breaking news
YSR
-
● నేతన్నకు దక్కని భరోసా
జిల్లాలోని చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ఏడాదికి రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని నేతన్న భరోసా కింద అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది ఆగస్టు 7న గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుతోపాటు ఆర్థికసాయం చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సహాయం నిలిచిపోయింది. ప్రభుత్వ తీరు కారణంగా తమ జీవనం కష్టతరంగా మారిందని పలువురు నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అప్పులు చేస్తున్నా.. అమలుకాని హామీలు
చింతకొమ్మదిన్నె : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి మంగళవారం అప్పులు చేయడం సర్వసాధారణంగా మారిందని, ఇప్పటికీ రెండు లక్షల 15 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినా ఆ మేరకు రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు జాడ లేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. బుధవారం చింతకొమ్మదిన్నె మండలం కడప నగరం 18వ డివిజన్ బయనపల్లెలో జరిగిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కూడా అప్పులు చేసినప్పటికీ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసమే నిధులు ఖర్చు పెట్టారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులు, ఆస్తులను అమ్మకానికి పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ముఖ్యంగా యువతకు, మహిళలకు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అమలు చేయకుండా కేవలం భ్రమలు కల్పించే చంద్రబాబు స్వార్థ ఆలోచనలతోనే కుటిల పరిపాలన చేస్తున్నారన్నారు. మొదటి ఏడాది పరిపాలనలో ఎలాంటి సంక్షేమ హామీలు అమలు చేయకుండా, రెండవ సంవత్సరంలో రైతులకు సంబంధించి హామీ మేరకు 20వేల రూపాయలు ఇవ్వకుండా అరకొరగానే హామీలు అమలు చేశారన్నారు. మహిళలకు సంబంధించి ఆరు ఉచిత సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి, రెండు మాత్రమే ఇచ్చారని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా నైపుణ్య శిక్షణ తీసుకోండని ఉచిత సలహాలతో మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు నెల నెలా 1500 చొప్పున సంవత్సరానికి 18000 అందిస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత 100 సంవత్సరాల కాలంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తీసుకొని వచ్చి 50 నుంచి 100 ఎకరాల వరకు భూములు కేటాయించి అవసరమైన చోట ప్రైవేటు వారి నుంచి సేకరించి నిర్మాణాలు సాగించారన్నారు. కొన్ని పూర్తయి అడ్మిషన్ దశకు చేరుకోగా మరికొన్ని చివరి స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇలాంటి దశలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మెడికల్ అడ్మిషన్లు వద్దని నిర్వహించలేమని చేతులెత్తేయడం, పేద విద్యార్థులు వైద్యులయ్యే అవకాశాన్ని దెబ్బతీశారన్నారు. 17 మెడికల్ కళాశాలలను ఆర్థిక కారణాలు సాకుగా చూపి ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, 47 వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల అవసరాలను ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో కడప నగర వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు దీప్తి, వైఎస్సార్సీపీ చింతకొమ్మదిన్నె మండల కన్వీనర్ గూడా ప్రభాకరరెడ్డి, సుధాకరరెడ్డి, కమలకూరి, శ్రీనివాసరెడ్డి, కళాయాదవ్, సురేంద్రారెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
పరిమళించిన ఆధ్యాత్మిక గంధం
గంధంలో పాల్గొన్న పీఠాధిపతి ఆరిఫుల్లాహ్ హుసైని, సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మదనపల్లె వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నిసార్ అహ్మద్, తదితరులు కడప సెవెన్రోడ్స్: ఆధ్యాత్మిక సుగంధం పరిమళించింది....అందరి మనసుల నిండా భక్తిభావం ఉట్టిపడింది....ఆ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. హజరత్ సూఫీ సర్ మస్తాని చిల్లాకష్ ఖ్వాజా సయ్యద్షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తన నివాసం నుంచి అలంకరించిన గంధం కలశంతో ఫకీర్ల మేళతాళాలు, సాహస విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గాలోని గురువుల మజార్ వద్దకు తరలి వెళ్లారు. గంధం సమర్పించి ఫాతెహా నిర్వహించారు. గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముషాయిరా హాలులో దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంస్థల వార్షిక నివేదికతోపాటు అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు విశేషాలను, విజయాలను నిర్వాహకులు పీఠాధిపతికి సమర్పించారు. అనంతరం దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో నిర్వహించిన పలు పో టీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. దీక్షలో మలంగ్షా ఈ సందర్భంగా మలంగ్షాను పీఠాధిపతి దీక్ష వహింపజేశారు. దర్గా నుంచి కడప నగరంలోని పలు ముఖ్య కూడళ్ల మీదుగా వెళ్లిన మలంగ్షా, అనుచర బృందం నాగరాజుపేటలోని బాదుల్లాసాహెబ్ మకాన్కు చేరింది. మకాన్ నిర్వాహకులు, స్థానిక భక్తులు వారిని ఘనంగా స్వాగతించారు. సాయంత్రం ఆ బృందం ఊరేగింపుగా తిరిగి దర్గాకు చేరుకుంది. రాత్రి మలంగ్షా దర్గా ఆవరణంలోని పీర్లచావిడిలో దీక్ష వహించారు. దర్గా పీఠాధిపతి స్వయంగా వెళ్లి ఆయనకు సంప్రదాయబద్ధంగా దీక్ష వహింపజేశారు. కడప కార్పొరేషన్: పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా ప్రతినిధులు అలీఖాన్, అమీర్ కోరారు. బుధవారం పెద్ద దర్గా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్ద దర్గా ఉరుసు ప్రాశస్త్యాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి 10వ తేది వరకూ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. మానవత్వమే సర్వమత సారాంశమని, లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాల నిర్వహిస్తున్నామన్నారు.ఆధ్యాత్మిక అభివృద్ధి, సూఫీ తత్వాన్ని, శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పేందుకు జరిగే ఈ ఉత్సవాలను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. కడప కార్పొరేషన్: పెద్ద దర్గా ఉరుసుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన పెద్ద దర్గాను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమీన్ పీర్ దర్గా ఉత్సవాలకు 400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, 200 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని వెల్లడించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, నేరాలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్సీ ఎన్. సుధాకర్, కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, పలువురు సీఐలు ఉన్నారు. ఫకీర్ల మేళతాళాల మధ్య దర్గాకు చేరుకున్న పీఠాధిపతి గురువు మజార్ వద్ద గంధం సమర్పణ దీక్ష చేపట్టిన మలంగ్షా జనసంద్రంగా దర్గా ప్రాంగణం మానవత్వమే సర్వమత సారాంశం పెద్ద దర్గా ప్రతినిధులు అలీఖాన్, అమీర్ -
పరీక్ష వాయిదా వేయాలి
కడప ఎడ్యుకేషన్: నవంబర్ 14వ తేదీ నిర్వహించనున్న సమ్మెటివ్–1 పరీక్షలను వాయిదా వేయాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలను నవంబర్ 10 నుంచి 19 వరకు నిర్వహించాలని విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. నవంబర్ 14న ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉందన్నారు. ఆ రోజు బాలల దినోత్సవమని.. ఆ పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖను కోరారు. కడప అగ్రికల్చర్: గ్రామీణ ప్రాంత రైతుల అభివృద్ధే లక్ష్యంగా జిల్లాలో రెండు సొసైటీలను కొత్తగా రిజిస్టర్ చేశామని జిల్లా సహకారశాఖ అధికారి వెంకటసుబ్బయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ గోపీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కడపలోని జిల్లా సహకార కేంద్రంలో చదిపిరాళ్లకు సొసైటికి సంబంధించిన రిజిస్టర్ కాపీని వారికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ జిల్లాలోని ఖాజీపేట మండలం చెముళ్లపల్లె సొసైటీ, కమలాపురం మండలం చదిపిరాళ్ల సొసైటిలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేశామన్నారు. ఈ రెండు సొసైటీలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో బుధవారం నిర్వహించిన అథ్లెటిక్స్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఎస్జీఎఫ్ క్రీడల్లో భాగంగా అండర్–14 బాల బాలికలకు అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలకు దాదాపు 100 మందికి పైగా క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీలు చంద్రావతి, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ పీఈటీ అసోసియేషన్ ట్రెజరర్ శివకృష్ణ, నాగేశ్వరావు, కోచ్లు మహేశ్వర్ రెడ్డి, రాయుడు, నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి కాశినాయన : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని డీఈఓ షంషుద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని వరికుంట్ల, గొంటువారిపల్లె, నరసాపురం గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. నరసాపురం, గొంటువారిపల్లెలో నిర్మిస్తున్న స్కూల్ బిల్డింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘ఫౌండేషన్ డే‘ను విజయవంతం చేద్దాం కడప ఎడ్యుకేషన్: ఈ నెల 7వ తేదీన జరగనున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి జిల్లాలోని ప్రతి ఒక్క యూనిట్ లీడర్ తమ యూనిట్ సభ్యులతో కడప శంకరాపురంలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. త్వరలో జరిగే రాజ్య పురస్కార్, తృతీయ సోపాన క్యాంపునకు సంబంధించిన అప్లికేషన్లను అందజేయాలని తెలిపారు. -
శివోహం.. జ్యోతిర్మయం
ప్రొద్దుటూరు.. కోటి దీపోత్సవంలో భక్తులుచాపాడు.. అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి ఊరేగింపు● భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పూజలు ● భక్తులతో కళకళలాడిన శైవ క్షేత్రాలు ● మార్మోగిన శివనామస్మరణకార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కళకళలాడాయి. తెల్లారుజామున నుంచి ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. భక్తులు కుటుంబాలతో పెద్ద ఎత్తున హాజరై కార్తిక దీపాలను వెలిగించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు దీపాలు పెట్టేందుకు ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు శైవ క్షేత్రాల్లో జ్వాలా తోరణం వెలిగించారు. –కడప సెవెన్రోడ్స్ కడప నగరంలోని మోచంపేట శివాలయంలో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తున్న భక్తులుజ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులు -
నిరాహార దీక్ష భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే కుట్ర
ప్రొద్దుటూరు : ప్రజాధనమైన ఎగ్జిబిషన్ బకాయిలు సుమారు రూ.కోటి వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన వెంట వైఎస్సార్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజాపీర్, మున్సిపల్ కౌన్సిలర్లు లావణ్య, ఆరు ణ, జయంతి, సత్యంతోపాటు ప్రొద్దుటూరు కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్సీపీ నాయకులు కమ్మక్క, మేరి, మాజీ కౌన్సిలర్ రమ ణమ్మ దీక్షలో పాల్గొన్నారు. వీరికి స్వర్ణకారుల సంఘం నాయకుడు ఉప్పర మురళి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిరెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, టంగుటూ రు విశ్వనాథరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్లు ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సి లర్లు వరికూటి ఓబుళరెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ యెల్లాల కుమార్రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిట్టా భద్రమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రశాంతంగా మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుట్రపన్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఈసందర్భంగా తెలిపారు. ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని రాచమల్లు తెలి పారు. జూదం నిర్వహిస్తున్నాడని దొరసానిపల్లె సర్పంచ్ భర్త మునివరపై ప్రకటన చేయగా ఆయన తన కుటుంబ సభ్యులను దీక్షా శిబిరం వద్దకు పంపారన్నారు. ఏదో ఒకటి వారు ఇక్కడ మాట్లాడితే ఘర్షణ పడి దీక్షా శిబిరాన్ని ఎత్తివేస్తారనే ఆలోచనతోనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఈ విధంగా వ్యూహ రచన చేశారన్నారు. అనంతరం రాచమల్లు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని, ఆ సమయంలో వారు ఎగ్జిబిషన్ బకాయిలు సక్రమంగా చెల్లించలేదన్నారు. 2019 – 2024 వరకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు ఎగ్జిబిషన్లోకి ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. ఉచిత ప్రవేశం కల్పించినప్పుడు జీఎస్టీ వర్తించదని తెలిపారు. అది తెలుసుకోకుండా తమ పార్టీ నాయకులు పాతకోట బలరామిరెడ్డి బకాయిలు చెల్లించాలని మాట్లాడటం సరికాదన్నారు. గత ఏడాది మీ పార్టీ కార్యకర్త బకాయి చెల్లించలేదని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఒత్తిడి చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు తాము ఈ దీక్ష చేపడుతున్నానన్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల నుంచి రెండింతలు ప్రవేశ రుసుం వసూలు చేశారని తెలిపారు. ఎవరి అండ చూసుకుని మున్సిపాలిటీకి బకా యి చెల్లించలేదన్నారు. అంతకుముందు ఎంపీపీ శేఖర్యాదవ్, మార్తల ఓబుళరెడ్డి కొబ్బరి బోండం నీళ్లు ఇచ్చి రాచమల్లుతో రిలే దీక్షను విరమింపజేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
● రూ. 6,28,000 నగదు, 8 సెల్ ఫోన్లు, 4 బ్యాంకు పాసుపుస్తకాలు స్వాధీనం ● నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు ● బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలేదిలేదు ● జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ వెల్లడి కడప అర్బన్ : ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ఆన్లైన్ ట్రేడింగ్ కోసం తమకు కరెంట్ అకౌంట్లు కావాలని చెప్పి ఈనెల 3 వ తేదీన చాపాడు మండలం, చిన్నగురవలూరు గ్రామానికి చెందిన పెదమల్ల జగన్ అనే వ్యక్తి ద్వారా వివిధ బ్యాంకులలో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించారన్నారు. అవి ఫ్రీజ్ కాగా మరిన్ని అకౌంట్లు కావాలని వారు అడుగగా అందుకు జగన్ సహకరించలేదన్నారు. దీంతో వారు అతనిపై దాడి చేశారన్నారు. బాధితుడు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. విచారణలో బెంగళూరులో పీజీ నడుపుతున్న నిందితులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన వీర శంకర్, చంద్ర అనే వ్యక్తులు రాయల్బుక్..365.కామ్ అనే వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ లావా దేవీల కోసం బ్యాంక్ అకౌంట్లు అవసరం కావడంతో వారు చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవి తేజ అనే వారిని సంప్రదించి వారి ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించుకున్నారని తెలిపారు. వారికి కమీషన్లు ఇస్తూ వారి ద్వారా విస్తృతంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో వీరంతా కలిసి మొత్తం 16 బ్యాంక్ అకౌంట్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్కు చెందిన అక్రమ లావాదేవీలు చేసినట్లు తేలిందన్నారు. దీంతో ఆయా బ్యాంకుల వారిని అకౌంట్ల లావాదేవీలను పొందుపరచమని కోరామన్నారు. ప్రస్తుతానికి బ్యాంకుల ద్వారా తెలిసిన సమాచారం మేరకు బెట్టింగ్కు సంబంధించి రూ. 8.7 లక్షలు ఫ్రీజ్ అయ్యాయన్నారు. ఇలా అనుమానాస్పద లావాదేవీలు జరిపిన అన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేయమని ఆయా బ్యాంకులను కోరినట్లు తెలిపారు. ఈ ముఠా గురించి కచ్చితమైన సమాచారం అందడంతో ఆరుగురు నిందితులను ప్రొద్దుటూరులో అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, అక్రమ లావాదేవీలకు వాడిన 4 బ్యాంకు పాస్ బుక్కులు, ఇటీవల జరిగిన ఇండియా–ఆస్ట్రేలియా, మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా నిర్వహించిన బెట్టింగ్ మొత్తం రూ 6.28 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు. వీరిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన ప్రొద్దుటూరు డీఎస్పీ పి. భావన, 2 టౌన్ సీఐ సదా శివయ్య, రూరల్ ఇన్స్పెక్టర్ నాగ భూషణం, ఎస్ఐలు ధనుంజయుడు, ఓ. రాఘవేంద్ర రెడ్డి, సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులను అందజేస్తామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వీర శంకర్, చంద్ర పరారీలో ఉన్నారని వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, ఎస్బీ డీఎస్పీ ఎన్.సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు సదాశివయ్య, నాగభూషణం, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
చేనేతలకు ప్రోత్సాహం లేదు
చేనేత కార్మికులు చాలీచాలని ఆదాయంతో జీవనం వెళ్లదీస్తున్నారు. సరిగ్గా పనులు దొరకడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందకపోవడంతో జీవనం గగనంగా మారింది. కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు అండగా నిలబడాలి. అప్పుడే కోలుకోగలం. – వెంకట రమణ, వేపరాల, మైలవరం మండలం ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత వర్గాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన విషయాన్ని గుర్తించాలి. పెట్టుబడి సాయంతోపాటు విద్యుత్ రాయితీ సత్వరమే అందేలా చూడాలి. పెట్టుబడులు సైతం చేతికి అందడం లేదు. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం చేనేత వస్త్రాలకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలి. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ తోడ్పాటు అందకపోతే చేనేత వర్గాలు తమ కుల వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – గోరెంట్ల శివ, మోరగుడి -
ఘనంగా కొండయ్యస్వామి జన్మదిన వేడుకలు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయపల్లెలో బుధవారం అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఊసయ్యగారి ఆశ్రమంలో ఉదయం కొండయ్యస్వామి భక్తులు, శిష్య బృందం సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని, 500 కిలోల నాలుగు భారీ కేక్లను వేదికపై ఉన్న కొండయ్యస్వామి కట్ చేసి అందరికి పంపిణీ చేశారు. అవధూత కొండయ్య స్వామిని దర్శించుకునేందుకు పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, శిఉ్యలు తరలి వచ్చారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ చిరంజీవి తమ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం, చెక్క భజన ఆకట్టుకున్నాయి. రాత్రి టీవీ కళాకారులతో నిర్వహించిన జబర్దస్త్ కార్యక్రమం అలరించింది. ఆశ్రమం ఆవరణలో పౌరాణిక నాటకాల ప్రదర్శన నిర్వహించారు. కాగా గురువారం ఉదయం వృషభరాజములకు రాష్ట్రస్థాయి ప్రత్యేక బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
నిరుద్యోగ ఎస్సీ యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
– ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి కడప సెవెన్రోడ్స్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని సభా భవన్లో నిర్వహించిన యువ పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్, అనిత దీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న రాయితీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూసే యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించి పరిశ్రమల స్థాపన, వ్యాపార రంగాలలో రాణించగలిగితే మరి కొంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలరన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా మాట్లాడుతూ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు తిరిగి సకాలంలో చెల్లించాలన్నారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే మరి కొంతమందికి రుణాలు ఇస్తామన్నారు. ఎల్డీఎం జనార్దన్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ ద్వారా చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు రాయితీ అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆర్ఎం తులసి, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ సతీష్, డీపీఎం ఎల్హెచ్ రఘునాథరెడ్డి, ఎఫ్ఎల్సీ వీరప్రసాద్ , సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎస్సీ మహిళలు పాల్గొన్నారు. మన కోసం ప్రకృతిని కాపాడుకుందాం – కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ప్రొద్దుటూరు క్రైం : మన కోసం, భావి తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని రాజీవ్గాంధీ నేషనల్ పార్కులో బుధవారం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరులోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎన్జీఓలు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటవీశాఖ అధికారులు వివిధ రకాల వృక్షాలు, వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం కడప డీఎఫ్ఓ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణానికి దగ్గరగా అటవీప్రాంతం ఉండటం ఎంతో అదృష్టమన్నారు. ఈ అడవిలో ఉసిరి, కానుగ, మారెడు తదితర వృక్షజాతులు ఉన్నాయని చెప్పారు. ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలి మాట్లాడుతూ ఎప్పుడూ బిజీ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు ఏడాదికి ఒకసారి కుటుంబ సభ్యులతో అటవీ ప్రాంతానికి వచ్చి వందలాది వృక్ష జాతుల మధ్య గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. అనంతరం డీఎఫ్ఓ వినీత్కుమార్ విద్యార్థులతో కలసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ రామ్లా నాయక్, ఎంపీడీఓ, డీఆర్ఓ లక్ష్మీకుమారి, ఎఫ్బీఓ హరినాథరాజు, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం నాగిరెడ్డి, భాష్యం, ఢిల్లీ పబ్లిక్స్కూల్, శ్రీ చైతన్య హైస్కూల్, పోట్లదుర్తి జెడ్పీహైస్కూల్ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగార్జున, ప్రొద్దుటూరు ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి వనిపెంట, ముద్దనూరు అటవీ శాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే టోర్నమెంట్
ముకేష్ మోక్షజ్ఞ తేజ్ అనంతపురం (138 పరుగులు) ప్రణవ్ గోవర్దన్, చిత్తూరు (151 పరుగులు)కేవీఎస్ మణిదీప్ చిత్తూరు (90 పరుగులు)హేమ చందర్ నాయక్ అనంతపురం (113 పరుగులు) రక్షణ్ సాయి, చిత్తూరు (3 వికెట్లు)తరుణ్ కుమార్ రెడ్డి, చిత్తూరు (4 వికెట్లు) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డాగ్రా ముగిసింది. బుధవారం రెండవ రోజు 184 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 66.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎస్కె సమీర్ 33 పరుగులు, సీహెచ్ కార్తీ 21 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని తరుణ్కుమార్ రెడ్డి 4 వికెట్లు, రక్షణ్ సాయి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 75 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని ప్రణవ్ గోవర్దన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. కేవీఎస్ మణిదీప్ 90 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని మోనీష్–1 వికెట్, సాయిచరణ్–1, తేజోధర్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. చిత్తూరు జట్టులోని తరుణ్ కుమార్రెడ్డి –1 వికెట్, హాఫీజ్–1 వికెట్ తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో అనంతపురం –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 174 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 72 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఆ జట్టులోని ముకేష్ మోక్షజ్ఞ తేజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 188 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్సర్తో 138 పరుగులు చేశాడు. హేమచందర్ నాయక్ 113 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని హేమంత్ 2 వికెట్లు, యశ్వంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 72 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ రెడ్డి 90 పరుగులు, రిషి 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని హేమ చందర్ నాయక్–1 వికెట్, కార్తీక్ సాయి–1 వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 7 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. కర్నూలు జట్టులోని చేతన్ సాయి 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డాగ్రా ముగిసింది. ఈ మ్యాచ్లో అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. -
జిల్లా సర్వజన ఆసుపత్రిని అభివృద్ధి పథంలో నడిపించాలి
కడప అర్బన్ : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)ని.. మరింత అభివృద్దిపథంలో నడిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని హెచ్డీఎస్. చైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సభ్యులను ఆదేశించారు. బుధవారం రిమ్స్ ప్రభుత్వ వైద్యకళాశాల బోర్డు మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, జీజీహెచ్ హెచ్డీఎస్ చైర్మన్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన 51వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తోపాటు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కడప నగర కమిషనర్ మనోజ్ రెడ్డి, డీఎంహెచ్ఓ డా.కె.నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రజా స్పందనలో కడప జీజీహెచ్ ప్రతిభ కనపరిచినందుకు డాక్టర్లను అభినందించారు. జిజిహెచ్ లో అన్ని విభాగాల్లో డాక్టర్లు ఉన్నారని, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు.అలాగే క్రింది స్థాయి సిబ్బంది రోగుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం జిజిహెచ్ లోని అన్ని విభాగాల వైద్యాధిపతులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఆయా విభాగాల్లో అవసరమైన వసతులు, సదుపాయాలు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అజెండా మేరకు..చర్చించిన అనంతరం జీజీహెచ్లో అవసరమైన వైద్య పరికరాల కోసం రూ. 3.5 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఇప్పటికే.. పురోగతిలో ఉన్న పలు అభివద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముందుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ రిమ్స్ హాస్పిటల్ ప్రోగ్రెస్పై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు.50వ హెచ్డీఎస్ మీటింగ్ లో తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను వివరించారు.ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కెఎస్ఎస్ వెంకటేశ్వరరావు, రిమ్స్ ఎస్డీసీ రంగస్వామి, జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జమున,సీఎస్ ఆర్ఎంఓ వై. శ్రీనివాసులు, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇఇ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఏపీ వీవీపీ డీసీహెచ్ఎస్ వై. హిమదేవి, నర్సింగ్ సూపరింటెండెంట్ వెంకట రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట వీధిలో 2017 సంవత్సం జనవరి 19న జరిగిన మునగాల రవి అనే వ్యక్తి హత్య కేసు లో లక్కిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాధవి అనే నిందితులకు కడప ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి జి. దీనబాబు గురువారం జీవిత ఖైదుతో పాటు ఇరువురికి 1000 రూపాయలు జరిమానా విధించినట్లు పట్టణ సీఐ సురేష్ బాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మునగాల రవి మాధవి అనే మహిళకు రూ. 5 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బులు అడుగుతున్నాడని ఆమె కక్షగట్టి నాగలకట్ట వీధిలో వస్తుండగా సూర్యనారాయణరెడ్డితో కలిసి ఇనుపరాడ్డు, కట్టెలు రాళ్లతో దాడి చేయడంతో మునగాల రవి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నాగరాజు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ టి. సర్కార్ విచారణ చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. గురువారం కోర్టు నిందితులిద్దరికీ జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది. -
ఆత్మహత్యను నివారించిన పోలీసులు
వల్లూరు : కుటుంబ సమస్యలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని కాపాడి వల్లూ రు పోలీసులు అందరి మన్ననలు పొందారు. వివరాలిలా.. వల్లూరుకు చెందిన షేక్ రసూల్ (36) కుటుంబ సమస్యలతో మనోవేదనకు గురై, బుధవారం గంగాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై పడుకు ని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.స్థానికుల ద్వారా పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఎస్ఐ పెద్ద ఓబన్న ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన పోలీసులు అంజి ప్రసాద్, సురేంద్ర హుటాహుటి న ఘటనా స్థలికి చేరుకుని పట్టాలపై వున్న రసూల్ను ట్రాక్పై నుంచి పైకి లేపి పక్కకు తీసుకుని వచ్చారు. ఫంక్షన్కు రానన్నందుకే.. భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఫంక్షన్న్కు రాలేమని చెప్పడంతో మనస్థాపానికి గురైన రసూల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రసూల్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడించారు. అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా పుష్పగిరిలో బందోబస్తు బాధ్యతల్లో వున్న ఎస్ఐ పెద్ద ఓబన్న సెల్ఫోన్ ద్వారా రసూల్తో మాట్లాడి మానసిక స్థైర్యం కల్పించారు. జీవితం చాలా విలువైనదని, సమస్యలు వస్తే చర్చించుకోవాలి తప్ప వాటి నుండి తప్పించుకోవడం సరి కాదని రసూల్కు, అతని కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వరికుంట్ల జయన్న (53) విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జయన్న సాగు చేసిన పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు మంగళవారం పొలం దగ్గరకు వెళ్లాడు. పొలం చుట్టు కర్రలు పాతి విద్యుత్ వైర్ చుట్టి కరెంట్ తగిలిస్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. బుధవారం సాయంత్రం పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి జయన్న బంధువులకు తెలిపారు. కాశినాయన ఎస్ఐ యోగేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య ఓబుళమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ యజమాని మరణించడంతో భార్య, కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. పెన్నా నదిలో జేసీబీని సీజ్ చేసిన పోలీసులు ప్రొద్దుటూరు క్రైం : పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్న జేసీబీని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జేసీబీతో ట్రాక్టర్లకు ఇసుకను నింపుకొని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇసుకను తోడుతుండగా స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న జేసీబీని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాల్సిందే
చింతకొమ్మదిన్నె : అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు రకరకాల హామీలు చెప్పి ఆచరణలో అమలు చేయకుండా చంద్రబాబు స్వార్థ ఆలోచనలతోనే, కుటిల పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో సంక్షేమ పథకాలు, ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఎగ్గొట్టిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. రైతులకు మొదటి సంవత్సరం రూ. 20,000 పూర్తిగా ఎగరగొట్టారని, రెండవ సంవత్సరం కూడా అరకొరగానే అందించారని ధ్వజమెత్తారు. ఆరు ఉచిత సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, ఒకటి రెండు మాత్రమే ఇచ్చారని, తల్లికి వందనం పేరిట దాదాపు 35 లక్షల మందికి ఎగరగొట్టారని, అరకొర హామీలు మాత్రమే అమలు చేస్తూ కేవలం ప్రచారం ద్వారా మాత్రమే కాలం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అమ్ముకొని దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అనతికాలంలోనే విపరీతంగా అప్పులు చేస్తున్నారని, ప్రజలకు హామీలు అమలు చేయకుండా ఆ డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా 2.15లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. రాష్ట్రంలోని ఆస్తులు వనరులను అమ్మకానికి పెట్టడమే పనిగా చేస్తున్నారన్నారు. గతంలోనూ స్పిన్నింగ్ మిల్లులు, కో–ఆపరేటివ్ సెక్టార్ లోని షుగర్ ఫ్యాక్టరీలు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. వేలాదిమంది ఉపాధి పొందిన ఆల్విన్ ఫ్యాక్టరీని సైతం అమ్మిన ఘన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. బాబు హయాంలోనే ఆర్టీసీని సైతం అమ్మకం చేపట్టే ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీ ని రాష్ట్ర ప్రభుత్వం లోకి చేర్చారన్నారు. మీడియా సంస్థల ద్వారా చంద్రబాబు అబద్ధాలనే పదే పదే ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 42 టూరిజం హోటళ్లను సైతం అమ్మే కార్యక్రమం చేస్తున్నారని, అమరావతి పేరుతో వందలాది ఎకరాలు దారాధత్తం చేస్తూ, తిరుపతి, గండికోట లాంటి చోట్ల కూడా ప్రైవేట్ వారికి అతి తక్కువ ధరలకే కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరు చేస్తున్న ఆగడాలపై ప్రజలు ప్రశ్నిస్తే కిందిస్థాయి నుండి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు వేధింపులకు గురి చేస్తూ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులేనని ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఇలాగే మెడికల్ కాలేజీలు అమ్మే కార్యక్రమం చేపట్టారని, వైఎస్ జగన్ గట్టిగా నిలదీసి ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే టెండర్లు వేసేవారు కూడా వెనకడుగు వేయడం జరిగిందని, అందువల్లే ప్రస్తుతానికి ఆగి ఉన్నట్లు తెలిపారు. ఒక్కో మెడికల్ కళాశాలకు 50 ఎకరాల నుండి 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కేటాయించి లేనిచోట్ల ప్రైవేట్ ఆస్తులు సైతం కొనుగోలు చేసి మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టే విధంగా వైఎస్ జగన్ చేశారని వివరించారు. అలాంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజలందరం కలిసి పోరాడుదామని, అందుకే కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. ప్రతిపక్షాలతో పాటు అధికార కూటమి పార్టీల కార్యకర్తలు సైతం సంతకాలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారని, ప్రతి గడప తొక్కి సంతకాలు సేకరణ చేపట్టే కార్యక్రమం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం పూర్తిగా ఆపే వరకు వైఎస్ఆర్సీపీ విశ్రమించబోదని ప్రజలకు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలకు పూర్తిగా అండగా నిలిచామని గుర్తుచేశారు. చంద్ర బాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలందరికీ తెలియపరచాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ గూడా ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు శ్రీరామ్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, విశ్వనాథరెడ్డి, కష్ణయ్య, కళా యాదవ్, ఓబుల్ రెడ్డి జయరామిరెడ్డి నాగరాజు, సురేంద్ర,రాజు, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ తదితర నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
వ్యక్తి ఆత్మహత్య
డ్రైవర్ మల్లికార్జున ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఇతడి మృతి పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యతో మనస్పర్థలే కారణమని పోలీసులు అంటున్నారు. అయితే అతడి బంధువులు మాత్రం పోలీసుల కోటింగ్ ఎక్కువగా ఉంటుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది. చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కుప్పగుట్టపల్లెకు చెందిన పెద్ది మోయిన మల్లికార్జున(49) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ ఆత్మహత్యపై పోలీసులు, బంధువులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జునకు ఆయన భార్య సుజాత మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని వాటితో విసుగు చెంది తాగుడుకు బానిసై పురుగు మందు తాగి చనిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే బంధువులు మాత్రం మల్లికార్జున వృత్తిరీత్యా డ్రైవర్ అని ఇటీవల కుటుంబ సభ్యుల ఫిర్యాదులు ఉండటంతో పాటు సోమవారం రాత్రి వాహనాల తనిఖీ నిమిత్తం విధి నిర్వహణలో ఉన్న నాగరాజు, నరసింహరాజు అనే ఇద్దరు హోం గార్డులపైకి మల్లికార్జున నడుపుతున్న జీపు ఢీ కొట్టడంతో వారు గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాయపడ్డ హోం గార్డులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. దీంతో పోలీసుల కోటింగ్ ఎక్కువగా ఉంటుందని భయంతో పురుగుల మందు తాగాడని బంధువులు పేర్కొంటున్నారు. మల్లికార్జున పురుగుల మందు తాగిన విషయం తెలుసుకొని చికిత్స నిమిత్తం రాయచోటిలోని ఓ ప్రవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చనిపోయినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లి అయింది. మరో ఇద్దరు కూతుర్లు పెళ్లీడుకు వచ్చారని బంధువులు పేర్కొన్నారు. గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని భాకరాపేట–కనుమలోపల్లె రైలు మార్గం (మిట్టపల్లి వద్ద)లో 60 సంవత్సరాల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూ కలర్ పై తెలుపు రంగు గీతలు కలిగిన ఫుల్ షర్టు, నలుపు రంగు కలిగిన ఫార్మల్ ప్యాంటు, పారగాన్ చెప్పులు కలిగి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిసినవారు కడప రైల్వే పోలీసులకుగానీ, ఎస్ఐ 9440900811, సీఐ 9440627398లకు సమాచారం అందించాలన్నారు. సోఫాల దుకాణం దగ్ధం పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డులో నాగేంద్రకు చెందిన సోఫాల దుకాణంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసిన పక్క దుకాణదారులు వెంటనే ఫైర్ సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఫైర్ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలో ఉన్న సోఫాలకు సంబంధించిన సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.12 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. -
8న సీబీఐటీలో స్ట్రాటో ఎక్స్మిషన్ శాటిలైట్ ఆవిష్కరణ
చాపాడు : స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 8న క్యాంపస్లో స్ట్రాటో ఎక్స్మిషన్ శాటిలైట్ ఆవిష్కరించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి తెలిపారు. 35 మంది విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్ను హై ఆల్టిట్యూడ్ హీలియం బెలూన్స్ ద్వారా 35 కిలోమీటర్లు ఎత్తులో ఉండే స్ట్రాటో స్పియర్లోకి పంపనున్నారు. దీని ద్వారా కలిగే ఉపయోగాలను గుర్తిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు –2025 గుర్తించనుందని, విద్యార్థుల మేధస్సుకు దోహదపడుతుందని సీబీఐటీ కళాశాల చైర్మన్ తెలిపారు. పోక్సో కేసు నమోదు కడప అర్బన్ : కడప నగరంలోని తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో 14 సంవత్సరాల బాలికపై ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసంఘటనపై బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై మంగళవారం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు. బెల్ట్షాప్పై దాడి మైదుకూరు : మండలంలోని జీవీ సత్రంలో మంగళవారం పోలీసులు బెల్ట్షాపుపై దాడి చేసి 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ చిల్లర దుకాణంలో బెల్ట్ షాప నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అర్బన్ ఎస్ఐ చిరంజీవి సిబ్బందితో దాడి చేశారు. జీవీ సత్రంలోని సీతారామనగర్లో పంగా సీతారామయ్య అనే వ్యక్తి తన చిల్లర దుకాణంలోనే బెల్ట్షాపు నిర్వహిస్తుండగా అతన్ని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఆవరణంలో నాగుపాము దర్శనమిచ్చింది. కార్తీక రెండవ సోమవారం రాత్రి భక్తులు భారీగా వచ్చి అఘోర లింగేశ్వరుడికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు పూర్తి చేసుకొన్న సమయంలో అమ్మవారికి, స్వామి వారికి కొబ్బరి కాయలు కొట్టగా కొబ్బరి నీళ్లు బయటకి వెళ్లే ప్రదేశం నుంచి ఈ పాము బయటికి వచ్చింది. దీనిని గమనించిన భక్తులు పాము....పాము అంటూ గట్టిగా కేకలు వేయగా ..ఆలయ అధికారులు పాము వెళ్లిన బొరియకు రాయి పెట్టి కప్పిపెట్టారు. పాము పట్టేవారిని పిలిపించి ఆ పామును పట్టుకొని సురక్షప్రదేశంలో వదిలిపెట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పామును పట్టి తీసుకెళ్లడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. టాస్క్ఫోర్స్ : తెలుగు తమ్ముళ్ల తన్నులాట రక్తపు చారలై పారింది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు తెగపడి దాడులలో తల బద్దలై ఆసుపత్రికి చేరిన తెలుగు తమ్ముడు శివాజీ నాయుడు ఉదంతం ఇది. ఇంత సంఘటన జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకుండా అధికారాన్ని అడ్డు పెట్టినట్లు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఇరువర్గాల దాడి అటువైపుగా వెళుతున్న ప్రజలను భయాందోళనకు గురిచేసింది. సంబేపల్లె మండలం గుట్టపల్లె పంచాయతీకి చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా ఏర్పడి గత కొద్ది రోజులుగా కారాలు, మిరియాలు నూరుకొంటునట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రంలో జరిగిన డీఆర్సీ మీటింగ్ అయిపోయిన అనంతరం ఒక వర్గం గుట్టపల్లెకు స్కార్పియో వాహనంలో వెళుతున్న సమయంలో మరో వర్గం వెంబడించి నారాయణరెడ్డిపల్లె సమీపంలో వాహనాన్ని ధ్వంసం చేసి అందులో వున్న వారిపై దాడికి తెగబడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివాజీనాయుడును 108 ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అండర్–14 క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు మంగళవారం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 51.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఆ జట్టులోని కిన్నుకిషల్ 77 పరుగులు, ఎస్కె సమీర్ 26 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రక్షన్ సాయి 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.... అదే విధంగా కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు అనంతపురం –కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాంటింగ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 45 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆ జట్టులోని ముకేష్ మోక్షజ్ఞ తేజ్ 124 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్పర్తో 102 పరుగులు చేశాడు. హేమచంద్ర నాయక్ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని హేమంత్ 2 వికెట్లు, చేతన్ సాయి 1 వికెట్ తీశారు. దీంతో తొలి రోజు ముగిసింది. హేమ చంద్ర నాయక్ అనంతపురం, (59 పరుగులు) ముకేష్ మోక్షజ్ఞ తేజ్, అనంతపురం, (102 పరుగులు) కిన్ను కిషల్, నెల్లూరు (77 పరుగులు) -
‘భారతి’ విద్యార్థుల ప్రతిభ
కమలాపురం : చెకుముకి సైన్స్ సంబరాలు–2025లో భాగంగా మండల స్థాయి పోటీల్లో మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన ‘డీఏవీ భారతి’ విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. స్థానిక ఎంఆర్సీలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో డీఏవీ భారతి విద్యామందిర్కు చెందిన జోష్ణ(10వ తరగతి), మహేశ్వరీ (9వ తరగతి), చాంద్ (8వ తరగతి) ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. కాగా ఈ నెల 23వ తేదీన జరిగే జిల్లా స్థాయి పోటీలకు వీరు హాజరు అవుతారని ప్రిన్సిపల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ టాలెంట్ పరీక్షల వలన విద్యార్థులలో సైన్స్ అవగాహనను పెంపొందించడంతో పాటు వారిలో శాసీ్త్రయ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడానికి ఉపయోగ పడతాయన్నారు. కాగా ప్లాంట్ హెడ్ రామమూర్తి, హెచ్ఆర్ గోపాల్రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు విద్యార్థులతో పాటు సైన్స్ ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. -
ప్రొద్దుటూరులో అధికార జులుం
● వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి కళాశాల తొలగింపు పనులు ● రోడ్డు విస్తరణ పేరుతో హిటాచి యంత్రంతో వచ్చిన ఆయా శాఖల అధికారులు ● అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : రోడ్డు విస్తరణ పేరుతో స్థానిక సినీ హబ్ సమీపంలోని ఫేస్ టాప్ మైండ్ జూనియర్ కళాశాల భవనం యజమాని, వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన డాక్టర్ షాకీర్ ఖురేషికి చెందిన ఫేస్ టాప్ మైండ్ జూనియర్ కళాశాల భవనాన్ని తొలగించేందుకు మంగళవారం ఉదయమే అధికారులు సిద్ధమయ్యారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్శాఖ, పోలీసు, ఆర్అండ్బీ శాఖల అధికారులు హిటాచి యంత్రం తీసుకుని భవన తొలగింపు పనులు చేపట్టేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. తాను ముందుగా సూచించిన మేరకు కళాశాలకు చెందిన లిఫ్ట్ను పూర్తిగా తొలగించానని, ప్రస్తుతం ఇంకా రెండు అడుగుల మేర భవనాన్ని తొలగించాలని తనకు తరచూ అధికారులు ఫోన్ చేస్తున్నారని కళాశాల కరస్పాండెంట్ ఈ సందర్భంగా రాచమల్లుకు వివరించారు. ఎలాంటి ముందస్తు నోటీసు తమకు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని తొలగించేందకు సిద్ధమయ్యారని తెలిపారు. ఎర్రగుంట్ల సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోలు బంకు వరకు రోడ్డు విస్తరణ కోసం ఎక్కడా భవనాలను తొలగించే పనులు చేపట్టలేదని, మధ్యలో ఉన్న తమ కళాశాలపైకి వచ్చారన్నారు. తనకన్నా ముందున్న భవనాలను పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితోపాటు ముక్తియార్ను కూడా కలిశానన్నారు. రూ.30లక్షలతో నిర్మించిన కళాశాల లిఫ్ట్ను తొలగించడంతో తమ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు బలవంతంగా భవనాలను కూల్చివేస్తే తాము ఆత్మహత్య చేసుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నుంచి తమ కళాశాల వరకు 27 అడుగుల విస్తీర్ణం ఉందన్నారు. పదే పదే అధికారులు ఫోన్ చేసి మీ భవనాన్ని తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. రాచమల్లు మధ్యాహ్నం 3 గంటల వరకు సంఘటన స్థలంలోనే ఉండి అధికారులతో మాట్లాడి వెళ్లారు. ప్రొద్దుటూరులో దౌర్జన్యం రాజ్యమేలుతోంది ప్రొద్దుటూరులో దౌర్జన్యం రాజ్యమేలుతోందని, అధికార జులం పరాకాష్టకు చేరిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ల కిందటే మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని ఈ భవనాన్ని నిర్మించారన్నారు. అయితే కరస్పాండెంట్ అధికార పార్టీకి అనుకూలం కాదని వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే ఉద్దేశంతో కూటమి పార్టీకి చెందిన ముస్లిం నాయకుడు ముక్తియార్ ఈ భవనాన్ని తొలగించాలని ఆదేశించారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి అనుమతి లేకుండా ముక్తియార్ ఈ భవానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. నేతల సిఫారసు లేకుంటే తహసీల్దార్, విద్యుత్శాఖ, ఆర్అండ్బీ, పోలీసు, మున్సిపల్ అధికారులు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వస్తారా అని ప్రశ్నించారు. కళాశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారని, చెప్పా పెట్టకుండా తొలగిస్తే విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఎవరు కారణమన్నారు. అసలు నోటీసు ఇవ్వకుండానే ఎలా ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. కళాశాల కంటే ముందు భూమిలో ఆర్టీపీపీ పైపులైన్ నిర్మాణం ఉందని, దానిని ఎలా తొలగిస్తారన్నారు. 2019 నుంచి 2024 వరకు తాము ఎన్నో పనులు చేపట్టామని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేల రాజారాంరెడ్డి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్రం గౌస్, మున్సిపల్ కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, లావణ్య, జయంతి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మార్తల ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చు వివరాల్లో ఈ తేడాలేంటి..?
