breaking news
YSR
-
‘బిహార్ రాష్ట్ర తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక’
వైఎస్ఆర్ జిల్లా: బిహార్ రాష్టర తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందని జిల్లా వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్న ఎంపిక చేసుకుని కొన్ని స్థానాలకే ఎన్నికలు జరిపారన్నారు. ‘ఆయుధాలను చూపి ప్రజలను బెదిరించి ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఎన్నికల్లో కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. అదే ఫోటోను నారా లోకేష్ ప్రజాస్వామ్యం గెలిచిందని ట్వీట్ చేసారు. అక్కడే అర్థం అయింది ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో?, ప్రజలను ఓటు వేసేందుకు వస్తుంటే బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్మెంట్స్.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
25 నుంచి ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి వివిధ కోర్సుల్లో నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీ పార్లర్ (35 రోజులు), జ్యూట్ ప్రోడెక్ట్ (14 రోజులు), కొవ్వొత్తుల తయారీ (11 రోజులు)లో శిక్షణ ఉంటుందని వివరించారు. 18–45 ఏళ్లలోపు కలిగిన నిరుద్యోగ మహిళలు ఇందుకు అర్హులన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తామన్నారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఫార్మసీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ సైన్సు గ్రూపు(ఎంపీసీ/బైపీసీ) పాస్ అయిన విద్యా ర్థులు గవర్నమెంట్, ప్రైవేటు పాలిటెక్నిక్లో డి ఫార్మసీ (డిప్లొమా ఇన్ ఫార్మసీ) రెండేళ్ల కోర్సులో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ నెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 6302782239, 9440144057 సంప్రదించాలని సూచించారు. వైఎస్ జగన్ను కలిసిన సుబ్బారెడ్డిఒంటిమిట్ట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని బుధవారం జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఆయనతో చర్చించా రు. ఇంతటి ఘోరమైన ఎన్నికలు తమ జీవితంలో చూడలేదన్నారు. మండలంలో ఏర్పా టు చేసిన ప్రతి బూత్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమక్షంలో ఆయన మనుషులు రిగ్గింగ్ చేశారని తెలిపారు. ఇక్కడ జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల గురించి మాజీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల కడప ఎడ్యుకేషన్ : పూర్వ విద్యార్థులకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ తెలిపారు. 2018, 2019, 2020, 2021,2022 సంవత్సరంలో తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు వన్ౖటైమ్ సెటిల్మెంట్ సప్లి మెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. ఇందులో ప్రతి ఒక్క పేపర్కు రూ. 1000 చెల్లించాలని తెలిపారు. పరీక్ష ఫీజును ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ ఫీజును చలానా ద్వా రా చెల్లించాలని వివరించారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే ప్రభుత్వ పురుషుల కళాశాలోని పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. నిత్యపూజ స్వామికి రూ. 1,38,003 ఆదాయం సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజ స్వా మి హుండీ ఆదాయం లెక్కించారు. బుధవారం ఆలయ ఇన్చార్జి ఈఓ శ్రీధర్ మాట్లాడుతూ జూన్, జూలై నెలల్లో భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించగా రూ. 1,38,003 వచ్చిందని తెలిపారు. రాజంపేట దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్ పాల్గొన్నారు. ‘పింఛా’లో పెరిగిన నీటిమట్టం సుండుపల్లె : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది.బుధవారం సాయంత్రానికి 258 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా ప్రస్తుతం 996.6 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో మొత్తం నీరు 81.74 శాతంగా ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తుతారని, అందువల్ల ప్రాజెక్టుకు దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. -
జిల్లాలో జడివాన
కడప అగ్రికల్చర్ : జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు జడిపట్టి కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా మబ్బులు.. వాన చినుకులతోనే రోజులు గడుస్తున్నాయి. ఇక బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులు రాలుతూనే ఉన్నాయి. దీంతో పనులపై బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగ విధులకు వేళ్లే వారు సైతం అవస్థలు పడ్డారు. వరుస వానలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారి జనాలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఖరీప్ సీజన్ ప్రారంభం నుంచి జిల్లాలో వర్షం కురవలేదు. దీంతో చాలా మేర పంటలసాగు కాలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్నర నెల కావస్తున్నా నేటికి జిల్లాలో 20 శాతం మేరనే పంటలు సాగయ్యాయి. సాగైన పంటలకు సరైన వర్షా లు లేక రైతన్నలు కాసింత ఇబ్బందులకు గురయ్యా రు. అల్పపీడనం కారణంగా జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాగు లో ఉన్న ఆరుతడి పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొ న్న, కొర్ర, కంది, పెసర, మినుము, వేరుశనగ, సన్ప్లవర్, సోయాబీన్, పత్తి పంటలకు జీవం వచ్చింది. వరిపంటలకు ఉన్న తెగులు తగ్గి ఏపుగా వస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు. ప్రారంభంకానున్న ఆరుతడి పంటలసాగు... గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భూమి పదునెక్కింది. ఇక రైతన్నలు కాడీ, మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వేరుశనగతోపాటు పసుపు, జొన్న, కందితోపాటు ఇంకా పలు రకాల ఆరుతడి పంటలను సాగు చేయనున్నారు. దీంతోపాటు కేసీ కాలువకు నీరు కూడా రావడంతో వరిసాగు పనులు కూడా ఊపందుకున్నాయి. ఉద్యాన పంటలకు మేలే... జిల్లాలోని పులివెందుల, చక్రాయపేట, వేముల, వేంపల్లి, వీన్పల్లిలతోపాటు పలు మండలాల్లో సాగులో ఉన్న ఉద్యాన పంటలైన మామిడి, చీని, సపోట, జామ వంటి ఉద్యాన పంటలకు ఈ వర్షంతో ప్రాణం వచ్చింది. -
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం, యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు బుధవారం అసోసియేషన్ నాయకులు కడప ఆర్టీసీ బస్టాండులోని ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని, గవర్నర్పేట–2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులూ సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 8 వేల ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు వెంటనే ఇవ్వాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంతోపాటు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, డిపో ప్రెసిడెంట్ జయరాం, గ్యారేజ్ సెక్రటరీ మల్లేష్, డిపో జాయింట్ సెక్రటరీ లక్ష్మయ్య, సీఎస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.ధర్నాలో ఎన్ఎంయూఏ నాయకులు -
‘గండికోట’లోకి భారీగా కృష్ణా జలాల రాక
కొండాపురం : అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి సృజల స్రవంతి కెనాల్ ద్వారా 11,200 క్యూసెక్కుల కృష్ణజలాలు గండికోట జలాశయంలోకి వస్తున్నట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమా మహేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 20.1 టీఎంసీలకు చేరినట్లు ఆయన తెలిపారు. వాగులు వంకల ద్వారా 2700 క్యూసెక్కులనీరు జలాశయంలోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. పుల్ రిజర్వాయర్ లెవల్ 695.5 అడుగులు ఉండగా ప్రస్తుతం 690 అడుగులకు రిజర్వాయర్ లెవల్కు చేరినట్లు తెలిపారు. గండికోట స్పిల్ వే క్రిస్ట్ గేట్ల ద్వారా మైలవరం జలాశయానికి 7500 క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయన్నారు. గండికోటఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు మోటర్లతో 440 క్యూసెక్కులనీరు పంపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు. -
ఫ్రీ పోలింగ్ జరపాలి
పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికలు ఫ్రీ పోల్ గా జరపాలి. టీడీపీ గుండాలు పోలింగ్ బూతుల వద్ద కాపు కాయడం సరికాదు. గ్రామస్తుల ఓటర్ స్లిప్పులను చింపి వాళ్లే ఓటు వేసుకుంటున్నారు. ఇప్పటికై నా ఇలాంటి సంస్కృతి మానేస్తే బాగుంటుంది. అంతేకాకుండా అధికారులు మా గ్రామం నుంచి వేరే గ్రామానికి పోలింగ్ బూతులను మార్చడం సరైన పద్ధతి కాదు. మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. – చందన, ఇ –కొత్తపల్లె (దళితవాడ) పులివెందుల ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. అందుకే మా కొత్తపల్లి దళితవాడలోని ఓటర్లందరం బాయ్ కాట్ చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి టీడీపీ గుండాలు బూతుల వద్దకు చేరుకున్నారు. బూతు దగ్గరికి వెళ్లగానే మా దగ్గర ఉన్న స్లిప్పులు లాక్కుంటున్నారు. మీరు వెళ్లిపోండి మీ ఓటు మేమే వేస్తాం అని అంటున్నారు. మా ఓటును కూడా మేము వేసుకునే పరిస్థితిలో లేం. ఇలాంటి సంస్కృతి కూటమి నేతలు మార్చుకోవాలి. – గోవిందమ్మ, ఇ –కొత్తపల్లె, పులివెందుల ఓటింగ్ బాయ్ కాట్ పులివెందుల మండలంలోని ఇ–కొత్తపల్లె దళితవాడ గ్రామస్తులందరం పోలింగ్కు వెళ్లకుండా బాయ్ కాట్ చేశాం. నేను పోలింగ్ బూత్ లో ఏజెంటుగా ఉన్నాను. కానీ పోలింగ్ బూత్ వద్ద ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గుండాలు చుట్టూ ముట్టారు. నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని లాక్కొని చింపి వేశారు. ఓటర్లు, ఏజెంట్లు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు జరపాలి. మా ఓటును స్వేచ్ఛగా అధికారులు వేసుకోలేనప్పుడు ఎన్నికలను రద్దు చేయాలి. – వరలక్ష్మి, మండలాధ్యక్షురాలు, ఇ –కొత్తపల్లె. -
పెన్నానదిలో యువకుడి గల్లంతు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం సమీపంలోని రెండు కుళాయిల వద్ద ఉన్న పెన్నానదిలో నాయుని విక్రమ్ (20) అనే యువకుడు గల్లంతయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రమ్ వన్టౌన్ సర్కిల్లోని టీ దుకాణంలో మాస్టర్గా పని చేస్తున్నాడు. అతను తన స్నేహితులు వెంకటసాయి, ముత్తయ్య, శివలింగమయ్యలతో కలిసి బుధవారం పెన్నానదికి వెళ్లాడు. మిత్రులందరూ పెన్నానదిలో కొంత సేపు సరదాగా గడిపారు. కొంత సేపటి తర్వాత మళ్లీ వస్తానని చెప్పి విక్రమ్ వారికి దూరంగా వెళ్లాడు. అలా వెళ్లిన అతను నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బోటు సాయంతో నదిలో గాలించారు. నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో విక్రమ్ ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రోదించసాగారు. యువకుడి తల్లి రుక్మిణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఆటో నగర్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ (29) అనే వ్యక్తి మృతి చెందాడు. కడప ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేటకు చెందిన వెంకటేశ్ కడపలో ప్రైవేటు దుకాణంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు ఇసుక టిప్పర్లు పట్టివేతచాపాడు : తిప్పిరెడ్డిపల్లె సమీపంలోని పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకున్నట్లు ఏఎస్ఐ నరసింహులు తెలిపారు. ఎస్ఐ చిన్న పెద్దయ్య ఆదేశాల మేరకు పెన్నానదిలో దాడులు నిర్వహించగా నాలుగు టిప్పర్లు ఇసుకను తరలిస్తుండగా వాటిని పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. కేసు నమోదు చేసి తహసీల్దారు రమాకుమారికి అప్పగించినట్లు చెప్పారు. పెట్రోల్తో పాటు నీళ్లుద్విచక్ర వాహనదారుల ఆందోళన వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోలు బంకులో పెట్రోలుతోపాటు నీరు వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పులివెందుల రోడ్డులోని హెచ్పీ పెట్రోలు బంకులో వర్షపు నీరు వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం వేంపల్లెకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఈ పెట్రోలు బంకులో తన మోటార్ బైకుకు రూ.500లకు పెట్రోలు పట్టుకోవడంతో పెట్రోలుతోపాటు నీరు కూడా వచ్చింది. మోటార్ బైకు కొద్ది దూరం పోయిన తర్వాత ఆగిపోవడంతో మోటార్ బైకును బజాజ్ షోరూంకు తీసుకొని వెళ్లాడు. మెకానిక్ పరిశీలించి ట్యాంకరులో పెట్రోలుతోపాటు నీరు కూడా ఉందన్నారు. అయితే పెట్రోలు బంకు యాజమాని వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపినా ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి పెట్రోలు బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకుని వాహనదారులను కాపాడాలని కోరారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాజుపాళెం : వివిధ చోరీలు, ఇంటి యజమానిపై దాడి చేసిన సంఘటనల్లో నిందితుడు తిమ్మారెడ్డి మహమ్మద్ రఫీని బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి తెలిపారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం రూరల్ సీఐ, రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడు మహమ్మద్ రఫీ గతంలో కర్నూలు, వెలుగోడు, గోనెగండ్లు, ఓర్వకల్లు, ఉలింది కొండ, చాగలమర్రి, ఆళ్లగడ్డ తదితర పోలీస్ స్టేషన్లో పలు చోరీ కేసులలో నిందితుడుగా ఉన్నాడన్నారు. పట్ట పగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవాడన్నారు. పట్టపగలే చోరీ.. ఈ నెల 7వ తేదీన రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో నంద్యాల వెంకటసుబ్బయ్య ఇంటికి తాళం వేసి ఉండడాన్ని చూసి సదరు నిందితుడు మహమ్మద్ రఫీ ఇంటి తాళం, బీరువాను పగల గొట్టేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అంతలో ఇంటి యజమాని నంద్యాల వెంకటసుబ్బయ్య ఇంటిలోనికి రాగా బీరువాను పగులగొడుతున్న నిందితుడిని ఎవరు నువ్వు అని ప్రశ్నించగా దొంగతనానికి వచ్చానని చెప్పి ఇంటి యజమానిపై దాడి చేశాడన్నారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్డు తీసుకొని వెంకటసుబ్బయ్య తలపై కొట్టడంతో రక్త గాయాలయ్యాయన్నారు. ఆ సమయంలో యజమాని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా ఇంట్లోకి రావడంతో చోరీ చేస్తున్న రఫీ పారిపోయాడని సీఐ తెలిపారు. నంద్యాల వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపాళెం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై చోరీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని గోపాయపల్లె చెక్పోస్ట్ వద్ద అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. టంగుటూరు, రాజుపాళెం గ్రామాల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితుడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితుడు మహమ్మద్ రఫీ దువ్వూరు మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన వాడు. నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు చోరీలపై అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విలువైన వస్తువులు, నగదును భద్రపరుచు కోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రా నాయక్, పోలీసులు సుధాకర్, కిరణ్ పాల్గొన్నారు. పట్టపగలే చోరీ, దాడి కేసులో నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు రూరల్ సీఐ -
వర్షానికి కూలిన పై కప్పు
కొండాపురం : నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వ ర్షానికి మండల పరిధిలోని బి.కొట్టాలపల్లె గ్రామానికి చెందిన ఆర్. హరికేశవరెడ్డి మట్టి మిద్దె ఇంటి కప్పు మంగ్లవారం రాత్రి కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం లేదా నూతన ఇళ్లు మంజూరు చేయాలని బాధితుడు కోరారు. అధికారుల పరిశీలన మైలవరం : మండల కేంద్రంలోని అయ్యవారిపల్లె గ్రామంలో వర్షానికి మిద్దె పైకప్పులు కూలిపోయాయి. బుధవారం ఉదయం తహసీల్దార్ లక్ష్మీనారాయణ సంఘటన స్థలాన్ని చేరుకుని మిద్దెను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు గంగబోయిన రవికుమార్, చౌడం వెంగళరావు తమ ఆవేదనను అధికారులకు విన్నవించారు. అనంతరం తహసీల్దార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కౌంటింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
– కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం కడప రిమ్స్ సమీపంలోని మౌలా నా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జేసీ అదితి సింగ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచామన్నారు. రౌండ్ల వారీగా కౌంటింగ్ సమాచారం కోసం మీడియా సెంటర్ను కుడా ఏర్పాటు చేశామన్నారు. – పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 30 మంది సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కోసం పెద్దదర్గాలో ప్రార్థనలు
కడప సెవెన్రోడ్స్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు బుధవారం పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వారు దర్గాలోని ప్రధాన గురువులు హజరత్ పీరుల్లాసాహెబ్ మాలిక్ మజార్ను దర్శించుకుని ఫాతెహా చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ మాట్లాడుతూ మృదు స్వభావి, ప్రజా నాయకుడు, సామాన్య కార్యకర్తను కూడా ఎంతో అభిమానంతో పలకరించే మిథున్రెడ్డిని రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఎన్ఆర్ఐలతోపాటు వారి కుటుంబ సభ్యులకు తమవంతుగా తోడ్పాటు అందించిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి బెయిలుపై విడుదల కావాలని దర్గా గురువులను ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు షేక్ గఫార్, ఎన్.సుబ్బారెడ్డి, సి.అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, ప్రధాన అధికార ప్రతినిధి షేక్ గౌస్ బాషా (చాక్లెట్) కార్పొరేటర్లు షేక్ షంషీర్, షేక్ జిలాన్ (డిష్ జిలాన్), జి.ప్రవీణ్, కుమార్రెడ్డి, షేక్ గయాజ్, బాబుభాయి, నాసర్, రాజాసాబ్, పీర్బాషా, ఫారూఖ్, అహ్మద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యా విషయాలపై అవగాహన పెంచుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిిస్థితులకు అనుగుణంగా విద్యా సంబంధిత విషయాలపై ప్రధానోపాధ్యాయులతోపాటు మండల విద్యాశాఖ అధికారులు సంపూర్ణ అవగాహన పొందాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో హెచ్ఎం, ఎంఈఓలకు ఒక్క రోజు వర్కుషాపు జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు జరగాలన్నారు. వీటితోపాటు విద్యా సంబంధిత విషయాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో జరుగుతున్న వర్కుషాపులో హెచ్ఎంలతోపాటు ఎంఈఓలు విద్యాభివృద్ధ్దికి సంబంధించిన విషయాలపై చర్చించాలన్నారు. సమగ్రశిక్ష ఏసీపీ నిత్యానందరాజు మాట్లాడుతూ హెచ్ఎంలతోపాటు ఎంఈఓలు విద్యాపరంగా విలువైన సలహాలు ఇస్తే రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో చాలా మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా హెచ్ఎంలు, ఎంఈఓలు పనిచేయాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రమాదేవి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ సరస్వతి, జిల్లా వైద్యశాఖ ప్రతినిధి వెంకట చంద్రరెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటన్ లక్ష్మి నరసింహారాజు, ఏఎంఓ వీరేంద్ర, జిసిడిఓ రూతు ఆరోగ్యమేరీ, ఏఎస్ఓ సంజీవరెడ్డి, ఏపీఓ మాధవి, విజయభాస్కర్ పాల్గొన్నారు. ఇన్స్పైర్ మనాక్ పోస్టర్ ఆవిష్కరణ ఇన్స్పైర్మనాక్ నామినేషన్ల స్వీకరణలో రాష్ట్రంలో వై ఎస్సార్జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు డీఈఓ షేక్ షంషుద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం కడప కలెక్టరేట్ సభాభవన్లో ఇన్స్పైర్ మనాక్ పోస్టర్ను డిప్యూటి ఈఓలు రాజగోపాల్రెడ్డి, మీనాక్షి, జిల్లా సైన్సు ఆఫీసర్ ఎబినైజర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్స్పైర్ మనాక్కు ప్రతి పాఠశాల నుంచి 5 నామినేషన్లు చేయించేలా హెచ్ఎం, ఎంఈఓలు చొరవ తీసుకోవాలన్నారు. ఇన్స్పైర్ మనాక్కు సంబంధించిన ప్రాజెక్టులు ఇన్నోవేటివ్గా ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా సైన్సు అధికారి ఎబినేజర్ మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 5నుంచి శంకరాపురంలోని అంధుల పాఠశాలలో అందుబాటులో ఉంటానని... సందేహాలు ఉంటే తెలపాలని కోరారు. అప్లికేషన్ కోడ్ను 8328375357 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపితే స్కూల్ మెయిల్, పాస్వర్డు మార్చడం చేస్తామని తెలిపారు. -
ఉచిత బస్సు కొందరికే!
