నింపుకొని వెళ్లాడు. బాధితుడు వేణుగోపాల్.. వంశీ సూచనలు పాటిస్తూ పలు దఫాలుగా నాటి నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్ లింక్ ద్వారా, ఫోన్ పే ద్వారా మొత్తంగా రూ.3,19,184 చెల్లించాడు. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో శనివారం బాధితుడు షాద్నగర్లోని అమెజాన్ సెంటర్కు వెళ్లి విషయం చెప్పాడు. తమ వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇచ్చే పద్దతి ఉండదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించి వేణుగోపాల్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రూ.3.19 లక్షలకు టోకరా -
సర్కిల్ గాయబ్
తుర్కయంజాల్: తుర్కయంజాల్ మున్సిపాలిటీని డిసెంబర్ 3న జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం సర్కిల్గా ప్రకటించి.. ఆవెంటనే ఆదిబట్ల సర్కిల్లో విలీనం చేయడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల చెంతకు పాలన తెస్తామని చెప్పిన సర్కార్ దూరం చేయడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డివిజన్ల విభజనపై నిరసనలు చేపడుతుండగా.. సర్కిల్ కార్యాలయాన్ని తరలించడంపై స్థానికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల కొద్ది అభ్యంతరాలు 2018 ఆగస్టు 2వ తేదీకి ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తుర్కయంజాల్, రాగన్నగూడ, కమ్మగూడ, ఇంజాపూర్, తొర్రూర్, బ్రాహ్మణపల్లి, మునగనూర్, కొహెడ, ఉమర్ఖాన్గూడలను కలిపి తుర్కయంజాల్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 77,217 మంది ఓటర్లు ఉండగా, 24 వార్డులు ఉండేవి. జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం ఇంజాపూర్, రాగన్నగూడలోని కొంత ప్రాంతం, తుర్కయంజాల్ గ్రామాన్ని కలుపుతూ 56వ డివిజన్గా తుర్కయంజాల్ను ఏర్పాటు చేశారు. ఈ వార్డు పరిధిలో 20వేల–25వేల వరకు మాత్రమే ఓటర్లు ఉండే అవకాశం ఉంది. మిగిలిన 50 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రాంతాన్ని 53వ డివిజన్ తొర్రూర్గా ఏర్పాటు చేసిన విషయం విదితమే. 10 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణం, 20వేల వరకు ఓటర్లు ఉన్న కొహెడను డివిజన్గా మార్చాలని కోరుతూ 1,200కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నింటిని కొట్టి పారేసిన జీహెచ్ఎంసీ నిర్ణయాన్ని ఏ మాత్రం సడలించుకోకపోగా సర్కిల్నే ఎత్తివేయడం గమనార్హం. సర్కిల్ కార్యాలయానికి 17 కిలోమీటర్లు తొర్రూర్ డివిజన్లోని ఉమర్ఖాన్ గూడ, మునగనూర్, ఇంజాపూర్ నుంచి ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం 17 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. తుర్కయంజాల్ నుంచి 10 కిలో మీటర్లకు పైగా దూరం ఉంది. అక్కడకు వెళ్లేందుకు వ్యక్తిగత వాహనాలు, ట్యాక్సీ సర్వీసులను ఆశ్రయించాల్సిందే. ఆర్టీసీ బస్సులు, ఆటోలు ప్రత్యేకంగా ఉండవు. ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్లు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు, పన్నుల చెల్లింపులు, ఇతర ఫిర్యాదులు, పనుల నిమిత్తం సర్కిల్ కార్యాలయానికి సామాన్యులు వెళ్లడం కష్టంతో కూడుకున్న పని అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు, ధర్నాలు, సంతకాల సేకరణను పట్టించుకోని ప్రభుత్వం ఆదిబట్ల సర్కిల్ పరిధిలోకి తుర్కయంజాల్ స్థానికుల నుంచి విమర్శల వెల్లువ -
గంజాయి విక్రేతల అరెస్ట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి టీసీఎస్ సమీపంలోని కార్మికులకు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కేంద్ర పారా జిల్లాకు చెందిన విజయ్శెట్టి (26), మృత్యుంజయ్ నాయక్ (21) ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. వీరు గంజాయి తీసుకువచ్చి ఆదిబట్లలోని టీసీఎస్ సమీపంలో ఉన్న కూలీలకు విక్రయిస్తుంటారు. నిందితులిద్దరూ ప్లంబర్ పనులు చేస్తుంటారు. ఒడిశాలోని అరఖిత్ అనే వ్యక్తి నుంచి చిన్నచిన్న ప్లాస్టిక్ కవర్లలో గంజాయి తెచ్చి, సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందడంతో విజయ్శెట్టి, మృత్యంజయ్నాయక్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరఖిత్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 24 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామని సీఐ రవికుమార్, ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.● ఇద్దరికి రిమాండ్ ● పరారీలో మరో వ్యక్తి -
తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలకు డిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బొంగ్లూర్ గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల్లో, ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. తాటి చెట్లను నరకివేయడంతో తాము జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 25 చెట్లకు యజమాని జనార్ధన్రెడ్డి గీత కార్మికులకు సమాచారం లేకుండా తొలగించారన్నారు. ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదానందంగౌడ్, మల్లేశ్గౌడ్, చంద్రయ్యగౌడ్, శేఖర్గౌడ్, మూల నర్సింహ, సత్తయ్య, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
ఆశల బకాయి బిల్లులు చెల్లించాలి
అనంతగిరి: ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. 2022 నుంచి 2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లెప్రసీ సర్వే చేపట్టిందని, జిల్లాలో కూడా 15 రోజుల పాటు సర్వే చేయించారని పేర్కొన్నారు. సర్వే చేసినందుకు రోజుకు ఒక ఆశ కార్యకర్తకు రూ.70 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ కార్యక్రమం ముగిసి ఏడాది పూర్తయినా ఇప్పటివరకు డబ్బులు విడుదల చేయలేదన్నారు. కావున బకాయి బిల్లులను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడురామకృష్ణ, కోశాధికారి చంద్రయ్య, తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షురాలుఅమృత, కార్యదర్శి మంగమ్మ, ఉమ, పద్మ, అనురాధ, అరుణ, కౌసల్య, జగదేవి, మునిబాయి, లక్ష్మి, మధులత, సుజాత, శ్రీదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ -
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు ఘనంగా వీడ్కోలుఅనంతగిరి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు వస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపినప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన సేవలను కొనియాడారు. అనంతరం లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో పనిచేయడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, డీఆర్ఓ మంగీలాల్, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, డీబీసీడీఓ కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు. ‘కోట్పల్లి’ రైతులకు పంట సెలవు దినం కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట సెలవు దినంగా ప్రకటించిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాలా కాలంగా మరమ్మతు, ఆధునీకరణ పనులు పెండింగ్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రాజెక్టును బలోపేతం చేయాల్సి ఉందన్నారు. 2025 – 26 రబీ సీజన్లో కుడి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. 24 కిలో మీటర్ల మేర పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్ణీత సమయంలో కాలువ మరమ్మతు పనులు పూర్తి చేసి నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు. ఇందుకు రైతులు సహకరించి ప్రాజెక్టు కుడి కాల్వ కింద పంటలు వేయరాదని కలెక్టర్ కోరారు. -
‘పరిషత్’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
బషీరాబాద్: రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి వివిధ గ్రామాల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను నగరంలో కలిశారు. ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీచేసిన వారికి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారో తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగాయని, తాను అంతటా ప్రచారం చేయలేదని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, పార్టీ బలపర్చిన వారిని గెలిపించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే.. పరిషత్ ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విభేదాలు వీడి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, భోజ్యా నాయక్ సర్పంచ్ శాంతిబాయి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామునాయక్, భీమప్ప, విష్ణు, ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సింహులు, బాలకృష్ణ, హనుమంతు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -
డబ్బులు పంపుతావా.. జైలుకు వెళ్తావా
వికారాబాద్ జిల్లా: ‘డబ్బులు పంపు. లేదంటే జైలుకు పంపిస్తాను. చంపేస్తా’ అని గుర్తు తెలియని వ్యక్తి బెధిరింపు ఫోన్కాల్స్తో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన వడ్త్యా రాఘవన్ అలియాస్ పవన్(26) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా రెండు సెల్ఫోన్ నంబర్లతో.. ఓ వ్యక్తి క్రైమ్ కానిస్టేబుల్ అని, కంట్రోల్ రూం నుంచి మాట్లాడుతున్నానని వివిధ రకాలుగా బెధిరించి డబ్బులు వేయమని వేధించసాగాడు. డబ్బులు పంపకుంటే జైలుకు పంపిస్తానని, చంపేస్తానని బెధిరించాడు. దీంతో మనస్తాపంచెందిన పవన్.. ఈ నెల 23న రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్కు ప్రాంతంలో పురుగు మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కాల్డేటా ఆధారంగా హైదరాబాద్కు చెందిన వ్యక్తిపై అనుమానం ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిని డబ్బుల కోసం ఫోన్లో వేధించినట్లు గుర్తించారు. మృతుడి అన్న విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రత్యర్థుల నుంచి కాపాడబోయి..
తన దుకాణంలో దాక్కున్న వ్యక్తిని ప్రత్యర్థుల నుంచి కాపాడబోయిన వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తాండూరు పట్టణ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తాండూరు/యాలాల: తాండూరు పట్టణ శివారు.. యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో గురువారం రాత్రి వృద్ధుడి హత్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో హత్య, హత్యాయత్నం ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కోట్పల్లిలో సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై హత్యాయత్నం ఘటన నుంచి తెరుకోకముందే తాండూరులో వృద్ధుడు హత్యకు గురికావడం కలవర పెడుతోంది. మరోవైపు పాత తాండూరులో అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. విషయం తెలుసుకున్న జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తాండూరుకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇక్కడే మకాం వేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లి.. పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన వృద్ధుడు హత్యకు గురైనట్లు జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం తాండూరులో ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం ఖాంజాపూర్కు చెందిన గోపాల్, కిట్టు మధ్య కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో గోపాల్ మరో 5 మందితో కలిసి గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కిట్టుపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన కిట్టు అక్కడి నుంచి తప్పించుకొని రాజీవ్ కాలనీలోని ఓ బీఫ్ షాపులోకి వెళ్లి షెట్టర్ వేసుకొని దాక్కున్నాడు. గోపాల్ అతని అనుచరులు షెట్టర్ను పగులగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న బీఫ్ షాపు యాజమాని నూర్ మహ్మద్, అతని కుమారుడు సుఫియాన్ ఖురేషి వారిని అడ్డుకున్నారు. దీంతో గోపాల్ ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నూర్ మహ్మద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న నూర్ మహ్మద్ను, గాయపడిన షుఫియాన్ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూర్ మహ్మద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. నగరానికి వెళ్తున్న క్రమంలో మరణించారు. కిట్టును కాపాడబోయి నూర్ మహ్మద్ హత్యకు గురైనట్లు డీఐజీ తెలిపారు. పట్టణంలో ఎలాంటి ఘటనలు చోటుచేఐసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ పికెటింగ్ తాండూరు రూరల్: వృద్ధుడి హత్య నేపథ్యంలో ప్రధాన నిందితుడు గోపాల్ స్వగ్రామం ఖాంజాపూర్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గురువారం గోపాల్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గ్రామంలో 20 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. హత్యకు గురైన వృద్ధుడు తాండూరు పట్టణ శివారులో ఘటన రాళ్లు రువ్విన అల్లరి మూకలు హుటాహుటిన ఘటనా స్థలానికిచేరుకున్న డీఐజీ, ఎస్పీ కేసు వివరాల వెల్లడి -
ముగ్గురు దొంగలకు రిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: ఇళ్ల తాళాలు పగులకొట్టి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆదిబట్ల ఠాణా పరిధిలోని బొంగ్లూర్ సమీపంలోని రాఘవేంద్ర హోమ్స్లో నవంబర్ 26న అమనగంటి శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులు నగరంలోని వారి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు కిచెన్ తలుపు పగలగొట్టి బంగారం, నగదు, ల్యాప్టాప్, స్మార్ట్ వాచ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మీర్పేట్లో నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన డెలివరీ బాయ్ దస్తార్ బ్యాండ్ షఫీ, అలియాస్ షఫీ(42), ఖమ్మగూడలోని సుభాష్నగర్లో ఉండే నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం ఎర్సానిగూడెంకు చెందిన డ్రైవర్ ఉబ్బాని యోగేశ్వర్ అలియాస్ యోగి(23), పశ్చిమగోదావరి జిల్లా నర్సపూర్ మండలం పెరుపాలెంకు చెందిన రాజేశ్ అలియాస్ చిన్నా (24) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరిని విచారించగా నేరం అంగీకరించారు. రెండు నెలల క్రితం బెయిల్పై వచ్చిన వీరిపై ఆదిబట్ల పీఎస్లో ఏడు కేసులు, ఇబ్రహీంపట్నం ఠాణాలో ఒక కేసు, నిజామాబాద్టౌన్లో బైక్ చోరీ, శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్టు సమీపంలో మరో మోటార్సైకిల్ దొంగతనం చేసిన కేసుల్లో పట్టబడ్డారు. వీరి వద్ద నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆపిల్ ఐపాడ్, ఆపిల్ స్మార్ట్వాచ్, మూడు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్, హీరో ఐస్మార్ట్ బైక్, హోండా షైన్ బైక్తో పాటు రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ బ్యాటరీల దొంగలకు.. నందిగామ: ట్రాక్టర్ బ్యాటరీలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్కుమార్, మధ్యప్రదేశ్కు చెందిన శివం సింగ్ మిత్రులు. వీరు కొత్తూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరు ఇటీవల అప్పారెడ్డిగూడ, నర్సప్పగూడ గ్రామాల్లో ట్రాక్టర్ల నుంచి 11 బ్యాటరీలు దొంగిలించారు. వీటిని శుక్రవారం కొత్తూరులో విక్రయించడానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు నేరం అంగీకరించారు. బంగారు ఆభరణాలు, రెండు బైక్లు స్వాధీనం -
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బదిలీ
అనంతగిరి: జిల్లా అడిషనల్ కలెక్టర్గా(రెవెన్యూ) విధులు నిర్వహిస్తున్న లింగ్యానాయక్ బదిలీ అయ్యారు. చేసింది. రెండేళ్లపాటు జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు. ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వ నియమించింది. ఎమ్మెల్యేకు రాములోరి ప్రసాదం అందజేత యాలాల: ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని.. మండల పరిధి రాఘవపూర్ గ్రామానికి చెందిన జనార్దన్రెడ్డి(ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్, ఖమ్మం) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పేరిట భద్రాచలం రాములోరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని, ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశానని కమిషనర్ తెలిపారు. ఆయనతో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సంఘ నాయకులు నర్సిరెడ్డి, అనిల్కుమార్ ఉన్నారు. బైక్పై నుంచి పడి వ్యక్తి మృతి దోమ: వాహనదారుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన గుండాల గేట్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప(45), దోమ మండలం కొత్తపల్లి గ్రామంలోని బంధువు మల్లయ్య ఇంటికి వచ్చాడు. స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కింద పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అడవిపంది దాడిలో గొర్ల కాపరికి గాయాలు దుద్యాల్: అడవిపంది దాడిలో మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధి సంట్రకుంటతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన కిషన్ నాయక్.. రోజులాగే మేకలను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని కందిపొలం జీవాలు మేత మేస్తుండగా.. ఆడవిపంది కిషన్పై దాడి చేసింది. కరిచి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో కాపరి కాలు, చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధితున్ని నారాయణపేట్ జిల్లా కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్కు తీసుకెళ్లారు. వృద్ధురాలి మృతి ఆలస్యంగా వెలుగులోకి బషీరాబాద్: ఓ ఇంట్లో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని పర్వత్పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంకుల లక్ష్మమ్మ(66) ఒంటరిగా ఉంటోంది. కొడుకు కాశప్ప కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నంలో స్థిరపడ్డారు. కూతురు నర్సమ్మ తాండూరులో ఉంటోంది. వీరు అప్పుడప్పుడు తల్లిని చూసేందుకు వచ్చి వెళ్తుంటారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూశారు. ఆమె శరీరం ఉబ్బి, కుళ్లిపోయి ఉండటంతో మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని భావించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు గ్రామానికి చేరుకొని విలపించారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. అస్తమా లేదా చలి తీవ్రతతో చనిపోయి ఉంటుందని స్థానికులు తెలిపారు. ఘనంగా ఎల్లమ్మ జాతర యాలాల: ఎల్లమ్మ జాతర ఘనంగా జరిగింది. మండల పరిధిలోని దేవనూరు గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. గ్రామస్తులు నెత్తన బోనంతో డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొన్నారు. ఈ సందర్భంగా పోతురాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ రేణుకాదేవి, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు ఆశన్న, మంత్రి వెంకటయ్య, యువ నాయకుడు కిరణ్, మెట్లి కృష్ణ, మహమూద్, సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. -
ఒక్కోచోట ఒక్కో ధర!
