Vikarabad
-
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
8లోu9లోuకరుణామయి అమ్మసృష్టికి మూలం అమ్మ.. అనురాగం, ఆప్యాయతను పంచే కరుణామయి. తల్లి పేగుబంధం విడదీయని అనుబంధం. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా వికారాబాద్ రామయ్యగూడ ఎంఐజీలోని ఇమాన్యుయేల్ ఏజీ చర్చిలో వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. – అనంతగిరి న్యూస్రీల్జవాన్ల కోసం జలాభిషేకం ఆపరేషన్ సిందూర్తో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం, సైన్యానికి మద్దతుగా ఆదివారం బుగ్గ రామలింగేశ్వరాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత సైనికులకు మరింత బలాన్ని చేకూర్చాలని స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. – అనంతగిరి -
ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి
చేవెళ్ల: కార్మికులకోసం పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తీసుకు వచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి డిమాండ్ చేశారు. ఏఐటీయుసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను ఆదివారం చేవెళ్లలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మికులపై దాడి మొదలు పెట్టిందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను పెట్టుబడి దారి వర్గానికి కొమ్ము కాస్తూ నాలుగు కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్త ంచేశారు. కార్మికులు పోరాడి 8 గంటల పని దినాలను సాధించుకున్నారని, కాని మోదీ ప్రభుత్వం 12 గంటల పనిదినాలు తీసుకు వస్తోందని మండిపడ్డారు. దీనిని కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీస వేత్తనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమ్మెను కార్మికులు, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ప్రభులింగం పాల్గొన్నారు. ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి -
గొప్ప పోరాటయోధుడు ఠానునాయక్
మీర్పేట: భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడిన గొప్పయోధుడు ఠానునాయక్ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జటోత్ ఠానునాయక్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఠానునాయక్ చరిత్రను, పోరాట స్ఫూర్తిని నేటి యువత, విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీందర్నాయక్, స్థానిక బంజారా నాయకులు జటావత్ శ్రీనివాస్ నాయక్, హామునాయక్, రవీందర్నాయక్, సికిందర్నాయక్, డా.లక్ష్మణ్నాయక్, దేవానంద్ నాయక్, దీప్లాల్నాయక్, బాలునాయక్, లక్ష్మణ్నాయక్, మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీజేపీ నాయకుడు కొలన్ శంకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అర్కల భూపాల్రెడ్డి, అర్కల కామేశ్రెడ్డి, దిండు భూపేష్గౌడ్, అనిల్యాదవ్, రాజ్కుమార్, మాదరి రమేష్, బాలరాజ్, సునీత, రజాక్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
‘ఉపాధి’కి కత్తెర
నాలుగేళ్ల కాలంలో కోటి పనిదినాల తగ్గింపు ● పనులు దొరక్క కూలీల అవస్థలు ● శరాఘాతంగా మారిన కొత్త నిబంధనలు ● ఉదయం, సాయంత్రం ఫొటోలు అప్లోడ్ చేస్తేనే వేతనంమొత్తం జాబ్ కార్డులు 1.83లక్షలు కూలీల సంఖ్య 3.77లక్షలు ప్రస్తుతం పనులు చేస్తున్న వారు 60 వేలు వికారాబాద్: ఏటా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పని దినాల్లో భారీ కోత విధిస్తోంది. సంస్కరణల పేరుతో నిబంధనలను కఠినతరం చేస్తూ పేదలను పనులకు దూరం చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కల్పించాల్సిన పని దినాల్లో దాదాపు కోటి పని దినాలకు కోత పెట్టింది. దీంతో పేదల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వ్యవసాయ పనులులేని కాలంలో వలసల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. ఈ పథకం ద్వారా ఏటా లక్షలాది మంది పేదలు ఉపాధి పొందుతూ వస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా పనిదినాల్లో కోత విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన కొత్త నిబంధనలు కూడా ఉపాధి పనులకు కూలీలను దూరం చేస్తోంది. పథకం ప్రారంభమైన సమయంలో కొన్ని పనులకే పరిమితం కాగా ప్రస్తుతం 266 రకాల పనులు చేర్చారు. కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేపట్టాలనే నిబంధన ఉండటం ఇబ్బందిగా మారింది. గతంలో కూలీలు ఉదయం 6గంటలకే పనులకు వెళ్లి వారికి ఇచ్చిన పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్న సమయానికి ఇళ్లకు చేరుకునే వారు. ప్రస్తుతం ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం తర్వాత మరోసారి పనులకు సంబంధించిన ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉండటంతో కూలీలు మండుటెండలోనే గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా కొంత మంది కూలీలు పనులకు దూరమవుతున్నట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. జిల్లాలో 1,86,197 జాబ్కార్డులు.. 3,77,087 మంది కూలీలు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత వేసవిలో కేవలం 60వేల మంది కూలీలే ఉపాధి పనులకు వస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో లక్షమందికి పైగా కూలీలు పనులకు రాగా ఈ సారి వారి సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కేంద్రం ఉపాధి కూలీల వేతనం పెంచడంతో రోజువారి కూలి రూ.307కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో సగటున రోజుకు రూ.270 చెల్లిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కోటి పనిదినాల తగ్గించడంతో ఈ ప్రభావం పేదల జీవన స్థితిగతులపైనే కాకుండా గ్రామీణాభివృద్ధిపై కూడా పడింది. గత ఆర్థిక సంవత్సరంలో 67,37,496 పనిదినాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏటా తగ్గుతున్న పని దినాలు ఇలా.. ఆర్థిక సంవత్సరం జిల్లాకు కేటాయించిన పని దినాలు 2021 – 22 1.3 కోట్లు 2022 – 23 71.58 లక్షలు 2023 – 24 62 లక్షలు 2024 – 25 59.85 లక్షలు 2025 – 26 33 లక్షలు ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా నీడకరువైంది. గతంలో నెట్ షెడ్లు, ప్రాథమిక చికిత్స కిట్లు పంపిణీ చేసేవారు. మూడేళ్లుగా వీటి పంపిణీ ఆగిపోయింది. కూలీలకు గ్రామ పంచాయతీలే వసతులు కల్పించాలని అధికారులు చెబుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వేతన పాట్లు జిల్లాలో డీఆర్డీఏ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 200 మంది ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందడంలేదు. అటెండర్లు, సీసీలు, ఏపీఓలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఎంలు వేతన వెతలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు నెలలకు ఒక్కసారి వేతనాలు ఇస్తుండటంతో అప్పులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది నుంచి ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా తమను క్రమబద్ధీకరించడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని, బయటి పనులకు వెళ్తే రోజుకు రూ.600నుంచి రూ.800ల వరకు వస్తున్నట్లు పలువురు కూలీలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధి పని దినాలను పెంచడంతోపాటు వసతులు కల్పించాలని, అలాగే వేతనం కూడా పెంచాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. -
మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ రూ.27 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి అప్గ్రేడ్, భవన నిర్మాణం చేయించడం సంతృప్తినిచ్చిందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయ కులు ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తు న హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, ఎ–బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
నేడు మంత్రి పర్యటన
అనంతగిరి: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 12న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు సూచించారు. పరిగి, వికారాబాద్ పర్యటనలో చేపట్టాల్సిన అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆదివారం మధ్యాహ్నం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు పరిగి పట్టణ కేంద్రంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు భూమి పూజ, వికారాబాద్ కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఆస్పత్రుల పనితీరు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం వికారాబాద్లో నిర్మించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంట రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి బషీరాబాద్: వానాకాలం పంటలకు రైతులకు రూ.50 లక్షలతో కొత్తగా పంట రుణాలు ఇస్తున్నామని నావంద్గీ(బషీరాబాద్) సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. సొసైటీలో ఉంటూ రుణం పొందలేని వారు సోమవారం నుంచి కొత్త రుణాలను తీసుకోవచ్చన్నారు. మొదటి విడతగా జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ ఈ రుణాన్ని నావంద్గీ సొసైటీకి మంజూరు చేసిందని చెప్పారు. గతంలో సొసైటీ నుంచి రుణమాఫీ పొందిన రైతాంగానికి సైతం కొత్త రుణాలను అందజేస్తామని వివరించారు. కొత్తగా రుణం పొందే రైతులు భూమికి సంబంధించి తాజా పహానీ, వన్బీ, నో డ్యూస్ సర్టిఫికెట్, నాలుగు రైతు ఫొటోలు నావంద్గీ సొసైటీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నేడు 50 వసంతాల స్ఫూర్తి సభ కొడంగల్ రూరల్: అరుణోదయ సాంస్కృతిక విజ్ఞాన సమాఖ్య 50 వసంతాల స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్పల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నగరంలోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం 10గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఉదయం 9గంటల ర్యాలీతో ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా సంస్కృతి, ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణంపై చర్చ, రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయని వివరించారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివాహ వేడుకలో స్పీకర్ తాండూరు రూరల్: తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో గౌతపూర్ మాజీ సర్పంచ్ రాజప్పగౌడ్ కుతూరు అంజలిగౌడ్ వివాహం బషీరాబాద్ మండలం గోట్టిగ ఖుర్ధుకు చెందిన మహేష్కుమార్ గౌడ్తో నిర్వహించారు. ఈ వివాహానికి హాజరైన స్పీకర్ ప్రసాద్కుమార్ నూతన దంపతులను ఆశీర్వదించి చిన్ననాటి స్నేహితులతో సరదగా గడిపారు. తప్పుల తడకగా ఇందిరమ్మ ఇళ్ల జాబితా ● రీసర్వే చేయించి అర్హులకు కేటాయించాలి ● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ తాండూరు టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తప్పులతడకగా ఉందని.. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రీసర్వే చేయించి పారదర్శకంగా అర్హులకే దక్కేలా చూడాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని అభాగ్యులకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి అర్హులకు దక్కేలా చూడాలని లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
పత్తి రైతుకు విత్తన భారం
నవాబుపేట: ఆరుగాలం శ్రమించి తీసిన పంటకు గిట్టుబాటు రాక నష్టపోతుంటే ఏటేటా పెరుగుతున్న విత్తనాలు, ఎరువుల ధరలతో రైతులకు అదనపు భారం పడుతోంది. గతేడాది పత్తిసాగు సమయంలో వర్షాలు లేక దిగుబడి తగ్గింది. ఈ ఏడాది తాజాగా బీటీ–2 పత్తి విత్తనాలు రూ.38 పెంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పంటగా.. కొంత కాలంగా రైతులు వానాకాలం సాగు ప్రధాన పంటగా పత్తి సాగుచేస్తున్నారు. నవాబుపేట మండలంలోనే గతేడాది 21,539 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి సైతం అంతే మొత్తంలో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఒక ఎకరాకు రెండు నుంచి మూడు పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయి. అర కిలో బీటీ పత్తి ప్యాకెట్ ధర గతేడాది రూ.835 ఉండగా ఈ సారి రూ.901కి పెంచారు. ఇప్పటికే రైతులు వానాకాలం సాగుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక వానాకాలంలో నవాబుపేట మండలానికి 1,200 మెట్రిక్ టన్నుల యూరియా, 820 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,380 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 110 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు, 50 టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అవసరం అవుతాయని మండలాధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. రైతులను నమ్మబలుకుతున్న డీలర్లు డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులు అడిగన కంపెనీ విత్తనాల మార్కెట్లో తక్కువ మొత్తంలో లభిస్తున్నాయని.. తాము బ్లాక్లో తెస్తున్నామని రైతులను నమ్మబలికి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదంటున్నారు. ఏటా పెరుగుతున్న ధరలు ఆందోళనలో కర్షకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ఎరువులు, విత్తనాలు విక్రయించాలి. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవు. రైతులు తప్పని సరిగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. – జ్యోతి, మండల వ్యవసాయాధికారి, నవాబుపేట -
447వ ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి
తాండూరు టౌన్: పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ఎప్సెట్లో 447 ర్యాంకు సాధించాడు. మండలంలోని చిట్టిఘనాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న గర్గుపల్లి నర్సిరెడ్డి, భ్రమరాంబ దంపతుల కుమారుడు అభినవ్రెడ్డి ఇంజనీరింగ్ విభాగంలో ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో 100.27 మార్కులతో రాష్ట్రస్థాయిలో 447వ ర్యాంకు సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్లోనూ 97 శాతం మార్కులు సాధించాడు. ఎప్సెట్లో ఉత్తమ ర్యాంకు సాధించిన అభినవ్రెడ్డిని తాత మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, తల్లిదండ్రులు, తాండూరు వాసులు అభినందించారు. -
అనుమతి లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగం
మొయినాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగిస్తున్న ఫాంహౌస్పై ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. ఢిల్లీ, గోవా రాష్ట్రాలకు చెందిన రూ.4 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తోలుకట్టలో నగరానికి చెందిన తేజా రెడ్డి ఫాంహౌస్ ఉంది. శనివారం రాత్రి ఇక్కడ ఓ ఫంక్షన్ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఎకై ్సజ్ పోలీసులు అర్థరాత్రి ఫాంహౌస్పై దాడి చేశారు. ఫంక్షన్లో వినియోగిస్తున్న ఢిల్లీకి చెందిన 50 బ్లాక్ లేబులు బాటిళ్లు, గోవాకు చెందిన నాలుగు యివాస్రీగల్ బాటిళ్లు, తెలంగాణకు చెందిన 3 లిక్కర్ బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసి పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని..
దుండిగల్: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన సమ్మర్ క్యాంపు
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు పది రోజులుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపు ఆదివారంతో ముగిసింది. శిక్షణలో భాగంగా విద్యార్థులకు గేమ్స్, స్పోర్ట్స్తో పాటు ఖురాన్ పఠనం, నైతిక విలువలు తదితర అంశాలలో తర్ఫీదునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, యూనిట్ అధ్యక్షుడు రఫీయొద్దీన్, ఆర్గనైజేషన్ వికారాబాద్ ఇంచార్జి అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
దుద్యాల్: అదుపుతప్పిన కారు విద్యుత్ సం్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఈర్లపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన కావలి రాజు, సిద్ధు పని నిమిత్తం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈర్లపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం మూడు ముక్కలయింది. కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తప్పిన పెను ప్రమాదం -
సేవాభావాన్ని అలవర్చుకోవాలి
తాండూరు టౌన్: ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాండూరులో ఏఎస్జీఎంకే ట్రస్టు చైర్మన్ ముజీబ్ఖాన్తో కలిసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, వైద్య, కంటి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సంపాదించిన దానిలో కొంత మొత్తం పేదలను ఆదుకునేందుకు ఉపయోగించాలన్నారు. తాండూరు ప్రాంతంలో పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ఖాన్ అభినందనీయుడున్నారు. అనంతరం ముజీబ్ఖాన్ మాట్లాడుతూ.. స్వార్థ చింతనను వదిలి పేదలకు ప్రతి ఒక్కరూ తోచిన సహాయ సహకారాలు అందించాలన్నారు. భవిష్యత్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రవూఫ్, డాక్టర్ సంపత్కుమార్, రవి, భగవాన్, రఘు, శివానంద్, సంకేత్, తేజ్ అబ్దుల్లా, మసూద్, గపూర్ తదితరులు పాల్గొన్నారు. రైతు జితేందరెడ్డిని ఆదుకుంటాం తాండూరు రూరల్: విద్యుదాఘాతంతో చెరుకు పంట దగ్ధమైన రైతు జితేంధర్రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని మండలి చీఫ్ విప్ పట్నం మహేంద్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పెద్దేముల్ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. విద్యుదాఘాతంతో దగ్ధమైన జితేందర్రెడ్డి చెరుకు పంటను పరిశీలించారు. వెంటనే తహసీల్దార్కు ఫోన్ చేసి ప్రభుత్వం నుంచి రైతుకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ డీఈ భాను ప్రకాశ్ను ఆదేశించారు. అనంతరం పెద్దేముల్ మండల కేంద్రంలోని చిట్టెపు లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బషీరాబాద్ మండలంలో ధాన్యం కోనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట నాయకులు కరణం పురుషోత్తంరావు, డీవై నర్సింలు, బలవంత్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అజంఖాన్, సిబ్లి, బుజ్జమ్మ, బాలప్ప, రవీందర్ ఉన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి -
సైన్యానికి మద్దతుగా పూజలు
అనంతగిరి: యుద్ధ వాతావరణ పరిస్థితులలో భాగంగా భారత్ సైన్యానికి మద్దతుగా వికారాబాద్ పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం వికారాబాద్ (అనంతగిరి) జిల్లా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదానంద రెడ్డి, ఆలయ పూజారి అనంతగిరి పంతులు, ముక్తా రెడ్డి, శ్రీరాములు, మాణిక్ రెడ్డి, నారాయణ రాథోడ్, పాపయ్య, రమేష్ గౌడ్, రవిశంకర్, మొణిగారి లావణ్య, జయశ్రీ, వరలక్ష్మి, విజయ, సరిత, అనురాధ, సరళ, రజిత తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు?
కేశంపేట: గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన మండల పరిఽధిలోని వేములనర్వ గ్రామ శివారులోని పాత బీరప్ప దేవాయలం సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములనర్వ గ్రామం నుంచి అల్వాల వైపు వెళ్లే దారిలో పాత బీరప్ప దేదాలయం సమీపంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం జేసీబీ సాయంతో గుంతను తీసి పూడ్చివేశారు. ఆదివారం సమీపంలోని రైతులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గుంత సమీపంలో పూజా సామగ్రితో పాటు నిమ్మకాయలు, గుమ్మడికాయలు కన్పించాయి. ఓ కుండను పగులగొట్టిన ఆనవాళ్లు కన్పించాయి. గతంలో పాత బీరప్ప గుడి సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ నరహరి సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంత తీసి మళ్లీ పూడ్చిన ఆనవాళ్లు ఉన్నట్టు తెలిపారు. -
అమ్మ కష్టం వృథా కాలే..
పరిగి: భర్త మృతితో కుంగిపోకుండా పిల్లల ఎదుగుదలే ధ్యేయంగా కష్టపడింది. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివించింది. అమ్మ కష్టాన్ని గుర్తించిన ఆ బిడ్డలు బుద్ధిగా చదువుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊటుపల్లి గ్రామానికి చెందిన కావలి పోచమ్మ, అనంతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే అనారోగ్యం బారిన పడి అనంతయ్య మృతిచెందాడు. సెంటు భూమి కూడా లేని నిరుపేద కుటుంబం వీరిది. ఇంటి పెద్ద దిక్కు కూలిపోవడంతో ఆతల్లి రెక్కలు విరిగినట్లయింది. తిండికి కూడా లేని పరిస్థితిలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నింటినీ ఎదుర్కొని, పిల్లల కోసమే పరితపించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారి చదువును ముందుకు నడిపింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, చిన్న కొడుకు రాఘవేందర్ కానిస్టేబుల్గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా పోచమ్మను పలకరించగా.. నేను పడ్డ కష్టానికి తగ్గట్లుగా పిల్లలు వృద్ధిలోకి రావడం సంతోషాన్నిస్తోందని భావోద్వేగం వ్యక్తంచేసింది. -
దేవుడు పంపిన ‘అమ్మ’
మీర్పేట: వివాహమైన కొన్నేళ్లకు కూడా పిల్లలు కాకపోవడంతో అనాథ పాపను దత్తత తీసుకుంది. చిన్నారికి అనారోగ్య సమస్య ఉందని తెలిసినా, భర్త సహకారంతో పాపను పెంచి పెద్దచేసింది. అమ్మా అనే పిలుపు కోసం ఆతల్లి పడిన వేదన మాతృత్వంలోని మమకారాన్ని చాటిచెప్పింది. తన బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించి, సొంతకాళ్లపై నిలబడేందుకు ఎంతో కృషి చేసింది. అనంతరం ఆమెకు వివాహం చేయడంతో పాటు పుట్టిన ఇద్దరు మనవరాళ్ల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమే నందిహిల్స్కు చెందిన విజయలక్ష్మి. వివాహమైన కొన్నేళ్లు గడిచినా పిల్లలను పుట్టకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఆడపిల్లనే కావాలని కోరింది. స్టేట్ హోమ్ నుంచి ఓ పాపను దత్తత తీసుకుంది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఆస్పత్రుల చుట్టూ తిప్పింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడింది. భర్త యాదయ్య సహకారంతో తన కూతురుకు విద్యాబుద్ధులు నేర్పించి, నచ్చిన రంగంలో ఆమెను ప్రోత్సహించింది. అనంతరం తగిన వరున్ని చూసి వివాహం చేసింది. అల్లుడు, కూతురిని తనవద్దే పెట్టుకుంది. ప్రస్తుతం విజయలక్ష్మి బిడ్డకు ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. వీరిని కూడా ఆమే చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. -
కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నిలిపి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్బన్ బహదూర్పూర ప్రాంతం హెచ్బీ కాలనీలో నివాసముండే రితేష్కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన హైదరాబాద్ వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్కు చెందిన ప్రియాన్ష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాట చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులుతేరుకునే లోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనం కాగా, కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్మిఠల్ను అతికష్టంగా బయటకు తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేమి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి ఓఆర్ఆర్పై ఆగిఉన్న బొలేరోనుఢీకొట్టడంతో ప్రమాదం -
అనుమానాస్పద స్థితిలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
తాండూరు రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కరన్కోట్ గ్రామ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరన్కోట్ గ్రామానికి చెందిన ఉస్సేన్ అలీ(39)కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీసీఐ ఫ్యాక్టరీలో పంప్హౌస్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా 15 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున పని ప్రదేశంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అక్కడే పని చేస్తున్న ఉస్సేన్ అలీ సోదరుడు మహబూబ్ అలీకి తోటి కార్మికులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉస్సేన్ అలీని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అలీ మృతి చెందినట్లు నిర్ధారించారు. తన తమ్ముడి మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని సోదరుడు పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన కార్మికుడు చనిపోయిన విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, కార్మికులు, గ్రామ నాయకులు ఫ్యాక్టరీ గేటు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి సిబ్బందితో ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో గ్రామ నాయకులు, కార్మిక సంఘాలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి కంపెనీ పరంగా రావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పంప్హౌస్ కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష పరిహారం, కంపెనీ నుంచి రూ.7 లక్షల ఇన్సూరెన్స్, మృతుని భార్యకు ఉద్యోగం, ప్రతి నెలా రూ.3 వేలు, ఒక్క పిల్లాడికి రూ.500 పెన్షన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీీసీ మాజీ సభ్యుడు రాజ్కుమార్, నాయకుడు శ్రీనుగౌడ్, సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరణప్ప, మాజీ ఉప సర్పంచ్ హేమంత్, పలువురు కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. కరన్కోట్లోని సీసీఐ ఫ్యాక్టరీలో ఘటన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన మద్దతుగా నిలిచిన కార్మికులు, గ్రామ నాయకులు ఆదుకుంటామని యాజమాన్యం హామీ -
అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది
ఆతల్లి పిల్లలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే బొంరాస్పేట: మండల పరిధిలోని గౌరారానికి చెందిన ఎర్రోళ్ల రాములు, అంజిలమ్మకు ఆనందం, సురేఖ, రాజేందర్, విజయ్, వసంత ఐదుగురు సంతానం. వ్యవసాయ కూలీలుగా పనిచేసే భార్యాభర్తలు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. పిల్లలు ప్రాథమిక విద్యలో ఉండగానే తండ్రి అకాలమరణం చెందాడు. దీంతో అన్ని బాధ్యతలు అంజిలమ్మపై పడ్డాయి. భర్తను కోల్పోయిన బాధ వేధిస్తున్నా.. తన పిల్లలను బతికించుకోవడమే ధ్యేయంగా సాగింది. కూలీ పనులు చేస్తూనే వారిని బడికి పంపింది. పిల్లలను బాగా చదివించింది. కట్ చేస్తే.. పెద్ద కొడుకు ఆనందం పంచాయతీ కార్యదర్శిగా, సురేఖ ప్రభుత్వ ఉపాధ్యాయినిగా(ఎస్ఏ ఇంగ్లిష్), రెండో కొడుకు రాజేందర్ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా, చిన్న కొడుకు విజయ్ ఎస్ఐగా, చిన్నకూతురు వసంత ఎస్ఐగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కలలు నిజమయ్యాయి నాభర్త 2010లో చనిపోయాడు. 15 ఏళ్ల నుంచి నా కొడుకులు, కూతుళ్లకు తండ్రిలేడనే లోటు లేకుండా పెంచా. ఆయన ఆలోచన ప్రకారం అందరు బాగా చదవాలని కోరుకున్నా. అలాగే చదివించాను. అందరికీ సర్కారు కొలువులు రావడం చాలా ఆనందంగా ఉంది. – ఎర్రోళ్ల అంజిలమ్మ, గౌరారం అమ్మే.. నాన్నలా.. ఇబ్రహీంపట్నం: భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని పిడుగుపడింది. విధి వక్రీకరించి భర్త మరణించడంతో దిక్కులేని స్థితిలో బతుకు భారంగా మారింది. అయినా పిల్లలను పోషించుకునేందుకు లాండ్రీ షాపు నిర్వహిస్తూ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తోంది. పట్టణంలోని గోల్కొండ శ్రీలతకు బీఎన్రెడ్డిలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో వ్యాన్ డ్రైవర్గా పనిచేసే రాజుతో 2007లో వివాహం జరిగింది. వీరికి వైష్ణవి, సాయికార్తీక్ సంతానం. పెళ్లయిన నాలుగేళ్లకే రాజు మరణించాడు. అత్తవారి ఇంటి వదవ్ద ఆస్తిపాస్తులు కూడా లేకపోవడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తన పిల్లలను అనాథలుగా మార్చేందుకు ఇష్టం లేక.. కన్నీటిని దిగమింగుకుని తన కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంది. స్థానికంగా లాండ్రీషాపు ప్రారంభించి ఇద్దరు పిల్లను చదివిస్తోంది. ఆరుగురు కూతుళ్ల ‘ఆరోగ్య’ లక్ష్మి కొడంగల్: ఆరుగురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ తల్లి ఏనాడూ చిన్నబుచ్చుకోలేదు. కొడుకులైనా, బిడ్డలైనా ప్రయోజకులైతే చాలని భావించింది. అందరినీ బాగా చదివించింది. ప్రస్తుతం వీరందరూ వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. రావులపల్లికి చెందిన లక్ష్మి, అంజయ్యగౌడ్ గీత కార్మికులు. కులవృత్తే వీరి జీవనాధారం. ఆడ పిల్లలకు చదువెందుకు అనుకోకుండా రెక్కల కష్టంతో బిడ్డలను చదివించారు. మొదటి కూతురు జయమాల, రెండో కూతురు అనురాధ అంగడిరాయ్చూర్ పీహెచ్సీలో ఏఎన్ఎంలుగా, మూడో కూతురు అరుణజ్యోతి జీఎన్ఎమ్గా, నాలుగో కూతురు ఉమలత ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా, ఐదో కూతురు రాధిక తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బీఎస్సీ నర్సింగ్, ఆరో కూతురు శిరీష జీఎన్ఎమ్ స్టాప్ నర్స్గా పనిచేస్తున్నారు. నలుగురు పెద్ద కూతుళ్లకు వివాహం చేశారు. ఆయన ఆకాంక్ష నెరవేరింది పిల్లలను బాగా చదివించి, టీచర్లుగా చేయాలనేది నా భర్త ఆకాంక్ష. ఆయన అప్పటికే కవి, రచయిత. ఆయన ఆశయం మేరకు పిల్లలను చదివించా. నా ముగ్గురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక తల్లిగా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. – నూర్జహాన్బేగం, రిటైర్డ్, అటెండర్ ముగ్గురు ఉపాధ్యాయుల తల్లి అనంతగిరి: బషీరాబాద్ మండలం పర్వత్పల్లికి చెందిన మహబూబ్, నూర్జహాన్కు దంపతులకు నస్రీన్బేగం, యాసిన్, మోసిన్ ముగ్గురు సంతానం. ప్రభుత్వ పాఠశాలలో నైట్ వాచ్మన్గా పనిచేసే మహబూబ్ 1987లో జరిగిన రైలు ప్రమాదంలో అకాల మరణం చెందారు. అప్పటికీ పిల్లల వయసు ఏడేళ్లలోపే. భర్త మృతితో కారుణ్య నియామకం కింద నూర్జహాన్కు మైల్వార్ ప్రభుత్వ పాఠశాలలో (1988) అటెండర్గా ఉద్యోగం ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఏకై క లక్ష్యంతో ముందుకు సాగింది. అనేక కష్టాల మధ్య తల్లిని అనుసరిస్తూ పెరిగిన పిల్లలు కష్టపడి చదివారు. ముగ్గురూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. పెద్దమ్మాయి నస్రీన్బేగం ప్రస్తుతం బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో, ఉపాధ్యాయుడైన యాసిన్ ఎస్సీఆర్టీలో ఫ్యాకల్టీగా, మోసిన్ మర్పల్లి మండలం పిల్లగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శివారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ 2020లో నూర్జహాన్ విరమణ పొందారు. ప్రస్తుతం వికారాబాద్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ‘మాతృ’భూమికి ఇద్దరు సైనికులు దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్కు చెందిన గొల్ల ఎల్లమ్మ, అనంతయ్య దంపతులకు రాములు, మల్లేశ్, సంతోష్ ముగ్గురు సంతానం. అనంతయ్య అకాల మృతితో పిల్లల భారం ఎల్లమ్మపై పడింది. తన బాధను గుండెల్లోనే దాచుకుని ముగ్గురు కొడుకులను చదివించింది. పెద్ద కుమారుడు రాములు సైన్యంలో సేవలందించి, పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం బ్యాంకులో గార్డుగా ఉద్యోగం చేస్తున్నారు. 2016లో ఇండియన్ ఆర్మీలో చేరిన రెండో కొడుకు మల్లేశం సైనికుడిగా దేశరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నకొడుకు మల్లేశం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దేశానికి ఇద్దరు సైనికులను అందించిన ఎల్లమ్మకు మదర్స్ డే సెల్యూట్. హ్యాపీ మదర్స్ డే అందరి జీవితంలోనూ అమూల్యమైన వ్యక్తి అమ్మ. బిడ్డల కోసం ఆమె పడే ఆరాటం అంతాఇంతా కాదు. మా అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలమే. అమ్మ ప్రోత్సాహమే నన్ను నిలబెట్టింది. ప్రస్తుతం నాకు కూడా ఓ కూతురు (మైరా) ఉంది. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – సుశీల ఎస్ఐ, షాద్నగర్. షాద్నగర్ రూరల్: మహేశ్వరం మండలం పెద్దమ్మతండాకు చెందిన మంగ్యానాయక్, మోతీ దంపతులకు జ్యోతి, సుశీల, రుక్మిణి, అరుణ నలుగురు ఆడపిల్లలు. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వీరికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. తండాలో పుట్టిన తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మోతీ నిర్ణయించుకుంది. తామెన్ని ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డల చదువుల విషయంలో ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఈక్రమంలో జ్యోతి ఎకై ్సజ్ కానిస్టేబుల్గా, సుశీల ఎస్ఐగా, రుక్మిణి టీచర్గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2020 బ్యాచ్కు చెందిన సుశీల ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కరాన్కోట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
గ్రామాలకు కార్యదర్శులే పట్టుకొమ్మలు
అబ్దుల్లాపూర్మెట్: పంచాయతీ కార్యదర్శుఽలే గ్రామాలకు పట్టు కొమ్మలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేటలోని వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సమ్మేళనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెరెడ్డి, ఎమ్మెల్సీలు మహేఽశ్గౌడ్, కోదండరాంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కార్యదర్శులు లేని వ్యవస్థను ఊహించలేమన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చడంలో వీరి పాత్ర కీలకమన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. పంచాయతీ అధికారులు, సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈక్రమంలో మానసిక ఒత్తిడికి గురై సుమారు 50 మంది పంచాయతీ కార్యదర్శులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి పాలనలో ఇలాంటి సమస్యలన్నీ దూరమై పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆనందంగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన అమరవీరుల ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి, అంజలి ఘటించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన పీర్ల వెంకన్న భార్యకు రూ.3 లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్గౌడ్, సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎం.సందీప్, కోశాధికారి ఎం.శశింద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్,సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పంచాయతీ సిబ్బంది సమస్యలపరిష్కారానికి హామీ -
మహిళల అభ్యున్నతికి కృషి
పరిగి: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళల రాజ్యం నడుస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారి పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో విరివిగా ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఆ దిశగా ఆలోచన చేసి వృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోసెప్, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీల చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో అమరులైన వీర సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్కు నివాళులర్పించారు. ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
హకీంపేట్లో సీసీ కెమెరాల ఏర్పాటు
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ ప్రధాన కూడలిలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హకీంపేట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుదా ఘాతంతో చెరుకు పంట దగ్ధం తాండూరు రూరల్: విద్యుదా ఘాతంతో చెరుకు పంట దగ్ధమైంది. ఈ సంఘటన పెద్దేముల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దేముల్ గ్రామానికి చెందిన రైతు జితేందర్రెడ్డి చెరుకు పంట సాగు చేశాడు. శనివారం మధ్యాహ్నం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ఒకదానికొకటి రాసుకొని మంటలు చెలరేగి చెరకుపంట దగ్ధమైంది. ఈ విషయాన్ని స్థానిక రైతులు గుర్తించి జితేందర్రెడ్డికి సమాచారం చేరవేశారు. ఆ తర్వాత అందరూ కలిసి మంటలను ఆర్పేశారు. అయితే పొలంలో విద్యుత్తీగలు వేలాడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయన్నారు. వేలాడుతున్నా విద్యుత్వైర్లకు మరమ్మతులు చేయాలని గతంలో విద్యుత్ అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు పంటతో పాటు బోరు మోటారు, స్టాటర్, విద్యుత్వైర్లు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నాడు. చేపలు పట్టడానికి వెళ్లి.. గండిపేట చెరువులో మునిగి వ్యక్తి మృతి మొయినాబాద్: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదశాత్తు నీట మునిగి చని పోయాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధి చిలుకూరులో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. చిలుకూరుకు చెందిన తోల్కట్ట శ్రీశైలం(28) బాలాజీ దేవాలయం వద్ద కొబ్బరికాయ లు విక్రయించడంతో పాటు చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా ఈ నెల 8న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రామ సమీపంలోని గండిపేట చెరువు లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో చేపల కోసం వల వేస్తుండగా అది అ తని కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయా డు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికా రు. కాగా ఆదివారం ఉ దయం అతడి మృతదే హం చెరువులో తేల డాన్ని గమనించిన స్థానికు లు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైపాల్ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్లో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ కొడంగల్: పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శనివారం ఆర్అండ్బీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మార్కింగ్ ఇచ్చారు. ఈ పనులకు రూ.45 కోట్లు మంజూరైనట్లు అధికారులు చెప్పారు. 4 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నాలుగు లేన్లుగా విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. వినాయక చౌరస్తాను విస్తరించనున్నారు. పట్టణంలోని తాండూరు మహబూబ్నగర్ జాతీయ రోడ్డును విస్తరించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, దుకాణాదారులు సహకరించాలని అధికారులు కోరారు. భాస్కరయోగికి పాత్రికేయ విశిష్ట పురస్కారం పరిగి: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి రచయిత డాక్టర్ భాస్కరయోగికి సమాచార భారతి.. నారద జయంతి సందర్భంగా కాలమిస్టుగా పాత్రికేయ విశిష్ట పురస్కారం అందజేసింది. నగరంలోకి కోఠిలో వైఎంఐఎస్లో పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారులు చామర్తి ఉమామహేశ్వరరావు, సాయి ప్రసాద్, సమాచార భారతి అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి యాలాల: వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యాలాల ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలకు నంబర్ ప్లేట్లు, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్పై అవగాహన కల్పించారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్కు లోబడి వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో పీఎస్ఐ వినోద్ పాల్గొన్నారు. వీర సైనికులకు ఘన నివాళి అనంతగిరి: పాక్ దాడుల్లో మృతి చెందిన వీర సైనికులకు శనివారం వికారాబాద్లోని కొత్తగంజ్ హనుమాన్ మందిరం వద్ద కాలనీవాసులు ఘనంగా నివాళులర్పించారు. ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్ పాల్గొన్నారు. -
శ్లోకాల పఠనంతో జ్ఞానసముపార్జన
భగవద్గీత అధ్యాపకుడు రాములు, మండల మాజీ ఉపాధ్యక్షుడు మల్లేశం దోమ: భగవద్గీత శ్లోకాలను కంఠస్తం చేయడంతో జ్ఞాపక శక్తి పెరుగుతుందని భగవద్గీత అధ్యాపకుడు రాములు, మండల మాజీ ఉపాధ్యక్షుడు జి.మల్లేశం అన్నారు. మండలంలోని మోత్కూర్ గ్రామంలో ఏడాదిగా విద్యార్థులకు భగవద్గీత అభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 12వ ఆధ్యాయం పూర్తయిన సందర్భంగా శనివారం విద్యార్థులకు శ్లోకాల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చేయాలని సూచించారు. అందులోని శ్లోకాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు పాలేపల్లి వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ కరణం శ్రీకాంత్ రావు, విద్యార్థులు, గ్రామస్తులు, పాల్గొన్నారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని..