కడపకోటిరెడ్డిసర్కిల్ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లలో ఉచిత ప్రయాణం కొందరికే ఉపయోగపడనుంది. ఒకవైపు ఎక్స్ప్రెస్లలో ఉచితం అంటూనే నాన్ స్టాప్లుగా నడిచే ఎక్స్ప్రెస్లలో నో ఫ్రీ అంటూ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతానికి నిబంధనలు ఇవే ఉన్నప్పటికీ ప్రారంభించే సమయానికి ఇంకా ఎన్ని నిబంధనలు ఉంటాయోనని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఇంతవరకు ఆర్టీసీ అధికారులకు మార్గదర్శకాలు రాకపోవడం విశేషం. జిల్లాలో కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో ఎక్స్ప్రెస్లు 113, పల్లె వెలుగు 189, అల్ట్రా పల్లె వెలుగు 58 బస్సులు ఉన్నాయి. ఇంతవరకు కొత్త బస్సు ఒక్కటి కూడా రాకపోవడం దారుణం. మరోవైపు ఎక్స్ప్రెస్ సర్వీసులైన నాన్స్టాప్ బస్సుల్లో అనుమతులు లేకపోవడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని చర్చించుకుంటున్నారు. పట్టణాల నుంచి పల్లెలకు నడిచేవి పల్లె వెలుగు బస్సులు మాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉచిత ప్రయాణం అందరికీ ఉపయోగపడే పరిస్థితి లేదని అంటున్నారు. డొక్కు బస్సుల్లోనే ప్రయాణం ప్రతిరోజు జిల్లాలో వివిధ బస్సుల్లో 1.50 లక్షల నుంచి 1.70 లక్షల వరకు ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వాటిలో మహిళలు 60–70 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. జిల్లాలో 360 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. కండీషన్లో లేని బస్సులు కడప రీజియన్లో అధికంగా ఉండడం గమనార్హం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత ఎక్కువ మంది మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే బస్సుల్లో లోడు పెరగడం ద్వారా బస్సుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణం సజావుగా సాగుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూలన పడేందుకు సిద్ధంగా ఉన్న బస్సులకు రంగులు అద్ది రోడ్లపైకి తీసుకు వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులకు తప్పని తిప్పలు ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, మరోవైపు ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా బస్సులో ఎక్కితే ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో అఽధికారులు ఈ సమస్యను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. ఇచ్చిన హామీ విస్మరించారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దె ఎక్కాలన్న తలంపుతో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని మడత పెట్టారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణమని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా కూడా చెప్పలేదు. అధికారం చేపట్టిన ఏడాది తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తూ చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారని మహిళలు మండిపడుతున్నారు. నాన్ స్టాపుల్లో నో ఎంట్రీ జిల్లాలో కడప–తిరుపతి, కడప–ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు–జమ్మలమడుగు ప్రాంతాలకు నాన్స్టాప్ బస్సులను నడుపుతున్నారు. అయితే ఆర్టీసీలో ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులనే నాన్స్టాప్ సర్వీసులుగా నడుపుతున్నారు. వీటిల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు టిక్కెట్ జారీ ఇలా.. సీ్త్ర శక్తి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణానికి టిక్కెట్జారీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బస్సు ఎక్కేచోటు నుంచి దిగే ప్రాంతం వరకు టిక్కెట్ ఇస్తారు. టిక్కెట్ విలువను సున్నాగా నమోదు చేస్తారు. టిక్కెట్ జారీ చేసే టిమ్ మిషన్లో ప్రత్యేకంగా ఉమెన్ ఫ్రీ టిక్కెట్ పేరిట బటన్ ఏర్పాటు చేశారు. బాలికలు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్స్కు జీరో ఫెయిర్ టిక్కెట్ ఇస్తారు. గుర్తింపు కార్డు తప్పనిసరి ఉచిత ప్రయాణానికి కండక్టర్కు గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపాలి. ఆధార్, ఓటరు ఐడీ, రేషన్కార్డు, పాస్పోర్టులలో ఏదో ఒకటి చూపడం తప్పనిసరి. ఆయా గుర్తింపు కార్డులో మన రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులకు తిప్పలు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లలో మాత్రమే అవకాశం నాన్స్టాప్లో ఉచిత ప్రయాణానికి నో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందని ద్రాక్షబస్సులను కండీషన్లో ఉంచాం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని బస్సులను కండీషన్లో ఉండేలా చూస్తున్నాం. ఇదే సమయంలో సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. – పొలిమేర గోపాల్రెడ్డి, జిల్లా ప్రజా రవాణాధికారి, కడప -
భర్త మద్యం మానలేదని బలవన్మరణం
నిమ్మనపల్లె : కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొంత కాలానికి భర్త మద్యానికి బానిస కావడంతో, ఎలాగైనా మాన్పించాలనుకుంది.. అందుకోసం ఎన్నోసార్లు భర్తతో గొడవ పడింది.. భర్త అలవాటును మార్చలేక.. తన వాళ్ల ముందు తలెత్తుకోలేక.. తీవ్ర మనస్థాపానికి గురై ఆ అభాగ్యురాలు తనువు చాలించింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన మలిశెట్టిపల్లె వెంకటరమణ, వెంకట రమణమ్మ దంపతుల కుమార్తె ఎం.రత్నమ్మ ఎం.ఫార్మసీ వరకు చదివి, మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్లోని అపోలో మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉండేది. నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లెకు చెందిన బల్లాపురం చంద్రశేఖర్ కుమారుడు జ్యోతి శేఖర్ తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ ముని సుబ్బమ్మతో ఉంటూ డిగ్రీ వరకు చదువుకొని మదనపల్లె అపోలో ఫార్మసీలో చేరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత 2019 సంవత్సరంలో పెద్దలను కాదని ఇరువురు తవళం నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముని పుష్కర్ నందన్ అనే ఒకటిన్నర ఏడాది బాబు ఉన్నాడు. వివాహం అనంతరం ఇరువురు ఉద్యోగాలు మానేసి, ఇంటివద్దే ఉంటూ జ్యోతి శేఖర్ పెయింటింగ్ పనులకు వెళ్తుండగా , రత్నమ్మ స్థానికంగా పనులకు వెళ్లేది. కొంతకాలంగా జ్యోతి శేఖర్ విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన సమయంలో భార్యతో అతిగా గొడవపడేవాడు. ఈ క్రమంలో తరచు భార్యాభర్తల మధ్య మద్యం అలవాటు విషయమై విభేదాలు తలెత్తి గొడవపడేవారు. మూడు నెలలుగా రత్నమ్మ భర్తను నీవు మద్యం అలవాటు మానకపోతే నేను చచ్చిపోతాను అంటూ బెదిరించేది. ఈ నేపథ్యంలో మంగళవారం భర్త మద్యం సేవించి ఇంటికి రాగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం జ్యోతి శేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి, రత్నమ్మ ఇంటికి గడియ పెట్టి ఉండడంతో, జ్యోతి శేఖర్ కిటికీలో నుంచి లోనికి చూడగా భార్య ఉరి వేసుకొని వేలాడుతూ ఉండటం గమనించాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి స్థానికుల సాయంతో భార్యను కిందికి దించి, వెంటనే స్థానిక పీహెచ్సీ కేంద్రానికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్య సిబ్బంది రత్నమ్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం తహసీల్దార్ తపస్విని స్థానికుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
అవయవ దానం చేసి.. ప్రాణదాతగా నిలిచి..
మైలవరం : అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తారు. సరిగ్గా ఇదే రోజున వైద్యులు కల్పించిన అవగాహనతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. వివరాలు ఇలా.. ఈనెల 10వ తేదీన మైలవరం రిజర్వాయర్ గేట్ల వద్ద ప్రమాదవశాత్తు గోడ మీద పడిన దుర్ఘటనలో శివరామసుబ్బయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. అవయవ దాన దినోత్సవం సందర్భంగా వైద్యులు ఇచ్చిన స్ఫూర్తితో మృతుని కుటుంబ సభ్యులు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులను ఆసుపత్రిలోనే దానం చేశారు. తాను మరణించినా మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదించి చిరంజీవిగా నిలిచిపోయాడని అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. -
రీ పోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను కప్పిపుచ్చుతూ కంటి తుడుపుగా రెండు చోట్ల నిర్వహించిన రీ పోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా కొనసాగింది! రీ పోలింగ్ జరిగిన అచ్చివెళ్లి, ఇ.కొత్తపల్లె గ్రామాల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తిష్ట వేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ రీ పోలింగ్ను బహిష్కరించడంతో సామాన్య ఓటర్లు ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో పచ్చ ముఠాలు బుధవారం కూడా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశాయి. పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాల అరాచకాలను వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. అధికార పార్టీ అరాచకాలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ గూండాల అరాచకాలను కప్పిపుచ్చుతూ ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ–పోలింగ్కు ఆదేశించింది. అది కూడా బుధవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మొత్తం బూత్లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల విన్నపాలను ఈసీ పెడచెవిన పెట్టింది. 15 పోలింగ్ బూత్లలో 10,601 ఓట్లు ఉండగా కేవలం 1,765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్కు ఆదేశించింది. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్కు ఆదేశాలు ఇచ్చింది. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కోరినా ఈసీ పట్టించుకోలేదు. రెండు చోట్లా అదే తంతు.. రీ పోలింగ్ జరిగిన ఇ.కొత్తపల్లె (14వ బూత్), అచ్చివెళ్లి (3వ బూత్)లో టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. ఇ.కొత్తపల్లెలో కమలాపురం టీడీపీ నేతలు, అచ్చివెళ్లిలో బీటెక్ రవి అనుచరులు క్యూలైన్లలో నిలుచుని దొంగ ఓట్లు వేసుకున్నారు. కమలాపురం మండలం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల నారాయణయాదవ్ రీ పోలింగ్ క్యూలైన్లో కనిపించాడు. టీడీపీ గూండాల బెదిరింపులతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాకపోవడంతో 10 గంటలకు అచ్చివెళ్లిలో కేవలం 6.71 శాతం, ఇ.కొత్తపల్లెలో 11.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక గ్రామస్తులు ఓటింగ్కు రారని గ్రహించిన టీడీపీ మూకలు దొంగ ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో చొరబడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు అచ్చివెళ్లిలో 33.74 శాతం, ఇ.కొత్తపల్లెలో 26.71 శాతం పోలింగ్ జరిగింది. 3 గంటలకు అచ్చివెళ్లిలో 59.35 శాతం, ఇ.కొత్తపల్లెలో 42.5 శాతం పోలింగ్ నమోదు కాగా సాయంత్రం 5 గంటలకు అచ్చివెళ్లిలో 68.5 శాతం, ఇ.కొత్తపల్లెలో 54.28 శాతం నమోదైంది. ‘మమ’ అనిపించేందుకే..! పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అభ్యర్థులకు వెబ్ కాస్టింగ్ ఇస్తే దొంగ ఓట్లు నిరూపిస్తామని, ఆ తర్వాత రీ పోలింగ్ ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. క్యూలైన్లలో ఉన్న టీడీపీ నేతల పేర్లు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో వారి ఓటు వివరాలు, పులివెందులలో ఓటు వేస్తున్న దృశ్యాలతో కూడిన ఆధారాలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించకుంటే న్యాయస్థానాలు తప్పుబట్టే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్యగా కేవలం రెండు బూత్లలో మాత్రమే రీ పోలింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రీ పోలింగ్ నిర్వహించామని చెప్పుకునేందుకు మాత్రమే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా రీ పోలింగ్ను వైఎస్సార్సీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం బహిష్కరించారు. కలెక్టరు కార్యాలయం తొలగించిన ఆ ట్వీట్ కథేంటో? సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ భారీగా దొంగ ఓట్లు వేసిందనేందుకు సాక్ష్యంగా నిలిచిన ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఈ దొంగ ఓట్ల తతంగం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసినట్లు పేర్కొంటున్న ఓ ట్వీట్ను అకస్మాత్తుగా తొలగించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘‘జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబెల్లి గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్కుమార్ పరిశీలించారు’’ అంటూ కలెక్టర్ కార్యాలయ అధికారి ట్వీట్ చేశారు. ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న 4 ఫొటోలను జత చేశారు. అయితే, కొంతసేపటికే దానిని తొలగించారంటూ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి కారణం... ఈ ట్వీట్లోని ఓ ఫొటోలో కలెక్టర్ ఎదుట ఓటు వేస్తున్నవారు పులివెందుల మండలానికి సంబంధం లేని జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్లు అని ఆధారాలతో సహా ప్రచారం జరగడమే అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వివరణ ఇవ్వాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.పులివెందుల, ఒంటిమిట్టలో రీ పోలింగ్కు ఆదేశాలివ్వండి» అధికార పార్టీ నేతలు అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు » రీ పోలింగ్ కోరినా ఎన్నికల సంఘం స్పందించడం లేదు » హైకోర్టులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పిటిషన్.. నేడు విచారణ సాక్షి, అమరావతి: ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు. ఈ నేపథ్యంలో రీ పోలింగ్కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి’’ అని కోరుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్రెడ్డి కొవ్వూరి కోర్టును కోరారు. లేదంటే నిరర్ధకం అవుతాయన్నారు. సకాలంలో వ్యాజ్యాలు తమ ముందుకురాలేదని, అత్యవసర విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గురువారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈసీ ఆదేశాలు కంటితుడుపే.. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ భారీ అక్రమాలకు పాల్పడిందని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ బూత్లను ఆక్రమించుకుందని తెలిపారు. కేవలం రెండు కేంద్రాల్లో మాత్రమే రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని, మొత్తం 15 కేంద్రాల్లో రీ పోలింగ్కు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని.. కానీ, రెండుచోట్ల మాత్రమే రీ పోలింగ్కు ఆదేశాలు జారీ చేసిందని, ఇది కంటితుడుపు చర్య అని వైఎస్సార్సీపీ నేతలు అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీ, వెబ్ కాస్టింగ్ను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరారు. మారణాయుధాలతో భయపెట్టి ఓట్లేసుకున్నారు.. ‘‘టీడీపీ వారు మారణాయుధాలు ధరించి ఓటర్లను బెదిరించి, భయపెట్టారు. సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేకుండా చేశారు. మా పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లపై బహిరంగంగానే దాడులకు పాల్పడ్డారు. అసలు ఓట్లు లేనివారు, స్థానికేతరులు కూడా ఓటు వేశారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ నేతల అండతో మా నాయకులను అక్రమంగా నిర్బంధించారు. ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను పలుసార్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్సీపీ నాయకులు వివరించారు. -
పులివెందులలో రీపోలింగ్ను బహిష్కరించాం
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే రీపోలింగ్ను వైఎస్సార్సీపీ బహిష్కరించిందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం వెల్లడించారు. పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లతో టీడీపీ అరాచకం సృష్టిస్తే, కేవలం రెండు బూత్ల్లోనే రీపోలింగ్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందుల ఎన్ని కల్లో అరాచకం సృష్టించారని, ఆధారాలతో సహా అన్ని వివరాలూ ఎన్నికల కమిషన్ ముందుంచినా పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. మొత్తం 15 పోలింగ్ బూత్లలోనూ కేంద్ర ప్రభుత్వ బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామన్నారు. రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ చేయడం ద్వారా తాము జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను జరిపామని చెప్పుకునేందుకు ఎన్నికల కమిషన్ యత్నిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే చంద్రబాబుకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామిక స్పూర్తికి విఘాతం కలిగిస్తాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇస్తారు. ఆ తర్వాత బూత్లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్కు సంబంధించిన వెబ్కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్బూత్లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు. -