● గత ఏడాది క్లాప్ వెహికల్స్ తిరగలేదు కదా..? ● సర్కులారిటీ అకౌంట్పై ఉద్యోగుల మౌనం ● స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అసహనం మదనపల్లె : ఉన్న వాహన లెన్ని, వాటి నిర్వహణకు అవుతున్న ఖర్చు లెక్కల్లో తేడాపై స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కమిషనర్ ప్రమీలను ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలో వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటి ఆదాయ, వ్యయాలు, నిర్వహణ అంశాలపై కమిషనర్ వివరిస్తూ ఉండగా వాహనాల అంశంపై ఆయనకిచ్చిన లెక్కలు, ప్రజెంటేషన్ లెక్కలో తేడా ఉండటంతో చైర్మన్ ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీలకు చెందిన క్లాప్ వాహనాల వినియోగం ఆగిపోయిందని, ఇక్కడ నిర్వహణ ఎలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీన్ని సరిచేసుకుంటామని కమిషనర్ వివరణ ఇచ్చారు. చైర్మన్ ప్రసంగంలో సర్కులారిటీ అకౌంట్ నిర్వహణపై ఎంతమందికి తెలుసని ప్రశ్నించగా అందరూ మౌనంగా ఉండిపోగా ఒక మహిళ ఉద్యోగి మాత్రమే స్పందించి దాని గురించి వివరించారు. దీనిపై అసహనానికి గురైన పట్టాభిరామ్ ఈ అంశంపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని డీఎల్పీఓ నాగరాజును ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ద్య నిర్వహణ బాగాలేదని, డంపింగ్యార్డుల నిర్వహణ కూడా జరగడం లేదన్నారు. గ్రామీణ స్వచ్ఛసర్వేక్షణ్ సర్వేలో లోపాలను గుర్తించి సరిచేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 1,600 ఎలక్ట్రికల్ వాహనాలు, 12వేల ట్రైసైకిళ్లు, 5వేల పుష్ గార్డులను కొనుగోలు చేసి మున్సిపాలిటీలకు అందించనున్నట్టు చెప్పారు. ఇంటిగ్రేటేడ్ వేస్ట్ ప్రాసెసింగ్ నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. దీని ప్రక్రియ కొనసాతుందన్నారు. 25–30 కిలోమీటర్ల పరిధిలో ఒక వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ను స్థాపించి గ్రామాలను అనుసంధానం చేసి అక్కడికి చెత్త తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమీక్షకు ముందుకు మున్సిపాలిటి డంపింగ్యార్డును పరిశీలించి అక్కడ చేపట్టిన పనులను పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే షాజహాన్బాషా, మున్సిపల్ ఆర్డీ నాగరాజు, చిత్తూరు కమిషనర్ నరసింహప్రసాద్, పీడీఓ సి.పవన్కుమార్ పాల్గొన్నారు. -
పోలీస్స్టేషన్ స్థల పరిశీలన
కొండాపురం: తాళ్లప్రొద్దుటూరులోని పోలీస్స్టేషన్ స్థల విషయమై మంగళవారం కలెక్టర్ శ్రీధర్ మండలంలో పర్యటించారు. ప్రభుత్వ విప్.ఆదినారాయణరెడ్డి, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ శాంతమ్మ, ఆర్డీఓ సాయిశ్రీతో కలిసి తాళ్ల ప్రొద్దుటూరు లేఅవుట్ను పరిశీలించారు. కాగా స్థానిక ఎమ్మెల్యే అండతో కొందరు నిర్వాసితుల ముసుగులో పునరావాస కాలనీలో ఖాళీ స్థలం కావాలని అర్జీ రూపంలో రెవిన్యూ శాఖ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం తాళ్లప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ స్థలం పరిశీలన చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తాళ్లప్రొద్దుటూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్కు పడమటి వైపున డాట్ లాండ్ లో రెండు ఎల్పీ నెంబర్లు ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. మరోవైపు తమ సమస్యలు చెప్పుకుందామని నిర్వాసితులు ఆశతో అక్కడి వచ్చారు. అధికారులు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదని.. నేతల అవసరాల కోసం వచ్చారని తెలుసుకుని నివ్వెరపోయారు. గండికోట జలాశయం పరిశీలన కలెక్టర్ శ్రీధర్ గండికోట జలాశయాన్ని పరిశీలించారు. నీటి మట్టం, ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను జీఎన్ఎస్ఎస్ ఏఈ చిన్న కొండారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండికోట టన్నెల్ ద్వారాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. -
పెద్ద ఉరుసుకు వేళాయె
కడప సెవెన్రోడ్స్: ప్రఖ్యాత కడప పెద్ద దర్గా పెద్ద ఉరుసుకు వేళయింది. శాంతియుత సూఫీ తత్వాన్ని ప్రబోధిస్తున్న ఈ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 5వ తేది నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా దర్గా నిర్వాహకులు విశేష ఏర్పాట్లు చేశారు. ఉరుసు నేపఽథ్యంలో దర్గాతోపాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఉత్సవాలకు తరలి రానున్న భక్తులకు దర్గా ఆధ్వర్యంలో విడిది, అన్నదాన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఉరుసు సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో విద్యుద్దీపాలను అలంకరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పారిశుధ్యం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ అధికారులు నగరంలోని రైల్వేస్టేషన్ నుంచి దర్గా వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం విశేషం. ● ఈనెల 5న గంధం కార్యక్రమంలో భాగంగా ఉదయం దర్గా నుంచి బాదుల్లా సాహెబ్ మకాన్ వరకు ఫకీర్ల ఊరేగింపు సాంగ్యం,సాయంత్రం పీఠాధిపతుల దివ్యాసనం, ధ్యాన తపస్సు. రాత్రి గంధం ఊరేగింపు, ఫాతెహా సమర్పణ, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ● 6న ఇదార–యే–అమీనియా చిస్తీయా వార్షిక నివేదిక, రాత్రి 9 గంటలకు ఉరుసు మహోత్సవం, ఎద్దులబండ్ల చౌహరీ ఖలీఫాల చాందినీ, గంధం ఊరేగింపు, చదివింపులు, ఖవాలీ మొదలైన పవిత్ర పుణ్య కార్యక్రమాలు జరుగుతాయి. ● 7న తహలీల్ ఫాతెహా ఉత్సవంలో భాగంగా ప్రసాద సమర్పణ, సంబంధిత ప్రార్థనలు, రాత్రి ప్రముఖ విద్వాంసులతో కవిసమ్మేళనం (ముషాయిరా) జరుగుతుంది. ● 8న రాత్రి 10గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు సమాఖానీ సజ్జదనషీన్ పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో ఖవాలీ, ఖురాన్ పఠనం, తదితర కార్యక్రమాలు ఉంటాయి. ● 9వ తేదీ ఫకీర్లతో పీఠాధిపతి వాటర్ గండిలోని హజరత్ మస్తాన్ స్వామివారి దర్శనం, జెండా ప్రతిష్ట, చదివింపులు నిర్వహిస్తారు. ● 10న ఫకీర్ల సంఘాలకు జర్రా ప్రసాదం, దస్సకీ ఆవాజ్, పండితులు,విద్వాంసులు, యాత్రికులు, భక్తుల తిరుగు ప్రయాణం. నేడు గంధోత్సవం వేలాదిగా తరలి రానున్న భక్తజనం నగరమంతటా విద్యుద్దీప శోభ వారం రోజులపాటుకొనసాగనున్న ఉత్సవాలు -
అది పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలం. నేషనల్ హైవే పక్కనే ఉండడంతో రూ. కోట్లు విలువ చేస్తుంది. ఎకరం తక్కువంటే రూ.3కోట్ల పైమాటే ఉంటుంది. అంతటి విలువైన ఆ స్థలంపై కొందరు కన్నేశారు. ఎలాగైనా కొల్లగొట్టాలని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రత్యక్ష, పరోక్ష సహక
సాక్షి ప్రతినిధి, కడప: కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటులో భాగంగా 1.38 ఎకరాలు తాళ్లప్రొద్దుటూరు పోలీసుస్టేషన్కు కేటాయించారు. ఆమేరకు తహసీల్దార్ రెఫరెన్స్ నెం.ఏ/785/2021తో డిసెంబర్ 13, 2021న పొజిషన్ సర్టిఫికెట్ కూడా అప్పగించారు. ఇప్పుడా స్థలంపై కూటమి నేతల కన్ను పడింది. తాళ్లప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్యే సమీప బంధువులు అధికారికంగా స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. నేషనల్ హైవే–67 రోడ్డు పక్కనే స్థలం ఉండడంతో మంచి డిమాండ్ వచ్చింది. సెంటు ధర రూ.3లక్షలు పలుకుతోంది. రూ కోట్ల విలువైన స్థలాన్ని తప్పుడు కారణాలు చూపెట్టి కొల్లగొట్టే ఎత్తుగడలు ఎంచుకున్నారు. అందుకు అధికార యంత్రాంగం దాసోహం దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఒత్తిడి కారణంగా స్థానికంగా పోలీసు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. ఆ మేరకు సిఫార్సులు చేస్తూ కలెక్టరేట్కు ఫైల్ పంపించారు. ఈ విషయమై మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ పర్యటించారు. పునరావాసం పేరిట సదరు స్థలం కావాలని అర్జీ వేసిన ఎమ్మెల్యే సమీప బంధువు రామాంజులరెడ్డిని గ్రామస్తుల సమక్షంలోనే పిలిపించి కలెక్టర్ మాట్లాడారు. అప్పుడెందుకు మీరు తీసుకోలేదని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా కేటాయించారంటూ అడ్డగోలుగా అసత్యాలు చెప్పడం అక్కడి ప్రజానీకానికి వింతగా కన్పించింది. వాస్తవానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద టీ–475ద్వారా ఆయన తల్లి వెంకటలక్షుమ్మ, టీ–480 ద్వారా రామాంజులరెడ్డి, కుమారుడు శివానందరెడ్డి మూడు యూనిట్లకుగాను వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున రూ.30లక్షలు రామాంజులరెడ్డి పునరావాస పరిహారం అందిపుచ్చుకోవడం గమనార్హం. అర్హులందరికీ కేటాయింపు... తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థులకు అర్హులందరికీ ఆర్అండ్ఆర్ కాలనీలో 1358 ఇంటి పట్టాలు కేటాయించారు. అందులో గుడి, బడి, ఈద్గా, చర్చి, అంగన్వాడీ, గ్రామచావిడి, పంచాయతీ కార్యాలయం, వెటర్నరీ, హెల్త్సెంటర్ ఇలా 22 ప్రభుత్వ భవనాలు నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించారు. వాటి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.88.70కోట్లు మంజూరు చేసింది. అందులో పోలీసుస్టేషన్ నిర్మాణానికి రూ.1.40కోట్లు కేటాయించారు. అదే కాలనీలో ఇంకా దాదాపు 200 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా, పోలీసుస్టేషన్కు కేటాయించిన 1.38ఎకరాలు కొట్టేసేందుకు కూటమి నేత లు పక్కాగా స్కెచ్ వేశారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్న విషయం తెలుసుకున్న మునుపటి ఎస్పీ అశోక్కుమార్ రెవెన్యూ అధికారులకు అభ్యంతరం చెబుతూనే, ఆ స్థలానికి కంచె కూడా వేయించారు. పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని స్థానికంగా ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఒత్తిడి ఫలితం, స్థానికంగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి చేతులు బరువెక్కడంతో పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలాన్ని కూడా అప్పగించేందుకు అధికారులు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. తహసీల్దార్ రెఫరెన్స్ నెం.ఏ/785/2021 స్వాధీన పర్చిన 1.38 ఎకరాలు కాకుండా సర్వే నంబర్ 289లో 75సెంట్లు ప్రభుత్వ గయ్యాలి భూమి ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని పోలీసుస్టేషన్కు అప్పగించాలని ఎమ్మెల్యే సమీప బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆండ్ఆర్ సెంటర్లో పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలం పట్టాలుగా విభజించి లబ్ధిదారులకు అప్పగించాలని మంగళవారం కలెక్టర్ దృష్టికి స్థానిక నాయకుడు రామాంజులరెడ్డి తీసుకొచ్చారు. ఈవిషయాన్ని గమనించిన ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు. కాగా, పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలాన్ని రక్షించుకోవాలనే దిశగా పోలీసుశాఖకే లేకపోవడంతో కూటమి నేతల వ్యూహం మరింత సులువుగా మారిందని పలువురు చెప్పుకొస్తున్నారు. కలెక్టర్ పర్యటనతోనైనా కూటమి నేతల ఆక్రమణ వ్యూహానికి చెక్ పడుతుందో.. లేదా చూడాలి. తాళ్లప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ స్థలం స్వాహాకు సన్నాహాలు కోట్లాది విలువైన స్థలం కావడంతోకన్నేసిన ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఆది దగ్గరుండి కొనసాగిస్తున్న తంతు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల అండదండలు కలెక్టర్ పర్యటనతోబట్టబయలైన వ్యవహారం -
పరిహారం ఇవ్వకుంటే ఆందోళన
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు చొప్పున ఇస్తామన్న పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. రెండు వారాల్లో పరిహారం అందకపోతే కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, చెన్నూరు, వీఎన్ పల్లె ఎంపీపీలు చీర్ల సురేష్యాదవ్, రఘునాథరెడ్డి ఎంపీతో కలిసి కలెక్టర్ను కలిశారు. ఈ సందర్బంగా ఎంపీ అవినాష్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లా రైతులు సుమారు 17 వేల ఎకరాల్లో ఉల్లి పంట నష్టపోయారని తెలిపారు. గతనెలలోనే తాము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు అడగ్గా ఫైలు ముఖ్యమంత్రి టేబుల్పై ఉందని, త్వరలో జీఓ విడుదల అవుతుందని చెప్పడం సరికాదన్నారు. 2022 రబీ నుంచి 2024 ఖరీఫ్ వరకు రైతులకు ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కింద రూ.173 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. ఇంతవరకు ఒక్క రైతు ఖాతాలో కూడా బీమా మొత్తం జమకాలేదని ఆరోపించారు. ఏ మండలానికి ఎంత మంజూరైందో చెప్పాలని అడిగినా అధికారుల వద్ద వివరాలు లేవన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మినుము, శనగ, వరి తదితర పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయన్నారు. ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పుడు రైతులు మళ్లీ పంట సాగు చేసుకోవడానికి వీలుగా 90 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం కూడా 90 శాతం సబ్సిడీతో విత్తనాలు తక్షణమే రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బోర్ల కింద వరి పంట సాగు చేసిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, గతనెల 26వ తేది మంత్రి ప్రకటించినప్పటికీ ఇంతవరకు జిల్లాలోని 19 కొనుగోలు సెంటర్లలో ఎక్కడా ఒక్క గింజ కూడా సేకరించలేదన్నారు. దీంతో చేసేది లేక రైతులు ఇప్పటికే 70 శాతం పంటలు తక్కువ ధరలకు విక్రయించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటాలు పత్తి రూ. 14–16 వేలు ఉండేదని, నేడు రూ. 5 వేలకు రైతులు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు హృషికేశ్రెడ్డి, రజనీకాంత్రెడ్డి, సీహెచ్ వినోద్కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో జమ కాని బీమా 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి వరిధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఉత్సాహంగా మ్యాథ్ బి
కడప ఎడ్యుకేషన్: సాక్షి మ్యాథ్ ‘బి’కాంపిటీషన్కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆసక్తి పెంచేలా చేయడమే మ్యాథ్ బీ లక్ష్యం. చిన్న చిన్న సమస్యలు మొ దలు వారి స్థాయిని అనుసరించి పోటీ నిర్వహించారు. కడప నగరంలోని జీఎంఆర్ స్కూల్, శివశివాని, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, సింహాద్రిపురంలోని గురుజాల నేతాజీ స్కూల్, వేంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో మంగళవారం ‘సాక్షి’ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో డ్యూక్స్ వ్యాప్తి, ట్రీప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన మ్యాథ్ బి మొదటి రౌండ్ కాంపిటేషన్ను నాలుగు కేటగిరీలుగా నిర్వహించారు. ఇందులో కేటగిరీ–1లో 1,2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3,4 తరగతుల విద్యార్థులు, కేటగిరి–3లో 5,6,7 తరగతుల విద్యార్థులు, కేటగిరి–4 లో 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. పోటీల్లో పాల్గొన్న నాగార్జున స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్న జీఎంఆర్ స్కూల్ విద్యార్థులు -
‘నా భర్తది అనుమానాస్పద మృతి’
రాయచోటి టౌన్ : తన భర్త మరణంపై తనకు అనుమానం ఉందని కేవీపల్లి మండలం దేవరపల్లికి చెందిన శ్రీదేవి పేర్కొన్నారు. సోమవారం ఆమె జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తాను జీవనోపాధికి కువైట్కు వెళ్లానని తెలిపారు. అయితే తాను ఇండియాకు వస్తుండగా మార్గ మధ్యంలో తన భర్త అంజి చనిపోయాడని సమాచారం అందిందన్నారు. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా తనను, తన కుమార్తెను కొట్టి తరిమేశారని వాపోయారు. తన భర్త మరణంపై అనుమానం ఉందని, మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని ఆమె కోరారు. -
డైవర్షన్ పాలిటిక్స్ బాబుకు అలవాటే
పులివెందుల: డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉంటాడని ధ్వజమెత్తారు. ఆయనకు అనుకూలంగా ఉన్న ఎల్లోమీడియా కూడా జరిగిన తప్పిదాన్ని కప్పి ఉంచి చంద్రబాబు అజెండానే తమ అజెండాగా భావించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన, మొంథా తుఫాన్ కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టి మరల్చేందుకు తమ పార్టీ నాయకుడు జోగి రమేష్ అరెస్టును తెరపైకి తీసుకొచ్చారన్నారు. అసలు నకిలీ మద్యం కేసులో నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని రాష్ట్ర ప్రజలందరికి తెలిసిన విషయమేనన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎలాంటి తప్పులు జరిగినా వెంటనే ఏదో ఒక అబద్దపు నిందలతో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి తమ పాలనపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. టీం ఇండియాకు అభినందనలు: ప్రపంచకప్ మహిళా క్రికెట్ పోటీలలో ఇండియన్ మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించడంపై ఎంపీ అవినాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విజేత జట్టులో జిల్లా వాసి శ్రీచరణి పాలు పంచుకోవడం జిల్లాకే గర్వకారణమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. శ్రీచరణి దేశానికేకాక రాష్ట్రానికి, తద్వారా మన జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని కొనియాడారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
శివశంకర... అభయంకర!
కడప సెవెన్రోడ్స్: గంగాధరుడి దర్శనం కోసం చీకటిని లెక్కచేయక భక్తులు తెల్లవారుజామునుంచి ఆలయాల వద్ద బారులు తీరారు. భోళా శంకరునికి తమ శక్తిమేరకు ఫలం, పుష్పం సమర్పించి ఆలయాల ప్రాంగణాల్లో కార్తీక దీపం వెలిగించి తన్మయులయ్యారు. కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు, అలంకారం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. మొక్కులుగల వారు ఆలయాల ప్రాంగణాలలో ఉదయం, సాయంత్రం కార్తీక దీపాలను వెలిగించా రు. కొందరు పిండి దీపాలు, మరికొందరు ఉసి రి దీపాలు, ఇతర ద్రవ్యాలతో ప్రమిదలు చేసి వెలిగించారు. మొక్కులుగల భక్తులు వెయ్యి, పది వేలు, అంతకుమించిన ఒత్తులతో అఖండ దీపాలను వెలిగించారు. భక్తులు కొందరు సమీపంలోని అటవీ ప్రాంతాలకు, మామిడి తోటలు తదితర ప్రాంతాలకు వన భోజనాలకు తరలి వెళ్లారు. శివాలయాలకు ప్రత్యేక బస్సులు ఈనెల 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పొలతల, నిత్యపూజ కోన, పుష్పగిరి, కన్యతీర్థం, అగస్థీశ్వరకోన శైవ క్షేత్రాలను జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్ఎం తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఆయా డిపోల నుంచి పోవడానికి, తిరిగి రావడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయని, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విశేష అలంకారంలో శ్రీ మృత్యుంజయేశ్వరస్వామి, స్వామి దర్శనానికి క్యూలైన్లో వేచివున్న భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక రెండవ సోమవారం -
స్పెల్ బీకి విశేష స్పందన
● పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు ● ఆంగ్లంపై ఆసక్తి పెరుగుతుందంటున్న చిన్నారులు స్పెల్బీలో పాల్గొన్న జీఎంఆర్ స్కూల్ విద్యార్థులు హైదరాబాదు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కడప ఎడ్యుకేషన్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో డ్యూక్స్ వ్యాప్తి, డ్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న స్పెల్ బీ కాంపిటేషన్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూల్, జీఎంఆర్ స్కూల్, లిటిల్ ప్లానెట్ స్కూల్, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, శివశివాని, జీఆర్టీ జీవీకే స్కూల్, వేంపల్లి శ్రీ చైతన్యం స్కూల్, గురిజాల నేతాజీ స్కూల్లలో నిర్వహించిన తొలి రౌండ్ స్పెల్బీకి చక్కటి స్పందన లభించింది. ఈ కాంపిటీషన్కు పలు పాఠశా లల విద్యార్థులు హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. అంగ్లంపై మక్కువ పెంచేలా, ఆసిక్తి కలిగించేలా ప్రయత్నం చేస్తున్న ‘సాక్షి’కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం 10 గంటలకు నుంచి ప్రారంభమైన ఈ పోటీ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. ఆంగ్లంపై ఉన్న భయాన్ని పోగొట్టడంతో పాటు భాషపై పట్టు సాధించేలా కాంపిటీషన్ ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. కాగా సోమ వారం నిర్వహించిన కాంపిటేషన్లో కేటగిరీ–1లో 1,2 తరగతులు విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–3లో 5,6,7,8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్య విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్ష
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభావం కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష పండులా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీవిద్య జూనియర్ కళాశాలలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఒకే మారు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వీటిని ప్రైవేట్పరం చేసిందని తెలిపారు. మంచి సంకల్పంతో జగన్ చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తారన్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్యం పొందాల్సిన పేదలు ప్రైవేట్ పరం కారణంగా డబ్బు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు జగనన్న పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత తమదేనన్నారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గుర్రం లావణ్య, జయంతి, ప్రొద్దుటూరు కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షురాలు చింతల దానమ్మ, పార్టీ నాయకులు వెలవలి రాజశేఖర్రెడ్డి, రవీంద్రారెడ్డి, రమణమ్మ, దావూద్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
కమలాపురం : ఆస్తి తగాదాలో సొంత తమ్ముడినే హత్య చేసిన అన్న మూల చెన్నారెడ్డిని అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఎస్కే రోషన్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఎస్ఐ విద్యా సాగర్తో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అప్పారావు పల్లెకు చెందిన మూల చెన్నారెడ్డి, మూల విశ్వనాథ రెడ్డి సొంత అన్నదమ్ములు. అన్న అయిన చెన్నారెడ్డికి వివాహం కాలేదు. తమ్ముడి ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తూ మద్యం తదితర చెడు వ్యసనాలను లోనై తరచూ గ్రామస్తులతో, తన ఇంట్లో వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో విశ్వనాథ రెడ్డి తన భాగానికి వచ్చిన వ్యవసాయ పొలాన్ని అమ్ముకోగా వచ్చిన డబ్బులో తనకు కూడా వాటా ఇవ్వాలని చెన్నారెడ్డి అడిగాడు. దీనికి విశ్వనాథ రెడ్డి ఒప్పుకోక పోవడంతో తమ్ముడిపై కక్ష పెంచుకున్న అన్న అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 30వ తేదీ విశ్వనాథ్ రెడ్డి ఇంటి నుంచి బైక్ పై బయటకు వెళ్తుండగా అప్పటికే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ మూల ఎల్లారెడ్డి మిద్దె పైకి ఎక్కి ఉన్న చెన్నారెడ్డి ఆ ఇంటి పై ఉన్న మాంసం కొట్టే మొద్దుతో బలంగా కొట్టడం వలన విశ్వనాథ రెడ్డి తలకు రక్తగాయం అయి మృతి చెందాడని వివరించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కమలాపురం–ఎర్రగుంట్ల రహదారిలోని సి.గోపులాపురం క్రాస్ వద్ద ఉన్న చెన్నారెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. అతన్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ వివరించారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
కడప సిటీ : జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామస్తులు హెచ్చరించారు. సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో వైఎస్సార్ సీపీ వింగ్ వలంటీర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్రెడ్డి, మైలవరం జెడ్పీటీసీ మహలక్ష్మి, తలమంచిపట్నం ఎంపీటీసీ నాగ ఉదయిని, దుగ్గనపల్లెకు చెందిన వినోద్, గ్రామస్తులతో కలిసి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాల్మియా సిమెంట్ పరిశ్రమ వల్ల ఆరోగ్య సమస్యలు, పంటల దిగుబడి, గృహాల వల్ల ఎంతో నష్టపోతున్నామన్నారు. ఉన్న ప్లాంట్తోనే ఇబ్బందులు పడుతుంటే మా శవాల మీద రెండో ప్లాంట్ ఏర్పాటు చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముందుకు వెళ్లడం దాల్మియా యాజమాన్యానికి సరికాదన్నారు. వరద నీరు గ్రామాలను ముంచేస్తోందన్నారు. నవాబుపేట నీటి మునిగి పొలాలు దెబ్బతిన్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇచ్చినా పక్కన పెట్టారన్నారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దృష్టికి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా దాల్మియా ఫ్యాక్టరీలోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారన్నారు. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తీసుకెళ్లారని చెప్పారు. దాల్మియా సిమెంట్ పరిశ్రమ విస్తరణ కోసం స్థల సేకరణ చేస్తున్నారన్నారు. నవాబుపేట వద్ద వరద రాకుండా కెనాల్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. రూ. 120 కోట్లు ఖర్చవుతుందని ఇరిగేషన్ అధికారులు చెప్పారన్నారు. పేలుళ్ల వద్ద ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల పంటల దిగుబడి రాలేదని, అలాంటి భూములకు పరిహారం అందిస్తామని అదికారులు హామీ ఇచ్చారన్నారు. సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని యాజమాన్యం ఒప్పుకున్నట్లు కలెక్టర్ చెప్పినా అది కార్యరూపం దాల్చలేదన్నారు. వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయన్నారు. దీనికి కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. బ్లాస్టింగ్ జరగకుండా చర్యలు చేపడతామన్నారు. రెండోప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల గొంతు కోయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా దాల్మియా వ్యవహరిస్తుంటే అధికారులు వత్తాసు పలకడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గాంఽధీ మార్గంలో కాకుండా గాడ్సే మార్గంలో విస్తరణ పనులను అడ్డుకుంటామన్నారు. మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రాణ త్యాగానికై నా సిద్ధమని హెచ్చరించారు. జమ్మలమడుగు దాల్మియా సిమెంట్స్ పరిశ్రమ బాధిత గ్రామస్తులు -
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం అందించాలన్నారు. ఎవరైనా అర్జిలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో పీజిఆర్ఎస్ పెండింగ్ అర్జీల పై సమీక్ష చేశారు. కిచెన్ షెడ్స్ నిర్వహణలోకి రావాలి: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి డిసెంబర్ నాటికి అన్ని మండలాల్లో అమలులోకి తీసుకురావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై అన్ని డివిజన్ల ఆర్డీవోలు, సంబంధిత అధికారులతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని..ఇవి రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదే స్పూర్తితోనే జిల్లాలో మరో 33 స్మార్ట్ కిచెన్ షెడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డీఇఓ శంషుద్దిన్, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, హౌసింగ్ పీడి రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉండాలి
మమ్మల్ని సూపర్వైజర్లుగా నియమించుకుని నెల రోజులపాటు పనిచేయించుకున్న తర్వాత ఉన్నట్లుండి తొలగిస్తే ఎలా? మమ్మల్ని చేర్చుకునే సమయంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చాలని పరిచయం వున్నవారి ద్వారా చేర్చుకున్నారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకుని రమ్మంటున్నారు. ఈ విధానం ఎంతవరకు న్యాయం? – గోసుల జనార్దన్రెడ్డి, ముండ్లపల్లి, చెన్నూరు మండలం. కడప రిమ్స్లో నూతన శానిటేషన్ కాంట్రాక్ట్ విధానంలో డిగ్రీ అర్హతతో వున్న నన్ను ఎలాంటి సిఫారసు లేఖ లేకపోయినా సూపర్వైజర్గా చేర్చుకుని నెలరోజుల పాటు పనిచేయించుకున్నారు. వేతనం కూడా ఇవ్వకుండానే వెళ్లిపొమ్మంటున్నారు. నిరుద్యోగులుగా వున్న మాకు న్యాయం చేయాలి. నూతన కాంట్రాక్టర్ మమ్మల్ని సూపర్వైజర్లుగా విధుల్లోకి తీసుకోవాలి. – బ్రహ్మపుత్రారెడ్డి, అంగడివీధి, చింతకొమ్మదిన్నె మండలం. -
వివాహిత ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు
బద్వేలు అర్బన్ : వివాహితను వేధించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన ఓ యువకుడిని సోమవారం బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అర్బన్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ లింగప్ప వెల్లడించారు. బి.మఠం మండలం మల్లెగుడిపాడు గ్రామానికి చెందిన మన్నెం మల్లేశ్వరి బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తూ పట్టణంలోని కోటిరెడ్డినగర్లో నివసిస్తుండేది. గత నెల 26న మల్లేశ్వరి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఆమె తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. విచారణలో గతంలో మల్లేశ్వరి దిరసవంచ సచివాలయంలో పనిచేస్తున్న సమయంలో అదే సచివాలయంలో వలంటీర్గా పనిచేస్తున్న పీరయ్య అనే యువకుడు మల్లేశ్వరితో చనువుగా ఉంటూ ఆమెకు వివాహమైన తర్వాత కూడా తనతో చనువుగా ఉండాలని, లేకుంటే గతంలో తనతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను, వాట్సాప్ చాట్లను నీ భర్తకు పంపుతానని బెదిరిస్తుండేవాడు. దీంతో ఒత్తిడికి గురైన మల్లేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇదే సమయంలో పీరయ్య దిరసవంచ గ్రామ పంచాయతీ వీఆర్ఓ ఓబుల్రెడ్డి మహేశ్వర్రెడ్డి వద్దకు వెళ్లి మల్లేశ్వరి చనిపోవడానికి తానే కారణమని నేరం అంగీకరించాడు. ఈ మేరకు వీఆర్ఓకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పీరయ్యను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడప రిమ్స్లో ఇష్టారాజ్యం.!
కడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనివిధానం ‘ఇష్టారాజ్యం’గా తయారైంది. గతనెల 1వ తేదీ నుంచి తిరుపతికి చెందిన ‘పద్మావతి శానిటేషన్ వర్క్స్’వారు శానిటేషన్ కార్మికుల నియామకం, పనితీరు కోసం కాంట్రాక్ట్ చేసుకునేందుకు అనుమతులు లభించాయి. వారు 15 రోజుల తరువాత ఎంఓయు ప్రక్రియను కడప రిమ్స్లో ప్రారంభించారు. రిమ్స్ ఆవరణంలో మొత్తం ఏడు క్యాంపస్లు ఉన్నాయి. వాటిలో కడప జీజీహెచ్లో ఐపీ, ఓపీతోపాటు, ప్రభుత్వ వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్యశాల, కేన్సర్ హాస్పిటల్ వారితో ఎంఓయు కుదుర్చుకోవాలి. వీటిలో ఎంఓయు ప్రక్రియను కొన్నింటిని పూర్తి చేశారు. కొన్నింటి ఫైల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విధానం ముగియకముందే నూతన శానిటేషన్ కాంట్రాక్టర్ తరపున నియమించిన ప్రతినిధులు తమ సంస్థ నిబంధనల మేరకు సూపర్వైజర్లను, శానిటేషన్ కార్మికులను నియమించుకుని పనులను చేయిస్తామని ప్రారంభించారు. ఈ క్రమంలో రిమ్స్ ఆవరణంలో గత 18 సంవత్సరాలుగా సూపర్వైజర్లుగా పనిచేస్తున్న వారిలో డిగ్రీ ఉత్తీర్ణత లేని వారిని నిలుపుదల చేసేందుకు వారిని సర్టిఫికెట్స్ తీసుకుని రమ్మని పట్టుబట్టారు. అలాగే కార్మికులలో మహిళలుగానీ, పురుషులుగానీ 50 సంవత్సరాలు పైబడిన వారిని కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో శానిటేషన్ సూపర్వైజర్లు, కార్మికుల తొలగింపు ప్రక్రియకు వ్యతిరేకంగా తమను అకస్మాత్తుగా ఎందుకు తొలగిస్తారని మూడు రోజుల క్రితం సీఐటీయూ, ఆర్సీపీ యూనియన్ల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూనియన్ నాయకులు మాత్రం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్లను, కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తామని నూతన శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వాహకులను హెచ్చరించారు. కాంట్రాక్ట్ నిబంధనలు ఏవైనా వుంటే కొత్తగా ఎవరినైనా నియమించుకునేందుకు వర్తింప చేయాలనీ, కానీ గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారిపై తాజా నిబంధనలను రుద్దడం సరికాదని తేల్చి చెప్పారు. మరోవైపు పాత వారిని తీసివేస్తామనే ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి కొందరు సూపర్వైజర్లను, శానిటేషన్ కార్మికులను హుటాహుటిన నియమించుకుని నెలరోజులపాటు కొందరితో, పదిరోజుల నుంచి 15 రోజులపాటు కొందరితో పనిచేయించుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వారిలో కొందరిని రావొద్దని కొత్త సూపర్వైజర్లను, కార్మికులను శానిటేషన్ కాంట్రాక్టర్ తరపున వున్న ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీంతో నెలరోజులకే తొలగింగింపునకు గురైన సూపర్వైజర్లు, కార్మికులు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను నిలదీయగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలుంటేనే తాము నియమించుకునేందుకు అంగీకరిస్తామని తమ యజమాని చెప్పారని వారు పేర్కొన్నారు. దీంతో ఐపీ విభాగంలోని కార్యాలయం వద్ద బాధిత కార్మికులు ఆందోళన చేపట్టారు. శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్ల నియామకంలో గందరగోళం అడ్డగోలు నియామకాలతో తలనొప్పిగా మారిన వ్యవహారం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు ఉంటేనే నియమించుకుంటామంటున్న కాంట్రాక్టు సంస్థ నెల రోజులు పని చేసిన తర్వాత ఇదేమి విడ్డూరమని కార్మికుల ఆందోళన ఈ విషయంపై రిమ్స్ అడ్మినిస్ట్రేటర్ రంగస్వామి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఎస్.ఎస్ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నూతన శానిటేషన్ కాంట్రాక్టర్కు, యూనియన్ నాయకులకు మధ్య త్వరలో చర్చలు నిర్వహిస్తామన్నారు. తరువాత కార్మికులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
రైతులను నట్టేట ముంచిన సచివాలయ ఉద్యోగి
సింహాద్రిపురం : రెండు రోజుల క్రితం రూ.6.25 లక్షల పింఛన్ డబ్బులతో పరారైన మండలంలోని అంకాలమ్మ గూడూరు సచివాలయం వీహెచ్ఏ ఎం.ప్రవీణ్ కుమార్ రెడ్డి అవినీతి బాగోతం ఒక్కొక్కటి వెలుగు చూస్తోంది. సబ్సిడీ శనగల కోసం 126 మంది రైతుల వద్ద దాదాపు రూ.8 లక్షల డబ్బులను శనగ విత్తనాల రిజిస్ట్రేషన్ కోసం తీసుకున్నాడు. అలాగే ఎరువుల కింద రైతుల వద్ద దాదాపు రూ.5 లక్షలకుపైబడిన నగదు తీసుకున్నాడు. కేవలం తెల్ల పేపర్ మీద రాసి ఇచ్చాడు. అంతేకాకుండా సహోద్యోగులు, రైతుల వద్ద అప్పుగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సోమవారం రైతులు అతనిపై కేసు నమోదు చేయాలని వెళ్లగా.. సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ రవికుమార్ తెలిపారు. సొంతూరులో పోలీసు బృందాలు తనిఖీ చేసి అతని బైకును తెచ్చామన్నారు. దీంతో రైతులు దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. కానీ రెండు రోజుల్లో తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 223 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు,, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు. మేనిఫెస్టో ఘనం అమలు శూన్యం – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి వీరపునాయునిపల్లె : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో ఘనంగా ఉందని, అయితే ఆచరణలో మాత్రం శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని యన్.పాలగిరి గ్రామంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సామాన్య ప్రజలు మొదలుకుని రైతులు, ఉద్యోగులను వంచనకు గురి చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు మూసేసినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించి దేశంలో మరణాల శాతం తక్కువగా నమోదు చేశామన్నారు. మళ్లీ అలాంటి సంఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అలాంటి మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడటం దారుణమన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపురం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి నియోజకవర్గ బీసీ నాయకుడు శివయాదవ్, నాయకులు నాగమునిరెడ్డి, చెండ్రాయుడు, గురివిరెడ్డి, జంగంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జనార్దన్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
లేఖ రాసుకో... బహుమతి అందుకో
● తపాల శాఖ ఆధ్వర్యంలో పోటీలు ● జాతీయస్థాయిలో మొదటి బహుమతి రూ.50 వేలు ● దరఖాస్తులకు ఆఖరు తేదీ డిసెంబర్ 8 కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్టాంపుల సేకరణపై ఆసక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా భారతీయ తపాల శాఖ పోటీలను నిర్వహిస్తోంది. 2025 –26 సంవత్సరానికి గాను ధాయి ఆఖర్ ఉత్తరాల పోటీలను జాతీయ స్థాయిలో చేపడుతున్నారు. ‘లెటర్ టు మై రోల్ మోడల్’ అనే అంశంపై ఇంగ్లీష్, హిందీ, అన్ని ప్రాంతీయ భాషల్లో ఉత్తరాలు రాసేలా అవకాశం కల్పించారు. జిల్లాలో 18 ఏళ్ల లోపు, 18 ఏళ్లు దాటిన వారిని రెండు విభాగాలుగా విభజించి ఈ పోటీలను నిర్వహించనున్నారు. చేతితో రాసిన లేఖలకే అనుమతి... ఎన్వలప్ కేటగిరిలో ఏ4 సైజు పేపర్లో 1000 పదాల కంటే ఎక్కువ మించకుండా రాయాలి. ఇన్ల్యాండ్ లెటర్ కార్డు (ఐ ఎల్ సి) కేటగిరిలో 500 పదాల కంటే ఎక్కువ ఉండకూడదు. చేతితో రాసిన లేఖలకు మాత్రమే అనుమతిస్తారు. డిసెంబర్ 8 తర్వాత పోస్ట్ చేసిన ఉత్తరాలు పోటీల్లో పాల్గొనేందుకు అంగీకరించరు. 18 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాలు పైబడిన వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇలా రాసిన ఉత్తరాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, కడప, వైయస్సార్ కడప జిల్లా– 516001 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. రాసే ఉత్తరాల్లో సంతకంతో పాటు వయసు రాయాలి. చిరునామాపైన ఎంట్రీ ఫర్ ధాయ్ ఆఖర్ 2025 –26 అని రాసి పోస్ట్ చేయాలి. ఈ పోటీలకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8 వరకు గడువు ఉంది. బహుమతులు ఇలా... జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిస్తే రూ.50వేలు, ద్వితీయ స్థానానికి రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10 వేలు, తృతీయ స్థానానికి రూ.5వేలు ఇస్తారు. -
రాఘవేంద్ర ‘దక్షత’కు పురస్కారం
రాయచోటి టౌన్: ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) గుండాల రెడ్డి రాఘవేంద్రను ప్రతిష్టాత్మక ‘దక్షత’ అవార్డు వరించింది.రాయచోటికి చెందిన ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ఒడిశా–చత్తీస్గడ్ రాష్ట్రాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లల్లో రాఘవేంద్ర కీలకంగా వ్యవహరించారు. ఈయన దక్షతకు పురస్కారం లభించింది.నకృల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసినందుకు గతంలో ఒడిశా ప్రభుత్వం నుంచి డీజీపీ డిస్క్ పురస్కారం పొందారు ఓబులవారిపల్లె: రేణిగుంట–నంద్యాల డెమో ప్యాసెంజర్ రైలుకు బ్రేక్ సిస్టం సమస్య తలెత్తడంతో ఆదివారం ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రేణిగుంటలో బయలుదేరాల్సిన రైలు ఇంజిన్లో సమస్య రావడంతో మధ్యాహ్నం మూడున్నరకు మరో ఇంజిన్ను జోడించి పంపించారు. ప్రతి స్టేషన్లో ఆగిపోయేది. రైల్వే మెకానిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా మరమ్మతు చేయలేకపోయారు. రాత్రి 9 గంటలకు ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్కు రాగానే బ్రేకుల్లో సమస్య తలెత్తడంతో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రైల్వేశాఖ అధికారులు తిరుపతి–గుంటూరు ఎక్స్ప్రెస్ రైలుకు ఓబులవారిపల్లిలో స్టాపింగ్ కల్పించి వారిని పంపించారు. కడప రూరల్: క్రైస్తవులలోని క్యాథలిక్లు ప్రతి సంవత్సరం నవంబరు రెండో తేదీని ‘సకల ఆత్మల పండుగ’గా పాటిస్తారు. తమ కుటుంబాలలో మరణించిన వ్యక్తుల ఆత్మ శాంతి కోసం ఆ రోజు పూజలు నిర్వహిస్తారు. తమ ఆత్మీయుల సమాధుల దగ్గరకు వెళ్లి, వాళ్లకు దైవానుగ్రహం లభించాలని, మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్ సోల్స్ డే సందర్భంగా ఆదివారం ప్రపంచ ఆత్మల స్మరణ దినోత్సవం నిర్వహించారు. కడప కొత్త రిమ్స్ వద్ద గల సమాధుల తోట, మాసాపేటలోని దొరల గోరీల వద్ద క్రైస్తవులు మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించారు. కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనల ద్వారా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ బిషప్ శామ్యూల్ బాబు తోపాటు బిషప్, పాస్టర్ల ద్వారా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ దానం పాల్గొన్నారు. -
● పెరిగిన వ్యయం..
2001లో చెయ్యేరు, పెన్నా, గుంజన నదులకు లక్షల క్యూసెక్కులు వరద పొటెత్తింది. 30టీఎంసీలు వృథాగా పోయింది. ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు సబ్ సర్ఫేస్ చెక్డ్యాం నిర్మించాలని అప్పటి సీఎం చంద్రబాబుఆదేశించారు.అప్పటి ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య సీఎంను కలిసి ప్రతిపాదనలు ఇచ్చారు. 2002లో నాలుగు సర్పేస్ చెక్డ్యాంలు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశించారు. సీఎం గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ● 07.07.2003లో నాబార్డు, గ్రామీణాభివృద్ధిశాఖ, నీటిపారుదలశాఖ అధికారులు సమావేశమై హైలెవల్ మానిటరింగ్ కమిటీని తెరపైకి తీసుకొచ్చారు.ఈ కమిటీ రాజంపేట, పెనగలూరు, నందలూరు మండలాల పరిధిలో ప్రవహించే చెయ్యేరు, గుంజన నదులపై నాలుగు సబ్ సర్ఫేస్డ్యాంల నిర్మించాలని సూచించింది. దీంతో మైనర్ ఇరిగేషన్ సెక్టార్ కింద రూ.6.45కోట్ల నిధులు మంజూరుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆ నిధులను ఏమయ్యాయో ఇప్పటి వరకు అంతుపట్టడంలేదు. ● నీటిపారుదలశాఖ 55 చెక్డ్యామ్ల నిర్మించేందుకు ప్రాథమిక నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అప్పట్లో నిపుణుల కమిటీని జిల్లాకు పంపి వరద నీటి గణాంకాలను పరిశీలించి చెక్డ్యామ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ విషయంలో జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని బాబు వెల్లడించారు. గతంలో వచ్చిన నిధులను నీటిపారుదలశాఖ వినియోగించుకోక పోవడం వల్ల ఇప్పుడు వ్యయం మూడురెట్లు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చెక్డ్యాంల నిర్మాణం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. -
ప్రభుత్వ కార్యకలాపాలు తెలుగులోనే సాగాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రాథమిక విద్య, ప్రభుత్వ కార్య కలాపాలు తప్పనిసరిగా తెలుగులోనే జరగాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. జానమద్ది శతజయంతి సందర్భంగా ఆదివారం కడపలోని బ్రౌన్ గ్రంథాలయం ఎదుట జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాల ప్రదానోత్సవానికి వెంకయ్యనాయు డు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి విద్యలు దేశ భాషల్లోనే సాగాలన్నారు. న్యాయస్థానాల్లో వాద ప్రతివాదా లు, తీర్పులు తెలుగులో సాగేలా చూడాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉందన్నారు. షాపులు, రెస్టారెంట్ల బోర్డులు తప్పనిసరిగా తెలుగులో ఉండే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో ఉండాలన్నారు. మిగతా భాషలు నేర్చుకోవడానికి తాను వ్యతిరేకం కాదని, అయితే మాతృభాషను విస్మరించరాదన్నారు. మన భాష, ఆహారం, పద్ధతులు, సంప్రదాయాలను పాటించాలని సూచించారు. స్వర్ణభారతి ట్రస్టు తరఫున తన కుమార్తె బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధి కోసం రూ. 5 లక్షల విరాళాన్ని ఇవ్వనుందని తెలిపారు. బ్రౌన్కు శాశ్వత చిరునామా సభకు అధ్యక్షతన వహించిన కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ బ్రౌన్కు శాశ్వత చిరునామా ఏర్పాటు చేసిన ఘనత డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్త్రికే దక్కుతుందన్నారు. బ్రౌన్ గ్రంథాలయ బడ్జెట్ ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, గ్రంథాలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్రూ. 50 లక్షలకు పెంచాలన్నారు. బ్రౌన్ గ్రంథాలయంలో ఏదో ఒక రాష్ట్ర స్థాయి అకాడమిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పురస్కారాల ప్రదానం: రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్, ప్రసారభారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు, కర్ణాటక రాష్ట్రంలో 20 లక్షల పుస్తకాలతో సొంతంగా గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న మరె అంకేగౌడలకు ఈ సందర్భంగా జానమద్ది స్మారక సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. చివరగా 2025లో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అధికమార్కులు సాఽధించిన బాల వికాస్పాఠశాల విద్యార్థులు గౌసియా, నీనాసహన, ప్రదీప్కుమార్, దీపిక, రిహానా హుస్నాలకు వెంకయ్యనాయుడు మెమెంటోలు అందజేశారు. అలాగే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డు సాధించిన చిత్రకారుడు ఆనందరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, స్టేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ తదితరులు పాల్గొన్నారు. బ్రౌన్ గ్రంథాలయానికి రూ. 5 లక్షల విరాళం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమ్మభాష తెలుగును మరువరాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప అన్నారు. రాబోయే తరాలకు మన సంస్కృతి, వ్యవహారాలు, కట్టుబాట్లు అందించడానికి భాష తోడ్పడుతుందన్నారు. కళలు, భాషా సాహిత్యాలను చరిత్రలో ప్రోత్సహించిన రాజులే నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని తెలిపారు. తెలుగు ప్రజల హృదయాల్లో బ్రౌన్ చిరస్థాయిగా నిలిచిపోయే కృషి చేసిన జానమద్ది హనుమచ్చాస్త్రి అభినందనీయుడన్నారు. -
జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: జిల్లాలోని జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో ఎర్రగుంట్లలో 13.4 మి.మీ, ప్రొద్దుటూరులో 8, చాపాడులో 3.2, ముద్దనూరులో 0.4 మి.మీ వర్షం కురిసింది. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బద్వేలులోని బిజివేముల వీరారెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల మైదానంలో ఈ నెల 4వ తేదీన 35వ సబ్ జూనియ ర్స్ బాల బాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ గురు శేఖర్, సెక్రటరీ వెంకట సుబ్బయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 99498 38864, 91334 80661 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కడప కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొ రేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థలో తొలిసారిగా డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661కు కాల్ చేయడం ద్వారా తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ తీసుకువచ్చి, వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. ఈనెల 3వ తేది సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులు మొబైల్ నంబరు 91333 31912కు చాట్ చేయడం ద్వారా కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను విని యోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయు డు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. పాత పీజీఆర్ఎస్లో నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం పాత పీజీఆర్ఎస్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునని పేర్కొన్నారు. జమ్మలమడుగు: మైలవరం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులెటర్ ద్వారా గాలేరు–నగరి వరద కాలువ ద్వారా ప్రతిరోజూ 10వేల క్యూసెక్కుల కు పైగా నీరు గండికోట ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రెండువేల క్యూసెక్కుల నీరు మైలవరం జలాశయానికి చేరుతోంది. దీంతో మైలవరం నిండా నీటితో తొణికిస లాడుతోంది. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.148 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి కంటే ఎక్కువ నీరు నిల్వ ఉండటంతో ప్రతిరోజు రెండువేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రతిరోజు ఐదువేల క్యూసెక్కుల నీరు పెన్నాలోకి విడుదల చేయగా.. .ప్రస్తుతం ఆ నీటిని రెండువేలకు తగ్గించా రు. కాగా పెన్నాలోకి నీరు రావడంతో తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండదని పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మైలవరం జలా శయం నుంచి ప్రతిరోజు పెన్నాలోనికి 2183 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
భక్తుల ప్రాణాలకు భద్రతేదీ!
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఘటనపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబుతో కలిసి ఆదివారం సాయంత్రం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొట్టిశ్రీరాములు సర్కిల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారానికి ఒడిగట్టి అపచారం చేశారన్నారు. ఈ 18 నెలల్లో ఎంతోమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాతపడ్డారని, తాజాగా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల భద్రతకు, రక్షణకు వినియోగించాల్సిన పోలీసులను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేందుకు, వేధించేందుకు వినియోగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. అది ప్రైవేటు ఆలయమని చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూడటం సరైంది కాదన్నారు. పోలీసులకు ఒక రోజు ముందే సమాచారం ఇచ్చామని ఆలయ నిర్వాహకులు చెప్పారని, ఆ వెనువెంటనే వారిచేతనే మాట మార్పించారన్నారు. కూటమి ప్రభు త్వంలో ఒక భక్తులకే కాదు మహిళలకు, చిన్నపిల్లలకు ఎవరికీ రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు, అకృత్యాలు జరుగుతుంటే పోలీసు శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, గాయపడిన 25 మందికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నుంచి డైవర్షన్ చేసేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన ప్రమాణం చేసి నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా సిద్ధ్దమని ప్రకటించినా టీడీపీ నేతలు స్పందించలేదని గుర్తు చేశారు. ఈ అరాచకాలు ఎంతో కాలం సాగవని, ఇలాగే ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, డా. సొహైల్, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, జమాల్వలీ, బంగారు నాగయ్య, సీహెచ్ వినోద్, సుభాన్ బాష, షఫీ, షఫీవుల్లా, పవర్ అల్తాఫ్, శివకోటిరెడ్డి, షంషీర్, త్యాగరాజు, కంచుపాటి బాబు, పస్తం అంజి, పి. సంపత్, అరీఫుల్లాబాష, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, ఉమామహేశ్వరి, నారాయణమ్మ, సుజిత, సుశీలమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మృతులకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి కొవ్వొత్తుల ప్రదర్శనలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా,అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు -
ఘనంగా బ్రహ్మంగారి జయంతి ఉత్సవాలు
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.ఈసందర్భంగా రెడ్డెమ్మతల్లీ దీవించమ్మా అంటూ వేడుకున్నారు. అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉద యం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, భద్రయ్యస్వామి, బ్రహ్మయ్యస్వామి, దత్తస్వామిలతో పాటు రెండవ భార్య కుమారులు కలసి పార్క్లో ఉన్న బ్రహ్మంగారి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి మహానంది దేవాలయం నుంచి వచ్చిన తలంబ్రాలతో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయ అధికారులతో పాటు మఠం నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో మరణాలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 9 మంది మహిళలు మృతి చెందారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం రాచమల్లు విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని, దాన్ని మనం ఏమీ చేయలేమని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాడునాయుడు చెప్పడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు చంద్రబాబు ఇంట్లో జరిగితే ఈ మాటలను అంత సులభంగా చెప్పేవారా అని ప్రశ్నించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఎండోమెంట్ పరిధిలో లేదని, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చెప్పడాన్ని అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. కాశీబుగ్గ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే సమాచారాన్ని ఆలయ నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం అందించారన్నారు. అయినా పోలీసులు పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం అవుతోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపుతున్నారు.. చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని బంద్ చేసి పేషెంట్లను చంపితే.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికుండగానే చంపేశారని రాచమల్లు అన్నారు. అలాగే ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టి మహిళలను చంపుతారు.. నకిలీ మద్యంతో పురుషుల ప్రాణాలను తీస్తున్నారని ధ్వజమెత్తారు. కాశీబుగ్గ ఆలయం ఘటన జరిగిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అనుమతించలేదన్నారు. మోంథా తుపానును అడ్డుకున్నానని బాబు గొప్పలు చెప్పడం సిగ్గు చేటన్నారు. మోంథా తుపానును ఆపగలిగిన చంద్రబాబు కాశీబుగ్గ ఆలయంలో భక్తుల ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు, ,క్షతగాత్రులకు రూ. 10 లక్షలు అందజేసి మంచి వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మహిళల మరణాలకు బాధ్యత వహించి హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి -
6న గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాలని ఈనెల 6న జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోంథా తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు చేలోనే పడిపోయాయన్నారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 13వేల ఎకరాలలో వరి, మినుము, కంది, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పెసర, నువ్వు, పదివేల ఎకరాల పైబడి ఉద్యాన పంటలైన ఉల్లి, మిరప, టమాటా లాంటి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. గత ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులే ప్రీమియం చెల్లించాలన్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం సవాలక్ష షరతులు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. -
బాల్యంపై తల సీమియా పోటు
● పేదరికంతో వైద్యం చేయించలేకున్న తల్లిదండ్రులు ● దాతలు ఆదుకోవాలని వేడుకోలు మైదుకూరు : అందమైన బాల్యంలో తోటి పిల్లలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఈ బాలుడు ఎప్పుడూ నీరసంగా తల తిరుగుతూ ఒక్కోసారి నొప్పితో పోటెత్తుతూ శాపగ్రస్తుడిలా ఉండాల్సి వస్తోంది. భవిష్యత్తుపై బంగారు కలలు కనాల్సిన ఈ బాలుడు అలా నిస్తేజంగా ఉండటానికి కారణం ఈ బాలుడికి తల సీమియా వ్యాధి సోకడమే. మైదుకూరులోని సర్వాయిపల్లె రోడ్డుకు చెందిన షేక్ అబ్దుల్ మత్తీన్ అనే 8 ఏళ్ల ఈ బాలుడు తల సీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. పేదలైన తల్లిదండ్రులు నూర్జహాన్, అమీర్ బాషా ఈ బాలుడికి వైద్యం చేయించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్న అమీర్ బాషా దంపతులకు ముగ్గురు పిల్లలు. తలసీమియాతో బాధపడుతున్న మత్తీన్ మూడో సంతానం. రెండేళ్ల క్రితం రక్తం ఎక్కించగా అది మెదడులోకి చేరింది. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేయించగా బాలుడికి తలసేమియా వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. ఈ రెండేళ్లలో బాలుడి చికిత్స కోసం ఆస్పత్రులకు తిరుగుతూ తల్లిదండ్రులు రూ.4లక్షలు దాకా ఖర్చు చేశారు. ప్రస్తుతం కడప రిమ్స్ ఆస్పత్రిలో 15 రోజులకోమారు బాలుడికి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. హైదరాబాద్లోని లిటిల్ స్టార్ ఆస్పత్రిలో చూపించగా పిల్లవాడికి బోన్ మ్యారోను ఎక్కించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పారు. ఇందు కోసం రూ.15లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. ఆస్పత్రికి చెందిన వైద్యుడు రమణకు పరిచయం ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వారు ఆపరేషన్కు రూ.10లక్షలు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వీరికి ఇంకో రూ.5లక్షలు కావాల్సి ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి రూ.5లక్షలు తలకు మించిన భారమే అవుతుంది. దాతలు ముందుకు వస్తే బాలుడి వ్యాధి నయమై లేత జీవితం చిగురిస్తుంది. దాతలు ఆర్థిక సహాయం అందించాలని మత్తీన్ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం అందజేసే దాతలు బాలుడి తల్లి నూర్జహాన్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) అకౌంట్ నంబర్ 104010100200315, ఐఎఫ్సీ కోడ్ నంబర్ UB1 N 0810401కి పంపాలని కోరుతున్నారు. -
కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటలు నిద్ర, ఎనిమిది గంటలు శ్రమ, ఇతర పనుల కోసం ఎనిమిది గంటలు చేయాల్సి ఉండగా వాటికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ డిసెంబర్ 31, జనవరి 4 , 2026 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు కె. సత్యనారాయణ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెన్నూరుకు చెందిన ఎం.సూర్యచంద్ర అలియాస్ సూరి (28) సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో పులివెందుల దారి వెళ్లి తిరిగి వస్తుండగా వేగం అదుపు చేయలేక డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విద్యుత్ తీగలు తెగి రెండు గేదెలు మృతి కొండాపురం : విద్యుత్ లైన్ కింద పశువులు మేత మేస్తుండగా ఉన్నట్టుండి మెయిన్ లైన్కు చెందిన తీగ తెగిపోవడంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానికుల వివరాల మేరకు మండల పరిధిలోని బెడుదూరు గ్రామానికి చెందిన బి.డేవిడ్ పాడిపరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. గేదెలను మేపుకొనేందుకు రామిరెడ్డిపల్లె వైపు శనివారం ఉదయం వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సాయంత్రం విద్యుత్ తీగ తెగి రెండు గేదెల మీద పడటంతో అవి మృతి చెందాయి. రెండు గేదెల విలువ సుమారు రూ. 1.40 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. బాలిక అదృశ్యం ముద్దనూరు : మండలంలోని కొత్తపల్లె గ్రామంలో బాలిక అదృశ్యమైనట్లు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు అదృశ్యమైన బాలిక పులివెందులలోని ఓ మిల్లో పనిచేస్తోంది. శనివారం ఉదయం మిల్లో పనిచేయడానికి వెళ్లింది. అయితే రాత్రివరకు తిరిగి ఇంటికి రాలేదు. బాలిక తల్లి బంధువులను, చుట్టుపక్కలవారిని విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : అనారోగ్యం భరించలేక మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం పుంగనూరు మండలంలో జరిగింది. ఈడిగపల్లె పంచాయతీ కమ్మవారిపల్లెకు చెందిన సురేంద్ర భార్య రేఖ(36) గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో లేని సమయం చూసి అనారోగ్యాన్ని భరించలేక మనస్తాపంతో పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య మదనపల్లె రూరల్ : మద్యానికి బానిసై మనస్తాపంతో ల్యాబ్ టెక్నీషియన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. పోతబోలు పంచాయతీ సిద్ధమ్మగారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు ఉపేంద్ర(30) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుండేవాడు. చాలాకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో పనిమానేసి స్వగ్రామానికి వచ్చి స్థానికంగా ఉన్న పనులకు వెళ్లేవాడు. అతిగా ఉన్న మద్యం అలవాటుతో అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం భార్య కృష్ణవేణిని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెలోని పుట్టింటికి కేదారవ్రత నోములకు అవసరమైన వంట చేసుకుని వచ్చేందుకు పంపాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన భార్య పోలీసులకు సమాచారం అందించింది. -
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం రెండవ రోజు 68 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 89.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 249 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని తాహిర్ 63 పరుగులు, ఆష్ఖాన్ 49 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని యశ్వంత్ సూర్య 3 వికెట్లు, అఖిత్ ఫరీక్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 31 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిషి 27 పరుగులు చేశాడు. కడప జట్టులోని ముని జ్ఞానేశ్వర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో... అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో అనంతపురం –నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 86 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 83.4 ఓవర్లకు 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ తేజ 84 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సాయి చరణ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 45 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్కే సమీర్ 59 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని రోహితేశ్వర్ రాజు 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. సాయి చరణ్, నెల్లూరు, (4 వికెట్లు)ముని జ్ఞానేశ్వర్, కడప, (3 వికెట్లు)తాహిర్, కడప (63 పరుగులు)ఆష్ఖాన్, కడప (49 పరుగులు)మోక్షజ్ఞ తేజ, అనంతపురం (84 పరుగులు) -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాల దాడి
వేంపల్లె : వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త (జగనన్న మిషన్ అడ్వైజర్) కుంచం రాఘవరెడ్డిపై టీడీపీ గుండాలు దాడికి దిగారు. ఆదివారం స్థానిక కడప రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద రాఘవరెడ్డిపై తువ్వపల్లె గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి తోపాటు మరో 30 మంది కట్టెలు, రాడ్లతో దాడి చేశారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నెల రోజులుగా ఫేస్బుక్లో గోపీనాథ్ రెడ్డి రెచ్చిపోయే విధంగా పోస్టులు పెడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని పలుమార్లు హెచ్చరించినా.. నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న స్వగృహానికి వెళుతుండగా కాపు కాచి రాడ్లతో తల, వీపుపై కొట్టి గాయపరిచారు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో వారు పారిపోయారు. గాయపడిన రాఘవరెడ్డిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
7.5 టన్నుల కందిపప్పు బ్లాక్ మార్కెట్కు ?