సాక్షి,సిటీబ్యూరో: రైతులకు గిట్టుబాటు ధర... కొనుగోలుదారులకు సరసమైన ధరలకే నాణ్యమైన కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన రైతు బజార్లపై పర్యవేక్షణ కరువైంది. తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి అన్నట్లుగా గ్రేటర్ పరిధిలోని రైతుబజార్లకు ఎస్టేట్ ఆఫీసర్లను నియమించి చేతులు దులుపుకుంది మార్కెటింగ్ శాఖ. హోల్సేల్ మార్కెట్లో కూరగాయల ధరలకు అనుగుణంగా ఏ రకం ఎంతకు అమ్మాలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయిస్తుంది. అన్ని రకాల కూరగాయలకు ధరలను నిర్ణయించి, ఏ రోజుకారోజు అన్ని రైతుబజార్లలోని ఎస్టేట్ ఆఫీసర్కు వాటి వివరాలను పంపుతారు. అయితే ఇది రైతుబజార్లలో ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని రైతు బజార్లలో ఒకే ధరలు అమలు చేయాలని నిబంధలు ఉన్నా నగరంలోని రైతుబజార్లలో ఈ తరహా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ధరల్లో వ్యత్యాసం దేనికి..? సామాన్యంగా రైతులు పొలం నుంచి తెచ్చిన పంటను ఎంతో కొంతకు అమ్ముకు వెళ్లిపోతారు. రైతుబజార్లలో రైతుల పేరిట తిష్ట వేసిన దళారులు... వినియోగదారులను దగా చేస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు కూరగాయల నాణ్యతను పరిశీలించి, ధరలు నిర్ణయిస్తారు.రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బోర్డులపైన వాటి వివరాలను పేర్కొంటారు. అయితే ఆ ధరలు తమకు గిట్టుబాటు కావని దళారులు తెగేసి చెబుతున్నారు. ఎవరైనా వినియోగదారులు ధరల విషయమై ప్రశ్నిస్తే... వారిని నానా మాటలు అని అవమానించి పంపేస్తుంటారు. పర్యవేక్షణ కరువు ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి దళారులకు అడ్డాలుగా మారిపోయాయి. రైతుల స్థానంలో ఒక్కొక్కరుగా నగరానికి చెందిన వారే రైతుల అవతారం ఎత్తుతున్నారు. నగరం నలువైపులా ఉన్న జిల్లాల నుంచి వచ్చే రైతులకు ఇక్కడ స్థానం లేకుండా పోతోంది. రైతు బజార్లలో దళారులను ఏరి వేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయా రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు చెబుతున్నా.. అది తూతూ మంత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల నుంచి తెచ్చుకున్న కూరగాయలను ఒకప్పటి మాదిరిగా అమ్ముకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయిన్పల్లి, గుడి మల్కాపూర్ లాంటి పెద్ద మార్కెట్లలో హోల్సేల్గా కొనుగోలు చేసిన కొందరు ఇక్కడికు తెచ్చి రైతుల పేరుతో విక్రయిస్తున్నారు. తమకంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నా వారిని అడిగే వారు కరువయ్యారని రైతులు పేర్కొన్నారు. పేరుకే రైతు బజార్లు వాటినిండా దళారులు, బినామీలే తిష్ట వేసి రైతులను రాకుండా చేస్తున్నారు. వీరి ఎస్టేట్ ఆఫీసర్లు, సూపర్వైజర్ల అండ ఉండటంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. క్షేత్ర స్థాయిలో రైతు బజార్లలో తనిఖీలు నిర్వహించే ఉన్నతాధికారి లేకపోవడంతో మధ్య దళారులు పెరిగిపోతున్నారు. ఇప్పటికై నా నిజమైన రైతులే రైతు బజార్లలో కూరగాయాలు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. కూరగాయల అమ్మకాల్లో ఇష్టారాజ్యం ఆన్లైన్ బిల్లింగ్ శ్రేయస్కరమంటున్న వినియోగదారులు -
శంషాబాద్ జోన్లోకి ఆదిబట్ల
● 17డివిజన్లతోసర్కిల్ కేంద్రంగా ఏర్పాటు ● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇబ్రహీంపట్నం రూరల్: శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం గ్రేటర్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటగా చార్మినార్ జోన్లోకి ఆదిబట్లను కలుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఔటర్రింగ్రోడ్డుకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంపై నిన్నటి వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గతంలో 150 కార్పొరేటర్ సిట్లు ఉన్న జీహెచ్ఎంసీ ప్రస్తుతం 300లకు పెంచింది. అందులో భాగంగానే ఆదిబట్ల మున్సిపాలిటీని సైతం రెండు వార్డులుగా విభజించింది. అభిప్రాయ సేకరణ పూర్తి ఆదిబట్ల మున్సిపాలిటీ గతంలో ఎంపీ పటేల్గూడ, మంగళ్పల్లి, బొంగ్లూర్, రాందాస్పల్లి, కొంగరకలాన్, ఆదిబట్ల, మంగళ్పల్లి ప్రాంతాలను కలిపి ఆదిబట్ల మున్సిపాలిటీగా చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో ఆదిబట్ల మున్సిపాలిటీని విలీనం చేయడంతో 54 డివిజన్గా కొంగరకలాన్, 55వ డివిజన్గా ఆదిబట్లను ప్రకటించారు. అభిప్రాయ సేకరణ చేసినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెండు డివిజన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ జోన్లో ఆదిబట్ల సర్కిల్ ఆదిబట్ల మున్సిపాలిటీ మొదటగా చార్మినార్ జోన్లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా అభ్యంతరాలు వెలువడడంతో ప్రస్తుతం ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని శంషాబాద్ జోన్లోకి విలీనం చేశారు. ప్రస్తుతం శంషాబాద్లో ఆదిబట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ నాలుగు సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో తొర్రూర్, కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయంజాల్, నాదర్గుల్, ప్రశాంతిహిల్స్, జిల్లెలగూడ, మీర్పేట్, బాలాపూర్, షాహీన్నగర్, పహాడీషరీఫ్, జల్పల్లి, తుక్కుగూడ, మంఖాల్, శంషాబాద్, కొత్వాల్గూడ డివిజన్లను కలిపింది. నాలుగు సర్కిల్లు ఇందులో ఉండగా తొర్రూర్, కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయంజాల్ డివిజన్లను కలుపుతూ ఆదిబట్ల సర్కిల్గా ఏర్పాటు చేయనుంది. పరిపాలన సౌలభ్యం పట్టణ ప్రజలకు సేవలందించడానికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టరేట్ కార్యాలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిబట్లను సర్కిల్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. డివిజన్ 53 తొర్రూర్, 54 కొంగరకలాన్, 55 ఆదిబట్ల, 56 తుర్కయంజాల్లను కలుపుతూ ఆదిబట్ల సర్కిల్గా చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిబట్ల మున్సిపాలిటీ కార్యాలయం లేదా , ఔటర్ పరిసర ప్రాంతాల్లో కొత్త సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కానుందని అధికార వర్గాల సమాచారం. -
డబ్బులు పంపుతావా.. జైలుకు వెళ్తావా?
● బెదిరింపు కాల్స్తో యువకుడి ఆత్మహత్య ● పోలీసుల అదుపులో నిందితుడుపూడూరు: ‘డబ్బులు పంపు. లేదంటే జైలుకు పంపిస్తాను. చంపేస్తా’ అని గుర్తు తెలియని వ్యక్తి బెధిరింపు ఫోన్కాల్స్తో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన వడ్త్యా రాఘవన్ అలియాస్ పవన్(26) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా రెండు సెల్ఫోన్ నంబర్లతో.. ఓ వ్యక్తి క్రైమ్ కానిస్టేబుల్ అని, కంట్రోల్ రూం నుంచి మాట్లాడుతున్నానని వివిధ రకాలుగా బెధిరించి డబ్బులు వేయమని వేధించసాగాడు. డబ్బులు పంపకుంటే జైలుకు పంపిస్తానని, చంపేస్తానని బెధిరించాడు. దీంతో మనస్తాపంచెందిన పవన్.. ఈ నెల 23న రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్కు ప్రాంతంలో పురుగు మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కాల్డేటా ఆధారంగా హైదరాబాద్కు చెందిన వ్యక్తిపై అనుమానం ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిని డబ్బుల కోసం ఫోన్లో వేధించినట్లు గుర్తించారు. మృతుడి అన్న విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ధ్యాన కేంద్రానికి వెళ్తూ.. అనంతలోకాలకు..
● ఔటర్పై డివైడర్ను ఢీకొన్న క్వాలీస్ వాహనం ● మహిళ మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు శంషాబాద్ రూరల్: ఔటర్పై అతి వేగంగా వెళ్తున్న క్వాలీస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలకు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డికి చెందిన కొత్తగడి శిరీష(31), ఆమె కుమార్తె సృజన(10), బంధువులతో కలిసి క్వాలీస్ వాహనంలో శుక్రవారం తెల్లవారుజామున కడ్తాల్లోని ధ్యాన కేంద్రానికి బయలుదేరారు. వీరి వాహనం మండలంలోని పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే ఔటర్పై డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడిన శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమార్తె సృజనతో పాటు సంధ్య, వీరమని, శారద, సంధ్య కుమార్తె అభిజ్ఞ(9)కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను శంషాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
6న బహిరంగ వేలం
అనంతగిరి: అనంతగిరిగుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం వద్ద ఏడాది పాటు వాహనాల పార్కింగ్ డబ్బు వసూలుకు జనవరి 6వ తేదీ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈవో నరేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షల నగదు డిపాజిట్గా చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. పరిగి: సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పరిగి పట్టణానికి చెందిన పీర్మహ్మద్ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని పేర్కొనారు. రైతు, కార్మిక సమస్యలపై సీపీఐ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాల అభివృద్ధితాండూరు రూరల్: ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధి సర్పంచులు శివరాజ్, ఈడ్గి సరితగౌడ్, చరణ్సింగ్లను సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, జగదీష్, పాండు, జగదీష్లు పాల్గొన్నారు. -
పనిచేసే వారికే గుర్తింపు
అనంతగిరి: పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన వారిని ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు ఉంటాయన్నారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని తెలి పారు. పంచాయతీలకు త్వరలో ప్రత్యేక నిధులు కేటాయిస్తారని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో, మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. అనంతరం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్రెడ్డి, జనరల్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ మాట్లాడారు. త్వరలో జిల్లా కమిటీని ఏర్పాటుచేస్తామని, ఈ నెల 3, 4 తేదీల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 3వ తేదీ ఉదయం తాండూరులో, మధ్యా హ్నం వికారాబాద్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 4వ తేదీ ఉదయం కొడంగల్, మధ్యాహ్నం పరిగిలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ సారి పదవుల్లో 20 నుంచి 25 శాతం మహిళలకు అవకాశాలు ఇవ్వాలనుకుంటాన్నట్లు తెలిపారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు కానున్న కొత్త కమిటీతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ సీఎంపై చేసిన వ్యాఖ్యాలను ఖండించారు. భాష మార్చుకోవాల్సింది కేసీఆర్ అని హితవు పలికారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్చైర్మన్ రమేష్కుమార్, డీసీసీబీ మాజీ డైరక్టర్ కిషన్నాయక్, నాయకులు రాంచంద్రారెడ్డి, గురువారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, సర్పరాజ్, మోహన్, వేణుగోపాల్, మనోహర్ గౌడ్ పాల్గొన్నారు. పరిగిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం పరిగి: పరిగి పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ కాలనీలో రూ.9 లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు, తుంకుల్గడ్డలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో పరిగికి రైలు మార్గం వస్తుందన్నారు. లక్నాపూర్ ప్రాజెక్టును టూరిజం స్పాట్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. తిర్మలాపూర్ అభివృద్ధికి కృషి పూడూరు: తిర్మలాపూర్ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామ నూతన సర్పంచ్ అనూష, ఉప సర్పంచ్ శ్రీను, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలోనే తండాలు అభివృద్ధి చెందాయన్నారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు రఘునాథ్రెడ్డి, సతీష్రెడ్డి, శ్రీనివాస్, రాములునాయక్, గోపాల్, మేగ్యారాజ్ తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి త్వరలో కాంగ్రెస్ జిల్లా కమిటీ ఏర్పాటు 3, 4 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్రెడ్డి -
పురాతన శిల్పాలను కాపాడుకోవాలి
● కొడంగల్ పట్టణానికి వెయ్యేళ్ల చరిత్ర ● పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శివనాగిరెడ్డి కొడంగల్: పట్టణంలోని తూర్పు కమాన్కు ఎడమవైపు వీధిలో ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలం నాటి శిల్పాలను (పదవ శతాబ్ది) కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆదరణకు నోచుకోని పలు శిల్పాలను గమనించారు. నాగదేవత, నంది శిల్పాలు, కళ్యాణ చాళుక్య కాలం నాటి వీరుల శిల్పాలను పరిశీలించారు. సర్పాలతో పాటు కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో డాలు తలపై కిరీటం ధరించి నడుమ నుంచి కింద భాగం వరకు సర్పం, దేవతల ఆకారాన్ని కలిగి ఉన్న శిల్పాలు, చేతిలో ఈటలు ధరించి పులిని చంపుతున్న తల లేని వీరుని శిల్పం, వంటిపైన గంట పట్టెడ ధరించి చిన్న మోపురంతో తలలేని నంది, నల్ల శాసనం రాతిలో చెక్కిన శిల్పాలు కొడంగల్కు వెయ్యేళ్ల చరిత్రకు సాక్షంగా నిలుస్తున్నాయన్నారు. ఈ శిల్పాలు అలనాటి సంస్కృతికి చిహ్నంగా ఉన్నాయని తెలిపారు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని రక్షించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ స్థపతి, సమతా మూర్తి రూపశిల్పి డీఎన్వీ ప్రసాద్, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, నందారం ప్రశాంత్, రత్నం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి అనంతగిరి: ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ అన్నారు. పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వికారాబాద్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసిన చరిత్ర సీపీఐ నాయకులకు ఉందన్నారు. సమాజంలోని పేదలు, విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మిక లోకం కోసం ముందుండి పోరాడుతుందన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకుల త్యాగాల ఫలితంగానే నేడు ముందుకు సాగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై పోరాటంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తామని పేర్కొ న్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏసురత్నం, గోపాల్రెడ్డి, రావుఫ్, అనంతయ్య, పీర్ మహముద్, అబ్దుల్లా, వెంకటేష్, సురేష్, జగదాంబ, విమలమ్మ, ఖాదర్, హనుమంతు, బీరయ్య, నర్సింలు పాల్గొన్నారు. -
కాపాడబోయి.. తన దుకాణంలో దాక్కున్న వ్యక్తిని ప్రత్యర్థుల నుంచి కాపాడబోయిన వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యారు.