బ్యాలెట్ బాక్సులనే మాయం చేశారు: ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రక్రియను అపహాస్యంపాలు చేసేలా నిర్వహించిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరగని అరాచకాన్ని చూశామని వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా ఏడుగురు మంత్రులను మండలంలో మోహరించినప్పుడే మా సత్తా అర్థమైందని అన్నారు.మంత్రి రాంప్రసాద్రెడ్డి 300 మంది రౌడీలను వెంటేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు 17 పోలింగ్ బూత్లలో తిరుగుతూ మా ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారని, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మాయం చేసి రిగ్గింగ్కి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..మంత్రి రాంప్రసాద్రెడ్డి అరాచకాలను కళ్లారా చూసిన జాయింట్ కలెక్టర్ కానీ, ఫోన్లో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ కానీ స్పందించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ఎంత లోపభూయిష్టంగా జరిగాయో అర్థంఅవుతోంది. అందుకే రీపోలింగ్ ని బహిష్కరించామని, కౌంటింగ్కి కూడా వైయస్సార్సీపీ హాజరుకాబోవడం లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఒంటిమిట్టలో కోదండరాముడి సాక్షిగా మంత్రి చేసిన అరాచకాలకు తప్పకుండా గుణపాఠం నేర్పుతాం. ఒంటిమిట్ట నుంచే మంత్రి రాంప్రసాదరెడ్డి పతనం ప్రారంభమైంది.ముగ్గురు మంత్రులు మండలంలో తిష్ట వేశారుఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, సవిత, రాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం పేరుతో మండలంలో విపరీతమైన హడావుడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఒంటిమిట్ట మండలంలో పార్టీకి గట్టిగా అండగా నిలబడిన దాదాపు 50 మంది వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని ఎన్నికల రోజున ఉదయం 5 గంటలకే ఏజెంట్లను నిలబెట్టగలిగాం. కానీ కీలకమైన పార్టీ ఏజెంట్లను గుర్తించి పోలీసులే బయటకు బూత్ల నుంచి బయటకు గెంటేశారు.దీనిపై జిల్లా ఎస్పీకి ఉదయం 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట, రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్ల వద్ద యాక్టివ్గా తిరుగుతూ కనిపిస్తున్నారని, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశాను. కొంతమంది వ్యక్తులను గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేసిన మమ్మల్నే అక్కడ్నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే యూనిఫాంకే చెడ్డపేరు తెచ్చారు.17 బూత్లలో మంత్రి రిగ్గింగ్ చేయించాడుఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రి రాంప్రసాద్రెడ్డి 300 మంది రౌడీలతో చిన్నకొత్తపల్లికి వచ్చి హల్ చల్ చేశాడు. 700 మంది ఓటర్లున్న చాలా చిన్న బూత్ అది. మా వారు 5 గురు ఏజెంట్లుగా ఉన్నారు. పోవడం పోవడం మా పార్టీ ఏజెంట్లను బయటకు ఈడ్చి దారుణంగా కొట్టారు. ఆ విషయం తెలిసి నేను ఈ బూత్ వద్దకు వెళితే నన్ను కూడా బెదిరించాడు. ఇదేం పద్దతని నేను ఆయన్ను నిలదీస్తే పోలీసులు నన్ను అక్కడ్నుంచి పంపించేశారు. ఆ తర్వాత మంత్రి రాంప్రసాద్రెడ్డి మంటపంపల్లి అనే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడా అంతే.వందల మంది రౌడీలతో వెళ్లి మా ఏజెంట్లను బూత్ల నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిపడేశారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి తనకు సంబంధం లేని ప్రాంతానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనకు చిన్నకొత్తపల్లిలో ఓటు కూడా లేదని జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి నేను మంటపంపల్లెకి వెళ్లేసరికి అక్కడ బాక్సుల్నే మాయం చేశారు.పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మాతోపాటే వచ్చిన జాయింట్ కలెక్టర్కి కూడా జరిగిన విషయాన్ని చెబితే ఆమె కూడా కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. మంత్రిని అడ్డుకోవడానికి మేం ప్రయత్నిస్తుంటే పోలీసులు వెళ్లనీయకుండా మా కార్లను అడ్డుకుంటున్నారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 17 పోలింగ్ బూత్లల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నాడు.కౌంటింగ్ను కూడా బహిష్కరిస్తున్నాంప్రజాస్వామ్యంలో నిన్నటి రోజు ఒక చీకటి దినం. ప్రశాంతంగా ఉన్న మండలంలో మంత్రి అరాచకం సృష్టించాడు. ఏడాది తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే ఆయన ఇదే విధంగా చేయగలడా? భవిష్యత్తులో టీడీపీకి ఏజెంట్లు కూడా ఉండరు. మంత్రి బెదిరింపులకు నేను వెనక్కి తగ్గేదే లేదు. చిన్న మండలంలో సొంతంగా గెలవలేక 780 మంది పోలీసులను తెచ్చుకున్నారు. మంత్రి అండ చూసుకుని నన్ను భూస్థాపితం చేస్తానని అన్నోళ్లు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది ఎన్నికే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రీపోలింగ్ను బహిష్కరించాం. కౌంటింగ్ను కూడా బహిష్కరిస్తున్నాం. మీ ఇష్టమైన మెజారిటీ రాసుకోండి. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుసరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు. కోదండరాముని సాక్షిగా చెబుతున్నా ఈ జడ్పీటీసీ ఎన్నిక మంత్రి పతనానికి ఆరంభం. -
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రగుంట్లలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్ట్ను సుధీర్రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు.కాగా, పులివెందులలో నిన్న (మంగళవారం) సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీసిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు.పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. -
జగన్ ప్రెస్మీట్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన కలెక్టర్
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్లో రిగ్గింగ్ రాజ్యమేలింది. నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు యథేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. క్యూలో దర్జాగా రకరకాల ఫోజులతో నిలబడి మరీ ఓట్లు వేశారంటూ ఇవాళ మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో.. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎదురుగానే దొంగ ఓట్లుపడ్డ సంగతిని వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు సంబంధిత దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి. అయితే ఫోటోలో ఉన్నది దొంగ ఓటర్లని బహిర్గతం కావడంతో కలెక్టర్ కంగుతిన్నారేమో..! దీంతో అప్పటికే ఆ ఫోటోలను తన ఎక్స్లో పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్ బహిష్కరిస్తున్నాం: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్ను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పులివెందుల: రెండు కేంద్రాల్లో రీపోలింగ్.. పచ్చ నేతల దొంగ ఓట్ల దందా
పులివెందుల ఎన్నికలు..రీపోలింగ్.. మళ్లీ దొంగ ఓట్ల దందా..పులివెందుల రీపోలింగ్లోనూ అదే దొంగ ఓట్ల పర్వంఈ.కొత్తపల్లి గ్రామంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ టీడీపీ నాయకుడుకమలాపురం మండలం నసంటపురం గ్రామానికి చెందిన గజ్జల నారాయణయాదవ్గా గుర్తింపుఅదే గ్రామంలో తిష్టవేసి ఉన్న కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు👉ఈసీ తీరును నిరసనగా.. రీపోలింగ్ను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉15 బూత్ల్లో రీపోలింగ్ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్పులివెందులలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రీపోలింగ్ను బహిష్కరించిన వైఎస్సార్సీపీముందు వెబ్ కాస్ట్ రీలీజ్ చేసి దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాత మొత్తం 15 బూత్లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం రీపోలింగ్ బహిష్కరణవెంటనే వెబ్ కాస్టింగ్ అభ్యర్థులకు ఇవ్వాలని, భారీ ఎత్తున అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్న వైఎస్సార్సీపీదొంగ ఓటర్లను గుర్తించిన తర్వాతే అన్ని పోలింగ్ బూత్లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు రెండు చోట్ల రీపోలింగ్ఈ.కొత్తపల్లి రీపోలింగ్ కేంద్రానికి 45 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న పోలింగ్ మెటీరియల్ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు రీపోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశాలుఇంత వరకు పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులుమరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న రీపోలింగ్ నేడు రెండు చోట్ల రీ-పోలింగ్అచ్చివెల్లి, ఈ.కొత్తపల్లిలో రీ పోలింగ్కు ఏర్పాట్లు14వ పోలింగ్ కేంద్రం ఈ.కొత్తపల్లిలో 1273 ఓటర్లుఉదయం 7 గంటలకు రీ-పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంత వరకు ప్రారంభం కాని పోలింగ్ఈ.కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ మెటీరియల్రీ-పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులు అచ్చవెల్లి రీ-పోలింగ్లో సైతం టీడీపీ నాయకుల హవాపోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ వద్ద టీడీపీ నాయకులు తిష్టచేతిలో వందకుపైగా స్లీప్స్తో పచ్చ పార్టీ నాయకులుఇంటి నుండి బయటకు రాని సామాన్య ఓటర్లు👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు.👉ఈ నేపథ్యంలో పులివెందులలో టీడీపీ నేతల అరాచకాన్ని కప్పి పుచ్చేందుకు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్కి ఆదేశించింది. నేడు 3 (అచివెల్లి), 14 (ఈ.కొత్తపల్లి) బూత్లలో పోలింగ్ జరగనుంది. అయితే, మొత్తం పోలింగ్ బూత్లలో మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ వారి అభ్యర్థనను ఈసీ పెడచెవిన పెట్టింది👉ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ నేతలు. చివరికి ఏజెంట్లను సైతం బూత్ లోకి వెళ్లనివ్వకుండా అరాచకం. మొత్తం 15 బూత్లలో ఏ ఒక్క చోటా ప్రజాస్వామ్యయుతంగా జరగని ఎన్నికలు. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్కు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 15 కేంద్రాల్లో మళ్ళీ తాజాగా పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రిపోలింగ్ కోరితే పట్టించుకోని ఈసీ.👉రీ-పోలింగ్ మొత్తం కలిపి కేవలం 1765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్. ఈ కొత్తపల్లిలో 1273 ఓట్లు, అచివెల్లిలో 492 ఓట్లకు మాత్రమే పోలింగ్. 15 బూత్లలో 10,601 ఓట్లకు ఫ్రెష్ పోలింగ్ జరపాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు. -
ఒంటిమిట్టలోనూ అరాచకమే...!
ఎలాగైనా గెలవాలన్న కుతంత్రం... అడ్డదారులను ఎంచుకుని రాద్ధాంతం... అధికారాన్ని ఆయుధంగా చేసుకుని స్వైరవిహారం... యథేచ్ఛగా అక్రమం... ఇదీ కూటమి ప్రభుత్వం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చేసిన అరాచకీయం..! ఇందుకోసం సాక్షాత్తు రాష్ట్ర మంత్రి హోదాలోని వ్యక్తే బరితెగించారు. ఈ తతంగమంతా కళ్లెదుటే జరుగుతున్నా ఏమీ చూడనట్లు అధికారులు, పోలీసు యంత్రాంగం మౌనంంగా ఉంది. సాక్షి టాస్క్ఫోర్స్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అనుచరగణంతో హల్చల్ చేశారు. దౌర్జన్యకాండకు తెరలేపారు. మంత్రిని చూడగానే టీడీపీ శ్రేణులు, వారివెంట వచ్చిన రౌడీ మూకలు రెచ్చిపోయాయి. బూత్లలోకి ప్రవేశించి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులకు దిగాయి. బూత్ల నుంచి బయటకు ఈడ్చి వేసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఇదంతా మంత్రి సమక్షంలోనే జరిగింది. ఆయన బూత్లలోకి వెళ్తుండడాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ, అధికార బలం దానికి పోలీసుల పూర్తి సహకారం తోడవడంతో ఏమీ చేయలేకపోయారు. ఒంటిమిట్టలో ఉదయం 9.30 వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇలాగైతే టీడీపీకి ఓటమి తప్పదని మంత్రి భావించారు. ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్లోని బూత్లోకి ప్రవేశించి వైఎస్సార్సీపీ ఏజెంట్ను స్వయంగా లేపి బయటికి పంపారు. మంత్రి అనుచరులు మిగిలినవారినీ పంపించేస్తూ టీడీపీ ఏజెంట్లను మాత్రమే కూర్చోబెట్టారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా 300 మందితో వచ్చి రిగ్గింగ్కు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన గ్రామస్తుడు, వైఎస్సార్సీపీ కార్యకర్త వల్లెపు సుబ్బయ్యపై మంత్రి దాడి చేయించారు. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. మండలంలోని 30 కేంద్రాల్లో మంత్రి అనుచరులు దగ్గరుండి ఓట్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు.మంటపంపల్లెలో చెలరేగిన పచ్చమూకఒంటిమిట్ట నుంచి మంత్రి రాంప్రసాద్రెడ్డి మంటపంపల్లె వెళ్లగా టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు తోసేశాయి. ఇది తెలిసి వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, నేతలు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నేతలు పులి సునీల్కుమార్, షఫీ నేరుగా మంటపంపల్లె చేరుకున్నారు. గట్టిగా నినాదాలు చేస్తూ మంత్రిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇది చూసి చేసేదేమీ లేక మంత్రి వెళ్లిపోయారు. కానీ, అప్పటికే బూత్లో దొంగ ఓట్ల పరంపర కొనసాగింది. ఇలా మంత్రి వెళుతున్న ప్రతి చోటికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే వైఎస్సార్సీపీ నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతలను వదిలివేయడంతో వారు రిగ్గింగ్ కొనసాగించారు.రాళ్లు రువ్విన టీడీపీ బ్యాచ్చిన్నకొత్తపల్లె బూత్లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లపై మంత్రి సమక్షంలోనే పిడిగుద్దులు గుద్దుతూ తన్నుతూ బయటకు తోసేశారు. టీడీపీ మూకలు రాళ్లు వేయడంతో ఏజెంట్కు గాయాలయ్యాయి. అక్కడి మహిళలు కూడా మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు మరోసారి వచ్చి మంత్రిని అడ్డుకున్నారు. దీంతో బూత్లోపల ఉన్న మంత్రి వెళ్లిపోయారు. భారీగా పోలీసులు ఉన్నా బూత్ లోపల ఏం జరుగుతుందో తెలియనట్లు ఉండిపోయారు.వైఎస్సార్సీపీ నేతల అరెస్టు.. గృహ నిర్బంధంఒంటిమిట్ట మండలంలో మధ్యాహ్నం వరకు మంత్రి హల్చల్ కొనసాగగా ఏమీ చేయని పోలీసులు... జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఫాంహౌస్ వద్ద ఉన్న రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా తదితరులను అరెస్టు చేసి కడపకు తరలించడం గమనార్హం. ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డిలను అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.ఒంటిమిట్టలో పోలింగ్ సాయంత్రం వరకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఒకపక్క మంత్రి, మరో పక్క రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలు, దాడులకు దిగాయి. పచ్చ నేతలు పదేపదే భారీగా బూత్లలోకి వెళ్తున్నా పోలీసులు అభ్యంతరం తెలపలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం దగ్గరకు రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.రీపోలింగ్ నిర్వహించాలి: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిఒంటిమిట్ట మండలంలో టీడీపీ నేతల కనుసన్నల్లో రిగ్గింగ్ జరిగిందని, రీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓబులమ్మను కలిసి విన్నవించారు. రాయచోటి, రాజంపేట నుంచి టీడీపీ రౌడీ మూకలుఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రాయచోటి, రాజంపేట నుంచి వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ రౌడీ మూకలు, బౌన్సర్లు పేట్రేగిపోయారు. బూత్లలోకి చొరబడి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఉదయం వరకు సాఫీగా సాగిన పోలింగ్.. ఓటర్ల నుంచి స్లిప్పులను కూడా లాక్కున్న వీరి అలజడి, దౌర్జన్యంతో ఉద్రిక్తంగా మారింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టీడీపీ రౌడీల అండతో దొంగఓట్లు, రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.మంత్రి బూత్లలో తిష్ట వేయగా శ్రేణులు రిగ్గింగ్ కొనసాగించాయి. పోలీసులు మాత్రం సెల్ఫోన్లు చూసుకుంటూ కొందరు, కాలక్షేపానికి విజిల్స్ వేస్తూ కొందరు పోలీసులు ఉండిపోయారు. మండలం అంతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడచూసినా టీడీపీ నేతలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరిచారు. సాయంత్రం వరకు కాన్వాయ్లో తిరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ నేతలకు మాత్రం ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ సమీప ప్రాంతాలకు రానివ్వలేదు. ఎన్నికల కమిషన్ దృష్టిసారించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పోలింగ్లో అక్రమాలు బట్టబయలు అవుతాయి. కాగా, వైఎస్సార్సీపీ గ్రామ స్థాయి నేతలను మంగళవారం ఉదయమే స్టేషన్కు తీసుకెళ్లారు. కీలక నేతలు వచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికిముందు కూడా పోలింగ్ బూత్ల వద్ద నాయకులు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తవారు వచ్చి మా ఓటు వేశారుఎవరో కొత్తవారు వచ్చి బూత్లలో కలిసిపోయి, మా ఓట్లు వేసేశారు. ఇదేంటి అని నిలదీసిన వైఎస్సార్సీపీ ఏజెంట్ వల్లెపు సుబ్బయ్యను మంత్రి మండిపల్లి ముందే బయటకు లాగి, విచక్షణారహితంగా కొట్టారు. – రాయచోటి వరలక్ష్మీ, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్టఇలాంటి గూండాగిరి ఎన్నడూ చూడలేదుఒంటిమిట్ట చరిత్రలో ఇలాంటి గూండాగిరి ఎన్నడూ వినలేదు చూడలేదు. మండలంలో ఎప్పుడూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు ఎవరో మంత్రి అట.. ఆయన పోయిన ప్రతి బూత్లో బయటకు వస్తూనే గొడవలు జరిగాయి. ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు జరిపితే ఏమి, లేకుంటే ఏమి.? – వల్లెపు నాగజ్యోతి, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్ట -
మీ కాళ్లు పట్టుకుంటాం..మా ఓట్లు ఏమయ్యాయ్?