ఇబ్రహీంపట్నం: ఓ బీటెక్ విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురునానక్ కాలేజీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెళ్లికి చెందిన అలూరి భావన(22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ ఇదే హాస్టల్లో ఉంటోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యార్థినులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన ఒక్కతే ఉంది. ఏమైందో తెలియదు కానీ శనివారం తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుంది. కొద్ది సేపటికి ఇది గమనించిన మిగిలిన విద్యార్థులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భావన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలానికి తరలించే అవకాశం ఉందని తెలిసింది. కాలేజీ వద్ద ఉద్రిక్తత విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోనికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీపీ రాజు, సీఐ జగదీశ్లు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా.. గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఇబ్రహీంపట్నంలోని గురునానక్ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన విద్యార్థి సంఘాల ఆందోళన మృతురాలిది ఖమ్మం జిల్లా -
అమ్మా వందనం
బిడ్డల ఉన్నతే లక్ష్యంగా నిలిచి, గెలిచిన మాతృమూర్తులు ● ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు.. ● పిల్లల విజయాలతో పట్టలేని సంతోషం ● నేడు మదర్స్ డే సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’.. సృష్టికి మూలం కూడా అమ్మే.. అమ్మా అనే రెండక్షరాల్లోని ప్రేమను కొలిచేందుకు సరితూగే సాధనాలే లేవు. కరుణ, త్యాగానికి ప్రతిరూపమైన అమ్మ గొప్పతనం.. ఆ పిలుపులోని మాధుర్యం వెలకట్టలేనిది. ఆమె జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. తన బిడ్డలను ఉన్నత స్థితిలో నిలిపేందుకు అమ్మ పడే వేదన మాటలకందనిది. అందుకే అమ్మా.. అందుకో మా వందనం. హహహ -
బహుదూరపు బాటసారి..
బంట్వారం: పాలమూరు గొర్రెల కాపరులను బహుదూరపు బాటసారులుగా పిలుస్తున్నారు. ఏడాదిలో 8 నెలల పాటు కురుమ, గొల్లలు వివిధ జిల్లాల్లో గొర్రెల మందలతో మేత మేపడం కోసం తిరుగుతూనే ఉంటారు. బంట్వారం, కోట్పల్లి మండలాల్లో సైతం వస్తుంటారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయలు దేరుతారు. ప్రతీఏటా దీపావళి తర్వాత ఇళ్లను వదిలి జీవాలతో సంచరిస్తుంటారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతుండేది. మూగజీవాలను బతికించుకునేందుకు అక్కడి గొర్రెల కాపారులు నానాతంటాలు పడేవారు. ఈ క్రమంలోనే వారు అప్పట్లోనే గొర్రెల మందలతో మేత కోసం సూదూర ప్రయాణం చేస్తుంటారు. నేటికి కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. వేలాది గొర్రెలతో రోడ్డు మార్గంలో వందల కిలోమీటర్లు కాలినడకన సంచరిస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కుల వృత్తిని మాత్రం వదిలి పెట్టమని గర్వంగా చెబుతున్నారు. తరచూ ప్రమాదాలు సూదూర ప్రయాణం రోడ్డు మార్గంలో కూడా సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. సంబంధిత పశు సంవర్ధక శాఖ అధికారులు జీవాలకు ఇన్సూరెన్స్ చేయించడం లేదు. అవగాహన కల్పించడం లేదు. ఎక్కడ చీకటి పడితే అక్కడే.. నెలల తరబడి ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలో మీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటి పడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. జీవాలకు సైతం తాగునీరు కరువైంది. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. జూన్లో వచ్చే మృగశిర కార్తె వరకు బయటనే కాలం గడుపుతారు. వర్షాలు మొదలవ్వగానే మెల్లగా మందలతో పాలమూరుకు తిరు పయనమవుతారు. పొలాల్లో మందలు వేస్తూ.. రాత్రి వేళ పొలాల్లో మందలు వేస్తే రైతులు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. బియ్యం ఇతర నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. వీటితోనే కాపారులు కాలం గడుపుతున్నారు. పొలాల్లోనే వంట చేసుకుంటున్నారు. తెల్లవారగానే భోజనం సిద్ధం చేసుకుని సద్దిమూట, నీటి డబ్బాలతో మళ్లీ గొర్రెల మందతో ముందుకు సాగుతున్నారు. గొర్రెల ఎరువు పొలాలకు చాలా బలం కావడంతో రైతులు పోటీ పడి రాత్రి వేళ మందలు వేసుకుంటున్నారు. మందకు నలుగురు.. ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. 8 నెలల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటాం. రెండు నెలలకు ఒక సారి ఇంటికి వెళ్లి వస్తాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. మొదక్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా తిరుగుతాం. వర్షాకాలం వరకు బయటనే ఉంటాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – ఆనందం, గొర్రెల కాపరి ఇన్సూరెన్స్ లేక నష్టం ఇన్సూరెన్స్ లేకపోవడంతో నష్టపోతున్నాం. రోడ్డు పొడువునా చాలా దూరం వెళ్తుంటాం. కొన్ని సార్లు లారీలు, ఇతర వాహనాలు గొర్రెల మందను గుద్దేసి పోతాయి. ఎవరూ పట్టించుకోరు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కులవృత్తి కావడంతో వదిలిపెట్టడం లేదు. చాలా కాలంగా ఇదే వృత్తిని నమ్ముకని బతుకుతున్నాం. అప్పడప్పుడు ఇంటికి వెళ్లి వస్తుంటాం. జూన్ వరకు గొర్రెల మందలతో ఉంటాం. ప్రభుత్వం గొర్రెల కాపారులను ఆదుకోవాలి. – ఐలయ్య, గొర్రెల కాపరి పాలమూరు గొర్రెల కాపరులు నెలలతరబడి ఇంటికి దూరం కులవృత్తిని నమ్ముకుని జీవనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాపరులు ప్రభుత్వం ఆదుకోవాలి -
నేటి నుంచి పురాతన నాణేలు, కరెన్సీ నోట్ల ఎగ్జిబిషన్
చార్మినార్: పాతబస్తీలో రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్లు, పురాతన వస్తువులు సేకరణల ప్రదర్శన శనివారం ప్రారంభం కానుంది. సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించే ఈ ఎగ్జిబిషన్ పాతబస్తీ ఉర్దూ ఘర్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అరుదైన నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్ల ప్రదర్శన, చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 7వ శతాబ్దం నాటి అంతర్జాతీయ నాణేలు, కరెన్సీని ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రి తెలిపారు. నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్లతో పాటు ఇతర పురాతన వస్తువుల మిశ్రమ కలయిక గల వస్తువులను ఈ ఎగ్జిబిషన్లో సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మరిన్ని వివరాల కోసం సొసైటీ కార్యదర్శి లేదా డైరెక్టర్ సిరాజుద్దీన్లను 8500212306 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
అనుమతులు లేనివి ఎన్నో?
నస్కల్ గ్రామంలో అనుమతులు లేకుండా చేసిన వెంచర్జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని లేఅ వుట్లు చాలానే ఉన్నాయి. దాదాపు 550 వరకు ఉన్నట్లు సమాచారం. వీటిలో వేల మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రుసుం చెల్లించి ప్లాట్లు, వెంచర్లు రెగ్యులరైజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నుంచి 20,900 దరఖాస్తులు వచ్చాయి. 594 గ్రామ పంచాయతీల నుంచి 16,095 అర్జీలు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఇచ్చిన గడువు మే 3వ తేదీ నాటికి దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం 17 శాతం మంది మాత్రమే ఫీజు చెల్లించి తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకున్నారు. 36,995 దరఖాస్తుల్లో 6,207 మంది తమ ప్లాట్లను క్రమబద్ధ్దీకరించుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.19.8 కోట్ల ఆదాయం సమకూరింది. తాండూరు మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా 12,259 దరఖాస్తులు వచ్చినా కేవలం 1,387 మంది మాత్రమే పాట్లను రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. -
ధాన్యం మిల్లులకు తరలించండి
పరిగి: రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది ఉండరాదనే జిల్లా వ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13,425 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వివరించారు. ఇందుకు గాను రూ.12.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఇష్టానుసారంగా తూకాలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తూకం వేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవరాదని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, కొరత ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్బాబు, డీఎం మోహన్కృష్ణ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
● ఉపాధ్యాయులు పట్టుదలతో బోధన చేపట్టాలి ● ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు తీసుకురావాలి ● వేసవి శిక్షణ శిబిరంలో చదువుతో పాటు నృత్యం, డ్రాయింగ్, క్రీడలు ● ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి ● ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి సూచనదుద్యాల్: ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకే ఉన్నత చదువు, అనుభవం ఉంటుందని, నాణ్యమైన విద్య బోధించడంలో వారు ముందుంటారని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి పేర్కొన్నారు. శుక్రవారం దుద్యాల్ మండల పరిధిలోని చిలుముల మైల్వార్ పాఠశాలలో విద్యార్థులకు కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈవో విజయరామా రావుతో కలిసి పరిశీలించారు. శిక్షణ శిబిరం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు ఆసక్తి, విద్య, శారీరక సామర్థ్యాలు పెంచే విధంగా తగిన శిక్షణ అందించాలన్నారు. ముఖ్యంగా చదువుతో పాటు నృత్యం, డ్రాయింగ్, క్రీడలు, గణితం సంబంధిత అంశాల్లో మెలకువలు బోధించడంతో పాటు భాషా పరిజ్ఞానం పెంపొందించుకునేలా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సాంకేతికత పెంచేందుకే కృత్రిమ మేదస్సు శిక్షణ.. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ముందస్తుగానే అధునాతన సాంకేతిక పెంచేందుకు కృత్రిమ మేదస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) శిక్షణ అందిస్తున్నామని డీఈవో రేణుక దేవి తెలిపారు. కృత్రిమ మేదస్సు ద్వారా విద్యార్థులు చదవడం, నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం వంటి విధానాలు చాలా వేగంగా నేర్చుకుంటారన్నారు. కంప్యూటర్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, అందుకు సంబంధించి విద్యార్థులకు లాగిన్ ఐడీ ద్వారా ఈ విషయాలు అందుతాయని అన్నారు. చదువుతో పాటు కథలు, తెలుగు, ఇంగ్లీష్, గణిత సంబంధిత అంశాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని 265 పాఠశాలలో కృత్రిమ మేదస్సు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వార్షిక ప్రణాళిక ముందస్తుగానే తయారు చేసుకోవాలి.. ప్రతీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు వచ్చే అకాడమిక్ సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను ముందస్తుగానే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏ నెలలో ఏ పాఠ్యాంశం పూర్తి చేయాలి, అందుకు సంబంధించిన పరీక్షను ఎలా నిర్వహించుకోవాలి, అర్థం కాకుంటే విద్యార్థులకు ఎలాంటి వివరణ ఇస్తే బాగుంటాయో వంటి అంశాలను ఉపాధ్యాయుడు రాసుకుని తిరిగి విద్యార్థులకు బోధించాలి. పాఠ్యాంశ బోధనలో నిర్లక్ష్యం తగదని, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా అకాడమిక్ సంవత్సరం మొదటి నుంచే ప్రణాళికలు తప్పనిసరిగా సిద్ధం చేసుకుంటే ఉత్తమం. అందుకు తగ్గట్టుగా విద్యా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదయ్య, ఉపాధ్యాయు లు ఆంజనేయులు, సంగమేశ్వర్, గోవర్ధన్, అనిల్ కుమార్, హన్మంతు, దివ్య శ్రీ, కవిత, గ్రామస్థులు శివ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాల గొంతెండుతోంది!
● పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన నీటి తొట్లు ● మరి కొన్నిచోట్ల నీటి వసతి లేకనిరుపయోగం ● ఆందోళన చెందుతున్న రైతులు ● పట్టించుకోని అధికారులు దోమ: వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పశువుల దాహం తీర్చడం రైతులకు ఇబ్బందిగా మారింది. దోమ మండలంలో 11,850 ఎద్దులు, 9,964 ఆవులు, 26,312 గొర్రెలు, 17,163 మేకలు ఉన్నాయి. వీటి దాహార్తి తీర్చేందుకు గతంలో ఆయా గ్రామాల పరిధిలో 60 తొట్లను నిర్మించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల నీటి వసతి లేక నిరుపయోగంగా మారగా.. మరి కొన్ని గ్రామాల్లో శిథిలావస్థకు చేరాయి. దీంతో నీరులేక జీవాలు అల్లాడిపోతున్నాయి. ప్రభుత్వం పశువుల సంరక్షణ కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన తొట్లకు పంచాయతీ బోర్ల నుంచి నీటిని సరఫరా చేయాలి. పశువైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో రైతులు పశువుల దాహార్తి తీర్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల్లో సైతం నీరు అడుగంటడంతో సమస్య మరింత పెరిగింది. అధికా రులు స్పందించి దెబ్బతిన్న నీటితొట్లను బాగు చేయించడంతోపాటు శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్త తొట్లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. -
పవర్
మరింతగా..ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా శరవేగంగా విస్తరిస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రమిక విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,756 మెగావాట్లు నమోదు కాగా, 2025లో 4,352 మెగావాట్లకు చేరుకుంది. అదే 2030 నాటికి అనూహ్యంగా 9,089 మెగావాట్లకు పెరుగుతుందని డిస్కం అంచనా వేసింది. ఆ మేరకు విద్యుత్ లైన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు 62 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. మరో ఐదేళ్లలో ఇది 80 లక్షలు దాటే అవకాశం ఉంది. రాబోయే విద్యుత్ డిమాండ్ను ఇప్పుడే గుర్తించి, ఆ మేరకు ఏర్పాట్లు చేయడం ద్వారా ఇళ్లలో 24 గంటలు విద్యుత్ వెలుగులు విరజిమ్మొచ్చొని డిస్కం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 33/11 కేవీ ఫీడర్లు, డీటీఆర్లు సామర్థ్యం పెంచుతున్న డిస్కం.. తాజాగా మరికొన్ని అదనపు సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే రెండేళ్లలో రూ.420 కోట్ల అంచనాతో రంగారెడ్డిజోన్లో 34, మెట్రో జోన్లో 36, మేడ్చల్ జోన్లో 18 చొప్పున మొత్తం 88 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయిచింది. పనుల్లో నాణ్యత, వేగవంతం కోసం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సర్కిళ్ల వారీగా పనులను విభజించి, వాటికి టెండర్లు పిలిచి, ముందుకు వచ్చే ఔత్సాహిక కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని భావిస్తోంది. 61 సబ్స్టేషన్లలో రికార్డు స్థాయి వృద్ధిరేటు గ్రేటర్ జిల్లాల్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 62 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ, 8 లక్షలకుపైగా వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా అదనంగా 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. కొత్త కనెక్షన్లకు తోడు ప్రతి ఇంట్లోనూ ఏసీ, కూలర్, ఓవెన్, మిక్సీ, వాషింగ్ మిషన్, గ్రీజర్, టీవీ, కంప్యూటర్, ఐరెస్ బాక్స్ సర్వసాధారణమయ్యాయి. ఫలితంగా విద్యుత్ డిమాండ్ వార్షిక పెరుగుదల రేటు ఏటా సగటున 15 నుంచి 25 శాతం పెరుగుతోంది. 61 సబ్స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ వృద్ధిరేటు నమోదైంది. 30 నుంచి 87 శాతం వరకు వృద్ధి రేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా పెరుగుతున్న ఈ వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇంజనీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సమ్మర్ యాక్షన్ప్లాన్లో భాగంగా బంజారాహిల్స్, సైబర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, హబ్సిగూడ, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో ఇరవై 33/11 కేవీ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. వీటిలో 184 పీటీఆర్ల సామర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచారు. 33 కేవీఫీడర్లు 69, అదే విధంగా 11 కేవీ ఫీడర్లు 592 ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 6,675 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య లేకుండా చూశారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో డిమాండ్ రానున్నట్లు డిస్కం ఇంజనీర్లు అంచనా వేశారు. 2030 నాటికి గ్రేటర్ డిమాండ్ 9,089 మెగావాట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అంచనా సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంపు అదనపు సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణకు ప్రతిపాదనలుగ్రేటర్లో 2030 నాటికి విద్యుత్ వృద్ధి రేటుసంవత్సరం మెగావాట్లు 2022 3,158 2023 3,435 2024 3,756 2025 4,352 2026 5,043 2027 5,843 2028 6,770 2029 7,644 2030 9,089 -
అంతర్జాతీయ క్రీడాకారులను అందించడం గర్వకారణం
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గచ్చిబౌలి: తమ అకాడమీ నుంచి అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించడం గర్వకారణంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్పొరేట్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల వారిలో పని ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో ఉద్యోగఒత్తిడి ఉన్నప్పటికీ శారీరక వ్యాయామం చాలా అవసరమన్నారు. శారీరక వ్యాయామ లేకపోవడం వల్లే చాలా మంది కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు రోగాల బారిన పడుతున్నారన్నారు. వారిని రోగాలకు దూరం చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతకుముందు ఈ పోటీలలో రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, డెల్, ఐకియా వంటి సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. -
నియంతృత్వ విధానాలపై ఉద్యమిద్దాం
ఇబ్రహీంపట్నం: ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్నే తరిమికొట్టిన పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. హిట్లర్ ఫాసిజంపై నాటి సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచదేశాలను అక్రమించుకోవాలన్న కుట్ర, కుతంత్రాలతో నియంత హిట్లర్ సాగించిన దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్టవేసిందన్నారు. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తూ రష్యాను సైతం ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నానికి 1945లో కమ్యూనిస్టు సైన్యం అడ్డుకట్టవేసి సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఉగ్రవాద చర్యలను సీపీఎం ఖండిస్తుందన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధం కొనసాగుతుండగా హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని జాన్వెస్లీ అన్నారు. వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఈనెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈనెల 30న వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టే ధర్నాలకు సైతం మద్దతు ఉంటుందని తెలిపారు. రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో సీపీఎం శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామేల్, జగదీశ్, ఈ.నర్సింహ, జగన్, చంద్రమోహన్ తదితరు పాల్గొన్నారు. యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
ప్రారంభమైన ఎఫ్ఐఆర్ నమోదు
దుద్యాల్: ఎట్టకేలకు దుద్యాల్ పోలీస్ స్టేషన్లో సేవలు ప్రారంభమయ్యాయి. కొంత కాలంగా సాక్షి దినపత్రికలో పేరుకే పోలీస్ స్టేషన్, అందుబాటులో లేని సేవలు అని వరుస కథనాలు ప్రచూరించింది. దీంతో స్పందించిన అధికారులు సేవలను ఇటివలే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్ఐ యాదగిరి మాట్లాడుతూ కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు సేవలు అందుబాటులో లేకపోవడంతో మండల వాసులను పాత మండల పోలీస్ స్టేషన్కే రెఫర్ చేశామన్నారు. ఈ నెల 1వ తేదీన పోలీస్ స్టేషన్కు సాంకేతిక సామాగ్రి వచ్చాయని, వాటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్కు సమయం పట్టిందని ఎస్ఐ తెలిపారు. రెండు రోజుల నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సేవలు, కేసుల నమోదు ఇక నుంచి దుద్యాల్ మండల కేంద్రంలోనే ఉంటాయని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. మండల కేంద్రంలో 16 సీసీ కెమెరాలు ఉండగా, 9 పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మిగితావి కొంత రిపేర్లో ఉన్నాయని త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మండల పరిధిలోని చిలుముల మైల్వార్ గ్రామంలో మరో రెండు సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచామని వివరించారు. సిబ్బంది కొరత.. దుద్యాల్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉంది. స్టేషన్ ప్రారంభించిన నాడు ఎస్ఐతో కలిపి 27 మంది సిబ్బందిని కేటాయించింది. గతంలో కొంత మంది సిబ్బందిని ఇక్కడి నుంచి వేరే స్టేషన్కు బదిలే చేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్లో ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 17 మంది కానిస్టేబుల్ (ఒక మహిళతో కలిపి) అందుబాటులో ఉన్నారు. ఇంకా ఒకరు మహిళ సిబ్బందితో పాటు కొంత మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈ విషయమై ఎస్ఐ యాదగిరిని వివరణ కోరగా త్వరలో బదిలీలు చేపట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దుద్యాల్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన నాలుగు నెలలకు సేవలు ప్రారంభం వరుస కథనాలకు స్పందన -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
ఆర్డీఓ వాసుచంద్ర ధారూరు: భూ సమస్యల పరిష్కారానికి రెవె న్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ వాసుచంద్ర తెలిపారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్ కలాన్, ధర్మాపూర్ గ్రామాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రెండు గ్రామాలకు చెందిన 28 మంది రైతులు భూ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కా రం కోసమే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఇకపై కోర్టులకు వెళ్లకుండా గ్రామాల్లోనే భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్లు, డీటీలు విజయేందర్, అనిల్బాబు, ఆర్ఐ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కుల్కచర్ల: ఆధ్యాత్మికత చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పీరంపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభు త్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, ఎస్ఐ అన్వేష్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిరక్ష్యం తగదు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ యాలాల: గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని దేవనూరు, అగ్గనూరు గ్రామాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పంచాయతీల్లో సిటీజన్ లాగిన్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సర్వే అధికారి, ఏఓ శ్వేతరాణిని ఆదేశించారు. పంచాయతీ కార్మికులు పాలసీ చేసుకోవాలని, పాలసీ చేసుకోనివారు వెంటనే చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుష్పలీల, ఎంపీఓ యాదయ్య, కార్యదర్శులు పావనిరెడ్డి, తారకచారి, రమాదేవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య రంగారెడ్డి డీఈఓ సుశీందర్రావు తుక్కుగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని డీఈఓ సుశీందర్రావు పేర్కొన్నారు. పురపాలిక సంఘం పరిధిలోని తుక్కుగూడ, సర్ధార్నగర్, మంఖాల్ గ్రామాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలే నిదర్శనమన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి, మంచి భవిష్యత్ను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నానాయక్, హెచ్ఎం భాస్కర్రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు భారీగా నిధులు
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని కోట్పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రభు త్వం రూ. 97.30 కోట్లు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్పల్లి ప్రాజెక్టు కింద పెద్దేముల్ మండల పరిధిలోని 14 గ్రామ పంచాయితీల్లోని 9,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.89.30 కోట్లతో మర్మమతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే 4,500 ఎకరాల ఆయకట్టు ఉన్న జుంటుపల్లి ప్రాజెక్టుకు రూ. 8 కోట్లతో మరమ్మతు చేపట్టనున్నామన్నారు. కాలువల నిర్మాణం, తూములు మరమ్మతు తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అలాగే తాండూరు పట్టణంలోని చిలకవాగు కాలువ, గొల్ల చెరువు సుందరీకరణ పనులను కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు. కొడంగల్ రోడ్డు మార్గం నుంచి గౌతాపూర్ వరకు, బస్టాండ్ నుంచి గౌతాపూర్ వరకు ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. బషీరాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి గాను రూ.200 కోట్లతో మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పట్టణానికి కాగ్నా నది నుంచి తాగునీటి సరఫరా నిమిత్తం నూతన పైపులైన్, మోటార్లను రూ.54 కోట్లతో పూర్తి చేయనున్నామన్నారు. పట్టణ శివారులో 30 ఎకరాల్లో రూ.40 కోట్లతో మార్కెట్ యార్డును నిర్మించనున్నట్లు చెప్పారు. రూ.200 కోట్లతో దౌలాపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు సీఎం చేత వచ్చే నెలలో శంకుస్థాపన చేయించనున్నామని వివరించారు. ఐటీఐకి బదులుగా టాటా కన్సల్టెన్సీ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 3,500 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాజీవ్ యువ వికాస్ కింద 5వేల మందికి వచ్చే నెల 2వ తేదీ న రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోట్పల్లి, జుంటుపల్లి జలాశయాల మరమ్మతులకు రూ.97.30 కోట్లు మంజూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -
ఖైదీల్లో మానసిక పరివర్తన రావాలి
కుషాయిగూడ: ఖైదీల సంక్షేమం కోసం తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న సంస్కరణలతో ఖైదీలు మానసిక పరివర్తన చెందాలని రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ఖైదీల వార్షిక స్పోర్ట్స్ కల్చరల్ మీట్–2025ను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఖైదీల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్కు హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఖైదీలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రస్తుతం ఉన్న ఫిట్నెస్ను విడుదల అనంతరం వరకు కూడా కొనసాగించాలన్నారు. జైళ్ల శాఖ అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో ఖైదీల్లో క్రమశిక్షణతో పాటుగా మానసిక పరివర్తన సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా వారి మధ్య స్నేహభావం పెంపొందుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో అవుట్డోర్, ఇండోర్ క్రీడలతో పాటు కల్చరల్ ఈవెంట్స్ను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 220 మంది ఖైదీలు ఈ మీట్లో పాలుపంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేష్, మురళీబాబు, పాల్గొన్నారు. -
లక్ష్యం.. లక్షల్లో..