● దేశంలోనే అతిపెద్ద నగర కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ ● 300 వార్డులతో మొదటి స్థానం.. ద్వితీయ స్థానంలో ఢిల్లీ ● పాలన సౌలభ్యం.. ప్రజలకు సౌకర్యాలు పెరిగే అవకాశం బిగ్ సిటీకూకట్పల్లి జోన్సికింద్రాబాద్ జోన్శేరిలింగంపల్లి జోన్నగర పాలనలో నూతన దిశ.. సిటీ ‘ఫేస్’ మారింది డీలిమిటేషన్తో హైదరాబాద్ ముఖచిత్రం మారింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా సిటీ చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకు 150 వార్డులతో (డివిజన్లతో) ఉన్న కార్పొరేషన్ ఏకంగా 300 వార్డులకు పెరిగింది. ఈ విస్తరణ వల్ల ప్రభుత్వం చెబుతున్నట్లుగా ప్రజలకు పాలన చేరువ కానుందా? మౌలిక సదుపాయాలు మెరుగవుతాయా ? అన్నది భవిష్యత్లో వెల్లడి కానుంది. అత్యధిక వార్డులున్న మున్సిపల్ కార్పొరేషన్గా.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 300 వార్డుల(డివిజన్ల)తో దేశంలోనే అత్యధిక వార్డులున్న మహా నగరంగా మారింది. – బీఎంసీ, ఎంసీడీ, బీబీఎంపీల్లో 200కు పైగా వార్డులున్నప్పటికీ, 300 వార్డులున్న మహానగరం మాత్రం హైదరాబాదే కావడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంతో హైదరాబాద్ బృహత్ నగరంగా మారిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయాల్లో రాజేంద్రనగర్, గోల్కొండ జోనల్ ఆఫీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విలీనంతో నగర విస్తీర్ణం 650 చదరపు కిలో మీటర్ల నుండి 2053 చదరపు కిలో మీటర్లకు విస్తరించిందన్నారు. విస్తీర్ణం పెరగడంతో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డులను 150 నుండి 300కు పెంచిందన్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచడం జరిగిందని చెప్పారు. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్లు కొత్త జోన్లుగా ఏర్పాటయ్యాయన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల పెంపుతో పౌరసేవలు సులభంగా, వేగంగా అందుతాయన్నారు. మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త బాధ్యతలు.. జీహెచ్ఎంసీలో ఉన్న ఆరు జోన్లకు తోడు అదనంగా మరో ఆరు జోన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం..కొత్త జోన్లకు కమిషనర్లను కూడా వెంటనే నియమించింది. గురు, శుక్రవారాలు సెలవురోజులైనప్పటికీ, డీలిమిటేషన్ తుదినివేదిక, జోనల్ కమిషనర్ల నియామకాలు, వారు బాధ్యతలు స్వీకరించడాలు జరిగాయి. జీహెచ్ఎంసీ కొత్త స్వరూపం కావడంతో ఇప్పటికే జోనల్ కమిషనర్లుగా ఉన్నవారు కూడా మళ్లీ కొత్తగా తమ జోనల్ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ (జడ్సీ)గా అనురాగ్జయంతి, గోల్కొండ జడ్సీగా జి.ముకుంద్రెడ్డి, చార్మినార్ జడ్సీగా ఎస్.శ్రీనివాస్రెడ్డి, కూకట్పల్లి జడ్సీగా అపూర్వ్ చౌహాన్, శంషాబాద్ జడ్సీగా కె.చంద్రకళ, ఉప్పల్ జడ్సీగా రాధికాగుప్తా, సికింద్రాబాద్ జడ్సీగా ఎన్.రవికిరణ్, ఖైరతాబాద్ జడ్సీగా ఆల ప్రియాంక, మల్కాజిగిరి జడ్సీగా సంచిత్ గంగ్వార్, శేరిలింగంపల్లి జడ్సీగా బోర్కడే హేమంత్ సహదేవ్రావ్, కుత్బుల్లాపూర్ జడ్సీగా సందీప్కుమార్ఝా, ఎల్బీనగర్ జడ్సీగా హేమంత్ కేశవ్పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త జడ్సీలకు కమిషనర్ కర్ణన్ అభినందనలు తెలిపారు. విధుల నిర్వహణలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశంలోని ప్రధాన నగరాలు, అక్కడి మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులిలా ..నగరం మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 300 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) 250 ముంబై బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 227 బెంగళూరు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) 225 చైన్నె గ్రేటర్ చెన్నయ్ కార్పొరేషన్ 200 పుణే పుణే మున్సిపల్ కార్పొరేషన్ 162 కోల్కతా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ 144 అహ్మదాబాద్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 48 సమగ్ర ప్రణాళికలు, మెరుగైన పౌర సేవలు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించిన కారణంగా.. సరిపడా భూ లభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు అమలు చేసే అవకాశం లభించింది. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు జీహెచ్ఎంసీ నిధులు, సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి రానున్నాయి. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, దోమల నివారణ, అత్యవసర సేవలు వంటి ప్రామాణిక పౌర సేవలు అందనున్నాయి. వేగంగా పౌరసేవలు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జోనల్ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు -
‘మరాటి’కి డాక్టరేట్
తాండూరు టౌన్: మండలంలోని నారాయణపూర్కు చెందిన తెలుగు అధ్యాపకుడు మరాటి నర్సింలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ‘వికారాబాద్ జిల్లా మాండలికం – పరిశీలన’ అనే అంశంపై ఆచార్య వెలుదండ నిత్యానందరావు పర్యవేక్షణలో పరిశోధన చేసి ఓయూ తెలుగు శాఖ వారు నిర్వహించిన మౌఖిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నర్సింలును ఓయు తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ విజయలక్ష్మి, పరీక్షకులు డాక్టర్ రఘు, వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ కె నారాయణమూర్తి అభినందించి తుది పరిశోధనా గ్రంథాన్ని అందజేశారు. -
క్రిస్మస్ శుభాకాంక్షలు
స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: ఏసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని క్రిస్టియన్లకు స్పీకర్ ప్రసాద్కుమార్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకమన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ట్రెయినీ కలెక్టర్ చంద్రకిరణ్ అనంతగిరి: లక్ష్య సాధనకు ఏకాగ్రత ఎంతో అవసరమని ట్రెయినీ కలెక్టర్ చంద్రకిరణ్ అన్నారు. బుధవారం పట్టణంలోని సిద్ధార్థ స్కూల్లో నిర్వహించిన ఎఫ్ 5(ఫుడ్ ఫెస్టివల్) కార్యక్రమాన్ని విద్యా సంస్థల డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్పం సాధించాలంటే ఏకాగ్రతతో సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్లు సీ వేణు గోపాల్రావు, ఆర్ బదరీనాథ్, కూర జయదేవ్, డా. పీ కృష్టారెడ్డి, ప్రిన్సిపాల్ సభిత రాణి, సిబ్బంది మంజుల జాదవ్, విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతగిరి: వినియోగదారుల హక్కులను కాపాడుతామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు తను తీసుకున్న వస్తువుకు డబ్బులు చెల్లించిన రసీదు పొందాలన్నారు. వస్తువు నాణ్యతలో లోపం ఏర్పడితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్ఓ మంగీలాల్, రేషన్ షాపు డీలర్లు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. దౌల్తాబాద్: కోస్గి పట్టణంలో బుధవారం నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మండలంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తరలివెళ్లారు. మండలంలోని 33 పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులను ఆయా పంచాయతీల కార్యదర్శులు వాహనాల్లో తీసుకెళ్లారు. తుక్కుగూడ: ఆశ కార్యకర్తల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆశ కార్యకర్తలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,358 మంది ఆశ కార్యకర్తలకు చీరలు అందజేశామని చెప్పారు. ఆశాలకు ప్రభుత్వం ఏటా ఒక జత యూనిఫాం రూపంలో చీరలను అందిస్తుందన్నారు. ఆశాలు గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నూతన జాయింట్ సెక్రటరీగా బద్యానాథ్చౌహన్
ఆమనగల్లు: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం జాయింట్ సెక్రటరీగా ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్చౌహన్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీఓ భవన్లో బుధవారం ఫోరం ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్గా కృష్ణయాదవ్, అసిస్టెంట్ ఆఫీసర్గా రామారావు వ్యవహరించారు. నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికై న బద్యానాథ్చౌహన్ను ఫోరం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎకై ్సజ్ శాఖ అడిషనల్ కమిషనర్ ఖురేషీ, సురేశ్రాథోడ్ తదితరులు ఘనంగా సన్మానించారు. -
సహకారం అభినందనీయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి ● ఘనంగా వీడ్కోలు అనంతగిరి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి బదిలీ అయ్యారు. జ్యుడీషి యల్ అకాడమికి వెళ్తున్న ఆయన్ను బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లా న్యాయవాదుల సహకారం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరసింహ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరేందర్, జీపీ శ్రీనివాస్రావు, బార్ అసోసియేషన్ సంయుక్త కా ర్యదర్శి ఆనంద్, సీనియర్ న్యాయవాదులు పర మానందరావు, కమాల్రెడ్డి, యాదవరెడ్డి, లవకుమార్, గోపాల్రెడ్డి, సంపూర్ణఆనంద్ పాల్గొన్నారు. -
హైవేపై హోర్డింగ్ల తొలగింపు
యాచారం: అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్లను అధికారులు తొలగిస్తున్నారు. పంచాయతీలకు ఆదాయం లేకుండా ప్రచారం కోసం వ్యాపారులు నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. జీపీలకు కనీస సమాచారం లేకుండా సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి మాల్ వరకు వందలాదిగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, వస్త్ర వ్యాపారం, విద్యాలయాలు, ఆస్పత్రుల తదితర ప్రైవేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ ఇష్టానుసారంగా ప్రకటనలు ఏర్పాటు చేస్తున్నారు. అవి రోడ్డుకు దగ్గరగా ఉండడంతో రాకపోకలు సాగించే వాహనాలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు అనుమతులు ఉండడంతోనే వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ సంస్థల ప్రచారం కోసం హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రజలు భావించారు. కానీ ఏ ఒక్క సంస్థ కూడా పైసా పన్ను చెల్లించకుండానే భారీ ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా హోర్డింగ్లు బిగిస్తున్నారు. హైవేపై 200లకు పైగానే.. సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు 200లకు పైగానే భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాచారం పంచాయతీ శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం సాగర్ హైవేతో పాటు 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లను తొలగించేశారు. ఇకపై అనుమతి లేకుండా ప్రకటనలు చేయవద్దని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ కోసం, వివిధ ఆఫర్ల పేరుతో హోర్డింగ్లు పెట్టి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పంచాయతీలకు ఆదాయం పెంచడం కోసమే హోర్డింగుల తొలగింపునకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ చిన్న హోర్డింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా.. ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన అనుమతి పత్రాలు, బాధ్యులైన వారి పేర్లతో కూడిన దరఖాస్తులు చేసుకుంటే నిర్ణయించిన ఫీజులు చెల్లించిన తర్వాత, నిర్ణీత గడువు వరకే అనుమతులు మంజూరు చేస్తారు. గడువు లోపు తొలగించకపోతే పంచాయతీ సిబ్బంది తొలగిస్తారు. లేని పక్షంలో ఆలస్యం కింద భారీ జరిమానాలు వసూల్ చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశంతో కదిలిన యంత్రాంగం అనుమతులు లేకుండా ఏర్పాటు చేయొద్దని సూచన నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా జీపీల ఆదాయం పెంచడంపై అధికారుల కృషి -
విద్యారంగం నిర్వీర్యానికి కుట్ర
అనంతగిరి: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తక్షణమే విరమించుకోవాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ ప్రధాన సంపాదకుడు మాణిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అధ్యక్షతన బుధవారం వికారాబాద్లో సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాణిక్రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఫైనాన్స్ బిల్లు సైతం పెన్షనర్లకు ఉరితాడుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఓ వైపు ప్రపంచం మొత్తం ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతుండగా, ఇక్కడ మాత్రం 25 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన టీచర్లు సైతం టెట్ పరీక్ష రాయాలంటూ నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సర్వీస్లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు పరీక్ష పాస్ కాకపోతే వృత్తిని వదుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ఇటీవల పలువురు ఎంపీలు సభ దృష్టికి తీసుకెళ్లినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లుగా విద్యారంగ పురోగమనంపై మాట్లాడటం మినహా ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాములు, ఉపాధ్యక్షుడు బి.నర్సింలు, కోశాధికారి మొయిజ్ఖాన్, జిల్లా కార్యదర్శులు ఎన్.బాబురావు, టి.పవన్ కుమార్, బసప్ప, వెంకటయ్య, ముత్తప్ప, సలీం, నర్సింలు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను విరమించుకోవాలి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ ప్రధాన సంపాదకుడు మాణిక్రెడ్డి -
ఎకరాకు రూ.కోటి ఇవ్వండి
● గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాధితుల డిమాండ్ ● అందరికీ సమాన పరిహారం ఇవ్వాలని అభ్యర్థన ● నిర్వాసితులతో ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశం కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం అందించాలని మర్రిపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు తదితరులు బుధవారం కలెక్టరేట్లో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని, భూమి కొల్పోతున్న తమకు ఎకరాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఎకరాకు రూ.25 లక్షల పరిహారం సరిపోదని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ మొదటి మార్గం రావిర్యాల నుంచి చివరి మార్గం ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం అందించాలని కోరారు. రూ.25 లక్షల పరిహారం.. అడిషనల్ కలెక్టర్, భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డులో పూర్తిగా భూమి కోల్పోతున్న బాధితులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.5.60 లక్షల చొప్పున పరిహారం, కోల్పోయిన భూమి ఆధారంగా 60 గజాల నుంచి 480 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. న్యాయం జరిగేలా చూస్తాం.. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ బాధితులకు ప్రైవేట్ ఉద్యోగంతో పాటు, కడ్తాల్లో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మరింత మేలైన పరిహారం ఇచ్చే అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి గ్రామ సర్పంచ్ ఈర్లపల్లి రవి, రైతులు రచ్చ శ్రీరాములు, నారయ్య, మల్లేశ్గౌడ్, సత్తయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు. -
‘పాలమూరు – రంగారెడ్డి’పై సర్కారు నిర్లక్ష్యం
● పది శాతం పనులు కూడా చేయలేదు ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మీర్పేట: రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై బుధవారం మీర్పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 90 శాతం పనులు పూర్తయినా మిగతా 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడంతో పాటు ప్రాజెక్టుపై శీతకన్ను వేశారన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం, పాలమూరు వంటి రెండు పెద్ద ప్రాజెక్టులను నాడు కేసీఆర్ ప్రారంభించారన్నారు. 45 టీఎంసీలు ఎలా సరిపోతాయి? కేసులు కొట్టేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30వేల కోట్లతో పాలమూరు పనులకు శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అంతేకాక రూ.27వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు కూడా పూర్తయ్యాయని, ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించకపోగా, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారని, అలాంటి గొప్ప నేతను విమర్శించడం మాని, మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై కేసీఆర్ అధ్యక్షతన తమ కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హరీశ్వర్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక తరలిస్తున్నారని కర్రలతో దాడి
● ట్రాక్టర్ యజమానితో పాటు మహిళకు తీవ్రగాయాలు ● దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు బషీరాబాద్: ఇసుక తరలించేందుకు వచ్చారని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టి, గాయపర్చిన ఘటన కంసాన్పల్లి(బి)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు ట్రాక్టర్లు తీసుకుని, కంసాన్పల్లి రైతులు గొల్ల కృష్ణ, గొల్ల అశోక్కు చెందిన పొలం వద్దకు చేరుకున్నాడు. కూలీలతో కలిసి ఇక్కడ మేట వేసిన ఇసుకను తవ్వేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడే ఉన్న కృష్ణ, అశోక్ అడ్డుకుని, కర్రలతో దాడి చేశారు. సాయిలుతో పాటు యశోదమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపర్చారు. హడలిపోయిన బాధితులు ట్రాక్టర్లు అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ విషయమై బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్లర్లతో పొలం వద్దకు వెళ్తుండగా మధ్యలో అడ్డుకున్న కృష్ణ, అశోక్ తమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారణ జరిపిన తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఐ విఠల్ ఇరువర్గాలతో మాట్లాడి, దాడికి పాల్పడిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కేసుల ఛేదనలో పురోగతి
వికారాబాద్: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సైబర్, ఇతర నేరాలు పెరిగాయని, కేసుల నమోదులో పారదర్శకంగా వ్యవహరించామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. 2024తో పోలిస్తే ప్రధాన నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోందన్నారు. బుధవారం వికారాబాద్లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2025లో నమోదైన నేరాలకు సంబంధించి వార్షిక నివేదికను వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్, నిఘా వ్యవస్థల బలోపేతం, నిరంతర అవగాహన కార్యక్రమాలతో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. మృతుల సంఖ్య తగ్గిందన్నారు. గుట్కా క్రయ విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక దందాను సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వివరించారు. డయల్ 100కు అత్యధిక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో ఈవ్ టీజింగ్ తదితర కేసులు ఉన్నాయన్నారు. వీటన్నింటిని పరిశీలించి పరిష్కరించామని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా 1,741 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులకు విముక్తి కల్పించామన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా కేసుల ఛేదనలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, వికారాబాద్, పరిగి డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన సిబ్బందికి అభినందనలు అనంతగిరి: డిజిటల్ సేవల్లో ప్రతిభ చాటిన జిల్లా ఐటీ సెల్, ఈకాప్స్ పోలీసు అధికారులు రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జిల్లాలో సీసీటీ ఎన్ఎస్ (వెర్షన్ 1 – 2) సాఫ్ట్వేర్ వినియోగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు వీరికి ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జిల్లా ఐటీ హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కానిస్టేబుల్ శివశంకర్, పరిగి పోలీస్ స్టేషన్ ఈకాప్స్ కానిస్టేబుల్ బక్కరెడ్డి, యాలాల కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహమెహ్ర వారిని అభినందించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, అంకితభావంతో విధి నిర్వహణ చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్, నిఘా వ్యవస్థలను బలోపేతం చేశాం గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య పెరిగింది రోడ్డు ప్రమాదాలు తగ్గాయి ఎస్పీ స్నేహమెహ్ర జిల్లాలో నమోదైన కేసులపై వార్షిక నివేదిక వెల్లడి -