ప్రొద్దుటూరు : ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేసిన కందిపప్పు డీలర్లు, అధికారులు కలిసి బ్లాక్ మార్కెట్కు తరలించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు చౌకదుకాణాల గోడౌన్ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలు ఉన్నాయి. మొత్తం 166 రేషన్ షాపులు ఉండగా, నిబంధనల ప్రకారం బియ్యం, చక్కెరతోపాటు కార్డుదారులకు కందిపప్పు అందించాల్సి ఉంది. ఉన్నతాధికారులు గోడౌన్కు ఆలస్యంగా కందిపప్పు సరఫరా చేశారు. మొత్తం రేషన్ కార్డుల్లో కేవలం 8 శాతం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రకారం ప్రొద్దుటూరు గోడౌన్కు 7.5 టన్నుల కందిపప్పును అధికారులు డీలర్లకు అందించారు. ఎంపిక చేసిన రేషన్ డీలర్లు తమ పలకుబడిని ఉపయోగించి కందిపప్పును తీసుకెళ్లారు. అప్పటికే బియ్యం పంపిణీ పూర్తి కావడంతో కంది పప్పు ఇచ్చినా.. ఇవ్వకపోయినా పట్టించుకోరని డీలర్లు బ్లాక్ మార్కెట్కు కందిపప్పు తరలించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కందిపప్పు కేజీ రూ.67లకు విక్రయిస్తుండగా బయట మార్కెట్లో రూ.100పైగా పలుకుతోంది. దీంతో డీలర్లు, అధికారులు కలిసి కంది పప్పును బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ సంస్థ డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్ను వివరణ కోరగా కందిపప్పు సరఫరా చేయలేదని, ఆరోపణలు వచ్చిన మాట నిజమేనన్నారు. తాను స్వయంగా ఆయా రేషన్ షాపులను పరిశీలించానని, గత నెలలో సరఫరా చేసిన కందిపప్పును డీలర్లు ఇప్పుడు పంపిణీ చేస్తున్నారన్నారు. రేషన్ షాపుల్లో యథావిధిగా కందిపప్పు బస్తాలు ఉన్నాయని తెలిపారు. -
కాంగ్రెస్, టీడీపీ నుంచి 100 మంది వైఎస్సార్సీపీలో చేరిక
కడప కార్పొరేషన్ : తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వంద మంది యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం 35వ డివిజన్లోని నకాష్లో దుబాయ్ జీనియస్ స్కూలు పక్కన నిర్వహించిన కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ఏ షంషీర్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యువతీ యువకులు వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇస్మాయిల్, గౌస్బాషా, కలీముద్దీన్, అహ్మద్ అలీ, అలీబాషా, నదీమ్, అలీముద్దీన్, షేక్ షఫీవుల్లా, ఆరీఫ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకు లు బీహెచ్ ఇలియాస్, సుబాన్బాషా, పి.జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అక్రమం
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ అన్నారు. ఆదివారం ౖజిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలపై రాజకీయ దాడులు, అక్రమ కేసులు, వేధింపులు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశపూర్వకంగా ఇరికించారన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసిన జోగి రమేష్ సవాల్పై టీడీపీ నేతలు ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రతీకారంతో జరిగినదేనని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీని, జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జోగి రమేష్ సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషనన్ దాఖలు చేశారని, అది విచారణకు రాకముందే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. కాశిబుగ్గ ఆలయ తొక్కిసలాటలో ప్రజల ప్రాణనష్టం, మోంథా తుఫాను సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను మర్చిపోయేలా డైవర్షన్ చేసేందుకే ఈ అరెస్ట్ చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల శివ యాదవ్ , వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ -
ప్రపంచంలో భారతదేశాన్ని
మాట్లాడుతున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకటయ్యనాయుడు కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు తెలివితేటలకు సాన పెట్టి కొత్త సవాళ్లను అధిగమిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని మేటిగా నిలిపేలా.. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భోదించారు. ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు యువత తమ మేధాశక్తికి సానపెట్టి కొత్త సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనంలోని అన్నమయ్య సెనేట్ హాలులో వైవీయూ వీసీ బెల్లకొండ రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుక సందర్భంగా విద్యార్థులతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమెరికా స్నేహం అవసరం అనుకున్నా దేశ సార్వభౌమత్వాన్ని ఫణంగా పెట్టడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరన్నారు. అమెరికా వైట్హౌస్ అధ్యక్షుడు మోదీని డిన్నర్కు ఆహ్వానించినా హాజరుకాలేదన్నారు. అయనే అంత క్రమశిక్షణతో ఉన్నప్పుడు నేటి యువత మరింత క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చినంత ఈజీగా రాజకీయ నాయకులు రోజుకోపార్టీ మారుతున్నారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లను మైకులు విరగగొట్టడం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి వేదికగా మార్చారన్నారు.ప్రస్తుతం బూతులు మాట్లాడటం జరుగుతోందని, అయితే ప్రజలు వారికి పొలింగ్ బూతులోనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. జీవిత సత్యాలను బోధించిన మహనీయుడు యోగి వేమన జీవిత సత్యాలను బోధించిన మహనీయుడు యోగివేమన అని, ఆయన శతకం చదివితే జీవితాన్ని చదివినట్లే అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వైవీయూలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కార్యక్రమం కోసం కడపకు వచ్చానన్నారు. ఇందులో భాగంగా యోగివేమన విశ్వ విద్యాలయాన్ని సందర్శించానన్నారు.ఇన్నేళ్ల తన అనుభవంలో తెలుసుకున్న విషయాలను విద్యార్థులు, యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో దేశంలోని విశ్వ విద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటీలు సందర్శిస్తున్నట్లు చెప్పారు. కడపజిల్లాలో యోగివేమన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చరిత్రాత్మకంగా, సాంస్కతికంగా, ఆధ్యాత్మికంగా కడపజిల్లా తెలుగువారికి అత్యంత ఇష్టమెన ప్రదేశం అన్నారు. మత సామర్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన శ్రీమతి తిమ్మక్కలు ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. తెలుగు కవయిత్రి మొల్ల గోపవరం అడపడుచు అన్నారు.శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన, రామభద్రుడు కూడా కడపజిల్లాకు చెందిన వారే అని అన్నారు.సీపీబ్రౌన్ కడపజిల్లా జేిసీగా పనిచేస్తూ తెలుగుభాషపై మక్కువ పెంచుకుని, భాషాభివృద్ధికి కృషి చేశారన్నారు. కడపజిల్లా సాంస్కృతిక, కళా సాహిత్య, ఆధ్యాత్మి కతలకు నెలవని కొనియాడారు. భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ గొప్పదనం, తెలుగుభాష తీయదనం విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అన్నారు. ప్రపంచంలోని 12 మల్టీ నేషనల్ కంపెనీల్లో భారతీయులు సీఈవోలుగా ఉన్నారని వివరిస్తూ దేశం బలోపేతం కావాలంటే, యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను వినియోగించాలన్నారు. వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన చిత్రకళ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రం ఆకట్టుకునేలా ఉన్నాయని మెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పెద్దల మాటలను ప్రతిఒక్కరూ పాటించి సన్మార్గంలో నడవాలని సూచించారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి శ్రీనివాస్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాలో ఈనెల 5వ తేదీ నుంచి జరిగే ఉరుసు ఉత్సవాలకు రావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆహ్వానించారు. శనివారం కడపకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతిని దర్గా భక్తులు కలిశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దర్గా చరిత్రను తెలుసుకున్నానని తెలిపారు. మత సామరస్యానికి పెద్ద దర్గా ప్రతీకగా నిలుస్తోందన్నారు. అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై దర్గా భక్తులను ఆయన అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు -
కాశీబుగ్గ ఘటన విషాదకరం
పులివెందుల : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో భక్తులు వేల సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఏకాదశి రోజున ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో కూడా తిరుపతిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందన్నారు. తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం అందుకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. కాశీ బుగ్గలో వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఉండాల్సిందన్నారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ కోరారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరిపంట నేలకొరగడంతో యంత్రాలతో కోయడం సాధ్యపడక దాంతో ఖర్చుపెరిగే అవకాశం ఉందన్నారు. దిగుబడి సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. దెబ్బతిన్న అన్ని పంటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశీలన బృందంలో అధికారులు, సిబ్బందితోపాటు రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామ్మోహన్, మనోహర్, అన్వేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు వేముల : యురేనియం పరిధిలోని గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షలతోపాటు శస్త్ర చికిత్సలు చేసేలా పుష్పగిరి కంటి ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీఎస్ఆర్ గ్రాంట్ కింద రూ.24.20 లక్షల చెక్కును పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రధాన వైద్యుడు సూర్యప్రకాష్కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు కేటాయించామన్నారు. తుమ్మలపల్లె ప్రాజెక్టు పరిసర గ్రామాల్లోని పేద రోగులకు పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రతి ఏటా 5వేల కంటే ఎక్కువ కంటి శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తుందన్నారు. మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం ఎస్.కె.బర్మాన్, సీఎస్ఆర్ ఇన్చార్జి నవీన్కుమార్రెడ్డి, యురేనియం అధికారులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
వల్లూరు(చెన్నూరు) : మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచిమరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. చెన్నూరు మండల పరిధిలోని గుర్రంపాడు పంచాయతీ ఓబులంపల్లెలో ఇటీవల కురిసిన వర్షాలకు నేల కొరిగి దెబ్బతిన్న వరి పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మట్టి నమూనా సేకరణ నుంచి నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించడమేకాక పంట చేతికొచ్చి పంటను సరైన ధరకు అమ్ముకునే వరకు రైతుకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కనీసం ఎరువులను కూడా అందించలేక పోయిందన్నారు. ఉల్లిని కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయలేదని, హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందిస్తామని ఇవ్వలేదని, సున్నా వడ్డీ, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులను ఎగనామం పెట్టిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అనే సీఎం చంద్రబాబు ఆ మాటను నిజం చేయడానికి శాయ శక్తులా కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాధారణంగా రైతులకు ప్రకృతి వైపరీత్యాలు, చీడ ,పీడలు శత్రువులని, కానీ చంద్రబాబు నాయుడు వాటికంటే ప్రధాన శత్రువన్నారు. కమలాపురం నియోజకవర్గంలో కుందూ, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వరి, పూల తోటలు, ఉల్లి, మినుము వంటి పంటలు వర్షాలకు దెబ్బతినగా ఇంత వరకు అధికారులు కనీసం వాటిని పరిశీలించక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, కమలాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుమ్మళ్ల సాయి కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు చల్లా వెంకటసుబ్బారెడ్డి, చల్లా శివారెడ్డి, వారిస్, హస్రత్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కమలాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలు
మైదుకూరు : మైదుకూరు – ప్రొద్దుటూరు రహదారిలో పట్టణ శివారులో ఉన్న బైపాస్ సమీపంలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన అజీజ్ బాషా, బాబు అనే వ్యక్తులు ఇంటి నిర్మాణంలో టైల్స్ వేసే పని చేస్తుంటారు. శనివారం మైదుకూరులో ఓ ఇంటిలో టైల్స్ పని చేసి తిరిగి గ్రామానికి బైక్పై వెళుతుండగా బైపాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అజీజ్బాషా, బాబుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైదుకూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదుపు తప్పిన స్కూల్ బస్సు కాశినాయన : మండలంలోని కొట్టాలపల్లె చెరువు కట్టమీద శనివారం ప్రైవేట్ స్కూల్ టైర్ పంచర్ కావడంతో వరి మళ్లలోకి వెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పొలాల్లోకి దింపాడు. ఆ సమ యంలో బస్సులో ఐదుగురు విద్యార్థులు ఉండగా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చారు. కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి ఖాజీపేట : గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేయడంతో సుమారు 18 గొర్రెలు మృతి చెందాయి. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన బత్తల ఓబులేసు యాదవ్కు గొర్రెలు ఉన్నాయి. శనివారం కమలాపురం మండలం కొత్తపల్లె గ్రామంలోని పొలాల్లో మేపు కోసం గొర్రెలను వదిలి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల గుంపు వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 18 గొర్రెలు మృతి చెందగా మరో 10 తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాయి. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
ప్రొద్దుటూరులో నర్సింగ్ హోం సీజ్
● లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోపణలు ● రిజిస్ట్రేషన్ లేకుండానే నాలుగేళ్లుగా నర్సింగ్ హోం నిర్వహణ ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని గాంఽధీరోడ్డులో ఉన్న సీఎన్ఆర్ నర్సింగ్హోంను వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యుడు ప్రతాపరెడ్డి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీతా, జిల్లా వైద్యాధికారుల బృందంతో కలిసి ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యుడు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో గత నెల 28న డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత ఆస్పత్రిని తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆస్పత్రిలో ఉన్న మొబైల్ స్కానింగ్ మిషన్ను మరో చోటికి తరలించినట్లు గుర్తించారు. దీంతో స్కానింగ్మిషన్ను సీజ్ చేసి కడప డీఎంహెచ్ఓ కార్యాలయానికి తరలించారు. తదుపరి చర్యల నిమిత్తమై డాక్టర్ ప్రతాపరెడ్డితో మాట్లాడాలని వైద్యాధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్ఓతో పాటు కడప నుంచి వైద్యాధికారుల బృందం శనివారం సీఎన్ఆర్ నర్సింగ్ హోంకు వచ్చారు. ఆస్పత్రిలోని ల్యాబ్ గది, డాక్టర్ ఓపీ గదులను సీజ్ చేశారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు గది ఉండగా.. ఈ వ్యవహారంలో ఆమె ప్రమేయం లేని కారణంగా సీజ్ చేయలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాలేదు లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే ఆరోపణలపై ఆస్పత్రిని సీజ్ చేయడానికి జిల్లా వైద్యాధికారులు వచ్చిన నేపథ్యంలోఆస్పత్రికి సంబంఽధించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. సీఎన్ఆర్ నర్సింగ్హోం రిజిస్ట్రేషన్ గడువు ముగిసి నాలుగేళ్లయింది. అప్పటి నుంచి ఆస్పత్రి నిర్వాహకులు రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేసుకోలేదు. కేవలం ఫిర్యాదులు వస్తే తప్ప సంబంధిత జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడటం లేదు. గత 28న తనిఖీ చేయడానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ వచ్చి వెళ్లిన రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం ఆస్పత్రి నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. స్కానింగ్ మిషన్ను మరో చోటికి తరలించరాదు రిజిస్ట్రేషన్లో పొందు పరిచిన విధంగా కాకుండా ఒక గది నుంచి మరో గదికి స్కానింగ్ మిషన్ను మార్చినా నేరం అవుతుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత అన్నారు. ఆస్పత్రిలోని గదులను సీజ్ చేసిన అనంతరం డాక్టర్ గీత మీడియాతో మాట్లాడారు. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు గత నెల 28న సీఎన్ఆర్ నర్సింగ్హోను తనిఖీ చేశామన్నారు. ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ మిషన్ను ఒక ఆర్ఎంపీ క్లినిక్కు తరలించినట్లు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో స్కానింగ్ మిషన్ను సీజ్ చేసి డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపించామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువు కాలేదని, తమకు ఆధారాలు ఏమీ దొరకలేదన్నారు. కేవలం స్కానింగ్ మిషన్ను మరో చోటికి తీసికెళ్లినట్లు మాత్రమే నిర్ధారణ జరిగిందన్నారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ గడువు ముగిసి నాలుగేళ్లు అయిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మూడు నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. అయినా వారు ఖాతరు చేయలేదన్నారు. రెన్యువల్ కోసం రెండు రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు. తనిఖీల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత, డెమో భారతి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 69.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిషిత్ 44 పరుగులు చేశాడు. కడప జట్టులోని మునిజ్ఞానేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆష్ఖాన్ (31) నాటౌట్గా నిలిచాడు. కర్నూలు జట్టులోని హేమంత్ ఒక వికెట్ తీశాడు. దీంతో కడప జట్టు కర్నూలు స్కోరు కంటే 57 పరుగులు వెనుకంజలో ఉంది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు అనంతపురం –నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 58.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కిన్ను కిషల్ 48 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని రోహిత్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 37 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని శ్రీచరణ్ 2 వికెట్లు, తీశాడు. రిషిత్, కర్నూలు (44 పరుగులు)రోహిత్ రెడ్డి, అనంతపురం (6 వికెట్లు)జ్ఞానేశ్వర్, కడప (4 వికెట్లు) -
నేడు బ్రహ్మంగారి జయంతి
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధ కర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 417 సప్త దశోత్తర చతుశ్యత జయంతి మహోత్సవాలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేనేజర్ ఈశ్వరా చారి తెలిపారు. సమీపంలోని పార్క్ లో ఉన్న స్వామి విగ్రహానికి క్షీరాభిషేకం, రాత్రికి కల్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. కడప రూరల్: అల్ సోల్స్ డే సందర్భంగా ఆదివారం ప్రపంచ ఆత్మల స్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ డాక్టర్ బిషప్ కె సామ్యూల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవ్యాప్తంగా క్రై స్తవులు మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించి, కొవ్వొత్తుల వెలిగించి ప్రార్థనల ద్వారా స్మరించుకుంటారని పేర్కొన్నారు. క్రైస్తవ కుటుంబాలు బిషప్, పాస్టర్ల ద్వారా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. ఆ మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు కొత్త రిమ్స్ వద్దు గల క్రై స్తవుల సమాధుల తోటలో మరియు 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాసాపేట లోని దొరల గోరీల వద్ద సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు సెల్ నంబరు 9573037770 ను సంప్రదించాలని పేర్కొన్నారు. కడప సెవెన్రోడ్స్: అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గాలేరు – నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎన్ఎస్ఎస్ (ఎల్ఏ) స్పెషల్ కలెక్టర్ (ఎఫ్ఏసీ)గా విధులు నిర్వహించిన ఎస్.నీలమయ్య రిలీవ్ అవ్వడంతో ఆ స్థానాన్ని అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించడం జరిగింది. ఆ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్లో జీఎన్ఎస్ఎస్ (ఎల్ఏ), కడప స్పెషల్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పథకంలో భాగంగా అన్ని రకాల భూసేకరణ, పరిహారం, విస్తరణ సంబందిత అన్నిరకాల పరిపాలన వ్యవహారాలను సమర్థవంతంగా పెండింగ్ లేకుండా చర్యలు చేపడతామన్నారు. రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్టమహోత్సవాల్లో భాగంగా శనివారం టీటీడీ పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం భగవతుపణ్యాహం, శాంతిహోమం, మహాకుంభారాధనం, విష్ణుగాయత్రీ పంచసూక్తపూర్వకమూర్తి హోమం, శాత్తుమర, తీర్థగోష్టి చేపట్టారు. సాయంత్రం మూర్తిహోమం, విష్ణుసహస్రనామ పారాయణం, జలాధివాసనము, పూర్ణాహుతి నిర్వహించారు. . కడప సెవెన్రోడ్స్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి అధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శింపజేశారు. అనంతరం ఆమె స్థానిక శివాలయంలో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ కుమార్, న్యాయమూర్తులు ప్రవీణ్ కుమార్, ప్రత్యూష, ఈశ్వర్ దేవాంగలు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ కడప అర్బన్: కడప నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రాష్ట్ర హైకోర్టు జడ్డి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను శనివారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేశారు. -
పులివెందులకు రైలుకూత!
రాజంపేట: పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సంగతి విధితమే. ముద్దనూరు–ముదిగుబ్బ రైలుమార్గం నిర్మాణంతో దశాబ్ధాలుగా పులివెందుల వాసులు ఎదురు చూస్తున్న రైలుకూతకు మార్గం సుగమం అయింది. ఈ మార్గం కడప–బెంగళూరుకు మరో రైలుమార్గంగా నిలవనుంది. వైఎస్సార్ కడప జిల్లాలో ముద్దనూరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ స్టేషన్లకు కనెక్టివిటీ రైల్వేలైన్గా మారబోతుంది. ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య రైల్వేలైన్ నిర్మితం చేయనున్నారు. ● పులివెందుల మీదుగా ఈ మార్గం ప్రణాళిక చేయడం ద్వారా కడప జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలు పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేగంగా ఎదగనున్నాయి. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్యానవనపంటలు, ఖనిజసంపద,బొగ్గు వంటి వనరుల రవాణా సులభతరం అవుతుంది. ఎలక్ట్రానిక్, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు రాయలసీమలో స్ధిరపడటానికి ఈ లైన్ మౌలిక సదుపాయంగా నిలుస్తుంది. ● ఈ రైలుమార్గం నిర్మితం కానున్న నేపథ్యంలో నాలుగో జంక్షన్గా ముద్దనూరు రైల్వేస్టేషన్ నిలవనుంది. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా రైలుమార్గంలో ఓబులవారిపల్లె, కడప, ఎర్రగుంట్ల జంక్షన్లు ఉన్నాయి. సీమలో రవాణా సౌకర్యాలు... ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీ సత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది.ఈ లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు విస్తృతమవుతాయి. ముద్దనూరు–ముదిగుబ్బ ప్రాంతాల మధ్య 65 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బడ్జెట్లో రైలుమార్గం ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు.ముదిగుబ్బ రైల్వేస్టేషన్ గుంతకల్–బెంగళూరు రైలుమార్గంలో ఉంది. జిల్లాలోని ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో సంబంధిత రైల్వే విభాగం అఽధికారులు డీపీఆర్ (డిటైయిల్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేశారు.రైల్వేబోర్డుకు డీపీఆర్ వెళ్లింది. 2020లో అప్పటి రైల్వేబడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైన్ను రైల్వేమంత్రిత్వ శాఖ తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో సర్వే కోసం అరకొరగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. 2025 బడ్జెట్లో కొత్తలైన్కు ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు. ముద్దనూరు–ముదిగుబ్బ రైలుమార్గానికి రైల్వేబోర్డుకు ఆమోదం తెలిపింది. రైలుమార్గం నిర్మితం కోసంప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ,2,505,89 కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం ద్వారా నాలుగు నుంచి ఐదుగంటలు పట్టే ప్రయా ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నాలుగో జంక్షన్గా ముద్దనూరు ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య లైన్ అంచనా వ్యయం రూ.2,505.89 కోట్లు -
నకిలీమరక.. ప్రజల్లోకి వెళ్లేదెలా?
మదనపల్లె: ములకలచెరువులో అక్టోబర్ 3న నకిలీమద్యం తయారీ ప్లాంట్ వెలుగుచూడటంతో యావత్ రాష్ట్రం ఉలికిపాటుకు గురైంది. ఆరోజు కడప ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, ఎకై ్సజ్ పోలీసులు జరిపిన దాడులతో తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఆందోళళనకు గురయ్యారు. ఈ వ్యవహరంలో టీడీపీ నేతల ప్రమేయం వెలుగులోకి రావడం, నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పార్టీనుంచి సస్పెండ్ కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితులతో తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టయ్యింది. మొన్నటిదాక టీడీపీ ఇన్చార్జిగా జయచంద్రారెడ్డి వద్దంటూ ఆ పార్టీ నేతలు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించగా ఇప్పుడు నకిలీమద్యం మరకతో ప్రజల్లోకి వెళ్లడం ఎలా అన్న అంతర్మథనం నెలకొంది. క్షేత్రస్థాయిలో ప్రతిష్ట పోయింది నకిలీమద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి పేరు నిందితుల జాబితాలో చేర్చడంతో నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్ట మసకబారింది. పీటీఎం టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు అరెస్ట్, తదితర అంశాలు ఆ పార్టీని ఆంతర్మథనంలో పడే శాయి. ఈ వ్యవహారం వెవెలుగులోకి రాకముందు వరకు టీడీపీ శ్రేణులు జయచంద్రారెడ్డిని వ్యతిరేకించినప్పటికీ అధికారంలో ఉన్నామన్న ఉత్సాహంతో కనిపించారు. సొంతగానే కార్యక్రమాలను నిర్వహించుకొంటూ వచ్చారు. అయితే ఈ కేసు తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఒకరకంగా చతికిలపడిపోయారు. నకిలీమరకతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అని పార్టీనేతలు చర్చించుకుంటున్నారు.జయచంద్రారెడ్డి వర్గీయులు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు. ● టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డితోపాటు ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్, ఇంటి పనిమనిిషి అన్బురాసు నకిలీమద్యం కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిప్పటికీ అరెస్ట్ కాలేదు. నకిలీమద్యం కేసులో టీడీపీ నేతల ప్రమేయం స్పష్టంకావడంతో వారు ఏమిచెప్పినా నమ్మే పరిస్థితులు లేనంత లోతుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్ళు తామంతా నకిలీమద్యం తాగామన్న భయం వారిలో నెలకొంది. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిందా అన్న భయం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ టీడీపీ నేతలు దీనిపై నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. ములకలచెరువు నకిలీమద్యం తయారీ కేసుతో మసకబారిన టీడీపీ ప్రతిష్ట జయచంద్రారెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేసినా ఆస్థానంలో కొత్త వారు ఎవరో పార్టీతేల్చలేదు. ఎవరి నియమిస్తారో కనీసం ఊహకై నా చెప్పడంలేదు. పరిస్థితి చూస్తుంటే ఇన్చార్జి నియామకం ఇప్పట్లో లేనట్టే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ కేంద్రకార్యాలయంలో నియోజకవర్గ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించగా ఎవరికివారు ఇన్చార్జి పేరును ప్రతిపాదించినా అది నా పరిధిలో లేదంటూ ఆయన తప్పించుకున్నారు. ఇంతలో ఓ నేత ఇన్చార్జి పదవి ఆశిస్తున్నట్టు చెప్పడంతో ఆ నేతపై విరుచుకుపడ్డంతో వివాదం అవుతుందని సమావేశం ముగించేశారు. తంబళ్లపల్లె విషయంలో ఆదినుంచి నెలకొన్న వివాదాలతో పార్టీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తుండగా ఇప్పుడు నకిలీమద్యం తయారీ కేసు వ్యవహారం ఉక్కరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఇన్చార్జి విషయం తేల్చే అవకాశం లేదు. -
హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యత
కడప అర్బన్ : హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హోంగార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ షె ల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆయన హోంగార్డ్ యూనిట్ల పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో హోంగార్డులకు దర్బార్ పెరేడ్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దురలవాట్లకు దూ రంగా వుండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీ స్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పాలసీలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలరెడ్డి, హోంగార్డ్స్ పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి రాయితీ రాని ఎస్సీ ఎస్టీలు ఈనెల 3తేదీ సోమవారం కడప కలెక్టరేట్ వద్దకు రావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర కోరారు. శనివారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీలు 2021 ఆగస్టు నుంచి సబ్సిడీ రాక రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఒత్తిళ్లతో అధిక వడ్డీలకు అప్పుచేసి ఈఎంఐ చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా సబ్సిడీ రాని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఈనెల 3 తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. -
సారస్వతమూర్తి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
● నేడు శత జయంతి వేడుకలు ● ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప సెవెన్రోడ్స్ : తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన డాక్టర్ జానమద్ది శత జయంతి వేడుకలు ఆదివారం కడపలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆ సారస్వతమూర్తి గురించి.... బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటులో.. తెలుగుభాష పరిరక్షకులుగా ఆంగ్లేయుడు సీపీ బ్రౌన్ అనంత కీర్తిని పొందారు. ఆయన సాహితీ కృషిని తెలుగు వారికి అందజేసిన ఘనత డాక్టర్ జానమద్దికే దక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖలో బ్రౌన్ పరిశోధన విభాగం 1974లో ఏర్పాటైంది. ఆచార్య జీఎన్ రెడ్డి పర్యవేక్షకులుగా, బంగోరే (బండి గోపాల్రెడ్డి) పరిశోధకులుగా పరిశోధన ప్రారంభించారు. బ్రౌన్ రచించిన రీడర్లు, సాహిత్య ఆత్మకథ ఆధారంగా వీరివురు కడపలో బ్రౌన్ నివసించిన బంగళా శిథిలాలను గుర్తించారు. అప్పుడు ఆ స్థలం ఆడిటర్ సీఆర్ కృష్ణస్వామి ఆధీనంలో ఉంది. 1976లో జానమద్ది జిల్లా రచయిత సంఘం మహాసభలను కడపలో నిర్వహించారు. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ఆరుద్ర, జీఎన్ రెడ్డి, బంగోరే ఆ సభల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారు కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి బ్రౌన్ నివసించిన ప్రదేశంలో స్మారక గ్రంథాలయాన్ని నిర్మించాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి జానమద్ది హనుమచ్ఛాస్త్రితో కలిసి స్థల యజమాని కృష్ణస్వామితో చర్చించారు. గ్రంథాలయ నిర్మాణానికి 20 సెంట్ల స్థలం ఉచితంగా ఇచ్చేందుకు కృష్ణస్వామిని అంగీకరింపజేయడంలో జానమద్ది కృషి ఎంతో ఉంది. అలా 1987 జనవరి 22న గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బ్రౌన్ నివసించిన బంగళా మొండి గోడల నుంచి నేడు మహాసౌధంగా రూపుదిద్దుకుందంటే అందుకు జానమద్ది నిరంతర, అలుపెరగని కృషే కారణం. ఆయన లేకుంటే గ్రంథాలయమే లేదు. అందుకే డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆయనకు బ్రౌన్ శాస్త్రి అని కితాబిచ్చారు. కైఫియత్తులు తీసుకురావడంలో.. ప్రకాశం పంతులు శతజయంతి సభల్లో పాల్గొనేందుకు జానమద్ది మద్రాసు వెళ్లినప్పుడు కై ఫియత్తుల గురించి విన్నారు. రైల్వే టీటీఈగా పనిచేస్తున్న కడపకు చెందిన గాజులపల్లె వీరయ్య సాయంతో తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న జేటీ ఆచార్యులను కలిశారు. కడప కై ఫియత్తులు ఇప్పించాలంటూ నాలుగైదుసార్లు చైన్నెకి వెళ్లి ఆచార్యులను కలిశారు. ఎట్టకేలకు జేటీ ఆచార్యుల ప్రత్యేక శ్రద్ధ వల్ల 44 సంపుటాల కై ఫియత్తుల జిరాక్స్ ప్రతులు 1994 డిసెంబరులో బ్రౌన్ గ్రంథాలానికి చేరాయి. వీటిని జానమద్ది మానసపుత్రుడైన విద్వాన్ కట్టా నరసింహులు పరిష్కరించారు. తెలుగుభాష.. సంస్కృతులపై పట్టు.. జాతీయ స్థాయిలో తెలుగు కవులు, రచయితలతో ఆత్మీయ అనుబంధం గల ఆయన తెలుగు, ఆంగ్ల, కన్నడల్లో పలు రచనలను అనువదించారు. స్వయంగా ఎన్నో పుస్తకాలు రచించారు. అటు ప్రాచీన సాహిత్యం, ఇటు అభ్యుదయ సాహిత్యాన్ని ఒకేలా ఆదరించారు. మాసీమ కవులు, బళ్లారి రాఘవ జీవిత చరిత్ర, సీపీ బ్రౌన్ చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం, కడప సంస్కృతి–దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు తదితర ఆయన రచించిన 16 గ్రంథాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే వివిధ దినపత్రికల్లో 2500కు పైగా వ్యాసాలు రాశారు. జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా గొప్ప కవులను జిల్లాకు ఆహ్వానించి సభలు ఏర్పాటు చేశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని జిల్లాలో సాహితీ సభలకు ముఖ్య కేంద్రంగా మార్చారు. సాహిత్యం పట్ల అభిమానం, అభిరుచి ఉన్న వారిని ఎంతో ఆదరించి ఆ రంగం వైపు ప్రోత్సహించారు. తెలుగుభాష సంస్కృతుల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఏ సమాచారం కావాలన్నా ఆయననే సంప్రదించేవారు. ‘సీమ’వాసి కావడమే శాపం మిణుకుమిణుకు మంటున్న తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం అవిరళ కృషి చేసిన సీపీ బ్రౌన్ను తెలుగు వారు దాదాపు మరిచిపోయిన సమయంలో జానమద్ది ఆయనను వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రౌన్ గ్రంథాలయ ఏర్పాటుతో సహా తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి అమోఘం. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కనీసం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించలేదు. రాయలసీమ వాసి కావడమే ఆయన చేసుకున్న పాపమని పలువురు పేర్కొంటున్నారు. ఆయన భాషా సాహిత్యాలకు చేసిన విశేష సేవలను వివిధ సంస్థలు గుర్తించి పురస్కారాలతో గౌరవించాయి. 1998లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. గ్రంథాలయానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా 2014 అక్టోబరు 20న గ్రంథాలయ ఆవరణలో డాక్టర్ జానమద్ది శిలా విగ్రహాన్ని నాటి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ద్వారా ఆవిష్కరింపజేశారు. జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బ్రౌన్ గ్రంథాలయంలో శతజయంతి సభ నిర్వహిస్తున్నారు. జానమద్ది స్మారక సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విశిష్ట అతిథిగా, కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, స్టేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ఆత్మీయ అతిథులుగా హాజరు కానున్నారు. అనంతరం రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్, ప్రసారభారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు, కర్ణాటకలో 20 లక్షల పుస్తకాల గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న మరె అంకేగౌడలకు ఈ సందర్భంగా పురస్కారాలను అందిస్తున్నారు. నేడు శతజయంతి సభ -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ)సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. పరిశ్రమల ప్రమోషన్కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. పరిశ్రమలకు వివిధ రాయితీల కింద రూ.67.62 లక్షల మేర రాయితీల మంజూరు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వ్యాపార, పెట్టుబడి ధోరణిలో.. పారిశ్రామిక రంగం వైపు అవగాహన నిమిత్తం ఉద్యం‘ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతోందన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఉద్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల రాయితీలను పొందేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్ఏం శ్రీనివాసమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నా రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, డీఆర్డీఏ వీడి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి డిసెంబర్ మొదటి వారం నాటికి అన్ని మండలాలలో అందుబాటులోకి వచ్చేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల పురోగతి పై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని, ఇప్పటికే జిల్లాలో కడప నగరంలో స్మార్ట్ కిచెన్, సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : జాతీయస్థాయి అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలకు మదనపల్లెకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని తన్మయ ఎంపికయ్యారు. ఇటీవల నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికై ంది. నవంబర్ 18వతేదీ నుంచి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అనంతపురం ఆర్డీటీలో నిర్వహించే జాతీయ స్థాయి బాలికల చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటుందని ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్ తెలిపారు. తన్మయికి పుట్బాల్ అసోసియేషన ఉపాధ్యక్షులు జాన్ కమలేష్, సాగర్, సంయుక్త కార్యదర్శులు మహేంద్రనాయక్, క్రీడాభారతి కార్యదర్శి నరేష్ అభినందనలు తెలిపారు. -
అనుమతులు లేనిచోట ఇసుక అక్రమ రవాణా
సాక్షి ప్రతినిధి, కడప : అధికారికంగా ఇసుక అనుమతులు లేకపోయినా టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు.అధికారం అండతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ఉచిత ఇసుక మాటున అక్రమార్జనే ధ్యేయంగా వెంకయ్యకాలువ గ్రామ సమీపంలోని చిత్రావతినదిలో అనుమతులు లేకున్నా.. నిబంధనలు నదిలో తొక్కి మరీ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం ఏటూరు ఇసుక రీచ్కు అనుమతి ఒకచోట పెట్టుకొని వెంకయ్యకాలువ గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో అనుమతులు లేనిచోట పగలు రాత్రి తేడాలేకుండా పొక్లెయిన్లు ఏర్పాటు చేసి టిప్పర్,లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన మైనింగ్ ,పోలీస్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. -
పటేల్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
కడప అర్బన్ : దేశ సమగ్రతను కాపాడిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం ఉదయం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ ’రన్ ఫర్ యూనిటీ’ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీ య ఏక్తా దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి కడప సెవెన్రోడ్స్ : భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యత, సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా వెలుగొందుతున్న భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిస్తున్నామని, అదే ‘ఏక్తా దివస్‘ ముఖ్య ఉద్దేశ్యమని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో రాష్ట్రీయ ‘ఏక్తా దివస్‘ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కలెక్టరేట్ అధికారులతో కలిసి సర్ధార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముందుగా ‘దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషిచేస్తానని‘సభకు హాజరైన వారందరి చేత డిఆర్ఓ ప్రతిజ్ఞ చేయించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, స్టెప్ సీఈఓ విజయ్ కుమార్, మెప్మా ిపీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పొలతల, నిత్యపూజకోనకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ప్రతి సోమవారంజిల్లాలోని పొలతల, నిత్యపూజకోనలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 02.15, 4.45 గంటలకు, నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మద్యాహ్నం 12.30, 3.30 గంటలకు బస్సులు పాత బస్టాండు నుంచి బయలుదేరుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు మాజీ ఉప రాష్ట్రపతి రాకకడప సెవెన్రోడ్స్ : బ్రౌన్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శనివారం కడప నగరానికి వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.40 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు కడప స్టేట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. రాత్రికి స్టేట్ గెస్ట్హౌస్లోనే బస చేస్తారు. ఆదివారం ఉదయం 9.15 గంటలకు స్టేట్ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి 9.20 గంటలకు సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుంటారు. 9.30 నుంచి 11.30 గంటల వరకు బ్రౌన్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. 11.45 గంటలకు బ్రౌన్ లైబ్రరీ నుంచి బయలుదేరి 12.15 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 1.00 గంటలకు కడప ఎయిర్పోర్టునుంచి విమానంలో బయలుదేరి 1.55 గంటలకు చైన్నె ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకడప అర్బన్ : దేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కడప నగర పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పలు సూచనలు చేశారు. నవంబర్ 1, 2 తేదీల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కడప నగర పర్యటన నేపథ్యంలో ఎరమ్రుక్కపల్లి లోని సీపీ బ్రౌన్ భాష పరిశోధన కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ అదనపు ఎస్.పి (పరిపాలన) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నియామకంకడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన కింద తెలియజేస్తున్న వారిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.నరసింహారెడ్డి (మైదుకూరు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ప్రణీత్రెడ్డి (బద్వేలు), జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా కె.లక్ష్మినారాయణరెడ్డి (కమలాపురం)లను నియమించారు. సిజేరియన్ ఆపరేషన్ జరగకుండా చూడాలికడప రూరల్ : సిజేరియన్ ఆపరేషన్ జరగకుండా గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం కడపలో డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి హైరిస్క్ గర్భిణులను సకాలంలో గుర్తించాలన్నారు. వారిని తరచూ సీ్త్ర వ్యాధి నిపుణులకు చూపించాలని తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. . ప్రతి గర్భిణిని సాధారణ కాన్పు కోసం సాధారణ సిద్ధం చేయాలన్నారు. సీ్త్ర వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ సుశీల మాట్లాడుతూ గర్భిణులకు ప్రతి నెల పీఎంఎస్ఎంఏ ప్రోగ్రాం లో రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ హిమాదేవి, డాక్టర్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ శాంతి కుమారి, డాక్టర్ శాంతిలత పాల్గొన్నారు. కడపకు దంపతుల హత్య కేసు నిందితులుకడప అర్బన్ : చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతులను దారుణంగా హత్య చేసిన నిందితులను శుక్రవారం కడప కేంద్రకారాగారానికి పోలీసులు తరలించారు. నిందితులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో భద్రత నడుమ కడప కేంద్రకారాగారానికి తరలించారు. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ చిత్తూరులోని ఆరవ అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. -
విచారణ లేకుండా డిప్యూటేషన్ ఎలా వేస్తారు
కడప ఎడ్యుకేషన్ : తిరుపతి ఇంటర్ డీవీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నన్ను ఎలాంటి విచారణ లేకుండా వేరేచోటుకు డిప్యూటేషన్పై (వర్క్ అడ్జెస్ట్మెంట్) ఎలా వేస్తారని తిరుపతి ఇంటర్ డీడీఈవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మునిచంద్ర అధికారులను ప్రశ్నించారు. దీంతోపాటు ఎయిడెడ్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఏ జీవో ప్రకారం పదోన్నతి ఇస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.ఇందుకు నిరసనగా శుక్రవారం ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ఎదుట సీనియర్ అసిస్టెంట్ మునిచంద్ర ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన రెగ్యులర్ స్థానమైన తిరుపతి డీవీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పోస్టును ఆరోపణలు ఎదర్కొంటున్న మరొకరికి ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే తనపై విచారణ చేయకుండా ముందుగానే మరో చోటికి డిప్యూటేషన్పై పంపించారన్నారు. దీంతోపాటు మరో ఉద్యోగి ఎయిడెడ్ యాజమాన్యం నుంచి వచ్చినా నిబంధనలకు విరుద్ధంగా అతనికి తన రెగ్యురల్ స్థానాన్ని ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు. పలు ఆధారాలతో ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. దీనిపై ఆర్జేడీ సురేష్బాబుతో మాట్లాడగా మునిచంద్రపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి కమిషనర్కు పంపించామన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే ఆతనిని పంపించినట్లు చెప్పారు. మిగతా వారిపై కూడా విచారణ చేసి కమిషనర్ కు నివేదించామని, ఆయన నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇంటిపోరు ఇంతింత కాదయా...!