వనమహోత్సవానికి అధికారుల కసరత్తు ● 40,53,500 మొక్కలు నాటేందుకు ప్రణాళిక ● శాఖల వారీగా టార్గెట్వికారాబాద్: వనమహోత్సవానికి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎప్పటిలాగేఈ సారి కూడా లక్ష్యాలను నిర్దేశించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో అమలు చేస్తోంది. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈ సారికూడా 19 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేయనున్నట్లు తెలిసింది. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో కార్యక్రమ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్షలు చేసి లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సారి జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని సమాయత్తం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా.. గత ఏడాది 40,54,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా 80శాతం మేర టార్గెట్ను పూర్తి చేశా రు. ఈ సారి కూడా 40,53,500 మొక్కల నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గత ఏడాది కంటే మరింత సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో నర్సరీల్లో భారీగా మొక్కలు ఎండిపోవడం, నాటిన వాటిని సక్రమంగా సంరక్షించకపోవడం తదితర కారణాలతో 80శాతం మొక్కలే బతికాయి. ఇది అధికారులు చెప్పే లెక్కలు మాత్రమే వాస్తవంగా కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే బతికాయి. ఈ సారి అలా కాకుండా నాటిన మొక్కల్లో 80 శాతానికిపైగా సంరక్షించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఖాళీ స్థలాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లు, రోడ్లపక్కన, పొలం గట్లపై మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 609 నర్సరీల్లో.. జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మొత్తం 609 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 15, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో 594 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. టేకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీపీల్లోని ఒక్కో నర్సరీలో 5వేల నుంచి దాదాపు 30వేల మొక్కలు, 15 ఫారెస్టు నర్సరీల్లో కలిపి 10 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఫారెస్ట్ పీసెస్ కింద గచ్చకాయ, వెదురు, గుల్మోర్, రేన్ట్రీ, రావి, మర్రి, కానుగ, తురాయి, గార్డెనింగ్ మొక్కలు, దానిమ్మ, నిమ్మ, గోరింటాకు తదితర మొక్కలను పెంచుతున్నారు. హోం సీడ్ కింద (ఇళ్ల వద్ద నాటుకునేవి) పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. శాఖల వారీగా కేటాయించిన మొక్కలు అటవీ 3.6లక్షలు ఆర్అండ్బీ 5వేలు జిల్లా పంచాయతీరాజ్ 4లక్షలు డీఆర్డీఓ, ఎంపీడీఓలు 26.87లక్షలు నీటిపారుదల 76వేలు వ్యవసాయ 6.38లక్షలు మార్కెట్ 5వేలు ఉద్యానవన 2.55లక్షలు (మరికొన్ని ఉప శాఖలకు మొక్కలు కేటాయించారు.)సిద్ధంగా ఉన్నాం వనమహోత్సవ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం. అటవీ, డీఆర్డీఓ శాఖల ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. వర్షాలు పడగానే మొక్కలు నాటాలనే ఆదేశాలు జారీ చేశాం. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం కూడా పూర్తయ్యింది. అన్ని శాఖల సమన్వయంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేస్తాం. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాం. – జ్ఞానేశ్వర్, డీఎఫ్ఓ -
ఆధ్యాత్మిక చింతన అవసరం
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్మోమిన్పేట: సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని సయ్యద్అల్లిపూర్ హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభ, నవగ్రహాలు, బొడ్రాయి ప్రతిష్ఠాపన పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో ప్రజలు ఎన్నో ఒత్తిడిలకు గురవుతుంటారని.. ఇలాంటి సమయంలో దైవారాధన చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్గౌడ్, మండల కార్యదర్శి సురేందర్, నాయకులు మాణయ్య, నరోత్తంరెడ్డి, మహంత్స్వామి, ఎరాజ్, సుభాష్ పాల్గొన్నారు. రథోత్సవంలో.. అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి రథోత్సవం వైభవంగా సాగింది. ఈ శోభాయాత్రలో చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో స్పీకర్ ప్రసాద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో.. బంట్వారం: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రొంపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకుని ప్రశాంత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు డు పోచారం వెంకటేశం, మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మ హేందర్రెడ్డి, నాయకులు రాములు యాదవ్, రాధా కృష్ణ గౌడ్, మొగులయ్య, పురుషోత్తంరెడ్డి, కోట చంద్రశేఖర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు
దుద్యాల్: వన నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించరాదని ఏపీడీ సరళాకుమారి సూచించారు. గురువారం దుద్యాల్ మండలం హస్నాబాద్లోని వన నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున నర్సరీల్లోని మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందని, నిత్యం నీటిని అందించాలని నిర్వాహకులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ఏపీవో రాములు తదితరులు పాల్గొన్నారు. ఏపీడీ సరళాకుమారి -
అంకితభావంతో పనిచేద్దాం
అనంతగిరి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కో సం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్రావు అన్నారు. గురువారం వికారాబాద్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అటవీ శాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్ను, అసోసియేట్ అధ్యక్షుడిగా వెటర్నరి అసి స్టెంట్ సర్జన్ డాక్టర్ ఆనంద్, ఉపాధ్యక్షుడిగా ఎంపీఓ సఫీవుల్లాఖాన్, జాయింట్ సెక్రటరీగా పరహీన్ ఖాతూన్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సెంట్రల్ కమిటీ సభ్యుడు కోటాజీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు, శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్రావు -
భూ భారతితో రైతులకు మేలు
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ధారూరు: గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని.. భూ భారతి చట్టం అందుబాటులోకి వస్తే ఆ సమస్య ఉండదని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాల్లోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. గురువారం మండలంలోని నర్సాపూర్, గడ్డమీది గంగారం గ్రామాల్లో భూ భారతి రెవన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి పరంగా ఏదైనా తప్పు జరిగితే ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆర్డీఓ స్థాయిలో కూడా తప్పు జరిగితే కలెక్టర్కు ఫిర్యాదు చేసి సవరించుకోవచ్చని వివరించారు. గతంలో మిస్సింగ్ సర్వే నంబర్ తెలుసుకునేందకు మీ సేవ కేంద్రంలో రూ.1,300 చెల్లించాల్సి వచ్చేదని, భూ భారతిలో ఫిర్యాదు చేస్తే సరిచేసే వీలుందని తెలిపారు. అనంతరం రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రెండు గ్రామాల నుంచి భూ సమస్యల పరిష్కారం కోసం 36 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు శ్రీనివాస్, సాజిదాబేగం, డీటీ విజయేందర్, ఆర్ఐ స్వప్న, రెవన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
సమాఖ్యలో రాజకీయం!
కొందరు నేతల కనుసన్నల్లోనే మహిళా సంఘాల ఎన్నికలు వికారాబాద్: పారదర్శకంగా.. తటస్తంగా.. స్వతంత్రంగా జరగాల్సిన ఎన్నికల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. ఇందుకు జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండానే కొందరు నేతల కనుసన్నల్లోనే ఇవి జరిగాయి. ఐకేపీ అధికారులకు అనుకూలంగా ఉండే వారినే ఎంపిక చేశారనే విమర్శలు ఉన్నాయి. గ్రామ సంఘాల ఎన్నికలు మొదలు.. మండల, క్లస్టర్, జిల్లా స్థాయిలోనూ ఇదే తరహాలో వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 5న జిల్లాలో మహిళా సమాఖ్య ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, నూతన కార్యవర్గానికి సంబంధించి పదాధికారులను ఎన్నుకున్నారు. ఎన్నికల విషయంలో మహిళా సంఘాల సభ్యులు, పలు మండలాల అధ్యక్షులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల బైలా ఇలా.. ఎన్నికల బైలా ప్రకారం గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు అధ్యక్షులుగా ఎన్నికై న వారు మూడు పదవుల్లో కలిపి మూడు సంవత్సరాల కంటే ఎక్కు వ కాలం కొనసాగడానికి వీలు లేదు. మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నికై న వారు అంతకుముందే గ్రామ సంఘం అధ్యక్షురాలిగా రెండేళ్లు కొ నసాగితే మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఏడా ది మాత్రమే బాధ్యతలు వహించి అనంతరం వేరే వా రికి ఆ బాధ్యతలు అప్పగించాలి. మండల, జిల్లా స మాఖ్యలోనూ ఇదే పద్ధతి పాటించాల్సి ఉంటుంది. కార్యవర్గం ఎన్నికలో లాటరీ పద్ధతి పాటించరాదు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎంపిక జరగాలి. అన్నీ పక్కన పెట్టి.. జిల్లాలో మొత్తం 19 మండల సమాఖ్యలు.. 13,138 స్వయం సహాయక సంఘాలు.. 1.40 లక్షల సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే గ్రామ, మండల సమాఖ్యలకు కార్యవర్గాలు ఉన్నాయి. రెండు మండల సమాఖ్యలకు ఒకటి చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి.. క్లస్టర్కు ఒకరి చొప్పున ఎన్నుకున్నారు. వీరు జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, కోశాఽధికారి, పదాధికారులను ఎన్నుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రక్రియలో బైలా నిబంధనలు పాటించలేదని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు పరిగి క్లస్టర్లో నలుగురు మహిళా అధ్యక్షులు కలిసి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉండగా ఇందులో ఇద్దరు పోటీ పడ్డారు. మిగతా ఇద్దరు ఒకరిని ఎన్నుకునేందుకు నిర్ణయించుకోగా ఓటింగ్ పెట్టకుండా ల్యాటరీ పద్ధతిలో ఒకరిని ఎన్నుకున్నారు. దీంతో మిగతా ఇద్దరు మహిళల మద్దతు ఉన్న సభ్యురాలు కాకుండా మరో మహిళ ఎన్నికయ్యింది. ఎన్నికల అధికారులకు జిల్లాకు చెందిన కొంత మంది ముఖ్య నేతలు ఫోన్లు చేసి వారు సూచించిన వారినే ఎన్నుకునేలా ఒత్తిడి తెచ్చినుట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పలు రాయితీలు, ఉపాధి అవకాశాలు మహిళా సంఘాల ద్వారానే కల్పిస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రమేయం మరింత పెరిగింది. లక్ష్యం పక్కదారి.. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో 1996లో గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థను ఏర్పాటు చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, దురాచారాల నుంచి వారిని బయటపడేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట్లో సంస్థ అధికారులు, ఉద్యోగులు ఈ దిశగా పని చేశారు. ప్రస్తుతం ఆ దృక్ఫథాన్ని గాలికొదిలేశారు. కేవలం రుణాలు ఇప్పించడం.. తిరిగి వసూలు చేయడంపేనే దృష్టి సారించారు. దీంతో అనుకున్న లక్ష్యం పక్కదారి పడుతోంది. ఉదాహరణకు పరిగి మండలానికి చెందిన ఓ మహిళా సభ్యురాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా చాలా కాలం పని చేశారు. ఆమె పదవిలో ఉన్నంత కాలం సభలు, సమావేశాలు, మీటింగుల కోసం తిప్పడం తప్ప.. ఆమె ఆర్థిక ఎదుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె ఇళ్లలో పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. మహిళాసమాఖ్య ఎన్నికల్లో లాటరీ పద్ధతి పాటించడంపై డీపీఎం వీరయ్యను వివరణ కోరగా మహిళల కోరిక మేరకే అలా వ్యవహరించామని తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులకు అనుకూలంగాఉండేవారినే ఎంపిక మూడు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా ప్రక్రియ పూర్తి మండల, క్లస్టర్ స్థాయిలోనూ ఇదే తంతు జిల్లాలో మండల సమాఖ్యలు: 19 స్వయం సహాయక సంఘాలు: 13,138 సభ్యులు: 1.40 లక్షలు -
భారత సైన్యానికి సెల్యూట్
● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● జాతీయ జెండాలతో ప్రదర్శన పరిగి: చాలా కచ్చితత్వంతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందేనని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని కొడంగల్ చౌరస్తాలో భారత సైన్యానికి సంఘీభావంగా జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పహల్గం ఉగ్ర దాడికి ప్రతీకారమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. భారత సైన్యం ఉగ్రమూకలను అంతమొందించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. వ్యూహాత్మకంగా మెరుపు దాడులతో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా ఆపరేషన్ను పూర్తి చేసి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారన్నారు. త్రివిధ దళాల పనితీరు అభినందనీయమన్నారు. దేశ పౌరులను సైన్యం కాపాడుతుందని.. వారి త్యాగాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. దేశ భద్రత విషయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ మదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, దోమ మండల అధ్యక్షులు విజయ్కుమార్రెడ్డి, సురేందర్ నాయకులు పాలాద్రి శ్రీనివాస్, యాదవరెడ్డి, శ్రీనివాస్, శాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి
ఎమ్మెల్యే బీఎమ్మార్ తాండూరు టౌన్: ఆలయాల అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవస్థాన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలకు పాలక మండలిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తోందన్నారు. అనంతరం దేవాదాయశాఖ అధికారులు ఆలయ పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ధారాసింగ్, ఉత్తం చంద్, డాక్టర్ సంపత్ కుమార్, ఆధ్యాత్మిక గురువు శంకర్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రత్యేక లోక్ అదాలత్ ● చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ మార్గం ● తాండూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శివలీల తాండూరు టౌన్: తాండూరు కోర్టులో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వ హించనున్నట్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శివలీల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచన మేరకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో ఇరువర్గాల అంగీకారం మేరకు కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొ న్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప తాండూరు టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు.బుగ్గప్ప గురువారం ఒక ప్రకటనలో కోరారు. జాబితాలో నిరుపేదలు, ఇళ్లు లేని వారిని మాత్రమే చేర్చాలన్నారు. ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్న, సొంత స్థలం ఉన్నప్పటకీ అద్దెకు ఉంటున్న వారికి, కడు పేదరికంలో ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గతంలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఫొటో మానిటరింగ్ సిస్టమ్ ఉండేదని, పారదర్శకత కోసం అధికారులు నేరుగా పేదలు నివసించే ప్రాంతానికి వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. అనర్హులకు ఒక్క ఇళ్లు ఇచ్చినా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసానికి 3,184 దరఖాస్తులు తాండూరు రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దేముల్ మండలం నుంచి 3,184 దరఖాస్తులు వచ్చినట్లు ఆ మండల ఎంపీడీఓ రతన్సింగ్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు హార్డ్ కాఫీ, బ్యాంక్ ఖాతా నంబర్, పాన్, ఆధార్ కార్డులు, కులం, ఆదాయం సర్టిపికెట్లను పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని సూచించారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే బ్యాంక్ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశామని పేర్కొన్నారు. మండల స్థాయి అధికారుల కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ కింద 244 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. -
ట్యాక్స్ కట్టేవారు అనర్హులు
తాండూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇన్కాం ట్యాక్స్ కట్టే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయరని, అనర్హులుగా గుర్తిస్తారని జిల్లా హౌజింగ్ ప్రాజెక్ట్డైరెక్టర్ కృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో లబ్ధిదారుల నివాసప్రాంతాలకు వెళ్లి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐదెకరాల కంటే ఎక్కువ ఉంటే ఇళ్లు మంజూరు చేయరన్నారు. ఆర్సీసీ స్లాబ్ ఉన్నా, ఫోర్ వీలర్స్ ఉన్నా కూడా అనార్హులుగా గుర్తిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి ఇటింతో పాటు పాత ఇంటిని పొడిగిస్తామని చెప్పిన కూడా మంజూరు చేయరని తేల్చి చెప్పారు. ఇంటి స్థలం ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి, రూ.5లక్షలు విడతల వారీగా చెల్లిస్తామని వివరించారు. ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్నీ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారని, వారం రోజుల్లో కలెక్టర్ తుది జాబితాను విడుదల చేస్తారన్నారు. విడుదల చేసిన తర్వాత ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎంపీడీఓ రతన్సింగ్, హౌజింగ్ డీఈ కలీమోద్దీన్, ఏఈ రహీం, వెరిఫికేషన్ అధికారి ఎంఈఓ నర్సింగ్రావు, పంచాయతీ కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ హౌజ్ పరిశీలన తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మిస్తున్న మోడల్ హౌజ్ను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు పీడీ కృష్ణయ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు రూ.5 లక్షలతో ఎలా నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రతి కేంద్రంలో ఓ మోడల్ హౌజ్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు యాలాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని కో ఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్బాబా, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు, ఇళ్ల స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. అనంతరం ఏఓ శ్వేతరాణి, పంచాయతీ కార్యదర్శి గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగయ్య, చందు, శేఖర్, మైను, లాలప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరు హౌజింగ్ జిల్లా పీడీ కృష్ణయ్య -
కంటి పరీక్షలు తప్పనిసరి
బంట్వారం: వయస్సు పైబడిన వారంతా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించకోవాలని తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోట్పల్లి మండల కేంద్రంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కంటి చూపు లేకపోతే మానవ జీవితం అందకారమన్నారు. అశ్రద్ధ వహించకుండా కళ్లను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలన్నారు. చూపు మసక బారిన వెంటనే అవసరమైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను
షాబాద్: పంటల సాగులో శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాని ఏఓ వెంకటేశం తెలిపారు. పలు సందర్భాల్లో రైతులు తీసుకునే సొంత నిర్ణయాలు దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వేసవి దుక్కులతో కలిగే లాభాలను వివరించారు. ● పంట కొయ్యలను కాల్చకుండా, కలియదున్నాలి. ● వేసవిలో లోతు దుక్కులతో చాలా ప్రయోజనాలున్నాయి.. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించడంతో పాటు భూమి పొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది. ● ఏప్రిల్, మే నెలలు వేసవి దుక్కులకు అనుకూలం. ● అడ్డం, పొడవు సాళ్లలా కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం. ● ఏటవాలు దుక్కులతో భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. ● లోతుగా దున్నినప్పుడు పంటలకు హాని చేసే క్రిమికీటకాలతో పాటు లార్వా దశలో ఉండే గుడ్లు సూర్యకిరణాలు పడి నాశనమవుతాయి. ● తొలకరి వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసుకునే అవకాశం కలుగుతుంది. ● అంతకుముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారుతుంది. ● ఇది కలుపును నియంత్రించడంతో పాటు నేలలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉండేలా దోహదపడుతుంది. ● భూమి పొరల్లోకి గాలి చేరుతుంది. ● సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బన వినియోగం పెరుగుతుంది. ● మొక్క వీటిని నేరుగా గ్రహించే అవకాశం ఉంటుంది. ● కలుపు, పురుగు మందుల అవశేషాలతో మొక్కలకు కీడు కలగకుండా ప్రభావం చూపుతుంది. ● గాలిలో ఉన్న నత్రజని వర్షపు నీటితో కలిసి భూ మిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది. ● పురుగుమందులు, తెగుళ్ల మందుకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. లోతైన దుక్కులతో పంటలకు పుష్టి తొలకరి వర్షాలకేవిత్తనాలు వేసుకునే అవకాశం ఏటవాలు సాళ్లతో భూమి కోతకు అడ్డుకట్ట వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు
చేవెళ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కమాన్ పట్టీలు విరిగిపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేసి, నియంత్రించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి కొండగల్, కోస్గి వెళ్తున్న కోస్గి ఆర్టీసీ బస్సు మీర్జాగూడ బస్ స్టేజీకి సమీపంలోకి రాగానే రోడ్డు ములుపు వద్ద కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్లి, ఆగిపోయింది. ఈ సంఘటనతో అందులో ఉన్న సుమారు 60మంది ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు మరికొంత దూరం వెళ్లి ఉంటే బోల్తా పడి ఉండేదని చెప్పారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కమాన్పట్టీలు విరగడంతో ప్రమాదం రోడ్డు కిందికి దూసుకెళ్లిన బస్సు 60 మంది ప్రయాణికులు సురక్షితం -
ఐఎస్ఐ గుర్తింపు తెచ్చుకోవాలి
తాండూరు టౌన్: పట్టణంలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లకు నిబంధనల ప్రకారం ఐఎస్ఐ గుర్తింపు ఉండాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని 70 వాటర్ ప్లాంట్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐఎస్ఐ గుర్తింపు కోసం మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. తదనంతరం వాటర్ ప్లాంట్లను సీజ్ చేస్తామన్నారు. వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతో మాత్రమే గడువు ఇచ్చినట్లు చెప్పారు. వాటర్ పంపిణీకి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లను నిత్యం శుభ్రం చేయాలని, ఆరు నెలలకు ఒకసారి కొత్త బాటిళ్లను తెప్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను యజమానులు చూసుకోవాలన్నారు. వాటర్ను సక్రమంగా ఫిల్టర్ చేయాలని, ప్లాంటు పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలన్నారు. ఫిల్టర్ కాగా మిగిలిన వ్యర్థ నీటిని విధిగా ఇంకుడు గుంతలు తవ్వించి అందులోకి వదలేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర తాగునీటిని పంపిణీ చేసినా అట్టి ప్లాంట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయం చూసుకోవాలి వ్యర్థ నీటిని ఇంకుడు గుంతల్లోకి వదలండి వాటర్ ప్లాంట్ యజమానులకు కమిషనర్ ఆదేశాలు -
సన్నబియ్యంపై కన్ను!
● పక్కదారి పట్టించేందుకు దళారుల ప్రయత్నాలు ● లబ్ధిదారుల నుంచి సేకరించే పనిలో నిమగ్నం ● కిలోకు రూ.15 నుంచి రూ.20 చెల్లిస్తామంటూ మంతనాలు ● అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే అడ్డుకట్ట పడే అవకాశం దౌల్తాబాద్: చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు ప్రారంభించారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు స్పందించి దీన్ని అడ్డుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కర్నాటకకు తరలింపు దౌల్తాబాద్ మండలం కర్నాటక సరిహద్దుకు 6 కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఉంది. ఆయా గ్రామాల్లో సన్నబియ్యం సేకరించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. గతంలో రేషన్ ద్వారా అందించిన దొడ్డు బియ్యాన్ని రూ.10 చొప్పున సేకరించి, దళారులకు విక్రయించేవారు. అనంతరం వీటిని రీసైక్లింగ్ చేసి, కర్నాటకకు తరలించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యంపై వీరి కన్ను పడింది. దౌల్తాబాద్తో పాటు కోస్గి, మద్దూరు మండలాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఒక చోట నిల్వ చేసి ఆతర్వాత మినీ వ్యాన్లు, ఆటోల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నబియ్యం కిలోకు రూ.20 చెల్లిస్తామంటూ భేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న వ్యాపారుల సంఖ్య సన్నబియ్యం తినేందుకు కొంతమంది లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో దొడ్డు బియ్యం తరలిస్తూ పట్టుబడిన కొందరు వ్యాపారులు, వాహనాల డ్రైవర్లే ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇలాంటి వారినుంచి సన్నబియ్యం సేకరించి, బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కర్నాటకకు సరిహద్దున ఉన్న దౌల్తాబాద్ మండలం దళారుల అక్రమ వ్యాపారానికి అనుకూలంగా ఉంది. 6–ఏ కేసులతో సరి మండలంలో గతంలో సబ్సిడీ బియ్యం పట్టుకున్న సందర్భాల్లో అధికారులు 6– ఏ కేసులతో సరిపెట్టారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి..? వ్యాపారి ఎవరు? అనే కోణంలో విచారణ చేస్తే అసలు సూత్రధారులు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అవేవీ పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఎప్పటిలాగే వారి పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ యంత్రాంగం దృష్టి సారిస్తేనే అక్రమ దందాకు అడ్డుకట్ట పడుతుంది. ఆదిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. -
ఏఈవోలకు కొత్త ఫోన్ నంబర్లు
దుద్యాల్: గ్రామాల్లో రైతులకు వ్యవసాయ సూచనలు చేసే ఏఈవోలకు కొత్త ఫోన్ నంబర్లు వచ్చాయి. గతంలో వ్యవసాయ శాఖ అందించిన ఫోన్ నంబర్లు సాంకేతిక సమస్యతో పని చేయకుండా పోయాయి. దీంతో రైతులకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ ఏఈవోలు కొత్త ఫోన్ నంబర్లు మంజూరు చేసింది. దుద్యాల్ క్లస్టర్ పరిధిలోని దుద్యాల్, గౌరారం, హంసంపల్లి గ్రామాల ఏఈవో కే భావనకు సెల్ నంబర్ 8977768852ను కేటాయించారు. హస్నాబాద్ క్లస్టర్ పరిధిలోని హస్నాబాద్, ఆలేడ్ గ్రామాల ఏఈవో వి.రేణుక – 89777 68859, కుదరుమల్ల క్లస్టర్ పరిధిలోని కుదురుమల్ల, చిలుములమైల్వార్, సంగాయిపల్లి, మాచన్పల్లి, నాజుఖాన్పల్లి గ్రామాల ఏఈవో కే జ్యోతి – 89777 68860, పోలేపల్లి క్లస్టర్ పరిధిలోని పోలేపల్లి, హకీంపేట్, ఈర్లపల్లి, లగచర్ల గ్రామాల ఏఈవో పి.మాణికేశ్వరి – 89777 68861కు సెల్ నంబర్లను కేటాయించారు. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయ సంబంధిత వివరాల కోసం పై పేర్కొనన ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఏఈవోలు సూచించారు. పూరిల్లు దగ్ధం మోమిన్పేట: పూరిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మొరంగపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సిరివాటి దుర్గమ్మ పూరి గుడిసెలో నివాసం ఉంటోంది. డెసెలో నివాసముంటుంది. ఉదయం సాన్నం చేసేందుకు పొయ్యిపై నీరు పెట్టి బయటకు వచ్చింది. అంతలో ఇంటికి మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకొని కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి అర్పేలోపు పూర్తిగా కాలిపోయింది. నిత్యవసర సరుకులు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం పేద మహిళను అదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య కోరారు. హైనా దాడిలో దూడ మృతి కుల్కచర్ల: హైనా దాడిలో దూడ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. అటవీశాఖ బీట్ ఆఫీసర్ మెయిన్ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్సింగ్ తండాకు చెందిన సక్య్రనాయక్ గురువారం తన పొలంలో దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున పొలానికి వచ్చి చూడగా దూడపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ ఉన్న పాద ముద్రల ఆధారంగా దూడపై హైనా దాడి చేసిందని నిర్దారించారు. రైతులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు. అడవి జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శివసాగర్లోకి దూసుకెళ్లిన కారు అనంతగిరి: వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి శివసాగర్ చెరువులోకి దూసుకెళ్లింది. నీళ్ల అంచువరకు వెళ్లి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికుల సాయంతో కారును బయటకు లాగారు. -
మండు వేసవిలో ‘చల్లని’ వ్యాపారం, రెండు నెలల్లో రూ. లక్ష
సీజనల్ వ్యాపారం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయ, కూలీ పనులు పెద్దగా దొరకని మండు వేసవిలో ఆదాయ వనరుగా నిలుస్తోంది. పక్క జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ‘బిజీ’నెస్గా మారి, నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు దోహదపడుతోంది. తాండూరు టౌన్: వేసవి ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీడ పట్టున ఉంటూ ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉక్కపోత, వేడికి తట్టుకోలేక చల్లని నీడను ఆశ్రయించడంతో పాటు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతున్నారు. ఈ క్రమంలోనే డీ హైడ్రేషన్కు గురికాకుండా, వడదెబ్బ తగలకుండా గొడుగుతో బయటకు వెళ్తున్నారు. ఈ సమయంలో లస్సీ, జ్యూస్, సోడా, నిమ్మరసం, కూల్డ్రింక్స్ వంటివి సేవిస్తున్నారు. తాండూరు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో జనం వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా, ముఖ్య కూడళ్ల వద్ద వెలిసిన సీజనల్ దుకాణాలు వీరిని సేదతీరుస్తున్నాయి. జ్యూస్లతో పాటు కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, లస్సీ తాగడంతో పాటు, తాటి ముంజలను ఇష్టంగా తింటున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏర్పాటు చేసిన దుకాణాల్లో జనాలకు అవసరమైన శీతల పానీయాలు, పండ్లు లభిస్తున్నాయి. ప్రత్యేకంగా వెలిసిన షాపుల ద్వారా పలువురికి ఉపాధి లభిస్తోంది. మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి వచ్చిన వారు స్థానికంగా షాపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఇక్కడే ఉంటారు. తాటి ముంజలపై మక్కువ వేసవి కాలంలో చాలా మంది తాటి ముంజలు తినేందుకు మక్కువ చూపుతారు. తాండూరు ప్రాంతంలో తాటి చెట్లు పెద్దగా లేకపోవడంతో చుట్టు పక్కల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. డజనుకు రూ.వంద చొప్పున తాజా ముంజలను అమ్ముతున్నారు. రెండు నెలల పాటు ఇదే తమకు బువ్వ పెడుతుందని గ్రామీణ చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఏళ్లుగా ఇదే వ్యాపారం కొన్నేళ్లుగా వేసవిలో తాండూరుకు వచ్చి పుచ్చకాయలు విక్రయిస్తున్నాం. మహబూబ్నగర్ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టులో తెస్తాం. నిత్యం సుమారు క్వింటాలు నుంచి క్వింటాలున్నర వరకు అమ్ముతాం. ఎండలు తగ్గగానే స్వస్థలానికి వెళ్లిపోతాం. – హైమద్, మహబూబ్నగర్ జిల్లా రాయలసీమ నుంచి వచ్చాం మాది రాయలసీమ ప్రాంతం. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పలు రకాల ఫ్రూట్ జ్యూస్లు అమ్ముతుంటాం. ఒక్కో గ్లాసుకు జ్యూస్ను బట్టి రూ.10 నుంచి రూ.40 వరకు విక్రయిస్తాం. వేసవి సీజన్లో ఇదే మాకు ప్రధాన ఉపాధి. రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తాం. – రషీద్, ఫ్రూట్ జ్యూస్ విక్రయదారు రెండు నెలల్లో రూ.లక్ష.. వేసవిలో చాలా మంది తాటి ముంజలను భలే ఇష్టంగా తింటారు. వీటి సీజన్ తక్కువ కాలం ఉంటుంది. దీంతో ఎగబడి కొంటుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆటోల్లో తీసుకువచ్చి విక్రయిస్తాం. రోజంతా ఎండలోనే పని, రెండు నెలల్లో రూ.లక్ష వరకు సంపాదిస్తాం. – హన్మంతు, చిన్నవార్వల్ సీమ నుంచి వచ్చి రాయలసీమ ప్రాంతానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఏటావేసవి సీజన్ ప్రారంభం కాగానే తాండూరుకు చేరుకుంటాయి. పలు అడ్డాల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకుని ప్రూట్స్ సలాడ్, బాదంపాలు, నిమ్మరసం వంటి జ్యూస్లను విక్రయిస్తారు. నిత్యం రూ.3 వేల నుంచి రూ.4 వేల వ్యాపారంజరుగుతుందని చెబుతున్నారు. జూన్ వరకు ఇక్కడే ఉండి ఐదు నెలల పాటు వ్యాపారం చేస్తారు. సీజన్ ముగిశాక తిరిగి తమ సొంతూళ్లకు వెళ్తారు. ఖర్చులు పోనూ నెలకు కనీసం రూ.30 వేల వరకు సంపాదిస్తామంటున్నారు. -