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తాండూరు రూరల్: అంతారంలో..పరిగి: పశువుల పాకలో ఏసుక్రీస్తు ముస్తాబైన చర్చి క్రిస్మస్ శోభజిల్లాలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు క్రిస్టియన్లు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాల్లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శిలువ, పశువుల పాక, మేరీమాత ప్రతిమ, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. గురువారం పాస్టర్లు దైవ సందేశం వినిపించనున్నారు. – పరిగి -
‘డబుల్’ నిరసన
● అనర్హులు ఇళ్లు తీసుకున్నారని మహిళల ఆందోళన ● పేదలను గుర్తించాలని ప్రభుత్వానికి అభ్యర్థన తుక్కుగూడ: అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం తుక్కుగూడ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని సర్ధార్నగర్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లాటరీ పద్ధతిన అర్హులకు కేటాయించిందని తెలిపారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి, ఒక్కొక్కరు మూడు, నాలుగు ఇళ్ల చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. కొంత మందికి పట్టాలు ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వమైనా అనర్హులను తొలగించి, పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మంచాల: బొలెరో వాహనం ఫల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మంచాల మండల పరిధిలోని రంగాపూర్ సమీపంలో కోళ్ల వంపు వాగు మలుపు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెం గ్రామానికి చెందిన ఓడుసు శివ(25) అతని స్నేహితులు యావ శంకర్, ఎడ్ల నాగరాజుతో కలిసి లోయపల్లి నుంచి రంగాపూర్ వైపు బొలెరో వాహనంపై వస్తున్నారు. రంగాపూర్ సమీపంలో చేరుకోగానే కోళ్ల వంపు వాగు మలుపు వద్ద రోడ్డుపై అతి వేగంగా వచ్చి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శివకు బలమైన గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న మంచాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వెంటనే 108 అంబులెన్స్లో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విలీనంపై వివరణ ఇవ్వండి
● ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలతో నిర్ణయం? ● సమగ్ర పరిశీలనానంతరమే ఖరారు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్)కు బ్రేక్ పడింది. డివిజన్ల పునర్విభజన సహేతుకంగా లేదనే ఆరోపణల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగర పాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులు పునర్విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపో, మాపో విడుదల కాగలదనుకుంటున్న తరుణంలో తాజా పరిణామం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన జారీ కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22వ తేదీ వరకు కూడా ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించారు. పునర్విభజనపై దాదాపు 6వేల అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. వాటిల్లో అర్హత కలిగిన, సమంజసమైనవిగా భావించిన అన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ముమ్మర కసరత్తుతో రేయింబవళ్లు పనిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ కావడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వారి ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్ను పెండింగ్లో పెట్టినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకో..? వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎస్ఐఆర్, జనగణనను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ను త్వరితంగా పూర్తిచేయాలని పురపాలకశాఖ భావించింది. దానికి తగ్గట్టుగానే చకచకా డివిజన్లు, సర్కిళ్ల హద్దులకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకతీతంగా అటు ప్రజాప్రతినిధుల నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులందడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యర్థనలు, తదితరమైన వాటి నేపథ్యంలో తుది నోటిఫికేషన్ వెలువరిస్తే, హడావుడిగా ముగించారని విమర్శలు వెల్లువెత్తుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేకులు వేయాలని భావించినట్లు తెలిసింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో డివిజన్ల పేర్లు, హద్దులు, కార్పొరేషన్ల విభజనపై అచితూచి అడుగువేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి పదోతేదీ వరకు గడువుండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తుది నివేదికకకు విరామమిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డీనెన్స్లను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బీ రాజు హైకోర్టులో మూడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటరు. వివాదాస్పదంగా విలీనం చేసిన మున్సిపాలిటీల్లో ఇది ఒకటి. పిటిషనర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి అని.. విలీనం కారణంగా భూభాగ పరిధి, పాలన, స్వరూపం, జనాభా మార్పులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తుక్కగూడ కార్పొరేషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అలా చేయకుండా ఏకపక్షంగా విలీనం చేపట్టినందున ఆర్డినెన్స్ 9, 10, 11ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955కు చేసిన సవరణలను ఆపి వేయాలి’అని కోరారు. కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
సామగ్రి ధ్వంసం కాలేదు
తాండూరు రూరల్: మండల పరిధి గౌతపూర్ పంచాయతీ కార్యాలయంలో ఎలాంటి సామగ్రి ధ్వంసం కాలేదని పంచాయతీ కార్యదర్శి ఫక్రోజి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సర్పంచ్ రాజప్పగౌడ్ ఆరోపణలు అవాస్తమన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గదులను శుభ్రం చేస్తున్న క్రమంలో ఉత్తమ అవార్డు జ్ఞాపిక, నేమ్బోర్డు, పాలకవర్గం శిలాఫలకం ఒక గదిలో భద్రపరిచామని పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో వాటన్నింటిని కార్యాలయంలో ప్రదర్శనకు పెడతామన్నారు. ఓడిపోయామని.. దాడికి పాల్పడి ● హత్యాయత్నం కేసులో ఆరుగురి రిమాండ్ ● వివరాలు వెల్లడించిన సీఐ రఘురాములు బంట్వారం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయామన్న కక్షతో ప్రత్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ధారూరు సీఐ రఘురాములు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పాతకక్షల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఓడిపోయామన్న కోపంతో కోట్పల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త సంగయ్యస్వామిపై ప్రత్యర్థులు దాడికి పథకం వేశారు. ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు స్వామి ఇంటి సమీపంలోనే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోట్పల్లికి చెందిన మహ్మద్ షకీర్, ఆనెం శివకుమార్, మహ్మద్ అక్రమ్, ఖురేషి అజ్మత్, మహ్మద్ షాన్వాస్, నక్కల బందెయ్యలను అనుమానితులుగా భావించి, అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరం అంగీకరించారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపడతామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సీఐ తెలిపారు. రాజ్పాకాల కేసు వీడియోలు వైరల్ శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై మోకిల పీఎస్లో నమోదైన కేసు,చార్జిషీట్ అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతేడాది అక్టోబర్ 26న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని, ఇందులో విదేశీ మద్యం వినియోగించారనే అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై జూన్ 30నచార్జిషీట్ దాఖలు చేశారు. ఈఅంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో 35 మందిని విచారించిన తర్వాత, అనుమతి లేకుండా ఫాంహౌస్లో విదేశీ మద్యంతో పార్టీ చేసిన రాజ్ పాకాలపై, డగ్ర్ పరీక్షలో పాజిటివ్గా తెలిసిన విజయ్ మద్దూరిపై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేశామని మోకిల సీప వీరబాబు తెలిపారు. స్వార్థ ప్రయోజనాలకు యూనియన్ పేరు వాడొద్దు షాద్నగర్రూరల్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సంఘం పేరును తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే సహించేది లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని టీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్గౌడ్, నరేష్ అధ్యక్షతన సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత అవసరాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ సంఘం పేరును తప్పుగా వాడుకుంటున్నాని, ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య కుత్బుల్లాపూర్: కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పేట్బషీరాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.. వివరాలిలా ఉన్నాయి.. కొంపల్లికి చెందిన కృష్ణ, నాగమణి(42) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపానికి లోనైన నాగమణి బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా ఫాక్స్సాగర్ సమీపంలో చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ కి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కొడంగల్ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కోరారు. బుధవారం నగరంలోని కాచిగూడలో నిర్వహించిన స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2025– 26 విద్యా సంవత్సరం పది పరీక్షల షెడ్యూల్ను యథావిధిగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ జీపీఎఫ్ నిధులు, టీఎస్జీ ఎల్ఐసీ నిధులు, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు బేసిక్ పే కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. -
రాకపోకలకు అడ్డుగా మట్టి దిబ్బలు
బడంగ్పేట్: అధికారుల మధ్య సమన్వయలోపం వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనున్న భారీ వృక్షాలను తరలించి, దాని నుంచి వెలువడిన మట్టి కుప్పలను అక్కడే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. బడంగ్పేట్ పరిధిలోని నాదర్గుల్ నుంచి గాంధీనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేయకుండా ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దాదాపు 65 భారీ చెట్లను గుర్తించి వాటికి రంగులు వేసి నంబర్లతో మార్కింగ్ వేశారు. నెల రోజుల క్రితం చెట్లను వేళ్లతో సహా పెకిలించి క్రేన్ల సహాయంతో వేరే చోటుకు తరలించారు. అప్పుడు జేసీబీతో వేళ్లతో సహా పెకిలించేందుకు చెట్ల చుట్టూ మట్టిని తవ్వి అలాగే రహదారి పక్కన వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలో తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికై నా స్పందించి రోడ్డు పక్కన మట్టి కుప్పలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
వైభవంగా ధ్యాన మహాయాగాలు
కడ్తాల్: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ధ్యాన జనుల సందడితో వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ధ్యానులతో, పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 బుధవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయిఽ. ఉదయం సంగీత విధ్వాంసుడు సంజయ్కింగి బృందం ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యాన గురువు పరిణిత పత్రి ధ్యానులను ఉద్దేశించి ప్రసంగించారు. పత్రీజీ ఆశయ సాధనకు ధ్యానులు కృషి చేయాలన్నారు. ధ్యానం ద్వారం పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని తెలిపారు. జీవిత ధ్యేయం తనను తాను తెలుసుకోవాలనే పత్రీజీ ఇచ్చిన ఫార్మూల ఎంతో గొప్పదని కొనియాడారు. అనంతరం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకుడు శ్రేయాన్స్దాగా ప్రసంగిస్తూ.. ధ్యానంలో మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో మనల్ని మనం తెలుసుకోగలుతామని అన్నారు. కోట్లాది మంది ధ్యానులను పత్రీజీ తయారు చేశారని కొనియాడారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను, నూతన సంవత్సర క్యాలండర్లను, ఎనిమిదేళ్ల పీఎంసీ చరిత్రపై రూపొందించిన పీఎంసీ సావనీర్ను పిరిమిడ్ ట్రస్ట్ సభ్యులు, మాస్టర్లతో కలిసి పరిణిత పత్రి, ట్రస్ట్ చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మీడియా కో–ఆర్డినేటర్ భాస్కర్రెడ్డి, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, లక్ష్మి, నిర్మల, దామోదర్రెడ్డి, రవిశాసీ్త్ర, ఫౌండర్ బుద్ధ, సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో రోజుకు చేరిన వేడుకలు -
హామీలు నెరవేర్చండి
దోమ: ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు మండల కేంద్రమైన దోమ మెడికల్ ఆఫీసర్ రజితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగ సెలవులు జారీ చేయాలన్నారు. ఏఎన్సీ, పీఎన్సీ రద్దు చేయాలని కోరారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించడంతోపాటు పారితోషికంలో సగం డబ్బును పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నారు. ఏటా 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ లివ్స్, 6 నెలలు మెడికల్ సెలవులు ప్రకటించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కాటన్ యూనిఫాం అంద జేయాలని తెలిపారు. పీఆర్సీ ఎరియర్స్తో పాటు మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, మూ డు రోజుల పల్స్ పోలియో డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో వి శ్రాంతి గది ఏర్పాటు చేసి ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనిభారం తగ్గించి పారితోషికం లేని పనులను చేయించరాదని కోరా రు. కార్యక్రమంలో మండల ఆశవర్కర్లు అతి యా బేగం, పద్మమ్మ, లక్ష్మి, రమాదేవి, బుడ్డమ్మ, యశో ద, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సర్పంచ్లకు గుర్తింపు కార్డులు
దుద్యాల్: ఇటీవలే ఎన్నికై న నూతన సర్పంచ్లకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి మంగళవారం గుర్తింపు కార్డులు అందాయి. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్లకు వెంటనే, ఇంత త్వరగా ఐడెంటిటీ కార్డులు అందడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. కొండగల్ నియోజకవర్గంలోని కోస్గిలో బుధవారం కొత్త సర్పంచ్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు. వీరితో కలిసి భోజనం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్లకు త్వరగా కార్డులు అందించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ గుర్తింపు కార్డులు ఉన్న వారికి ప్రత్యేకంగా ఎలాంటి పాసులు అక్కర్లేదని సమాచారం. -
లెక్కచెప్పాల్సిందే..
వికారాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. గెలిచిన వారు ఆనందంలో మునిగిపోయా రు. ఓటమి చవిచూసిన వారు అంతర్మథనం చేసుకుంటున్నారు.. ఎక్కడ లెక్క తప్పిందబ్బా అంటూ లెక్కలేసుకుంటున్నారు. ఓటమికిగల కారణాలను విశ్లేషిస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం ఇక ఎవరితో మాకేంటని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నామినేషన్ వేసిన నాటినుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారో వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. లేదంటే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకా రం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కలను బిల్లులతో సహా ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి 45 రోజుల్లోగా చూపించాల్సిందేనని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులకు ఈ నెలలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తాండూరు రెవెన్యూ డివిజన్లోని 8 మండలాల్లో 11వ తేదీ, వికారాబాద్ రెవెన్యూ డివిజన్లోని 7 మండలాల్లో 14వ తేదీ, పరిగి సెగ్మెంట్లోని 5 మండలాల్లో 17వ తేదీ ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పోలింగ్ తేదీకి పదిహేను రోజుల ముందు నిర్ణీత మండలాల్లో ప్రారంభమైంది. దీని ప్రకారం పోలింగ్ ముగిసిన 45 రోజుల్లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని 594 జీపీలకు గాను 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యా యి. మిగతా వాటికి 1,933 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. 5,058 వార్డులు ఉండగా 1,252 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి 10,055 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరందరూ ఎన్నికల ఖర్చులు చెప్పాల్సిందే. నిబంధనలివే.. పెరుగుతున్న వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు బ్యాంక్ ఖాతా నుంచే వ్యయం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 5 వేల జనాభా పైబడిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి వ్యయ పరిమితిని రూ.2.50 లక్షలు, వార్డుసభ్యులు రూ.50 వేల లోపే ఖర్చుచేయాలి. అదే విధంగా 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు రూ. 1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేల లోపే ఖర్చు చేయాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం – 2018 ప్రకారం తాము చేసిన ఎన్నికల వ్యయాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు గడువులోగా సమర్పించకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులు లెక్కలు చూపకుంటే అనర్హత వేటు కు గురవుతారు. అంతేకాకుండా ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. చట్టం 237 ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను అందించాలని అధికారులు కోరుతున్నారు. వాస్తవ లెక్కలు సమర్పించేనా? జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ వ్యయ పరిమితిని విధించింది. అయితే అభ్యర్థులు మాత్రం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.కోటికి పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఏ మేరకు ఖర్చుల వివరాలు చూపుతారో చేచి చూడాల్సి ఉంది. -
క్రమశిక్షణ, సమన్వయం ముఖ్యం
అనంతగిరి: విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వ యం ఎంతో ముఖ్యమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నా రు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి విభాగం పనితీరును, పెండింగ్లో ఫైళ్లను పరిశీలించారు. అనంతరం విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది అత్యంత ప్రధానమైనదని, ప్రతి అధికారి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కార్యాలయానికి వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభాగాల మధ్య పరస్పర సమన్వయం ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సహోద్యోగులందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని సూచించారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి పనిని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విధుల్లో పారదర్శకతను పెంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీ రాములు నాయ క్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఏఓ ఖాజా మోహినొద్దీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జీపీల అభివృద్ధికి సహకరిస్తా
అనంతగిరి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సర్పంచ్లపై ఉంటుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం కొటాలగూడెం సర్పంచ్ బచ్చంగారి శ్వేత వేమారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం నూతన సర్పంచ్లకు వచ్చిందని, దీన్ని అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పాల న సాగుతోందన్నారు. వికారాబాద్ నియోజకర్గంలో 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 105 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సొంతం చేసుకున్నారని తెలిపారు. మరో 9 మంది రెబల్స్ విజయం సాధించారని చెప్పారు. ఈ విజయానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కారణమన్నారు. అనంతరం నూతన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు రఘుపతిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమేష్నాయక్, సీనియర్ నాయకులు అనంత్రెడ్డి, శశాంక్రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, రాములు నాయక్, వేణుగోపాల్, గురువారెడ్డి, ప్రహ్లాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాను సరిచేయండి