సాక్షి, అమరావతి/పులివెందుల : ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి.. మీ కాళ్లు పట్టుకుంటాం..’ అంటూ పులివెందుల మండల ఓటర్లు వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ నేతల అడ్డగోలు వ్యవహారాలు, దౌర్జన్యాలు, ఓట్లు కొల్లగొట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయకుండా గ్రామాలకు గ్రామాలనే నిలువరించడం ఇప్పుడే చూస్తున్నామని పులివెందుల మండల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలంటే ఓటర్లందరూ వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. పోలింగ్ రోజున వృద్ధులు, నడవలేని వారిని పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది భుజాలపై మోసుకుని వెళ్లి ఓటు వేయించడం గతంలో అందరూ చూశారు. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్లో ఇలాంటి ఘటన మచ్చుకు ఒక్కటి కూడా కనిపించలేదు. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ పచ్చ తాలిబన్ల అరాచకం రాజ్యం ఏలింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ బూత్ల వరకూ వెళ్లనివ్వకుండా పోలీసులే చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో మేం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాం.. మా ఓట్లన్నీ ఏమయ్యాయ్? అని పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ అడ్డగింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నిక జరిగితే ఘోర పరాజయం తప్పదని ముందే పసిగట్టిన చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలు పన్నిన విషయం తెలిసిందే. ఒక గ్రామం పోలింగ్ బూత్ను మరో గ్రామానికి మార్చేసి, ఓటర్లు ఓటు వేయడానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు పన్నాగంలో భాగంగా ఓటర్లు పక్క ఊరికి వెళ్లి ఓటు వేయకుండా పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి నిలువరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. ఓటర్లందరినీ పోలీసులతో నిలువరించి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఇతర బయటి ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను రప్పించి, వారితో ఇష్టారాజ్యంగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా.. » పులివెందుల మండలంలోని కనంపల్లి ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు గ్రామాన్ని నిర్బంధించారు. దీంతో గ్రామస్తులు ఓటు వేయడం కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ వారు ఏ మాత్రం కనికరించ లేదు. ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి..’ అంటూ గ్రామస్తులు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. ఇంతలోనే తమ ఓట్లను వేరే వారు వేశారని తెలుసుకున్న కనంపల్లె మహిళలు ఆందోళనకు దిగారు. మా ఓట్లు ఏమయ్యాయంటూ నిరసన తెలిపారు. వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. మోట్నూతనపల్లి గ్రామస్తులకు కూడా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారు. » తుదకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మంగళవారం తెల్లవారుజామున హేమంత్ రెడ్డి నిద్ర లేచాక ఇంటి బయటికి వచ్చి చూస్తే వందలాది మంది టీడీపీ మూకలు చుట్టుముట్టాయి. బయటకు వస్తే మీ మీద దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులే హేమంత్రెడ్డిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయలేకపోయారు. ఓ దశలో బయటకు రావడానికి ప్రయత్నించినా, బయట ఉన్న టీడీపీ మూక అరుపులు, కేకలతో భయపెట్టారు. » ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని, రీపోలింగ్ నిర్వహించాలంటూ అచి్చవెళ్లి గ్రామస్తులు ఎన్నికల అధికారికి వినతి పత్రం సమరి్పంచారు. బయట ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ గూండాలు గ్రామాల్లో కర్రలతో, రాడ్లతో కలియ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. మహిళలపైనా దౌర్జన్యకాండే » ఎక్కడికక్కడ పురుషులను పోలీసులు నిర్బంధించగా.. ఏజెంట్లుగా కూర్చోడానికి మహిళలు ముందుకొచ్చారు. ఇందుకు అభినందించాల్సిన ఖాకీలు.. అధికార ఒత్తిళ్లకు తలొగ్గారు. ‘మగాళ్లతోనే కాలేదు.. మీరెందుకొచ్చారు.. గొడవలవుతాయి.. త్వరగా ఇంటికి వెళ్లిపోండి’ అంటూ వెనక్కు పంపడం విస్తుగొలుపుతోంది. » పోలింగ్ బూత్లలోకి రాకుండా మహిళా ఏజెంట్లను అడ్డుకున్నారు. టీడీపీ రౌడీలు దూషణల పర్వం కొనసాగించినా చూస్తుండిపోయారు. అవసరమున్నప్పుడు బందోబస్తు ఇవ్వకుండా.. రిగ్గింగ్ అయిపోయాక వస్తారా.. అంటూ మరోచోట మహిళలు పోలీసులను నిలదీశారు. ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగా భవానీలు ఏజెంట్లుగా కూర్చోడానికి టీడీపీ నేతలను తప్పించుకుని వెళ్లగలిగారు. అయితే వారిని పోలీసులే అడ్డుకున్నారు.» నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య.. నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచి్చనా అనుమతించలేదు. నోరు మూసుకొని పోండి’ అంటూ రౌడీ మూక గదమాయించింది. ఈ పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్న వారిపై సుమారు 350 మంది రౌడీలు దౌర్జన్యానికి దిగి వెనక్కు పంపారు. » తమను టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చొన్న మహిళలను బెదిరించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎదుట అచ్చివెళ్లి గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ బూత్ల వద్దకు వెళితే మహిళలని కూడా చూడకుండా చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రిగ్గింగ్ చేసుకున్నారు ఎర్రిపల్లె గ్రామంలో 600 ఓట్లు ఉన్నాయి. 350 మందికి పైగా టీడీపీ గూండాలు వచ్చి అరాచకం సృష్టించి, ఓట్లు వేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. పోలీస్ పహారా మధ్య టీడీపీ మూకలే మా ఓట్లన్నీ వేసేసుకున్నాయి. – అన్నారెడ్డి మమత, ఎర్రిపల్లె, పులివెందుల మండలం ఏజెంట్లనూ వెళ్లనివ్వలేదు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అల్లరి మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి. కనీసం ఏజెంట్లను కూడా పోలింగ్ బూ త్ల వద్దకు రానివ్వలేదు. బయటి వ్యక్తులు వచ్చి గ్రామంలో తిష్ట వేశారు. మా గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అసలు ఇంత మంది పోలీసులను ఎందుకు దింపినట్లు? – రమాదేవి, కనంపల్లె, పులివెందుల మండలం చంపేస్తామని బెదిరించారు సోమవారం రాత్రి నుంచే టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఓటు వేయడం కోసం వస్తే చంపుతామని బెదిరించారు. మీరు స్లిప్పులు ఇచ్చి వెళ్లిపోండన్నారు. టీడీపీకి చెందిన బీటెక్ రవి, శ్రీనాథ్లతోపాటు 400 మంది బయట వ్యక్తులు వచ్చారు. పోలీసులు కూడా వారికి సహకరించారు. ఓటు..గీటు అంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – కుమారి, కనంపల్లె, పులివెందుల మండలం స్లిప్పులు లాక్కుని చించేశారు నా అనుభవంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. టీడీపీ గూండాలు సోమవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ ఏజెంట్ల ఇంటి ముందు రాడ్లు, కత్తులు పట్టుకొని తిష్ట వేశారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారు. జమ్మలమడుగు, కమలాపురం, వేంపల్లె ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టి ముట్టారు. ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఓటు వేయడం కోసం ఎలాగో ఒకలా వచ్చిన వారి వద్ద నుంచి స్లిప్పులు లాక్కొని చింపేశారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగింది. – బాంధవి, ఎంపీటీసీ సభ్యురాలు, అచ్చవెళ్లి, పులివెందుల మండలం ఏజెంట్ ఫారాన్ని చింపేశారు గ్రామస్తులు ఎవరూ ఓటు వేయనందున రీ పోలింగ్ జరిపించాలి. నేను ఏజెంటుగా పోలింగ్ బూత్ వద్దకు ఆరు గంటల్లోపు వెళ్లాను. అప్పటికే టీడీపీ గూండాలు బూత్ల వద్దకు చేరుకొని నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని చించేశారు. ఇంటికి వెళ్లకపోతే చంపుతాం అని బెదిరించారు. ‘మీరు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు.. ఓట్లు మేమే వేసుకుంటాం.. వెళ్లిపోండి’ అని బెదిరించారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని.. లేదంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – అనురాధ, అచ్చివెళ్లి, పులివెందుల మండలం -
పులివెందుల జెడ్పీటీసీకి రీ–పోలింగ్ నిర్వహించండి
సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు. అధికార పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్కు పాల్పడిందన్నారు. పోలింగ్కు ముందే టీడీపీ బయటి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూండాలను పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మోహరించిందని వివరించారు. దీని మీద పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు ఫారాలను సమర్పించడానికి పోలింగ్ కేంద్రాలకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని వెల్లడించారు. ఓటర్లను సైతం ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించారన్నారు. పోలీసు యంత్రాంగం పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించడానికి బదులుగా, అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అండగా నిలిచిందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి బయటకు రాకుండా టీడీపీ గూండాలు ఇంటిని చుట్టుముట్టారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని తెలిపారు. -
పోలీసుల వేధింపులకు గురైన వ్యక్తి మృతి
కర్నూలు(హాస్పిటల్)/కొండాపురం: స్థల వివాదంలో పోలీసుల వేధింపులతో వైఎస్సార్ కడప జిల్లా కోర్టు ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మంగళవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్.చిన్నబాలయ్య(45)కు చెందిన స్థలం విషయంలో హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జున రెడ్డి, కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవ రెడ్డి, గంగిరెడ్డి, తుంగ జగదీశ్వర్ రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాల నారాయణరెడ్డి వేధిస్తున్నారని.. తన భార్య, పిల్లలను తనకు చూపించకుండా ఎక్కడో దాచారని అప్పట్లో ఆరోపించాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు పోలీసులకు తెలిపి గత నెల 29న కోర్టు ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడికి కడప రిమ్స్లో ప్రాథమిక వైద్యం చేయించి అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రిలోని కాలిన రోగుల వార్డులో 60 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కోలుకోలేక మృతిచెందాడు. దాదాపు రెండు వారాల పాటు ఎలాగైనా తనను బతికించాలని.. తన భార్య, బిడ్డలను చూపించాలని వైద్యులను వేడుకోవడం అందరినీ కలచివేసింది. -
పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంఘంలో జిల్లావాసులు
కడప అగ్రికల్చర్: విజయవాడ పశుసంవర్థశాఖ రాష్ట్ర సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా నుంచి ముగ్గురికి చోటు లభించింది. వేల్పులలో లైవ్ స్టాక్ ఆఫీసర్గా పనిచేస్తున్న చాంద్బాషాకు ఏపీ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్– వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు దక్కింది. అలాగే ఊటుకూరులో లైవ్స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్యకు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడిగా, ఖాజీపేట మండలం ఆంజనేయకొట్టాలులో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న గంగయ్యకు ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు లభించింది. మన జిల్లా నుంచి రాష్ట్ర సంఘానికి ఎన్నికై నందుకు వైయస్సార్ కడప జిల్లా తరఫున అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలియచేశారు. ఏపీ జూనియర్ వెటర్నీరీ ఆఫీసర్స్ అండ్ వెటర్నరీ ౖౖలైవ్ స్టాక్ ఆఫీసర్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు సదాశివయ్య, విద్యాసాగర్, మనీ, వెంకటసుబ్బయ్య, సునీల్, వీరకుమార్, మహదేవ, రమేష్ , పెంచలయ్య, శ్రీనివాసులు, మోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఎన్ఆర్ఐలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ దేశాలలోని ఎన్ఆర్ఐలు కలిశారు. మంగళవారం విజయవాడ తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్లోబల్ ఎన్ఆర్ఐ కన్వీనర్ ఏ. సాంబశివ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్తో కలిసి గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పులపుత్తూర్ సురేష్ కుమార్ రెడ్డి, అడ్వైజర్ అరవ సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. ఏజెంట్లను లాగిపడేసి యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారన్నారు. రాజకీయ కక్షలతో వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారని, ఎంతో కాలం ఈ అక్రమాలు సాగవని హెచ్చరించారు. -
ఒంటిమిట్టలో రాయచోటి రౌడీల వీరంగం
సాక్షి రాయచోటి/రాజంపేట: ఒంటిమిట్టలో జెడ్పీ టీసీ ఉప ఎన్నికల పోలింగ్లో రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. మండలంలో 30 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి చోట పోలీసులు, ఎన్నికల సిబ్బంది సహకారం ఎల్లో గ్యాంగ్కు లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా పోలింగ్ బూత్ల్లోకి చొరబడి, ఓటర్ల నుంచి ఓటరు స్లిప్లు లాక్కుని వారే ఓటు వేసుకున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోయారు. మంత్రి నేతృత్వంలోఏజెంట్లపై దాడులు మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు.. పోలింగ్ బూత్లలో వున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. ప్రధానంగా మంటంపంపల్లె, చిన్నకొత్తపల్లె, గంగపేరూరు, నడింపల్లె తదితర పోలింగ్ బూత్లలో ఉదయం నుంచి ఏజెంట్లను బయటికి లాగి పడిసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంఘటనలతో బూత్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నేతల యత్నం సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవింద్రెడ్డిలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పోలింగ్ బూత్ వద్దకి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డుతగులుతున్నారని భావించి.. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని పోలీసులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేసి ఒంటిమిట్ట, కడప రిమ్స్, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లకు తరలించారు. -
సత్యం వధ..ధర్మం చెర
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు.. కంచే చేను మేసిందన్న నానుడిని పోలీసు శాఖ రుజువు చేసిన రోజు.. అధికార పార్టీకి తొత్తుగా మారి.. కాదు కాదు ఆంక్షల సంకెళ్లలో బందీగా మారి పూర్తి బానిసగా మారిన రోజు.. అవును.. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. పులివెందులలో అడుగడుగునా రౌడీ రాజ్యం కనిపిస్తే.. ఒంటిమిట్టలో పచ్చ మూక బరితెగించింది.ఇంకా తెలవారకముందే.. సూరీడు కిరణాలైనా పడకముందే పులివెందుల పల్లెల్లో డబ్ డబ్ మంటూ ఖాకీల అడుగు చప్పుళ్లు వినిపించాయి. బందోబస్తుకు కాదు.. బందిపోట్లకు అండగా నిలవాలన్న తాపత్రయంతో వేసిన అడుగులవి. దొంగ ఓట్లను అరికట్టడానికి కాదు.. నిజమైన ఓటర్లను అడ్డుకోవడానికి వేసిన అడుగులవి. పచ్చని పల్లెల్ని పచ్చ స్వామ్యంగా మార్చాలనే కుట్రలో భాగంగా వేసిన అడుగులవి. ఇందులో భాగంగానే స్థానిక వాసి.. ప్రజా ప్రతినిధి.. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికొచ్చారు. ఎన్నికల వేళ నేతల్ని ‘ఇంటి నిర్బంధం’ చేయడం సహజమే. కానీ ఇంట్లోనే ఉంటానన్న ఎంపీ వినతిని పట్టించుకోలేదు.. ఒంట్లో నలతగా ఉందన్నా కనికరించలేదు.. బలవంతపు అరెస్టు చేసి సగం జిల్లా తిప్పారు. పోనీ అధికార పార్టీ నేతల్ని చేశారా అంటే అబ్బే అస్సలు పట్టించుకోలేదు. పైగా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ఓట్ల దొంగల్ని దగ్గరుండి స్వాగతం పలికారు. కమలాపురం మండలం పెద్ద చెప్పలి ఎక్కడుంది.. పులివెందుల మండలంలోని ఎర్రిపల్లె ఎక్కడుంది... అక్కడి నుంచి వచ్చి ఏంచక్కా ఓట్లు వేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అంతేనా వేంపల్లె నుంచి.. జమ్మలమడుగు నుంచి.. ఎర్రగుంట్ల నుంచి.. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీల్ని.. పచ్చ మూకల్ని తరలించి మరీ ఓట్లేయించారు. సాక్షాత్తు డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ.. ఇలా పోలీసు బాసులందరూ తిష్ట వేసింది దీనికోసమే. ఈ అరాచకాలకు..అక్రమాలకు.. పోలీసు ఉన్నతాధికారులందరూ సాక్ష్యమే. ఇక సాక్షాత్తు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటిని ఉదయాన్నే చుట్టుముట్టిన పోలీసులు కొన్ని గంటల వరకు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలింగు బూతుల్లో దొంగ ఓట్ల జాతర ముగిశాక తీరిగ్గా ఓటు వేయడానికి రమ్మని అడిగారు. అప్పటికే నిండా ఆక్రోశంతో ఉన్న మహిళలు పోలీసుల తీరును తూర్పారబట్టారు. ఏజెంట్లు లేకుండా ఇంత సేపు దొంగ ఓట్లు వేసుకుని ఇప్పుడొచ్చి రమ్మంటారా అంటూ ఖాకీల్ని నిలదీశారు. జవాబు చెప్పలేక.. అక్కడి జనాల్లో ఉండలేక కాళ్లకు పని చెప్పడం పోలీసుల వంతైంది.ఎర్రిపల్లెలో సుమారు 350 మంది పచ్చ మూక బరితెగిస్తుంటే ఖాకీ సైన్యం చోద్యం చూస్తూ నిలబడింది. ఆడోళ్లని కూడా చూడకుండా పచ్చ మూకలు దౌర్జన్యం చేస్తుంటే అడ్డు చెప్పే ధైర్యం కూడా వారిలో లేకుండా పోయింది. పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫాం కనిపిస్తున్నా .. లోన వేసుకున్న ‘పచ్చ చొక్కాల లెక్క’ డామినేట్ చేసింది. పబ్లిగ్గా అది సాక్షాత్కరమైంది కూడా.పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నాయకుల అనుచరుల హల్చల్నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ కేంద్రం వద్ద జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. ఉదయం నుంచే బూత్లను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను కూర్చోనివ్వలేదు. టీడీపీ గూండాలు ఏజెంట్ల ఫారాలను లాక్కొన్నారు. మోట్నూతలపల్లిలో దారిని టీడీపీ అల్లరి మూకలు అడ్డగించి పోలింగ్ బూత్ కి 2 కిలో మీటర్లు ముందే వాహనాలు అపి కొట్టి వారు ఊరి బయటే వాహనాలను వెనక్కి పంపారు. కనంపల్లెలో టిడిపి అల్లరి మూకల మహిళా ఓటర్లపై దాడులు చేశారు. కనంపల్లెలో ఓటు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనంపల్లె సర్పంచ్ రామాంజనేయులు ఇంటి వద్ద మంచంపై పోలీసులు గన్ను పెట్టి బెదిరించారు. తుమ్మలపల్లె, కనంపల్లె పోలింగ్ బూత్లకు వెళ్లనీయకుండా టీడీపీ మూకలు ఓటు వేయడానికి వెళుతున్న మహిళా ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎర్రిపల్లె పోలింగ్ బూత్లోకి ఏజెంట్లను బీటెక్ రవి తమ్ముడు భరత్ రానీయకుండా అడ్డుకుంటున్నా పోలీసులు చోద్యం చేస్తున్నారని మహిళా ఏజెంట్ వాపోయింది. -
స్లిప్పులు లాక్కోవడం ఏంటి?
ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించకోలేకపోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక తాలిబన్ల రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఎర్రిపల్లె గ్రామంలో 300 మంది టీడీపీ గూండాలు భయపెట్టారు. సోమవారం రాత్రి నుంచి గ్రామంలో తిరుగుతూ వైఎస్సార్సీపీకి చెందిన వారిని కత్తులు, తుపాకులతో బెదిరించారు. గ్రామంలో ఎవరినీ కూడా ఓటు వేసేందుకు వెళ్లనివ్వలేదు. స్లిప్పులు లాక్కొని మర్యాదగా వెళ్లిపోతారా.. లేక దెబ్బలు తింటారా అని హెచ్చరించారు. ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదు. –కె.రామ్మోహన్ రెడ్డి, ఎర్రిపల్లె, పులివెందుల మండలం 500 మంది టీడీపీ గూండాలు వచ్చారు గ్రామంలోకి సోమవారం రాత్రి ఒకసారిగా 500 మంది టీడీపీ గూండాలు వచ్చారు. గ్రామంలో వీధి వీధి తిరిగారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. దీంతో వారు గ్రామంలో లేకుండా వెళ్లిపోయారు. ఏజెంట్లుగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించారు. భయపడి గ్రామస్తులు ఎవరూ కూడా ఓటు వేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. పోలీసులు టీడీపీ గూండాలకు తొత్తులుగా వ్యవహరించడం తగదు. – జి.సుధాకర్ రెడ్డి, ఎర్రిపల్లె, పులివెందుల మండలం బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు ఎర్రిపల్లె పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చొనేందుకు వెళ్లాను. బీటెక్ రవి తమ్ముడు భరత్కుమార్రెడ్డి నా వద్ద ఉన్న పత్రాలు లాక్కొని అడ్డుకున్నాడు. ఇతనితో పాటు పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఇలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి? పోలీసులు వారి డ్యూటీ చేయకుండా టీడీపీ గూండాలకు కాపలాగా ఉన్నారు. గ్రామంలో ఏ ఒక్కరినీ ఓటు వేయనీయలేదు. – గంగా భవాని, ఎర్రిపల్లె, పులివెందుల మండలం వైఎస్సార్సీపీ అంటే స్లిప్పులు లాక్కున్నారు కొత్తపల్లె పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా నిలబడటానికి వెళితే ఏజెంట్ పత్రాలను చించివేశారు. ఓటు వేయడానికి వెళ్లిన వారిని ఏ పార్టీకి చెందిన వారని అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ అంటే స్లిప్పులు లాక్కొని వెనక్కు పంపిస్తున్నారు. గ్రామంలో ఇదేవిధంగా ప్రజల స్లిప్పులను తీసుకుని వారే ఓటింగ్ వేసేలా చేసుకున్నారు. రిగ్గింగ్ పక్కాగా జరిగింది. ఇంటింటికి వెళ్లి బెదిరింపులతో ఓటర్ల స్లిప్పులను తీసుకెళ్లారు. – పి.సాయికుమార్, చంద్రగిరి, పులివెందుల మండలం న్యూస్రీల్ -
పులివెందులలో విష సంస్కృతికి బీజం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో విష సంస్కృతికి బీజం పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నిక జరిగింది. వేలాది మంది టీడీపీ అల్లరి మూకలవల్ల ఓటర్లు, ఏజెంట్లు భయబ్రాంతులకు గురయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్లను మంగళవారం టీడీపీ మూకలు ఆక్రమించుకున్నారు. అలాగే టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ సాక్షి వాహనాన్ని చుట్టుముట్టి వాహనాన్ని బాది తాళాలు లాక్కొన్నారు., చొక్కా పట్టి కిందకు దించే ప్రయత్నం చేశారు. కొత్తపల్లిలో ‘సాక్షి’ మీడియా వాహనాలు ధ్వంసం చేశారు. ఎర్రిపల్లె, కొత్తపల్లెల్లో వైఎస్సార్సీపీ నాయకుడు ఆనంద్పై టీడీపీ అల్లరి మూకల దాడి చేశారు. తుమ్మలపల్లె, కనంపల్లెలలో కట్టెలు పట్టుకుని టీడీపీ మూకలు గొడవలు చేశారు. తుమ్మలపల్లెలో షామియానా వేసి టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చివెళ్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మోట్నూతలపల్లెలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ వాహనాలను ధ్వంసం చేశారు. కొత్తపల్లె, నల్లగొండువారిపల్లె, తుమ్మలపల్లె పోలింగ్ బూత్లలోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకుండా ఆక్రమించుకున్నారు. ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్ను ఆధీనంలోకి తీసుకుని ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులను సైతం తరిమేస్తూ.. ఊర్లో మహిళలపై దాడి, అసభ్యంగా ప్రవర్తించారు. గ్రామంలో ఎవరూ ఓటు వేయకుండా అడ్డుకున్నారు. పల్లెలపై పడ్డ పచ్చ మంద భయబ్రాంతులకు గురైన ఓటర్లు ఏజెంట్ల ఫారాలు చించివేత టీడీపీ అల్లరి మూకల భయానక పరిస్థితుల మధ్య ఎన్నికలు చోద్యం చూసిన పోలీసు యంత్రాంగం -
ఓట్ల దొంగలు!
పేరు: మల్లిఖార్జున్హోదా: టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ (జమ్మలమడుగు)నివాసం: పొన్నతోట గ్రామం, జమ్మలమడుగు నియోజకవర్గంఓటు వేసింది: పులివెందుల మండలం ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..పేరు: పుల్లారెడ్డిహోదా: టీడీపీ సర్పంచ్నివాసం: కర్మలవారిపల్లె, జమ్మలమడుగు నియోజకవర్గంఓటు వేసింది: పులివెందుల మండలం ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..పేరు: వీరభద్రహోదా: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రధాన అనుచరుడునివాసం: వేంపల్లి గ్రామం/మండలంఓటు వేసింది: పులివెందుల మండలంలోని ‘నల్లపురెడ్డిపల్లి’ పోలింగ్ కేంద్రంలో..పేరు: సుధాకర్ (మాజీ సర్పంచ్), మహమ్మద్ రఫీ, అనకాల రమేష్నివాసం: పెద్ద చెప్పలి గ్రామం, కమలాపురం నియోజకవర్గంఓటు వేసింది: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: స్వతంత్ర భారత దేశ చరిత్ర నిర్ఘాంతపోయేలా టీడీపీ కూటమి సర్కారు ప్రజాస్వామ్యాన్ని అత్యంత కిరాతకంగా ఖూనీ చేసింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అధికార దుర్వినియోగానికి అడ్డాగా మార్చేసింది. పోలీసు బలగాలు, పచ్చమూకలను అడ్డుపెట్టుకుని భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న దుర్భుద్ధితో అధికార పార్టీ బరితెగించింది. ఆటవిక రాజ్యాన్ని, తాలిబన్లను మరిపిస్తూ దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లతో విశృంఖలంగా వ్యవహరించింది. పులివెందుల ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా పోలీసు బలగాలు, టీడీపీ రౌడీలతో అడ్డుకుంది. పొరుగు నియోజకవర్గాలైన జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా టీడీపీ గూండాలను తరలించి పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుని అరాచకం సృష్టించింది.యథేచ్ఛగా దొంగ ఓటర్లను తరలించి..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న 15 పోలింగ్ కేంద్రాల్లోనూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రోద్బలంతో వేలాది మంది టీడీపీ రౌడీలు, అనుచరులు దొంగ ఓటర్లుగా ప్రత్యక్షమయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నవాబుపేట, భీమగుండం, కంబళదిన్నె, కలవటల, చిన్న దండ్లూరు, గూడెం చెరువు, కర్మలవారిపల్లె, పొన్నతోట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి దొంగ ఓట్లు వేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్రెడ్డి కనుసన్నల్లో దొంగ ఓటర్లను తరలించారు. పులివెందులకు పొరుగు ప్రాంతాలైన.. అసలు పులివెందుల మండలంలో ఓటర్లు కాదు కదా.. కనీసం స్థానికులతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి దర్జాగా దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్క నల్లపురెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ నుంచి పదవులు అనుభవిస్తున్న వందలాది మంది వ్యక్తులు.. సర్పంచ్లు, మార్కెట్ యార్డు సభ్యులు, ఆ పార్టీ నాయకుల ప్రధాన అనుచరులు నిస్సిగ్గుగా దొంగ ఓట్లు వేస్తుంటే ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ముఠా పనులకు కూలీలను తీసుకెళ్లినట్లుగా.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం చంద్రబాబు సర్కారు దొంగ ఓటర్లను దిగుమతి చేసి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది.స్లిప్పులు లాక్కుని.. దొంగ ఓటర్లకు పంచి..పులివెందుల మండలంలోని గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఛాయలకు కూడా రాకుండా చంద్రబాబు సర్కారు పోలీసు బలగాలతో బెదిరింపులకు దిగింది. ఎన్నికల వేళ ఓటర్లకు రక్షణగా నిలిచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అండగా నిలవాల్సిన పోలీసులే అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారు. గ్రామాల్లో పికెటింగ్ పెట్టి బ్యారికేడ్లతో పోలింగ్ కేంద్రానికి కిలోమీటరు దూరంలోనే ఓటర్లను అడ్డుకున్న దౌర్భాగ్య పరిస్థితి కనిపించింది. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి దౌర్జన్యంగా బయటకు గెంటేయడం ద్వారా టీడీపీ పథకం ప్రకారం యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకోవడంతో పాటు కనీవినీ ఎరుగని రీతిలో రిగ్గింగ్కు పాల్పడింది. పోలింగ్ కేంద్రాల దగ్గరే తిష్టవేసిన టీడీపీ మూకలు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ల నుంచి బలవంతంగా స్లిప్పులను లాక్కుని.. వాటిని దొంగ ఓటర్లకు పంచుతూ అక్రమాలకు పాల్పడ్డాయి.‘హెల్ప్’లెస్ డెస్క్లు..!పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సహాయార్థం ఏర్పాటు చేసే ‘హెల్ప్డెస్క్’లను సైతం ఎన్నికల కమిషన్ నిర్వహించలేని నిస్సహాయ పరిస్థితుల నడుమ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది. టీడీపీ గూండాలతో పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. పోలీసులే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా అడ్డుకుని అరాచక శక్తులకు దండుగా నిలిచారు. ఫలితంగా హెల్ప్డెస్క్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులను కూర్చోనివ్వకుండా తరిమేశారు. చివరికి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఉత్సవ విగ్రహాలు మాదిరిగా మిగిలిపోయారు. కణంపల్లెలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఓట్లు వేయకుండా తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో అక్కడ ఓటర్లు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు.పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా ఓట్లు వేసిన జమ్మలమడుగుకు చెందిన కొందరు వ్యక్తుల వివరాలు..» పాతకుంట శివారెడ్డి, గూడెంచెరువు» రామచంద్రయ్య, చిన్న దండ్లూరు » రాజన్న, కలవటల, n కుళాయి, కంబళదిన్నె » రాజగోపాల్, భీమగుండం » మర్రి ప్రకాశం, నవాబుపేట » ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, నవాబుపేటపచ్చ గూండాల చేతుల్లో పోలింగ్ కేంద్రాలు..!పులివెందుల మండలం ఎర్రిపల్లి గ్రామంలో టీడీపీ మూకలు పోలింగ్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తూ వికృత చేష్టలతో మహిళలపై దౌర్జన్యానికి దిగి భయబ్రాంతులకు గురి చేశారు. గ్రామంలో ఎవరినీ ఓటు వేయనివ్వకుండా భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. -
ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు
సాక్షి, అమరావతి: అధికార పార్టీ ఆగడాలు.. స్వయంగా మంత్రి, ఎమ్మెల్యే అరాచకాలు.. అధికార దుర్వినియోగం.. పోలీస్ యంత్రాంగం స్వామి భక్తి సాక్షిగా ప్రజాస్వామ్యం నడివీధుల్లో అపహాస్యం పాలైంది! రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. ప్రజాస్వామ్య విలువలు, మౌలిక సూత్రాలను కాలరాస్తూ టీడీపీ కూటమి సర్కారు అక్రమాలకు పాల్పడింది. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లే లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకోవాలన్న తలంపుతో బరి తెగించింది. ఎక్కడికక్కడ ఏజెంట్లను అడ్డుకుని పోలింగ్ బూత్ల దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా కట్టడి చేసి పోలీసుల సహకారంతో దాడులకు తెగబడింది. చివరకు నిస్సిగ్గుగా మహిళా ఏజెంట్లపై కూడా దౌర్జన్యాలకు ఒడిగట్టింది. ఏజెంట్ల ఇళ్ల వద్ద మోహరించి..పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మునుపెన్నడూ చూడని విష సంస్కృతికి అధికార టీడీపీ తెర తీసింది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అసలు ఏజెంట్లే లేని ఎన్నికలు నిర్వహించి టీడీపీ పెద్దలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు కూడా కళ్లుమూసుకోవడంతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు తమ తరపున పర్యవేక్షించేందుకు జనరల్ ఏజెంట్లతో పాటు బూత్కొకరు చొప్పున పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటారు. వీరు తమకు కేటాయించిన పోలింగ్ బూత్లలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. రిగ్గింగ్ జరగకుండా అడ్డుకోవడం, బోగస్ ఓట్లు పడకుండా నివారించడం వీరి ప్రధాన విధి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోయిన టీడీపీ పెద్దలు ఓ పథకం ప్రకారం వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫారాలను చించివేసి గృహ నిర్భందాలకు పాల్పడ్డారు.కొన్ని చోట్ల సోమవారం రాత్రి నుంచే ఏజెంట్ల ఇళ్ల వద్ద కర్రలతో పహారా కాస్తూ బయటకు రాకుండా తిష్ట వేశారు. ఎలాగోలా బూత్లకు చేరుకున్న ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు. బూత్లలో ఉన్న ఏజెంట్లను బయటకు ఈడ్చుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 15 పోలింగ్ బూత్లుండగా ఏ ఒక్క చోట కూడా ఏజెంట్ను లోపలకు వెళ్లనివ్వలేదు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ ముష్కరులు దాడులకు తెగబడుతున్నా అడ్డుకునే యత్నం చేయలేదు. కొన్ని చోట్ల అయితే పోలీసులే దగ్గరుండి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపించేశారు.ఏకంగా అభ్యర్థినే ఇంట్లో బంధించి..పులివెందుల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి స్వగ్రామమైన తుమ్మలపల్లెలో ఆయన ఇంటి చుట్టూ 150 మందికిపైగా టీడీపీ మూకలు పోగై కర్రలతో బెదిరిస్తూ బయటకు రాకుండా అడ్డగించారు. పోలీసులు వారికి కొమ్ము కాస్తూ.. హేమంత్రెడ్డి బయటకు రావొద్దని, వస్తే గొడవలు అవుతాయంటూ హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేందుకు సైతం అనుమతించలేదు. పోలింగ్ జనరల్ ఏజెంట్ బలరామిరెడ్డిది కూడా అదే పరిస్థితి. ఆయన్ను కూడా బయటకు రానివ్వలేదు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాలంటే దాదాపు 300 మందిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు సరెండర్ అయ్యారు.బూత్ను ఆక్రమించి ‘ఆది’ అరాచకం..» నల్లపురెడ్డిపల్లెలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు బూత్లను ఆక్రమించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను కూర్చోనివ్వకుండా పోలీసులు బలవంతంగా బయటకు పంపేశారు. ఏజెంట్ల ఫారాలను లాక్కుని చించేశారు. » కనంపల్లెలో బూత్లలోకి ఏజెంట్లు వెళ్లకుండా వారి ఇళ్ల వద్ద టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో మోహరించారు. ఇ.కొత్తపల్లిలో రెండు బూత్లను ఆక్రమించి ఏజెంట్లను అడ్డుకున్నారు.» మోట్నూతలపల్లిలో టీడీపీ మూకలు పోలింగ్ బూత్కి 2 కి.మీ ముందే వాహనాలను వెనక్కి పంపేశాయి. పోలింగ్ బూత్లను ఆక్రమించి గ్రామంలోకి ఎవరినీ రానివ్వలేదు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ లోపలికి వెళ్లనివ్వలేదు. ఈ అక్రమాలను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.మంత్రి రాంప్రసాద్రెడ్డి సమక్షంలో ఏజెంట్పై దాడి» ఒంటిమిట్ట మండలం చినకొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బూత్లోకి చొరబడ్డారు. మంత్రి హోదాలో ఉంటూ ఓ గూండా మాదిరిగా పార్టీ కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీ ఏజెంట్ను బయటకు లాక్కొచ్చి బట్టలూడదీసి చావబాదారు. పక్కనే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు. ఇదే మండలం గాండ్లపల్లి బూత్లో పోలింగ్ మొదలు కాకముందే వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలీసుల సమక్షంలోనే బయటకు గెంటేశారు.» పులివెందుల మండలం చింతరాజుపల్లెలో ఎన్నికల బూత్లో వైఎస్సార్సీపీ ఏజెంట్పై దాడి చేసిన టీడీపీ నాయకులు చితకబాది బయటకు గెంటేశారు.» నల్లగొండువారిపల్లెలోని బూత్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ బూత్ బయట కర్రలతో స్వైర విహారం చేశారు.» బీటెక్ రవి తమ్ముడు భరత్ ఎర్రిపల్లె పోలింగ్ బూత్లోకి ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకుంటున్నా పోలీసులు చోద్యం చూశారని మహిళా ఏజెంట్ వాపోయారు. » అచ్చివెళ్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ నాయకులు బూత్ల నుంచి బలవంతంగా పంపేశారు. కొత్తపల్లె పోలింగ్ బూత్లలోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. తుమ్మలపల్లెలో పోలింగ్ బూత్లను టీడీపీ నాయకులు ఆక్రమించుకొని ఏజెంట్లను బయటకు పంపేశారు. -
ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి !
సాక్షి ప్రతినిధి, కడప : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం వెలుగుచూసింది. మేధావుల ఫోరం, పులివెందుల పేరిట ‘ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి’.. అంటూ ఓ బహిరంగ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు టీడీపీకి ఓటెందుకు వేయాలి? అని ప్రశ్నించడంతో పాటు.. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో జరిగిన అనేక అభివృద్ధి అంశాలను అందులో ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది.. ● పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఏం చేశారు? ఏం చూసి ఓట్లు వేయాలి? కసనూరు సంస్కృతి (ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు) తెరపైకి తెచ్చి భయానక పరిస్థితులు కల్పించినందుకా? .. ప్రశాంత పట్టణంలో విచ్చలవిడి దౌర్జన్యం చేస్తున్నందుకు ఓటెయ్యాలా?.. కోనసీమను మరిపించేలా పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంతో ఉన్న పచ్చటి గ్రామాల్లో రక్తపాతం పారిస్తున్నందుకు ఓటెయ్యాలా?.. ఓ సారి ఆలోచించండి. కామధేనువు లాంటి వైఎస్ కుటుంబాన్ని కాదని పక్కవారిని ఎందుకు బలపర్చాలి? పులివెందుల మండల ప్రజలు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా. ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునేందుకు మాత్రమే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పరిమితం. నిర్దిష్టమైన అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పులివెందుల అభివృద్ధంటూ జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మాత్రమే. ఈ విషయం మీకు తెలియంది కాదు. కళ్లెదుట కన్పిస్తోంది. ఉదాహరణకు.. ● విద్యాపరంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నాడు–నేడు పథకంలో అపురూపంగా మారిన పాఠశాలలు. ● ఆరోగ్య రంగంలో డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఉపాధి రంగంలో యూసీఐఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, గోవిందరాజా టెక్స్టైల్స్, వ్యవసాయ రంగంలో చీనీ మార్కెట్ యార్డు, బనానా రీసెర్చ్ సెంటర్, ఐజీసీఏఆర్ఎల్ (ఐజీ కార్ల్), డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ గుర్తుకొస్తాయి. ఒక ప్రాంతంలో ఇన్ని సంస్థలు రావడం సాధ్యమా? వైఎస్ కుటుంబం చలువే కదా ఇదంతా. ● కృష్ణా జలాలను మెట్ట ప్రాంతంలో పారించాలనే తపన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. అందుకే గండికోట రిజర్వాయర్ నుంచి నీరు లిఫ్ట్ చేసి, పైడిపాలెం రిజర్వాయర్లో నిల్వచేసే బృహత్తర ప్రాజెక్టు తీసుకొచ్చారు. ● మూడు టీఎంసీలకు మాత్రమే పరిమితమైన ఛిత్రావతి ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించారు. గండికోట నుంచి చిత్రావతి లిఫ్ట్ ద్వారా నీరు తీసుకొచ్చారు. కుడి, ఎడమ కాలువలు తవ్వారు. ● అద్భుతమైన రోడ్డు కనెక్టవిటీ సౌకర్యం కల్పించారు. బెంగళూరు–విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్లు, విలేజ్ కనెక్టివిటీ రోడ్లు, సచివాలయాలు, వరల్డ్ క్లాస్ ఆర్టీసీ బస్టాండ్, క్రికెట్ స్టేడియం, మినీ సెక్రటేరియట్ ఉలిమెల్ల లేక్వ్యూ, రాణి తోపుల ఇవన్నీ వైఎస్ కుటుంబం తీసుకొచ్చినవే కదా! టీడీపీ గెలుపు ఎవరికి ప్రయోజనం..? ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఎవరికి ప్రయోజనం? ప్రధానంగా బీటెక్ రవికి, పరోక్షంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఇద్దరూ కలిసి కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్నారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలింగ్లో దొమ్మి చేయాలని చూస్తున్నారు. పోనీ, ఆ తర్వాత కూడా ఇలాగే ఉంటారా? 2019లో అధికారంలోకి వైఎస్సార్సీపీ రాగానే రూ.10 కోట్లు ఇస్తాం, పార్టీలో చేర్చుకోండంటూ పాదాక్రాంతమయ్యారు. ఇదంతా వాస్తవమే కదా! జగన్ను ఓడించామని చెప్పుకునేందుకే.. పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించామని చెప్పుకునేందుకే.. నానా తంటాలు పడుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవస్థలు మిన్నకుండిపోయాయి. టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్ మెప్పు కోసమే ఈ యాగీ అంతా. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్్ఎంసీ) 2024–25 విద్యా సంవత్సరంలోనే పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. నిర్దయగా వద్దని చంద్రబాబు సర్కారు లేఖ రాసింది. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ప్రాజెక్టును మరుగునపర్చారు. ఎలాంటి పురోగతిలేదు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఆలోచించండి.. విజ్ఞత ప్రదర్శించండి. నిర్భయంగా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి. పులివెందుల పౌరుషాన్ని తెలియజేయండి. – మేధావుల ఫోరం, పులివెందుల అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా వారిని కాదని పక్కవారిని ఎందుకు బలపర్చాలి? ఆలోచించండి.. విజ్ఞత ప్రదర్శించండి.. పులివెందుల పౌరుషాన్ని చాటిచెప్పండి సోషల్ మీడియాలో మేధావుల ఫోరం బహిరంగ లేఖ వైరల్ -
జావెలిన్ త్రో స్టేట్ ఫస్ట్ సూఫియాన్
కమలాపురం : కమలాపురం దర్గా వీధికి చెందిన ఎస్. సూఫియాన్ కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కడపలోని డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సూఫియాన్ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు జరిగిన 36వ ఏపీ స్టేట్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. కాగా స్పోర్ట్స్ స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ను, అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోచ్ వెంకటేశ్వర్లును ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. జావెలిన్త్రోలో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ -
పోలీస్ రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్
అధికారమదమెక్కిన ‘పచ్చ’గూండాల సాక్షిగా.. పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఖాకీలే పౌరులపై జులుం చేస్తుంటే.. ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే.. ఓటు స్వామ్యం చిన్నబోయింది. తెల్లారకముందే.. చిరు చీకట్లు వీడకముందే ఖాకీ.. ఖద్దరు ద్వయం ఏకమై.. దౌర్జన్యకాండ రాసింది. గడప దాటొద్దంటూ.. ఏజెంట్లు రాకూడదంటూ.. ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువల్ని నిలువునా పాతరేసింది. ఒక ఎన్నిక.. వంద కుట్రలు... గంతలు కట్టిన ‘నిఘా కళ్ల’తో.. గల్లంతైన పోలింగు కేంద్రాలతో.. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి.. దొంగ ఓటర్ల వేలిపై పడ్డ సిరా చుక్క సైతం సిగ్గు పడింది. కూటమి నేతల అరాచకాలు.. పరాకాష్టకు చేరిన వేళ.. ‘బ్యాలెట్ బాక్స్’సైతం మౌనంగా రోదించింది. ఈ మాత్రం ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రం మారింది.. పోలీసు తీరు మారింది.. ఎల్లో గూండాల రాజ్యంలో ఓటు సైతం గల్లంతైంది.. చివరికి ‘దొంగ ఓటే’ బ్యాలెట్టులో నిక్షిప్తమైంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఐసిస్, తాలిబన్, హమాస్ తీవ్రవాదులు.. పిండారీలు, థగ్గులు వంటి బందిపోట్లు కలగలిసినా తమ ముందు దిగదుడుపేనని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పెదబాబు, చినబాబు సారథ్యంలోని టీడీపీ కాలకేయులు చాటిచెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రలోభాలు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు ఘోర పరాజయం తప్పదని తమ అంతర్గత సర్వేల్లో తేలడంతో పెదబాబు, చినబాబు నిస్సిగ్గుగా బరితెగించారు. ఎలాగైనా సరే.. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలిచి తీరాల్సిందేనని తమ కాలకేయ సైన్యానికి దిశా నిర్దేశం చేశారు. అత్యంత క్రూరులైన పచ్చ కాలకేయులకు కొంత మంది పోలీసు అధికారులను పెదబాబు, చినబాబు జత చేశారు. దీంతో మంగళవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ కాలకేయ సైన్యం ఆకాశమే హద్దుగా చెలరేగింది. విచక్షణ మరచి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలీసులే ముందుండి అరాచకంస్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్ ప్రారంభానికి 2.30 గంటల ముందే అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకే వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డిలను పోలీసులు నిర్బంధించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ బూత్లు ఉంటే, ఏ ఒక్క బూత్లోకి కూడా వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలింగ్ బూత్కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న ఓటర్లను పోలీసులే అడ్డుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మహిళా ఓటర్లు కాళ్లు పట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. తమ కళ్లెదుటే స్లిప్పులను ఓటర్ల నుంచి టీడీపీ గూండాలు లాక్కుని దౌర్జన్యం చేసినా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, నాయకులపై టీడీపీ గూండాలు అత్యంత పాశవికంగా దాడులు చేస్తున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. సోమవారం రాత్రికే జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ గూండాలు, రౌడీలు ఒక్కో పోలింగ్ బూత్ వద్దకు 300 నుంచి 400 మంది వరకు చేరుకుని, అక్కడే తిష్టవేశారు. పోలింగ్ బూత్లను హైజాక్ చేసి.. మంగళవారం ఉదయం 7 గంటలకే ఆ రౌడీలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్ చేశారు. చివరకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి.. అతని జనరల్ ఏజెంట్ ఎం.బాలరామిరెడ్డిని ఓటు వేయనివ్వకపోగా.. వారి ఓట్లను కూడా దొంగగా వేసుకున్నారంటే టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951 అక్టోబర్ 25న తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే 74 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ అంత దుర్మార్గంగా మరో ఎన్నిక జరగలేదని ఎన్నికల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకే ఈ ఉప ఎన్నిక కళంకంగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.అవినాష్రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు అత్యంత దుర్మార్గంగా పోలింగ్ ⇒ పులివెందుల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డి ఇంటి చుట్టూ మంగళవారం తెల్లవారుజామునే 200 మందికిపైగా జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన టీడీపీ గూండాలు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే తిష్ట వేసి పార్టీ చేసుకున్నారు. హేమంతరెడ్డిని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ⇒ పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ.. ఎక్కడా వైఎస్సార్సీపీ ఏజెంటు కూర్చునేందుకు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దౌర్జన్యానికి, వారిపై గ్రామస్తులు తిరుగుబాటు చేయకుండా పోలీసులు పహారా కాశారు. ⇒ రాగిమానుపల్లె, అచ్చవెళ్లి, ఎర్రిపల్లె, యర్రబల్లె–1, యర్రబల్లె–2, ఈ.కొత్తపల్లె పంచాయతీల పరిధిలో 15 పోలింగ్ బూత్లు ఉండగా, ఏ ఒక్కచోట కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి పోలింగ్ ఏజెంటును కూర్చోనివ్వలేదు. హేమంతరెడ్డి సొంతూరు తుమ్మలపల్లి, బాలరామిరెడ్డి సొంతూరు నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు వందల మంది పోలింగ్ కేంద్రం వద్ద మకాం వేశారు. పోలింగ్ బూత్కు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అడ్డగించారు. వస్తే దాడి చేస్తామని హెచ్చరికలు పంపారు. పోలీసులను రక్షణ కల్పించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ⇒ పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా కూర్చునేందుకు పోలీసులు, టీడీపీ గూండాలు అనుమతించలేదని తెలిసి మహిళలు సాహసం చేశారు. తాము పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటామని ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగాభవానీ వెళ్లారు. టీడీపీ రౌడీలు అడ్డగించినా లెక్కచేయకుండా పోలింగ్ బూత్లోకి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుతగిలి బెదరగొట్టి వెనక్కు పంపారు. ⇒ నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచ్చినా పోలీసులు అదే రీతిలో బెదరగొట్టారు. ‘ఎవ్వరూ ఏజెంటుగా లేకపోతే, మీరొచ్చి ఏమి చేద్దామని? నోరు మూసుకొని పోండి’ అంటూ టీడీపీ రౌడీ మూక బెదిరించింది. విశ్వ ప్రయత్నం చేసినా పోలీసులు సహకరించక పోవడంతో వారు వెనుతిరిగి వెళ్లారు.రాజ్యమేలిన రౌడీయిజంపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ రౌడీయిజం రాజ్యమేలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకే కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఇంటికి పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు వెంకటరమణ, ఉలసయ్య, చాంద్బాషా నేతృత్వంలో భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని అరెస్టు చేసి, కడప వైపు తీసుకెళా్లరు. ‘పోలీసులకు సహకరిస్తాం, హౌస్ అరెస్టు చేసుకోండి, ఎక్కడికీ వెళ్లను, పైగా జ్వరం వస్తోంది’ అని చెప్పినా పోలీసులు అత్యంత కిరాతకంగా లాక్కువెళ్లి వాహనంలోకి బలవంతంగా తోశారు. ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్టు చేయడం.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డితోపాటు కీలక నేతలను పోలీçÜులు గృహ నిర్బంధం చేయడంతో పెదబాబు, చినబాబు పన్నిన కుట్ర అమలుకు మార్గం సుగమమైంది. పోలీసుల ఏకపక్ష చర్యల కారణంగా కేడర్ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేకపోయింది. మరింతగా రెచ్చిపోయి టీడీపీ నేతలు ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకున్నారు.ఎక్కడికక్కడ ఓటర్ల అడ్డగింతస్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెగబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను పోలీసుల పహారాలో టీడీపీ రౌడీమూకలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఓటర్ల నుంచి ఓటరు స్లిప్పులు లాక్కుని వారిని వెనక్కి పంపించేశారు.అవే ఓటరు స్లిప్పులను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ రౌడీలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించారు. టీడీపీ వర్గీయులైన వారిని మాత్రమే ఓటు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ముందస్తు పథకం ప్రకారం క్యూలైన్లలో టీడీపీ గూండాలను బారులు తీరేలా చేసి.. పూర్తిగా ఏకపక్షంగా సైక్లింగ్ చేసుకుంటూ.. దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్ చేసుకున్నారు.పోలింగ్ బూత్ల వద్దనున్న బీఎల్ఓల నుంచి ఓటర్ల వివరాలు తీసుకుని.. కడప పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్రెడ్డి పీఏ సుదర్శన్రెడ్డి దగ్గరుండి స్లిప్లు రాయిస్తూ దొంగ ఓట్లను ప్రోత్సహించారు. ఎర్రిబల్లిలో టీడీపీ నేత పుత్తా లక్ష్మిరెడ్డి, కమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి, జమ్మలమడుగు జంబాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మల్లికార్జున, సర్పంచ్ పుల్లారెడ్డి, గూడెంచెరువు శివారెడ్డి, చిన్నదండ్లూరు రామచంద్రయ్య, కల్వటాల రాజన్న, కంబాలదిన్నె కుళాయి, బీమగుండం రాజగోపాల్, నవాబుపేల మర్రి ప్రకాశం, రామస్వామిరెడ్డి, ద్వారకచర్ల జనార్ధన్రెడ్డి.. కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ వర్గీయులంతా 15 పోలింగ్ బూత్ల్లో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేశారు.ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు మీడియానూ వదలలేదు. ఏకపక్ష పోలింగ్పై ఎలాంటి కవరేజ్ లేకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో ‘రికార్డు చేయవద్దని చెబుతుంటే అర్థం కాలేదా..’ అని గద్దిస్తూ కర్నూలు నుంచి వచ్చిన ఎన్టీవీ ప్రతినిధి కెమెరాను యర్రబల్లెలో ధ్వంసం చేశారు. ‘సాక్షి’ ప్రతినిధులకు అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ.. భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. పచ్చ మూకల రౌడీయిజంతో మంగళవారం పులివెందుల మండలం అట్టుడికింది. -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ
జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఖాకీలే పచ్చరౌడీల్లా తెగబడ్డారు. పోలీసు పహారాలోనే అధికారిక రిగ్గింగ్ యథేచ్ఛగా సాగిపోయింది. టీడీపీ కూటమి కుతంత్రాన్ని పచ్చ ఖాకీలు అంతా తామై అమలు చేశారు. రాజ్యాంగాన్ని నిర్భీతిగా కాలరాశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పోలీసులు సర్వం తామై ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఓటు వేసే ప్రజల రాజ్యాంగ హక్కును అడ్డుకున్నారు. దాడులతో తెగబడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. సామాన్యులు కనీసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ గూండాలు దాడులకు తెగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు దొంగ ఓట్లు వేసేందుకు రాచబాట పరిచారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి వత్తాసు పలకడమే విద్యుక్త ధర్మం అంటూ పోలీసులు కొత్త మాన్యువల్ను అమల్లోకి తెచ్చారు. పత్తేపారం చేస్తున్నారా అనే దిగజారుడు భాషతో పచ్చ ఖాకీల అధికారిక రౌడీయిజానికి డీఐజీ కోయ ప్రవీణ్ రింగ్ మాస్టర్గా వ్యవహరించారు. ఈయన ఓ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే కావడం గమనార్హం. లాఠీచార్జితో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయమని పచ్చ పైత్యం ప్రదర్శించారు. ఇక, కాల్చిపారేస్తా.. నా కొడకా అంటూ డీఎస్పీ మురళీనాయక్ పచ్చిరౌడీలా చెలరేగిపోయారు. ఎస్పీ అశోక్కుమార్ నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కుట్రలో భాగస్వామిగా మారింది. ఓటర్లను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్రమాలు, టీడీపీ రిగ్గింగ్కు అడ్డుఅదుపు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. రెక్కీ నిర్వహించి హత్యలు చేసే కిరాయి మూకల్లా ఖాకీలు పులివెందులపై పడ్డారు. వెయ్యిమందికిపైగా పోలీసులు మండలాన్ని అష్ట దిగ్బంధం చేశారు. వారం రోజులుగా పులివెందులలో పోలీసు మార్క్ రౌడీయిజంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ ప్రభుత్వ కుతంత్రంతో ఓ గ్రామంలోని ఓటర్లకు వేరే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి వద్దకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెళ్లకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడపడితే అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం పోలింగ్ సందర్భంగా పోలీసులు పూర్తిగా బరితెగించేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఓటర్లను లాఠీలు ఝళిపిస్తూ బూతులు తిడుతూ వెనక్కి పంపించేశారు. అయినా సరే తాము ఓట్లు వేస్తామని పట్టుబట్టినవారిపై విరుచుకుపడ్డారు. అనుమతించాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఓటర్ల చేతుల్లోని స్లిప్లను గుంజుకున్నారు. ‘‘మీ దగ్గర ఓటరు స్లిప్పులు లేవు కాబట్టి అనుమతించం’’ అని తర్వాత చెప్పడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఖాకీ గూండాగిరీ రాజ్యమేలింది. పోలీసు పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ టీడీపీ రిగ్గింగ్కు పోలీసులు రక్షాకవచంగా నిలిచారు. పులివెందులలోని అన్ని పోలింగ్ బూత్లలోని వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. కాగా, జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పోలింగ్ రోజున అనుమతించకూడదు. పోలీసులు అవేమీ పట్టించుకోకుండా కూటమి గూండాలకు రాచబాట పరిచారు. దీంతో పచ్చ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భారీగా ఓటర్లు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మరీ విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, సామాన్యులు ఓటు వేసేందుకు వెళ్లకుండా నిరోధించారు. స్లిప్పులను తీసుకుని చింపివేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వర్గీయులు, గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. పోలీసులే వారిని దగ్గరుండి తీసుకువెళ్లి మరీ దొంగ ఓట్లు వేయించడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేవరకు పోలీసుల పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ యథేచ్ఛగా కొనసాగింది. వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఖాకీల దండయాత్ర డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆశోక్కుమార్, ఏఎస్పీ ప్రకాష్ బాబు, డీఎస్పీ మురళీనాయక్, మరో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, వందలమంది పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. వారికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా లాఠీచార్జితో చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. తమను ఓట్లు వే సేందుకు అనుమతించాలని ఓటర్లు కాళ్లా వేళ్లా పడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ కార్యాలయం గేటుకు తాళం వేసి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ అవినాశ్రెడ్డిని నిర్బంధంలోనే ఉంచారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆయన పక్కనే కూర్చుని మరీ ఈ కుతంత్రాన్ని పకడ్బందీగా పర్యవేక్షించారు. రిగ్గింగ్ ఆధారాలు ఉంటే ఇవ్వండి: డీఐజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచామని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకు తెలిపారు. తాము బందోబస్తు కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిగ్గింగ్కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘం, కోర్టుకు ఇస్తారు కానీ డీఐజీకి ఎందుకు ఇస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కాల్చిపడేస్తా నా కొడకా.. అంటూ డీఎస్పీ రౌడీయిజంపులివెందుల డీఎస్పీ మురళీనాయక్ అయితే వైఎస్సార్సీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయడం లేదని, రిగ్గింగ్ను ఆపాలంటూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే యత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్, యూనిఫాం ఇక్కడ..’ అంటూ రౌడీ తరహాలో చెలరేగిపోయారు. పోలీసులు కుట్రపూర్వకంగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించడం.. పరుష వ్యాఖ్యలతో డీఎస్పీ మురళీనాయక్ చెలరేగిపోవడం.. ఇద్దరు, ముగ్గురు సీఐలు విరుచుకుపడడం అంతా పక్కా పన్నాగంతోనే సాగింది. కార్యకర్తలు ప్రతిఘటించి పరిస్థితి అదుపుతప్పితే.. అదే సాకుగా ‘తీవ్రమైన చర్యల’కు తెగించాలన్నది పోలీసుల కుతంత్రం. కాల్పులకూ తెగించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. పోలీసులు ఉద్దేశం గుర్తించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కార్యకర్తలను వారించారు. ‘ఎలాంటి ఉద్రిక్తతలు వద్దు. కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని హితవు పలికారు. రిగ్గింగ్ రింగ్ మాస్టర్ డీఐజీ కోయ ప్రవీణ్ మొన్న విపరీత వ్యాఖ్యలు.. నేడు అధికార దుర్వినియోగం పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్కు రింగ్ మాస్టర్గా డీఐజీ కోయ ప్రవీణ్ వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరితెగించారు. ఎస్పీ అశోక్ కుమార్తో పాటు యావత్ పోలీసు యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. పోలింగ్కు నాలుగు రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్యాదవ్, పార్టీ కీలక నేత వేల్పుల రాములపై హత్యాయత్నాన్ని డీఐజీ ప్రవీణ్ తక్కువ చేసి చూపించేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ‘ఒక ఊరివారు మరో ఊరికి ఎందుకు వెళ్లారు? పత్తేపారం చేయడానికా’ అంటూ వెటకారం ఆడారు. తద్వారా ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలకడమే తన ఉద్దేశం అని చాటారు. పోలింగ్ సందర్భంగా ప్రవీణ్ అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అక్రమ గృహ నిర్బంధం, వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి తరహాలో పోలీసులు చొచ్చుకుపోవడాన్ని ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి స్వయంగా ఆదేశించడం గమనార్హం. ప్రవీణ్ ఆదేశాలతోనే ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ మురళీనాయక్తో పాటు పోలీసులు అక్రమాలకు తెగబడ్డారు. తెల్లవారుజామునే పోలీసుమార్కు గూండాయిజం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అక్రమ నిర్బంధం పులివెందులలో మంగళవారం సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీశారు. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీ పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. -
రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/Qky1FZjeQA— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025 ‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు...ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు బూత్ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, లిక్కర్, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్ పీరియడ్స్తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ ..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు...పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని చంద్రబాబు రౌడీ రాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఒంటిమిట్టలో రిగ్గింగ్పై.. ఈసీకి జడ్పీటీసీ అభ్యర్ధి ఫిర్యాదు
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పచ్చమూక రెచ్చిపోయింది. అధికార బలాన్ని అడ్డంపెట్టుకొని పోలింగ్ బూత్లలోనే దొంగ ఓట్లు వేయించింది. అందుకు పోలీసులు కొమ్ముకాయడంతో ప్రజలు తమ విలువైన ఓట్లను వినియోగించుకోలేకపోయారు. పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు వేస్తున్నారని, మా ఓట్లను మేం వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల కాళ్లమీద పడ్డా ఫలితం లేకుండా పోయింది.ఈ క్రమంలో జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను ఆశ్రయించారు. 17బూత్లకు రీపోలింగ్ జరపాలని కోరారు. ఈ మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 బూత్లకు 17బూత్లలో రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. -
‘పులివెందులలో భారీ రిగ్గింగ్ జరిగింది’
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ నేతల దౌర్జన్య కాండపై వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందులలో భారీ రిర్గింగ్ జరిగిందని ఎంపీ అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్లకు పాల్పడ్డారన్నారు. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్లో లేకుండా చేశారని, బయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారన్నారు. ఈ ఉప ఎన్నికలను బర్తర్ప్ చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు. పులివెందులపై పోలీసులు పగబట్టారని మండిపడ్డారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారన్నారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందామని అవినాష్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారని, ఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర బలగాలతో రీపొలింగ్ నిర్వహించాలన్నారు.అవినాష్తో అచ్చివెల్లి గ్రామస్తులుపులివెందుల ఉప ఎన్నికలో భాగంగా అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్రెడ్డిని కలిశారు. తమను ఓటువు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారన్నారు. కత్తులు, కర్రలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు. వచ్చిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామంలోకి వచ్చిన వారేని వారు ఎంపీ అవినాష్కు తెలిపారు. తమ గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గూండాలను మోహరించారన్నారు. తమ ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి దౌర్జన్యాఉ జరగలేదని, మహిళలను కూడా చూడకుండా తమను బూతులు తిట్టారని, చంపుతామని బెదిరించారరని అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్కు స్పష్టం చేశారు. -
డీఐజీ కోయ ప్రవీణ్కు అంబటి వార్నింగ్
సాక్షి,విజయవాడ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకువచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా కాయడం దారుణమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంకు వస్తున్న కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికారపార్టీకి ఎంత తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, రౌడీలను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి మా పార్టీ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫొటోలతో సహా బయటపెట్టారు. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తుల పేర్లతో సహా వెల్లడించారు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి. పులివెందుల్లో ఉన్న 10,601 ఓట్లలో యాబై శాతంకు మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో వేయించారు. పులివెందుల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకోలేకపోయారు. పోలీస్ యంత్రాంగం వైఎస్సార్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా బయట తిరగనివ్వకుండా నిర్భందించారు.ఎంపీ అవినాష్రెడ్డిపై ఆంక్షలు:కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకువెడుతున్నారో కూడా చెప్పకుండా గంటల తరబడి వాహనాల్లో తిప్పారు. దీనిని పార్టీ నేతలు ప్రశ్నించడంతో ఎర్రగుంట్లలో ఓ పార్టీ నాయకుడి ఇంటిలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల పార్టీ కార్యాలయంకు వచ్చారు. ఈ సమాచారం తెలియగానే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడికి వచ్చి నేను కూడా మీ పార్టీ కార్యాలయంలోనే కూర్చుంటాను అంటూ కూర్చున్నారు. ఒకవైపు రెండు సెగ్మెంట్లలోనూ టీడీపీ వారు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తుంటే, దానిని అడ్డుకోకుండా, వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్రెడ్డి బయటకు రాకుండా కాపలా కాస్తూ కూర్చుంటాను అని కోయ ప్రవీణ్ అనడం చూస్తుంటేనే వారి కుట్రలు అర్థమవుతున్నాయి. వైఎస్సార్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వవద్దని, టీడీపీ దొంగ ఓట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆయన ఆదేశాలు ఇచ్చేశారు. ఆయన ఖాకీ చొక్కాకు బదులు పచ్చ చొక్కా వేసుకున్నట్లుగా, తెలుగుదేశం ఏజెంట్గా, కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇంత కన్నా దిగాజరుడుతనం ఎక్కడైనా ఉంటుందా? టీడీపీని గెలిపించేందుకు ఐపీఎస్ అధికారి డీఐజీ కోయ ప్రవీణ్ దిగజారి వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రజాస్వామికవాదులు మరిచిపోతారా? పోలీసులే దొంగ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు తమ హక్కులను కాపాడాలని ఓటర్లు పోలీసులు కాళ్ళు పట్టుకుని ప్రాదేయపడుతున్నా వారు పట్టించుకోవడం లేదు.మా పార్టీ ఆఫీస్కే వచ్చి... మా కార్యకర్తలనే కాల్చేస్తామని వార్నింగ్:వైఎస్సార్సీపీ కార్యాలయానికే వచ్చి పార్టీ కార్యకర్తలను 'నా కొడకల్లారా.... కాల్చిపారేస్తాను' అంటూ పులివెందుల్లో డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికేనా? చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారన్న అహంకారమా? వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి, వారి కార్యాలయంలో ఒకవైపు ఎంపీ ఉండగానే, బయట ఉన్న కార్యకర్తలను కాల్చి పారేస్తాను అంటూ హెచ్చరించడం డిఎస్పీ అహంకారానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే ఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను ఎన్నికల్లో చూడలేదు. రెండు జెడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత కక్కుర్తి పడాలా? వందేళ్ళ పాటు ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడు. ఈ సంప్రదాయం చంద్రబాబు, ఆయన కుమారుడిని వెంటాడదా? ఈ పరిణామాలను చూస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయి.డీఐజీ కోయ ప్రవీణ్ను చూస్తుంటే సిగ్గేస్తోంది:వైఎస్ అవినాష్ను పోలీసులు వెంటాడుతున్నారు. ఏకంగా ఆయన ఉన్న పార్టీ ఆఫీస్లోనే కూర్చుని, ఆయనను గమనించేందుకు డీఐజీ తెగబడ్డారు. మరోవైపు ఇరవై కార్లతో జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదు. యధేచ్ఛగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైనం వారికి కనిపించదు. డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది. అవినాష్రెడ్డి బయటకు వెళ్ళి, జరుగుతున్న తప్పులను పట్టుకుంటారేమోనని భయపడుతున్నారు. మహిళలు తమ హక్కును కాపాడాలని ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు వేశాడంటేనే ఈ ఎన్నిక ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. దీనిని డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం. -
‘ఓటరు స్లిప్ తీసుకుని మమ్మల్ని తరిమేశారు’
వైఎస్సార్జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా మెట్నూతనపల్లి గ్రామస్థులకు ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. మెట్నూతనపల్లిలో పచ్చకాలకేయులు దొంగ ఓట్లను వేస్తున్నారు. టీడీపీ మూకలు దౌర్జన్యంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. తమ ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదని, బయట వ్యక్తులు వందలాది మంది తిష్టవేసి తమ ఓట్లను వేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటర్ ప్లిప్లను తీసుకుని తరిమేశారంటూ మీడియాకు చెప్పుకొచ్చారు. అక్కడ తమను ఓటు వేయకుండా ఆడ్డుకోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోతున్నామన్నారు. మరికొన్ని చోట్ల వేలికి ఇంక్ పూసి ఓటు వేసేశారు వెళ్లిపోండి అంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్ద పోలీసుల ఓవరాక్షన్కూటమి ప్రభుత్వానికి పోలీసులు అండగా ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైంది. పులివెందుల వైఎస్సార్సీపీ ఆఫీస్ గేట్లను మూసివేశారు. వైఎస్సార్సీపీ ఆఫీస్లోకి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో కార్యాలయానికి తాళం వేశారు. దాంతో వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళలపై సైతం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. -
పులివెందులలో హైటెన్షన్.. వైఎస్సార్సీపీ ఆఫీస్కు భారీగా పోలీసులు
సాక్షి, వైఎస్సార్సీపీ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసుల కుట్రలు కొనసాగాయి డీఐజీ కోయ ప్రవీణ్ ఫుల్ పోలీస్ఫోర్స్తో మంగళవారం మధ్యాహ్నాం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆఫీస్లోనే నిర్బంధించారు.పోలీసులు అక్కడికి వచ్చిన సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దూషించారు. అయితే తమను రెచ్చగొట్టవద్దంటూ కొందరు పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను వద్దని వారించారు. ‘‘పులివెందులపై చంద్రబాబు, లోకేష్లు పగబట్టారు. రిగ్గింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండి. కార్యకర్తలు సంయమనం పాటించండి. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’’ అని కార్యకర్తలను ఉద్దేశించి అవినాష్ అన్నారు. అయితే తాము భద్రత కల్పించేందుకు వచ్చామని పోలీసులు చెప్పగా.. ఆ అవసరం లేదని, మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరాయి. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని ఆఫీస్లోపలే ఉంచి కోయ ప్రవీణ్ అక్కడే ఉండిపోయారు. అంతకు ముందు.. ఈ ఉదయం అవినాష్ రెడ్డిని నివాసం నుంచి పోలీసులు బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల చెర నుంచి విడుదలైన వైఎస్ అవినాష్ రెడ్డి కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అక్కడ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ చేయగలిగింది ఇదొక్కటే. కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. దౌర్జన్యం చేసుకునేందుకు, ప్రజల్ని ఓట్లు వేయనీకుండా చేసేందుకు, బూత్ క్యాప్చర్లు చేసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకునేందుకు అధికారం ఎంతటి వెసులుబాటు ఇస్తుందో ఈ ఎన్నికలే ఉదాహరణ. విచారకరం ఏమంటే ఇన్ని దారుణాలు జరిగినా TDP will get away with it.ఈ ఎన్నిక గెలిచినా టీడీపీ తాను ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నది మాత్రం చేయలేదు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలు చూసారు. ప్రజలను కనీసం బూతుల వద్దకు రానీకుండా అడ్డుకుని టీడీపీ అన్ని హద్దులు చేరిపివేసింది. కోర్టు తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం టీడీపీకి ఎంబారెస్మెంట్ తప్పదు అని అవినాష్ రెడ్డి అన్నారు. -
పులివెందులలో ఇష్టారాజ్యంగా టీడీపీ దొంగ ఓట్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఓటర్లను బెదిరించి మరీ యధేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుంటూ రిగ్గింగ్కు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో.. జమ్మలమడుగు నుంచి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం బయటపడింది. వాళ్లలో పొన్నతోటకు చెందిన టీడీపీ రైతు కార్యదర్శి.. జమ్మలమడుగు మార్కెట్యార్డ్ వైఎస్ చైర్మన్ మల్లికార్జున్ కూడా దొంగ ఓటు వేశారు. జమ్మలమడుగు అనంతగిరి, గూడంచెరువు పంచాయతీ గ్రామ పంచాయితీ గ్రామ టీడీపీ లీడర్ బాలఉగ్రం కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దొంగ ఓటేశాడు.ఆ జాబితాను పరిశీలిస్తే.. కర్మలవారిపల్లె సచ్పంచ్ పుల్లారెడ్డి, గూడెంచెరువుకు చెందిన పాతకుంట శివారెడ్డి, చిన్న దండ్లూరుకు చెందిన రామచంద్రయ్య, కలవటలకు చెందిన రాజన్న, కంబళదిన్నెకి చెందిన కుళాయి, భీమగుండం వాసి రాజగోపాల్, నవాబుపేటకు చెందిన మర్రి ప్రకాశం.. సన్నపురెడ్డి రామస్వామి రెడ్డి.. ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి ఉన్నారు. వీళ్లందరినీ గుర్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఫొటోలతో సహా వివరాలను బయటపెడుతున్నాయి. -
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు: అంబటి
సాక్షి, విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, ఓటర్లు బూత్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ, పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసుల సహాయంతో మా పోలింగ్ ఏజెంట్లను బయటికి నెట్టేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ గూండాలు వచ్చారు. వైఎస్సార్సీపీ నేత బలరాంరెడ్డి పోలింగ్ ఏజెంట్గా ఉన్నప్పటికీ ఆయన్ని వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేసే వారిని గుర్తించి బయటికి పంపించేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. సాయంత్రం వరకూ అవినాష్ రెడ్డిని తిప్పాలనుకున్నారు. ప్రజలు తిరగబడటంతో ఎర్రగుంట్లలో వదిలిపెట్టారు..ఎస్వీ సతీష్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధిని కూడా బయటికి రానివ్వలేదు. టీడీపీ అభ్యర్ది మాత్రం అన్ని చోట్లా తిరగనిస్తున్నారు. నల్లకుంట్ల పాడులో పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ ఓటర్లు వేడుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే కుట్ర మొదలైంది. పులివెందుల, ఒంటిమిట్టలో కుట్రలతో గెలవాలని ముందే ప్లాన్ చేశారు. కుట్రలతో గెలిచి వైఎస్ జగన్ పనైపోయిందని ప్రచారం చేయాలని చూస్తున్నారుటీడీపీ ఓటర్లు మాత్రమే ఓటేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నంద్యాలలో కూడా చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయాం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇంత దుర్మార్గంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదు. కనంపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ను తుపాకీతో బెదిరించారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి పులివెందులలో ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్ తీరు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉంది. ఎన్నికల కమిషన్, టీడీపీ, పోలీసులు ఒక్కటైపోతే ఎన్నికలు ఏం జరుగుతాయి?బ్యాలట్ ఓటింగ్లోనే ఇంత అరాచకం చేస్తే.. ఇక ఈవీఎంలు అయితే మరింత దారుణంగా వ్యవహరించేవారు. పులివెందులలో గెలిచానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటిసి అభ్యర్థి గన్మెన్ను రాత్రికి రాత్రి మార్చేశారు. రాబోయే కాలంలో ప్రతిఫలం చంద్రబాబు అనుభవించక తప్పదు. చంద్రబాబు నీచమైన వ్యక్తి అని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయింది.ఇంతకంటే దుర్మార్గం ఏముంది?: వెలంపల్లి శ్రీనివాస్పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో దారుణంగా వ్యవహరించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?. చంద్రబాబుకి శునకానంద తప్ప ఏమీ ఒరగదు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. ఏం సాధించావని ఎన్నికల్లో ఇలా వ్యవహరిస్తున్నారు.దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు: మల్లాది విష్ణుఎన్నికల కమిషన్ నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు. పులివెందుల, ఒంటిమిట్టలో రెవిన్యూ, పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఓటర్లను గ్రామ పొలిమేర్లలోనే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులకు పులివెందుల, ఒంటిమిట్టలో ఏం పని?. దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఇది అసలు ఎన్నికే కాదు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటమి భయంతో కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు -
ఒంటిమిట్టలో మంత్రి వీరంగం.. పోలింగ్ బూత్లో బూతు పురాణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చిన్న కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులకు పాల్పడుతూ.. రెచ్చిపోతున్నారు. కర్రలతో కొడుతున్నారంటూ ఓటర్లు వాపోతున్నారు. ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. బూతు పురాణం అందుకున్నారు. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అసలు ఒంటిమిట్టకు సంబంధం లేకపోయినా కానీ మంత్రి హడావుడి చేశారు. మంత్రి వచ్చి.. పొలింగ్ బుత్లలో దౌర్జన్యం చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోలేదు.ఓటర్లను ప్రలోభపెట్టేలా.. ఒంటిమిట్ల పోలింగ్ బూత్లోకి మంత్రి వెళ్లారు, మరో వైపు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. నల్లపురెడ్డి బూత్ క్యూలైన్లో నిలబడి వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. మరో బూత్ క్యూలైన్లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరు ఓటు వేశారు. క్యూ లైన్లో జమ్మలమడుగు వాసులను వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. -
టీడీపీ అరాచకాలు.. ఎస్ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు. టీడీపీ అరాచకాల ఆధారాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు.పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలు పెట్టింది. క్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్నారు. క్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు మోహరించారు. గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ నేతలు ఎవర్నీ గ్రామంలో రానివ్వడం లేదు.కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారు. పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలు.. మీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోంది. దొంగ ఓటర్లతో పోలింగ్ బూత్ల నిండిపోయాయి. -
పులివెందులలో.. ఆ 10 మంది టీడీపీ వాళ్లే!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజలు ముక్కున వేలేసుకునేలా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటూ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు.. పోలింగ్ వేళ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులపై దాడులు చేయడం మొదలు.. ప్రచారాలను అడ్డుకోవడం.. దాడులు చేయడం, పోలింగ్ బూత్లను మార్పించడం, పోలీసుల సాయంతో అక్రమ కేసులు.. నిర్బంధాలు, చివరకు ఇవాళ పోలింగ్ వేళ ఓటర్లను భయపెట్టడం.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం టీడీపీకి షరా మామూలే అనే విషయాన్ని స్పష్టం చేశాయి.పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ వేళ టీడీపీ అరాచకాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. పోలింగ్ బూత్లను ఆక్రమించిన టీడీపీ నేతలు, కొన్నిచోట్ల ఓటర్లను అడ్డుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లను వెనక్కి పంపేసి మరీ ఓట్లు వేసుకుంటున్నారు. టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తున్నా.. ఎన్నికల అధికారులు, పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్న చందాన ఉండిపోయారు. ఈ అరాచకాలను కప్పి పుచ్చేందుకు ఎల్లో మీడియా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.పులివెందుల, ఒంటిమిట్టలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఈ ఉదయం నుంచి కథనాలతో ఊదరగొడుతోంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్ల వద్దకు కేవలం కూటమి పార్టీల అనుకూల మీడియాలను(ఆఖరికి చిన్నాచితకా యూట్యూబ్ ఛానెల్స్ను సైతం) పోలీసులు అనుమతిసున్నారు. అలాగే.. ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతోందంటూ కవరేజ్తోనూ భలే కవరింగ్ చేస్తున్నారు. ఓ పది మంది టీడీపీ అనుకూల వ్యక్తులను క్యూ లైన్లో నిలబెట్టి వీడియోలు తీసి బయటకు వదులుతున్నారు. తద్వారా.. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతులో, ఎంతో సక్రమంగా జరుగుతోందంటూ ఎల్లో మీడియా ద్వారానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంటెంట్నే అటు టీడీపీ అండ్ కో సోషల్ మీడియాలోనూ ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు.. పోలీసుల సాయంతోనే టీడీపీ పలుచోట్ల రిగ్గింగ్కు పాల్పడుతోంది. తమకు కావాల్సిన ఓట్లన్నీ టీడీపీ గుద్దించుకున్నాక.. ఆపై ఊళ్లలోకి వచ్చి ఓటేయడానికి రావాలంటూ అభ్యర్థులను, కొందరు ఓటర్లను పోలీసులు బతిమాలుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహిస్తున్న ఓటర్ల నుంచి పోలీసులు చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఇంకోపక్క.. పులివెందుల, ఒంటిమిట్టలోని పలు గ్రామాలకు చెక్ పోస్టులు వెలిశాయి. వాటి గుండా ఓటర్లతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంట్రీ ఇవ్వడం లేదు పోలీసులు. కేవలం టీడీపీ నేతల కార్లు కనిపిస్తే చాలూ రైట్ రైట్ చెబుతున్నారు. -
‘మమ్మల్ని ఆపకండయ్యా..’ పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు ఇష్టారాజ్యం రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్న టీడీపీ.. అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఖాకీలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు. పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ‘‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా’’ అంటూ అభ్యర్థించారు. అయినా పోలీసులు కనికరించలేదు. ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు. మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు?అంటూ గదమాయించారు. మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు. ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. -
కారు ఇస్తే కానిస్టేబుల్కు కుదువ పెట్టాడు!