చట్టపరంగా దత్తత తీసుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఇటలీ దంపతులకు బాలుడి అప్పగింతరసాయనాలతో పంటలకు నష్టం● ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మణ్ అనంతగిరి: పిల్లలు లేని దంపతులు చట్టపరంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్ కంట్రీ(ఇటలీ) దంపతులకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వికారాబాద్ శిశు గృహలో పెరుగుతున్న ఎనిమిది సంవత్సరాల అబ్బాయిని దత్తత ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరంగా కాకుండా పిల్లలను తీసుకుంటే నేరమని, పిల్లలను దత్తత తీసుకోవాలంటే జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని శిశు గృహ వికారాబాద్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జయసుధ, సీడబ్ల్యూసీ చైర్ పర్మన్ వెంకటేశం, బీఆర్బీ కోఆర్డినేటర్ కాంతారావు, డీసీపీఓ శ్రీకాంత్, శిశు గృహ మేనేజర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. కొడంగల్: పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మణ్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త టి.రాజేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని పర్సాపూర్ గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెతులు అధిక మొత్తంలో యూరియా వాడుతున్నారని అన్నారు. యూరి యా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. యూరియా అధికంగా వాడటం వల్ల నేల సారవంతం దెబ్బతిని ఉత్పాదకత తగ్గుతుందన్నారు. సాగు ఖర్చులు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రసాయనాల వాడకం వల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు చనిపోతున్నాయని తెలిపారు. అనంతరం కొడంగల్ పీఏసీఎస్ చైర్మన్ కటుకం శివకుమార్ గుప్తా, కొడంగల్ ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్ మాట్లాడారు. రైతులు సేంద్రియ ఎరువులను వాడి ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తప్పక పాటించాలన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పంటలకు ఎంత నీటి అవసరం ఉంటే అంతే నీటిని వినియోగించుకోవాలన్నారు. ఆ తర్వాత వ్యవసాయయ ఉప సంచాలకులు శంకర్ రాథోడ్ మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేప్పుడు రైతులు తప్పని సరిగా రసీదులు పొందాలన్నారు. రసీదులు ఉంటే కష్టకాలంలో నష్ట పరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి తులసీ మాట్లాడుతూ.. పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. పురుగులు, తెగుళ్ల నుంచి పంటలకు స్వీయ రక్షణ లభిస్తుందన్నారు. -
రైల్వే ప్రైవేటీకరణను విరమించుకోవాలి
● సీఐటీయూ నేతల డిమాండ్ ● తాండూరు రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమంతాండూరు టౌన్: రైల్వే ప్రైవేటీకరణను కేంద్ర ప్ర భుత్వం వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచి పెట్టేందుకే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే రైల్వేను ప్రైవేటీకరిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహ రించుకొని రైళ్లలో సౌకర్యాలను మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రయ్య, సురేష్, మానెప్ప,సంజీవ్,అంజయ్య, బాలస్వామి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయండి
పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి తాండూరు రూరల్: కాగ్నానదిపై చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం మండలంలోని బొంకూర్ – బిజ్వార్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ.4.85 కోట్లతో బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని వివరించారు. వేసవికాలం ముగిసేలోపు పనుల్లో పురోగతి సాధించాలన్నారు. బొంకూర్ – రుక్మాపూర్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.56కోట్లు మంజూరయ్యాయని వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రూ.1.75 కోట్లతో చేపట్టిన అల్లాపూర్ – సిరిగిరిపేట్ రోడ్డు పనులను, రూ.1.25 కోట్లతో చేపట్టిన సిరిగిరిపేట్ – సంకిరెడ్డిపల్లి రోడ్డు పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. అనంతరం తాండూరులోని పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ తాండూరు డివిజన్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డీఈ నాగభూషణం, ఏఈ నందిని తదితరులు పాల్గొన్నారు. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి డీఈఓ రేణుకాదేవి మోమిన్పేట: మండలంలోని ఎన్కతల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని మంగళవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న శిక్షణ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ప్రధానోపాధ్యాయుడు గౌరీశంకర్, రమేష్, పద్మ, శ్రీనివాస్రెడ్డి, రజిని, రాజు, పాఠశాల చైర్పర్సన్ కళావతి తదితరులు పాల్గొన్నారు. భూ భారతికి 24 దరఖాస్తులు పరిశీలించిన ఆర్డీఓ వాసుచంద్ర ధారూరు: మండలంలోని అంపల్లి, క్యాచారం గ్రామాల్లో మంగళవారం భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ రెండు గ్రామాల నుంచి భూ సమస్యల పరిష్కారం కోసం 24 దరఖాస్తులు వచ్చాయి. కాచారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొని రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాస్, సాజిదాబేగం, డీటీ విజయేందర్, ఆర్ఐ స్వప్న, రెవన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం అల్లాపూర్, అల్లిపూర గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించనున్నారు. పంచాయతీ కార్మికులసమస్యలు పరిష్కరించండి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి కొత్తూరు: పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ విభాగం పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె నోటీసును ఎంపీడీఓ అరుంధతికి అందజేశారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు శేఖర్రెడ్డి, కార్మికులు సురేష్, దేవయ్య పాల్గొన్నారు. -
సేవలు అక్కడ
ఆఫీసు ఇక్కడరెండేళ్లు కావస్తున్నా ఏర్పాటు కాని పీఆర్ ఎస్ఈ కార్యాలయంవికారాబాద్: జిల్లాకు పీఆర్ ఎస్ఈ కార్యాలయం మంజూరై రెండేళ్లు కావస్తున్నా స్థానికంగా సేవలు మాత్రం అందడం లేదు. నేటికీ రంగారెడ్డి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. 2023 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం జిల్లాకు పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయం తోపాటు ఎస్ఈ, ఈఈ, డీఈ పోస్టులను మంజూరు చేసింది. అప్పటిదాకా రంగారెడ్డి జిల్లా ఖైరతాబాద్ కార్యాలయం నుంచి సేవలు కొనసాగేవి. జిల్లాకు నూతన కార్యాలయం మంజూరు కావడంతో అప్పటి వరకు పని ఒత్తిడితో సతమతమవుతూ వచ్చిన అధికారులు ఇక కష్టాలు తీరుతాయని భావించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఎస్ఈ కార్యాలయం ద్వారా వికారాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లా అయిన నారాయణ్పేట్కు కూడా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి జిల్లా మంత్రి మహేందర్రెడ్డి చేతులమీదు గా వికారాబాద్లో ఎస్ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సేవలు మాత్రం నేటికీ స్థానికంగా అందుబాటులోకి రాలే దు. ఇంత జరుగుతున్నా జిల్లా ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. నేటికీ రంగారెడ్డి నుంచే.. జిల్లా కేంద్రం వికారాబాద్లో పీఆర్ ఎస్ఈ కార్యాలయం ప్రారంభమై రెండేళ్లు పూర్తయినా సేవలు అందుబాటులోకి రాకపోవడానికి ఆ శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారే కారణమనే విమర్శలు ఉన్నాయి. వికారాబాద్లో ఎస్ఈ కార్యాలయం ప్రారంభం కాకుండా సూపరింటెండెంట్ రాకుండా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఎప్పటిలాగే రంగారెడ్డి జిల్లా(ఖైరతాబాద్) నుంచే వికారాబాద్ జిల్లా సేవలు కొనసాగేలా పథకం వేసినట్లు సమాచారం. జిల్లా ఏర్పాటైంది మొదలు ఈఈ వికారాబాద్లోనే సేవలందిస్తూ వచ్చారు. ఎస్ఈ పోస్టు, కార్యాలయం మంజూరయ్యాక కూడా ఇన్చార్జ్ ఎస్ఈగా ఉంటూ వచ్చారు. నేటికీ వికారాబాద్, తాండూరు ఈఈ కార్యాలయాలు, ఇతర సబ్ డివిజన్లకు చెందిన ఫైళ్లను ఖైరతాబాద్కే తెప్పించుకొని సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. జిల్లాకు మంజూరైన కార్యాలయాలు జిల్లాకు ఎస్ఈ కార్యాలయంతో పాటు తాండూరుకు ఈఈ కార్యాలయం, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం మంజూరయ్యాయి. 2023 వరకు వికారాబాద్లో మాత్రమే క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం ఉండేది. ఆ తర్వాత తాండూరుకు అదనంగా మరో కార్యాలయాన్ని మంజూరు చేశారు. గతంలో వికారాబాద్లోని నాలుగు మండలాలకు కలిపి ఒక్కటే సబ్డివిజనల్ కార్యాలయం ఉండేది. రెండేళ్ల క్రితం వికారాబాద్, ధారూరు మండలాలకు కలిపి ఓ సబ్డివిజన్ కార్యాలయం, మోమిన్పేట, తాండూరు మండలాలకు కలిపి మరో సబ్ డివిజనల్ కార్యాలయాన్ని మంజూరు చేశారు. వికారాబాద్ సబ్డివిజన్ నుంచి విడిపోయిన మోమిన్పేట, నవాబుపేటను ప్రత్యేక సబ్డివిజన్గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సేవలన్నీ స్థానికంగా కొనసాగుతున్నాయి. కలెక్టరేట్లో పీఆర్ ఎస్ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉన్నా జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లా కేంద్రం నుంచి పీఆర్ ఎస్ఈ కార్యాలయ సేవలు అందేలా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. నేటికీ ఖైరతాబాద్ నుంచే కార్యకలాపాలు అధికారులకు తప్పని ఫైళ్ల మోత ఓ అధికారి తతంగం వల్లే ఈ పరిస్థితి -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
తాండూరు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలక్ష్మి బషీరాబాద్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తాండూరు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆమె స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిల్లు చేయడానికి ముహూర్తాలు పెడుతున్నారన్నారు. అలాంటి పెళ్లిళ్లపై అంగన్వాడీ టీచర్లతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. తాండూరు నియోజకవర్గంలో నెల రోజులుగా మొత్తం తొమ్మిది చైల్డ్ మ్యారేజీలను అడ్డుకున్నట్లు తెలిపారు. మరో రెండు వివాహాల విషయంలో పోలీసు కేసులు పెట్టినట్లు చెప్పారు. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బాల్య వివాహాలతో ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద వచ్చే ఆర్థిక సాయం అందదని చెప్పారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడైన బలవంతంగా బాల్య వివాహం చేయాలని నిర్ణయిస్తే టోల్ ఫ్రీ నంబర్స్ 1098 లేదా 181 కాల్ చేసి సమాచరం ఇవ్వాలని సూచించారు. -
9నుంచి ప్రత్యేక లోక్ అదాలత్
● చెక్ బౌన్స్ కేసులను రాజీ చేసుకోండి ● కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరాం కొడంగల్: కొడంగల్ కోర్టు పరిధిలో గతంలో నమోదైన చెక్ బౌన్స్ కేసులను రాజీ చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి బి.శ్రీరాం సూచించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జూన్ 9నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల లోపు చెక్కులు బౌన్స్ అయిన వాటికి గతంలో కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఈ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవాలన్నారు. చెక్ బౌన్స్ విషయంలో కాంప్రమైజ్ ఫీజు తీసుకోవడం లేదన్నారు. ఇరువర్గాల అంగీకారం మేరకు కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. బ్యాంకులకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసుల్లో కూడా రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని వివిధ కోర్డుల్లో మొత్తం 89,900 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలో నిర్వహించిన లోక్ అదాలత్లో 3,107 చెక్ బౌన్స్ కేసులకు పరిష్కారం లభించినట్లు చెప్పారు. రాజీమార్గం ద్వారానే ఇరు వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. జూన్ 14వ తేదీ వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్లో మరిన్ని కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్ కేసులకు రాజీ మార్గంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూములు, గట్టు పంచాయితీలు, ఆర్థిక విషయాల్లో సివిల్, క్రిమినల్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
మంచాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఎల్లమ్మ తండా గ్రామంలో ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జాన్వెస్లీ మాట్లాడుతూ.. సీపీఎం పోరాటాల ఫలితంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. నేటి ప్రభుత్వాలు ఉపాధి హామీ అమలులో విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా దినసరి కూలీ.600కు పెంచి ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా అలవెన్స్లు ఇవ్వడం లేదన్నారు. ఉపాధిహామీ కూలీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, టీఏ, ఏపీఓలకు సైతం నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో ప్రజాపాలన సాగుతోందని ఆరోపించారు. ఆదివారం సైతం పనులు చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30న కార్మికుల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని కార్మికులు, కర్షకులు కదలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య మాట్లాడుతూ.. సీపీఎం పేదల పక్షాన పోరాడుతుందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందాలంటే సీపీఎం పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, జిల్లా నాయకులు సామేల్, జగదీష్, ఇ.నర్సింహ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, కె.జగన్, నాయకులు కె. శ్రీనివాస్రెడ్డి, కృష్ణ, శ్యాం సుందర్, పి.జగన్, జంగయ్య, యాదయ్య, బుగ్గ రాములు, శేఖర్, విజయ్, ఐలయ్య, వెంకటేష్, మంతని జంగయ్య, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ● వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం అనంతగిరి: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా జాబితాను రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ధ్రువీకరణ ప్రక్రియపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదలకు చెందాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ద్వారా వచ్చిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి కుటుంబాల స్థితిగతులను తెలుసుకొని పారదర్శకంగా జాబితాను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్హెచ్ఓ సత్తార్, హౌసింగ్ డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వేగం పెంచండి కొడంగల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం ఆయన కొడంగల్లో పర్యటించారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ను పరిశీలించారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. అర్హులను గుర్తించి వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు. ఇంటి నిర్మాణంలో పారదర్శకంగా వ్యవరించాలన్నారు. అర్హులైన పేదలకు అన్యాయం జరుగకుండా చూడాలన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే కట్టుకోవాలి దుద్యాల్: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగాయిపల్లిలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంగాయిపల్లికి 62 ఇళ్లు మంజూరు కాగా 12 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేసినట్లు వివరించారు. మరో 22 ఇళ్లు పునాది దశలో ఉన్నట్లు తెలిపారు. 28 ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసినట్లు వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ చందర్ నాయక్, డీఎల్పీఓ శంకర్ నాయక్, దుద్యాల్, కొడంగల్ ఎంపీడీఓలు మహేష్కుమార్, ఉషా శ్రీ, ఎంపీఓ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్తానీలను పంపించండి
కుల్కచర్ల: భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీలను దేశం నుంచి పంపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కరణం ప్రహ్లాదరావు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతం పేరుతో ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తానీలను భారతదేశం నుంచి వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారందరి ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు వెంకటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్యముదిరాజ్, నాయకులు జానకీరాంచౌహాన్, అంజిలయ్య, నరేష్, వెంకటేష్, మహేష్, కె.మహేష్, మల్లేశశం, హన్మంతు, గాదె మల్లేష్, శివసంతోష్, ధను, ప్రశాంత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్రహ్లాదరావు -
విద్యార్థుల భవిష్యత్కు కృషి
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: విద్యార్థుల అభ్యున్నతికి, వారి మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బోయిని సాయితన్మయి ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించింది. దీంతో ఎమ్మెల్యే తన నివాసంలో మంగళవారం విద్యార్థినిని సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమాలను తీసుకువచ్చిందన్నారు. జిల్లా విద్యార్థి ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణం అన్నారు. ఉన్నత చదువులు చదివి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, నాయకులు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడి తగ్గకుండా..
కందుకూరు: అధిక ఉష్ణోగ్రతలు, పొడి గాలులు, జల వనరులు తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో వేసవి కాలంలో కూరగాయల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. ఫలితంగా రైతులు నష్టపోతుంటారు. ఈ సమస్యలను అధిగమించి, ఎండల్లో కూడా మంచి దిగుబడులు సాధించడానికి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ తెలిపారు. వేసవిలో కూరగాయల సాగుపై ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. అనువైన పంటలు టమాటా, వంగ, బెండ, పచ్చి మిర్చి, సొర, కాకర, బీర, కూరదోస, పొట్ల, గోరు చిక్కుడు, చేమ, కంద, ముల్లంగి, తోటకూర, పాలకూర పంటలు వేసవిలో సాగు చేసుకోవచ్చు. మొక్కల సాంద్రత పెంచడం ● వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. ● మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచాలి. దీంతో విడిగా ఒక్కో మొక్క నుంచి దిగుబడి తగ్గినప్పటికి, ఎక్కువ మొక్కలు ఉండటంతో మొత్తం విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందు కోసం విత్తన మోతాదు పెంచాలి. ఎరువుల యాజమాన్యం ● సమగ్ర పోషక యాజమాన్యం పాటిస్తే భూభౌతిక లక్షణాలు మారడమే కాకుండా సూక్ష్మపోషకాలు కూడా లభ్యమవుతాయి. ● సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడితే భూమిలో తేమను నిలిపి ఉంచే గుణం పెరగడమే కాకుండా, సూక్ష్మ జీవుల చర్యలు అధికమై మొక్కలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. ● జీవన ఎరువులైన అజిటోబాక్టర్, అజోస్పైరిల్లిం, పాస్పోబాక్టీరియాను ఎకరానికి 2 కిలోల చొప్పున వాడటంతో సిఫారుసు చేసిన నత్రజని, భాస్వరం ఎరువుల్లో 25 శాతం ఆదా చేయవచ్చు. ● 30, 45, 75 రోజులకు 2శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేస్తే నత్రజని ఆదాతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే వీలుంది. ● పొటాష్ను సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకునే గుణం పెరుగుతుంది. ● 9 కిలోల యూరియాకు ఒక కిలో వేప పిండిని కలిపి వేయాలి. లేదా 25 కిలోల యూరియాకు ఒక కిలో వేప నూనెను కలిపి అరగంట సేపు ఆరబెట్టి పంటకు అందించాలి. ● జింక్, బోరాన్, కాల్షియం, మెగ్నీషియం మొదలైన సూక్ష్మధాతు లోపాలు కనిపించే అవకాశం ఉంది. ● మిరప, చేమ పంటల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ దుక్కిలో వేయాలి లేదా లీటరు నీటికి 2కిలోల జింక్ సల్ఫేట్ కలిపి మిరపలో పూతకు ముందు పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ● 3 గ్రాముల బోరాక్స్ను లీటరు నీటికి కలిపి పూత, పిందె సమయంలో వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేయాలి. ● బ్లూజమ్ఎండ్ రాట్ అనగా కాయ తొడిమ వద్ద నల్లగా మారే సమస్య నివారణకు కాల్షియం నైట్రేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవి తాపాన్ని తట్టుకునేలా.. ● నేల ఉష్ణోగ్రత తగ్గించడానికి వరుసల మధ్య ఎండుగడ్డి, రంపపుపొట్టు, వరి పొట్టు, పశువుల ఎరువు మొదలైనవి పరచాలి. ● టమాటాలో పాక్షికంగా నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్నలాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాటు కోవాలి. లేదా 35 శాతం షేడ్ నెట్లను ఏర్పాటు చేస్తే ఎండ తీవ్రత తగ్గి దిగుబడులు పెరుగుతాయి. ● పండ్ల తోటల్లో సొర, దోస, గుమ్మడి, బెండ, గోరుచిక్కుడు వంటి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ● తుంపర పద్ధతిలో నీరు ఇవ్వడంతో నీటి ఆదాతోపాటు ఎండవేడి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు. ● సూక్ష్మపోషకాలు, హార్మోన్లు చల్లి పూత రాలడాన్ని అరికట్టాలి. ఫలితంగా మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మేలైన యాజమాన్య పద్ధతులతో వేసవిలోనూ లాభాల పంట కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ -
సరిహద్దు మాదే తవ్వకాలు ఆపండి
బొంరాస్పేట: ‘ఈ సరిహద్దు భూమి మాదే, మట్టి తవ్వకాన్ని ఆపేయాలి’ అంటూ మండల పరిధిలోని సాలిండాపూర్వాసులు మంగళవారం బొంరాస్పేట తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ధారూరు మండల సరిహద్దు వద్ద ఉన్న సాలిండాపూర్ సమీపంలోని గుట్ట నుంచి ధారూరు మండలం అంపల్లి గ్రామస్తులు మట్టితవ్వకం పనులు చేపట్టారు. దీనిపై సాలిండాపూర్ గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్ చేయడంతో ఇరు గ్రామాల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో సీఐటీయూ నాయకులు చొరవచూపి తహసీల్దార్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. సరిహద్దు పంచాయితీ తేల్చేవరకు మట్టితవ్వకాల పనులు ఆపేయాని కోరారు. దీంతో ధారూరు మండలం అధికారులతో మాట్లాడిన తహసీల్దార్ పనులను నిలిపివేయించారని సాలిండాపూర్వాసులు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాయుడు బుస్స చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్కు సాలిండాపూర్వాసుల ఫిర్యాదు -
ఫలించిన డిజిటల్ బోధన
దుద్యాల్: పదో తరగతి ఫలితాల్లో పేదింటి బిడ్డలు సత్తా చాటారు. మండల పరిధిలోని చెట్టుపల్లితండా సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. బాలికల సాధనతో పాటు అత్యాధునిక వసతుల కల్పన ఏర్పాటుతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులు విద్యార్థినులకు ఎంతగానో తోడ్పడ్డాయి. తరగతి గదిలో పాఠాలు బోధించిన తర్వాత ప్రత్యేకంగా డిజిటల్ క్లాసులు సైతం నిర్వహించేవారు. అర్థంకాని అంశాలను ప్రత్యేక తరగతిలో బాలికలు నివృత్తి చేసుకునేవారు. దీనికి తోడు స్టడీ అవర్లు నిర్వహించి కఠోర సాధన చేసేవారు. వాటి ఫలితంగానే మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలుపతున్నారు. ఉపాధ్యాయుల సూచనలు ఉపాధ్యాయుల మార్గదర్శకాలను అనుసరించిన విద్యార్థినులు ఉత్తమ మార్కులతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ఖ్యాతి గడించారు. 44 మంది బాలికలు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత పొందారు. అత్యధికంగా 494 మార్కులతో సంధ్యారాథోడ్, 480 మార్కులతో అంజలి, పూజ, 475 మార్కులతో తనుజ మెరిశారు. గత సంవత్సరం పది ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ సారి మాత్రం దుద్యాల్ మండలంలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా ఈ కేజీబీవీ నిలిచింది. పది ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు -
టైలరింగ్తో ఉపాధి
పరిగి/ధారూరు: మహిళలు టైలరింగ్ నేర్చుకొని ఆర్థికంగా ఎదగొచ్చని సత్యసాయి సేవా సమితి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జ్ మాధవి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి సేవా కేంద్రం పరిగిలోని రంగాపూర్లో ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన ఐదో బ్యాచ్కు మంగళవారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 55 మందికి సర్టిఫికెట్లతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరుగురికి కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణ తరగతులకు హాజరైన వారికి 65 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కల్పించామన్నారు. గ్రామీణ మహిళాలకు ఉపాధి కల్పించేందుకు సంస్థ ఆధ్వర్యంలో నిత్యం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టైలరింగ్తో ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుందన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న ప్రతిఒక్కరూ మంచి నైపుణ్యులుగా తయారవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ నాగరాజు, ప్రభాకర్, జిల్లా ఇన్చార్జ్ విద్యారాణి తదితరులు పాల్గొన్నారు. ● సత్యసాయి సేవా సమితి స్కిల్ డెవలప్మెంట్ ఇన్చార్జ్ మాధవి ● నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల అందజేత -
వృద్ధుల బాధ్యత వారసులదే
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు మొయినాబాద్రూరల్: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం చట్టపరంగా వారి పిల్లలే చూసుకోవాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్స్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశాన్ని డాక్టర్ వి.పాండుగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదనరావు, అనంతరెడ్డిలు హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007, నియమావళి రూల్స్ 2011ను వివరించారు. డాక్టర్ పాండుగౌడ్ మాట్లాడుతూ.. ఇండియన్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందరం కలిసి పేద కుటుంబాల ప్రజలకు సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేయాలని చట్టం 2007 అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సత్తయ్య, నాయకులు ఉపేందర్రెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్, రమేశ్, చంద్రలింగం, సంగరి మల్లేశ్, గోపాల్రెడ్డి, మల్లారెడ్డి, కిషన్, రామ్మోహన్, సుగుణాకర్రావు, సయ్యాజీరావు, బల్వంత్రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. సబ్రిజిస్ట్రార్పై దాడి అమానుషం తీవ్రంగా ఖండించిన గెజిటెడ్ అధికారుల సంఘం ఇబ్రహీంపట్నం రూరల్: విధి నిర్వహణలో ఉన్న పెద్దఅంబర్పేట్ సబ్రిజిస్ట్రార్పై దాడి చేయడం అమానుషమని గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరీలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్రిజిస్ట్రార్పై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే జైలుకు పంపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణ ప్రకారం పని చేస్తారన్నారు. అధికారులు తప్పు చేస్తే ఫిర్యాదులు చేయాలి కాని, భౌతిక దాడులకు పాల్పడటం తగ దని హెచ్చరించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ నందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు ఉరుకోబోమని తెలిపారు. కార్యక్రమంలో స్టాంప్స్, సబ్రిజిస్ట్రార్ సంఘం బాధ్యులు సహదేవ్, స్తితి ప్రజ్ఞ, వెంకటేష్, నూతనగంటి వెంకట్, శాంతి శ్రీ, అలివేలు, లక్ష్మణ్ స్వామి, సుజాత, సైదమ్మ, నాగేశ్వర్రావు, సీడీపీఓ, ఈఈఎస్, డీఈఈఎస్, కలెక్టరేట్ గజిటెడ్, నాన్ గెజిటెడ్, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. పెద్దమంగళారంలో భారీ చోరీ మొయినాబాద్: గుర్తుతెలియని దుండగులు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారంకు చెందిన అప్పల హరీష్యాదవ్ సోమవారం రాత్రి 9 గంటలకు మొయినాబాద్లో ఉన్న తన అన్న సురేష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు తిరిగి వెళ్లే సరికి ఇంటి తాళం కనిపించలేదు. లోపలికి వెళ్లి చూశాక బీరువా తాళాలు పగులగొట్టి తెరిచి ఉంది. అందులో ఉన్న 26 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. రాత్రి సమయంలో దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. -
ప్రహరీ పనులు ఆపేయండి
పహాడీషరీఫ్: మామిడిపల్లి గ్రామం 99/1 సర్వే నంబర్లో హౌసింగ్ బోర్డు అధికారులు చేపట్టిన ప్రహరీ నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని మాజీ కౌన్సిలర్ ఈరంకి వేణుకుమార్గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు పెరమోని నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం మామిడిపల్లి రైతులు వందల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. వీరిలో చాలా మందికి పరిహారం ఇవ్వలేదని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన కొంత భూమిని టీజీఐఐసీకి కేటాయించారని, అందులో కంపెనీలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ ఆచరణలోకి తేలేదని మండిపడ్డారు. 99/1 సర్వే నంబర్ భూమిలో మల్లన్నస్వామి, కొండ మైసమ్మ, రామాలయం, కాటమయ్యస్వామి, ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు అంబేద్కర్ విగ్రహం, దోబీఘాట్, క్రీడా మైదానం, శ్మశానవాటిక ఉందన్నారు. వీటిలోకి వెళ్లకుండా చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు అధికారులు చదను పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. భూములను త్యాగం చేసిన రైతులతో పాటు గ్రామంలోని నిరుపేదలకు ఈ భూమిలో 60 గజాల ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి రంగనాయకులస్వామి ఆలయం వెలుపల వరకు ప్రహారీ పనులు నిలిపి వేయాలన్నారు. దాదాపు 20 ఎకరాల స్థలాన్ని గ్రామ అవసరాలకు కేటాయించాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం వీరి దీక్షకు మాజీ కార్పొరేటర్ యాతం పవన్కుమార్ యాదవ్ కూడా మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు నందీశ్వర్, గుర్జని గణేశ్గౌడ్, అర్జున్, పురుషోత్తం, రాజు, లక్ష్మీపతి, నర్సింహ, జగన్, శ్రీకాంత్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లివాసుల నిరసన సంఘీభావం ప్రకటించిన నాయకులు -
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఆశవర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు అమృత బంట్వారం: ఆశవర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర యూనియన్ కోట్పల్లి మండల అధ్యక్షురాలు అమృత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు ఆశవర్కర్లతో కలిసి ఆమె కోట్పల్లి పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ మేఘనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 20న కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు. ఆశవర్కర్లను మూడో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలన్నారు. సీనియార్టి ప్రాతిపదికన ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలన్నారు. అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మెడికల్ ఆఫీసర్కు అందజేశారు. కార్యక్రమంలో ఆశవర్కర్లు విజయ, శోభారాణి, అండాలు, సుమిత్ర, జయమ్మ, సంపూర్ణ, వినోద, లక్ష్మీఇందిరా తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్: మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో 40 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మంగళవారం నుంచి ఆన్లైన్లో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేస్తామన్నారు. బాలికలకు హాస్టల్ వసతి ఉందన్నారు. కళాశాలలో అ నుభవజ్ఞలైన అధ్యాపకులు ఉన్నారని, ప్రతి ఏ టా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కేజీబీవీలో ప్రవేశాలకు.. దోమ: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో, ఇంటర్ మొదటి సంవత్సరం, ఎంపీఎచ్ఈడబ్ల్యూ గ్రూపులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ వెంకట్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 40 సీట్లు, సీఈసీలో 40 సీట్లు, ఎంపీఎచ్ఈడబ్ల్యూలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్కార్డు, రెండు పాస్ సైజ్ ఫొటోలు, పదో తరగతి మెమో జిరాక్స్, కులం సర్టిఫికెట్ జిరాక్స్ను దరఖాస్తు ఫారానికి జత చేసి పాఠశాలలో సమర్పించాలని తెలిపారు. నేడు రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నవాబుపేట: మండలంలోని ఎల్లకొండ కెనరా బ్యాంకులో రాజీవ్ యువ వికాస్ పథకం కింద రుణాల కోసంఽ దరఖాస్తు చేసుకున్న వారికి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లకొండ బ్యాంక్ పరిధిలోకి వచ్చే గ్రామాలైన ఎల్లకొండ గొల్లగూడ, ముబారక్పూర్, ఉబ్బడిపత్తేపూర్, మైతాప్ఖాన్గూడ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు రేషన్కార్డు, ఆధార్, కుల, ఆదాయ, బ్యాంక్ పాస్బుక్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆమె సూచించారు. మూఢ విశ్వాసానికి బాలుడి బలి ● నాగుపాము కాటేయడంతో మంత్రగాడిని ఆశ్రయించిన వైనం ● పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి దోమ: తల్లిదండ్రుల మూఢ విశ్వాసం ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన దోమ మండలం బాస్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి రాములు, సువర్ణకు ముగ్గురు కుతుళ్లు, ఓ కుమాడు. చిన్నవాడైన చాకలి శివకుమార్(11) పరిగి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసుకుని, సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. ఉదయం పది గంటలకు తాతతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో నాగుపాము అతన్ని కాటేసింది. గమనించి బాలుడు కుటుంబ స భ్యులకుచెప్పడంతో..మంత్రతంత్రాలతో బాగవుతుందని దొంగఎన్కేపల్లికి తీసుకెళ్లారు. పరి స్థితి విషమించడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ స భ్యులు శకసంద్రంలో మునిగిపోయారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బాలుడు బతికే వాడని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. పశువులకు టీకాలు షాబాద్: పశువులకు వచ్చే సీజన్ల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రేగడిదోస్వాడ, షాబాద్ పశువైద్యాధికారులు చంద్రశేఖర్రెడ్డి, స్రవంతి రైతులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. -