సాక్షి ప్రతినిధి, కడప : బోద కొట్టంలోకి ఎలుక దూరిందని వెనుకటిరోజుల్లో ఒకామె ఏకంగా ఇంటికి నిప్పు పెట్టిందనే సామెతను గుర్తు చేస్తున్నారు ఓ ఎమ్మెల్యే. అచ్చం అలాగే తన వ్యతిరేకుల్ని చేరదీస్తున్నారన్న ఆక్రోషంతో కార్పొరేషన్ పరిధిని కుదించాలని పట్టుబట్టారు. పొరుగు నియోజకవర్గ పరిధిలోని డివిజన్లను అక్కడికే మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్పొరేషన్ డివిజన్లు పునర్విభజన చేపట్టాలంటూ అభ్యర్థించారు. కలెక్టర్ నివేదిక ఆచరణ సాధ్యం కాదని జవాబు వెళ్లడంతో కమిషనర్పై అగ్గిమీదగుగ్గిలమవుతున్నట్లు సమాచారం. అనువైన నివేదిక ఇవ్వకుండా కలెక్టర్ను తప్పుదారి పట్టించారని మండిపడుతన్నట్లు తెలుస్తోంది. ‘మొగుడు కొట్టినందుకు కాదు, చూసిన తోడుకోడలు నవ్వినందుకే అసలైన బాధ’అన్నట్లుగా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి పరిస్థితి తయారైంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అసంతృప్తి, అసమ్మతి అన్ని చోట్ల ఉంది. కాకపోతే, పొరుగు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ అసమ్మతి గళమిప్పడమే అసలు సమస్యగా మారింది. అసమ్మతి నేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సామాజికవర్గం ఓ మారు గళమిప్పుతూ ప్రజాదృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలా ఇప్పటికి రెండు వేర్వేరు మతాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి తరలివెళ్లారు. ఇలా వెళ్లడం తీవ్రమైన అవమానంగా సదరు ప్రజాప్రతినిధి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పొరుగు నియోజకవర్గ నేత పెత్తనాన్ని కట్టడి చేసేందుకు అడుగులు వేసినట్లు సమాచారం. డివిజన్లు డీలిమేటేషన్ చేయాంటూ అభ్యర్థన... కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 6 డివిజన్లు కమలాపురం నియోజకవర్గ పరిధిలోకి రానున్నాయి. కడప మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినప్పుడు చింతకొమ్మదిన్నె, చెన్నూరు మండలాల్లోని కొన్ని పంచాయతీలు కార్పొరేషన్లో విలీనం చేశారు. ఆ కారణంగా కార్పొరేషన్లో కమలాపురం ప్రాంతం ప్రమేయం ఏర్పడింది. ఇటీవల కడపలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో డివిజన్ల డీలిమిటేషన్ చేయాలంటూ ఓ ప్రజాప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆమేరకు ప్రభుత్వం కలెక్టర్ నివేదిక కోరింది. సాధ్యాసాధ్యాలపై కలెక్టర్ కార్పొరేషన్ యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. తదనంతరం డివిజన్ల పునర్విభజన సాధ్యం కాదని తెలియజేసినట్లు సమాచారం. ఆమేరకు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. కమిషనర్పై గరంగరం.. కార్పొరేషన్ నుంచి 6 డివిజన్లు తప్పిస్తే కమలాపురం నేతల బెడద లేకుండా పోతుందని భావిస్తుంటే, కమిషనర్ అందుకు సహకరించలేదని ఓ ఎమ్మెల్యే ఆక్రోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ ధర్మాన్ని సైతం విస్మరించి అనేక ఘటనల్లో అండగా నిలిచిన అధికారి సైతం తాజాగా తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్థానంలో మరో అధికారిని తీసుకురావాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. సందట్లో సడేమియాలాగా, పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు కొందరు మెప్మాలో పని చేస్తున్న ఓ అధికారితో అంతర్గత మంతనాలు చేసుకొని ఆయన అయితే సమర్థుడని పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడా తతంగమంతా హాట్ టా ఫిక్గా నగరంలో చుక్కర్లు కొట్టుతుండడం విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరాటం కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన చేయాలంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థన కడప నియోజకవర్గ పరిధిని మాత్రమే కార్పొరేషన్గా కొనసాగించాలని ఒత్తిడి కలెక్టర్ వివరణ కోరినా ప్రభుత్వం.. సాధ్యం కాదంటున్న అధికారులు -
బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధ కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన గృహానికి పూర్వ వైభవం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, కడప చాప్టర్ కన్వీనర్ కె. చిన్నపరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రహ్మంగారు నివాసమున్న గృహం పాక్షికంగా కూలిపోయిన నేపథ్యంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు ఇంటాక్ ప్రతినిధులతోపాటు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, బ్రహ్మంగారిమఠం మేనేజర్ ఈశ్వరాచారి తదితరులు శుక్రవారం కూలిపోయిన బ్రహ్మంగారి నివాసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు, దివంగత పీఠాధిపతి సతీమణి మహాలక్షుమ్మ, స్థానిక భక్తులతో వీరు చర్చించారు. కూలిపోయిన బ్రహ్మంగారి నివాసం పాత స్వరూపం చెడిపోకుండా మరమ్మతు చేయిస్తే ఈ నివాసాన్ని దర్శించుకునే భక్తులకు బ్రహ్మంగారి కాలంనాటి వైభవాన్ని గుర్తుకు తెచ్చినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంటాక్ ప్రతినిధులు ఓ.వెంకటేశ్వర రెడ్డి, టీఎస్ గౌరీ శంకర్, స్థానిక భక్తులు ఈశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్పై నిరంతర నిఘా కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో వై ఎస్ఆర్ కడప జిల్లాలో రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను విస్తారంగా తనిఖీ చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు జిల్లా ఇన్చార్జ్ ఉప రవాణా శాఖ కమినర్ వీర్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని సీట్ ఆల్టర్నేషన్స్, ఫైర్ డిటెక్షన్ అలారమ్స్, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనితీరును నిశితంగా పరిశీలించడం జరిగిందన్నారు. గత 7 రోజులలో జిల్లాలో 102 ప్రైవేట్ ట్రావెల్ బస్సులను పరిశీలించి అందులో 59 బస్సులపై కేసులు రాశామన్నారు. రోడ్డు భద్రత నియమాలకు విరుద్ధంగా ఉన్న 3 బస్సులను సీజ్ చేశామన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని స్కూలు బస్సులు మరియు కాలేజీ బస్సులను తనిఖీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వచ్చే పది రోజులలో అన్ని స్కూల్ బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, హ్యాండ్ బ్రేక్, సర్వీస్ బ్రేక్ మొదలైన అన్ని రోడ్డు భద్రతా పరికరాలను సిద్ధంగా చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు నోటీసుల ద్వారా తెలియజేయడమైనదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు. -
తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
బద్వేలు అర్బన్ : మోంథా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గుండంరాజుపల్లెలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరిపంటను సీపీఎం బృందం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో కోత కోసేందుకు సిద్ధమైన వరిపంట తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిందని, దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అన్నారు. నీటమునిగిన పంటలను అధికారులు పరిశీలించి రైతులకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. ఉచిత పంటల బీమా ఎత్తివేతల వలన దాదాపు 6 లక్షల మంది రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచి పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిందు మాధవ రెడ్డి అన్నారు. ఆయన యోగి వేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం స్కాలర్లకు, విద్యార్థులకు ‘డయాబెటిస్, కేన్సర్లో శక్తి సమతుల్యత (ఎనర్జీ హోమియోస్టాసిస్ ఇన్ డయాబెటిస్ అండ్ క్యాన్సర్)’ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఇచ్చారు. కేన్సర్ డయాబెటిస్పై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు గురించి అవగాహన కల్పించారు. ఈ రెండు రంగాలలో జరుగుతున్న పరిశోధనలు, యువ పరిశోధకుల భాగస్వామ్యం గురించి ప్రస్తావించారు. మరో ప్రొఫెసర్ రాజమోహన్ రాయ్ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే ఎలాంటి ఆలోచన విధానాలు ఉండాలి, లక్షణాలను అలవర్చుకోవాలో అవగాహన కల్పించారు. వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆచార్య బిందు మాధవరెడ్డిని, ప్రొ రాజమోహన్ రాయ్లను విశ్వవిద్యాలయం తరపున సత్కరించారు. -
మోంథా ప్రభావం... తెగుళ్లతో జరభద్రం
● మోంథా నుంచి కోలుకుంటున్న రైతులు ● మెలకువలను పాటించాలంటున్న శాస్త్రవేత్తలుకడప అగ్రికల్చర్ : మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం.. నెమ్ము చేరడంతో పంటలు వాడుముఖం పట్టడం తెగుళ్ల బారిన పడడం జరుగుతోంది. వరితోపాటు, మినుము, వేరుశనగ, పత్తి, శనగ రైతులకు ఈ నష్టం తప్పనిసరి. ఇప్పటికే చాలా పంటలు నీటమునిగాయి. రైతులకు ఉపశమనం కలిగించేందుకు కొన్ని మెలకువలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వరి పంట... కోత దశలో పడిపోయిన, నిలిచిన పైరు, కంకిలో మొలకలు కనపడితే పొలం నుంచి నీరు తీసేసి 50 గ్రాముల కల్లు ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నూర్పిడి చేసిన ధాన్యం రెండు, మూడు రోజుల పాటు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజలు మొలకెత్తకుండా క్వింటా ధాన్యానికి కిలో కల్లు ఉప్పు, 20 కిలోల వరిపొట్టు కలపాలి. పైరు నిలబడి ఉన్నా, పడిపోయిన చేలలో గింజలు రంగు మారకముందే పొట్టకుళ్లు, పాముపొడ, మానిపండు తెగుళ్లు రాకుండా ఎకరాకు 200 మి.మీటర్ల ప్రొపిపకోనోజోల్ మందు పిచికారీ చేయాలి. పిలకల దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైరులో ఆకుముడత, కాండం తొలుచు పురుగు, సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. వాటి నివారణకు ఎకరాకు ప్లూబెండమైడ్ 50మి.మీ, గ్రాము పైమెట్రిజిన్తో కలిపి పిచికారీ చేసుకోవాలి మినుము పొలంలో నిలిచిన నీటిని పిల్ల కాల్వల ద్వారా తీసివేయాలి. వేరుకుళ్లు, చిత్తపురుగులు, లద్దెపురుగు నివారణకు 400 మి.మీ అసిఫేట్, హెక్సాకోనజోల్, వేయి గ్రాముల 19:19:19 మందు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. వేరుశనగ పైరు తొలిదశలో ఉన్నప్పుడు మొదలుకుళ్లు, ఆకుమచ్చ తెలుగు ఆశించాయి. నివారణకు కార్బండిజమ్, మాంకోజెబ్ 500 గ్రాములు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగు ఆశించినప్పుడు ఇమామెక్టిన్ జెంబేమేట్ 80 గ్రాములు ఎకరాకు పిచికారీ చేయాలి. కోత దశలో ఉన్న పైరులో వర్షం తగ్గిన తరువాత నీటిని తీసివేయాలి. పత్తి పైరులో నిలిచిన నీటిని తీసేసి ఎకరాకు 40 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. గులాబీరంగు పురుగు, కాయకుళ్లు నివారణకు క్లోరాన్ట్రానిక్ప్కొల్ 60మి.మీ, హెక్సాకోనజోల్ 400మి.మీ, 13:0:45 వేయి గ్రాములు కలిపి ఎకరా పంటకు పిచికారీ చేయాలి. శనగ తొలిదశలో ఉన్న శనగ పంట వేరుకుళ్లుతో చనిపోతోంది. నివాణరకు హెక్సాకొనాజోల్ 400 మి.మీ ఎకరాకు కలిపి పిచికారీ చేయాలి. కంది ప్రస్తుతం కంది పంట శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది. పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. వర్షాలు ఆగాయి కాబట్టి పొటాషియం నైట్రేట్, 19:19:19 ఎరువు 1.0% (10 గ్రా. లీటర్ నీటికి) పిచికారీ చేయాలి. పొడలు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణకు, కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రామాలు లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా నేలపై పిచికారీ(డ్రెంచింగ్) చేయాలి. వర్షాలు ఆగిన తరువాత, మరూక, శెనగపచ్చ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, నోవాల్యూరోన్ 1.0 మి.లీ, స్పైనోసాడ్ 0.3 మి.లీ కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. -
ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్గా విజయ ప్రసాద్
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ గ్రీన్ కార్ప్స్ కడప జిల్లా కో ఆర్డినేటర్ ఏబీ విజయప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు డీఈఓ షేక్ షంషుద్దీన్ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్(ఎన్జీసీ) కార్యక్రమాలను విస్తృత పరిచడం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెంపొందించాలని సూచించారు. ఎన్జీసీ కో ఆర్డినేటర్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ అంశాల మీద పట్టు సాధించడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ పోటీలు, ఎబ్జిబిషన్లు, ప్రాజెక్టులు, నేజర్ క్యాంపులు వంటివి నిర్వంచనున్నట్లు తెలిపారు. -
డ్రోన్తో..పిచికారీ చేసుకోవాలి
అధిక వర్షాలకు భూమిలో తేమ ఎక్కువగా ఉండడంతో భూమి ఆరడం లేదు. ప్రస్తుతం అన్ని పంటలలో పైన సూచించిన మందులను ఎకరాకు 10 లీటర్ల నీటితో కలిసి పిచికారీ చేసుకోవాలి. రైతులు పైరు దశను దృష్టిలో పెట్టుకుని జాగ్రతగా పంటలను కాపాడుకోవాలి. – సునీల్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం అధిక వర్షాలకు నీరు నిలిచి ఏ పంటైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితిని బట్టి పంట పొలాల్లో నిలిచి నీటిని బయటకు పంపాలి. పైన సూచించిన నియమాలను పాటించి పంటను రక్షించుకోవాలి. లేకుంటే అధిక వర్షాలకు పంటలు దెబ్బతింటాయి. అప్రమత్తంగా ఉండాలి. – క్రిష్ణప్రియ, డాట్ సెంటర్ సమన్వయకర్త, ఊటకూరు, కడప -
ప్రశాంతంగా ఇంటర్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పదోన్నతి కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్కు సంబంధించిన పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడప ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్ ఆర్జేడీ సురేష్కుమార్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ను నిర్వహించారు. నాలుగు జిల్లాలకు సంబంధించిన 18 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతికి కల్పించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ముగ్గురికి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదుగురికి, ఉమ్మడి అనంతపురం జల్లాకు సంబంధించి నలుగురికి, ఉమ్మడి కర్నూల్ జిల్లాకు సంబంధించి ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి కల్పించి నిర్వహించి వారికి స్థానాలకు కేటాయించారు. కౌన్సెలింగ్లో తిరుపతి జిల్లా ఆర్ఐవో రాజశేఖర్రెడ్డి, సత్యసాయి జిల్లా డీవీఈఓ చెన్నకేవశ ప్రసాద్, కడప డీవీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ కార్యాలయ ఏవో రూపానాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ పరిధిలో 18 మందికి పదోన్నతులు -
వైఎస్సార్ సంల్పంతోనే రాయలసీమకు నీళ్ళు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పంతోనే రాయలసీమలో నీళ్లు చూస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ ఈనెల 26న ఆలోచనపరుల వేదిక నాయకులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తిగా కాకుండానే పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో రెండు లక్షల కోట్ల అదనపు భారాన్ని రాయలసీమ రైతాంగంపై మోపుతున్నారు అన్న అభియోగాన్ని ప్రస్తావన చేశారు. అందుకు శ్రీనివాసులు రెడ్డి స్పందిస్తూ పంట కాలువల కంటే ప్రధాన కాలువ ముఖ్యం అంటూ కాలం చెల్లిన విధానాలను పట్టుకు వేలాడే కమ్యూనిస్టులు అంటూ, నీటి కోసం ఏడు దశాబ్దాలుగా యుద్ధం చేస్తున్న ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించి నిర్మాణానికి నిధులు కేటాయించి రాయలసీమలో అక్కడక్కడ నీళ్లు చూడగలుగుతున్నామంటే వైఎస్సార్ సంకల్పమే అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలకు గుర్తింపుగా గండికోట ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, వెలుగొండకు పూల సుబ్బయ్య పేర్లను పెట్టి ఉద్యమకారులను గౌరవించిన చరిత్రను శ్రీనివాసులు రెడ్డి తెలుసుకోవాలన్నారు. చారిత్రాత్మకమైన విజయాలు సాధించిన కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ.. ఏ సిద్ధాంతం లేకుండా అవకాశవాద రాజకీయాలకు అడ్డాగా మారిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ.. అన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కారదర్శి వెంకట శివ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
అట్లూరు : బతుకుదెరువు కోసం ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ అదే ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన హృదయ విదారకరమైన ఘటన అట్లూరు మండలం కుమ్మరవారిపల్లె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా త్రిపురాంతకంకు చెందిన దగ్గుల అంజిరెడ్డి (55) 20 ఏళ్ల క్రితం అట్లూరు మండలం కుమ్మరవారిపల్లె గ్రామానికి వచ్చి అదే గ్రామంలో సరస్వతి అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు. ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆయన జీవనం సాగించేవాడు. వారికి కుమార్తె వెంకట నారాయనమ్మ ఉంది. ఆమె 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పక్క ఊరు చిన్నరాజుపల్లికి దగ్గర మాగానిలో ట్రాక్టర్ రోటవేటర్తో అంజిరెడ్డి సేద్యం చేస్తున్నాడు. అయితే ఉన్న ఫలంగా ట్రాక్టర్ బురదలో ఇరుక్కపోవడంతో వెలికితీసే క్రమంలో ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ ఇంజిన్ పల్టీ కొట్టింది. ఆ ఇంజిన్ కింద అంజిరెడ్డి పడిపోయి బుదర కూరకపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందివ్వడంతో స్థానిక ఎస్ఐ రామకృష్ణయ్య తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, కుమార్తె బోరున విలపించారు. వీధిన పడ్డ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. -
నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
భార్గవ్ రెడ్డికమలాపురం: చింతకొమ్మదిన్నె మండలంలో లేని భూమిని సృష్టించి తాను అడ్వాన్స్ తీసుకున్నానని నాపై ఓ పత్రికలో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని బీసీపీపీఎల్ హెచ్ఆర్ మేనేజర్ భార్గవ్రెడ్డి వివరించారు. శుక్రవారం కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ల్యాండ్ గురించి తనకు ఏ మాత్రం తెలియదని, ఇందులో తాను అడ్వాన్స్ తీసుకున్నానని వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొన్నాళ్ల క్రితం తనకు బాగా తెలిసిన ఓ వ్యక్తి వచ్చి తన భూమి ఆన్లైన్ కావడం లేదని రెవెన్యూ అధికారులకు చెప్పాలని నన్ను కోరాడు. తెలిసిన వ్యక్తి కావడం, అందులోనూ పదే పదే అడుగుతుండటంతో తనకు తెలిసిన ఓ అధికారికి ఫోన్ చేసి ఆ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఆన్లైన్ చేయాలని కోరానన్నారు. అయితే ఆ అధికారి ఆ భూమి ఆన్లైన్ కాదని, కుటుంబ సభ్యుల సమస్య ఉందని, దానిని ఏమీ చేయలేమని చెప్పడంతో తాను అదే మాట ఆ వ్యక్తికి చెప్పానని, అంతకు మించి తనకు ఏమీ తెలియదన్నారు. నేను భారతి సిమెంట్ లో పని చేస్తుండటంతో రెవెన్యూలో తిరుగుతుంటానని, దాని వలన అతడు నన్ను ఈ విషయం అడిగాడన్నారు. దానిని బేస్ చేసుకుని వారు అడ్వాన్స్ ఇప్పించుకున్నారేమోనన్నారు. ఆ భూమి గురించి గాని, ఆ సర్వే నెంబర్ల గురించి గాని, అడ్వాన్స్గురించి గాని నాకు తెలియదన్నారు. మూడు రోజుల క్రితం మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి మీ ఫిర్యాదు చేశాడని సీఐ ఫోన్ చేసి రావాలని చెప్పడంతో నేను స్టేషన్కు వెళ్లి ఇదే విషయం చెప్పానన్నారు. మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదన్నారు. సీఐకు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చానన్నారు. -
చిన్నరంగాపురంలో కొండచిలువ ప్రత్యక్షం
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామంలో రైతు మల్లికార్జునరెడ్డి తోటలో శుక్రవారం కొండ చిలువ పాము ప్రత్యక్ష్యమైంది. రైతు తన పొలంలో గడ్డి కోస్తుండగా కొండ చిలువ కనిపించింది. భయంతో గ్రామస్తులు, స్థానికులు తోట వద్దకు వెళ్లి కొండ చిలువ పామును చంపేవారు. రేపు టెన్నికాయిట్ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం టెన్నికాయిట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రామసుబ్బారెడ్డి , జి.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఈ ఎంపికల లో పాల్గొనవచ్చని తెలిపారు. రవాణా చార్జీలను అసోసియేషన్ భరిస్తుందని తెలిపారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాలకు 91826 61748 నెంబర్ను సంప్రదించాలని కోరారు ప్రకృతి వ్యవసాయ అరటి పంట పరిశీలన మైదుకూరు : మైదుకూరు మండలంలోని టి.కొత్తపల్లెకు చెందిన పుత్తా వెంకటసుబ్బారెడ్డి, ఆదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరామయ్య పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి పంటను శుక్రవారం యూకేలోని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన నేల, పర్యావరణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్ కాలిన్స్ బృందం పరిశీలించారు. ప్రధాన పంటకు ముందు 30 రకాల విత్తనాలతో సాగు చేసిన పీఎండీసీ విధానాన్ని ప్రొఫెసర్ కాలిన్స్ రైతు శ్వేతను అడిగి తెలుసుకున్నారు. అలాగే పంట కాండం, ఆకులు నాణ్యతను పరిశీలించారు. మట్టి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు రామనందారెడ్డి పాల్గొన్నారు. -
కూటమి కళ్లకు గంతలు!