● డబుల్ ఓట్లను తొలగించాలి ● సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు రూరల్: ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఉండరాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూ చించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాను 2025 జాబి తాతో అనుసంధానం చేయాలన్నారు. 2002 లో ఉన్న ఓటర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించా లని ఆదేశించారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాండూ రు నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలు, 2 లక్షల 20 వేల మండి ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్లు తమ నివాస పత్రాలతో పాటు సరైన ఆధారాలు చూపించాలన్నారు. ఒక వ్యక్తి కి రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లలిత, బీఎల్ఓలు పాల్గొన్నారు.. -
మీ డబ్బు.. మీ హక్కు
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు.. మీ హక్కు’ అనే కార్యక్రమం ద్వారా ఖాతాదారులు అన్ క్లైమ్డ్ సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసుల్లో క్లైమ్డ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 1,48,511 ఖాతాల్లో 30.44 కోట్ల రూపాయల అన్ క్లైమ్డ్ సొమ్ము ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 184 ఖాతాల్లోని 1.60 కోట్ల రూపాయలను సంబంధిత ఖాతాదారులు తిరిగి పొందారని తెలిపారు. ప్రజల సొమ్మును వారికే చేరాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ, డీఎఫ్ఎస్ వంటి జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు ఉమ్మడిగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్ఓ మంగీలాల్, ఎల్డీఏం యాదగిరి, ఆర్బీఐ ఏజీఎం చేతన్ గోరేఖర్, యూబీఐఎస్బీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హైదరాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు, జీవిత బీమా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సజావుగా ధాన్యం సేకరించాలి ధారూరు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని గట్టెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని, వెనక్కు పంపరాదని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి నష్టపోరాదని, కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర వస్తుందన్నారు. కార్యక్రమంలో హరిదాస్పల్లి పీఏసీఎస్ సీఈఓ రవి, కేంద్ర నిర్వాహకులు తదితరలు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో దుకాణం దగ్ధం
● రూ.6 లక్షల నష్టం ● ప్రభుత్వం ఆదుకోవాలనిబాధితుల వేడుకోలు యాలాల: షార్ట్ సర్క్యూట్తో కిరాణా దుకాణం దగ్ధమైన ఘటన మండలంలోని ముద్దాయిపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోచనగారి వినోద, వెంకటయ్యగౌడ్ దంపతులు తాండూరులోని ఎస్బీఐ(ఏడీబీ) నుంచి మూడేళ్ల క్రితం రూ.10 లక్షల రుణం తీసుకుని, వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి కొట్టు మూసేసి, వెనకాలే ఉండే ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ దుకాణంలో నుంచి మంటలు ఎగిసి పడటాన్ని గమనించిన స్థానికులు యజమానిని నిద్ర లేపి, మంటలు ఆర్పారు. అప్పటికే ఆలస్యం కావడంతో కొట్టులోని ఖరీదైన వస్తువులు, భారీ రిఫ్రిజిరేటర్, పప్పుల సంచులు, చక్కెర, పిండిబస్తాలు, గల్లాపెట్టెలోని నగదు, ఇతర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో తనకు సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
కేవీ కేంద్రాలతో లాభాల సాగు
మాడ్గుల: వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించేలా కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధునిక పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేరుస్తున్నాయని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా భారతరత్న మాజీ ప్రధాని చౌధరీ చరణ్సింగ్ జయంతిని నిర్వహించారు. అనంతరం శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో సేంద్రియ సాగు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ మెట్ట వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్లు శీకృష్ణ, రజిత, గౌతమ్ చౌహాన్, దిలీప్, ఏఓ అరుణకుమారి, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
వరివైపే మొగ్గు
● ఇతర పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడమే కారణం ● ప్రస్తుత సీజన్లో పెరగనున్న సాగు విస్తీర్ణం దౌల్తాబాద్: రైతన్నలు ఎక్కువగా వరిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాల పంటల సాగుపై అవగాహన ఉన్న వారు సైతం వరినే ఎంచుకుంటున్నారు. తరచూ వరిసాగు చేయడంతో భూసారం తగ్గి అధిక దిగుబడి సాధించడం కష్టమే. మండలంలో గత యాసంగిలో సుమారు ఐదువేల ఎకరాల్లో వరిసాగు చేస్తే ప్రస్తుత సీజన్లో మరో వెయ్యి ఎకరాల్లో అదనంగా సాగు చేయనున్నట్లు అంచనా. చెరువులు, బావుల కింద ఎక్కువగా వరి వేస్తారు. మంచి దిగుబడులు వస్తుండటంతో ఇదే పంటను మళ్లీమళ్లీ వేస్తున్నారు. చెరుకు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు యోగ్యమైన నేలలు ఉన్నా ఇవన్నీ దీర్ఘకాలిక, మద్దతు ధర లేని పంటలు కావడంతో వీటి జోలికి వెళ్లడం లేదు. దీనికి తోడు సరైన మార్కెటింగ్, రవాణా సౌకర్యం లేకపోవడంతో చెరకు, ఉద్యాన పంటలను తగ్గించారు. ప్రస్తుతం రైతులు వేసిన తుకాలు ఎదగకపోతే సంక్రాంతి తర్వాత పెసర, మినుము సాగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో వ్యవసాయధికారులు రైతుల పొలాలకు వెళ్లి వారి భూమి పరీక్ష చేయించి వాటి ఫలితాలను కూడా అందించారు. నేల సారాన్ని బట్టి పంటలు వేయాలని చెబుతున్నారు. మండలంలోని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాం. నీటి వనరులు లేని రైతులకు ఆరుడి పంట సాగు చేయాలని సూచించాం. భూసారాన్ని బట్టి నేలలో ఉన్న పోషకాలను వినియోగించుకుని వాటికి తగ్గ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – లావణ్య, ఏఓ, దౌల్తాబాద్ నాటుకు సిద్ధంగా నారు -
చలికాలం కోడి పైలం
● పౌల్ట్రీల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి ● లేదంటే నష్టాలు వచ్చే ప్రమాదం షాబాద్ మండలం నరెడ్లగూడ గ్రామంలో ఉన్న ఫౌల్ట్రీ ఫాంలో పెరుగుతున్న కోళ్లు రక్షణ చర్యలు తప్పనిసరి చలికాలంలో పౌల్ట్రీ ఫారమ్లో నష్టాలు వాటిల్లకుండా రైతులు రక్షణ చర్యలు పాటించాలి. కోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే పశువైద్యాధికారులను సంప్రదించాలి. – చంద్రశేఖర్రెడ్డి, రేగడిదోస్వాడ పశువైద్యాధికారి షాబాద్: జిల్లాలోని పలువురు రైతులు వ్యవసాయంతో పాటు పౌల్ట్రీరంగాన్ని ఎంచుకుని ఆదాయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,780 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనిపై రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి సలహాలు, సూచనలు.. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు.. సాధరణంగా కోడి శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారన్హీట్ ఉంటుంది. అయితే చలికాలంలో ఉష్ణోగ్రత లోపం వల్ల కూడా కోడి పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. అందువల్ల కోళ్లలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. లిట్టర్ నిర్వహణలో... చలి కాలంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో లిట్టర్ గట్టిపడుతుంది. దీంతో ఈకొలై వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లిట్టర్లో ప్రతీ 100 చదరపు అడుగుల స్థలానికి 5–8 కిలోల పొడిసున్నం లేదా అమ్మోనియం సల్ఫేట్ లేదా ఆరు కిలోల సూపర్ పాస్పేట్ కలపాలి. లిట్టర్ను తరుచూ కదిలిస్తూ పొడిగా ఉండేలా చూడాలి. ఆహారం విషయంలో... శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడానికి కోళ్లు చలి కాలంలో దాణా ఎక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రత తగ్గితే మేత వినియోగం 1.5 శాతం పెరుగుతుంది. మేత ఎక్కువగా తీసుకుంటున్నాయని దాణా తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి దాణా తగ్గించకుండా పోషకాలను సరిచేయాలి. తేమవల్ల నిల్వ ఉంచిన దాణా ముడిపదార్థాల్లో శిలీంద్రాలు వృద్ధి చెందుతాయి. తేమ 9శాతానికి మించితే అప్లోటాక్సిన్ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు దాణాలో ఈస్టు కల్చర్ బైండర్సన్ రెండు కిలోల చొప్పున కలిపి అందించాలి. బ్రూడింగ్ విషయంలో... చలికాలంలో బ్రూడింగ్ నిర్వహణపై అత్యంత శ్రద్ధ వహించాలి. కోడి పిల్లలు మొదటి వారంలో 90– 95 డిగ్రీలు ఫారన్ హీట్, ఆ తర్వాత ప్రతీ వారానికి 5 డిగ్రీల ఫారన్ హీట్ చొప్పున తగ్గిస్తూ ఆరో వారానికి 70 డిగ్రీల ఫారన్హీట్ ఉండేలా చూసుకోవాలి. కేజ్ సిస్టమ్లో అయితే బ్రూగింగ్ షెడ్డు ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారన్ హీట్, 25 శాతం తేమ ఉండే విధంగా చూడాలి. ఫారాల నిర్వహణలో... కోళ్లు చలిబారిన పడకుండా షెడ్ల చుట్టూ పరదాలు కట్టాలి. తగినంత వెచ్చదనం కోసం 16 గంటల పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలి. షెడ్ల చుట్టూ పది అడుగుల దూరం వరకు పిచ్చి మొక్కలు, పొదలు తొలగించాలి. వంద అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఉండే ఫారాల్లో తాత్కలికంగా పార్టీషన్లు ఏర్పాటు చేసుకోవాలి. కోడి పిల్లలను కిక్కిరిసి ఉంచితే శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సరిపోయే స్థలం కేటాయించాలి. -
పోలేపల్లిలో కొనసాగుతున్న ’రంగుల రగడ’
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ భవనానికి వేసిన ‘రంగుల రగడ’ కొనసాగుతోంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణ స్వీకారం చేయబోమని సోమవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రంగులు మార్పిస్తామని చెప్పిన ఎంపీడీఓ హామీతో పంచాయతీ భవనం బయటే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందిన వ్యక్తి జాతీయ జెండాను అవమానించేలా పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయించారని మండిపడ్డారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా మండల అధికారులు పట్టించుకోవడం లేదని, త్వరలోనే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఉప సర్పంచ్ ఏదుల అనురాధ, వార్డు సభ్యులు విశాల్, బాల్రాజ్, రాములు, శారద, పద్మమ్మ, రేణుక, బీఆర్ఎస్ నాయకులు పుర్ర రాఘవేందర్, బుగ్గప్ప, తూర్పు శ్రీనివాస్, సుదర్శన్, కృష్ణయ్య, దశరత్, మల్లికార్జున్, విజయ్కుమార్, చంద్రప్ప తదితరులు తెలిపారు. -
ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం
పరిగి: ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బృందావన్ గార్డెన్లో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల పండుగలను అధికారికంగా.. ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్లకు ప్రభుత్వం అండ తాండూరు: పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం అండ గా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో తాండూ రు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది క్రిస్టియన్లు హాజర య్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం క్రిస్టియన్లుతో కలిసి ఎమ్మెల్యే విందు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
కోడ్ ముగిసినా.. ముసుగు తీయరా!
తాండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసి వారం రోజులు గడిచినా.. నేతల విగ్రహాల ముసుగు తొలగలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యాదగిరి.. మున్సిపల్ పరిఽధిలోని జాతీయ, రాజకీయ నేతల విగ్రహాలకు తెల్లని దుస్తులను చుట్టేశారు. అయితే ఎన్నికలు ముగిసి, పాలకవర్గం కొలువుదీరినా.. నేటి వరకు ముసుగులు తొలగలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొని, వాటి ముసుగులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం -
రద్దీ బస్సుల్లో దుండగుల చేతివాటం
ధారూరు: బస్సుల్లోని రద్దీని దుండగులు ఆసరాగా చేసుకుంటున్నారు. కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సుల్లో ఎక్కి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు, నగలు, సెల్ఫోన్లు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది తస్కరిస్తున్నారు. టీజీ 34 జెడ్ 0022 నంబరు గల ఆర్టీసీ బస్సు మంగళవారం 114 మంది ప్రయాణికులతో నగరానికి బయలుదేరింది. ధారూరు సమీపంలోకి రాగానే ఓ ప్రయాణికుడు తన సెల్ఫోన్ పోయిందని గోల చేశాడు. దీంతో బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆపారు. దొంగిలించిన వారు ఫోన్ ఇవ్వాలని కోరినా ఎదరూ ముందుకు రాలేదు. పోలీసులు వచ్చినా ఫలితం లేకపోవడంతో, ఫిర్యాదు చేయాలని సూచించారు. -
కిచెన్షెడ్, అంగన్వాడీ.. వగైరా..
ధారూరు: మండలంలోని పలు పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడంతో సోమవారం నూతన సర్పంచ్లు కిచెన్షెడ్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. మరి కొన్ని చోట్ల టెంట్ల కింద బాధ్యతలు తీసుకున్నారు. లక్ష్మీనగర్తండా సర్పంచ్ పూజ, నర్సాపూర్ సర్పంచ్ బీర్ల రాజు అంగన్వాడీ కేంద్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు. కుమ్మర్పల్లి సర్పంచ్ వర్ాత్య దివ్వ కిచెన్షెడ్ ఎదుట, ధర్మాపూర్, పీసీఎం తండాల సర్పంచులు ఇళ్ల ముందు, అల్లాపూర్, నాగ్సాన్పల్లి, మోమిన్ఖుర్దు, రాజాపూర్, కొండాపూర్ఖుర్దు సర్పంచ్లు పాఠశాలల్లో, అంపల్లి సర్పంచ్ ఓ ఇంటి వద్ద గల షట్టర్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అల్లిపూర్లో గొట్టిముకుల వీరేశం(65) ఎక్కువ వయస్సున్న సర్పంచుగా, మహిళల్లో నాగారం సర్పంచ్ నీరటి లక్ష్మి(29) తక్కువ వయస్సున్న సర్పంచ్గా నిలిచారు. రేకుల షెడ్డులో.. తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం గిర్మాపూర్లో సోమవారం సర్పంచ్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మీకాంత్రెడ్డి మరో ఆరుగురు వార్డు సభ్యులు రేకుల షెడ్డులో ప్రమాణ స్వీకారం చేశారు. గిర్మాపూర్ను 2018లో పంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సొంత భవనానికి నోచుకోలేదు. గ్రామ మొదటి సర్పంచ్ శివరాం నాయక్తో తహసీల్దార్ వెంకట్ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని పాలకవర్గం కోరింది. 21 ఏళ్లకే సర్పంచ్ కొడంగల్ రూరల్: మండల పరిధిలోని చిట్లపల్లి సర్పంచుగా తలారి జ్యోతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి ఈసారి సర్పంచ్ బరిలో నిలిచి, తన ఓటు తనకే వేసుకున్నారు. 21 సంవత్సరాలకే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదిలా ఉండగా ఉప సర్పంచుగా సంగెం చంద్రకళ, వార్డు మెంబర్లుగా సాయిరెడ్డి, హబీబ్, శాంతమ్మ, బొర్ర వెంకటప్ప, బొర్ర కిష్టప్ప, మంజుళ, అమృతమ్మ, కుమ్మరి శ్రీనివాస్(కరాటే), పద్మమ్మ లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సర్పంచు జ్యోతిని గ్రామస్తులు అభినందించారు. పాఠశాలలో.. మర్పల్లి: మండలంలోని గుర్రంగట్టు, శాపూర్, కుడుగుంట, నర్సాపూర్ పెద్ద తండా, జంశాద్పూర్, రామపూర్ గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేవు. సోమవారం నూతన పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకున్నారు. మల్లికార్జున గిరి గ్రామంలో స్థానికులు చందాలు వేసుకొని నిర్మించిన భవనం వద్ద సర్పంచ్ భాగ్యమ్మ, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రామాపూర్ సర్పంచ్ రమాదేవి, వార్డు సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు. ధారూరు: కొండాపూర్ఖర్దులో పాఠశాల భవనంలో.. ధారూరు: కుమ్మర్పల్లిలో కిచెన్షెడ్ వద్ద ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలి ఇవే సర్పంచులప్రమాణ స్వీకార కేంద్రాలు -
మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: జిల్లాలో మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం వికారాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా నూతన బోరు పనులను ప్రారంభించారు. పెండింగ్ ఫైల్స్, రికార్డులు, బ్యారక్స్, రైటర్ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల వివరా ల ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వ ర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అత్యంత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి విడుదలైన నిధులను సద్వినియోగం చేసుకొని పోలీస్ స్టేషన్ను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బీ సరోజ, ఎస్ఐలు అనిత, స్రవంతి, శ్వేత, రాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా పనిచేయండి
బషీరాబాద్: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కొత్త పాలకవర్గాలు బాధ్యతగా పనిచేయాలని, నిధులు ఇచ్చే బాధ్యత తనదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం బషీరాబాద్, కాశీంపూర్ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 నెలలుగా సర్పంచులు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని, త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో తాండూరు నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి పంచాయతీలకు కేటాయిస్తామన్నారు. బషీరా బాద్ మేజర్ పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి వసతిపై సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల్లో మరోసారి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు మంజూరు కానున్నట్లు చెప్పారు. కాశీంపూర్నుఇందిరమ్మ పైలెట్ గ్రామంగా ఎంపిక చేశామనిఎమ్మెల్యే తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మాధవరెడ్డి, బాల్రెడ్డి, సురేందర్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, సీనియర్ నాయకులు రాకేష్ మహరాజ్, రోహిత్ మహరాజ్, శంకర్రెడ్డి, కాలాల్ నర్సింలు, సుధాకర్రెడ్డి, ఖాలీద్, శ్రీనివాస్రెడ్డి, మాలే రాఘవేందర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఔటర్కు అన్ని వైపులా రోడ్లు తళతళ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్ నుంచి ఫిల్మ్నగర్ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్రింగ్రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి.ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ మీదుగా ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు. ఔటర్ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.సుమారు 9 కి.మీ.మేర నిర్మాణం చేపట్టనున్నారు.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్పాస్లను నిర్మించనున్నారు.వాహనాలు ఎక్కడా ఆపాల్సిన అవసరం లేకుండా నగరం నడిబొడ్డున ఈ ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ కారిడార్ రవాణా సదుపాయాన్ని అందజేయనుంది. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.మరో 90రోజులవ్యవధిలో ఎంపికై న కన్సల్టెన్సీ నివేదికను అందజేయవలసి ఉంటుంది. మరోవైపు షేక్పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది.షేక్పేట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్రింగ్రోడ్డుకు, అలాగే ఔటర్రింగ్రోడ్డు నుంచి అన్ని వైపులా రీజనల్ రింగ్రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్కు ఎక్స్ప్రెస్ వే షేక్పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు విశాలమైన రహదారి శరవేగంగా సికింద్రాబాద్–డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్ త్వరలో సికింద్రాబాద్–శామీర్పేట్ పనులు ప్రారంభం -
టిప్పర్ డ్రైౖవర్పై కేసు నమోదు