లగచర్లలో టెన్షన్.. టెన్షన్
● పోలీస్ పహారాలో భూ సర్వే ప్రక్రియ పూర్తి ● ఊపిరి పీల్చుకున్న అధికారులు కొడంగల్: దుద్యాల్ మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట, రోటిబండ, పులిచర్ల కుంట తండాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో భూములు ఇవ్వడానికి సమ్మతించిన రైతుల పట్టా భూముల్లో సర్వే చేపట్టారు. తహసీల్దార్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో తొమ్మిది సర్వే నంబర్లలోని 85 ఎకరాల భూమిని సర్వే చేశారు. రైతులు చూపించిన హద్దులను గుర్తించి వారి సంతకాలు తీసుకున్నారు. భూములు ఇవ్వడానికి తాము సమ్మతిస్తున్నట్లు పలువురు ప్రకటించారు. భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారి పొలాల్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శివకుమార్, సర్వేయర్లు మహేష్, కిరణ్, మహేష్కుమార్, ఆర్ఐ నవీన్లు సర్వే చేశారు. అయితే గతంలో జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో లగచర్ల, హకీంపేట గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్పీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో పారా మిలటరీ బలగాలతో పాటు సివిల్ పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తహసీల్దార్ కిషన్నాయక్, డిప్యూటీ తహసీల్దార్ వీరేష్బాబులతో పాటు పోలీస్ సిబ్బందికి ఎస్పీ తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. సర్వే ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. దీంతో భూ సర్వే ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. గత అనుభావాల దృష్టా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిగి డివిజన్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్ల నుంచి పోలీసులను రప్పించారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో పలు మండలాలకు చెందిన ఎస్ఐలు సత్యనారాయణ, యాదగిరి, రవిగౌడ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సాగులో మనమే అగ్రగామి
● జూన్ 2న రైతులకు ఫౌండేషన్ సీడ్స్ పంపిణీ ● ‘రైతుల ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల ధారూరు: పంటల సాగు, దిగుబడుల సాధనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా ధారూరులోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతుల ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రైతులందరికీ ఫౌండేషన్ సీడ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విత్తనాలతో పండించిన పంటను నేరుగా విక్రయించకుండా ఆయా గ్రామాల్లోని ఇతర రైతులకు విత్తనంగా అందిస్తే, విత్తనాలను కొనుగోలు చేసే బాధ తప్పుతుందన్నారు. రైతు పండించే విత్తనం నాణ్యమైనదని, మోసం జరిగే వీలుండదని చెప్పారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పంటలు సరిగ్గా పండకున్నా, ఎకరా భూమి అమ్మితే రూ. కోట్లు వస్తాయని, ఒక్క ధారూరు మండలంలోనే 5 వేల ఫాంహౌస్లు ఉన్నాయంటే ఇక్కడి భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సాగునీటిని ఆదా చేసి, భావితరాలకు అందించాలని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. జిల్లాకు సాగునీరు వచ్చేలా చూడాలని మంత్రి తుమ్మలను కోరారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ పంటల సాగులో రసాయనాలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు సునీల్, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ అల్తాఫ్ జానయ్య, కమిషనర్ గోపి, డైరెక్టర్ విజయకుమార్, కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు. అనంతరం ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’అనే కరపత్రాలను ఆవిష్కరించారు. -
రైతులకు భూధార్ కార్డులు
● మండల వ్యవసాయాధికారి కొమరయ్య ● ఏఈఓలకు వివరాలు అందజేయాలని అన్నదాతలకు సూచన తాండూరు రూరల్: ఆధార్ తరహాలో కేంద్ర ప్రభు త్వం ప్రతి రైతుకూ 11 అంకెలతో కూడిన యూనిక్ కోడ్(భూధార్ కార్డు)ను కేటాయిస్తుందని మండల వ్యవసాయాధికారి కొమరయ్య తెలిపారు. సోమ వారం పట్టణంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందన్నారు. రైతు యూనిక్ కోడ్ పొందాలంటే ఆధార్కార్డుతో పాటు లింక్ చేసిన సెల్ఫోన్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలన్నారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ రైతు పేరు, ఆధార్, గ్రామం, భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, సెల్ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేస్తే రైతుకు గుర్తింపు సంఖ్య వస్తుందన్నారు. రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సి పల్ వార్డు కార్యాలయాల్లో సంబంధిత ఏఈఓలకు పై పేర్కొన్న వివరాలు అందజేయాలని రైతులకు సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు తమ వివరాలు నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు వస్తాయన్నారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయండి
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలోని చిలకవాగు, గొల్ల చెరువు ప్రక్షాళన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్య ని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. అనంతరం మండలానికి చెందిన 143 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా జానకి అనంతగిరి: మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా జానకి ఎన్నికయ్యారు. సోమవారం వికారాబాద్లోని మహిళా సమాఖ్య భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని పరిశీలకురాలు.. సెర్ఫ్ రాష్ట్ర ప్రతినిధి విజయలక్ష్మి తెలిపారు. సంఘం కార్యదర్శిగా శ్వేత(పరిగి), కోశాధికారి భాగ్యలక్ష్మి(మోమిన్పేట)ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. వీరి పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది. కార్యక్రమంలో డీపీఎం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజయ్ దేవరకొండపై ఫిర్యాదు
కుల్కచర్ల: సినీ హీరో విజయ్ దేవరకొండ గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హీరో వెనుకబాటుకు గురైన వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు అంగూర్ నాయక్, నాయకులు చిట్టునాయక్, గణేశ్నాయక్, హన్మ్యనాయక్, రవినాయక్, అరుణ్, శ్రీను, గోపాల్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో పనిచేయండి
ధారూరు: అధికారులు అంకితభావంతో పనిచేసి భూ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. సోమవారం మండలంలోని బాచారం, అవుసుపల్లి గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వస్తున్న సమస్యలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రతి అర్జినీ స్వీకరించాలని ఆదేశించారు. అవుసుపల్లికి చెందిన 11మంది, బాచారం గ్రామానికి చెందిన 16 మంది భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేశారు. మంగళవారం కా చారం, అంపల్లి గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగాల పనితీరు మెరుగు పర్చేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను మంజూరు చేసిందని, వీటి కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తామని తెలిపారు. మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్ఐఎంఎస్ఈ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అలాగే సెల్ నంబర్ 8688921546లో సంప్రదించాలన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
సాగుపై అవగాహన పెంచుకోవాలి
యాచారం: ఆధునిక పద్ధతుల్లో పంటల సాగుకు రైతులు అవగాహన, చైతన్యం పొందాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త ఏకాద్రి పేర్కొన్నారు. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో సోమవారం ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల సాగులో ఎరువుల యాజమాన్యంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తక్కువ యూరియా, అవసరం మేరకు రసాయనాల వినియోగంతో నేలతల్లిని కాపాడుకోవాలన్నారు. రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువుల రసీదులను జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని చెప్పారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరిలో రకాలు, కొత్తరకం వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నమోదు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతు నమోదు కార్యక్రమానికి పట్టాదారు, పాసుపుస్తకం, ఆధార్ కార్డుకు లింకు ఉన్న ఫోన్ నంబర్ వివరాలతో రైతు వేదికల వద్దకు వచ్చి వివరాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, యాచారం పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
డాక్టర్ న్యూటన్ కొండవీటి బంట్వారం: ఆధ్యాత్మిక చింతన, ధ్యానంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని లైఫ్ యూనివర్సిటీ నిర్వహకులు డాక్టర్ న్యూటన్ కొండవీటి అన్నారు. సోమవారం ఆయన కోట్పల్లి మండలంలోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన గంటపాటు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో లైఫ్ యూనివర్సిటీ నిర్వాహకులు డాక్టర్ లక్ష్మి, ప్రతినిధులు పవణ్కుమార్, హారిక, సూరి, నిర్మళ, సూరారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ లఘు చిత్రం ‘అక్షరమే ఆధారం’ షాద్నగర్రూరల్: దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకని టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్స్ అసోసియే, రెయిన్బో చిల్డ్రన్స్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్ర భారతిలో ఆదివారం రాత్రి రాష్ట్రస్థాయి లఘు చిత్రాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో షాద్నగర్కు చెందిన టీవీ రంగయ్య నటించి దర్శకత్వం వహించిన అక్షరమే ఆధారం షార్ట్ ఫిలింను ప్రదర్శించారు. ఈ చిత్రం ఉత్తమ సందేశాత్మక లఘుచిత్రంగా ఎంపికై ంది. ఈ సందర్భంగా రెయిన్బో సంస్థ డైరక్టర్ మోహన్ ఉత్తమ లఘు చిత్రం అవార్డును టీవీ రంగయ్యకు అందజేశారు. టిప్పర్ ఢీకొని పశువుల కాపరి దుర్మరణం తాండూరు రూరల్: టిప్పర్ ఢీకొని ఓ పశువుల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దేముల్లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ణపూరి రవి(41) అవివాహితుడు. అదే గ్రామానికి చెందిన బాలేసాబ్ దగ్గర పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే పశువులను మేపేందుకు పెద్దచెరువు వద్దకు వెళ్లాడు. గ్రామానికి చెందిన ముక్రాంఖాన్ తన టిప్పర్లో పెద్ద చెరువు నుంచి మట్టి తరలిస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ పశువుల కాపరి రవిని ఢీకొట్డంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు ఎల్లప్ప టిప్పర్ యజమాని ముక్రాంఖాన్, డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కడ్తాల్: రైతు సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ముద్వీన్ గ్రామంలో పీఏసీఎస్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతన్నలకందిస్తున్న చేయూతతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దన్నారు. వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర నిర్ణయించిందని, సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్గుప్తా, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్రెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ సత్యం, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కడ్తాల్, తలకొండపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బీచ్యానాయక్, ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ దేవేందర్, మండల వ్యవసాయ అధికారులు శ్రీలత, అరుణకుమారి పాల్గొన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి -
‘క్షయ’పై అప్రమత్తత అవసరం
కుల్కచర్ల: క్షయ వ్యాధిపై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని టీబీ హెల్త్ విజిటర్ రాజు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు, సహచరులకు టీబీ నిరోధక టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. క్షయ సోకిన వారు జాగ్రత్తలు పాటించకుంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ముందస్తు టీకాతో వ్యాధి నిరోధించే అవకాశం ఉంటుందని చెప్పారు. పౌష్టికాహారం తీసుకుంటూ.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం
పరిగి: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆలోచన విధానం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల తో పాటు కులగణన చేపడతామని కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కులగణన చేపట్టి 42శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని వివరించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి ఈ నెల 7న ఉదయం 11 గంటలకు వికారాబాద్ పట్టణ కేంద్రంలోఎన్నెపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసి న అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్పీకర్ ప్రసా ద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పా రు. మధ్యాహ్నం 3గంటలకు విగ్రహావిష్కరణ అ నంతరం సత్యభారతి ఫంక్షన్హాల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ –ఎ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, దోమ మండల అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయ ణ, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, రాఘవేందర్ రెడ్డి, యాదయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేష్, వెంకటేష్, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, మాధవరెడ్డి, ఆరిఫ్, పటేల్, నేపాల్ రెడ్డి, రవీందర్, పులిందర్, మహేష్, బాలు, లక్ష్మణ్ పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి -
కేక్ కోసం వెళ్లి.. ప్రమాదానికి గురై
బొంరాస్పేట: మండల పరిధిలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారి 163పై ఉన్న కల్వర్టు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరారు. స్థానికుల వివరాల ప్రకారం.. దుద్యాల్ మండల కేంద్రానికి చెందిన భరత్ పుట్టినరోజు కావడంతో కేక్ కోసం బొంరాస్పేటకు ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు అనంతరాములుతో వెళ్తున్నాడు. తుంకిమెట్ల బ్రిడ్జి వద్ద మరమ్మతులకు రహదారిని తవ్వారు. ఇది గమనించని యువకులు ప్రమాదానికి గురయ్యారు. గాయాలు కావడంతో మండల కేంద్రం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
అనంతగిరి: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కులలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను స్థానిక బూత్ కమిటీ అధ్యక్షులు సుద్దగళ్ల లింగమయ్య, మైస నరేష్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదానందరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులను ఇస్తుందన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కృషితో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ వడ్ల నందు, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి నవీన్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాల్, యువకులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్@255 కోట్లు
తుర్కయంజాల్: అక్రమ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు విశేష స్పందన లభించింది. ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించడంతో దరఖాస్తు దారులు చాలా మంది రుసుం చెల్లించారు. తొలుత మార్చి 31 వరకు రాయితీతో కూడిన గడువు ప్రకటించినప్పటికీ.. తరువాత మరో నెల, అనంతరం మే 3వ తేది వరకు అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీ స్థలాల యజమానులు ముందుకు రావడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. రూ.255.56 కోట్ల ఆదాయం జిల్లాలోని 14 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల పరిధి నుంచి 2020 సంవత్సరంలో 2లక్షల 55వేల 923 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో లక్షా 78వేల 591 దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని అధికారులు ఆన్లైన్ ద్వారా సమాచారం అందజేశారు. దీంతో 65వేల 186 మంది రుసుం చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి రూ.255 కోట్ల 56 లక్షల ఆదాయం వచ్చింది. అత్యధిక దరఖాస్తులు తుర్కయంజాల్ నుంచి 54,331 వచ్చినప్పటికీ, ఆదాయం మాత్రం పెద్ద అంబర్పేట నుంచి రూ.53 కోట్ల 85 లక్షలు వచ్చింది. బడంగ్పేట కార్పొరేషన్ నుంచి రూ.48 కోట్ల 45లక్షలు వచ్చాయి. అత్యల్పంగా శంషాబాద్ మున్సిపాలిటీలో 10,086 అర్జీలు వచ్చినప్పటికీ 111జీఓ పరిధిలో ఉండటంతో కేవలం 270 మందిని మాత్రమే అర్హులుగా పేర్కొంటూ రుసుం చెల్లించాలని సూచించారు. ఇందులో 151 మంది రూ.ఒక కోటి 59 లక్షలు చెల్లించారు. మరో అవకాశం కల్పిస్తే.. ప్రభుత్వం రాయితీ ప్రకటించిన నాటి నుంచి ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు భారీగా ప్రచారం చేశారు. ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి, దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించారు. సులభంగా అర్థమయ్యేలా మొబైల్లో ఫైల్ స్టేటస్ చెక్ చేసుకోవడంతో పాటు, డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో చాలా మంది రుసం చెల్లించారు. ప్రభుత్వం గడువు మరింత పెంచి, రాయితీ కల్పిస్తే మరికొందరు ఫీజు చెల్లించే అవకాశాలు ఉంటాయి. క్రమబద్ధీకరణకు విశేష స్పందన ముగిసిన రాయితీ గడువు ప్రొసీడింగ్స్కు వేచి ఉండాల్సిందే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో భారీగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ.. వీటి పరిశీలనకు వేచి చూడక తప్పని పరిస్థితి. వారం క్రితం వరకు దరఖాస్తులను కేవలం టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రూవల్ చేస్తే సరిపోయేది. కానీ తిరిగి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అంగీకారం కూడా కావాల్సి ఉంది. దీంతో అత్యధికంగా ఫీజులు చెల్లించిన చోట ఇబ్బందులు తప్పేలా లేవు. మూడు శాఖల అధికారులు ధ్రువీకరించి, ఆమోదం తెలిపితే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పొందవచ్చు. -
సెల్ఫోన్ దుకాణంలో చోరీ
తాండూరు: సెల్ఫోన్ చార్జింగ్ పెట్టుకొనేందుకు వచ్చిన యువకుడు కౌంటర్పై ఉంచిన రూ.35వేలు తీసుకొని ఉడాయించిన సంఘటన తాండూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణంలోని కొడంగల్ రోడ్డు మార్గంలో తాండూరుకు చెందిన ఓ వ్యాపారి ఒప్పొ స్టోర్ను నిర్వహిస్తున్నాడు. షాప్ చూసుకోవాలని దుకాణంలో పని చేసే యువకుడికి చెప్పి బయటకు వెళ్లాడు. అప్పుడే ఓ వ్యక్తి ఫోన్ కొనేందుకు వచ్చాడు. వచ్చిన వ్యక్తికి రూ.35వేల ఫోన్ను విక్రయించాడు. వచ్చిన డబ్బులను క్యాష్ కౌంటర్లో పెడదామంటే తాళం వేసి ఉంది. దీంతో అతను కౌంటర్పైనే ఒక అరలో డబ్బులను పెట్టి వ్యాపారంపై దృష్టి పెట్టాడు. అప్పుడే ఓ యువకుడు సెల్ఫోన్ చార్జింగ్ పెట్టుకొనేందుకు వచ్చాడు. చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ.. ఎవరు లేని సమయం చూసి కౌంటర్పై ఉన్న రూ.35వేలను తీసుకొని మెల్లగా షాపులో నుంచి వెళ్లిపోయాడు. కొంత సేపటి తర్వాత షాపులో పని చేస్తున్న వ్యక్తి డబ్బులను చూసుకోగా కనిపించలేదు. దీంతో అతను డబ్బులు ఎత్తుకెళ్లారని గుర్తించి సీసీ కెమెరాలు చెక్ చేశాడు. అందులో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకొనేందుకు వచ్చిన గుర్తు తెలియని యువకుడు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయం గురించి యజమాని వచ్చాక వివరించి చెప్పాడు. ఇద్దరు కలిసి వెళ్లి పట్టణ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చార్జింగ్ పెట్టుకునేందుకు వచ్చి రూ.35వేలు అపహరణ -
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
నాంపల్లి: కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మాసబ్ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మణికంఠ(24) అనే యువకుడు జొమోటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున అతను అమీర్పేట నుండి మెహిదీపట్నం వైపు వెళుతుండగా మాసబ్ట్యాంక్లోని ఖాజా మెన్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని కారు అతడిని ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శతాధిక వృద్ధురాలి మృతి శంకర్పల్లి: శతాధిక వృద్ధురాలు మృతి చెందారు. మండలంలోని పర్వేద గ్రామానికి చెందిన కటికె మోతి బాయ్(102) ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస వీడారు. వంద సంవత్సరాలు జీవించిన బామ్మను కడసారిగా చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. ఆమె మనుమడు సతీశ్ మాట్లాడుతూ.. వందేళ్ల వయస్సులోనూ అమ్మమ్మ ఎంతో హుషారుగా ఉండేదని, చిరుతిండికి అయిష్టత చూపేదని పేర్కొన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్’శ్రవణ్రావుపై మరో కేసు ● ఇనుప ఖనిజం ఇప్పిస్తానంటూ మోసం ● అఖండ సంస్థ ఫిర్యాదు మేరకు రిజిస్టర్ ● నిందితుల్లో శ్రవణ్ భార్య మరికొందరుసాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ కుమార్ రావుపై హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. ఇనుప ఖనిజం వ్యాపారం డీల్ ఇప్పిస్తానంటూ మోసం చేశారని అఖండ ఇన్ఫ్రాటెక్ ఇండియా సంస్థ ఎండీ ఎ.ఆకర్ష్ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు దీనిని రిజిస్టర్ చేశారు. రూ.6.5 కోట్ల గోల్మాల్తో ముడిపడి ఉన్న ఈ కేసులో శ్రవణ్రావుతో పాటు ఆయన భార్య స్వాతి రావు, వ్యాపార భాగస్వామి కేబీ వేదమూర్తి, ఎకోర్ ఇండస్ట్రీస్ హోల్టైమ్ డైరెక్టర్ ఉమా మహేశ్వర్రెడ్డి నిందితులుగా ఉన్నారు. గత నెల 25నే ఈ కేసు నమోదైనప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్రిధమ్ ఎనర్జీ సంస్థ డైరెక్టర్గా ఉన్న శ్రవణ్రావు 2022 జూన్లో ఆకర్ష్ను సంప్రదించాడు. కర్ణాటక, సాండూర్లో ఉన్న ఎకోర్ ఇండస్ట్రీస్ బాధ్యతల్ని తాను స్వీకరించినట్లు చెప్పాడు. ఇనుప ఖనిజం వ్యాపారంలో ఉన్న తమకు నిధులు సమకూరిస్తే ప్రతి టన్నుకు రూ.300 చొప్పున లాభం ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో అఖండ సంస్థ 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వివిధ దఫాలుగా ఎరోర్ సంస్థ ఖాతాల్లోకి రూ.6.5 కోట్లు బదిలీ చేసింది. ఈ చెల్లింపులకు సంబంధించి ఎకోర్ సంస్థ నుంచి తమకు ఎలాంటి ఇన్వాయిస్లు అందలేదని ఆకర్ష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2023 నాటికి సంబంధిత వ్యక్తులకు రూ.7 కోట్ల విలువైన ఇనుప ఖనిజం సరఫరా జరగాల్సి ఉండగా... అలా చేయకపోవడంతో ఆకర్ష్కు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీసిన ఆయన తమ సంస్థ బదిలీ చేసిన నిధుల్ని శ్రవణ్రావు వేరే అవసరాలకు మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై పలుమార్లు ప్రశ్నించినా శ్రవణ్రావు నుంచి సరైన సమాధానం రాలేదు. కొన్ని రోజులకు శ్రవణ్రావు విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆకర్ష్ తన నిధులకు సంబంధించి శ్రవణ్ భార్య స్వాతితో పాటు వేదమూర్తిని పలుమార్లు సంప్రదించాడు. గత ఏడాది సెప్టెంబర్ వరకు వారు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారు. గత నెల వరకు ఎదురు చూసిన ఆకర్ష్ దీనిపై సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుతో పాటు బాధితుడు అనేక వాట్సాప్ చాటింగ్స్, ఈ–మెయిల్స్ ప్రతులకు జత చేశాడు. ఈ కేసును అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
మేనకోడలే మాస్టర్ మైండ్
● మేనత్త ఇంట్లోదోపిడీ చేయించిన వైనం ● అద్దె పేరుతో ఇంట్లోకి చొరబడి చోరీ ● మేనకోడలితో పాటు మరోఇద్దరు నిందితుల రిమాండ్ సికింద్రాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలైన మేనత్తను టార్గెట్ చేసి ఆమె ఇంట్లో దోపిడీ చేయించిన మేనకోడలి ఉదంతమిదీ. ఇల్లు అద్దెకు కావాలన్న నెపంతో వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు ఆమెను బంధించి నగలు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసులో మిస్టరీ వీడింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు ఆగంతకులతో పాటు సూత్రధారిగా వ్యవహరించిన బాధితురాలి మేనకోడలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురినీ రిమాండ్కు తరలించారు. ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి, చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ పార్శిగుట్టలో పారిజాతం (60) అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఈనెల 2న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ పారిజాతం ఉంటున్న మొదటి అంతస్తుకు వచ్చారు. ఆమె తేరుకునే లోపే ఇంట్లోకి చొరబడి తలుపులు గడియపెట్టి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేసి సెల్ఫోన్, రూ.6వేల నగలు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు వెళ్లిపోయిన తర్వాత కట్లు విప్పుకుని బయటికి వచ్చిన పారిజాతం స్థానికుల సహాయంతో వారాసీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముషీరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో స్వీపర్గా పని చేస్తున్న శ్రీకాంత్, బన్సీలాల్పేట్కు చెందిన ఎలక్ట్రీషియన్ ఈశ్వర్లను నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ బంధువు పార్శిగుట్టకు చెందిన క్యాటరింగ్ వర్కర్ ఆళ్ల జ్యోతి సూచన మేరకే తాము పారిజాతం ఇంట్లో దోపిడీకి పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా తన మేనత్త ఒంటరిగా ఉంటున్న విషయం తనకు తెలుసునని డబ్బు కోసమే శ్రీకాంత్ను దోపిడీకి పురమాయించినట్లు తెలిపింది. నిందితుల నుంచి సెల్ఫోన్, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం డబ్బు కోసం మాత్రమే వీరు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వారికి ఎలాంటి నేరచరిత్ర లేదన్నారు. రెండు రోజుల్లోనే కేసును చేధించి నిందితులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్ఐలు సుధాకర్, ప్రకాశ్రెడ్డి, కానిస్టేబుళ్లు గాలేబ్, దస్తగిరి, వేణు, రామకృష్ణ తదితరులకు డీసీపీ అవార్డులు అందజేశారు. -
రైతులు ఆందోళన చెందొద్దు
ఆమనగల్లు: అన్నదాతలు ఆందోళన చెందవద్దు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, న్యాయం చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కురిసిన వానకు ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో కుప్పలుగా పోసిన వడ్లు తడిసిపోగా.. ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. విపక్షాల రాజకీయం ఏనాడు రైతు సంక్షేమం పట్టని విపక్షాలు.. అకాలవర్షానికి ధాన్యం తడిస్తే.. దానిని రాజకీయం చేస్తూ, పబ్బం గడుపుకొనే యత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ.. రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షలు మాఫీ చేసిందని పేర్కొన్నారు. సన్నాలకు అదనంగా క్వింటాకు రూ.500 అందిస్తున్నామని చెప్పారు. వ్యవ సాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించి ఆదుకు న్నది కాంగ్రెస్ పార్టేనన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భా స్కర్రెడ్డి, తలకొండపల్లి సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు శ్రీశైలం, పాండు రంగ య్య, రవీందర్, అజీం, రమేశ్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్, నాయకులు ఖలీల్, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఖాదర్, బాబా, శ్రీపాల్, రాము తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెపెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభాష్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివా సం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మికి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచ్చిన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి మల్లాపూర్: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ రుద్విర్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్కు చెందిన అవదేశ్ కుమార్ వర్మ(50), బాబు రామ్ వర్మ(55) నగరానికి వలస వచ్చి మల్లాపూర్ వీఎన్ఆర్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న బాబురామ్ వర్మ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందుకుగాను కొబ్బరి కాయలు కొట్టే కత్తిని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం అతను అవదేశ్ కుమార్ వర్మపై కత్తితో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడిని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం అవదేశ్ కుమార్ వర్మ ఆరోగ్య నిలకడగానే ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మండేకాలం.. పశువులు భద్రం
అప్రమత్తంగా ఉంటేనే మూగజీవాలు ఆరోగ్యం ● వేడి గాలులతో జాగ్రత్త ● పశు వైద్యుల సూచన తాండూరు: పక్షం రోజులుగా ఎండలతో పాటు వేడి గాలులు జన జీవనంతో పాటు పశువులను ఊపిరాడకుండా చేసున్నాయి. వేడి ఎక్కువైన ప్రజలు ఫ్యాన్ లేదా కూలర్లతో సేదదీరుతారు. మరీ ఇబ్బంది పడితే ఏసీలో చల్లగా గడిపేస్తారు. కానీ పశువులు మాత్రం మండే ఎండలకు అనారోగ్యబారిన పడుతున్నాయి. వాటిని పోషకులే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండక పోతే అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు తీవ్రరూపం దాల్చడంతో మూగజీవాలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి మృత్యువాత కూడా పడతాయి. పశువులు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన మెళకువలు, చికిత్స వివరాలను పశువైద్యాధికారులు వివరించారు. వడదెబ్బ వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు మెదడులో హైపోథలామస్ అనే భాగం స్వేద గ్రంథులు చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. చెమట ద్వారా శరీరంలోని ధాతువులు కోల్పోయి జీవక్రియ దెబ్బ తింటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి శ్వాస, గుండె, నాడి, మూత్ర పిండాల విధులు తగ్గిపోయి పశువుల ఆరోగ్యం విషమంగా మారుతుంది. శ్వాస సరిగా అందక మరణించే అవకాశాలు లేకపోలేదు. లక్షణాలు పశువులలో శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల సెల్సీయస్ మించితే చర్మం మృధుత్వం తగ్గిపోయి, గట్టి పడుతుంది. నోటితో గాలి పీల్చుకోవడం, నోటి వెంకట చొంగ కారడం జరుగుతుంది. ఆవుల్లో పాల దిగుబడి పునరుత్పత్తి, గర్భస్రావం అయ్యే అవకాశం ఉండగా, ఎత్తులో వంధత్వం వస్తుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు పక్షవాతం, లక్షణాలు సంభవించి క్రమంగా కోమాలోకి వెళ్లి మరణిస్తాయి. కారణాలు ● గాలిలో తేమ అధికంగా ఉండటం ● వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం ● పాకలో సామర్థ్యానికి మించి పశువులు ఉండటం ● నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ● వడగాలులతో పశువులు ఒత్తిడికి లోను కావడం వల్ల చికిత్స వడదెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయంలో పశువులను చల్లని నీటితో పలు మార్లు కడగాలి. నీటిని తాగడానికి అందుబాటులో ఉంచి నొప్పులను తగ్గించడానికి మందును వాడాలి. నివారణ చర్యలు ● వేసవిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పశువులను మేతకు బయటకు వదలకూడదు. ● చల్లని నీరు తాగేందుకు పాకాలో అందుబాటులో ఉంచాలి. ● రోజుకు 3 లేదా 4 సార్లు చల్లని నీటితో పశువులను కడగాలి. లేదా చెరువులలో నీరు నిల్వ ఉన్న కుంటలలో పశువులను వదలాలి. ● కొట్టాలను బాగా ఎత్తుగా నిర్మించుకొని పైన ఎండుగడ్డితో కప్పాలి. ఎండ ఉన్న సమయంలో పశువులపై నీటిని చల్లుతుండాలి. ● పశువుల పాకలో వడగాలి వీస్తున్న దిక్కులలో గోనే సంచులను కట్టి నీరు చల్లుతుండాలి. ● నీటి శాతం అధికంగా ఉన్న పచ్చి మేతను పశువులకు వేయాలి. ● ఎక్కువగా దాణా లేదా ఉడికించిన ధాన్యాలను పెడుతున్నప్పుడు కొంచెం వంట సోడా కలపడం వల్ల ఎండ వేడిమికి గురైన పశువుల్లో వచ్చే అజీర్తి సమస్యను నివారించవచ్చు. -
ఆమ్దాని ఘనం.. సౌకర్యాలు శూన్యం