రోడ్డంతా గుంతలు.. అడుగుకో గుంతతో ప్రమాదం పొంచి ఉంది. ఏ రోడ్డు చూసినా గోతులతోనే దర్శనమిస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గుంతలు కనిపించవన్నారు.. కొన్నాళ్ల కిందటే రోడ్ల కోసం కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పారు. కోట్లు ఖర్చు చేశారో.. ‘కోట్ల’ వెనక దాచారో గుంతలు పడ్డ ఈ రోడ్లను చూసే తెలుస్తుంది. పచ్చ కళ్లకు కట్టిన గంతలు తీసేస్తే గోతులు పడ్డ రోడ్డు కానొస్తుంది.అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తప్ప పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదని కడప నగర శివార్లలోని ప్రధాన రహదారిని చూస్తే అర్థమవుతుంది. ఈ రహదారుల్లో వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్పా చేసేదేమీ ఉండదని కూటమి నేతల తీరుపై తూర్పారబడుతున్నారు. – ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, కడప పాలెంపల్లె వద్ద అధ్వాన స్థితిలో రోడ్డుదేవునికడప రోడ్డు వద్ద ఫాతిమా కళాశాల వద్ద రింగ్రోడ్డులో బచ్చుంపల్లె వద్ద భారీ గుంత -
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
కడప అర్బన్ : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా ఏఎస్పీ(పరిపాలన) కె.ప్రకాష్ బాబు పేర్కొన్నారు. కడప మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గురువారం సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పండగల సమయాల్లో అందరు ఇళ్లలో ఉంటే .... పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. నిరంతరం ప్రజల పరిరక్షణలో ఉంటున్న పోలీసులకు ప్రజలు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఏఆర్ ఏఎస్పీ బి.రమణయ్య మాట్లాడుతూ పోలీసు శాఖలో విధులు సంక్లిష్టంగా ఉంటాయని, సైనికులు దేశ సరిహద్దుల్లో, పోలీసులు దేశంలోని అంతర్గత శాంతి భద్రతల సంరక్షణ విధులు నిర్వహిస్తూ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం అమరవీరుల త్యాగాలు, వారి సేవలు ప్రజలకు తెలియజేసే విధంగా పోలీసులు బ్యాండ్ షో రూపంలో దేశభక్తి గీతాలు ఆలపించారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.బాలస్వామిరెడ్డి, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు
ఎంపికై న అండర్–14, 17 బాలుర జట్టు ఎంపికై న అండర్–14, 17 జిల్లా స్థాయి బాలికల జట్లు కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో గురువారం ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ముగిశాయి. ఎస్జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ జిలానీబాషా విలేకరులతో మాట్లాడుతూ అండర్–14, అండర్–17 విభాగంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికలు నిర్వహించామని, సుమారు 250కి పైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఎంపికలు జరిపిన అనంతరం జిల్లాస్థాయి పోటీలకు పంపించడం జరిగిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసిన బాలబాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతి కేటగిరీకి ఐదుగురు చొప్పున ఎంపికచేశామన్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న వారిని నవంబర్ 5, 6వ తేదీలలో తిరుపతిలో జరిగే అండర్–17, నవంబరు 25, 26వ తేదీలలో గన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు కడప, ప్రొద్దుటూరు సెంటర్లలో శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్కు ఎంపికై న క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. అండర్–17 బాలుర జట్టు : జి.వేదవ్యాసశర్మ, ఎస్.అమానుల్లాఖాన్, ఎల్.సుప్రీత్రెడ్డి, సి.త్రివిక్రమ్, డి.విశ్వనాథ్ అండర్–17 బాలికల జట్టు : ఎం.రమ్యశ్రీ, బి.హరిణి, లలితాబాయ్, కె.ప్రణవి, కె.శ్రీశరణ్య, బి.భార్గవి అండర్– 14 బాలుర జట్టు : డి.ఈశ్వర్ప్రసాద్రెడ్డి, ఏఎస్.ఆదినారాయణరెడ్డి, ఎం.ఆదిత్య, జె.శ్రీకర్రెడ్డి, పిబిజి.వర్షిత్ అండర్–14 బాలికల జట్టు : ఎల్.పూర్వజ, వి.శ్రీకావ్య, జి.ఆరాధ్య, ఎస్.శృతిక, కె.హ్రితిక -
నాలుగు రోజులుగా రాకపోకలు బంద్
బి.కోడూరు : మండలంలోని మేకవారిపల్లె చిన్నచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం బి.కోడూరు మండల కేంద్రం, సిద్ధయ్యగారి మఠం, బ్రహ్మంగారిమఠానికి జనం రాకపోకలు సాగించలేకపోయారు. కొందరు బి.కోడూరుకు చేరుకుని 15 కిలోమీటర్ల మేర తిరిగి సిద్దయ్యగారిమఠం, బ్రహ్మంగారిమఠానికి వెళ్తున్నారు. మేకవారిపల్లె చిన్న చెరువు అలుగు వద్ద పైపులు వేసి కల్వర్టు నిర్మించి ఉంటే ఇబ్బందులు ఎదురయ్యేవికాదని మండల వాసులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల వాసులు కోరుతున్నారు. -
నేడు జాబ్మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు కడపలోని ప్రభుత్వ ఐటీఐలో 13 కంపెనీలతో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–45 ఏళ్లలోపు కలిగిన అభ్యర్థులు 7, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామా, బీటెక్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో నవంబర్ 7వ తేదీన అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డాక్టర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూ టింగ్, యోగ, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీ లు ఉంటాయన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారు లు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, వీటిలో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలపై ప్రిన్సిపల్తో అటెస్టేషన్ చేయించుకుని రావాలని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయ పరిధిలో జరగుతున్న బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలను గురువారం యూనివర్సిటీ హైపర్ కమిటి సభ్యులు ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రంలో వసతులతోపాటు విద్యార్థులను పరిశీలించారు. పరీక్ష తీరును పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వ ర్ దాసరిమోసే పాల్గొన్నారు. అలాగే విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు పలు సెంటర్లను తనిఖీ చేశారు. కడప వైఎస్సార్ సర్కిల్: ఈనెల 22,23న ఏలూరులో నిర్వహించిన ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి జాతీయస్థాయికి ఎంపికై నట్లు డీఎస్డీఓ గౌస్ బాషా పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారుడైన బి.సాయి 800 మీటర్లలో సిల్వర్ పథకం 400 మీటర్ల సిల్వర్ పథకం, రిలే బంగారు పతకం సాధించారన్నారు. ఏ.సాయి ప్రశాంత్ 1500 మీట ర్లలో కాంస్య పథకం, 400 మీటర్లలో రిలే బంగారు పతకం సాధించారన్నారు. వీరు నవంబర్ 27 నుంచి హర్యానాలో జరిగే జాతీయ స్థా యి పోటీలకు ఎంపికై నట్లు తెలిపా రు. అథ్లెటిక్స్ లో రాణించిన క్రీడాకారులను కోచ్ లు శివగంగా అభినందించారు. మైదుకూరు: మోంథా తుపాను కారణంగా ఉద్యాన పంటలు దెబ్బతిని ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై అంచనా వేయనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ కాంతిశ్రీ, ఉద్యాన అధికారులు బి.శ్రీనివాస్ రెడ్డి, వి.రామకృష్ణ, ఉద్యాన సహాయకులతో కలిసి పలు మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మైదుకూరు, పోరుమామిళ్ల, కాశినాయన, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని లింగందిన్నెపల్లె, చెంచయ్యగారిపల్లె, రామచంద్రాపురం, సావిశెట్టిపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో మోంథా తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న అరటి, ఉల్లి, జామ, మిరప, వంగ, చామంతి పంటలను పరిశీలించి ఎంత మేరకు దెబ్బతిన్నాయి.. నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై అంచనా వేశారు. పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నందున నష్టాన్ని అంచనా వేసి సంబంధిత శాఖలకు నివేదిక అందజేస్తామని తెలిపారు. పంట నష్ట వివరాలను నమోదు చేయండి కాశినాయన: మోంథా తుపాన్ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల నష్ట వివరాలను నమోదు చేయాలని జిల్లా ఉద్యాన అధికారి సతీష్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో తు పాన్ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటలను స్థానిక ఉద్యాన అధికారి శ్రీనివాసులరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. -
వివాహిత ఆత్మహత్య
పీలేరు రూరల్ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం మోడల్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మోడల్ కాలనీకి చెందిన త్రివేణి (25)కి ఏడేళ్ల క్రితం కేవీపల్లె మండలం గోరంట్లపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. గత కొంత కాలంగా తన ఇద్దరి పిల్లలతో త్రివేణి స్థానిక మోడల్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం త్రివేణి పురుగుల మందు తాగి ఇంటిలో పడుకుంది. ఆమె నోట్లో నుంచి నురుగు రావడం గమనించి కుటుంబ సభ్యులు చికిత్సనిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏడుగురిపై కేసు నమోదు
చింతకొమ్మదిన్నె : భూమి అమ్మేస్తామంటూ రూ.60 లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మండలంలోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలంలో తమకు సరైన పత్రాలు, హక్కులు లేకున్నా విలువైన భూమి ఉందని కడప నగరానికి చెందిన కొందరు వ్యక్తులు చెప్పారు. దీంతో కడపకు చెందిన పఠాన్ మహబూబ్ఖాన్ ఆ భూమిని కొనేందుకు రూ.60 లక్షలు ఇచ్చారు. అనంతరం వారు భూమిని అమ్మకపోవడంతో మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఏడుగురు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 20 తులాల బంగారు నగల అపహరణ కమలాపురం : పట్టపగలే దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు నగలను అపహరించారు. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన నీలం పెద్దరెడ్డయ్య తన కుమారుడు చిదంబరంతో కలిసి ప్రొద్దుటూరుకు వెళ్లారు. రెడ్డెయ్య భార్య కింది ఇంటికి వెళ్లింది. ఆమె కళ్లు కప్పి ఇంట్లో వెళ్లిన దుండగులు అల్మారాలో ఉన్న బీగాలు తీసుకుని బీరువా తెరిచారు. అందులో 20 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. అక్కడే ఉన్న రూ.4 వేల నగదు ముట్టుకోలేదు. రాత్రి పెద్దరెడ్డెయ్య వచ్చి చూసుకుని .. బంగారం చోరీ అయినందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రతి రూపాయి దాచి పోగుచేసిన డబ్బుతో కొన్న బంగారం దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఉద్దేశ్యమని పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప ఆర్జేడీ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు రూపొందించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష స్టడీ మెటీరియల్ను వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు మరింత మార్గదర్శకంగా ఉంటుందని, ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. డీఈఓ మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యా ప్రేరణాత్మక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జేవీవీ నాయకులు రాహుల్, సమీర్ బాషా, శివరాం, సరస్వతి, జీసీడీవో దార్ల రుతుఆరోగ్యమేరీ, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
‘మోంథా’తో లక్షల ఎకరాల పంట నష్టం
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో మోంథా తుపాన్ ప్రభావం కారణంగా 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన గురువారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. లక్షల సంఖ్యలో రైతులు పంట నష్టాన్ని చవిచూశారన్నారు. ప్రకృతి రైతులపై కన్నెర చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. వర్షం నీరు రైతుల కన్నీళ్లలో కలిసిపోయాయని, ఇది విచారించదగ్గ విషయమని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు రావడం ఏ ప్రభుత్వంలో అయినా సహజమని, రైతులను ఆదుకునే ఉదార స్వభావం ప్రభుత్వాలకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. వ్యవసాయం దండగ అని గతంలో అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు ద్రోహిగా రైతుల మనసులో మిగిలిపోయాడ న్నారు. ఈఏడు ఖరీఫ్లో, రబీలో ప్రకృతి వైపరీ త్యాల ప్రభావం కారణంగా పంటలు నష్టపోయినా ప్రభుత్వం ఇసుమంతైనా సాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప రైతులను ఆదుకునే మనసు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగు చేసిన వరి, మొక్క జొన్న, పత్తి, మిరప, ఉల్లి, పసుపు లాంటి అన్ని రకాల పంటలు దెబ్బ తిన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. సబ్సిడీ శనగలు కూడా ఇవ్వలేదు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సా యం చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. పంటలకు ఉచిత పంటల బీమా నమో దు చేయడం, ఎరువులు, విత్తనాలు అందించడం, 40 శాతం సబ్సిడీతో శనగలను అందించడం జరిగిందన్నా రు. కూటమి ప్రభుత్వం ఇంతవరకు శనగ విత్తనా లను రైతుల చేతికి అందించలేదన్నారు. 25 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు ఇంకా ప్రణాళికలను తయారు చేసే పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఉందన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5లోపు సబ్సీడీ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో పంటలు దెబ్బతింటే నెల రోజుల్లోపే రైతులకు పరిహారం అందించే పరిస్థితి ఉండేదన్నారు.మోంథా తుపాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎంపీల బలంపైనే ఆధారపడి ఉందని, ఎంపీలు రైతులను ఆదుకునేందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన నష్టాలకుప్రభుత్వం రూపాయి చెల్లించలేదు నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోంది మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
పంటికింద రాయితీ!
చిన్నపరిశ్రమలకు కడప సెవెన్రోడ్స్: నవంబర్ 2 తేదీ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారిక ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ అదితి సింగ్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ ప్రాంగణంలో నిర్వహించనున్న గ్రంథాలయ సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆయన బస చేయనున్న ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద మెడికల్ టీం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అధికారులందరూ జానమద్ది సాహితీ పీఠం వారితో సమన్వయం చేసుకుంటూ, ప్రొటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: ఓ సినిమాలో అడుక్కుంటున్న అలీకి బ్రహ్మానందం అర్థరూపాయి వేసి... తీసుకో.. పండుగ చేస్కో...అంటాడు. దీనికి ఏం పండుగ చేసుకోవాలి.. తొక్కలో అర్థరూపాయి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్లు ఫోజు ఇస్తున్నావేంటి.. అంటూ అలీ వెటకారంగా జవాబిస్తాడు. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల విషయంలో అచ్చం ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది...పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం...ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నాం. సింగిల్ డెస్క్ ద్వారా అన్ని రకాల వెనువెంటనే అనుమతులిస్తున్నామని గొప్పలు పోతూ విశాఖపట్నంలో సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు ముందు పారిశ్రామిక వేత్తలకు ఏదో చేశామని చెప్పుకునేందుకు దీపావళి కానుక పేరుతో రూ.1500 కోట్లు పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా చూస్తే అందులో రూ.1031 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రూ.470 కోట్లను దారి మళ్లించారు. ● వైఎస్సార్ కడప జిల్లాలో 2004 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే 156.51 కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అందులో సగం రాయితీలనైనా ఇస్తుందని పారిశ్రామిక వేత్తలు ఆశించారు. కానీ తీరా ప్రోత్సాహకాలు విడుదలయ్యాక వారు అవాక్కయ్యారు. కేవలం నామమాత్రంగా నిధులు మాత్రమే విడుదలయ్యాయని తెలుసుకొని నవ్వాలో, ఏడవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. మొత్తం 156.51 కోట్ల బకాయిల్లో కేవలం అతి తక్కువ శాతం రాయితీలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం పండుగ చేసుకోమంటోందని పారిశ్రామివేత్తలు వాపోతున్నారు. ఈ రాయితీలు కూడా ఏయే యూనిట్లకు ఎంతెంత ఇచ్చారనే వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వైఖరి చూసి పారిశ్రామిక వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రోత్సాహకాలు ఎంతిచ్చారనేది తెలీదు ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎంత మేర ప్రోత్సాహకాలు విడుదల చేసిందనేది మాకు తెలీదు. మేమైతే జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాం. కొందరు వచ్చాయంటున్నారు, కొందరు రాలేదంటున్నారు. సాధా రణంగా ఎంతమందికి ప్రోత్సాహకాలు ఇచ్చా రో జాబితా రావాలి. ఇంకా రాలేదు. – చాంద్బాషా, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రొటోకాల్ మేరకు ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం జిల్లాలో 2004 ఎంఎస్ఎంఈలకు రూ.156.51కోట్ల బకాయిలు జిల్లాకు నామమాత్రంగారాయితీలు విడుదల విస్తుపోతున్న పారిశ్రామిక వర్గాలు -
కోర్టు స్టే
వల్లూరు: డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఈ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి కడప నగర సమీపంలోని శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ప్రస్తుత ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వీసీ జయరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఈ యూనివర్సిటీని వైవీయూ ప్రాంగణంలోని 21 వ శతాబ్దం గురుకులంలోకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. లీజు అగ్రిమెంట్ నిబంధనలను పక్కనపెట్టి హడావుడిగా యూనివర్సిటీ తరలింపు చర్యలు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. కొనసాగిస్తామని చెప్పి.. నిజానికి శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భవన సముదాయంలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి 2024 డిసెంబర్లో అగ్రిమెంట్ ముగిసింది. ఈ క్రమంలో తమ భవనాలను ఖాళీ చేయాలని యాజమాన్యం జనవరిలో యూనివర్శిటీ అధికా రులకు నోటీసులు అందచేసింది. వైవీయూలో ఈ యూనివర్సిటీ నిర్వహణకు కేవలం 4 భవనాలు మాత్రమే అందుబాటులో ఉన్న కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో తరగతులు, కార్యకలాపాలు నిర్వహించడం వీలు కాదని భావించిన యూనివర్శిటీ వారు ఇక్కడే కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 22న తమ అగ్రిమెంట్ను రెన్యువల్ చేయాలని యాజమాన్యం యూనివర్సిటీని కోరింది. ఈ క్రమంలో తాము ఈ నెల 31లోపు యూనివర్శిటీని తరలిస్తున్నట్లు 24 వ తేదీ రాత్రి మెయిల్ ద్వారా యూజమాన్యానికి తెలియచేసింది. 27న నోటీసును అందచేసింది. దీంతో తమకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన అద్దె, ఇతర బకాయిలను, విద్యుత్ చార్జీలను చెల్లించాలని, అగ్రిమెంట్ నిబంధనల మేరకు మూడు నెలల ముందు నోటీస్ ఇచ్చిన తరువాత ఖాళీ చేయాలని యాజమాన్యం తెలిపింది. సామగ్రి తరలింపుపై అభ్యంతరం శుక్రవారం ఉదయం యూనివర్సిటీకి సంబంధించిన సామగ్రి, ఫర్నీచర్ను తరలించడానికి ట్రాక్టర్లను సిద్ధం చేయగా యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. దీంతో వీసీ పోలీసులకు సమాచారం అందించగా చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యాజమాన్యంతో చర్చించారు. లీజు అగ్రిమెంట్ నిబంధనలతో బాటు, తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను వారు ఆయనకు అందచేశారు. ఈ క్రమంలో లీజ్ అగ్రిమెంట్ విషయమై సీఐ వీసీతో చర్చలు జరిపారు. నిబంధనలకు తిలోదకాలు ఒక యూనివర్సిటీని మొత్తం ఒక చోట నుంచి మరో చోటికి తరలించాలంటే అందులోని సామగ్రిని, రికార్డులను తరలించడానికి టెండరు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో తక్కువ మొత్తానికి కోట్ చేసిన వారికి తరలింపు కాంట్రాక్టును ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి తరలించాలని చూడడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా లీజు అగ్రిమెంట్కు సంబంధించి మూడు నెలల ముందు నోటీసు ద్వారా తెలపకపోవడంతో బాటు, తమకు చెల్లించాల్సిన సుమారు రూ 3.5 కోట్ల బకాయిలు చెల్లించకుండా యూనివర్సిటీని తరలించాలని నిర్ణయించడంపై శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు కోర్టు వారం రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో యూనివర్శిటీ తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
జంతువుల కొవ్వు నుంచి ఆయిల్ తయారీ
చింతకొమ్మదిన్నె : మండలంలోని చెర్లోపల్లె జగనన్న కాలనీలో జన నివాసాల వద్ద ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా జంతువుల కొవ్వు, వ్యర్థాల నుంచి ఆయిల్ తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీకే.దిన్నె సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఓ ఇంటిలో షేక్నూర్మహమ్మద్ అనే వ్యక్తి జంతువుల వ్యర్థాలు, కళేబరాలు, కొవ్వు సేకరించి వాటి నుంచి ఆయిల్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు తనిఖీలు చేసి తయారుచేస్తున్న నూనెను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఆయిల్, వివిధ రకాల వాడకం కొరకు ఇతర రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసును మరింత లోతుగా, కఠినంగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడతాయని సమాచారం. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు మైదుకూరు : మైదుకూరు మండలం గుడ్డివీరయ్య సత్రం గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటయ్య అనే యువకుడు కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుఅర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వెంకటయ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సీఐ పేర్కొన్నా రు. యువకుని చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘ప్రైవేటీకరణ’రద్దు కోసం పోరాడుతాం
పులివెందుల: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేశామన్నారు. అందులో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో దాదాపు జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడాన్ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య, విద్యను దూరం చేయాలనుకోవడం చంద్రబాబు దుర్మార్గపు చర్యకు పరాకాష్టగా చెప్పుకోవచ్చని ధ్వజమెత్తారు. అమరావతి రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం కేవలం రూ.5వేల కోట్లు వెచ్చిస్తే మెడికల్ కళాశాలలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తుపాన్వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రెండు రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన మోంథా తుపాన్వల్ల పంట నష్టం జరిగిన ప్రతి రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగిన నెలలోపే రైతులకు ప్రభుత్వ సాయం అందేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు పంట నష్టపోయిన ఏ రైతులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
అన్నమయ్యా...ఇదేందయ్యా..!
● టెండరు రద్దు చేయకుండానే కమిటీ ఏర్పాటు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రూ.787.77 కోట్లు ● రాఘవ కన్స్ట్రక్షన్స్కు టెండరు ఖరారు ● ఐదు గేట్లు ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు 14గేట్ల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు ● కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణానికి అడుగులు పడని వైనం కడప సిటీ : అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు ముందుకువచ్చింది. ఈ పనులకు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇన్వెస్టిగేషన్కే రూ.కోటి ఖర్చు చేసింది. అంతలోపే ఎన్నికలు రావడం, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు కొనసాగించకుండా కాలం వృథా చేస్తోంది. టెండరు రద్దు చేయకుండా కమిటీ ఏర్పాటుచేసి నిర్మాణానికి ఆలస్యం చేస్తూ మళ్లీ ఇన్వెస్టిగేషన్, కొత్త డిజైన్తో పనులు చేపడతామంటూ సాకులు చెబుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టు గురించి ఎన్నో ఆరోపణలు చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు చేపట్టడం లేదు. కమిటీతో కాలయాపన 2.20 టీఎంసీల సామర్థ్యంతో చెయ్యేరు నదిపై 2001 నాటికి ఐదు గేట్లతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. అయితే 2021 నవంబరు, 19న అకస్మిక వరదలతో ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.787.77 కోట్లతో ప్రాజెక్టు నిర్మించి ఐదు గేట్ల నిర్మాణాన్ని 14 గేట్లకు పెంచేందుకు టెండర్ ఖరారుచేసింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుని ఇన్వెస్టిగేషన్ పనులు చేపట్టింది. అంతలోపే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచి పోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిక కూటమి ప్రభుత్వం 25శాతంలోపు జరిగిన పనులను రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన రూ.కోటి పనులకు బిల్లు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఇదే కంపెనీతో డిజైన్ వర్క్ చేయమని చెప్పినా కాంట్రాక్టర్ అందుకు అంగీకరించలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక నిపుణులు, నీటిపారుదలశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటినా కమిటీ నివేదిక ఇంత వరకూ రాలేదు. కేవలం కమిటీ నెపంతో కాలయాపన చేస్తున్నారే గానీ, నిర్మించే యోచనలో కూటమి ప్రభుత్వం లేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేట్ల సంఖ్య పెంపు చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని అఽధికారులు అంచనా వేశారు. 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరి 2021 నవంబరు, 19న తెగిపోయింది. ఈ నేపథ్యంలో నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్వే నిర్మించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జల వనరులశాఖ అఽధికారులు అన్నమయ్య ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. ఐదే గేట్లుగా ఉన్న అన్నమయ్య ప్రాజెక్టును 14 గేట్లుగా నిర్మించాలని సంకల్పించారు. టీడీపీ నిర్లక్ష్యం 2012లో జలవనరులశాఖ 3డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చని నివేదికలు ఇచ్చారు. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యాం సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2021 నవంబరు, 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం–నల్లమల అడవులు, చెయ్యేరు, బాహుదా, మాండవ్య పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ నేపథ్యంలో నవంబరు 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.77 టీఎంసీలు నిల్వచేస్తూ వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలారు. 18వ తేదీ రాత్రి 8 గంటలకు 77.125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కుల నీటిని వదలారు. అదే రోజున రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపారు. 19వ తేదీ అర్ధరాత్రి ఊహించని పరిణామాలు ఎదురై 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టి కట్టపై నుంచి దిగువకు వరద నీరు చేరింది. దీంతో 19వ తేదీ ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది. అదే అప్పటి టీడీపీ ప్రభుత్వం అదనంగా స్పిల్వే నిర్మించి ఉంటే ప్రాజెక్టు తెగిపోకుండా ఉండేది. ఆ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు తెగిపోవడం జరిగిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కమిటీ ఏర్పాటుచేసింది. ఇన్వెస్టిగేషన్, డిజైన్ వర్క్ చేపట్టాల్సి ఉంది. కమిటీ అంచనాల మేరకు ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది. ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించే అవకాశం కనిపించడంలేదు. కమిటీ నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – అబ్దుల్షమీ, ఎస్ఈ, నీటిపారుదలశాఖ, కడప -
కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, వైఎస్సార్: కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యూనివర్సిటీని అకస్మాత్తుగా తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, భవన యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.వివరాల ప్రకారం.. కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యోగివేమన యూనివర్సిటీలోని గురుకుల బిల్డింగ్స్లోకి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ తరలింపుపై వీసీ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల బిల్డింగులో ఎలాంటి సదుపాయాలు లేవని, యూనివర్సిటీ నిర్వహణకు అది సరిపోదని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు. కూటమి నేతల ప్రమేయంతో అకస్మాత్తు తరలింపు ప్రక్రియ జరుగుతోందని చెబుతున్నారు. ఉన్న ఫలంగా తరలిస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. కూటమి ప్రభుత్వం సదరు భవన యాజమాన్యానికి రూ.4 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల మేరకు మూడు నెలలు ముందు ఖాళీ చేస్తామని నోటీసులివ్వాల్సి ఉండగా కూటమి సర్కార్ మాత్రం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఇలా చేయడాన్ని భవన యాజమాన్యం తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. ఇక, యూనివర్సిటీ వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. భవన యాజమాన్యాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేవలం వైఎస్ జగన్ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారనే అక్కసుతోనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ అడ్మిషన్లు నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేసింది. కూటమి నిర్ణయంపై వైఎస్సార్సీపీ నేతల స్పందిస్తూ.. యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. -
రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వాసంతి రెడ్డి
ప్రొద్దుటూరు : పట్టణానికి చెందిన కుందుల వాసంతిరెడ్డిని అఖిల భారత రెడ్డి సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సంఘం అధ్యక్షుడు నారుపల్లె జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా కందుల వాసంతరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత రెడ్డి సంఘం బలోపేతం చేసేందుకు, రెడ్డి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్యపెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లికి చెందిన పీ.సతీష్ కుమార్ (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉన్న కొక్కీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకట్రమణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ హరిహరప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి మృతికి అనారోగ్య సమస్యలా, వేరే ఇతర కారణాలా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. గంజాయి నిందితుల పట్టివేతపెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులో ఎస్ఐ హరిహరప్రసాద్, సిబ్బంది బుధవారం నాకా బందీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ము గ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ పో లీసులను చూసి అనుమానాస్పదంగా తచ్చాడా రు. పోలీసులు సదరు వాహనాన్ని క్షుణంగా తని ఖీ చేయగా సుమారు అరకిలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని మట్లివారిపల్లికి చెందిన రాజోళ్ల హరీష్ (29), మదనపల్లిలోని రామారావ్ కాలనీకి చెందిన ఫరూక్(19)లతోపాటు మరో మైనర్ యువకుడు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టు బడినట్లు తెలుస్తోంది. తహసీల్దారు శ్రీరాములు నాయక్, వీఆర్వో నరేంద్రల సమక్షంలో పోలీసులు పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. బొలెరో వాహనం బోల్తాచిన్నమండెం : మండల కేంద్రంలోని దేవపట్ల క్రాస్రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అటుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి వైపు నుంచి కడపకు నారు వేసుకొని వస్తున్న బొలెరో వాహనం దేవపట్ల క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుకవైపు టైర్ పగిలి అదుపు తప్పింది. ఎవరికీ చిన్నగాయాలు కూడా కాలేదు. వర్షానికి కూలిన ఇల్లు జమ్మలమడుగు: మోంథా తుపాను ప్రభావంతో పెద్దముడియం మండలం పాలూరు గ్రామంలో కాచన రమణారెడ్డి, పుల్లమ్మ నివాసం ఉన్న ఇల్లు కూలిపోయింది. చౌడుమిద్దె కావడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసింది. ఒక్కసారిగా ఆర్థరాత్రి సమయంలో ఇల్లు కూలింది. అయితే రమణారెడ్డి, పుల్లమ్మ ఇంట్లో కాకుండా సోఫాలు నిద్రించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కూలిన శబ్దం కావడంతో స్థానికులు వచ్చి భార్య, భర్తలను క్షేమంగా బయటికి తీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. -
అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి
జమ్మలమడుగు : జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తరతర అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జమ్మలమడుగు స్టేషన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని హైవేలపై రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని, రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. కేసులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గండికోట వైష్టవి హత్య కేసు గురించి ఆరాతీశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ప్రొద్దుటూరు క్రైం: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్పాల్ (51), సయ్యద్ ఆసిఫ్ (19) దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ప్రొద్దుటూరులో జీవిస్తున్నాయి. వీరంతా పీఓపీ, గ్లాస్ వర్క్, తదితర పనులు చేకుంటూ సుమారు 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. వీరిలో సయ్యద్పాల్ కుమారుడి వివాహం గురువారం పెంచలకోనలో జరుగనుంది. దీంతో బంధువులతో పాటు సయ్యద్పాల్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి కార్లలో బయలుదేరారు. అనంతసాగరం మండలంఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో సయ్యద్పాల్, సయ్యద్ రఫిలు అక్కడిక్కడే మృతి చెందగా జబిఉల్లా, ఆదిల్పాల్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడిన వెంటనే దారిన వెళ్తున్న వ్యక్తులు క్షతగాత్రుల ఫోన్ తీసుకొని బంధువులకు సమాచారం అందించారు. ప్రొద్దుటూరులోని సయ్యద్పాల్ బంధువులు కొందరు గురువారం ఉదయం పెంచలకోనకు వెళ్లాలని భావించారు. ప్రమాద వార్త తెలియడంతో ప్రొద్దుటూరులో ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసులు రోధించసాగారు. పలువురు వారి బంధువులు బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. -
ఆస్తి ఇవ్వలేదనే తండ్రి, పిన్ని హత్య
● ఆన్లైన్ గేమ్లతో చేసిన అప్పు తేర్చలేక తనయుడి ఘాతుకం ● విలేకరులతో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్జమ్మలమడుగు : ఈనెల 26వ తేదీన మండలంలోని మోరగుడిలో జరిగిన నాగప్ప, పెద్దక్కల హత్య కేసును పోలీసులు చేధించారు. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చేందుకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతో కుమారుడు కుడేటి వెంకటేస్ తన తండ్రి, పిన్నిలను హతం చేసినట్లు విచారణలో తేల్చారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హత్య వివరాలు వెల్లడించారు. నాగప్ప కుమారుడు కుడేటి వెంకటేష్ స్థానిక ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో క్యాషినో గేమ్స్ ఆడి విపరీతంగా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఆస్తులు పంచాలంటూ తండ్రి నాగప్పను కోరాడు. ఆన్లైన్ గేమ్లు ఆడితే నేను అప్పులు తీర్చాలా.. ఇచ్చేది లేదంటూ ససేమిరా అన్నారు. పిన్ని పెద్దక్క కూడా తాము కష్టపడి సంపాదించుకున్నది.. నీకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది మనసులో పెట్టుకున్న వెంకటేష్ కోపంతో ఊగిపోయాడు. ఇద్దరినీ హతమార్చాలని ముందస్తు ప్రణాళిక చేసుకున్నాడు. శనివారం రాత్రి నాగప్ప, పెద్దక్క ఒకేచోట నిద్రిస్తున్నారు. ఈ సమయంలో పట్టుడు కట్టెతో ఇద్దరినీ దారుణంగా కొట్టి హతమార్చాడు. కేసును నీరు కార్చేందుకు మిరపపొడి చల్లి.. ఇంటి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసును ఛాలెంజ్గా తీసుకుని తక్కువ రోజుల్లోనే చేధించారు. విచారణలో తండ్రి, పిన్నిలను హతమార్చానని కుమారుడు వెంకటేష్ తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు చేధించినందుకు సీఐ నరేష్బాబు, ఎస్ఐలు రామకృష్ణ, హైమావతిలతోపాటు, కానిస్టేబుల్ నాగేంద్ర, కృష్ణారెడ్డి, మహేష్, గంగాధర్, సుధాకర్ సురేష్ ,ప్రవీణ్లకు ఎస్పీ రివార్డు ప్రకటించారు. నిందితుడు వెంకటేష్కు రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
యూనిట్ లీడర్కు ఉత్తమ పురస్కారం