బొంరాస్పేట: పనిచేస్తున్న కర్మాగారంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందగా.. ఈ ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి చౌదర్పల్లి శివారు శ్రీసాయిలక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్లో గ్రామానికి చెందిన ఖాసీం పాషా(29) పదిహేనేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. లోడర్తో కంకర నింపుతున్న క్రమంలో టిప్పర్కింద కిందపడి పాష మృతి చెందాడు. మృతుడి భార్య గౌసియాబేగం ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ అశోక్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ బాలవెంకట రమణ తెలిపారు. ప్రాణం ఖరీదు రూ.20 లక్షలు! కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతు డి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేయగా.. రూ.20 లక్షలు పరిహారం ఇచ్చేందు కు యాజమాన్యం ఒప్పుకున్నట్లు సమాచారం. కారు ఢీకొని చిన్నారి మృతి పూడూరు: ప్రమాదవశాత్తు కారుఢీ కొని చి న్నారి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాకంచర్ల గ్రామంలో ఇంటి ముందు అడుకుంటున్న చిన్నారి సౌజన్య(7)ను అటుగా వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. బాలికను పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. బస్టాప్లో ప్రమాదం వృద్ధురాలికి గాయాలు మొయినాబాద్: ఆర్టీసీ బస్సు చక్రం వృద్ధురాలి కాలుపై నుంచి వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన వృద్ధురాలు కుమ్మరి భారతమ్మ(70) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొయినాబాద్కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్ బస్టాప్లో ని ల్చుంది. చేవెళ్ల–హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు వృద్ధురాలు కాలుపైనుంచి వెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్సకోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. బస్సును ఠాణాకు తరలించి డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి యాచారం: బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బదిమీది రాజు(40) సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి బైక్పై అత్తారిల్లు అయిన చింతపట్లకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఓ వెంచర్ డివైడర్కు బైక్ను ఢీకొట్టి కిందపడి పోయాడు. తీవ్ర గాయాలైన ఆయన్ని గ్రామస్తులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, నలుగురు పిల్లలు ఉన్నారు. వ్యక్తి అదృశ్యం మొయినాబాద్: తండ్రితో పాటు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి బస్సు దిగి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన జీనగుర్తి నవీన్గౌడ్ భార్యాపిల్లలు, తండ్రితో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నారు. కాగా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు తాండూరుకు వెళ్లేందుకు తండ్రి దస్తయ్య, కొడుకు నవీన్గౌడ్ బస్సులో బయలుదేరారు. బస్సు మొయినాబాద్ బస్టాప్ వద్దకు చేరుకోగానే నవీన్గౌడ్ భార్యవద్దకు వెళ్తానని చెప్పి బస్సు దిగాడు. కానీ అక్కడి వెళ్లకుండా అదృశ్యమయ్యాడు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్ఫూర్తిప్రదాత శ్రీనివాసరామానుజన్ మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి డివిజన్ బాబుల్రెడ్డినగర్లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య అతిథిగా మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్.వెంకటేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందిస్తాయన్నారు. పాఠశాలలో స్వయంగా విద్యార్థులు నిర్వహించిన గణిత క్విజ్లు, గణిత నమునాల ప్రదర్శన, సమస్య పరిష్కార కార్యక్రమాలు, సంఖ్యలతో వినోదాత్మక కార్యకలాపాలు విద్యార్థులను రోబో ఆన్సర్ చేసే విధానం పాఠశాలలో అందరినులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ గణిత ప్రతిభను ప్రదర్శించగా ప్రత్యేకంగా తయారు చేసిన గణిత నమూనాలు అందరి ప్రశంసలను పొందాయి. యాజమాన్యం బోయ లక్ష్మణ్, నాగలక్ష్మి, రాజేంద్రనగర్ మండల ప్రైవేటు పాఠశాలల అధ్యక్షులు ఎం.ప్రభాకరాచారి, ప్రధాన కార్యదర్శి జి.శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. -
28న క్రాస్ కంట్రీ పరుగుపందెం సెలక్షన్స్
తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో ఈ నెల 28న బాలబాలికలకు క్రాస్కంట్రీ పరుగుపందెం పోటీలు, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం రాములు, రాము, మధు సోమవారం సంయుక్త ప్రకటనలోతెలిపారు. అండర్ –16 బాల,బాలికలకు వేర్వేరుగా 2 కిలోమీటర్లు, అండర్ –18 బాలికలకు 4 కిలోమీటర్లు, బాలురకు 6 కిలోమీటర్లు, అండర్ –20 జూనియర్ మహిళలకు 6 కిలోమీటర్లు, జూనియర్ పురుషులకు 8 కిలో మీటర్లు, 20 ఏళ్లు పైబడిన పురుషులకు 10 కిలోమీటర్ల విభాగంలో క్రాస్కంట్రీ పరుగుపందెం పోటీలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల 4వ తేదీన గచ్చిబౌలిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. సెలక్షన్స్కు వచ్చే క్రీడాకారులు తహసీల్దార్చే ధ్రువీకరించిన ఒరిజినల్ జనన పత్రాన్ని తప్పకుండా తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9951343432, 6300075229 లలో సంప్రదించాలన్నారు. ఎన్నికల పారితోషికం చెల్లించాలి అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో విధులు ని ర్వహించిన ఏఆర్ఓ,ఏఆర్ఓ–2, స్టేజ్–2 రిట ర్నింగ్ ఆఫీసర్లకు పారితోషికం చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్ర ధాన కార్యదర్శి ఎం పాండు కోరారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ రూ.4,500, రూ.4 వేలు, రూ.3,500 చొప్పు న చెల్లించాలన్నారు.ఈ మేరకు సోమవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధకువినతిప త్రం అందజేశారు. అలాగే మే –2005 వేసవిలో 5 రోజుల వృంత్యంతర శిక్షణలో పాల్గొన్న ఎస్జీటీ, ఎస్ఏ, జీహెచ్ఎంలకు ఈఎల్స్ ఇవ్వాలని డీఈఓ రేణుకాదేవికి వినతిపత్రం అందజేశారు. వాహనాల పార్కింగ్కు వేలం అనంతగిరి: వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ డబ్బు వసూలు హక్కుకై బుధవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నరేందర్, ధర్మకర్త పద్మనాభం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2026 నుంచి డిసెంబర్ 31 2026 వరకు(ఏడాదిపాటు) వేలం వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షల నగదు రూపంలో డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు ఆలయ ఆవరణలో వేలం ఉంటుందన్నారు. ఉచితంగా నట్టల నివారణ మందు అనంతగిరి: గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి సదానందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు వందశాతం సబ్సిడీపై నట్టల నివారణ మందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పశు వైద్య శాఖ సిబ్బంది 50 బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తూ జీవాలకు మందు తాగిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓవరాల్ చాంపియన్స్గా గురుకుల విద్యార్థులు అనంతగిరి: నగరంలోని శామీర్పేటలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల్లో వికారాబాద్కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్గా నిలిచారు. సోమవా రం కళాశాల ప్రిన్సిపాల్ మహబూబా ఫాతిమా విద్యార్థులను, పీడీ స్వాతిను అభినందించారు. -
సాగుకు సరిపడా యూరియా
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి న ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చా యి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజ లు ఇచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచదాదన్నారు. ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో సాగుకు సరిపడా యూరి యా అందుబాటులో ఉందని, రైతులు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. మొబైల్ యాప్ వినియోగంపై పీఎస్లు, జీపీఓలు, వ్యవ సా య విస్తరణ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కారక్రమంలో అదనపు కలెక్టర్ సుధీ ర్, ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సోమవారం పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ పాల్గొన్నారు. -
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి
కొడంగల్: మున్నూరు కాపులు ఐకమత్యంగా ఉండాలని, రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పెద్ది పెంటయ్య అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కొడంగల్, ఉడిమేశ్వరం, పర్సాపూర్, దుద్యాల్, అలిఖాన్పల్లి, పాత కొడంగల్, కొండారెడ్డిపల్లి గ్రామ కమిటీ సభ్యులతో పాటు కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్ మండల కమిటీలు, యువజన కమిటీలు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. తద్వారా రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయంగా రాణించాలని సూచించారు. రాష్ట్ర మహాసభ ద్వారా విద్యార్థులకు కాచిగూడలో హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్ షిప్పులు, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేదింటిలో పెళ్లి ఉంటే పుస్తె మెట్టెలు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం కొడంగల్ సంఘం అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్ మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోడుప్పల్ సంఘం నాయకులు ప్రకాశ్, యువ మండలి రాష్ట్ర కార్యదర్శి శంకర్, కొడంగల్ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి నర్సిరెడ్డి, సంఘం ప్రతినిధులు రమేష్, అరిగె ఓం ప్రకాశ్, అనంత ప్రసాద్, నరేష్కుమార్, బిచ్చప్ప, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కేంద్ర నిధులు
మొయినాబాద్రూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ల ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా శ్రీరామ్నగర్, బాకారం, రెడ్డిపల్లి గ్రామాలలో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నూతన పాలకవర్గాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్నగర్ సర్పంచ్ గీతామైపాల్, ఉపసర్పంచ్ సుమలతమెన్రెడ్డి, బాకారం సర్పంచ్ ఎలిగని వెంకటేశ్గౌడ్, రెడ్డిపల్లి మాణిక్యం, మండల ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ గౌతమ్కుమార్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, బీజేపీ నాయకులు చనివెల్లి ప్రభాకర్రెడ్డి, కంజర్ల ప్రకాశ్, తోక అంజన్కుమార్గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
సొంత డబ్బులతో పెన్షన్
కేశంపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం రోజునే అమలు చేశారు సంగెం సర్పంచ్ వేణుగోపాలచారి. సర్పంచ్గా తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరయ్యే వరకూ తన సొంత డబ్బులు అందజేస్తానని ప్రచారంలో పలువురురికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం లక్ష్మమ్మ, నర్సింలుకు డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షఖిల్, యెన్నం గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, సలీం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభం
అట్టహాసంగా సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంపల్లె పాలనవికారాబాద్: రెండేళ్ల ప్రత్యేక పాలన తర్వాత గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులు కొలువుదీరారు. ఈ నెల 17తో ఎన్నికల ప్రక్రియ ముగియగా సోమ వారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన నూతన పాలక మండళ్లు కొలువు దీరాయి. గ్రామ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో మొదటి రోజు పాలన ప్రారంభించారు. సత్తాచాటిన మహిళలు జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,050 వార్డులు ఉండగా.. 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 594 మంది సర్పంచులు, 594 మంది ఉప సర్పంచులు, 4,464 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 594 జీపీల్లో 278 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయగా మిగతా 316 పంచాయతీలను జనరల్కు కేటాయించారు. సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో మహిళలు విజయం సాధించారు. అంటే వారికి కేటాయించిన జీపీలు కాకుండా అదనంగా 32 స్థానాల్లో గెలుపొందారు. 310 జీపీల్లో మహిళా సర్పంచులు, 284 పంచాయతీల్లో పురుష సర్పంచులు బాధ్యతలు స్వీకిరంచారు. ఆర్భాటంగా మొదటి గ్రామ సభలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొత్త పాలక మండళ్ల ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి పనులు, సమస్యలు వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్లు వివరించాయి. ఇదే సమయంలో ఆయా పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న నిధులు, అప్పుల గురించి చర్చించారు. పన్నులు, ఇతర వివరాలను గ్రామ కార్యదర్శులు చదివి వినిపించారు. అనేక మండలాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేక కిచెన్షెడ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, నూతన సర్పంచుల ఇళ్ల వద్ద ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. పంచాయతీలకు సొంత భవ నాలు ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు. జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు 594 ఉప సర్పంచులు 594 వార్డు సభ్యులు 4,464 మహిళలకు కేటాయించిన స్థానాలు 278 గెలిచింది 310 జీపీల్లో.. 32 జనరల్ కేటగిరీల్లో విజయకేతనం -
ఆలూరులో హామీల అమలు
చేవెళ్ల: తనను సర్పంచ్గా గెలిపిస్తే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఆస్పత్రికి వెళ్లేందుకు ఉచిత ఆటో ప్రయాణం కల్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఆలూరు సర్పంచ్ కౌలంపేట భాగ్యమ్మశేఖర్ గౌడ్. సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఉచిత ఆటో సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం నూతన ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారు. సేవలు వినియోగించుకునేందుకు ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచుతామన్నారు. తన సొంత డబ్బులతో డ్రైవర్ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తానని స్పష్టంచేశారు. గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు పి.రాంచంద్రయ్య, శ్రీశైలం, కె.ఆంజనేయులు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నుంచే సేవలు ప్రారంభించిన నూతన సర్పంచ్ -
యాచారం ఎస్బీఐ ఎదుట ధర్నా
యాచారం: చౌదర్పల్లి గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం రాత్రి యాచారం ఎస్బీఐ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. గతంలో ఇక్కడ మేనేజర్గా పనిచేసిన ఝాన్సీరాణి చౌదర్పల్లి గ్రామానికి చెందిన చెందిన డ్వాకా సంఘాల మహిళలకు అందాల్సిన రూ.కోట్లాది రుణాలను, కొంత మంది ఐకేపీ సిబ్బందితో కుమ్ముకై నకిలీ డాక్యుమెట్లు, ఫోర్జరీ సంతకాలతో బినామీల ఖాతాల్లో జమ చేసింది. డ్వాక్రా సంఘాల మహిళల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీఆర్డీఓ అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు పూర్తి బాధ్యత మేనేజర్ ఝాన్సీరాణినేనని మహిళలు ఆరోపిస్తున్నారు. బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీ చేత రికవరీ చేయించి మా పేర్ల మీదున్న అప్పులు చెల్లించాలని మహిళలు కొద్ది నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీ సోమవారం ఎస్బీఐ బ్యాంకుకు విచారణ వచ్చినట్లు తెలుసుకున్న చౌదర్పల్లి డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు వచ్చి బ్యాంకు గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాగర్ హైవేపై ధర్నా చేసేందుకు యత్నిస్తుండగా యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి అక్కడకు వచ్చి మహిళలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రస్తుత మేనేజర్ మాన్యనాయక్ను సంప్రదించగా బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీరాణి వచ్చింది, నిజమేనని వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. చౌదర్పల్లి ఘటనలో బదిలీ అయిన మేనేజర్ నుంచి వివరాల సేకరణ బినామీ ఖాతాలకు మళ్లించిన నిధులు చెల్లించాలని డ్వాక్రా మహిళడిమాండ్ -
ధ్యానం.. పరమ ఔషధం
కడ్తాల్: ధ్యానం పరమ ఔషధమని ధ్యాన గురువు పరిమళ పత్రి అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 సోమవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగీ ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యానగురువు పరిమళ పత్రి మాట్లాడుతూ.. ఆలోచనలను సరైన స్థితిలోకి తీసుకువెళ్లడమే ధ్యానమన్నారు. నోటి లోని మౌనం, మనసులోని శూన్యమే ధ్యానమని.. అది ఆచరణతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడమే పత్రీజీ కోరుకున్నారని చెప్పారు. అనంతరం యోగా గురువు వెంకటేశ్ గురూజీ ధ్యానం, యోగా, ప్రాణాయామం గురించి వివరించారు. అనంతరం పలు ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు, మేగజైన్లను ట్రస్ట్ సభ్యులు, పిరమిడ్ మాస్టర్లతో కలిసి పరిమళ పత్రి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ భాస్కరానందా, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, దామోదర్రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం గురువుల ఆధ్యాత్మిక ధ్యాన సందేశాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శాంతి, ధ్యాన సందేశం ఇచ్చిన శ్రీ కృష్ణ చాముండేశ్వరీ మహర్షిని సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తీకేయన్తో పాటు ట్రస్ట్ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా కళాకారులు ఎంఎస్ పార్వతి బృదం ఆలపించిన గీతాలు, సంస్కృతి ముదాల్కర్ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ధ్యాన వేడుకలకు సినీ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, జ్యోతిష్య శాస్త్రవేత్త రవిశాస్త్రి హాజరయ్యారు. గురువుతో కలిసి ధ్యానం చేస్తున్న స్టంట్ మాస్టర్స్ రామ్లక్ష్మణ్ సోదరులు కోలాటం ఆడుతున్న మహిళలు -
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అత్యుత్సాహం.. బాలిక ప్రాణం తీసింది
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి
శంషాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రాజేంద్రనగర్: నూతన సంవత్సరం ప్రారంభ వేడుకల్లో మద్యాన్ని వినియోగించాలనుకుంటే తప్పనిసరిగా ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని శంషాబాద్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవేందర్ సూచించారు. ఈవెంట్లతో పాటు ఫంక్షన్ హాళ్లు, క్లబ్లు, ఫామ్హౌస్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం సేవిస్తే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆదివారం ఉప్పర్పల్లిలోని స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత సంవత్సరం స్టేషన్ పరిధిలో 20 ఈవెంట్లు నిర్వహించారన్నారు. వారందరికీ ఎకై ్సజ్ శాఖ తరఫున మద్యం వినియోగించేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులు తీసుకోకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేషన్లో సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉందన్నారు. వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం, డ్యూటీ ఫ్రీ మద్యాన్ని వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఎకై ్సజ్ శాఖ తరఫున అనుమతులు తీసుకోవాలని కోరారు. -
కొహెడను డివిజన్గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ సర్కిల్ను చార్మినార్ నుంచి ఎల్బీనగర్ జోన్లో చేర్చాలని, జీహెచ్ఎంసీ 53వ డివిజన్కు కొహెడ పేరు పెట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్ల విభజన చేపట్టిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. సుమారు 80వేలకు పైగా ఓటర్లున్న తుర్కయంజాల్ సర్కిల్ను రెండు డివిజన్లు మాత్రమే చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మరో డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ కందాల బల్దేవ్ రెడ్డి, కో కన్వీనర్లు సింగిరెడ్డి రాంరెడ్డి, కొమిరిశెట్టి భిక్షపతి, అంగత్ కుమార్, నాయకులు బాల్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ తాండూరు టౌన్: వరకట్నం తేవాలంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ, సీపీఎం, మహిళా, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల తాండూరు పట్టణం సాయిపూర్కు చెందిన అనూష(20)ను భర్త పరమేష్ అత్యంత దారుణంగా కర్రతో కొట్టి చంపిన విషయం విధితమే. మృతురాలి తల్లి చంద్రమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆదివారం వారు పరామర్శించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. అందరినీ ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుని భార్యను హత్య చేయడం దారుణమన్నారు. విచక్షణ కోల్పోయి, క్రూర జంతువులా ప్రవర్తించిన భర్త పరమేష్ను, కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేసిన అత్త, మామలతో పాటు, హత్యకు కారకులైన వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేరాలకు కారణమైన డ్రగ్స్, మద్యం వంటి వాటిని అరికట్టడం, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇలాంటివి పునరావృతమైతే ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సీపీఎం నాయకుడు కె.శ్రీనివాస్, మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలివేలు, మల్కయ్య, పి.శ్రీనివాస్, సాధిక్, శివకుమార్ తదితరులు హెచ్చరించారు. -
ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాల్లో మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణపై అగ్నిమాపక, ఎన్ఆర్డీఎఫ్, మెడికల్ ,రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, హైడ్రా డీఎఫ్ఓ యజ్ఞ నారాయణ, సీఈ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే మాక్ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఈవెంట్ కు జిల్లా ఫైర్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో చేపట్టిన ఏర్పాట్లను నిర్దేశించిన సమయానికి పూర్తిచేసి అందుబాటులో ఉంచాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు నిర్వహణ విధివిధానాలపై సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్డీసీలు రవి, శ్రీనివాస్, ఎన్ఆర్డిఎఫ్ మేనేజర్ భూపేందర్ కుమార్, పోలీస్, రెవిన్యూ, జిహెచ్ఎంసి, విద్యు త్, ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తానికి వేళాయే
● నేడు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం ● ప్రత్యేక సమావేశంతో కొలువు దీరనున్న పాలకవర్గం ● త్వరలోనే శిక్షణ తరగతులుమూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేకాధికారులు వారితో ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగిస్తారు. ఆ వెంటనే కొత్త పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. దీని కోసం గ్రామ సచివాలయాలు ముస్తాబయ్యాయి. బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు 22 నెలలుగా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనకు నేటితో తెరపడనుంది. మండలంలోని 39 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీర బోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22ను అపాయింట్మెంట్ డేగా ప్రకటించింది. దీంతో పంచాయతీరాజ్ అధికారులు కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతూ వచ్చింది. అయితే సోమవారంతో పాలనా పగ్గాలు కొత్త సర్పంచుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన మొదటి సమావేశం జరుగుతుంది. మరోవైపు నూతన సర్పంచులకు, ఉప సర్పంచులకు ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ముస్తాబైన జీపీలు దోమ: మండల వ్యాప్తంగా మొత్తం 36 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటిని ఎన్నికలు నిర్వహించగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం వారి ప్రమాణ స్వీకారం జరగనుండగా, ఆయా జీపీలకు పంచాయతీ కార్యదర్శులు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. గూడులేని పంచాయతీలు! మండలంలో కాశీంపూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, గొట్టిగఖుర్ధు, నవల్గా, నీళ్లపల్లి, కొర్విచెడ్, బసీరాబాద్, మైల్వార్, ఎక్మాయి, మంతన్గౌడ్తండా, జీవన్గీ జీపీలకు సొంత భవనాలున్నాయి. తొమ్మిది జీపీలు మల్కన్గిరి, బాద్లాపూర్, బాద్లాపూర్తండా, కంసాన్పల్లి(బి), బోజ్యానాయక్తండా, హంక్యానాయక్తండా, పర్శానాయక్తండా, గంగ్వార్, నంద్యనాయక్తండాలలో భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు, అద్దె ఇళ్లల్లో తాత్కాలికంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఇస్మాయిల్పూర్, జలాల్పూర్, పర్వత్పల్లి, మర్పల్లి, బాబునాయక్తండా, ఇందర్చెడ్, క్యాద్గీరా, మాసన్పల్లి, కొత్లాపూర్, వాల్యానాయక్తండా, గొట్టిగఖుర్ధు పంచాయతీలకు కొత్త భవనాలున్నాయి. ఇవి కూడా ప్రారంభం కాకపోవడంతో అంగన్వాడీ, అద్దె ఇళ్లల్లో కొనసాగనున్నాయి. -
లోడర్ కిందపడి కార్మికుడి మృతి
బొంరాస్పేట: మండలంలోని చౌదర్పల్లి శివారులో గల శ్రీ సాయి లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్లో ఆదివారం రాత్రి కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బృంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖాషీంపాషా(29) పదిహేనేళ్లుగా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి కంకర నింపుతున్న క్రమంలో లోడర్ కిందపడి చనిపోయాడు. శరీరంలోని సగభాగం పూర్తిగా దెబ్బతింది. పరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యన మృతిచెందాడు. మృతదేహాన్ని కొడంగల్ మార్చురిలో ఉంచారు. మృతుడికి భార్య గౌసియాబేగం, ఐదేళ్ల కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొడంగల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నీటూర్ గేటు సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ పట్టణానికి చెందిన వెంకటేశ్(33)కు ఇటీవల వివాహం జరిగింది. అత్తగారిల్లు కర్ణాటక రాష్ట్రంలోని బూర్గుపల్లి గ్రామానికి హైదరాబాద్ నుంచి బైక్పై వెళుతున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని నీటూర్ గ్రామ గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్ పై నుంచి లారీ వెళ్లడంతో శరీరభాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. గమనించిన పరిసరవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సంబంధీకుల ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలిబీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి మొయినాబాద్రూరల్: సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాశీంబౌలిలో సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన నాయకులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్లు గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముదిగొండ రవియాదవ్, కాశీంబౌలి సర్పంచ్ రాజేందర్రెడ్డి, సుధాకర్యాదవ్, పరమేశ్, చిన్న పాల్గొన్నారు. -
ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని 4వ వార్డు సభ్యురాలిగా పసుల స్వప్న ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం నిర్వహిస్తుండగా నీటి సమస్యను కాలనీవాసుల ద్వారా తెలుసుకొని నూతనంగా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వార్డులో బోరు వేయించారు. త్వరలోనే మోటారును ఏర్పాటు చేసి కాలనీలో నీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్యాదవ్, మాజీ సర్పంచ్ నవీన్కుమార్, ఉప సర్పంచ్ దర్శన్, మాజీ మండల కో–ఆప్షన్ సభ్యులు జమాల్ఖాన్, నరేష్యాదవ్, కుంటి లక్ష్మయ్య, జగన్రెడ్డి, మహేందర్రెడ్డి, కృష్ణయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 95 కేసులకు పరిష్కారం
తాండూరు: పట్టణంలోని న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివలీల ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్కు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నుంచి మొత్తం 95 కేసులు వచ్చాయి. ప్రిన్సిపల్ జేసీజే కోర్టుకు 78 కేసులు, అడిషనల్ జేసీజే కోర్టుకు 4, సైబర్ క్రైమ్ కేసులు 13 కేసులు న్యాయమూర్తి ముందుకు వచ్చాయి. ఈ కేసులను కొట్టి వేసి అర్జీదారులకు కక్షిదారులకు శాశ్వత పరిష్కారం కల్పించారు. కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్ సభ్యులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత తాండూరు రూరల్: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. చిట్టిఘనాపూర్, చంద్రవంచ గ్రామ శివారులో కాగ్నా నది నుంచి అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తాండూరు పట్టణానికి తరలిస్తున్నారు. ఇదంతా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా చిట్టిఘనాపూర్ కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తాండూరుకు తరలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు బెల్కటూర్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కరన్కోట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినోద్ రాథోడ్ తెలిపారు. త్వరలో చంద్రవంచలో ఇసుక అక్రమ రవాణాను అరికడతామని ఎస్ఐ చెప్పారు. 28న దివ్యాంగుల సమావేశం అబ్దుల్లాపూర్మెట్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డికి తెలంగాణ ప్రతిభావంతుల వికలాంగుల సేవా సంఘం సభ్యులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 28న సంఘం తరఫున కుంట్లూరు డివిజన్ రాజీవ్గృహకల్పలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఎంపీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి.రాంచంద్రయ్య, సభ్యులు గ్యార మహేశ్, గొల్ల పాండు తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం షాద్నగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జగన్(38) వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై షాద్నగర్కు వచ్చారు. పట్టణంలోని ముఖ్య కూడలి మీదుగా మహబూబ్నగర్ రోడ్డు వైపు వెళుతుండగా లావణ్య బార్ ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో వాహనం జగన్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్లో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు జిల్లా ఫైర్ అధికారి– 2 బి.కేశవులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్స్టేషన్ నిర్మాణానికి గతంలో కలెక్టర్ 900 గజాల స్థలాన్ని సరూర్నగర్లో మంజూరు చేశారని అన్నారు. నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సరూర్నగర్, బాలాపూర్ ప్రజల సౌకర్యార్థం రెండేళ్ల క్రితం ఎల్బీనగర్ ఫైర్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. -
అతివేగంగా వెళ్తున్న డీసీఎం బోల్తా
పరిగి: మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ వైపు నుంచి సోమన్గుర్తి స్టీల్ ఫ్యాక్టరీకి స్క్రాప్ లోడ్తో అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న డీసీఎం బహార్పేట్ మూల మలుపున చికెన్సెంటర్ ఎదుట బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ఆటో, బైక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న చిన్నారి త్రుటిలో తప్పించుకుంది. జాలి కిందికి వెళ్లిన చిన్నారిని స్థానికులు వెంటనే స్పందించి రక్షించారు. రోడ్డు ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడటంతో గంటకుపైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ సర్వే నం.24, 25లో తమ ముగ్గురు అన్నదమ్ములకు దాదాపు 12 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే సర్వే నం.23లో ఓ పెద్ద భవన నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టింది. దాంట్లో ఉన్న నక్ష నాలాని సర్వే నం.25లో ఉన్నట్లు అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపించారు. దీనిపై గత ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూ, డిసెంబర్ 1న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 3న హైకోర్టు న్యాయమూర్తి గతంలో ఉన్న మాదిరిగానే ఉన్నట్లు నక్ష నాలాని పునరుద్ధరించాలని సంబంధిత నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మొర పెట్టుకున్నారు. ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ● బీజేపీ సర్పంచ్లకు సన్మానం అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి జరుగుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని కొండా బాలకృష్టారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసి గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ పాలన వచ్చాకే గ్రామాల రూపు రేఖలన్నీ మారిపోయాయన్నారు. ప్రతి పల్లెకూ నేరుగా కేంద్రం నిధులు అందుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో రోజు వారి కూలీ ధరలు పెంచిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. పనిదినాలను పెంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో వేస్తున్న రోడ్డన్నీ ఉపాధి హామీ పథకం కింద మంజూరైనవేని అన్నారు. రైతులకు ఏడాదిలో రెండు దఫాలుగా పంట పెట్టుబడి డబ్బు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని, దీంతో సర్పంచ్లు అప్పులపాలయ్యారని పేర్కొన్నారు. సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేపట్టి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, ఆ కుటుంబంలోనే ఇప్పుడు కొట్టాటలవుతున్నాయని ఆరోపించారు. నేటి పరిస్థితులను చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యేట్లున్నాయని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సదానందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్కుమార్, నాయకులు శివరాజు, మారుతీకిరణ్, వికారాబాద్ కోఆర్డినేటర్ వడ్ల నందు, కన్వీనర్ శ్రీధర్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాచ శ్రీనివాస్రెడ్డి, కేపీ రాజు, విజయభాస్కర్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, పోకల సతీష్, రాజేందర్రెడ్డి,, సుచరితారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కక్ష సాధింపు చర్యలు సరికాదు
● ఉపాధి హామీ పథకం పేరు మార్పు దారుణం ● డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ● వికారాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ అనంతగిరి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం వీబీ–జీ రామ్–జీ –2025 బిల్లుకు వ్యతిరేకంగా వికారాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్కు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరు మార్చినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ కుటుంబాన్ని దూరం చేయలేరన్నారు. ఈ బిల్లు తీసుకురావడం రాజకీయ కక్ష సాధింపు తప్ప, ప్రజలకు మంచి చేసే పని కాదన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్తో పల్లెల్లో ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఈ పథకాన్ని రద్దు చేస్తే నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో ఈ పథకం ద్వారా ఎంతోమందికి ఉపాధి లభించిందని గుర్తుచేశారు. ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్కుమార్, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ డైరక్టర్ కిషన్నాయక్, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఎండీ హఫీజ్, గుడిసె లక్ష్మణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, శ్రీనివాస్, సతీష్రెడ్డి, వహిద్మియా, శ్రీనివాస్గౌడ్, దీపు, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
షాద్నగర్రూరల్: ప్రతిరోజు యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఆదివారం యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. యోగాతో అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్కుమార్, కేశంపేట సీఐ నరహరి, ఎస్ఐలు సుశీల, శ్రీకాంత్, రాంచంద్రయ్య, ప్రణయ్, రాజేశ్వర్, రవీందర్నాయక్, విజయ్, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాలకులొచ్చేశారు..
వికారాబాద్: గ్రామ పంచాయతీ పాలకమండళ్లు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ నెల 20నే కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ముహూర్తాలు బాగాలేవనే అభ్యర్థన మేరకు ప్రభుత్వం 22వ తేదీకి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మార్చింది. దీంతో సర్పంచ్లు, వార్డు సభ్యులు ఏర్పాట్లలో మునిగితేలారు. ముఖ్య నాయకులు, తెలిసిన వారిని ఆహ్వానిస్తున్నారు. 2019 జనవరిలో జీపీ ఎన్నికలు జరగ్గా 2024 జనవరితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ప్రస్తుతం కొత్త సర్పంచ్లు గెలిచిన నేపథ్యంలో ప్రత్యేక పాలనకు తెరపడింది. ముస్తాబైన పంచాయతీలు జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త పాలనకు కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. సర్పంచులు కొత్త కుర్చీలు, ఫర్నీచర్ తెచ్చుకొని పాలన ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఆత్మీయులు, బంధుమిత్రులను తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా గెలిచిన ఆనందంలో సన్నిహితులతో కలిసి విందులు, వినోదాలు చేస్తున్నారు. ఓడిపోయిన వారు బాధలో ఉండగా గెలిచిన వారు ఫాంహౌస్లు, పొలాలు, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు చేసుకోవడంలో మునిగిపోయారు. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులు ఉన్నాయి. 75 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్థిక సంఘం నిధులపైనే.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన రోజే ఉపసర్పంచ్లను కూడా ఎన్నుకున్నారు. ఈ నెల 17వ తేదీతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. 22న కొత్త పాలకమండళ్ల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయించడానికి జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త పంచాయతీలు కొలువుదీరిన అనంతరం మొదటి సమావేశం జరునుంది. జిల్లాకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు కూడా త్వరలో విడుదల కానున్నాయని పంచాయతీ అధికారులు తెలియజేస్తున్నారు. రెండేళ్లుగా సర్పంచులు లేకపోవటం, నిధుల విడుదల ఆగిపోవంతో ప్రస్తుతం పంచాయతీలు అభివృద్ధి కుంటుపడింది. అంతేకాకుండా గత పాలకుల హయాంలో చేసిన పనులకు సంబంధించిన రూ.30 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. నిధులలేమి, ప్రజా ప్రతినిధులు లేకపోవటంతో పంచాయతీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్లు, వీధి దీపాల వంటి సమస్యలు పల్లెలను పట్టి పీడిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే సర్పంచులకు తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేడే సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం స్వాగతం పలకనున్న కార్యదర్శులు జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలు సవాల్గా మారనున్న నిర్వహణ భారం 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలుకొత్తగా ఎన్నికై న సర్పంచులకు నూతనంగా రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రామపాలన, సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, హరితహారం, గ్రామాభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అంతర్గత రోడ్లు నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రి, స్టేషనరీని సమకూర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సర్పంచ్లు బాధ్యతలు తీసుకుంటే తమ గ్రామాలు, వార్డులు బాగుపడతాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. -
నేడు క్రిస్మస్ విందు
తహసీల్దార్ తారాసింగ్ తాండూరు రూరల్: నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు సోమవారం ప్రభుత్వం తరఫున క్రిస్మస్ విందు ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి హాజరవుతారన్నారు. క్రిస్టియన్లు విందుకు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి తాండూరు రూరల్: ఎల్మకన్నె గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గ్రామంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్ బ్యాగరి నరేష్ ఆదివారం హైదరాబాద్లో మహేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలోని కొత్త సర్పంచ్లకు అన్ని విధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వై రాములు, నాగప్ప, రాజు, నరేష్, చాకలి రాజు, అశోక్ తదితరులు ఉన్నారు. పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. ఆదివారం పట్టణంలోని కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. 58 కేసులను ఇరువురి ఒప్పందంతో పరిష్కరించారు. 108 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించి రూ.1,92,000 జరిమానా విధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో తప్పులు చేసి జైలుపాలు కావొద్దని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కేసులు ఉన్న వారు ఎప్పుడైనా రాజీ కావచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ తాండూరు టౌన్: మైనార్టీ ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ అధికారులు చూపుతున్న వివక్షను వ్యతిరేకిస్తున్నట్లు మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ అన్నారు. ఆదివారం ఆయన సమితి సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న ఖలీల్ పాషాకు రావాల్సిన వేతనం, ఇంక్రిమెంట్లను విద్యాశాఖాధికారులు అకారణంగా నిలిపివేయడం సమంజసం కాదన్నారు. సాహితీవేత్త అవార్డు గ్రహీత అయిన ఆయనపై స్కూల్ హెచ్ఎం, ఎంఈఓ కావాలనే పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయానికి పాఠశాల ఎదుట టెంటు వేసుకుని శాంతియుత దీక్ష చేస్తున్నప్పటికీ వారిలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. మైనార్టీ ఉపాధ్యాయుని పట్ల అధికారులు చూపుతున్న వివక్షకు నిరశనగా రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోనలు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై సీఎంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. వెంటనే ఖలీల్ పాషాకు న్యాయం చేయాలని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనకాడేది లేదన్నారు. సమావేశంలో సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీమ్, ముస్తఫా, ఎండి సమి, ఎండి సాదిక్, అంజద్ అలీ పాషా, ఫర్హాద్, వాసే, గౌస్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు. -
కుష్టు రహిత సమాజమే లక్ష్యంగా..