తాండూరు: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ప్రభుత్వ కార్యాలయాల పనితీరు. సర్కారుకు ఏటా రూ.కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రభుత్వ శాఖలకు తాండూరులో సొంత గూడు లేకుండా పోయాయి. పట్టణంలో ప్రభుత్వ భవనాలు పదుల సంఖ్యలో వృథాగా ఉన్నా అద్దె భవనాలలోనే అధికారులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. తాండూరు పట్టణంలో సబ్రిజిస్ట్రార్, గనులశాఖ, ఎకై ్సజ్ శాఖల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. కానీ వీటికి సొంత భవనాలు మాత్రం లేవు. విపత్కర సమయంలో ఉపయోగపడే అగ్నిమాపక శాఖకు సైతం శాశ్వత భవనం లేకపోవడం గమనార్హం. శంకుస్థాపన చేసినా.. తాండూరు పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు లేక దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా తాండూరు సబ్ రిజిస్ట్రార్, ఎకై ్సజ్, గనుల శాఖ, కార్మిక శాఖ కార్యాలయం లాంటివి ఇప్పటికి అద్దె భవనాల్లోనే సేవలు అందిస్తున్నాయి. అవి కూడా రెసిడెన్షియల్ ఇళ్ల మధ్యలో కార్యాలయాలున్నాయి. గత ప్రభుత్వాలు సొంత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు. 20 ఏళ్లు గడుస్తోంది స్థానికంగా సబ్ రిజిస్ట్రార్, గనుల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో సబ్రిజిస్ట్రార్, గనులశాఖ కార్యాలయాలకు నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలను నిర్మించలేకపోయారు. ఏళ్లు గడుస్తున్నా భవన నిర్మాణానికి నోచుకోవడం లేదు. దీంతో సిబ్బందితో పాటు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. అధికారుల చిత్తశుద్ధి లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో పనులు కొనసాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎకై ్సజ్ శాఖ ద్వారా ఏటా తాండూరు నుంచి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కానీ ఎకై ్సజ్ శాఖ కార్యాలయ భవనం మాత్రం ఇప్పటికి ఇళ్ల మధ్యనే కొనసాగుతుంది. చిన్న గదుల్లోనే.. సంవత్సరానికి సబ్రిజిస్ట్రార్, గనులశాఖ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. భవన నిర్మాణానికి నిధులు పుష్కలంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వంతో పనులు ప్రారంభం కావడం లేదు. రైల్వేస్టేషన్ సమీపంలో అద్దె భవనంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం చిన్న గదులతో ఉండటంతో సిబ్బందికే సరిపోవడం లేదు. దీంతో స్థానికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గనులశాఖ కార్యాలయం కూడా అంతే. చిన్న గదుల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అద్దె భవనాల్లో సర్కారు సేవలు నిర్మాణానికి నోచుకొని సబ్రిజిస్ట్రార్, గనులశాఖ కార్యాలయాలు ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ప్రజలు -
ప్రశాంతంగా నీట్ పరీక్ష
అనంతగిరి: వికారాబాద్లో నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర, జెడ్పీహెచ్ఎస్ బాలికల, సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల, కొత్తగడిలోని బాలికల గురుకుల, అనంతగిరిపల్లి సమీపంలోని బాలుర గురుకుల పాఠశాల సెంటర్లలో నిర్వహించారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ఉండగా 11 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతించారు. 1.30 గంటలకు గేట్ మూసివేశారు. మొత్తం 1193 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 39 మంది గైర్హాజరయ్యారు. 1154 మంది పరీక్ష రాశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే హాల్లోకి పంపించారు. పరీక్షకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా సెంటర్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర తనిఖీ చేసి పరీక్ష నిర్వహణపై ఆరా తీశారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ -
అంటరానితనాన్ని నిర్మూలించాలి
బొంరాస్పేట: శాస్త్ర సాంకేతికత రంగం కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో సైతం గ్రామాల్లో కుల వివక్ష ఉండడం అత్యంత దారుణమని ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఏర్పుమళ్లలో డా.బీఆర్.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏర్పుమళ్లలోనూ రెండు గ్లాసుల విధానం, దళితులకు క్షౌవరం చేయకపోవడం బాధాకరమన్నారు. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులు, పేదల భూములు కాపాడేందుకు సీఎం రేవంత్రెడ్డి జుడీషియల్ కమిటీ వేసి కాపాడాలని ఆయన కోరారు. వక్తలు కట్టెల మల్లేశం, బైరెడ్డి సతీష్, కాంగ్రెస్ పార్టీ జాతీయ యూత్ కోఆర్డినేటర్ కృష్ణంరాజు, తదితరులు పాల్గొని స్థానికులకు చైతన్య పరిచారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాయకులు రమేశ్బాబు, సూర్యానాయక్, వెంకటయ్య, చంద్రయ్య, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ వినోద్కుమార్ ఏర్పుమళ్లలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ -
వెతలు తీరక
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025ప్రాజెక్టు పూర్తికాక..10లోuకేపీ లక్ష్మీదేవిపల్లి డిజైన్ మార్పులతో కాలయాపన ● బడ్జెట్ సమావేశంలో రిజర్వాయర్ ప్రస్తావన ● సస్యశ్యామలం కానున్న 2,46,154 ఎకరాల భూమి ● త్వరితగతిన నిర్మించాలని అన్నదాతల వేడుకోలువికారాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా పరిస్థితి దీపం చుట్టూ చీకట్లే అన్న చందంగా తయారయింది. నగరానికి ఆమడ దూరంలో ఉన్నా అభివృద్ధిలో మాత్రం నత్తతో పోటీ పడుతోంది. దశాబ్దాలుగా పాలకుల అనాలోచితచర్యతో సరిపడా సాగునీటి వనరులు లేకుండా పోయాయి. ఎన్నికల సమయంలో మాత్రం ఈ ప్రాంత రూపురేఖలు మార్చుతామనే నాయకుల వాగ్దానాలు నీటి మీది రాతలుగా మారాయి. జిల్లాకు వరప్రదాయినిగా భావించే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపించింది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినప్పటికీ ప్రత్యేకంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తావన అందులో లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ ఇప్పటివరకు ముందడుగు పడలేదు. గతంలోనే పరిగి నియోజకవర్గం సరిహద్దులో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కల నెరవేరుతుందా? జిల్లాకు చెందిన ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ ఏదో ఒక కొర్రీలు పెట్టి ప్రభుత్వాలు పక్కన పెడుతున్నారు. సర్వేలు, రీడిజైన్లు, కేసులు అంటూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని దశాబ్దాలుగా కాలయాపన చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 50 టీఎంసీల కేటాయింపులున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం అటకెక్కించింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొన్నేళ్లుగా ఊగిసలాడుతూ వస్తోంది. అనేక సర్వేలతో డిజైన్లను మార్చుతూ వచ్చారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే కోసం రూ.6.91 కోట్లు కేటాయించగా.. నిపుణులు సర్వే చేసి డిజైన్ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 115 టీఎంసీ నీటిని కేటాయించారు. అందులో 45 టీఎంసీల కేపాసిటీతో పరిగి నియోజకవర్గంలోనే రిజర్వాయర్లు కట్టేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో గండేడ్, కుల్కచర్ల మండల పరిఽధిలో నిర్మించే రిజర్వాయర్ సామర్థ్యం 35 టీఎంసీలుగా పేర్కొన్నారు. న్యూస్రీల్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది బడ్జెట్లోనే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొనడం శుభ పరిణామం. నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి నుంచి హామీ తీసుకున్నాం. రిజర్వాయర్ పూర్తయితే జిల్లా రైతాంగానికి ఎంతో మేలు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ప్రభుత్వ పెద్దలు, సంబంధిత మంత్రితో చర్చిస్తున్నాం. సీఎం సైతం సానుకూలంగా ఉన్నారు. కచ్చితంగా ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుంది. – రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, పరిగిసీఎంపైనే ఆశలు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లక్ష్మీదేవిపల్లి, పరిగి మండల పరిధిలోని రావులపల్లి గ్రామాల శివారులో సంయుక్తంగా 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాకు 2,46,154 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. అయితే గత సర్కారు హయాంలో అనేక సార్లు రీడిజైన్ చేస్తూ వచ్చారు. చివరకు గ్రావిటి ద్వారానే నీళ్లు అందిస్తామని చెప్పి, అది కూడా పూర్తి చేయలేదు. ప్రధాన ప్రాజెక్టుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటానికే పరిమితమయ్యారు తప్పా పనులు పూర్తి చేయడంలో శ్రద్ధ చూపలేదు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఈసారైనా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తారని ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
ధారూరు మార్కెట్కు పోటెత్తిన ధాన్యం
ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్కు శనివారం 5,334 బస్తాల 1010 రకం వడ్లు వచ్చాయని ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. క్వింటాలుకు రూ.1,940 నుంచి రూ.2 వేల వరకు ధర పలికినట్లు చెప్పారు. మొక్కజొన్న 1,787 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,225 నుంచి రూ.2,340 వరకు, సోనారకం వడ్లు 165 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,250 నుంచి రూ.2,230 వరకు, కందులు 97 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.6,150 నుంచి రూ.7,050 వరకు ధర పలికిందని ఆమె వివరించారు. అలాగే పసుపులో కాడి రకం 59 బస్తాల వచ్చాయని, క్వింటాలుకు రూ.8,900 నుంచి రూ.12 వేల వరకు, పసుపులో గుండు రకం 10బస్తాలు రాగా క్వింటాలుకు రూ.11,500 వేల నుంచి రూ.12,200 వరకు అమ్మకాలు జరిగాయని ఆమె తెలిపారు. నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం జరగనున్న పరీక్షకు భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1,193 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల వద్ద గల జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు రేపటి నుంచి 13 వరకు తొమ్మిది బృందాల పర్యటన సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల ఐదు నుంచి 13 వరకు తొమ్మిది బృందాలు, 54 గ్రామాల్లో పర్యటించి సహజ వనరులు, పంట మార్పిడి, చెట్ల పెంపకం, సాగునీటి యాజమాన్యం, విత్తనాలు, రసాయనాల కొనుగోలు చేసిన రసీదులను భద్రపరుచుకోవడం వల్లే చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్లు సహజ వనరుల విభాగం సంచాలకురాలు డాక్టర్ కేపీ వాణి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలోని మొయినాబాద్, కొత్తూరు, చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్వే షురూ.. కందుకూరు: ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు శనివారం సర్వే పనులు ప్రారంభించారు. మండల పరిధిలోని మీరాఖాన్పేట, పంజుగూడ రెవెన్యూలో గతంలో సేకరించిన భూములను సర్వేచేసి వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫ్యూచర్సిటీ పీఎస్ సీఐ కృష్ణంరాజుతో పాటు కందుకూరు సీఐ సీతారామ్, పహడీషరీప్ డీఐ జితేందర్రెడ్డి పర్యవేక్షణలో నలుగురు ఎస్ఐలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ విషయంలో రైతులకు ఇబ్బందులు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని సీఐ కృష్ణంరాజు ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పేదలకు మేలు మహిళా కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మొయినాబాద్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పామెన జ్యోతి అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మున్సిపల్ ఉపాధ్యక్షురాలిగా చిలుకూరు మాజీ సర్పంచ్ గునుగుర్తి స్వరూపకు నియామకపత్రం అందజేశారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. -
‘ఎర్లీబర్డ్’కు స్పందన కరువు
షాద్నగర్: మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఎలాంటి బకాయిలు లేని వారు ముందస్తుగా మొత్తం పన్ను చెల్లిస్తే అందులో ఐదు శాతం రాయితీని కల్పిస్తోంది. కానీ మందస్తు చెల్లింపులకు ఇళ్ల యజమానుల నుంచి స్పందన అంతంతమాత్రమే వచ్చింది. షాద్నగర్లో రూ.1.94 కోట్ల వసూలు షాద్నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డుల్లో సుమారు 70వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. 15,933 గృహ, వ్యాపార సముదాయాల నుంచి సుమారుగా రూ.7.22 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 27శాతం రూ.1.94 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. కొత్తూరులోనూ అంతంతే.. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 13,200 జనాభా ఉంది. 2,619 ఇళ్లు, వ్యాపార సముదాయాలున్నాయి. వీటి నుంచి రూ.2.56 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఎర్లీ బర్డ్ పథకంలో అధికారులు ఇప్పటి వరకు సుమారు 14శాతంతో రూ.54 లక్షలు వసూలు చేయగలిగారు. ప్రచారం నిర్వహించినా స్పందన కరువు ఎర్లీ బర్డ్ పథకం పై అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక బృందాలుగా అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అగాహన కల్పించారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాలకు మైకులను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆశించిన మేర పన్నులు వసూలు కాలేదు. ప్రభుత్వం విధించిన గడువును ప్రజలు పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేసుకోలేదు. రాయితీ గడువు పెంపు ఎర్లీ బర్డ్ పథకానికి ఏప్రిల్ 30తో గడువు ముగిసింది. అయితే ప్రభుత్వం ఈ గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ వర్తింస్తుందని స్పష్టం చేశారు. ఐదు శాతం రాయితీ ప్రకటించినా ముందుకు రాని మున్సిపల్ వాసులు షాద్నగర్లో 27 శాతం, కొత్తూరులో 14 శాతం చెల్లింపులు ఈ నెల 7వ తేదీ వరకు గడువు పెంపుసద్వినియోగం చేసుకోవాలి ఎర్లీబర్డ్ పథకానికి ఈ నెల 7వరకు గడువు పొడిగించారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. సకా లంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. – బాలాజీ, కమిషనర్, కొత్తూరు మున్సిపాలిటీ -
సమస్యల బాలకేంద్రం
● మౌలిక వసతులు లేక చిన్నారుల పాట్లు ● ప్రహరీ లేక ఇబ్బందులు ● శిథిలావస్థలో భవనం అనంతగిరి: చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన బాలకేంద్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు 1982లో వికారాబాద్లో బాలకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు గదుల్లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కార్యాలయ గది గోడకు పగుళ్లు వచ్చాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కిటికీలు, తలుపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది. ఏళ్ల తరబడిగా భవనం మరమ్మతులకు నోచుకోవడం లేదు. కేంద్ర చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి విషపురుగులకు నిలయంగా మారింది. ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం బాల కేంద్రంలో సమ్మర్ క్యాంపు మొదలైంది. గత నెల 26 నుంచి చిన్నారులకు ఉదయం 9నుంచి మధాహ్నం 12.30గంటల వరకు భరతనాట్యం, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, తబలా, బుక్ రీడిండ్ తదితర వాటిలో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 200లకు పైగా పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అనుభవజ్ఞలైన సిబ్బంది ఉంది. వేసవి శిబి రం కావడంతో చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తు న్నారు. అయితే సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గదులు సరిపోక వరండాలో భరత నాట్యం నేర్పుతున్నారు. రాణిస్తున్న చిన్నారులు ఇక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని చిన్నారులు తెలిపారు. సొంతంగా డబ్బు సమకూర్చుకొని వెళ్లాల్సి వస్తోందని వివరించారు. కలెక్టరేట్లో జరిగే వివిధ ఉత్సవాల్లో సైతం బాలకేంద్రం చిన్నారులకు అవకాశాలు ఇవ్వాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని బాలకేంద్రంలో మౌలిక వసుతులు కల్పించడంతో పాటు, భవనానికి మరమ్మతులు చేయాలని వారు విన్నవించారు. పెండింగ్లోనే అప్గ్రేడ్ ఫైల్ వికారాబాద్లోని బాలకేంద్రాన్ని బాలభవన్గా అప్గ్రేడ్ చేస్తే పిల్లలకు మరిన్ని కళలు అందుబా టు లోకి వస్తాయి. ఇందుకు సంబంధించిన ఫైల్ డైరక్టరేట్ కార్యాలయంలో పెండింగ్లో ఉంది. స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకుని బాలకేంద్రాన్ని బాలభవన్గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఎకై ్సజ్ శాఖకు అవినీతి మరక
● సహచర ఉద్యోగినీ వదలని వైనం ● జిల్లా కార్యాలయంలోనే చేతివాటం ● నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే ● గుడ్విల్ పేరుతో ఉన్నతాధికారుల వరకు.. ● ఏసీబీ దాడులతో అసలు విషయం వెలుగులోకి.. వికారాబాద్: ఎకై ్సజ్ శాఖ జిల్లా కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. బెల్టు దుకాణాలు, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్ల నుంచి ముక్కు పిండి మామూళ్లు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సొంత శాఖ, సహచర ఉద్యోగులను కూడా వదిలిపెట్టరని తాజా ఘటనతో రుజువైంది. శుక్రవారం ఎకై ్సజ్ జిల్లా కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ పట్టుబడిన విషయం తెలిసిందే. కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఎవరి వాటా వారికి.. జిల్లా ఎకై ్సజ్ శాఖలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వసూలు చేసిన మొత్తంలో ఎవరి వాటాలు వారికి వెళ్లి పోతాయనేది బహిరంగ రహస్యం. విజిలెన్స్, టాస్క్ఫోర్స్ టీంలు సైతం జిల్లా బాస్ కనుసన్నల్లోనే దాడులు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తాయనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ నుంచి ఫుల్ బాటిల్, బీర్ల అమ్మకాల్లో రూ.10 నుంచి రూ.50 వరకు అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎప్పుడైనా బెల్టు షాపులనిర్వాహకులు పట్టుబడితే వారికి మద్యం దుకాణ యజమానులు అండగా నిలుస్తున్నారు. కేసులు కాకుండా చూస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు మ ద్యం దుకాణాల నుంచి నెలనెలా మామూళ్లు తీసు కుంటున్నందునే బెల్టు షాపుల విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో మద్యం షాపు నుంచి వేల రూపాయలు మామూళ్ల రూపంలో అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పేరుతో అప్పుడప్పుడు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు గాలికి.. దుకాణాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు రూపొందించినా అవి ఎక్కడా అమలు కావడం లేదు. ఉదాహరణకు పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఎన్కెపల్లిగేట్ వద్ద ఆలయానికి 50 మీటర్ల దూరంలోనే మద్యం షాపు ఏర్పాటు చేశారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం వద్ద బాలికల పాఠశాల ఉన్నా ఇక్కడ కూడా మ ద్యం షాపు ఏర్పాటు చేశారు. దీనిపై కాలనీ వా సులు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఉండాలి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. వ్యాపారాన్ని బట్టి..జిల్లాలో మొత్తం 59 మద్యం దుకాణాలు ఉన్నాయి. రోజుకు రూ.60 వేలకు మించి వ్యాపారం జరిగే షాపు నుంచి నెలనెలా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవి నెలనెలా తీసుకునే మామూళ్లకు అదనం అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని మద్యం దుకాణ యజమానులు భయపడుతున్నట్లు సమచారం. ఎకై ్సజ్, పోలీసు అధికారులు మూమూళ్లు తీసుకుంటున్న కారణంగానే గ్రామాల్లో విచ్ఛలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో అవినీతి జలగలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
భూ భారతితో రైతులకు మేలు
నవాబుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా చాలా సమస్యలు అలాగే ఉండిపోయాయన్నారు. తాను జిల్లాలో బాధ్యతలు చేపట్టే నాటికి 15 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉండేవాని, వాటిని 5 వేలకు తెచ్చినట్లు వివరించారు. భూ భారతి చట్టంతో జిల్లాలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి మండలానికి 5 నుంచి 6 మంది వరకు సర్వేయర్లను నియమించడం జరుగుతుందన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లా డుతూ.. భూమికి రైతుకు అవినాభావ సంబంధం ఉందన్నారు. భూమి ఉన్నంత కాలం రైతు ఉంటాడని పేర్కొన్నారు. భూమినే నమ్ముకొని బతుకుతున్న రైతులకు అధికారులు మేలు చేయాలని సూచించారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలన్నారు. అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘం నాయకుడు మాణిక్రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ జైరాం, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మండల వ్యవసాయాధికారి జ్యోతి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
ఉద్యాన పంటలకు ఊతం
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన, కలెక్టర్ ప్రతీక్జైన్ ● చీమల్దరి గ్రామంలో పర్యటన మోమిన్పేట: ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన తెలిపారు. శనివారం కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి మండలంలోని చీమల్దరి గ్రా మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపా ధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి పను లు, వేతనంపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన తోటలు మామిడి, జామ, మునగ, సీతాఫలం తదితర పంటలు సాగు చేసుకోవచ్చని వివరించారు. మూడు సంవత్సరాల పాటు తోటల పెంపకానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పొలాల్లో ఏటవాలుకు అడ్డంగా చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచి వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని కంపోస్టు షెడ్డు, శ్మాశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ యాదగిరి, శంకర్, ఈసీ వికాస్, కార్యదర్శులు భరత్, సుగుణ తదితరులు పాల్గొన్నారు. రైతులను ప్రోత్సహించాలి నవాబుపేట: ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన వన పంటలు సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనర్ సృజన ఆదేశించారు. శనివారం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పొలాల వద్ద చెక్ డ్యామ్ల నిర్మాణానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, పంచాయత్ రాజ్ ఈఈ ఉమేష్, డీఈ మాధవరెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఏపీఓ లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శులు గీత, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సినీ నటుడు విజయ్దేవరకొండపై ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం: గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓ సినిమా రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై తమ సంఘం తరఫున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం ఆమనగల్లు: మండల పరిధిలోని కోనాపూర్గేటు సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో అమెజాన్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గుర్రంగుట్ట కాలనీకి చెందిన కావటి శ్రీకాంత్(25) ఆరేళ్లుగా తుక్కుగూడ సమీపంలో ఉన్న అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులకు హాజరైన ఆయన తన బైక్పై శనివారం ఇంటికి వస్తున్న క్రమంలో సుమారు ఉదయం 3గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం మృతుడి కుటుంబీకులను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి పరామర్శించారు. ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి భారీ విరాళం రూ.15 లక్షల చెక్కు అందజేసిన కేసర్ ఇండసీ్ట్రస్ షాద్నగర్: దాతల సహకారంతో షాద్నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి కేసర్ ఇండస్ట్రీస్ అధినేత బంకట్ లాల్బాటీ శనివారం భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసిన రూ.15 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరిందని.. దాతల సహకారంతో అత్యాధునిక సదుపాయాలతో కూడిన నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థుల చదువులకు దాతలు సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కాశీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంసీహెచ్లో గర్భిణి మృతి
తాండూరు టౌన్: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఎనిమిది నెలల గర్భిణి చికిత్స పొందుతూ మృతిచెందింది. తాండూరు మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే గర్భిణితో పాటు ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను తీసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం పాషాపూర్తండాకు చెందిన సుమిత్రాబాయి (35)కి కడుపులో నొప్పి రావడంతో శనివారం ఉదయం 6గంటలకు ఎంసీహెచ్లో చేరింది. గంటన్నర గడిచిన తర్వాత గర్భిణితో పాటు కడుపులోని శిశువు మృతిచెందిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తాము ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి రాగా, 7.30 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతిచెందిందని జైసింగ్ ఆరోపించాడు. ఈక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అత్యవసర చికిత్స అందించాల్సిన సమయంలో సిబ్బంది, డాక్టర్లు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ను వివరణ కోరగా సుమిత్రాబాయికి రక్తం తక్కువగా ఉందని, హిమోగ్లోబిన్ శాతం 1.8 గ్రాములు మాత్రమే ఉందని, దీంతో శ్వాస తీసుకోకలేకపోయిందని తెలిపారు. సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయిందని స్పష్టంచేశారు. ఇందులో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ ఆక్సిజన్ అందక చనిపోయిందన్న సూపరింటెండెంట్ -
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ అందజేత
పోలీసునని చెప్పి..ఐపీఎల్ టికెట్లు లాక్కొని పరార్ శంషాబాద్ రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాలను ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ శనివారం అందజేశారు. మండలంలోని న ర్కూడ వాసి పి.పద్మ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె వైద్య సహాయం కోసం ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఎల్ఓసీ మంజూరు చేయించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు నీరటి రాజు, ఎస్.శ్రీనివాస్, శేఖర్, విశ్వనాథం, ప్రభు, నర్సింహా, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. సనత్నగర్: పోలీసునని చెప్పి బెదిరించి యువకుల నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను లాక్కొని పరారైన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన వంగూరి రాకేష్ ఈ నెల 5వ తేదీన నగరంలో జరిగే ఎస్ఆర్హెచ్, డీసీ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించడం కోసం 16 టికెట్లను కొనుగోలు చేసేందుకు స్నేహితులైన పవన్, రామకృష్ణలతో కలిసి నగరానికి వచ్చాడు. మొదట హిమాయత్నగర్లోని టికెట్ బుకింగ్ కేంద్రానికి వెళ్లి 16 టికెట్ల కోసం ప్రయత్నించగా 8 టికెట్లు మాత్రమే దొరికాయి. మరో 8 టికెట్ల కోసం జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ కష్టపడి మరో 8 టికెట్లను కొనుగోలు చేసి బయటకు వస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అడ్డగించాడు. తనకు నాలుగు టికెట్లు విక్రయించాలని, రూ.2,500ల చొప్పున విలువ చేసే టికెట్లకు రూ.5,000 చొప్పున చెల్లిస్తానన్నాడు. తొలుత నిరాకరించిన యువకులు ఆ తర్వాత టికెట్లను విక్రయించేందుకు ఒప్పుకున్నారు. మళ్లీ సదరు వ్యక్తి మరో 6 టికెట్లు కావాలని అడిగాడు. టికెట్లు ఇచ్చేందుకు యువకులు నిరాకరించడంతో వారిని బెదిరించాడు. వారికి పోలీసు గుర్తింపు కార్డు చూపించి తాను టాస్క్ఫోర్స్ పోలీసు అధికారినని, బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారని, అందరినీ జైలుకు పంపుతానని బెదిరించి వారిని బేగంపేట పోలీస్స్టేషన్ సమీపం వరకు తీసుకువచ్చాడు. మొత్తం 16 టికెట్లతో పాటు యువకుల వద్ద ఉన్న రూ.1700 తీసుకుని వారిని తిరిగి పరేడ్గ్రౌండ్ వద్ద దించి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తిపై అనుమానం వచ్చిన యువకులు బేగంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న ఉచిత కరాటే శిబిరం
ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మేరినాట్స్ గ్రౌండ్లో సమ్మర్ ఫ్రీ కరాటే శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ తరగతులు మాస్టర్ జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్న్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి 8వరకు రెండు గంటలు నిర్వహిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన ఈ శిబిరం మే 26 వరకు కొనసాగుతుందని నిర్వాహకుడు యండీ ఖాజాపాషా మాస్టర్ తెలిపారు. ఆయన సమ్మర్ ఉచిత శిక్షణ శిబిరాలు 15సంవత్సరాలనుంచి చేపడుతున్నట్లు తెలిపారు. తన శిష్య బృందంతో ఈ తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శిబిరంలో 215మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారన్నారు. ఈ క్యాంపులో శిక్షణ పొందే వారు అమ్మాయిలే అధికంగా ఉన్నారు. శిక్షణ శిబిరంలో కరాటే, సెల్ప్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఓరియల్ వెపన్, జిమ్నాస్టిక్, జూడో తదితర వాటిలో తర్ఫీదు ఇస్తున్నామని శిక్షకులు తెలిపారు. అనంతరం ఆసక్తి, ప్రతిభ గల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ పోటీలకు సైతం శిక్షణ ఇచ్చి పోటీలకు సన్నద్ధం చేస్తామని చెబుతున్నారు. నిర్వాహకుడు మాస్టర్ యండీ ఖాజాపాషాతో పాటు అతని బృందం బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ డి. విజయ్, మాణిక్నాయక్, మధు మోహన్, ప్రజ్వల్కుమార్ తదితరుల ఆధ్వర్యంలో క్యాంపు కొనసాగిస్తున్నారు. కరాటేతో విద్యార్థులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఉచితంగా శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమని మాస్టర్ ఖాజాపాషాను తల్లిదండ్రులు, విద్యార్థులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. -
ప్రాణం తీసిన చేపల వేట
తాండూరు రూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ గిరిజనుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ ఘటన మండల పరిధిలోని మైసమ్మతండాలో శనివారం చోటుచేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. తండాకు చెందిన రాథోడ్ శాంతుకుమార్(28), లక్ష్మీబాయి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. శాంతుకుమార్ మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య లక్ష్మి కూలీ పనులకు వెళ్తుంది. శుక్రవారం పెద్దేముల్ మండలం పాషాపూర్లో జరిగిన ఓ విందులో పాల్గొని ఇంటికి వచ్చిన శాంతు సాయంత్రం 6గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తండా మొత్తం వెతికారు. శనివారం ఉదయం గుండ్లమడుగుతండాకు చెందిన జయరాంచౌహన్కు తండా సమీపంలోని ఐలాన్చెరువు వద్ద శాంతు బైక్, దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే అతను ఈ విషయాన్ని మైసమ్మతండా వాసులకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వచ్చి చెరువులో గాలించగా శాంతు మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. శాంతుకుమార్ మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చెరువులో మునిగి గిరిజనుడి మృతి మైసమ్మతండాలో విషాదం -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే
పరిగి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు బాధ్యతలు స్వీకరించడంతో శనివారం పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సచివా లయంలో ప్రధాన కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దేదిశగా ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని కోరారు. బీడీ, డాగ్స్క్వాడ్ బృందాల తనిఖీ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్లలో శనివారం బీడీటీం, డాగ్స్క్వాడ్ బృందం తనిఖీ చేపట్టారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఎల్మకన్నెలో వ్యక్తి అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య తాండూరు రూరల్: పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన కరన్కోట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్మకన్నె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన సిరిగిరిపేట్ రవి, స్వాతి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే రవి గత నెల 13వ తేదీన ఎల్మకన్నెలోని ఇంటి నుంచి పనికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. భార్య స్వాతి శనివారం కరన్కోట్ పోలీస్స్టేషన్లో భర్త రవి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నీలిరంగు ప్యాంట్, గులాబిరంగు షెర్ట్ఽ ధరించినట్లు తెలిపింది. బొలెరో వాహనం బైకు ఢీ యువకుడి మృతి మోమిన్పేట: బొలెరో వాహనం.. బైకు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మోమిన్పేటలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి గ్రామానికి చెందిన మొల్లని శుభాష్(30) శుక్రవారం రాత్రి బూరుగుపల్లి నుంచి తన బైకుపై స్వగ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో కల్లు సరఫరా చేసే బొలెరో వాహనం వేగంగా వచ్చి రాళ్లగుడుపల్లి నుంచి ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టింది. బైకు నుజ్జు నుజ్జయి తలకు బలమైన గాయం అవ్వడంతో శుభాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న మృతుని తండ్రి మొల్లని నర్సయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించా రు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవరు తుకరాంను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ అరవింద్ పేర్కొన్నారు. -
‘పట్టా’లేని పాట్లు!