కడప ఎడ్యుకేషన్ : రోబోటిక్స్, ఏఐ, స్టెమ్, యుఈపీపై భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కార్యాలయం ఏర్పాటుచేసిన వర్క్ షాప్లో కడప జిల్లాకు చెందిన యూనిట్ లీడర్ అహమ్మద్ సగినాల ప్రతిభ చూపారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ఆళ్వాస్ విద్యా సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా పలువురితో పోటీపడి అహమ్మద్ ప్రతిభ చూపించి విజయం సాధించారు. జాతీయ కార్యాలయ గౌరవ అతిథులు మధుసూదన్ ఆవల, షిండీయ, అనలేంద్ర శర్మ, కృష్ణస్వామి, ప్రతిమాకుమార్, ఛటర్జీ, భారత్రాజ్ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్చౌటా, ఆళ్వాస్ సంస్థల అధినేత మోహన్ఆళ్వా, వివేక్ ఆళ్వా, ప్రభాకర్ భట్టు చేతుల మీదుగా అహమ్మద్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. వీలునామా ప్రకారమే మఠాధిపతిని నియమించాలి కడప రూరల్ : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి వీలునామా ప్రకారమే మఠాధిపతిని నియమించాలని వీర బ్రహ్మేంద్రస్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆలెపు శ్రీనివాసులు అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి 420 ఏల్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. విశ్వ గురువుగా, కాలజ్ఞాన రచయితగా భగవంతుని స్వరూపంగా స్వామి కొలువబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పవిత్ర మఠంలో మఠాధిపతి నియామకంలో అలజడులు జరగడం తగదన్నారు. దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వీలునామా ప్రకారం గోవిందస్వామి మఠాధిపతిగా అర్హుడని అభిప్రాయపడ్డారు. ఈయనకు మఠం సంప్రదాయాలు, పద్ధతులు తెలుసనన్నారు. గోవిందస్వామి మాట్లాడుతూ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి తనకు వేదాలు నేర్పేవారని, కాలజ్ఞానం గురించి బోధించేవారని తెలిపారు. తాను వీరభోగ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ధర్మపరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చీటింగ్ కేసు నమోదు కడప అర్బన్: కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న దంపతులు తనకు స్థలం ఇప్పిస్తామని రూ.54 లక్షలను తీసుకుని మోసం చేశారని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. రామచంద్రారెడ్డి, శ్యామల దంపతులు బాధిత ఉద్యోగి శివరామిరెడ్డికి స్థలం ఇప్పిస్తామంటూ 54 లక్షల తీసుకున్నారు. ఇప్పటివరకూ బదులీయకపోవడంతో.. మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నారు. -
నియమ, నిష్టలకే.. అయ్యప్ప అనుగ్రహం
కడప సిటీ : నియమ, నిష్టలతో అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తే అయ్యప్ప అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా కార్తిక మాసం ఆరంభం నుంచే అయ్యప్ప స్వాములు మాలధారణ ప్రారంభించి 41 రోజులు మండల దీక్ష.. ఆపై ఇరుముడితో శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురుస్వామి మార్గదర్శనం ఇందులో ప్రత్యేకం. భక్తులు మాలధారణ చేసిన తరువాత మనసు, మాట, శరీరం పవిత్రతను కాపాడాలి. రోజూ స్వామియే శరణం అయ్యప్పా శరణు ఘోష చెప్పాలి. ఉపవాసం, అహింస, మద్యపానం, మాంసాహారం, పొగత్రాగడం పూర్తిగా నిషేధించడమేగాక, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి (ఉదా: పాలు, పండ్లు, ఆకు కూరలు మొదలైనవి.). మాలధారణ కాలంలో బ్రహ్మచర్యం పాటించి.. నిత్యం ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. దీపం వెలిగించి, అయ్యప్ప స్తోత్రాలు నిష్ఠతో పఠించాలి. గుడిలో జరిగే పడిపూజ, అంబులం పూజ, మండల పూజ, గ్రామోత్సవం వంటి కార్యమాలలో విరివిగా పాల్గొనాలి. గురుస్వామి పాత్ర అయ్యప్ప మాలధారణలో గురుస్వామికి ప్రత్యేకత ఉంటుంది. భక్తులను సరైన మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక మార్గదర్శకుడు ఆయన. భక్తులకు అయ్యప్ప మాలధారణ, నియమాలు, ఆచారాలు ఎలా పాటించాలో బోధిస్తాడు. మాలధారణలో సహాయం చేసి మాలను భక్తుడిచే ధరింపజేస్తాడు. స్వామియే శరణం అయ్యప్పా అని జపం చేయిస్తాడు. 41 రోజుల నియమాలు ఎలా పాటించాలో, ఏవి చేయకూడదో వివరిస్తాడు. తన శిష్యుల ఆచరణ, ఆలోచన, నడవడిని పరిశీలించి పవిత్రత కాపాడేలా చేస్తాడు. శబరిమల యాత్రలో గురుస్వామి బృందానికి నాయకుడై మార్గం చూపుతూ అన్ని పూజలు, ఆచారాలు నిర్వహిస్తాడు. అనుభవజ్ఞుడైన ఆయన భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యం, శాంతి, సహనం నేర్పిస్తాడు. యాత్ర పూర్తయ్యాక మాలను తీసేయడానికి గురుస్వామి సహకారం అవసరం ఉంటుంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం మాలధారణ చేసిన తర్వాత 41 రోజుల మండల దీక్ష నిష్టగా, భక్తిగా పూర్తి చేసిన భక్తుడు ఆధ్యాత్మికంగా పవిత్రుడవుతాడు, మనసు, శరీరం, ఆత్మ శుద్ధి చెందుతుంది, అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందుతాడని, దీక్షను సచ్చ్ఛిదానందంగా పాటించిన వారికి అంతరంగ శాంతి లభిస్తుందని, పూర్వ జన్మ పాపాలు, చెడు అలవాట్లు తొలగి కొత్త జీవితం మొదలవుతుందని భక్తులు నమ్ముతారు. సాత్విక జీవన విధానం వల్ల శారీరకంగా ఆరోగ్యవంతులవుతారు. అయ్యప్ప స్వామి దృష్టి కరుణ పడితే, జీవితంలో శుభం, సౌఖ్యం, విజయాలు లభిస్తాయని, బ్రహ్మచర్యం, ఉపవాసం, సత్యం పాటించడం వల్ల మనసు స్థిరమవుతుంతని, మండల దీక్షను పూర్తిగా పాటించడంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని చెబుతారు. అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ జీవించినవారికి మోక్ష మార్గం కలుగుతుంది. పెద్దపాదం విశిష్టత నిజమైన భక్తి, నియమం, వినయం కలిగిన వారికి నా కృప తప్పక లభిస్తుంది. పెద్దపాదం అనేది శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో అత్యంత పవిత్రమైన మరియు చారిత్రాత్మక ప్రదేశం. ఇది అయ్యప్ప స్వామి యాత్రికులు దివ్య దర్శనానికి వెళ్ళే మార్గంలో ఉండే ఒక ఆధ్యాత్మిక స్థలం. పెద్దపాదం అంటే అయ్యప్ప స్వామి అడుగుల ముద్రలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశాన్ని చేరి భూమిని నమస్కరిస్తారు. ఈ ప్రదేశం చేరుకునే వరకు భక్తులు కష్టమైన అరణ్య మార్గాలు, పర్వత మార్గాలు దాటి వెళ్తారు. అది వారి భక్తి, ధైర్యం, సహనానికి పరీక్షగా భావిస్తారు. పెద్దపాదం వద్ద స్వామిని ధ్యానిస్తూ భక్తులు మోక్షం కోసం ప్రార్థిస్తారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. శబరిమల యాత్ర ఇలా.. పెద్దపాదం మీదు అయ్యప్ప దర్శనానికి వెళ్లే వారంతా ముందుగా అయ్యప్ప యాత్ర ప్రారంభ స్థానం ఎరుమేలి చరుతారు. ఇక్కడ పెట్టా తుల్లల్ పూజ, నృత్యం చేస్తారు. తరువాత పాదయాత్ర మొదలవుతుంది. అరణ్యమార్గం పెరియ మీదుగా భక్తులు స్వామి పేరు జపిస్తూ నడుస్తారు. కఠినమైన పర్వతం కరిమల ఎక్కడం భక్తులకు నిజమైన పరీక్ష. అనంతరం పంపా చేరుకుని నదీ స్నానం చేస్తారు. అక్కడి నుంచి సన్నిధానం వైపు ఎక్కే దారిలో పెద్దపాదం వస్తుంది. ఇక్కడ భక్తులు దీపం వెలిగించి దేవుడిని ప్రార్థిస్తారు. మోకాళ్లపై కూర్చుని పూజచేస్తారు. అనంతరం అయ్యప్ప ఆలయానికి చేరి స్వామియే శరణం అయ్యప్పాఅంటూ దర్శనం పొందుతారు.కార్తీక మాసం ఆరంభం నుంచి మాలధారణపవిత్రతతో ఉన్నప్పుడే ఫలితం 35 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధారణ చేస్తున్నా. నియమ, నిష్టలతో దీక్ష పూర్తి చేసినపుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఫలితం లభిస్తుంది. నేను ప్రస్తుతం కడప హోసింగ్ బోర్డు కోదండరామాలయం ధర్మకర్తగా కొనసాగుతున్నా. 2010 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా మండలం కాలంపాటు కడప నగరం హొసింగ్ బోర్డు కాలనీలోని కోదండరామాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నాం. రోజు మధ్యాహ్నం అన్నదానం(బిక్ష) ఉంటుంది. – దేసు వేంకటరెడ్డి, గురుస్వామి, హౌసింగ్బోర్డు కాలనీ, కడప -
వ్యక్తి ఆత్మహత్య
చక్రాయపేట: మండలంలోని పోలిశెట్టిపల్లెకు చెందిన మాచనబోయిన సిద్ధయ్య(50) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, బంధువుల కథనం మేరకు సిద్ధయ్య గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉండడంతో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే సిద్ధయ్యను నాగలగుట్టపల్లెకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందినట్లు వారు తెలిపారు. సిద్ధయ్య భార్య కూడా ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకరు మృతి లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామంలో విద్యుత్ షాక్కు గురై గొడ్డలి వెంకట్రాములు (60) బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం వెంకట్రాములు తన ఇంటిలో విద్యుత్ స్విచ్ బోర్డు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతడకి భార్య, కుమారుడు ఉన్నారని తెలిపారు. వెంకట్రాములు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
జిల్లా మార్చురీ వద్ద ఉద్రిక్తత
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. పిల్లల పేరుతో ఆస్తి రాయించాలంటూ మృతదేహాన్ని తీసుకెళ్లకుండా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన వివాహిత సునీత మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్తో మృతిచెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కావ్య, హరినాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సునీత అమ్మగారి ఊరు మైదుకూరు మండలంలోని తిప్పిరెడ్డిపల్లె. సునీత మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులందరూ జిల్లా ఆస్పత్రి వద్దకు వచ్చారు. సునీత భర్త శ్రీకాంత్కు కొంతమేర పొలం ఉంది. పొలాన్ని పిల్లల పేరుతో రాయించాలని సునీత తరపు బంధువులు అడిగారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లకుండా తిప్పిరెడ్డిపల్లె వాసులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పినా మహిళలందరూ వాహనానికి అడ్డుగా నిల్చున్నారు. రూరల్ ఎస్ఐ రాజు, టూ టౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డితోపాటు పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చివరకు పిల్లల పేరుతో పొలం రాయిస్తున్నట్లు తండ్రి శ్రీకాంత్ అగ్రిమెంట్ రాయడంతో సునీత బంధువులు శాంతించారు. అనంతరం సునీత మృతదేహాన్ని చౌడూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న బంధువులు -
భక్తుల మనోభావాలకు ఇబ్బంది కల్గించవద్దు
బ్రహ్మంగారిమఠం : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన నివాసం భారీ వర్షాలకు కూలిపోయింది. భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో ఐదు నెలల్లో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపడతామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన బ్రహ్మంగారి నివాసాన్ని బద్వేల్ ఆర్డీవో చంద్ర మోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మఠం నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. బ్రహ్మంగారు నివాసం ఉన్న చోట ఒకవైపు మాత్రమే మిద్దె కూలిపోయిందని.. మరోవైపు బాగానే ఉందన్నారు అయితే భక్తుల సౌకర్యం కోసం పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి భక్తులకు అందుబాటులో తేవాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు కార్తీక్, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జునప్రసాద్, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, దేవాదాయ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వైవీయూలో జార్ఖండ్ టస్సర్ సిల్క్ పట్టు పురుగు
కడప ఎడ్యుకేషన్ : జార్ఖండ్ రాష్ట్రంలో కనిపించే టస్సర్ సిల్క్ పట్టు పురుగులు వైవీయూలో బుధవారం కనిపించాయి. వైవీయూ పరిశోధకులు నల్లమల, లంకమల అడవులలో పెరిగే వృక్ష జాతులను సేకరించి క్యాంపస్లో పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో టెర్మినాలియా ఎలిపికా, టెర్మినాలియా అర్జునా వంటి వృక్ష జాతులు ఉన్నాయి. టెర్మినాలియా జాటి చెట్లపై టస్సర్ సిల్క్ పట్టు పురుగులు(ఆంథిరా మిల్లిగా)జీవిస్తున్నాయి. ఇవి ఎక్కువగా జార్ఖండ్ అడవులలో కనిపిస్తాయి. ఈ టస్సర్ సిల్క్ పట్టు పురుగును పర్యావరణశాఖ విద్యార్థులు సేకరించారు. ఈ పురుగులు 300–500 గ్రుడ్లును పెట్టి అంతరించిపోతాయని, ఆ తరువాత గ్రుడ్ల నుంచి లార్వా, ప్యూప, కక్కూన్ దశలు ఉంటాయని విద్యార్థులు తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
కడప అగ్రికల్చర్ : మోంఽథా తుపాన్ కారణంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ● నీట మునిగిన రైతన్నల ఆశలు ● జిల్లావ్యాప్తంగా 1233 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం ● 4378.23 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం కడప అగ్రికల్చర్ : మోంఽథా తుపాన్ జిల్లా రైతులను ముంచేసింది. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. పంట సాగుకోసం శ్రమటోడ్చిన అన్నదాతలకు చివరికి కన్నీరే మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతుల పంటలన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. చేతికొచ్చిన పంట వర్షపు నీటిలో నానుతుండడం చూసి రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యా రు. జిల్లాలో వరితోపాటు ప్రధాన పంటలన్నీ పూర్తి గా కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుపాన్కంటే ముందు కురిసిన తుఫాన్ వర్షాలకు కూడా జిల్లావ్యాప్తంగా దాదాపు 8 వేల ఎకరాల్లో పత్తి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆ నష్టం మరువకముందే మళ్లీ మోంథా తుఫాన్ జిల్లాలోని వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలకు సంబంధించి 5611. 33 హెక్టార్లలో నీట ముంచి రైతన్నలకు భారీ నష్టం మిగిల్చింది. వరుస వానలతో జిల్లాలో కొన్ని ప్రాంతాలు ప్రజలు నీలవ నీడ కూడా కోల్పోయారు. ఉద్యాన పంటలకు సంబంధించి... మోంథా తుపాన్ వల్ల జిల్లాలో 73 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 2088 మంది రైతులకు సంబంధించి 1233.1 హెక్టార్లలో ఉల్లి, కూరగాయలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. ఇందులో బి.మఠం మండలంలో 110 మంది రైతులు 70.2 హెక్టార్లలో, కలసపాడు మండలంలో 66 మంది రైతులకు సంబంధించిన 36.5 హెక్టార్లలో, పోరుమామిళ్ల మండలంలో 38 మంది రైతులకు సంబంధించి 20.4 హెక్టార్లలో, కాశినాయనలో 218 మంది రైతులకు సంబంధించి 140 హెక్టార్లలో, బి. కోడూరులో 24 మంది రైతులకు సంబంధించి 8 హెక్టార్లలో, సిద్దవటంలో 74 మంది రైతులకు సంబంధించి 74 హెక్టార్లలో, మైదుకూరు లో 871 మంది రైతులకు సంబంధించి 506 హెక్టార్లలో, దువ్వూరులో 639 మంది రైతులకు సంబంధించి 380 హెక్టార్లలో, ఖాజీపేటలో 41 మంది రైతులకు సంబంధించి 20 హెక్టార్లలో, వల్లూరులో 7 మంది రైతులకు సంబంధించి 4 హెక్టార్లలో ఉల్లి, కూరగాయల పంటలు, పూలతోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధి కారులు నష్టాన్ని అంచనాన్ని తయారు వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి.. జిల్లాలో 4378.23 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 1071 హెక్టార్లలో వరి, 68 హెక్టార్లలో కంది, 2559.24 హెక్టార్లలో మినుము, 119.5 హెక్టార్లలో పెసర, 145 హెక్టార్లలో మొక్కజొన్న, నాలుగు హెక్టార్లలో జొన్న, 71.64 హెక్టార్లలో వేరుశనగ, 284.5 హెక్టార్లలో పత్తి, 55.35 హెక్టార్లలో నువ్వలు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిన నివాస గృహాలు... వరుస వానలకు జిల్లాలో పలు మిద్దెలు కూలిపోయాయి. బి.మఠంలో వీరబ్రహేంద్రస్వామి వారి ఇళ్లు కూలిపోయింది. అలాగే ఖాజీపేట మండలం ముత్తలూరుపాడు, అప్పనపల్లె, శాంతినగర్ పలు ఇళ్లు నేలకూలాయి. కలసపాడు మండలం చెన్నుపల్లెకు చెందిన అన్నమ్మకు చెందిన కొట్టం కూలిపోయింది. -
ఆకాంక్షిత లక్ష్యాలలో పురోగతి సాధించాలి
● భూగర్భ జలాల పెంపునకు చర్యలు ● నీతి అయోగ్ జాయింట్ సెక్రటరీ సిద్దార్థ జైన్ కడప సెవెన్రోడ్స్ : ఆకాంక్షిత జిల్లాల ప్రగతిలో వైఎస్సార్ కడప జిల్లా మరింత పురోగతి సాధించేందుకు సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని నీతి ఆయోగ్ సెక్రెటరీ జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి వైఎస్సార్ కడప ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత బ్లాక్ ప్రోగ్రాం ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ 2025 మార్చి నాటికి 73.6 స్కోరు సాధించి టాప్–5 జిల్లాలలో వైఎస్సార్ కడప జిల్లా నిలిచిందని తెలిపారు. పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలలో శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కు లక్ష్యాన్ని నిర్దేశించి లక్ష్యసాధనకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ –నైపుణ్యాభివృద్ధి, గృహ నిర్మాణం, వ్యవసాయం, పశుపోషణ, మౌలిక సదుపాయాలు మొదలైన శాఖల్లో నిర్దేశిత లక్ష్యా లను సాధించడంలో మరింత పురోగతి సాధనకు కృషి చేస్తున్నామన్నారు. సీపీఓ హజరతయ్య, డీఈవో షంషుద్దీన్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి ,హౌసింగ్ పీడీ రాజారత్నం పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్ విధానం ఆదర్శనీయం చింతకొమ్మదిన్నె : సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ నిర్వహణ అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరింత బాగుందని నీతిఆయోగ్ జాయింట్ సెక్రెటరీ, వైఎస్సార్ కడపజిల్లా ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్దార్థ్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్తో కలిసి సీకే దిన్నె జెడ్పీ హైస్కూలులోని సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను ఆయన పరిశీలించారు. ఏడీపీ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. పీఏసీఎస్ల అభివృద్ధికి కృషి చేయాలి కడప అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిద్దార్థజైన్ పేర్కొన్నారు. బుధవారం డీసీసీ బ్యాంకులో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశా రు. డీసీసీబీ చైర్మెన్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్రావతికి నీటి విడుదల
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలవల్ల సీబీఆర్ ఎగువ భాగంలోని యోగివేమన రిజర్వాయర్ పూర్తిగా నిండి దిగువకు విడుదల చేశారు. దీంతో సీబీఆర్కు రోజుకు 3వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సీబీఆర్కు పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా ఒక గేటును ఎత్తి 200క్యూసెక్కుల నీటిని చిత్రావతి నదికి విడుదల చేశారు. చిత్రావతి నది డ్యాం దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ చిన్నయ్య సూచించారు. బీసీ ఈఈ వెంకటేశ్వరరావు, డీటీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బద్వేలులో పర్యటించిన కలెక్టర్
బద్వేలు అర్బన్/పోరుమామిళ్ల : మోంథా తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బద్వేలులో పర్యటించారు. స్థానిక మైదుకూరు రోడ్డులో వర్షపునీరు నిలుస్తున్న ప్రాంతాన్ని, డ్రైనేజీని పరిశీలించడంతో పాటు బద్వేలు పెద్ద చెరువును పరిశీలించారు. ప్రధాన రహదారుల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలు విస్తరణ చేయడానికి అంచనాలు, డిజైన్ తయారు చేయాలని ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డిలను ఆదేశించారు. అనంతరం బద్వేలు పెద్ద చెరువును సందర్శించి చెరువు సామర్థ్యం, చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పోరుమామిళ్ల చెరువు పరిశీలన పోరుమామిళ్ల మండలంలో వాగులు వంకలు ఉప్పొంగాయి. పంటలు దెబ్బతిన్నాయి. రాజాసాహేబ్పేట, టే కూరు, టేకూరుపేట, సూరిశిద్దుపల్లె, తిమ్మారెడ్డిపల్లె, తోకలపల్లె, యరసాల గ్రామ పొలాలు నీటితో నిండాయి. కోత కోసి ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్బాబు బుధవారం సాయంత్రం పోరుమామిళ్ల చెరువును సందర్శించారు. దమ్మన్నపల్లె వద్ద రైతులు రోడ్డుపై పోసుకున్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. నీరు పారడం వల్ల దెబ్బతిన్న పొలాల గురించి, పంట దెబ్బతిన్న పొలాల గురించి కలెక్టర్ అధికారులను విచారించారు. నష్టం గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
హడావిడిగా ఆర్కిటెక్చర్ వర్సిటీ తరలింపు
● పెండింగ్లో 15 నెలల అద్దె బకాయిలు ● ఒప్పందాన్ని తుంగలో తొక్కిన వర్సిటీ అధికారులు ● కనీస వసతులు లేకున్నా గురుకులం భవనాల్లోకి ● వీసీ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు !సాక్షి ప్రతినిధి కడప : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ అధికారులు నిబంధనను.. ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. జిల్లా కేంద్రమైన కడప సమీపంలో ఉన్న సదరు యూనివర్శిటీని హడావిడిగా యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 21వ సెంచరీ గురుకులం భవనాల్లోకి తరలిస్తూ వీసీ ఆచార్య బి.జయరామిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లీజు నిబంధనలు పాటించకుండా వీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ఒకవేళ యూనివర్శిటీ తమ సొంత భవనాల్లోకి వెళ్లదలుచుకుంటే లీజు ఒప్పందం ప్రకారం మూడు నెలల ముందే శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యానికి నోటీసు ద్వారా తెలియజేయాలి. అలాగే భవనాల అద్దెలు, ఇతర బకాయిలను పూర్తిగా చెల్లించాలి. ఈ మేరకు ఒప్పందంలో రాసి ఉంది. అగ్రిమెంటు ప్రకారం మూడు నెలల ముందుగానే ఆ విషయాన్ని తమకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ వైస్ చాన్సలర్ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై భవన యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే 15 నెలలకు సంబంధించి విద్యుత్ బిల్లులతో కలిపి దాదాపు రూ. 3.50 కోట్ల అద్దె బకాయి లు, ఇతర చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు సదరు యాజమాన్యం చెబుతోంది. పైగా మార్చిలో ఖాళీ చేయాల్సిందిగా జనవరిలో లేఖ రాస్తే.. స్పందించిన అధికారులు విద్యా సంవత్సరం కొనసాగిస్తామని రాతపూర్వక జవాబు ఇచ్చారని చెబుతోంది. కాగా ఈనెల 14వ తేది వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య బి.జయరామిరెడ్డి అనతికాలంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అధికార పార్టీకి చెందిన బలమైన నాయకుల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. విద్యార్థుల అగచాట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 21వ సెంచురీ గురుకులం భవనాల్లో కనీస వసతులు సైతం లేవని తెలుస్తోంది. హాస్టల్ గదులు, తాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు లేకపోతే తమ చదువులు ఎలా ముందుకు వెళతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని వసతులు సమకూర్చిన తర్వాత కొత్త భవనాల్లోకి యూనివర్శిటీని తరలించి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని వారు అంటున్నట్లు సమాచారం. ఇప్పటికై నా హడావడి నిర్ణయాలను ఉపసంహరించుకుని, సొంత భవనాలు సమకూరిన తర్వాత వర్శిటీని తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాలజ్ఞాని నివాసంపై ‘మోంథా’ పడగ
సాక్షి ప్రతినిధి, కడప/బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం)లో నివాసం ఉన్న మట్టి మిద్దె మోంథా తుపాన్ వర్షం ధాటికి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి ఆనవాళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మఠం నిర్వాహకులు విస్మరించడం, రాజకీయ ప్రయోజనాలు మినహా చరిత్రను పరిరక్షించుకోవాలనే స్పృహ ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం ఈ దుస్థితికి కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి 1693లో సజీవ సమాధి అయ్యారు. అటు తర్వాత గ్రామస్తులు, భక్తులు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసమున్న రెండు కొట్టాల స్థానంలో మట్టి మిద్దె ఏర్పాటు చేశారు. 1982లో ముందు భాగంలో భక్తులు ఆధునికీకరణ చేపట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో పరిరక్షణచరిత్రాత్మక సంపద స్వామివారి మిద్దె, బావి పరిరక్షించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దాదాపు రూ.30లక్షలతో మిద్దెకు ప్రాకారం, చప్పట, స్వామివారు స్వయంగా తవ్విన బావి పరిరక్షణ చర్యలు చేపట్టింది. పనులు పూర్తి చేసి 2022 జూన్లో అప్పటి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ప్రారంభించారు. రెండేళ్లుగా మఠం నిర్వాహణ ప్రభుత్వ పరిధిలో ఉంది. బాబు ప్రభుత్వం నిర్లక్ష్యంస్వామివారు నివసించిన ఇంటి పరిరక్షణ చర్యలు బాబు ప్రభుత్వంలో శూన్యమయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చరిత్రను పరిరక్షించుకోవాలనే చొరవ కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని పలువురు వాపోతున్నారు. మరోవైపు శిథిలావస్థకు చేరిందంటూ పూజలు చేసుకునే అవకాశం లేకుండా నివాసానికి తాళాలు వేసిన నిర్వాహకులు, తదుపరి పరిరక్షణ చర్యలపై శ్రద్ధ చూపలేదని భక్తులు మండిపడుతున్నారు.ఇప్పుడు బ్రహ్మంగారి మఠం అప్పుడు కాశినాయన క్షేత్రం.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి కాలజ్ఞాని నివాసం కూలిపోవడం తాజా ఉదాహరణ కాగా, ఇప్పటికే ఇలాంటి విమర్శలు వైఎస్సార్ కడప జిల్లాలో అవధూత కాశినాయన క్షేత్రం విషయంలోనూ వ్యక్తమయ్యాయి. ఈ క్షేత్రంలో భక్తులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూటమి సర్కారు అటవీశాఖ అ«ధికారులతో కూలగొట్టించిన విషయాన్ని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో కూలగొట్టిన నిర్మాణాలను పునర్నిర్మించడంతో పాటు పెండింగ్ పనులన్నింటినీ చేయిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించి ‘మమ’ అన్పించి చేతులు దులుపుకోవడం గమనార్హం.నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం..మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. బ్రహ్మంగారి నివాసం కూలిపోయిందంటే, ఆయన భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నట్టే! – ప్రతాప్ ఆచారి, బ్రహ్మంగారిమఠం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తీవ్ర విచారకరంతీవ్ర విచారకరమైన ఘటన ఇది. అధికారుల నిర్లక్ష్యంతోనే స్వామి వారి నివాస గృహం కూలిపోయింది. దీనికి అధికారులు ఏమని సమాధానం చెబుతారు. – డాక్టర్ వేలు ఆనందచారి, పద్మశ్రీ అవార్డు గ్రహీతతక్షణం పునర్నిర్మించాలినిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆధునీకరణ పనులు జరగలేదు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు, మఠం నిర్వాహకులు శ్రద్ధ తీసుకొని కూలిన గృహాన్ని పునర్నిర్మించాలి. – విశ్వరూపచారి, స్థానికుడు, బ్రహ్మంగారిమఠం -
బి.మఠం మఠాధిపతి నియామకంపై వీడని ఉత్కంఠ
వినతి పత్రాలు స్వీకరిస్తున్న అధికారులు అభిప్రాయం విన్నవించేందుకు బారులు తీరిన భక్తులు బ్రహ్మంగారిమఠం : పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో 12వ మఠాధిపతి నియామకంపై ఉత్కంఠ వీడడం లేదు. పలువురు పోటీ పడుతూ కోర్టును ఆశ్రయించడంతో ధార్మిక పరిషత్ చివరికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వచ్చింది. మఠంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్య వివాదం తలెత్తడంతో కోర్టును ఆశ్రయించారు. ఆరు వారాల లోపు మఠాధిపతి నియామకం జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ప్రత్యేక అధికారిగా ఆర్జేసీ స్థాయి అధికారి చంద్రశేఖర్ ఆజాద్ను నియమించింది. దీంతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పూర్వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్దభార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, వీలునామా ప్రకారం తనకే దక్కాలని రెండో కుమారుడు భద్రయ్యస్వామి మరోవైపు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ పెద్దకుమారుడు గోవిందస్వామి ఇంకోవైపు తమకే మఠాధిపతి కావాలని పట్టుపడ్డారు. పోటీ పెరగడంతో ప్రజా ప్రతినిధులు గతంలో సర్దిచెప్పారు. అయినా వినకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణచేవారు. తుఫాన్ను లెక్కచేయకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు, వివిధ మఠాల నిర్వకులు, సాధువులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కందిమల్లాయపల్లె పుర ప్రజలు 1600మంది వినతిపత్రాల ద్వారా తమ అభిప్రాయం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ డీసీ పట్టెం గురుప్రసాద్ , వైఎస్సార్ జిల్లా ఎండోమెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ , ఈఓలు శంకర్బాలాజీ, జగన్మోహన్రెడ్డి ఎండోమెంట్ అధికారులు, మైదుకూరు డీఎస్పీరాజేంద్ర ప్రసాద్, సీఐ శివశంకర్, రమణారెడ్డి, ఎస్ఐ శివప్రసాద్ పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్ సీజ్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సీఎన్ఆర్ నర్సింగ్ హోంలో ఉన్న నేహా స్కానింగ్ సెంటర్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత మంగళవారం స్కానింగ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలియడంతో స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసి సంబంధిత మిషన్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి తీసుకెళ్లినట్లు డాక్టర్ గీత తెలిపారు. నిబంధనల ప్రకారం రిజిష్టర్ చేయించుకున్న సెంటర్లోనే స్కానింగ్ మిషన్ ఉంచాలని, మరోచోటికి తరలించరాదని తెలిపారు. లింగనిర్ధారణ చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, విజయకుమారి, కన్సల్టెంట్ పాలేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామాల్లో విచారణ చింతకుంట గ్రామంలోని ఓ క్లినిక్లో లింగ నిర్ధారణపరీక్షలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కొన్ని రోజుల క్రితమే ఆర్ఎంపీ క్లినిక్ను ఖాళీ చేసినట్లు గుర్తించారు. అయినా ఓ ఇంట్లో స్కానింగ్ మిషన్ పెట్టుకొని లింగనిర్ధారణ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు ఈ ఘటనను సీరియస్గా పరిగణిస్తున్నారు. అనుమానిత గ్రామాల్లో విచారణ చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇంతేగాక ప్రొద్దుటూరు నుంచి ఓ డాక్టర్ కూడా మొబైల్ స్కానింగ్ మిషన్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇందుక అసలు సూత్రధారులను గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు. -
దౌర్జన్యంగా భూమిని కబ్జా చేస్తున్నారు
సుండుపల్లె : భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసెయ్ అన్న రీతిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు డేరంగుల సతీష్ కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని భైరవగుట్ట సమీపంలో సుండుపల్లె గ్రామ సర్వే నెంబర్–426లో తన తాత డేరంగుల కృష్ణయ్య పేరుమీద 3.59 సెంట్ల డీపట్టా భూమి ఉందని తెలిపారు. తమ ఐదుగురు అన్నదమ్ములకు నేటికీ దానిపై సమాన వాటా ఉందన్నారు. అయితే ఇటీవల సుండుపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు ఆ స్థలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు హక్కుగా ఉన్న భూమిలో ఫెన్సింగ్ వేసి రాతి కూసాలు వేశారని, భూమిలోకి రావద్దంటూ బెదరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ పలుకుబడి వినియోగించి భయపెడుతున్నారని ఆరోపించారు. పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి రక్షణ కల్పించాలని, ఆక్రమణదారుల నుండి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్ నాయక్ను చరవాణి ద్వారా వివరణ కోరగా కోర్టు విషయమై వేరే ప్రదేశంలో ఉన్నానని కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు సర్వే నెంబర్ పరిశీలించి వివరాలు తెలుపుతానన్నారు. రక్షణ కల్పించాలని పట్టాదారుడి వేడుకోలు -
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య కడప అర్బన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏ.ఆర్ అదనపు ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఎందరో అభాగ్యులు ఆపద సమయాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు, ఆర్.ఐ లు శివరాముడు, టైటస్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ టెక్నీషియన్ స్వరూప రాణి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జీజీహెచ్ కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తాం
కడప అర్బన్ : కడప జిజిహెచ్(రిమ్స్)లో పనిచేస్తున్న శానిటేషన్, సూపర్వైజర్లను తొలగిస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఆప్కాస్ జిల్లా అధ్యక్షుడు పవన్, రిమ్స్ నాయకులు ఏసన్న ,రాజమ్మ, పెంచలమ్మ, విజయలతో కలిసి రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్ఎస్.వెంకటేశ్వరరావును మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కడప ఆస్పత్రిలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పద్మావతి శానిటేషన్ వర్కర్స్ కాంట్రాక్ట్ వారు పనులు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లను తొలగిస్తామని యాజమాన్యం తరఫున సురేష్ చెప్పడం సరికాదన్నారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తవారిని తీసుకోవాలేగానీ, గతంలో పని చేసే వారిని తొలగిస్తే ఉద్యమిస్తామన్నారు. ఎంఓయూ ప్రకారం కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని, పీఎఫ్ ,ఈఎస్ఐ ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలన్నారు. కార్మికులకు వీక్లీ ఆఫ్లు, సెలవులు తప్పనిసరిగా మంజూరుచేయాలని కోరారు. లేబర్ ఆక్ట్కు భిన్నంగా వేతనాలు ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బాలాజీ రావు, సీపీ.రమణ, శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అనంతరం సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాసులుకు విన్నవించగా ఆయన స్పందిస్తూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఎవరిని తొలగించవద్దని మౌఖికంగా తెలియజేశామని పేర్కొన్నారు. -
సొరంగ మార్గ ప్రయాణం ఎప్పుడో?
ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైలు మార్గం అత్యంత పొడవైనది. ఈ మార్గంలో చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని కొండవద్ద ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో దాదాపు 6.6 కిలో మీటర్ల మేర అతి పెద్ద సొరంగ మార్గం ఏర్పాటుచేశారు. దీంతోపాటు మరో 5 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం ఉంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం 11.21 కిలోమీటర్ల మేర జుమ్మూ కశ్మీర్లోని పీర్ పంచాలో ఉంది. సొరంగం ఉన్న ఈ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలు కోరుకుంటారు. రాయలసీమ ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది.రూ.2 వేల కోట్లతో రైలు మార్గంఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం వరకు 1.33 కిలో మీటర్ల రైలు మార్గాన్ని రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. 2005–2006లో ఈ మార్గం మంజూరుకాగా, 2019 జూన్ 10న తొలి రైలును నడిపించారు. అప్పటినుంచి ఈ మార్గంలో సరకు రవాణా చేసే 25కు పైగా గూడ్స్ రైళ్లు నిత్యం ఈ మార్గంలో నడుస్తున్నాయి. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ తప్ప ప్యాసింజర్లు ప్రయాణించే వీలుగా నిర్మించలేదు. ఈ మార్గంలో కడప నుంచి ఓబులవారిపల్లి మీదుగా రైల్వే అధికారులు ప్యాసింజర్ డెమో రైళ్లు నడిపించాలని ప్రజలు ప్రతిసారీ కోరుతున్నారు. ఈ రైలు నడిపతే కడప–నెల్లూరు మధ్య వాణిజ్యపరంగా, విద్యా పరంగా వ్యాపారం అన్ని విధాలా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేగాక దక్షిణ భారతదేశ అతి పెద్ద సొరంగ మార్గంలో ప్రయాణించాలనే సీమ వాసుల కల నెరవేరుతుంది. రైల్వే అధికారులు స్పందించి ఈ మార్గంలో రైలు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
పింఛా ప్రాజెక్టు పరిశీలన
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టును జల వనరుల శాఖ డీఈ చెంగల్రాయుడు మంగళవారం పరిశీలించారు. పింఛా ప్రాజెక్టు నుంచి మంగళవారం 3632 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్లు ఏఈఈ నాగేంద్ర తెలిపారు. కడప కార్పొరేషన్: జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.6.59కోట్ల రాయితీలు విడుదలయ్యాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చాంద్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేది ‘ఎంఎస్ఎంఈలపై చిన్నచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఇండస్ట్రియల్ పాలసీలలో రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, రాయితీలన్నీ ఒకేసారి చెల్లించాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు ఏడేళ్లుగా ఎలాంటి రాయితీలు విడుదల చేయలేదని, జిల్లాలో ఎంఎస్ఎంఈలకు రూ.156కోట్ల బకాయిలు ఉండగా రూ.6.59 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. -
ఒంటిమిట్టలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి జరిగిన బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి భక్తుల సౌకర్యం కోసం రూ. 37 కోట్లతో 100 గదులు ఉన్న నూతన ఆధునిక వసతి భవనాన్ని నిర్మించేందుకు, అలాగే రామాలయం వద్ద మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ. 2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు -
వ్యాపారుల సిండికేట్... ప్రభుత్వ ఆదాయానికి గండి
చక్రాయపేట : వీరాంజనేయుడి ఆదాయానికి గండి పడింది. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి మంకుపట్టు వీడకపోవడంతో అధికారులు వచ్చిన కాడికి అంటూ గత ఏడాది కంటే తక్కువ మొత్తానికి కట్టబెట్టేశారు. గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో గత ఏడాది కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది టెండరు వేంపల్లెకు చెందిన నాగరాజు రూ.73,35,000కు దక్కించుకున్నారు. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి రూ.50 లక్షలకు మించి తమకు వద్దని భీష్మించుకు కూర్చోవడంతో కాసేపు చర్చ సాగింది. అయితే అనధికారికంగా రూ.60కి అమ్ముకోవచ్చునంటూ అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆయనకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది కొబ్బరికాయల విక్రయం టెండర్ రూ.80 లక్షలకు దక్కించుకోగా.. జీఎస్టీతో కలిపి రూ.94 లక్షలు చెల్లించాలి. అయితే టెండరు దారుడు తనకు నష్టం వస్తోందని జీఎస్టీ చెల్లించలేదు. పైగా రూ.35 టెంకాయలు తెచ్చి రూ.60కి విక్రయించారు. దీనిపై భక్తులు పలుమార్లు అధికారులను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది కూడా 30 నుంచి 35 సెంటీమీటర్లు గల టెంకాయ రూ.35కు అమ్మాలని అధికారులు నిబంధన పెట్టారు. అయితే జీఎస్టీ ఊసే ఎత్తలేదు. దీంతో టెండరు దారులు మార్కెట్లోనే రూ.40నుంచి రూ.45 ఉంటే రూ.35కే ఎలా అమ్మాలంటూ ఎదురుప్రశ్నలు వేశారు. పోటీకి ఎవరూ రాకపోవడంతో మూడు పర్యాయాలు వాయిదా వేశారు. చివరికి ఆలయ వర్గాలు మెట్టు దిగి పూజా సామగ్రితో కలిపి రు.42కు అమ్ముకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. చివరకు రూ.60కు అమ్మవచ్చునని అనధికారిక హామీ రావడంతో అందరూ సిండికేట్గా మారి నామ మాత్రంగా పాడుతూ రూ.75,35,000లకు ముగించేశారు. నాగరాజుకు హక్కు కల్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. దీంతో గత ఏడాది కంటే తక్కువగా టెండరు పాడడం.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం జరిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ కార్యాలయ అధికారి భారతి, మాజీ ఛైర్మన్లు వీరభాస్కరుడు, వెంకటస్వామి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కంటే తక్కువగా రూ.75 లక్షలకే అప్పగించేశారు -
● పంట మునిగింది..