కొడంగల్ రూరల్: కుష్టు వ్యాధిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ వ్యాధి గ్రస్తులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనుంది. ఇందుకోసం 698 మంది ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటోంది. వ్యాధి వ్యాప్తి ఇలా.. కుష్టువ్యాధి అనేది లెప్రో మైక్రో బ్యాక్టీరియా, లెప్రమోటోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు చేరుతుంది. ఇది సోకిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. శరీరంపై తెల్టి, రాగి, స్పర్శలేని మచ్చలు, మొద్దుబారిన మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ లేకపోవడం, చేతి గోళ్లలో, నరాల్లో తిమ్మిర్లు రావడం, శరీరంపై వెంట్రుకలు రాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తిస్తే మంచిది కుష్టు వ్యాధి అనేది అంత ప్రమాదకరమైనది కాదని, పూర్తిగా నయం కాని జబ్బేమి కాదని, నిర్లక్ష్యం చేస్తే మాత్రం కబళించే ప్రమాదం ఉంటుందని, మల్టీడ్రగ్ థెరపీతో నయం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందజేస్తున్నారు. ఇంటింటి సర్వే.. జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 698 మంది ఆశా కార్యకర్తలతో 1,99,465 కుటుంబాల్లో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. రోజూ ఒక్కో బృందం 20 నుంచి 25 ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి కుటుంబంలో వారి ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది గుర్తిస్తూ వ్యాధి సంబంధిత లక్షణాలున్న వారిని గుర్తిస్తూ పేర్లు, వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వారి వివరాలను సేకరిస్తూ జిల్లా స్థాయి వైద్య బృందం 15 రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో వైద్యం అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 78 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేయాలని, వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందిస్తూ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అడుగులు అనుమానితులను గుర్తించే పనిలోవైద్య ఆరోగ్య శాఖ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స, మందులు కుష్టు వ్యాధిని అంతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యుల సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడడంతో వ్యాధి తగ్గుతుంది. – డాక్టర్ రవీంద్రయాదవ్, టీబీ, లెప్రసీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి -
సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, విలువలను, భవిష్యత్తరాలకు అందించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రిన్స్పల్ మధుకర్ స్వామి, పల్లవి గ్రూపు డైరెక్టర్ నిహారిక, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు -
బీజేపీ విధానాలను ఎండగడుతాం
తాండూరు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొంటోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జా దవ్ విమర్శించారు.శనివారం ఆయన తాండూ రు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరు ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చి న వెంటనే నల్లధనాన్ని తెచ్చి పేదలకు రూ. 15లక్షల చొప్పున ఖాతాల్లో జమచేస్తామని మోసం చేసిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స మయంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలకంగా ఉందన్నారు. జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన పత్రిక కావడంతో బీజేపీ ప్రభు త్వం పత్రికపై విషం చిమ్మిందన్నారు. కోర్టులో పత్రికను అనుకూలంగా తీర్పు రావడంతో పాటు కేసు డిస్మిస్ చేసిందన్నారు. 2005లో నా టి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేసిందన్నారు. 20 ఏళ్లుగా ఈ పథకం ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి ల భించిందన్నారు. కొన్నాళ్లుగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తోందన్నారు. ఇటీవల పథకం పేరు మార్చిందని మండిపడ్డారు. తాండూరులోని సిమెంట్ పరిశ్రమ ఇప్పటికే అదాని చేతిలోకి వెళ్లిందన్నారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంఽధీ పార్కు వరకు నిరసన ర్యాలీ,గాంఽధీ పార్కులో ధర్నా చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్ర తి నిధులు,నాయకులు పార్టీ శ్రేణులు, మద్దతు దారులు పెద్దఎత్తున హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు తదితరులున్నారు. -
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
నందిగామ: సరుకులతో పరిశ్రమ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే లారీ డ్రైవర్ గుండె పోటుకు గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రంగాపూర్లో చోటు చేసుకుంది. నందిగామ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం .. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాలూల్(37) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ శివారులోని పీఅండ్జీ పరిశ్రమలో ఆదివారం సరుకులను లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు బయలుదేరాడు. లారీ నందిగామ మండలం రంగాపూర్ వద్దకు చేరుకోగానే జాలూల్కు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో లారీని రోడ్డు పక్కన నిలిపాడు. స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్తం వెళ్లాడు. డాక్టర్ వచ్చే లోపే కుప్పకూలి మృతి చెండాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
భూములు అప్పగిస్తే రూ.20 లక్షలు
● జనరల్ అవార్డు ప్రకటిస్తే రూ.7లక్షలే.. ● అదనపు బెనిఫిట్లు అందవని అధికారుల వెల్లడి దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక వాడ కొరకు గతంలో ప్రభుత్వం 1,175.35 ఎకరాల భూ సేకరణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రైతులు అంగీకారం తెలుపుతూ దాదాపు వెయ్యి ఎకరాల భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 175.35 ఎకరాల భూమిని రైతులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పలు మార్లు రెవెన్యూ అధికారులు లగచర్ల గ్రామంలో అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించి సంబంధిత రైతులకు వివరించారు. భూములు ఇవ్వకుంటే జనరల్ అవార్డు కింద కోర్టు అప్పగిస్తామని రైతులకు చెప్పారు. ఇలా చేస్తే ఎకరాకు దాదాపుగా రూ.7 లక్షలు మాత్రమే వస్తాయని, అదనపు బెనిఫిట్లు రావని రైతులకు వివరించారు. అక్టోబర్ 23న సమావేశం నిర్వహించి చివర అవకాశం కల్సిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్లు వివరించారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వం 175.35 ఎకరాల భూమికి సంబంధించి 58 మంది రైతులకు జనరల్ అవార్డు ప్రకటిస్తున్నట్లు ప్రకటన వెళ్లడించారు. ఇప్పటికై న రైతులు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే మేలు చేకూరే అవకాశం ఉందని తెలుస్తుంది. జనరల్ అవార్డు కింద కోర్డుకు అప్పగిస్తే ఎకరాకు రూ.7 లక్షల వరకు మాత్రమే వస్తాయని, లేదని అంగీకారం తెలిపి భూములు అప్పగిస్తే ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల డీటీసీపీ లేఅవుట్ కల్గిన ఇంటి స్థలం, ఒక ఇందిరమ్మ ఇళ్లు, పారిశ్రామిక వాడలో కుటుంబానికి ఒక ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వం కోర్డుకు అప్పగించక ముందే రైతులు నిర్ణయం తీసుకుంటే లబ్ధిచేకూరుతుందని, లేదంటే నష్టం పోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులు అంగీకారం తెలుపుతారో..లేదో వేచి చూడాలి. -
ప్రజలకు అవగాహన కల్పించండి
అనంతగిరి: ప్రజల జీవితాలను కాపాడాల్సిన బా ధ్యత అధికారులదేనని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం ఆయన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై గుంతలను పూడ్చివేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. జాతీయ రహదారుల అనుసంధాన రోడ్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మలుపులు ఉన్న రోడ్లను గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల జంక్షన్లలో సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి భాద్యత అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేపట్టి వైద్య సేవలు అందించాలని డిపో మేనేజర్కు సూచించారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు చెప్పా రు. మోతాదుకు మించి రవాణా చేపడుతున్న వా హనాలను గుర్తించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాహనాలపై దృష్టి సారించాలని, రవాణ, మైనింగ్ అధికారులు ఉమ్మడి తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, రవాణా అధికారి వెంకట్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ జాఫర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ పదవి.. రాజకీయాలకు తొలిమెట్టు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మోమిన్పేట: స్థానిక సమస్యలపై దృష్టి సారించి పాలనపై పట్టు సాధించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం సర్పంచ్ నిర్మలా ఉపేందర్రెడ్డి శనివారం బీజేపీలో చేరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నగరంలోని తన నివాసంలో వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా రాణించేందుకు సర్పంచ్ తొలిమెట్టు అన్నా రు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటరు వడ్ల నందు, విక్రంరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. సర్పంచ్కు మీనాక్షినటరాజన్ అభినందనలు అనంతగిరి: వికారాబాద్ మండల ఎర్రవల్లికి చెందిన ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ కుమారుడు రబ్బానీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జాఫర్ తన కుమారుడితో కలిసి హైద్రాబాద్లో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె రబ్బానీని అభినందించారు. మరో భూ సేకరణకు నోటిఫికేషన్ దుద్యాల్ తహసీల్దార్ కిషన్ దుద్యాల్:ప్రభుత్వం మండల పరిధిలో 139.98 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తహసీల్దార్ కిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని సర్వేనంబర్ 363లో 85 మంది రైతుల నుంచి అసైన్డ్ భూములకు సేకరించనుందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిడ ఏర్పాటుకు ఈ భూసేకరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడాది క్రితం మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 1,175.35 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు సంబందించిన 1,10 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగలిన 74.35 ఎకరాలకు రైతులు అంగీకారం తెలపకపోవడంతో ప్రభుత్వం జనరల్ అవార్డు ప్రకటించింది. ఇటీవల హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు సంబంధించి 55.36 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విదితమే. ఎర్త్ సెంటర్కు ‘ఆట’ ప్రతినిధులు కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని ‘ది ఎర్త్ సెంటర్’ను అమెరికాతెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో సమావేశమయ్యారు. భూగ్రహం సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ కోసం కలిసి పనిచేయడానికి అవకాశాలపై చర్చించారు. సీజీఆర్, ఆటా సంయుక్తంగా అటు అమెరికాలో, ఇటు భారతదేశంలో చేపట్టబోయే పర్యావరణ కార్యక్రమాలపై ప్రాథమికంగా చర్చలు జరిపారు. సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 15 సంవత్సరాలుగా సీజీఆర్ సంస్థ చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ‘ఆట’ ప్రతినిధులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ చేపడుతున్న సేవలు బాగున్నాయిని వారు కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్రెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిందితులను శిక్షించాలి
తాండూరు: కోట్పల్లి సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వీరశైవ సమాజం సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం వారు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. దాడిలో గాయపడిన సంగయ్య ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సమాజం సభ్యులతో పాటు సర్పంచ్లు మైలారం రాజ్కుమార్, పటేల్ విజయ్కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం యథావిధిగా ప్రజావాణి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. సాక్షి,సిటీబ్యూరో: వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఈ నెల 22న సాయంత్రం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేనిమను చౌదరి తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చర్లపల్లి స్మార్ట్ టెర్మినల్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణనష్టం తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగా హన కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ రావల్కోల్ కు చెందిన రవీందర్ శబరిమల యాత్రలో మృతి చెందాడు. రావల్కోల్ గ్రామస్థులు తెలిపిన మేరకు.. రవీందర్(42) మేడ్చల్లో బోర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం గ్రామ అయ్యప్పభక్తులతో కలిసి శబరి యాత్రకు వెళ్ళాడు. పళని సుబ్రమణేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం కాలినడకన కొండ ఎక్కాడు. కొండ ఎక్కి దేవుడి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉండగా అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రి కి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని మేడ్చల్కు తరలిస్తున్నారు. చంచల్గూడ: తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసిన ఇద్దరిపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ తహసీల్దారు నిహారిక ఫిర్యాదు మేరకు.. చావణీకి చెందిన నహిదాబేగం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెన్యువల్ చేయాలని మహ్మద్మూసా అనే వ్యక్తి మండల కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. వీటిని పరిశీలించిన తహసీల్దారు తన నకిలీ సంతకం, కార్యాలయం సీల్ గతేడాది జారీ అయినట్లు గుర్తించారు.దీంతో మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్లు తీసుకొచ్చిన మహ్మద్ ముసాతో పాటు నహిదాబేగంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంగళరావునగర్: సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నగరంలో ప్రతిరోజు కోటి రూపాయల వరకు ఈ తరహా నేర గాళ్ళు కొట్టేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలియజేశారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్కాలనీ శ్రీసాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీహాల్లో శనివారం సైబర్క్రైమ్పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిషనర్ సజ్జనర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సగటున రూ.250 కోట్ల మేర నగదును సైబర్ దొంగలు దోచుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహనా శిబిరాల ద్వారా చైతన్య పరుస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, సైబర్ క్రైమ్, వెస్ట్జోన్ డీసీపీలు వి.అరవింద్బాబు, సిహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మాస్టర్ ప్లాన్.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) మాస్టర్ప్లాన్ లోపభూయిష్టంగా ఉందని, అందులో రైతులకు తీరని అన్యాయం జరిగిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ రైతులు, పేదలు, అమాయకులు, తమ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. మాస్టర్ప్లాన్ వల్ల 50 వేల మందికిపైగా రైతుల భూములు 11 ఏళ్లుగా కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయని, వాటిని బహుళ వినియోగ జోన్లోకి మార్చకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారని విస్మయం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్–2013 లోని లోపాలపై శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సామాజిక కార్యకర్త కరుణా గోపాల్, ఆదర్శరైతు వెంకట్రెడ్డి తదితరులు మాట్లాడారు. బౌరంపేట్ మాజీ సర్పంచ్ డాక్టర్ ఎస్.మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రభుత్వం భూములను విక్రయించి భారీ ఎత్తున సొమ్ము చేసుకోవడం ప్రజాహితం కాదని దత్తాత్రేయ అన్నారు. రైతులు, సాధారణ ప్రజలకు భూమితోనే ఆత్మగౌరవం, సమాజంలో హోదా లభిస్తాయని అన్నారు. మాస్టర్ప్లాన్ వల్ల రైతులు ఏళ్ల తరబడి తమ భూములను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొనడం దారుణమన్నారు. కన్జర్వేషన్ జోన్లో ఉన్న రైతుల భూములను వెంటనే బహుళ వినియోగంలోకి మార్చాలని కోరారు. మాస్టర్ప్లాన్ లోపాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జోన్ మార్పిడి కోసం రైతుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రంలో భూసేకరణ చేస్తే రైతులు పండుగ చేసుకుంటారని, అక్కడ బయటి వాళ్లకు అమ్ముకుంటే ఎకరానికి రూ.70 లక్షల వరకు లభిస్తుందని, ప్రభుత్వం భూసేకరిస్తే మార్కెట్ రేట్ ప్రకారం రూ.కోటి చొప్పున అందజేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ ఔటర్రింగ్ రోడ్డుకు భూమి సేకరించడంతోనే నగరంలో భూసమస్య మొదలైందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు. హెచ్ఎండీఏ తీరు లోపభూయిష్టంగా ఉందన్న వక్తలు కన్జర్వేషన్ జోన్లోని రైతుల భూములకు తీరని అన్యాయం రౌండ్టేబుల్ సమావేశంలో దత్తాత్రేయసహా పలువురి ధ్వజం -
పరిషత్ ఎన్నికలపై పార్టీల నజర్
కొడంగల్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను సమీక్షించుకున్న పార్టీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించాయి. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించాయి. రిజర్వేషన్ ఏదైనా.. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారి వివరాలను ఇప్పటికే సేకరించి పెట్టుకుంటున్నాయి. అధికారికంగా రిజర్వేషన్లు ఖరారయ్యాక అభ్యర్థిని వెతకటం కన్నా.. ముందస్తుగా ఒక అంచనాకు రావాలనే ఆలోచనతో ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలను పక్కనబెట్టి పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించాలని, ఆయా పార్టీల నేతలు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల నుంచి పోటీ పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో అన్ని ప్రాదేశిక స్థానాల్లో విజయం సాధించాలని హస్తం పార్టీ ఆరాట పడుతోంది. బీఆర్ఎస్ సైతం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, మహేష్ రెడ్డి, రోహిత్రెడ్డి, మెతుకు ఆనంద్లు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీజేపీ పలు మండలాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రణాళికాబద్ధంగా.. ఇటీవల తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందిన స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ మేరకు కొంత ముందస్తుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుని, ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని యోచిస్తున్నాయి. ఈ క్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపైనా అంతర్గతంగా కసరత్తు చేస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది.. గెలిచే సత్తా ఎవరికి ఉంది.సామాజిక, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి.. తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. రేపు సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఈనెల 22న సోమవారం ఉదయం ఆయా మండలాల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వార్డు సభ్యులతో ఆయా గ్రామాల్లోనే ప్రమాణ స్వీకారం చేయించాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలో కొత్తగా సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయనున్నారు. వివరాలు ఎంపీటీసీ స్థానాలు 227 జెడ్పీటీసీ స్థానాలు 20 ఎంపీపీ 20