దౌల్తాబాద్: ఆరుగాలం శ్రమించి పండించి, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. కొద్ది రోజులుగా వరుణుడు నిత్యం వీరిని భయపెడుతున్నాడు. ఏదో ఒక చోట కురుస్తున్న వానతో ధాన్యం ఆరబోసిన రైతుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఎండిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కనీసం టార్పాలిన్లు (పట్టాలు) కూడా అందుబాటులో లేవు. ప్రభుత్వం ఏడేళ్లుగా వీటి సరఫరాను నిలిపేసింది. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో టార్పాలిన్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంత ఖ రీదు చేసి కొనలేకపోతున్న కర్షకులు ఎరువుల బస్తాలతో పట్టాలు కుట్టించి, ధాన్యం తడవకుండా కాపాడుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు వ్యక్తుల వద్ద టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఏడేళ్లుగా ఎదురుచూపులు.. మండలంలో వానాకాలం సీజన్కు సంబంధించి 12 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఎనభైశాతం మేర వరికోతలు పూర్తయ్యాయి. ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ సమయంలో వడ్లు ఆరబెట్టేందుకు, వర్షం పడితే తడవకుండా కప్పేందుకు టార్పాలిన్లు చాలా అవసరం. గతంలో ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్లు అందజేసింది. వీటిని కొనుగోలు చేసేందుకు రైతులు పోటీపడేవారు. డిమాండ్ మేర కాకపోయినా.. ఉన్నంతలో ఇచ్చేవారు. కానీ ఏడేళ్లుగా ప్రభుత్వం రాయితీ టార్పాలిన్ల పంపిణీని ఆపేసింది. బహిరంగ మార్కెట్లో అధికం ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. వీటికి 50శాతం రాయితీని వర్తిస్తుంది. ఒక్కో టార్పాలిన్కు రైతు తనవంతుగా వాటా రూ.1,250 చెల్లిస్తే చాలు. అదే ప్రైవేటులో కొనుగోలు చేస్తే ఒక్కో కవర్కు రూ.3 వేలు పలుకుతుంది. నాణ్యత కూడా అంతగా ఉండదు. సబ్సిడీ టార్పాలిన్ల పంపిణీకి సర్కారు మంగళం 2018 నుంచి నిలిపివేత బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల అవస్థలు రూ.3 వేలు అంటున్నారు ప్రస్తుతం వరి పంట కోతకు వచ్చింది. పంట కోస్తే ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్లు లేవు. ప్రభుత్వం సడ్సిడీపై ఇస్తలేదు. బయట మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3 వేలు అంటున్నారు. – కృష్ణ, రైతు దౌల్తాబాద్ ఆదేశాలు రాలేదు చాలా మంది రైతులు సబ్సిడీ టార్పాలిన్లు కావాలని అడుగుతున్నారు. ఈ విషయా న్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదే శాలు రాలేదు.– లావణ్య, ఏఓ, దౌల్తాబాద్ -
ఏఐతో విద్యా ప్రమాణాలు మెరుగు
దోమ: విద్యార్థుల ప్రమాణాలు పెంపునకు కృత్రిమ మేధ(ఏఐ) విద్య ఎంతో దోహదపడుతుందని కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి(సీఎంఓ) రజిని, జీసీడీఓ(గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్) శ్రీదేవి అన్నారు. మండల పరిధిలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న వేసవి తరగతులను శనివారం ఎంఈఓ వెంకట్తో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కంప్యూటర్ ద్వారా విద్యార్థులు అందిపుచ్చుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, సంఖ్యాపరమైన విజ్ఞానాన్ని పెంపొందించడం, వ్యక్తిగతంగా విద్యార్థుల ప్రమాణాలు, అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపర్చడం వంటివి దగ్గరుండి పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమయంలో ఎలాంటి అనుమానాలు అడిగినా వెంటనే నివృత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.వెంకటయ్య, వలంటీర్ అఖిల్, అభిలాష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. సీఎంఓ రజిని, జీసీడీఓ శ్రీదేవి కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రజిని, జీసీడీఓ శ్రీదేవి బొంపల్లిలో విద్యార్థులు నేర్చుకుంటున్న ఏఐ విద్య పరిశీలన -
వరిధాన్యం సేకరణకు చర్యలు
అనంతగిరి: జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. శనివారం వరి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 129 కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రైతులు కష్టపడి పండించిన పంట వర్షాలతో తడిసిపోకుండా కావలసిన తాడిపత్రీలు, సంచులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తూనిక, తేమ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు చేరవేయాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యాన్ని సేకరించేందుకు హమాలీలను తగిన సంఖ్యలో పెంచుకోవాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, మార్కెటింగ్ ఏడి సారంగపాణి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి నాగార్జున, డీసీఎంఎస్ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ -
తాండూరులో ‘దోస్త్’సెంటర్
తాండూరు టౌన్: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మణ్ తెలిపారు. శనివారం ఆయన సెంటర్ను ప్రారంభించారు. విద్యార్థులు ఆన్లైన్లో దోస్త్ సెంటర్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కళాశాల పనివేళల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పేర్ల నమోదు, ఆధార్ ధ్రువీకరణ, వెబ్ ఆప్షన్స్ నమోదు తదితర సేవలు పొందవచ్చన్నారు. వివరాల కోసం దోస్త్ సమన్వయకర్తలు ఎస్.మహేందర్రెడ్డి, కిషన్, అమర్ను 9885583432, 9959531273, 9849432029 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షరీఫా, హరికృష్ణ, రవి, ఆశప్ప, అనంతరామ్ పాల్గొన్నారు. మరిన్ని కొత్త కోర్సులు.. ఈ ఏడాది తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. వీటికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. బీఎస్సీ (ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్), బీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఏ (మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం), బీఏ (సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మిన్స్ట్రేషన్) వంటి కోర్సులను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. వీటితో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, నాలుగు అధునాతన డిజిటల్ తరగతుల సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. డిగ్రీ కాలేజీలో ప్రారంభించిన ప్రిన్సిపల్ లక్ష్మణ్ కొత్త కోర్సుల కరపత్రాల ఆవిష్కరణ -
ఆపదలో ఉన్నవారికి ‘ఆర్ట్’ చేయూత
మహేశ్వరం: ఆపదలో ఉన్నవారిని అదుకునేందుకు తమ సంస్థ పనిచేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్, ఆర్ట్(అనితారెడ్డి తీగల) ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ తీగల అనితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గొల్లూరులో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఆమె, రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిత్యం కొంత సమయాన్ని వాకింగ్, ధ్యానం, యోగాకు కేటాయించాలన్నారు. ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి హాజరైన సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, మాజీ సర్పంచ్ హరినాథ్గౌడ్, నాయకులు బాల్రాజ్, లోకేశ్వర్రెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై కల్లాలు.. ప్రమాదాలకు నిలయాలు
దుద్యాల్: రోడ్లపైనే పంట ఉత్పత్తులను ఆరబోయడం, నూర్పిడి, రాసులు చేస్తుండటంతో వాహనాలు ప్రమాదాలకు గురువుతున్నాయి. గతంలో రైతులు గ్రామంలో కల్లాలు ఏర్పాటు చేసుకొని ధాన్యం, మక్కలు, వేరుశనగ తదితర పంటలను ఆరబెట్టేవారు. ప్రస్తుతం ప్రధాన రహదారుల పొడవునా పంట ఉత్పత్తులను ఆరబోస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ప్రాంతంలో నూర్పుడిలు చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నూర్పిడి తర్వాత వ్యర్థాలను రోడ్లపైనే వదిలేసి పోతున్నారు. దీంతో వ్యర్థాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళ ప్రయణం కష్టంగా ఉందని వాహనచోదకులు తెలిపారు. రోడ్లపై కల్లాలు ఏర్పాటు చేయకుండా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మండలంలోని నాజుఖాన్పల్లి, చిలుముల్ మైల్వార్, సాగారం తండా, గౌరారం, హంసంపల్లి, చెట్టుపల్లి తండా మార్గాల్లో కల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉందని పలువురు తెలిపారు. రోడ్లపైనే ధాన్యం రాసులు బొంరాస్పేట: వరి ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు రహదారులను కల్లాలుగా మార్చుకుంటున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని మెట్లకుంట నుంచి ఎన్కేపల్లి వరకు ధాన్యం నూర్పిడి కల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారులు అవగాహన కల్పించి రహదారులపై నూర్పిడి జరగకుండా చూడాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు రాత్రి వేళ ప్రయాణం మరింత ప్రమాదకరం చర్యలు తీసుకోవాలంటున్న వాహనచోదకులు అవగాహన కల్పించాలి రోడ్లపై ధాన్యం ఆరబోయడం, కల్లాలు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. నూర్పిడి అనంతరం వ్యర్థాలను రోడ్లపైనే వదిలేసి వెళ్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చూడాలి. – ఆశన్న, వాహనచోదకుడు. దుద్యాల్ మండలం -
ప్రజలను అప్రమత్తం చేయండి
అనంతగిరి: ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ శుక్రవారం అధికారులకు సూచించారు. ఎండల కారణంగా జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు ఎండల వల్ల కలిగే ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం, చేనేత వస్త్రాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, చల్లదనం ఉండే చోటు ఉండాలన్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు నీడ, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు వడదెబ్బకు గురై ఆస్పత్రికి వస్తే తక్షణ చికిత్స చేయాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు, మీటర్లు, బోరు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాటిని సమకూర్చాలని సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులను అలసత్వం చేయరాదని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, విద్యుత్ శాఖ ఎస్ఈ రవి ప్రసాద్, డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
రిజిస్ట్రేషన్.. నో టెన్షన్
షాద్నగర్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం కానుంది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం ఉండదు. పది నుంచి 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కానుంది. ఇందుకు గాను రిజిస్ట్రేషన్ల శాఖ సంస్కరణలు చేపట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు జిల్లాలోని ఐదు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేశారు. రెండో విడతలో భాగంగా.. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి మంచి స్పందన వచ్చింది. విడతల వారీగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. రెండో విడతలో భాగంగా జిల్లాలోని ఫరూఖ్నగర్, షాద్నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, శేరిలింగంపల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి విడతలో శంషాబాద్, సరూర్నగర్, చంపాపేట్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎంపిక కావడంతో అక్కడ ఇప్పటికే స్లాట్బుకింగ్ విధానం కొనసాగుతోంది. అనుకున్న సమయానికి .. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం అనుకున్న సమయానికి, తేదీకి, ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, ఆ తర్వాత 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లిపోవచ్చు. స్వయంగా దస్తావేజుల తయారీ స్థిరాస్తి దస్తావేజులు నమోదు చేసుకునే వారు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండా స్వయంగా తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ప్రత్యేక మాడ్యూల్ ప్రవేశపెట్టారు. మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసం వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపై అమ్మినవారు, కొన్నవారు, సాక్షులు తర్వాత సబ్రిజిస్ట్రార్ సంతకాలు చేయడం, వాటిని స్కానింగ్ చేయడానికి సుమారు గంట సమయం పడుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్బోర్డ్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. నిరీక్షణకు తెర మరింత సులభతరంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం పది నుంచి పదిహేను నిమిషాల్లోనే పూర్తి కానున్న ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో ఆరు సబ్రిజిస్ట్రార్కార్యాలయాల ఎంపిక ఈనెల 12 నుంచి అమలు -
ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు దగ్ధం
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం హన్మాపూర్ గేటు వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరు–జహీరాబాద్ మార్గంలోని రోడ్డుకు ఇరువైపులా అధికారులు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు. హన్మపూర్ గేటు సమీపంలో శుక్రవారం నిప్పంటుంకుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి విషయాన్ని కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. కలెక్టర్, డీఆర్డీఏ ఆదేశాల మేరకు పెద్దేముల్ ఎంపీడీఓ రతన్సింగ్, పంచాయతీ కార్యదర్శి నర్సింలు ఘటనా స్థలిని పరిశీలించారు. పరిస్థితిని కలెక్టర్కు ఫోన్లో వివరించినట్లు ఎంపీడీఓ రతన్సింగ్ వెల్లడించారు. -
కళాశాల నిర్మాణానికి రూ.11లక్షల విరాళం
షాద్నగర్: దాతల సహకారంతో షాద్నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి వ్యాపారవేత్తలు, రవి ఫ్రూట్స్ సంస్థ వారు భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు వారు శుక్రవారం రూ.11లక్షల చెక్కును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి ఫ్రూట్స్ సంస్థ అధినేతలు రవికుమార్ అగర్వాల్, కేదార్నాథ్ అగర్వాల్, రాజేందర్కుమార్ అగర్వాల్ ఎమ్మెల్యేను కలిసిన రవికుమార్ అగర్వాల్ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. -
అక్రమంగా గోవుల తరలింపు
ఇబ్రహీంపట్నం: కంటైనర్లో అక్రమంగా గోవులు తరలిస్తుండగా బీజేపీ నాయకులు వాటిని గోశాలకు తరలించారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. గురువారం రాత్రి మండల పరిధిలోని రాయపోల్ మీదుగా ఓ కంటైనర్లో 42 గోవులను తరలిస్తున్నారు. విషయం గమనించిన స్థానికులు మార్గమధ్యలో వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవులను ఇరుకుగా ఉంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుసుకుని వాహనాన్ని స్టేషన్కు తరలించారు. అనంతరం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకుని గోవులను సమీపంలోని గోశాలకు తరలించారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
● సహచర ఉద్యోగికి రావాల్సిన బిల్లులో లంచం డిమాండ్ ● అవినీతి నిరోధక శాఖ అధికారులనుఆశ్రయించిన బాధితుడు ● ఎకై ్సజ్ కార్యాలయంలో వలపన్ని పట్టుకున్న అధికారులు అనంతగిరి: ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్లోని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే శ్రీధర్ ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్స్ చేస్తాడు. ఇదే శాఖలో పనిచేస్తున్న సహచర ఉద్యోగికి 2022– 23 సంవత్సరానికి సంబంధించిన రూ.76 వేల పైచిలుకు బిల్లు రావాల్సి ఉంది. దీన్ని క్లియర్ చేయాలని శ్రీధర్ను కోరగా డబ్బులు అడిగాడు. మొత్తం బిల్లులో తనకు 11శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే బిల్ పాస్ చేసేది లేదని తేల్చిచెప్పాడు. అయితే తన వద్ద డబ్బు లేదని, బిల్లు వచ్చిన వెంటనే ఇచ్చేస్తానని ఉద్యోగి తెలిపాడు. ఇందుకు అంగీకరించిన శ్రీధర్ బిల్ పాస్ చేయడంతో ఇటీవల ఉద్యోగి ఖాతాలో డబ్బులు జమయ్యాయి. చెప్పిన విధంగా తనకు రూ.8 వేలు ఇవ్వాలని శ్రీధర్ పలుమార్లు అతనికి ఫోన్ చేశాడు. న్యాయబద్ధంగా తనకు రావాల్సిన బిల్లులో లంచం ఇవ్వడం ఏమిటని భావించిన సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కార్యాలయంలో శ్రీధర్ రూ.8 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని, అన్ని వివరాలు సేకరించారు. డబ్బులు తీసుకోవడంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని నాంపల్లిలోని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఏసీబీ దాడులు జరుగుతున్నాయనే విషయం క్షణాల్లో మిగితా కార్యాలయాలకు పాకింది. దీంతో అవినీతి అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 1064కు కాల్ చేయండి జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 9440446106లో, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని సూచించారు. -
రూ.40 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముప్పై ఏళ్ల క్రితమే కబ్జాకు గురైన రూ.40 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులు మూడు రోజుల క్రితం విముక్తి కల్పించారు. ఇప్పటికే రెండుసార్లు సర్వే చేయడంతో పాటు భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సరూర్నగర్ మండలం లింగోజిగూడ డివిజన్ సర్వే నంబర్ 86లో 1.21 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఓ పార్టీకి చెందిన నేత దీనిపై కన్నేశాడు. పక్కనే ఉన్న ప్రైవేటు పట్టాదారును ఉసిగొల్పి ప్రభుత్వ భూమిని పట్టా భూమిలో కలిపేందుకు యత్నించాడు. ఇప్పటికే ఆ భూమిలో నాలుగు తాత్కాలిక గదులు నిర్మించి కూలీలకు అద్దెకిచ్చాడు. ఇతరులెవరినీ లోనికి అడుగు పెట్టకుండా ప్రైవేటు సెక్యురిటీతో నిఘా ఏర్పాటు చేశాడు. ఖాళీ స్థలాన్ని తన సొంత స్థలంగా నమ్మించి అందులో ప్రైవేటు కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాల పార్కింగ్ కోసం అద్దెకిచ్చాడు. విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. ఏళ్లుగా ప్రైవేటు వ్యక్తి చెరలో చిక్కిన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించాలని నిర్ణయించారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓ వెంకట్రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్ క్షేత్రస్థాయికి చేరుకుని భూమిని పరిశీలించారు. నాలుగు నెలల్లో మూడుసార్లు పరిశీలించడంతోపాటు పక్కగా సర్వే చేయించారు. మూడు రోజుల క్రితం చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫెన్సింగ్ వేయించారు. తాత్కాలిక గదుల్లో అద్దెకున్న వారంతా వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. లేదంటే ఆ నివాసాలను కూల్చివేయనున్నట్లు హెచ్చరించారు. ఇదే భూమికి సమీపంలో ఉన్న మరో 250 గజాల స్థలాన్ని కూడా అధికారులు రక్షించారు. -
బీఎస్ఎన్ఎల్ సేవలు డీలా
బంట్వారం: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంస్థ సేవలు నానాటికి కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ప్రతీ గ్రామంలో సేవలు అందుబాటులో ఉండేవి. మొదట్లో ఏరియా పరిధిలోని టెలిఫోన్ ఎక్చేంజ్ల నుంచి రోడ్డు వెంట స్తంభాలు ఏర్పాటు చేసి గ్రామాలకు ల్యాండ్ ఫోన్ సౌకర్యం కల్పించారు. అనంతరం కేబుల్ ద్వారా టెలిఫోన్ వ్యవస్థను నడిపించారు. కాలక్రమంలో ల్యాండ్ ఫోన్లు కనుమరుగయ్యాయి. సెల్ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ఒకప్పుడు బాగా నడిచిన ఎస్టీడీ, ఐఎస్డీ టెలిఫోన్ బూత్లు మూతబడ్డాయి. తదనంతరం వచ్చిన కాయిన్ బాక్స్లు కథ కంచికి చేరింది. 30 ఏళ్ల క్రితం పరుగులు పెట్టిన బీఎస్ఎన్ఎల్ సేవలు ఇప్పుడు పూర్తిగా డీలా పడ్డాయి. బంట్వారం, ఎన్నారం గ్రామాల్లో 25 సంవత్సరాల క్రితమే టెలిఫోన్ ఎక్చేంజ్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో వీటికి పక్కా భవనాలు సైతం నిర్మించారు. బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచి పోవడంతో ఈ భవనాలు వృథాగా మారాయి. సెల్ఫోన్ల రాకతో తగ్గిన వినియోగం సెల్ఫోన్లు మార్కెట్లోకి రావడంతో బీఎస్ఎన్ఎల్ సేవలు తగ్గుతూ వచ్చాయి. వివిధ ప్రైవేటు కంపెనీలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్శిస్తూ మార్కెట్లో దూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ పూర్తిగా చేతులెత్తేసింది. ప్రస్తుతం పట్టణాలకే పరిమితమైంది. అక్కడక్కడ కొనసాగే ఇంటర్నెట్ కనెక్షన్లతోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెడుతున్నారు. ఇప్పటికై నా సంబందిత టెలికమ్యూనికేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి బీఎస్ఎన్ఎల్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉంది. కనుమరుగైన ల్యాండ్ ఫోన్లు మూతబడిన ఎస్టీడీ బూత్లు నిరుపయోగంగా మారిన టెలిఫోన్ ఎక్చేంజ్ భవనాలు -
సీడ్స్ షాప్లో నకిలీ మందులు విక్రయం
యజమానిపై కేసు షాబాద్: నకిలీ మందులు విక్రయిస్తున్న న్యూ మారుతి సీడ్స్ దుకాణం పై కేసు నమోదయింది. ఈ ఘటన శుక్రవారం షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని నాగర్గూడలో ఉన్న న్యూ మారుతి సీడ్స్ షాపులో సింజెంట కంపెనీకి చెందిన నకిలీ మందులు విక్రయిస్తున్నారని సదరు కంపెనీ మేనేజర్ కేషమసుధీర్కు సమాచారం అందింది. దీంతో అతడు అదే కంపెనీలో పనిచేసే రాకేశ్తో సినోడిస్ 200 మి.లీల మందు కొనుగోలు చేయించాడు. సదురు మందు డబ్బాపై ఉన్న లోగోలు వేరుగా ఉన్నట్లు గమనించి అది నకిలీదని గుర్తంచారు. షాపు యజామాని రాజశేఖర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సింజెంట కంపెనీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం ● విరిగిపడిన స్తంభం ● విద్యుత్ సరఫరాకు అంతరాయం ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి రోడ్డుపై పడడంతో విద్యుత్, కేబుల్ వైర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలోని ఈశ్వరాంజనేయ స్వామి ఆలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణం నుంచి రాయపోల్ వెళ్లే మార్గంలోని ఈశ్వరాంజనేయ ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం స్తంభాన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చి వవిద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బస్తీవాసులు భయాందోళనకు గురయ్యారు. జనసంచారం లేని సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. -
స్నేహితుడిని నమ్మించి..
షాద్నగర్ రూరల్: స్నేహితుడిని నమ్మించి, నగదు దోచుకెళ్లడంతో పాటు ఎవరికై నా చెబితే చంపుతామ ని బెదిరించిన నిందితులను పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ విజయ్కుమార్ తెలిపిన ప్రకారం.. నగరంలోని యూసుఫ్గూడలో నివాసం ఉంటున్న నాగేశ్వరం శ్రీధర్ సినీ డైరెక్టర్. శివరాంపల్లికి చెందిన రొయ్యల మల్లేశ్తో ఇతనికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో షాద్నగర్ పరిధి విఠ్యాల వద్ద ఓ వెంచర్లో ప్లాటు అమ్మకానికి ఉందని, తక్కువ ధరకే ఇప్పిస్తానని శ్రీధర్ మల్లేశ్కు చెప్పాడు. అనంతరం షాద్నగర్కు చెందిన చింతోజు శ్రీధర్ను ఫోన్ద్వారా పరిచయం చేశాడు. స్నేహితుడి మాటలు నమ్మిన మల్లేశ్ ప్లాటును చూసేందుకు శివరాంపల్లికి చెందిన తన స్నేహితులు రవి, రాజుతో కలిసి గత నెల 27న కారులో షాద్నగర్కు వచ్చారు. ప్లాటుకు బయానా ఇచ్చేందుకు మల్లేశ్ రూ.5.60 లక్షలు తీసుకువచ్చాడు. నాగేశ్వరం శ్రీధర్ చెప్పినట్లుగా ప్లాటును చూపించేందుకు చింతోజు శ్రీధర్ స్నేహితులు శ్రీనాథ్ శ్రీకాంత్.. మల్లేశ్ పాటు అతని స్నేహితులను వెంచర్కు తీసుకెళ్లారు. చంపుతామని బెదిరించి.. మల్లేశ్ కారులో డబ్బులు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నాగేశ్వరం శ్రీధర్ ఎలాగైనా కాజేయాలని చింతోజు శ్రీధర్కు చెప్పాడు. వెంచర్ వద్ద ఎవరూ లేకపోవడంతో మల్లేశ్ కారుకు రాళ్లను అడ్డుగాపెట్టి అద్దాలు పగులగొట్టారు. మల్లేశ్, రవి, రాజుపై రాళ్లతో దాడిచేసి ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. కారులో ఉన్న రూ.5.60 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై గత నెల 29న కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి ఈనెల 1న చింతోజు శ్రీధర్, నాగేశ్వరం శ్రీధర్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకొన్నారు. నిందితుల నుంచి రూ.2.70 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, రఫీని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. వీరికి తగిన రివార్డులు అందజేస్తామని సీఐ తెలిపారు. రూ.5.60 లక్షలు దోపిడీ ఇద్దరు నిందితులకు రిమాండ్ వివరాలను వెల్లడించిన పట్టణ సీఐ విజయ్కుమార్ -
రద్దీ ప్రదేశాలే లక్ష్యం
పరిగి: రద్దీగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను పరిగి సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు. గత నెల 17న పరిగి బస్టాండ్లో ఇద్దరు ప్రయాణికుల నుంచి నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పాత నేరస్తులను విచారించి, వివిధ బస్టాండ్లలో జరిగిన చోరీల వివరాలను తెలుసుకుని, ఒక నిర్ధారణకు వచ్చారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గుంజల గిద్దన్న, అతని భార్య ఆగిరమ్మ, కూతురు కీర్తి, అతని బావ ప్రసాద్ను నిందితులుగా గుర్తించారు. బస్టాండ్లు, రద్దీ ప్రదేశాలే టార్గెట్గా చోరీలు చేసి, సొంతూరుకు ఉడాయిస్తారని తెలుసుకున్నారు. ఎస్ఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో సిద్దాపురం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం నిందితులను పట్టుకుని, విచారించగా నేరం అంగీకరించారు. వీరినుంచి మూడు తులాల బంగారం, రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏ– 1 నిందితుడుగిద్దన్నపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆగిరమ్మపై పెబ్బేరు, వనపర్తి, పంజాగుట్ట పీఎస్లలో కేసులు ఉన్నాయన్నారు. దొంగలను పట్టుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం రిమాండ్కు తరలించారు. ఎస్ఐ సంతోష్కుమార్, సిబ్బంది గోపాల్, జావిద్, బాలునాయక్లను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. బస్టాండ్లలో చోరీలకు తెగబడుతున్న ముఠా దోచుకున్న సొమ్ములు, డబ్బుతో స్వగ్రామానికి ఉడాయింపు గత నెల 17న పరిగి బస్టాండ్లో నగలు, నగదు చోరీ నిందితులను కటకటాల్లోకి పంపిన పోలీసులు వివరాలు వెల్లడించినపరిగి డీఎస్పీ శ్రీనివాస్ -
బీజేపీతోనే నూతన సంస్కరణలు
పరిగి: అరవైఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు కులగణన చేపట్టలేదని.. నూతన సంస్కరణలు బీజేపీతోనే సాధ్యమని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని నిర్ణయించడంతో శుక్రవారం బీజేపీ శ్రేణులు ప్రధాని మోది చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ.. కులగణనతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. దేశంలోని అన్ని పార్టీలు కులగణను స్వాగతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన కులగణన అశాస్త్రీయంగా ఉందని.. కేంద్రం నిర్వహించే జనగణనతోనే ప్రజలకు న్యాయం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాముయాదవ్, కార్యదర్శి పెంటయ్యగుప్తా, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య -
సీనియర్ టెక్నీషియన్ బలవ్మరణం
తాండూరు రూరల్: సో లార్ప్లాంట్లో పనిచేసే టెక్నీషియన్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దేముల్ మండలం ఇందూరు శివారులోని సోలార్ప్లాంట్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపిన ప్రకారం.. పెద్దేముల్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందని మాదారపు రాజశేఖర్రెడ్డి(37) ఏడేళ్లుగా లిండ్స్టోత్ సోలార్ కంపెనీలో సీనియర్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే గురువారం విధులకు వెళ్లిన రాజశేఖర్రెడ్డి శుక్రవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో మృతుడి తండ్రి బాల్రెడ్డి కుమారుడికి ఫోన్ చేసినా సమాధానం రాలేదు. కాసేపటికి అదే గ్రామానికి చెందిన బట్టల జైపాల్రెడ్డి మీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన గ్రామస్తులతో కలిసి ప్లాంట్కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సోలార్ప్లాంట్లోని గదిలో ఫ్యాన్కు నైలాన్ తాడుతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. తన కుమారుడికి ఎలాంటి సమస్యలు లేవని ప్లాంట్ యాజమాన్యంపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ సీఐ నగేశ్ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య విశాల, కూతురు శ్రీజ, కుమారుడు భరత్రెడ్డి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. అపస్మారక స్థితిలో గుర్తుతెలియని వ్యక్తితాండూరు రూరల్: అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని కరన్కోట్ యువకులు శుక్రవారం ప్రభు త్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా గ్రామంలోని బంగారమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. ఆయన వివరాలు తెలసుకునేందుకు యత్నించినా చెప్పలేకపోతున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ తగిలి ఉంటుందని భావించిన యువ నాయకుడు శ్రీనివాస్ పంచాయతీ కార్మికులతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అనాథ వ్యక్తి యాలాల మండలం కోకట్ వాసిగా అనుమానిస్తున్నారు. మట్టిని తరలిస్తున్న వాహనాలు సీజ్ మాడ్గుల: అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ వేణుగోపాల్రావు తెలిపారు. మండల పరిధిలోని అందుగుల శివారులోని వాగు నుంచి శుక్రవారం ఉదయం అక్రమంగా మట్టి తరలిస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసి డ్రైవర్లు, వాహన యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓఆర్ఆర్పై కారు బోల్తా యువకుడి దుర్మరణం ఇబ్రహీంపట్నం: అతివేగం కారణంగా కారు బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఆదిబట్ల ఠాణా పరిధిలో ఔటర్ రింగ్రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన డేరంగుల తిరుమలేశ్(35) నగరంలోని గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా స్వగ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో బొంగులూరు ఎగ్జిట్–12 వద్దకు రాగానే అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న తిరుమలేశ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. యువకుడి బలవన్మరణం షాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సతీశ్కుమార్ తెలిపిన ప్రకారం..మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన జట్ట సంగమేశ్వర్(22) 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. గురువారం తండ్రి నర్సింలు సంగమేశ్వర్ను మొయినాబాద్లోని భాస్కర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇంటికి తీసుకువచ్చాడు. ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురైన సంగమేశ్వర్ పొలానికి వెళ్తున్నాని చెప్పి అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి పొలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందిన కుమారుడిని చూసి బోరులన విలపించాడు. శుక్రవారం మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
● అయినా మేల్కోని విద్యాశాఖ ● అధికారుల పనితీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం ● పూర్తిస్థాయి సిబ్బంది ఉన్న చోటా 30 శాతంలోపే ఉత్తీర్ణత ● సమీక్ష చేయని జిల్లా యంత్రాంగం
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ప్రతీసారి విద్యాశాఖ ఉన్నతాధికారులుఒకే మాట చెప్పారు.. పదిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యమని.. ఇందుకోసం పక్కా ప్రణాళికతో సాగుతున్నామని, మెరుగైన ఫలితాలు వస్తాయని ఊదరగొట్టారు.. కానీ వారి మాటలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడాపొంతన కుదరలేదు. ఇటీవల విడుదలైనటెన్త్ ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలవడం వీరి పనితీరుకు అద్దం పడుతోంది. వికారాబాద్: తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగున నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ పనితీరుపై తల్లి దండ్రులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో మన ప్రాంతానికి టాప్ ఫైవ్లో చోటుదక్కేది.జిల్లాల విభజన తర్వాత కరోనా బ్యాచ్లు మినహా ఒక్క సారి కూడా కనీస స్థానం దక్కించుకోలేక పోయింది. ఈ సారి ఏకంగా రాష్ట్రంలోనే చివరి స్థానానికి పడిపోయి అపఖ్యాతిని మూటగట్టుకుంది. విద్యాశాఖ పై మూడేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నా దిద్దు బాటు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇంతజరుగుతున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 3,344 మంది ఫెయిల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 12,846 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 9,502 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 3,344 మంది ఫెయిల్ అయ్యారు. ఒక్క గణితం సబ్జక్టులోనే 2,639 మంది విద్యార్థులు తప్పారు. సైన్స్లో 1,474 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో సైతం రాష్ట్ర సగటుకంటే తక్కువ ఉత్తీర్ణత రావడం విమర్శలకు తావిస్తోంది. గురుకులాల్లో మంచి ఫలితాలు రాగా మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. విద్యాశాఖ ఘోర వైఫల్యాలను మూటగట్టుకుంది. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం, బోధన సక్రమంగా లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయి ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లోనూ ఫలితాలు దారుణంగా వచ్చాయి. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండి కూడా ఒకరిద్దరు మాత్రమే పాస్ కావడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నా.. నవాబుపేట మండలం అక్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పదో తరగతి పరీక్షలకు ఐదుగురు విద్యార్థులు హాజరు కాగా ఒక్కరు మాత్రమే పాసయ్యారు. ఇదే మండలంలోని నారెగూడ స్కూల్లో మొత్తం 13 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులు పది పరీక్షలు రాయగా ఒక్కరే పాసయ్యారు. ● పెద్దేముల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 102 మంది విద్యార్థులు.. ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పది పరీక్షలకు 16 మంది విద్యార్థులు హాజరు కాగా ఇద్దరే ఉత్తీర్ణత సాధించారు. ఇదే మండలంలోని తట్టెపల్లి స్కూల్లో 150 మంది విద్యార్థులు.. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 20 మంది పరీక్షలు రాయగా ఏడుగురే పాసయ్యారు. ● తాండూరు మండలం జినుగుర్తి ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు.. 12 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 30 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా కేవలం 8 మంది మాత్రమే పాసయ్యారు. ● కుల్కచర్ల బాలురు ఉన్నత పాఠశాలలో 21 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ 98 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదే మండలంలోని ఉప్పాయిపల్లి ఉన్నత పాఠశాలలో 56 మంది విద్యార్థులు.. 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 11 మంది పదో తరగతి పరీక్షలు రాయగా నలుగురు పాసయ్యారు. కుస్మ సముద్రం ఉన్నత పాఠశాలలో మొత్తం 68 మంది విద్యార్థులు.. ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. 15 మంది పది పరీక్షలకు హాజరు కాగా నలుగురు పాసయ్యారు. ● పూడూరు మండలం కోడుమూర్ ఉన్నత పాఠశాలలో 46 మంది విద్యార్థులు.. ఏడుగు రు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎనిమిది మంది ఎగ్జామ్స్ రాయగా ముగ్గురే పాసయ్యారు. ● పరిగి జిల్లా పరిషత్ నంబర్ వన్ పాఠశాలలో 123 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 58 మంది మాత్రమే పాసయ్యారు. నంబర్ టూ పాఠశాలలో 58 మందికి గాను 23 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదే మండలంలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో 27 మంది పరీక్షలు రాయగా 9 మంది మాత్రమే పాసయ్యారు. మొదటి స్థానంలో బొంరాస్పేట్ మండలం జిల్లాలోని బొంరాస్పేట్ మండలం 93 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలవగా కుల్క చర్ల, పెద్దేముల్ మండలాలు 47 శాతం ఫలి తాలతో చివరి స్థానంలో నిలిచాయి. జిల్లాలో ఎనిమిది పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. ప్రైవేటు పాఠశాలలకు చెందిన 303 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. -
పారిశ్రామికవాడకు భూ సర్వే
● పలువురు రైతుల అంగీకారంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ● పులిచర్లకుంటతండాలో110 ఎకరాలకు హద్దుల నిర్ధారణ ● భారీ బందోబస్తు నడుమ కొనసాగిన సర్వే ● పర్యవేక్షించిన ఎస్పీ నారాయణరెడ్డి దుద్యాల్: పటిష్ట బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు గురువారం పారిశ్రామికవాడకు సంబంధించిన భూ సర్వే చేపట్టారు. ఎస్పీ నారాయణరెడ్డి సర్వేను పర్యవేక్షించారు. ఇటీవల పులిచర్లకుంటతండాకు చెందిన పలువురు రైతులు కలెక్టర్ ప్రతీక్జైన్ను కలిసి పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. దీంతో ఉదయమే తహసీల్దార్ కిషన్ రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు సర్వే నిర్వహించారు. పులిచర్లకుంటతండా గ్రామానికి చెందిన దాదాపు 20 మంది రైతులకు సంబంధించి 110 ఎకరాల పట్టా భూములకు హద్దులు పాతినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ వీరేశ్బాబు, ఆర్ఐ నవీన్కుమార్, సిబ్బంది లాలాప్ప, మారుతి, ఊషనప్ప, వీరేశ్, రైతులు యుగంధర్రెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేబాటలో మిగిలిన వారు మండల పరిధిలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లో ప్రభుత్వం పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన భూ సేకరణకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల్లో అసైన్డ్ భూములతో పాటు కొంతమంది పట్టా భూములను రైతుల అంగీకారంతో తీసుకుంది. ఇందుకు పరిహారం సైతం ముట్టజెప్పింది. కానీ రోటిబండతండా, పులిచర్లకుంటతండాలో మాత్రం గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత చూపలేదు. దీంతో అధికారులు కొంతకాలం మౌనంగా ఉన్నారు. పులిచర్లకుంటతండాకు చెందిన ఓ రైతు గతంలోనే తన భూమిని పారిశ్రామికవాడకు ఇచ్చారు. దీంతో మరికొంత మంది ముందుకు వస్తున్నారు. భారీ బందోబస్తు సర్వే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ నారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టి లో ఉంచుకొని ప్రత్యేక బలగాలను మోహరించారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐలు యాదగిరి, సత్యనారాయణ, రవూఫ్, రవిగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగుకు సై
● జిల్లాలో 5.63 లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళిక సిద్ధం ● 42,064 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ● ఏర్పాట్లలో నిమగ్నమైన వ్యవసాయశాఖ తాండూరు: సాగుబడిలో రైతులు నూతన ఒరవడిని ప్రదర్శిస్తున్నారు. సంప్రదాయ ధోరణికి స్వస్తి చెప్పి వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అందుకు వానాకాలం సీజన్(ఖరీఫ్)ను అనువైనదిగా ఎంచుకుంటున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో కంది, పెసర, మినుము పంటల సాగుకు మక్కువ చూపేవారు. అయితే మూడు నాలుగేళ్లుగా ఇతర పంటలపై మొగ్గు చూపుతున్నారు.దీంతో జిల్లావ్యాప్తంగా కంది పంట విస్తీర్ణం భారీగా పడిపోతూ వస్తోంది. పత్తి సాగుకు ఆసక్తి జిల్లాలో 20 మండలాల్లోని రైతులు ఖరీఫ్(2025) సాగుకు సిద్ధమవుతున్నారు. 5.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా పత్తి, కంది, వరి, పెసర, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగవుతాయి. ఎక్కువగా పత్తి పంటను రైతులు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వానాకాలం జిల్లా వ్యాప్తంగా 2.58 లక్షల ఎకరాలలో ఈ పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. 1.31 లక్షల ఎకరాల్లో వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. 1.14 లక్షల ఎకరాలలో కంది పంట మూడో స్థానానికి పరిమితమవుతోంది. ఈ పంటలకు 42,064 క్వింటాళ్ల విత్తనాలు, సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు సరిపడా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో గతేడాది ఖరీఫ్ ప్రణాళికలో 5.97 లక్షల ఎకరాలలో పంటల సాగుకు అంచనా వేశారు. కానీ ఈసారి మాత్రం 5.63 లక్షల ఎకరాల సాగు ప్రణాళికను రూపొందించారు. దీంతో గతేడాది ఖరీఫ్తో పోల్చితే 34,180 ఎకరాల పంట తగ్గినట్లు కనిపిస్తోంది. కందికి తగ్గుతున్న ఆదరణగతంలో ప్రధాన పంటలుగా పప్పు దినుసుల సాగు ఉండేది. కానీ ఏటా భారీగా పడిపోతూ వస్తోంది. ఐదేళ్ల క్రితం జిల్లాలో కంది పంట విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాల వరకు సాగయ్యేది. తాజాగా వ్యవసాయాధికారులు ప్రణాళికలో 1.14 లక్షల ఎకరాలకు పడిపోయింది. అదే బాటలో మినుము 5,736 ఎకరాలకు చేరింది. పెసర 14,838 ఎకరాల్లో సాగవుతుంది. తాండూరు కంది పప్పునకు అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో ఈ పప్పునకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయినా కర్షకులు మాత్రం కంది సాగుకు అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. విత్తనాల ఎంపికలో జాగ్రత్త జిల్లా వ్యాప్తంగా 5.63 లక్షల ఎకరాలలో ఖరీఫ్ పంటల సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. స్థానికంగా ఏఓలు, ఏఈఓలు అందుబాటులో ఉన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే పంట దిగుబడులు బాగుంటాయి. వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలి. – మోహన్రెడ్డి, వ్యవసాయాధికారి, వికారాబాద్ జిల్లా -
జెడ్పీ..ఖాతా ఖాళీ!