కడప అగ్రికల్చర్/సిద్దవటం: మోంథా తుఫాన్ ధాటికి వైఎస్సార్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 470 మంది రైతులకు సంబంధించి 270 హెక్టార్ల పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ సూచించారు. సిద్దవటం మండలంలో 60 హెక్టార్లలో వరిపంట, గోపవరం మండలంలో 20 హెక్టార్లలో వరి, 5 హెక్టార్లలో మొక్కజొన్న, పోరు మామిళ్లలో 150 హెక్టార్లలో వరిపంట, బి.మఠంలో 35హెక్టార్లలో వరిపంట తెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమింగా నష్టాన్ని అంచనా వేశారు. సిద్దవటం మండలంలోని లింగంపల్లి, మంగలవారిపల్లె, కడపాయపల్లె గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వేంపల్లె : మండలంలోని బోలగొందిచెరువు బీట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్కుమార్ తెలిపారు. వేంపల్లె అటవీ శాఖ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎరచ్రందనం రవాణాపై నిఘా పెట్టామని, వేంపల్లె ఎఫ్ఆర్ఓ పర్యవేక్షణలో సిబ్బంది బోలగొందిచెరువు బీట్ ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారని తెలిపారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన వ్యక్తులు ఎర్రచదనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్దం చేస్తుండగా దాడులు చేశామన్నారు. వేములగొందికి చెందిన పోతలపల్లె మల్లికొండ, కాయలపల్లెకు చెందిన వీరాంజనేయులు, చినన్న వారిపల్లెకు చెందిన చెన్నకేశవులను అరెస్టు చేశామని, కాయలపల్లెకు చెందిన కలువపల్లె మనోహర్నాయుడు పరారీలో ఉన్నారన్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. వారి నుంచి రూ.2,13,692 విలువగల 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎరచ్రందనం స్మగ్లింగ్ చేస్తే సమస్యల్లో పడతారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేసి.. అక్రమ రవాణాపై ఎక్కువగా నిఘా పెట్టామని తెలిపారు. టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బందతో కలిసి దాడులు చేసి డంప్లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులు, అడవి జంతువులను వేటాడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, డీఆర్ఓలు సుబ్బయ్య, శేషయ్య, బీవీ.సుబ్బయ్య, ఏబీఓ.శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. డీఎఫ్ఓ వినీత్ కుమార్ -
రోడ్ల మరమ్మతులకు రూ. 74.20 కోట్లు
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఆర్అండ్బీ అధికారి వై.సహదేవరెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని 218 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేసేందుకు రూ. 74.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. నాబార్డు, ప్లాన్ వర్క్, నిమ్మనపల్లి–వాల్మీకిపురం – గుర్రంకొండ, కలకడ–గుర్రంకొండ, పొంతల చెరువు–తిమ్మాపురం, చిత్తూరురోడ్డు–మదనపల్లి రోడ్డు వయా కేశపురం బోనమల రహదారితోపాటు ఇతర గ్రామాల రహదారులల్లో మరమ్మతు పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని వాటర్ ట్యాంకు వీధిలోని టవర్ వద్ద ఈ నెల 21న జరిగిన బ్యాటరీ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. కోవెలకుంట్ల రహదారిలో అనుమానాస్పదంగా ఉన్న పత్తూరిప్రశాంత్, పత్తూరు జగన్, అక్కలి పవన్సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని తెలిపారు. సీఐ మాట్లాడుతూ మద్యం, చెడు అలవాట్లకు వ్యసనపరులై బ్యాటరీలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వివాహిత మృతి ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని చౌడూరులో విద్యుత్ షాక్కు గురై వివాహిత సునీత (32) మృతిచెందారు. రూరల్ పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని సునీత ఇంటి పక్కనే పశువుల కోసం రేకుల షెడ్డు నిర్మించారు. షెడ్డులో ఇనుపరాడ్డుకు ఫ్యాన్ను అమర్చారు. ఈ క్రమంలో సర్వీసు వైర్కు చుట్టిన టేప్ సరిగా లేకపోవడంతో విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పశువుల పాకలోకి వెళ్లిన సునీత విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రజా సమస్యలపై కేంద్ర స్థాయిలో పోరాటం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పోరాటం చేపడతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయనకు నగరంలోని హరిత హోటల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తానన్నారు. చిన్నతనం నుంచి పోరాటం అనే పదం అట్టిపెట్టుకున్నానని, గిరిజన, దళిత, పేద, బడుగు వర్గాలకు విద్యార్థులకు, కార్మిక కర్షక రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశానని తెలిపారు. చట్ట సభల్లో ప్రశ్నించే హక్కు గతంలో లెఫ్ట్ పార్టీలకు ఉండేదని, అలాంటి రోజులు రావాలనే తపనతో ముందుకు వెళతానన్నారు. కూటమి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోదీ, అమిత్షా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా కార్పొరేట్ సంస్థలకు సంపద దోచిపెడుతోందని వివరించారు. అమరావతిలో 64 వేల ఎకరాలు సేకరించినా.. మరో 44 వేల ఎకరాలు అవసరమంటూ పంట భూములను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఉద్యోగులకు టీఏ, డీఏలను ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రైలులో జనరల్ కంపార్ట్మెంట్లు, స్లీపర్ కంపార్టుమెంట్లు పెంచాలని అడిగితే ఎయిర్పోర్టులు కడతాం.. విమానాలలో తిరగండి అనడం ఎన్డీఏ పాలకులకే చెల్లిందన్నారు. నక్సలైట్ల ఏరివేత ముసుగులో దమనకాండ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పట్టుదల, అంకుఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగిన ఈశ్వరయ్య రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. కృషి పట్టుదల, సామాజిక స్పృహ, సమస్యలపైన పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి నిదర్శనం గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య -
15 మంది జూదరుల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల–కడప రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో జూదమాడుతున్న హోంగార్డు గిరినాయక్, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుభాన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ సమీపంలో జూదమాడుతున్న 11మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. వైవీయూ అభివృద్ధికి సహకరించండి కడప ఎడ్యుకేషన్ : వైవీయూ అభివృద్ధికి సహకరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఎపిఎస్సిహెచ్) ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిని మంగళవారం ఆయన ఛాంబర్లో వీసి కలిసి విన్నవించారు. విద్య, పరిశోధనాపరమైన అనుభవాలతో విద్యా సంస్థను తీర్చిదిద్దాలని, ఎపీఎస్సీహెచ్ పూర్తిగా వెన్నంటి ఉంటుందని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు, కె.రత్న శైలామణి, సెక్రటరి బి.తిరుపతిరావులనులాయన కలిశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా కడప వైఎస్ఆర్ సర్కిల్ : కర్నూల్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్ఛార్జి డీటీసీ వీర్రాజు ఆధ్వర్యంలో ఇప్ప టి వరకూ గత నాలుగు రోజుల్లో 61 కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఐదు బస్సులను సీజ్ చేశారు. అనుమతులు లేకపోవడం, పన్ను చెల్లించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మద్యం తాగి నడపడం, అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవడం, సుత్తి లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం, సరిగా తెరుచుకోకపోవడం వంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
వెలిగల్లు నుంచి ..
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపధ్యంలో ముందుజాగ్రత్తగా ఇరిగేషన్శాఖ అధికారులు వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దిగువనున్న పాపా ఘ్ని నదికి 750 క్యూసెక్కులు చొప్పున ఒక గేటు ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 4.63 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.77 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అఽధికారుల ద్వారా తెలుస్తోంది. అలాగే సుండుపల్లె మండలంలోని పింఛాతోపాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జిల్లాలో ని వివిధ చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. -
పెన్నాకు నీరు విడుదల
జమ్మలమడుగు రూరల్: మైలవరం జలాశయం నుంచి పెన్నాకు నీటిని విడుదుల చేసినట్లు మైలవరం జలాశయం ఈఈ రమేష్ తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జలాశయం నుంచి సుమారు 4300 క్యూసెక్కుల నీటిని అధికారులతో కలసి ఆయన విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 5 టీఎంసీల నుంచి మైలవరం జలాశయానికి ఇన్ఫ్లో ఉండడంతో.. వచ్చిన నీటిని అలాగే పెన్నాకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.01 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు.జలాశయం సహయం ఈఈ మూర్తి, ఏఈ సుబ్బారావు, రూరల్ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్ కొట్టు.. సబ్సిడీ పట్టు
● పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో భారీగా అవకతవకలు ! ● ఒక ప్రామాణికం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా జమ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక వేత్తలు సాక్షి టాస్క్ఫోర్స్ : ఆషాఢం సేల్...దీపావళి ధమాకా...దసరా బంపర్ ఆఫర్ అంటూ వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి వినియోగదారులకు బహుమతులు (గిఫ్ట్)లను ఎరగా వేస్తుంటారు. ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ ప్రకటిస్తుంటారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు మంజూరు చేయడంలో పరిశ్రమల శాఖలో ఇదే తరహా సేల్ రివర్స్లో జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే క్యాష్ కొడతారో వారికే రాయితీలు బహుమతులుగా వచ్చాయన్న అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సమ్మిట్లో పారిశ్రామిక వేత్తలకు తాము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకుల నుంచి రూ.2వేల కోట్లు రుణంగా పొంది, అందులో రూ.1500 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు దీపావళి రోజు ప్రకటించారు. ఆ ప్రకటనతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు సంబరపడి పోయారు. వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు...ప్రోత్సాహకాల విడుదలలో ప్రభుత్వం చేసిన అసలు మోసం బట్టబయలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి నిలువునా మోసపోయామని, ఈ దెబ్బతో చాలా చిన్న యూనిట్లు ఖాయిలా పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒక ప్రామాణికం, విధానం అంటూ లేకుండా... పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో పరిశ్రమల శాఖ అధికారులు ఒక ప్రామాణికం, పద్ధతి, ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ కమ్...ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అయితే సీనియారిటీ మేరకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి మొదట రాయితీలు ఇవ్వాలి. అలాకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నవారికే ఇచ్చారని అనుకుంటే అంతకుముందు దరఖాస్తు చేసుకున్నవారిని పక్కనబెట్టాలి. కానీ అటూ ఇటూ కాకుండా 2023లో రాయితీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కొందరికి, 2024లో దరఖాస్తు చేసుకున్న వారికి మరికొందరికి, 2022లో చేసుకున్న కొందరికి మంజూరు చేయడంతో పారిశ్రామిక వేత్తలు అయోమయంలో పడిపోయారు. ఎవరైతే కాసులిచ్చి విజయవాడలోని పరిశ్రమల శాఖ అధికారులను ప్రసన్నం చేసు కున్నారో వారికి మాత్రమే ప్రోత్సాహకాలు విడుదల చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం పాలసీలో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాతాల్లో కూడా భారీ తేడా ఎవరికి ఎంత శాతం రాయితీలు పడ్డాయన్నది కూడా మిస్టరీగా మారింది. ఒక యూనిట్కు రావాల్సిన మొత్తం రాయితీలో 20 శాతం, 40 శాతం మేర ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు సమాచారం. బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకున్నవారికి 20 శాతం, మ్యాన్యుపాక్చరింగ్ సెక్టార్ వారికి 40 శాతం రాయితీలు ఇచ్చారని తెలిసింది. కానీ కొంతమందికి 10 శాతమే రాయితీలు పడ్డాయని చెబుతున్నారు. ఏ నిబంధనల ప్రకారం ఏ సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎంతెంత రాయితీలు ఇచ్చారో ప్రకటించాల్సిన పరిశ్రమల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పారిశ్రామిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
బీఎడ్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల య పరిధిలోని వైఎస్సార్ కడప, అన్న మయ్య జిల్లాలోని 17 కేంద్రాల్లో బీఎడ్ పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను అన్ని కేంద్రాల్లో కలుపుకొని 21,665 మంది విద్యార్థులు రాస్తున్నారు. తొలిరోజు కడపలోని నాగార్జున డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిబంధనలను అనుసరించి జరపాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి.కృష్ణారావు వివరిస్తూ రెండు జిల్లాల్లోని అన్ని కేంద్రాలకు విశ్వవిద్యాలయం తరఫున అబ్జర్వర్లను నియమించామని తెలిపా రు. అలాగే స్క్వాడ్ బృందాల సభ్యులు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని వి.సికి వివరించారు. యూనివర్సిటీ సెంటర్ అబ్జర్వర్ తుమ్మలూరు సురేష్బాబు, చీఫ్ సూపరింటెండెంట్ రెడ్డప్ప పాల్గొన్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు.ముందుగా మూల విరాట్లు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, పూజలు జరిపారు. రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గుంటిమడుగు పెద్ద చెరువుకు గండి రాయచోటి : రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని పెద్ద గోలాన్ చెరువుకు భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోలాన్ చెరువులోకి వర్షపునీరు చేరింది. సోమవారం మధ్యాహ్నం గండిపడిన ప్రాంతాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు స్పందించి గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. కడప కోటి రెడ్డి సర్కిల్ : మోంథా తుపాను నేపథ్యంలో కడప నుంచి విశాఖపట్నం వెళ్లేతిరుమల ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు -
శంభో శివ శంభో !
నిండు మనసుతో చెంబుడు నీళ్లు గుమ్మరిస్తే చాలు.. అడిగిన వరాలిస్తాడు... భక్తితో ఒక మారేడు దళం సమర్పిస్తే ముక్తిని ప్రసాదిస్తాడు.. మా శివయ్య భోళా శంకరుడు... అంటూ భక్తులు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శివాలయాలన్నీ కార్తిక దీప కాంతులతో శోభిల్లాయి. తొలి దర్శనం చేసుకున్నా...తొలిదీపం పెట్టినా అధిక పుణ్య లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు తెల్లవారుజాము 3.30 గంటల నుంచే ఆలయాలకు క్యూ కట్టి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. ● కార్తీక దీప కాంతులతో శోభిల్లిన శైవ క్షేత్రాలు ● భక్తిశ్రద్ధలతో కార్తిక తొలి సోమవారం బి.కోడూరులోని అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమంలో 108 శివలింగాలు .. కడప అక్కాయపల్లెలో కోటి దీపోత్సవం.. పుష్పగిరిలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ -
మోంథాపై ఆందోళన వద్దు
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్ : మోంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉందని ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా అధికారులకు సూచించారు. మోంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, సంసిద్ధతపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తగు సూచనలు చేశారు. రిజర్వాయర్లు, నదులు, వాగులు, వంకలు, చెరువులు.. ఉప్పొంగే అవకాశాలు ఉన్నందున.. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు సంబంధిత సిబ్బందితో 24 గంటలు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిలో పోలీసు, అగ్నిమాపక సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీలలో సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యు లు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపడుతున్న ముందస్తు సంసిద్ధత ఏర్పాట్లపై ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్ : తుపాన్ కారణంగా జిల్లాలో వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో అత్యధికంగా 11.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే చక్రాయపేట, ఎర్రగుంట్లలలో 10, వీఎన్పల్లిలో 7.2, వేంపల్లిలో 6.2, సిద్దవటంలో 3.4, మైదుకూరులో 1.8, కడపలో 1, దువ్వూరులో 0.3 మి.మీ వర్షం కురిసింది. -
వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!
కడప అగ్రికల్చర్ : మొంథా తుపాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.సతీష్ ఉద్యాన రైతులకు సూచించారు. కూరగాయల పంటలు.. ● వర్షం ధాటికి పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు దగ్గరగా మట్టిని ఎగదోయాలి. ● మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలతో ఉన్నట్లయితే 0.3 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె) లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2–3 సార్లు మొక్క తడిచేటట్లుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ● కూరగాయ పంటలు కొత్తగా విత్తిన లేదా నాటినట్లయితే వాటిని తీసివేసి మరలా నాటుకోవాలి. ● పంటకు ఆకుపచ్చ, కాయకుళ్లు, బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 2.5 గ్రాముల సాఫ్ మందును కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి. ● వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు లేదా కర్బండిజమ్ 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపు పంట.. ● వర్షాలు ఆగిన వెంటనే పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. ● పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనబడితే, 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు అన్నభేది ఒక నిమ్మచెక్క రసం, జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ● నేల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది. పైపాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్తో పాటు 200 కిలోల వేపపిండి వేయాలి. ● ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రాప్తికోన జోల్ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● దుంపకుళ్లు ఆశించినట్లయితే పాదుల్లో మొక్కలు చుట్టూ నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాములు రిడోమిల్ మందును కలిపిన ద్రావణంతో తడపాలి. పూల తోటలు.. ● మొక్కలపై 2 శాతం యూరియా లేదా 1 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె)ను 2–3 సార్లు పిచికారీ చేయాలి. ● ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1–2 సార్లు పిచికారీ చేయాలి. ● కోతకు సిద్ధంగా ఉన్న పువ్వులను వీలైనంత త్వరగా కోసుకోవాలి. ● పువ్వులను కోసిన తరువాత, మార్కెట్కు పంపేలోపు వాటిని తాత్కాలికంగా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి. ● వీలైనంత త్వరగా పువ్వులను మార్కెట్టుకు పంపాలి. ఉల్లి పంట.. ● మురుగు నీటిని బయటకు పంపాలి. ● ఆకుమచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లి కోత దశలో.. ● తుపాను హెచ్చరిక ఆధారంగా తుపాను రాక ముందే వీలైనంత తొందరగా గడ్డలను కోసుకోవాలి. ● వర్షం ఆగిన వెంటనే గడ్డలను కోయరాదు / పీకరాదు. కోత అనంతరం.. ● గడ్డలను పీకిన తరువాత 1 గ్రాము థయోఫాసేట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. ప్రొఫికోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నిల్వలో గడ్డ కుళ్లును నివారించవచ్చు. ● కోసిన గడ్డలను వర్షంలో తడవకుండా టార్పాలిన్ పట్టలు కప్పాలి. ● సోలారు డ్రైయర్స్ను ఉపయోగించి గడ్డలను తొందరగా ఆరబెట్టుకోవాలి. లేదా గడ్డలను 7 నుంచి 10 రోజులు ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ● వీలైనంత తొందరగా గడ్డలను గ్రేడింగ్ ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచకుండా మార్కెటింగ్ చేసుకోవాలి.రైతులు జాగ్రత్తలు పాటించాలంటున్న ఉద్యానశాఖ అధికారులుసస్యరక్షణ చర్యలు తప్పనిసరి.. వర్షాల నేపథ్యంలో రైతులు తప్పని సరిగా ఉద్యాన పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలా చేపట్టినప్పుడే ఉద్యాన పంటలను రక్షించుకోగలరు. ఆయా పంటలు సాగుచేసిన రైతులు తప్పని సరిగా ఆయా చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలి. – జి. సతీష్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
ఉత్సాహంగా ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో సబ్ జూనియర్ ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు సోమవారం ఉత్సాహంగా సాగా యి. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్సార్ కడప, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎంపిక లు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి జనార్ధన రెడ్డి ఎంపికలను పర్యవేక్షించారు. సబ్ జూనియర్స్ ఇండియన్ రౌండ్–బాలుర జట్టు: కె. అరవింద్, ఎస్. శశి వర్ధన్, జి. సిద్ధార్ధ, టి.గణేష్, సి దినేష్ కుమార్ బాలికల జట్టు: టి.శివ దుర్గ, కె.నవ్య శ్రీ, వి.మధులిక సబ్ జూనియర్స్ రికర్వ్ రౌండ్ బాలుర జట్టు: వై.నవనీష్, ఎ.యశ్వంత్ రెడ్డి, ఎల్. కౌశల్ దేవ రాయల్, పి.విఘ్నేష్ చరణ్, బి.ఖ్యాతేష్, షణ్ముక బాలికల జట్టు: టి. సుశ్రుత సభ జూనియర్స్ కాంపౌండ్ బాలుర జట్టు: సి. అభినయ్, పివి. పాయి శ్రీనివాస్, కె. వెంకట కార్తీక్ -
విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం
వీరపునాయునిపల్లె : మోంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణ అన్నారు. సోమవారం మండలంలోని అయ్యవారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్చిన చర్యలపై సిబ్బందికి సలు సూచనలందించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయేంతవరకు అధికారుల, సిబ్బందికి సెలవులు రద్దుచేశామని.. ప్రతి ఒక్కరూ 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించా రు. సమావేశాననంతరం విలేకరులతో మాట్లాడు తూ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కడప నుంచి కాకినాడకు 20బృందాలను పంపించామని వెల్లడించారు. సర్కిల్ కార్యాలయం కడప, కడప డివిజన్, పులివెందుల ప్రొద్దుటూరు, మైదుకూరులలో 5కంట్రోల్ రూమ్లు పని చేస్తున్నాయని వివరించారు. కంట్రోల్ రూమ్ నంబర్లు యల్యమ్సి సర్కిల్ కార్యాలయం కడప 9440817440, కడప డివిజన్ కార్యాలయం 9901761782, పులివెందుల 7893063007, ప్రొద్దుటూరు 7893261958,మైదుకూరు 9849057659 అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల డీఈ కిరణ్, ఏఈ హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
కొప్పర్తి చెరువు కట్ట కాలువకు గండి
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి చెరువు నుంచి తాడిగొట్ల చెరువుకు నీరు వెళ్లే కట్ట కాలువకు సోమవారం గండ్లు పడడంతో నీరు వృథాగా పోయింది. సాయంత్రానికి స్పందించిన రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు జేసీబీ సహాయంతో కాలువకు పడిన గండ్లను మట్టితో పూడ్చివేశారు. కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి కడప ఎడ్యుకేషన్: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ షేక్ షంషుద్దీన్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణమూర్తి అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అతనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నంకమలాపురం : కమలాపురం విద్యుత్ సబ్స్టేషన్కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. కడప–ముద్దనూరు ఫోర్లేన్ రోడ్డు మంజూరు కావడంతో కబ్జాకోరులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ఈ స్థలం నాదని, పిల్లర్ల కోసం 9 గుంతలు సైతం కొట్టించాడు. దీనిని చూసి సబ్ స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సోమవారం విద్యుత్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది సబ్ స్టేషన్ స్థలమని తమ స్థలంలో గుంతలు కొట్టించాడని ఆ గుంతలను అధికారులు పూడ్పించారు. కార్మికుల సమస్యలపై పోరాటంఓబులవారిపల్లె : కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం పరిసరాల్లో ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్, త్రివేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోగురి మురళీ, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు దినేష్, హరి, త్రివేణి, కార్మీక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు నాగరాజు, వెంకటరమణ, వరప్రసాద్ పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో ఉన్న డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ గండిలోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బంగారు పతకం సాధించిన వైశాలి త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాజరవుతుందని ఆయన వివరించారు. కాగా భారతి సిమెంట్స్ ప్లాంట్ హెడ్ ఎం. రామమూర్తి, హెచ్ఆర్ గోపాల్ రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. సిల్వర్ జోన్ ఫౌండేషన్ లిటిల్ స్టార్స్లో డీఏవీ విద్యార్థుల ప్రతిభ.. సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లిటిల్ స్టార్లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఒలంపియాడ్ (ఐఓఈఎల్) డీఏవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. తమ డీఏవీ భారతి స్కూల్కు చెందిన 147 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందాయన్నారు. అలాగే ఐదుగురికి వెండి, ఏడుగురు రజత పతకాలు అందుకున్నారని తెలిపారు. పతకాలు అందుకున్న విద్యార్థులను ప్లాంట్ ప్రతినిధులు అభినందించారు. -
మెడికల్ కాలేజీల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కువైట్లో కోటి సంతకాల సేకరణ
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కువైట్ దేశంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసాంఽధ్రులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. కువైట్లోని మాలియా ప్రాంతంలో మాక్స్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోడూరు మండల కన్వీనర్ రామిరెడ్డి, ధ్వజారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ కల్లూరు రమణారెడ్డి, కువైట్ పిస్తా హౌస్ అధినేత ఎస్బి అహ్మద్బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్యాన్ని అందించడానికి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు ఎన్. మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్లు ఎం. చంద్రశేఖర్ రెడ్డి, మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, షేక్ రహమతుల్లా, అఫ్సర్ అలీ, యు.వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అట్లూరు : ప్రమాదవశాత్తు ఆదివారం సగిలేరు నదిలో గల్లంతైన ప్రభాకర్ మృతదేహం లభ్యమైంది. మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) ఓ మహిళ అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు సగిలేరు నదిలో గల్లంతైన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వెంటనే తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ, ఎస్ఐ రామకృష్ణయ్య, సీఐ కృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి చీకటి పడే వరకు గాలించినా మృతదేహం లభించలేదు. తిరిగి సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, అగ్నిపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఎట్టకేలకు ప్రభాకర్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముడమాల ప్రభాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నవోలు బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబాన్ని ఓదార్చి మేమున్నామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
● రూ. 10.2 లక్షల విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం ● 14 మంది నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లిరాయచోటి : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు, విక్రయదారులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియాకు వివరించారు. కలకడ పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్ ద్వారా రూ. 10.2 లక్షలు విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషాతో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న పర్యవేక్షణలో కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారన్నారు. సోమవారం ఉదయం కలకడ మండలం, బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల, కొత్తపల్లి రోడ్డులోని రాతి దిబ్బ సమీపంలో పోలీసులు దాడి చేశారన్నారు. ఇదే సమయంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళ నిందితురాలితోపాటు 14 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సొత్తు కేసు వివరాలు.. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10.2 లక్షలు విలువచేసే 34 కిలోల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న చిన్నచిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు అయిన 14 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వివరించారు. కఠిన చర్యలు తప్పవు.. జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి ముఠా అరెస్టు ఆపరేషన్ విజయవంతం చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి.రామాంజనేయులు, పీఎస్ఐ కుమారి హారిక, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మదనపల్లె రూరల్ : మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మదనపల్లె మండలం, వలసపల్లె మొలకలదిన్నెకి చెందిన గుర్రాల వాసు అలియాస్ ఎరుకుల శ్రీనివాసులు (35), కురబలకోట మండలం, తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కుమారుడు గెంటిమ్ ఆనంద్ కుమార్(27) లు గంజాయి రవాణాదారులైన మదనపల్లె పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీంసాబ్ కుమారుడు జాఫర్ అలీ, గంగిశెట్టి చలపతి కుమారుడు శివకుమార్ల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, మదనపల్లె, అంగళ్లు తదితర ప్రాంతాల్లో రహస్యంగా యువతకు, విద్యార్థులకు విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో 26వ తేదీ ఆదివారం తట్టివారిపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని విచారించి నిందితుల వద్ద నుంచి, రూ. 20వేల విలువ చేసే రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ 1 నిందితుడు శ్రీనివాసులుపై ఇదివరకే మదనపల్లె తాలూకా, టూ టౌన్, స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఇదే కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాఫర్ అలీ, గంగిశెట్టి శివకుమార్ పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని, నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన టు టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు. -
రైల్వేసమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నియమితులై తొలిసారిగా విచ్చేసిన ఎంపీ మేడా రఘునాథరెడ్డిని మేడా భవన్(రాజంపేట బైపాస్ క్రాస్)లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టాండింగ్ కమిటీలో సభ్యునిగా చోటు కల్పించినందువల్ల రైల్వేపరంగా ఈ ప్రాంతానికి అవసరమైన అంశాలపై దృష్టి సారించగలిగే అవకాశం కలిగిందన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి దృష్టికి ఉమ్మడి కడప జిల్లాలోని రైలుమార్గంలో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లనున్నట్లు గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి తెలిపారు. మేడాభవన్లో ఎంపీ మేడాను కలిసి బొకేను అందచేశారు.కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి,మార్కెట్మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు కృష్ణారావు, నందలూరు సింగల్ విండో మాజీ అధ్యక్షుడు పాలగిరి సుధాకర్రెడి సౌమ్యనాధాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్,్డతోపాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ మేడా -
కర్నూలు బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
– వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటన ప్రమాదం కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయని, కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రఽథమ ముద్దాయని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. జాతీయ రహదారి సమీపంలోని బెల్ట్షాపులో మద్యం తెల్లవారుజామునే అమ్మడంపై ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం (ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తోందన్నారు. ఫిట్నెస్ సహా ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీరాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారుశ్రీ అని దుయ్యబట్టారు. ఈ ఘటనతో పాటు మద్యం వల్ల ఇకపై ఏ ప్రమాదం జరిగినా అది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే భావించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తానన్నారు. వీటిని హత్యలుగా భావించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. -
నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు
వేంపల్లె : నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపిన దర్బార్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం వేంపల్లెలోని పులివెందుల – గండి బైపాస్ రోడ్డులోని మదీనాపురం సమీపంలో దర్బార్ అనే యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులు 3 మోటార్ బైకుల్లో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెద్దగా శబ్దం చేయడంతో పాటు మోటార్ బైకు ముందు చక్రాలను లేపి వెనుక చక్రాలపై మోటార్ బైకు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మోటార్ బైకులను నడిపిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి మోటార్ బైకులపై చర్యలు తీసుకోవాలని పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ షాక్తో మహిళ మృతి మైలవరం : మండల పరిధిలోని కర్మలవారిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (56) కరెంటు షాక్తో మృతి చెందింది. ఆదివారం లక్ష్మీదేవి తాను ఉతికిన దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టుకుంటుండగా కడ్డీలకు విద్యుత్ కనెక్షన్ తగలడంతో షాక్కు గురైంది. భర్త మాధవరెడ్డి భార్యకు కరెంటు షాక్ తగిలిందని భావించి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ షాక్కు గురైన లక్ష్మీదేవిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోను ఢీకొన్న కారు కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై ముద్దనూరు వైపు వెళ్లే ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేట గ్రామానికి చెందిన చంద్ర ఓబులేసు తన కుమారుడు శశి విఖ్యాత్కు మూర్ఛ వస్తుండటంతో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామంలో వాయి బిళ్ల వేయించుకొనేందుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి వైపు నుంచి వచ్చే కారు వెనుక నుంచి ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా నడుం బిగిద్దామని జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో తెలిసీ తెలియని వయస్సులో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వాడినా, అమ్మినా నేరమని, దానికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. యువత సన్మార్గంలో నడిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరణాల.శివకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్, నగర ఉపాధ్యక్షుడు పెద్దన్న పాల్గొన్నారు వృద్ధురాలి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్కు ఈనెల 26వతేదీన తన కుమార్తె ఇంటికి రాజుపాలెం మండలం అర్కటవేములకు చెందిన గంటల నాగమ్మ(82)అనే వృద్ధురాలు వచ్చింది. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయిందని అల్లుడు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు పోలీసులకుగానీ, వేణుగోపాల్ సెల్ నెంబర్: 80740 22422కు తెలియజేయాలని పోలీసులు కోరారు. చెరువులో వ్యక్తి గల్లంతు అట్లూరు : చెరువులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి గల్లంతైన ఉదంతం మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) డప్పు కళాకారుడుగా జీవనం సాగిస్తున్నాడు. బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఆదివారం ఆమె అంత్యక్రియలకు డప్పు వాయించేందుకు ప్రభాకర్ వెళ్లాడు. ఆ మహిళ అంత్యక్రియల అనంతరం ప్రభాకర్ ఇంటికి వస్తూ కాళ్లు, చేతులు కడుక్కొనేందుకు సమీపంలోని వేమలూరు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో అక్కడున్న వారు బంధువులకు సమాచారం ఇచారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, తహసీల్దార్కు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఐ రమణ, వీఆర్ఓ సుబ్బన్న బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి ఆదివారం చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గజ ఈతగాళ్లు మళ్లీ ఉదయం గాలిస్తామని తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఐదుగురు ఆడపిల్లలు కాగా, వారిలో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. జాతీయ స్థాయి అబాకస్లో సత్తా చాటిన నాగార్జున విద్యార్థులు కడప ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి అబాకస్ పోటీలలో కడప నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి క్యూబాటిక్ అబాకస్ పరీక్షల్లో 5వ తరగతికి చెందిన తబితాశ్రేష్ఠ, 4వ తరగతికి చెందిన మోక్షజ్ఞలు ద్వితీయ బహుమతులను సాధించగా 5వ తరగతికి చెందిన భారతి తృతీయ బహుమతిని సాధించారు. అలాగే 6వ తరగతికి చెందిన రేయాన్ఖాన్, 5వ తరగతికి చెందిన మోక్షితారెడ్డి, 3వ తరగతికి చెందిన సోహిత్, లక్ష్మి కాస్వీరెడ్డిలు నాలుగో స్థానంలో నిలిచారు. మరో నాలుగు మెరిట్ బహుమతులను పొందారు. జాతీయస్థాయి అబాకస్ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ శివ తులశమ్మ, డైరెక్టర్ శివప్రసాద్రెడ్డి, హెచ్ఎం క్రిష్ణారెడ్డి, హెడ్మిసెస్ సుశీలదేవి అభినందించారు. కుటుంబ సభ్యులకు మహిళ అప్పగింత మైలవరం : మండల పరిధిలోని బుచ్చంపల్లి గ్రామానికి చెందిన మూడే తేజేశ్వరిని ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ తేజేశ్వరి జూన్ 19వ తేదీన భర్త కేశాలు నాయక్తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో పక్కింటి వారితో ఉపాధి పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. అయితే ఇంటికి భార్య తిరిగి రాకపోవడంతో భర్త కేశాలు నాయక్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఆచూకీ లభ్యం కావడంతో ఆదివారం కుటుంబ పెద్దలను పిలిపించి అప్పగించారు. -
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని కోటిరెడ్డినగర్లో నివసిస్తూ బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తుండే మన్నెం మల్లేశ్వరి (28) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బి.మఠం మండలం మలుగుడుపాడుకు చెందిన సుబ్బరామిరెడ్డి, ఇంద్రావతిల రెండవ కుమార్తె అయిన మల్లేశ్వరిని మూడేళ్ల క్రితం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెలకు చెందిన రామనరసారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లేశ్వరి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండటంతో తలుపును పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా మల్లేశ్వరి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరామర్శించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే .. మృతురాలు మన్నెం మల్లేశ్వరి స్వగ్రామం బి.మఠం మండలం మలుగుడుపాడు కావడంతో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మల్లేశ్వరి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, బి.మఠం మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మండల నాయకులు వెంకటరామిరెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాగమునెమ్మ మృతదేహం లభ్యం
రాజుపాళెం : రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో శనివారం గల్లంతైన నాగమునెమ్మ (76) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఉదయం నుంచి ప్రొద్దుటూరు ఫైర్ సిబ్బంది బోట్ సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వెల్లాల పాతవంతెనకు సమీపంలో ఆ వృద్ధురాలి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడంతో వెంటనే బోటులో ఒడ్డుకు చేర్చారు. పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామసుబ్బారెడ్డి, గొంగటి నాగమునెమ్మ అనే వృద్ధ దంపతులు జీవితంపై విరక్తి చెందడంతో పాటు అనారోగ్య కారణాలతో శనివారం వెల్లాల కుందూనది పాత వంతెనపై నుంచి నదిలోకి దూకిన విషయం విదితమే. నది ఉధృతిలో కొట్టుకుపోతున్న రామసుబ్బారెడ్డిని స్థానికుడైన గుర్రప్ప ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయింది. ఆదివారం లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