● ఉన్న రూ.2 కోట్ల నిధులుభవన నిర్మాణానికే కేటాయింపు ● వేధిస్తున్న అధికారుల కొరత ● జూనియర్ అసిస్టెంట్లతోనేకొనసాగుతున్న కార్యాలయం ● జిల్లా పరిషత్ సేవలు అస్తవ్యస్తం వికారాబాద్: జిల్లా పరిషత్ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాల్సిన జెడ్పీ నామమాత్రమైంది. ప్రస్తుత గడ్డు పరిస్థితిలో ఖాతాలో ఉన్న నిధును మండల పరిషత్లు, జీపీలకు కేటాయించాల్సిందిపోయి ఇప్పటికిప్పుడు అవసరంలేని జెడ్పీ భవనం కోసం వినియోగించారు. ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల నిధులను భవనానికే కేటాయించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలక మండలి ఉన్న సమ యంలో అవిశ్వాసం నేపథ్యంలో నిధులు ఖర్చు చేయలేదు.ప్రత్యేకాధికారుల పాలన వచ్చాక ఓ నేత సూచన మేరకు నిధులన్నీ బిల్డింగ్ నిర్మాణానికే కేటాయించినట్లు సమాచారం.ప్రస్తుతం జిల్లా పరిషత్లో ఉన్న నిధులకు సంబంధించి గత పాలక మండలి సమయంలోనే పనులు చేపట్టేందుకు ప్రొసిడింగులు ఇవ్వగా పాలకమండలి వీటికి తీర్మానం చే యకపోవడంతో అవన్నీ రద్దయ్యాయి.కానీ వీటిలో చాలా వరకు పనులు పూర్తి కావడం గమనార్హం. పోస్టులన్నీ ఖాళీ ● ఏడాది కాలంగా జిల్లా, మండల పరిషత్లలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● జెడ్పీ ఆఫీస్ మొత్తాన్ని జూనియర్ అసిస్టెంట్లతోనే నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ● ప్రస్తుత సీఈఓ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా మరో నాలుగు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో మండల పరిషత్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. ● జిల్లాలో 20 మండలాలు ఉండగా కొత్త మండలాలకు పోస్టులు మంజూరు కాలేదు. ● జిల్లా, మండల పరిషత్లలో 19 సూపరింటెండెంట్ పోస్టులకు గాను తొమ్మిది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ● ఐదు మండల పరిషత్లలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● జెడ్పీలో రెండు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా వీరిలో ఇద్దరు ఇతర మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు మెడికల్ లీవ్లో ఉండగా మరొకరు చేవెళ్ల ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్నారు. ● నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఇద్దరు వేరే మండలాల్లో విధులు నిర్వహిస్తుండగా ఒకరు మెడికల్ లీవ్లో ఉన్నారు. మరొకరు చేవెళ్ల ఎమ్మెల్యేకు పీఏగా పని చేస్తున్నారు. సీఈఓకు ఏడు బాధ్యతలు కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో జెడ్పీ కార్యాలయానికి సొంత భవనాన్ని కేటాయించలేదు. మండల పరిషత్ కోసం నిర్మించిన భవనంలోనే జెడ్పీ ఆఫీసును ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల క్రితం జెడ్పీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదటి అంత స్తు పూర్తవడంతో మూడు నెలల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ ఆఫీసును ఇక్కడికి తరలించలేదు. జెడ్పీ సీఈఓ కుర్చీ ఏడాది కాలంగా ఖాళీగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత జెడ్పీ సీఈఓకు అదనపు కలెక్టర్గా, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారిగా, వికారాబాద్ మండల స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు ఉన్నాయి. ఇలా ఒకే అధికారి ఏడు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల పరిషత్లు, జీపీలు -
కోనేరులో పూడికతీత
కుల్కచర్ల: మండలంలోని పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో ఉన్న సిద్ధి రామయ్య ఆలయం ఎదుట ఉన్న కోనేరులో గురువారం పూడికతీత పనులు ప్రారంభించారు. కొన్నేళ్లుగా మట్టితో నిండిపోవడంతో పాలకమండలి సభ్యులు కోనేరు పూడికతీతకు నిర్ణయించి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పాంబండ దేవస్థానం ఆలయ ప్రతిష్టను పెంపొందించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డీటీసీ డీఎస్పీగా శ్రీనివాసులు అనంతగిరి: వికారాబాద్లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం డీఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం నిర్వహించిన బదిలీలో భాగంగా బాలనగర్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం డీటీసీ ప్రిన్సిపల్ మురళీధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
సమ్మెను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తాండూరు: కార్మికుల హక్కుల సాధన కోసం నెల 20వ తేదీన చేపడుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. గురువారం కార్మిక సంఘాలు, టీజేఎస్ పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సోమశంకర్లతో కలిసి ఆయన కార్మిక దినోత్సవాన్ని(మే డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.బీఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్మిక జెండాను ఎగుర వేశారు. అనంతరం సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేందుకు సిద్ధమవుతోందన్నారు. వేతన జీవులు శ్రమదోపిడీకి గురవుతోన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రాములు, వనరేష్, బలరాం, నర్సింహులు, వెంకటప్ప, కిష్టప్ప, అంబరప్ప తదితరులు పాల్గొన్నారు. ఎన్సీడీ రిపోర్టు సకాలంలో పంపాలి డీఎంహెచ్ఓ వెంకటరవణ అనంతగిరి: ఎన్సీడీ(అసంక్రమిత వ్యాధులు) రిపోర్టులను సకాలంలో పంపాలని జిల్లా వైద్యాధికారి వెంకటరవణ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం వికారాబాద్లోని వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో వైద్యులు, ఎంఎల్హెచ్పీలు, ఎన్సీడీలు, సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, డీఈఓలకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంక్రమిత వ్యాధుల నివారణ, సర్వే కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలుపర్చడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలన్నారు. గృహ సందర్శన చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి జాబితా పంపాలన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసే, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నిరోషా, ఏఓ డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, సిబ్బంది మహేశ్, రేణుకుమార్, జయరాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కులగణన నిర్ణయంపై హర్షం మర్పల్లి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య పోరాట పటిమతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో కులగణన చేపడుతుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రవికుమార్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఆర్.కృష్ణయ్యకు ఆయన పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేస్తామనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆర్.కృష్ణయ్య దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. శ్రమశక్తి అవార్డు ప్రదానం పహాడీషరీఫ్: జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ఽ అబ్దుల్ రవూఫ్ శ్రమ శక్తి అవార్డును అందుకున్నారు. మే డే సందర్భంగా ప్రభుత్వం తరఫున గురువారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ గిగ్ అండ్ ప్లాట్ఫార్మ్ ప్రొఫెషనల్ అధ్యక్షుడైన రవూఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
నీటి సమస్య రానీయొద్దు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● అధికారులతో సమీక్ష సమావేశం అనంతగిరి: గ్రామాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులు, రాజీవ్ యువ వికాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పింఛన్లు తదితర సమస్యలపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బోర్లు, పైపు లైన్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే పలు అంశాలపై కల్టెకర్ మాట్లాడి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి, డీఆర్డిఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, హౌసింగ్ ఈఈ కృష్ణయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్, డీఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, ఇన్చార్జి డీఎస్సీడీఓ సత్తార్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, పంచాయతీ రాజ్ ఈఈలు ఉమేష్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా నీట్ పరీక్షలు నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో నీట్–2025 పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరిగే నీట్ పరీక్షకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదు కేంద్రాల్లో 1,193 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో మాత్రమే తీసుకురావాలన్నారు. అభ్యర్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు సూచించారు. నీట్ పరీక్షకు సాయిలత, కుమారస్వామిలని కోఆర్డినేటర్లుగా నియమించారు. మరింత సమాచారం కోసం 08416 235291 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఈఓ రేణుకాదేవి, ఆర్డిఓ వాసుచంద్ర, సూపరింటెండెంట్ నైమత్ అలీ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ భీమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొహెడలో భూ వివాదం
హయత్నగర్: ఓ భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ సర్వే నంబర్ 951, 952లోని సుమారు ఏడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కంగుల రాములు, పోచయ్యతో పాటు మరికొంత మంది నుంచి కంగుల గండయ్య, ఈదయ్య జీపీఏ చేసుకున్నారు. అనంతరం 1970లో ఈస్థలంలో 170 ప్లాట్లు చేసి విక్రయించారు. అయితే ఈ జీపీఏ చెల్లదంటూ కంగుల కుటుంబానికి చెందిన పలువురు వారసులు, ఇదే భూమిని 2013లో బ్రాహ్మణపల్లికి చెందిన సంరెడ్డి బాల్రెడ్డికి విక్రయించారు. ఆయన కొంత విస్తీర్ణంలో ఫాంహౌస్తో పాటు చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ప్లాట్ల యజమానులు, బాల్రెడ్డికి మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించగా 28 మార్చి 2025న జిల్లా న్యాయస్థానం వీరికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో లే అవుట్ రోడ్లను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించారనే కారణంతో రెండు నెలల క్రితం హైడ్రా అధికారులు ఫాంహౌస్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చేశారు. దీన్ని సవాలు చేస్తూ బాల్రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో హైడ్రా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఇందులో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా కొంతమంది ప్లాట్ల ఓనర్లు గురువారం తమ స్థలాలను చదను చేసుకునేందుకు జేసీబీ తీసుకుని వెళ్లారు. ఇది గమనించిన బాల్రెడ్డి, అతని అనుచరులు దిలీప్రెడ్డి, శీలం శ్రీను తదితరులు ప్లాట్ల యజమానులైన సత్యనారాయణరెడ్డి, పండుగల వెంకటేశ్, నవీన్రెడ్డి, బద్రి అశోక్, రఘు వెంకట్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. బాల్రెడ్డి వర్గం వారు రాళ్లు, కర్రలు, గడ్డి కత్తిరించే కత్తితో దాడి చేయడంతో సత్యనారాయణరెడ్డి, నవీన్, వెంకటేశ్కు గాయాలయ్యాయి. వీరి ప్రతిఘటనతో బాల్రెడ్డికి సైతం గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలు కేసు నమోదు చేసిన పోలీసులు -
ఎన్నికల హామీ మేరకే చిలుక వాగు ప్రక్షాళన
తాండూరు: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కృషి వల్లే చిలుక వాగు ప్రక్షాళన పనులు వేగంగా జరుగుతున్నాయని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హబీబ్లాల పేర్కొన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిఽధిలోని 9 వార్డు సాయిపూర్ ప్రాంతంలో రూ.16 కోట్లతో చేపట్టిన చిలుక వాగు అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా చిలుక వాగు కబ్జాకు గురైందన్నారు. గతంలో ఎంతో మంది నేతలు చిలుక వాగు అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అని పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలో సాయిపూర్, గ్రీన్ సిటీ ప్రాంతాలు నీటి ముంపునకు గురి కాకుండా చిలుక వాగులోనే వరద ప్రవహిస్తోందన్నారు. వీరితో పాటు నాయకులు బంటు వేణుగోపాల్, బంటు మల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి -
ఆదాచేస్తేనే ‘గృహజ్యోతి’
మహేశ్వరం: ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఏసీల వాడకం పెరుగుతోంది. ఫలితంగా విద్యుత్ వినియోగం ౖపైపెకి ఎగబాకుతోంది. ఈ తరుణంలో నెలవారీ యూనిట్లు 200 దాటితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం వర్తించదు. జీరో బిల్లు రావాలంటే కరెంట్ను పొదుపుగా వాడటం అనివార్యం. వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది. మహేశ్వరం మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో 29,544 మంది గృహ విద్యుత్ వినియోగదారులు, వీరిలో 10,722 మంది గృహజ్యోతి పథకానికి అర్హులు ఉన్నారు. గత మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.43,11,000 సబ్సిడీ విడుదలైంది. వీరంతా 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగిస్తూ జీరో బిల్లుతో లబ్ధిపొందారు. ఇవి పాటించాలి ● మార్కెట్లో 5స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే వినియోగించాలి. ● ఇంట్లో టీవీ అవసరం లేకపోతే రియోట్తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి. ● చార్జింగ్ పూర్తయ్యాక ఫోన్ను ఫ్లగ్ నుంచి తొలగించాలి. ● అవసరమైతేనే ఫ్యాన్లు, కూలర్లు వేయాలి. ● రిఫ్రిజిరేటర్లో కాలానుగుణంగా ఫ్రీజర్ లెవల్స్ను మార్చుకోవాలి. ● ఏసీల ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తూ, టైమర్ను సెట్ చేసుకోవాలి. ● వాషింగ్మెషీన్లో లోడ్కు తగిన దుస్తులు మాత్రమే వేయాలి. ● నాణ్యమైన ఎల్ఈడీ బల్బులు వాడాలి. ● అవసరం ఉన్న గదుల్లో, అవసరమైనంత సేపే లైట్లు వేసుకోవాలి. ● ఫ్రిజ్ డోర్ను పదేపదే తీయకూడదు. సాధ్యమైనంత త్వరగా మనకు అవసరమైన వస్తువును తీసుకుని వెంటనే డోర్ మూసేయాలి. ఎండల నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ వాడకం 200 యూనిట్లు దాటితే జీరో బిల్లు లేనట్లే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చేతికందనున్న పథకం పొదుపుగా వాడాలి వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. బల్బులు, ఫ్యాన్లు, కూలర్లు, ఎసీలు, ఫ్రిజ్లు, ఐరన్ బాక్సులు వంటివి అవసరానికి మించి ఉపయోగించొద్దు. ఐఎస్ఐ మార్కు ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తేనే గృహజ్యోతి వర్తిస్తుంది. – చక్రపాణి, విద్యుత్ ఏఈ -
ప్రభుత్వ హామీలపై నిలదీస్తాం
మీర్పేట: ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన 83 మంది లబ్ధిదారులకు గురువారం చెక్కులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చడంతో పాటు చెక్కులు తీసుకున్న వారందరికీ తులం బంగారం కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు మహిళలకు నెలకు రూ.2,500 ఎక్కడా ఇవ్వలేదని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులని చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, త్వరలోనే మీర్పేట, జిల్లెలగూడలో ఇంటింటికీ వెళ్లి ఎవరు కోటీశ్వరులు అయ్యారో తెలుసుకుంటానని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పథకాన్ని మహిళలను దృష్టిలో పెట్టుకుని అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, కమిషనర్ జ్ఞానేశ్వర్, డీటీ మణిపాల్రెడ్డి, స్థానిక నాయకులు అర్కల భూపాల్రెడ్డి, అనిల్యాదవ్, బొక్క రాజేందర్రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, అర్కల కామేష్రెడ్డి, భూపేష్గౌడ్, మాదరి రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి -
ఆయన మార్గం అనుసరణీయం
కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: సమాజంలో కుల, లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మ బసవేశ్వరుడని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం బసవేశ్వర జయంతి సందర్భంగా కలెక్టరేట్లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. తన బోధనలతో సమాజాన్ని మూఢాచారాల నుంచి కాపాడారని కొనియాడారు. సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీఎస్ హెచ్ఓ సత్తార్, ఎస్సీ డెవెలప్మెంట్ జిల్లా అధికారి మల్లేశం, డీవైఎస్ఓ హన్మంతరావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మొదటి గురువు బసవేశ్వరుడు
శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్అనంతగిరి: కుల, మత రహిత సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నా రు. బుధవారం మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఎన్నెపల్లిలోని జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థల్లో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. సమాజం పట్ల అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అన్నా రు. ఆయన ఇచ్చిన శాంతి సందేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బస్వరాజు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, కాంగ్రె స్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోశ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రె డ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, వీరశైవ సమాజం ప్రతినిధులు శివరాజు, ఆత్మలింగం, వీరన్న, విజయ్కుమార్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, షరీఫ్, వెంకట్రెడ్డి తదితరుల పాల్గొన్నారు. వికారాబాద్లో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
ఔత్సాహికులను ప్రోత్సహించాలి
అనంతగిరి: వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో నూతన ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, నూతన పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, మత్స్య సంఘాలు, డెయిరీ ఫాంలు, గోదాములు, ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా సహకార అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. రైతుల అవసరాలకు అనుగుణంగా అదనంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కొత్త పెట్రోల్ పంపులు, ఇప్పటికే ఉన్న పెట్రోల్ పంపుల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. జన ఔషధి కేంద్రాలు, కిసాన్ సమృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకార్ సమితి లిమిటెడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగార్జున, నాబార్డ్ డీడీఎం అఖిల్, జిల్లా సెంట్రల్ బ్యాంక్ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సదానందం, వ్యవసాయ అధికారి పద్మావతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
● ఉత్తీర్ణత శాతం పెరిగినా ఆఖరు స్థానానికే పరిమితం ● ఎప్పటి మాదిరిగా బాలికలదే పైచేయి ● 580 మార్కులతో సత్తా చాటిన నవాబుపేట గురుకుల విద్యార్థి
ఫలితాలు నిరాశపరిచాయి జిల్లా ర్యాంకు చివరన ఉన్నప్పటికీ ఫలితాల పరంగా చూస్తే గతేడాది కంటే మెరుగయ్యాం. తాము ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ఉపాధ్యాయులు కష్టపడినప్పటికీ ఫలితాలు నిరాశ పరిచాయి. ఈ ఫలితాలను బేరీజు వేసుకుని సప్లిమెంటరీలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. ఏయే సబ్జెక్టులలో, ఏయే పాఠశాలల్లో తక్కువ ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నాం. ఉత్తీర్ణులైన వారందరికీ అభినందనలు. – జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి సంతోషంగా ఉంది పదో తరగతి ఫలితాల్లో అధిక మార్కులు సాధించడం సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలు, సూచనలతో చదువుకున్నాను. మాది నిరుపేద కుంటుంబం కావడంతో అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు భవిష్యత్లో మరింత రాణించేందుకు కృషి చేస్తాను. – కార్తీక్, నవాబుపేట గురుకుల పాఠశాల -
కార్మికులకు భద్రత ఏదీ..?
● సంక్షేమాన్ని మరిచిన యాజమాన్యాలు ● హక్కుల కల్పనలో ప్రభుత్వాలు విఫలం ● ఎన్నికల హమీకే పరిమితమైన ఈఎస్ఐ ఆస్పత్రి తాండూరు: ప్రభుత్వాలు మారుతున్నా.. శ్రమ జీవుల జీవన విధానంలో మార్పులేదు. కష్టాలు వీడడం లేదు. బతుకుబండి సాఫీగా సాగడం లేదు. కుటుంబ జీవన స్థితిగతులు వారిని మరింత కష్టాల కడలిలోకి నెట్టివేస్తున్నాయి. వేతనం గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ మార్గాలు లేక కార్మిక వృత్తినే కొనసాగిస్తూ కష్టాల కడలిని ఈదుతున్నారు. 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో కార్మికుల వీరమరణంతో కార్మిక దినోత్సవానికి ఊపిరి పోసింది. నాటి నుంచి ప్రతి ఏటా మేడేను జరుపుకొంటున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా శ్రమ జీవుల హక్కుల కల్పనలో మాత్రం ప్రభుత్వాలు విఫలం చెందుతూనే ఉన్నాయి. కార్మికులు సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కేంద్ర సహకారం లేక జాప్యం జిల్లాలో భూగర్భ నిక్షేపాలు పుష్కలం. దీంతో కార్మికులకు నాపరాయి, ఎర్రమట్టి, సుద్ద వనురుల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, తాండూరు మండలాల్లో 300 వరకు నాపరాతి గనులు, 500 వరకు నాపరాతి షాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సుమారు రూ.600 కోట్ల వరకు వ్యాపారం సాగుతోంది. ఇక్కడ పనిచేసే కార్మికులు ప్రమాదాల బారిన పడినా వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నప్పటికీ తాండూరు ప్రాంతంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటులో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో తాండూరు పాత మున్సిపల్ భవనంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు యత్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో జాప్యం చేసుకొంటోంది. కూలీలుగా పరిగనిస్తున్న యాజమాన్యాలు తాండూరు నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమలపై ఆధారాపడి 40 వేల మంది వరకు కార్మికులు నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లలో పని చేస్తున్నారు. దీంతో పాటు సీసీఐ, ఐసీఎల్, పెన్నా సిమెంట్ కార్మగారాల్లో వేల మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారికి కార్మికులకు అందే ఫలాలు అందడం లేదు. గనులు, నాపరాతి పాలిషింగ్ యూనిట్లలో పని చేసే కార్మికులను రోజు వారి కూలీలుగా పరిగనించడంపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు అందాల్సిన ఫలాలు ● కార్మిక సంక్షేమ నిధి చట్టం ద్వారా ప్రతీ సంస్థ యజమాని కార్మికుడి తరపున ఏడాదికి యజమాని వాటా కింద రూ.70, కార్మికుడి వాటా కింద రూ.30 వార్షిక చందా సంక్షేమ నిధికి చెల్లించాలి. ● వివాహ కానుకగా కార్మికుడి కూమార్తెకు, కార్మికురాలి వివాహం సందర్భంగా రూ.20 వేలను మూడేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందిస్తారు. ● విద్యా ప్రోత్సాహకం, ప్రతిభ ఆధారంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.5 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.10 వేల వరకు అందిస్తోంది. ● ఆదర్శ కుటుంబం కింద కార్మికుడు లేదా కార్మికుడి భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే రూ.5 వేలు. ● కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ.10 వేలు. ● ప్రమాదం బారిన పడి అంగవైకల్యం పొందిన కార్మికుడికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం. ● కార్మికుడి వైద్యసాయం కోసం ధీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలకు రూ.50 వేల ఆర్థికసాయం. -
మళ్లీ మనమే లాస్ట్
పది ఫలితాల్లో జిల్లాకు 33వ స్థానం వికారాబాద్: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా మళ్లీ చివరి స్థానానికే పరిమితమైంది. గతేడాది సైతం ఇదే స్థానంలో నిలిచి 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 73.97 శాతంతో మెరుగైన ఫలితాలు సాధించారు. మూడేళ్ల క్రితం వరకు 24వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాదితో వరుసగా మూడో సారి అట్టడుగు స్థానానికి పడిపోయింది. అధికారులు మౌలిక సదుపాయాలంటూ పాఠశాలల చుట్టూ తిరిగుతూ విద్యార్థుల సామర్థ్యాలపై దృష్టి సారించడంలో విఫలమయ్యారనే అపవాదు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో మొదటి స్థానం సాధించిన జిల్లా మహబూబాబాద్ 99.29 శాతం ఫలితాలు సాధించగా జిల్లా 26 శాతం వెనకబడి ఉంది. రాష్ట్ర సగటు 92 శాతం ఉండగా దానికన్నా 19 శాతం వెనకబడి ఉన్నాం. 32 వ స్థానంలో నిలిచిన అసిఫాబాద్ జిల్లా కంటే కూడా మనం 14 స్థానాలు వెనకబడి ఉండటం గమనార్హం. గతేడాది వరకు జీపీఏ రూపంలో ఫలితాలు ఇవ్వగా ఈ ఏడాది పాత పద్ధతిలో విద్యాశాఖ మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడించింది. నవాబుపేట మండలానికి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థి కార్తీక్ 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి సత్తా చాటాడు. 73.97 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 20 మండలాల నుంచి వార్షిక పరీక్షలకు 12,846 మంది విద్యార్థులు హాజరవగా.. 9,502 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో మొత్తం ఈ ఏడాది పరీక్షలకు హాజరైన వారిలో 3,344 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 73.97 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 78.14 శాతంతో బాలికలు మొదటి స్థానంలో నిలవగా 69.77 శాతంతో బాలురు అట్టడుగున నిలిచారు. రెండేళ్ల క్రితం పేపర్ లీకేజీ కారణంగా పోలీసులు, ఆయా శాఖల అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కొన్ని చోట్ల పోలీసులే విద్యార్థులను చెక్ చేశారు. రెండేళ్లుగా విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్ష లు రాయలేకపోవటం ఫలితాలపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
● కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు తప్పనిసరి ● కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి వరి కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ అంశాలపై జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కావలసిన తాడిపత్రిలు, సంచులు, తేమ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వర్తించని వారిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రైస్ మిల్లర్ల వద్ద బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఎలాంటి లోపభూయిష్టం లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలని చెప్పారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్, వ్యవసాయ శాఖ ఏడీఏ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు అధికారుల ఉద్యోగ విరమణనిజాయతీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన ప్రభుత్వ ఉద్యోగులకు జీవితంలో ఎంతో సంతృప్తిని ఇస్తుందని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం ఉద్యోగవిరమణ పొందుతున్న షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, యువజన క్రీడల అధికారి హనుమంతరావు, యలాల తహసీల్దార్ అంజయ్యను కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం ఆత్మీయ సన్మానం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రజా సేవ చేసే అదృష్టం వస్తుందని.. నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు అందుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో మీసేవలను తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్, డీఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. -
మహనీయుల ఆశయాలకు కృషి
జనజాతర సభలో ప్రొ. రవీందర్ తాండూరు టౌన్: మనువాదంపై మహోద్యమం చేపట్టాలని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే, అంబేడ్కర్ జన జాతర సభకు ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తుది శ్వాస వరకు మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. నేటి కాలంలో మహనీయులను ఒక కులానికి మాత్రమే పరిమితం చేయడం ద్వారా వారిని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. మనుస్మృతి శూద్రులకు విద్యను నిషేధిస్తే, పూలే దంపతులు అందరికీ విద్యనందించారన్నారు. పురుష, మహిళ అనే భేదం లేకుండా సమానత్వం కోసం నాటి అనాగరిక సమాజాన్ని చైతన్య పరిచారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కేవలం భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కొలుస్తూ, ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తీరుతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు కాసుల వర్షం కురిపించేందుకు కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తెస్తోందన్నారు. నేటి యువతకు పూలే, అంబేడ్కర్ ఆశశయాలను చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కన్న, ఉపాధ్యక్షుడు మహిపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు బుగ్గప్ప, ఆనంద్, సురేష్, రాజు, గోపాల్, చంద్రయ్య, శ్రీనివాస్, బలరాం, రఘుపతి, రవి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్తో పేదలకు మేలు
పరిగి: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన పలువురి లబ్ధిదారులకు బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్తో ఎంతో మంది నిరుపేదలకు మేలు జరుగుతుందన్నారు. అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కృషితో ప్రజలకు సంక్షేమాలను సక్రమంగా అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు వెంకట్, సురేష్, చందర్రెడ్డి, వీరారెడ్డి, శేశిరెడ్డి, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
సుదీర్ఘ సేవలు అభినందనీయం
అనంతగిరి: విధి నిర్వహణలో మనం ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ మహిళ పీఎస్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఎండీ హాషంకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. 41 ఏళ్ల పాటు విధులు చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఏఓ జ్యోతిర్మణి, ఉమెన్స్ పీఎస్ సీఐ శివచంద్ర, ఆర్ఐలు, జిల్లా పోలీసు ప్రెసిడెంట్ అశోక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.