కడప రూరల్ : స్నేహితుడే కదా అని కారు ఇచ్చాను...అతను తన కారును ఒక కానిస్టేబుల్కు కుదువ పెట్టుకున్నాడని బద్వేలు నియోజకవర్గం గోపవరానికి చెందిన సిద్దయ్య తెలిపారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన బతుకుతెరువు కోసం 2023లో టయోటా కారును కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నట్లు తెలిపాడు. కొన్ని నెలల క్రితం బద్వేల్కు చెందిన తన మిత్రుడు వచ్చి ఒక వారం కారు కావాలని అడిగితే ఇచ్చానని పేర్కొన్నాడు. వారం దాటినా అతను తన కారును ఇవ్వకపోవడంతో విచారించగా తన మిత్రుడు కారును ఒక కానిస్టేబుల్కు కుదువ పెట్టినట్లు తెలిసిందన్నాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, బద్వేల్ పోలీస్ స్టేషన్కు రెఫర్ చేశారని తెలిపాడు. అయినా కూడా తనకు న్యాయం జరగలేదని ఆరోపించాడు. అధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. -
టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారు: హేమంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారంటూ పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు’’ అంటూ హేమంత్రెడ్డి నిప్పులు చెరిగారు.ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు.. ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా కాస్తున్నారు. ఎస్ఫీకి కాల్ చేసినా ఫలితం కనిపించలేదు. హేమంత్ గన్మెన్ని ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. నిన్నటి వరకు ఉన్న గన్మెన్ను తొలగించి మరొకరిని పంపించారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ గుండాలు నిర్భందించారు. ఏజెంట్గా ఉన్న మాజీ ఎంపీపీ బలరాంరెడ్డిని బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటేసేందుకు అడ్డుకుంటున్నారని సామాన్య ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు. మాపై దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ గుండాలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటేసేందుకు వెళ్తే ఓటర్ స్లిప్పులను చించేశారంటూ ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
‘చెత్త ఎన్నికలు’.. అవినాష్ రెడ్డిని తరలిస్తున్న వాహనం అడ్డగింత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించాలనుకుంటున్నారో ఓ స్పష్టత లేకుండా ముందుకు సాగారు. తొలుత కడపకు తరలించి.. అక్కడి నుంచి అంతా తిప్పుతూ ఉన్నారు. ఈ క్రమంలో యర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు.. ఆయన్ని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.ఎలాంటి నోటీసులు, వారెంట్ లేకుండా అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన అధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆ వాహానాన్ని ముందుకు కదలనీయలేదు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధీర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు.. ‘‘మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడ అవినాష్ను దించేస్తాం’’ అంటూ పోలీసులు చెప్పడంతో.. తన నివాసానికి తీసుకెళ్లాలంటూ సుధీర్రెడ్డి అదే వాహనం ఎక్కారు. అధికార టీడీపీతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని.. పులివెందుల ఉప ఎన్నికకు అవినాష్ రెడ్డిని దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఇదీ చదవండి: బలవంతంగా ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్యర్రగుంట్లలో పోలీస్ వాహనంలోనే ఉండి సాక్షితో ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడారు. ‘‘పులివెందులలో బయటివాళ్లను అనుమతించి.. ఇంట్లో ఉన్న నన్ను బలవంతంగా తరలిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగమే. బీహార్లోనూ ఇంతదారుణమైన పరిస్థితులు ఉండవేమో. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన.. చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? లేదా?. దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది ఈసీ తీరు. పది రోజుల నుంచి మొత్తుకుంటున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వేల మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్లతో మాపై దాడులు చేయించారు’’ అని మండిపడ్డారాయన. -
పోలింగ్కు సర్వం సిద్ధం
కడప సెవెన్రోడ్స్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. కడప, పులివెందుల ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బ్యాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. జీపీఎస్తో కూడిన బస్సుల్లో రూట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. పులివెందుల మండలంలో ఏర్పాటుచేసిన 15 పోలింగ్ కేంద్రాల్లో 10,601 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఒంటిమిట్ట మండలంలో ఏర్పాటు చేసిన 30 పోలింగ్ కేంద్రాల్లో 24,606 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్తోపాటు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రూట్ మొబైల్స్, స్టైకింగ్ఫోర్స్లను, మొబైల్ వీడియో కెమెరాలు, నేత్ర వాహనాలతోపాటు అత్యాధునిక డ్రోన్లను కూడా వినియోగిస్తుండడం విశేషం. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య కడప నగర శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాల స్ట్రాంగ్ రూముకు తరలించనున్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే ఒంటిమిట్ట ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (వైఎస్సార్ సీపీ), పూల విజయభాస్కర్ (కాంగ్రెస్), ముద్దుకృష్ణారెడ్డి (టీడీపీ), సౌమిత్రి చంద్రనాథ్, కోనేటి హరి వెంకట రమణ, గుండు మల్లికార్జునరెడ్డి, టక్కోలి శివారెడ్డి, నడివీధి సుధా కర్, వై.మధుమూర్తి, మామిళ్ల ఈశ్వరయ్య, వెంకటేష్ నంద్యాల (స్వతంత్రులు)లు పోటీలో ఉన్నారు. పులివెందుల తుమ్మల హేమంత్ రెడ్డి (వైఎస్సార్ సీపీ), మారెడ్డి లతారెడ్డి (టీడీపీ), మొయిళ్ల శివకల్యాణ్రెడ్డి (కాంగ్రెస్), అంకిరెడ్డి సురేష్కుమార్రెడ్డి, తుమ్మలూరు అనిల్కుమార్రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, ఎం.గజేంద్రనాథ్రెడ్డి, మారెడ్డి జయభారత్రెడ్డి, ఎం.వెంగళరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్ (స్వతంత్రులు)లు రంగంలో ఉన్నారు. -
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
కడప ఎడ్యుకేషన్ : కంటికి కనిపించని శత్రువు. ఒంటికి హాని కలిగించేదే నులిపురుగు. ఇది మనిషి పేగుల్లో మకాం వేసి రక్తాన్ని పీల్చి పిల్లలను పిప్పి చేస్తూ రక్తహీనతను కలిగిస్తుంది. నులి పురుగులు అధిక శాతం అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దీని నివారణకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 12వతేదీ మంగళవారం అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలలో విద్యనభ్యసిస్తున్న పిల్లలందరికి ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం వైద్యశాఖాధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన మాత్రలను ఇప్పటికే అంగన్వాడీలు, స్కూల్స్, కళాశాలలకు తరలించారు. ఈ మేరకు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని వల్లూరు మోడల్ స్కూల్లో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్ట్రేట్ ఎన్డీడీ మానిటరింగ్ ఆఫీసర్, జెడ్ఎంఓ జమాల్ బాషా, డీఎంఅండ్హెచ్ఓ నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్ హాజరుకానున్నారు. ఏడాది వయసు నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరికి ఈ నులిపురుగులను నివారించే మాత్రలను వేయనున్నారు. వ్యాప్తి ఇలా.. ● నులి పురుగులు కలుషిత ఆహారం, దుమ్ము ధూళి, ఈగలు వాలిన తినుబండారాలు తినటం వలన వ్యాపిస్తుంది. ● బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన ద్వారా, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ● ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వస్తుంది. ● భోజనం వండేవారు, వడ్డించేవారు, తినేముందు తిన్న తరువాత చేతులు శుభ్రంగా కడక్కోకపోవడం వల్ల వస్తుంది. ● చేతివేళ్లకు గోర్లు ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ● ఆరుబయట తిరిగేటప్పుడు బూట్లు, చెప్పులు ధరించకపోవడం వల్ల వస్తుంది. బాల్యం చిక్కిపోతోంది.. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు 4,71,835 మంది ఉన్నారు. ఇందులో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు (అంగన్వాడీ కేంద్రంలోని) ఆల్బెండజోల్ 200 ఎంజీ, 3 నుంచి 19 సంవత్సరాలలోపు వారికి 400 ఎంజీ మాత్రలు మధ్యాహ్నం భోజనం తరువాత నీళ్లలో మింగించాలి. భోజనం చేయకుండా మాత్రను వేసుకుంటే కడపునొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు జ్వరం లేదా ఇతర ఇతర కారణాల వలన అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి ఆల్బెండజోల్ 400 గ్రాముల మాత్రలు ఇవ్వకూడదు. ఆ రెండు మండలాలు మినహా.. జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల మండలాలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఈ రెండు మండలాల్లో నులిపురుగుల నివారణ మందులు వేయడం లేదు. ఇక్కడ ఈనెల 20వ తేదీ నులి పురుగుల నివారణ మందులను వేయనున్నారు. ఉపాధ్యాయులు పాటించాల్సిన నియమాలు.. ● ఈ నులి పురుగుల కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అరోగ్యశాఖ అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలి. ● ప్రార్థన సమయంలో ఆల్బెండోజోల్ 400 గ్రాముల మాత్రల ఆవశ్యకతతోపాటు చేతుల పరిశుభ్రత గురించి వివరించాలి. అందేలా చూడాలి నులిపురుగుల నిర్మూలన వల్ల ప్రయోజనాలు.. ● పిల్లల్లో రక్తహీనత నియంత్రిస్తుంది. ● పోషకాహార ఉపయోగతను మెరుగు పరుస్తుంది ● వ్యాధి నిరోధకతను మెరుగు పరుస్తుంది ● ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం, పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి హాజరు మెరుగుపరుస్తుంది నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఒంటిమిట్ట, పులివెందుల మినహా అన్ని మండలాల్లో మాత్రలు పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యా, వైద్య ఆరోగ్యశాఖలు నేడు వల్లూరు మోడల్ స్కూల్లో జిల్లా కార్యక్రమంచిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం.. పిల్లల్లో నులి పురుగుల నివారణ లక్ష్యంగా వారి ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. ఈ పురుగుల నివారణకు ఆల్బెండోజోల్ 400 ఎంజీ ఒక మాత్ర 2 ఏళ్లలోపు పిల్లలకు సగం మాత్రను నలిపి వేయాలి. 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు వారికి ఒక మాత్ర చొప్పున వేయాలి. ఏదేని కారణాలతో మాత్రలు వేసుకోని వారికి 20వ తేదీన మళ్లీ వేస్తాం. అప్పుడు తప్పకుండా వేసుకోవాలి. – డాక్టర్ కె. నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిప్రతి పాఠశాలలో ఇవ్వాలి జిల్లా వ్యాప్తంగా ఒంటిమిట్ట, పులివెందుల మండలాలు మినహా అన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఆల్బెండోజల్ 400 గ్రాముల మాత్రలను ఇవ్వాలి. ఈ విషయంలో వైద్యశాఖ, విద్యాశాఖ సమన్వయంతో పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలి. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ పిల్లలతో మాత్రలను మింగించాలి. ఏదైనా తేడా అనిపిస్తే తక్షణం వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి -
విలేకరి బెదిరిస్తున్నాడని మహిళా సర్పంచ్ ఫిర్యాదు
కాశినాయన : మండలంలోని కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నుపల్లె సుభద్రమ్మ తనను మహబూబ్ బాషా అనే పత్రికా విలేకరి వేధిస్తున్నాడని సోమవారం నరసాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రమణకు ఫిర్యాదు చేశారు. తాను విలేకరినని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతికి పీఏను అని పాత పనులకు బిల్లు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని సర్పంచ్ తెలిపారు. 2017–18 సంవత్సరంలో తాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్డిని నిర్మించానని, అప్పుడు తనకు బిల్లులు రాలేదని, ఇప్పుడు బిల్లులు ఇవ్వాలని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. సర్పంచ్పై విలేకరి ఫిర్యాదు రూ.50 లక్షలు గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని పత్రికలో తాను వార్త రాసినందుకు సర్పంచ్, ఆమె బంధువులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని నరసాపురం పోలీస్ స్టేషన్లో విలేకరి మహబూబాషా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన తుడిమెల ప్రశాంత్ (22) సోమవారం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ తెలిపారు. ఈ యువకుడు బాల్యం నుంచి చక్కెర వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉండేవాడు. చిన్న వయస్సులోనే చక్కెర వ్యాధి వచ్చిందని మనస్తాపం చెంది శనివారం విష ద్రావణం తాగాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చియ్యపాడులో కూలిన చౌడు మిద్దెచాపాడు : మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వీఆర్ఏ (గ్రామ సేవకుడు)గా పని చేస్తున్న మండ్ల సిద్దయ్యకు చెందిన చౌడు మిద్దె కూలిపోయింది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం అందరూ చూస్తుండగా సిద్దయ్యకు చెందిన చౌడు మిద్దె పై కప్పు కూలిపోయింది. రెండు రోజుల క్రితమే సిద్దయ్య బంధువుల ఇంటికి వెళ్లడంతో మిద్దె కూలిన సమయంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయింది. మిద్దె కూలి పోవడంతో తాను కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కుక్క అడ్డు రావడంతో.. బ్రహ్మంగారిమఠం : బి.మఠంలోని గురుకుల పాఠశాల వద్ద సోమవారం సాయంత్రం సోమిరెడ్డిపల్లెకు చెందిన బొమ్ము రామమోహన్రెడ్డి అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రామమోహన్రెడ్డి బి.మఠం నుంచి మైదుకూరుకు బైకుపై వెళ్తుండగా గురుకుల పాఠశాల సమీపంలో కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో బైక్ కుక్కకు తగిలి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం తిరుమల : వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఆర్ అసోసియేట్స్ సంస్థ అధినేత చరణ్ తేజ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,10,116 విరాళంగా అందించారు. ఈమేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు. -
కదులుతున్న రైలు ఎక్కబోయి యువకుడి దుర్మరణం
జమ్మలమడుగు : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు(18) దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో ముంబై–ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు కదులుతున్న సమయంలో అందులో ఎక్కబోయి ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో మృతి చెందినట్లు. కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. యువకుడి వివరాలు తెలియలేదన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం అట్లూరు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనులను కేంద్ర పరిశీలక బృందం సభ్యుడు దయానందరెడ్డి పరిశీలించారు. తొలుత వరికుంట పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరిగిన తీరును ఆరా తీశారు. అలాగే తంబళ్లగొంది పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన 5 పనులను, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీ ఆనంద్, ఏఓ భాస్కర్రావు, ఏపీఓ జయచంద్రబాబు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
ఆవుల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సంబేపల్లె : వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఆవుల వేణుగోపాల్ రెడ్డి మరణ వార్తను మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. సోమవారం ఆవుల కుమారులు ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, ఆయన సోదరుడు ఆవుల మల్లికార్జున రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డిలు కూడా ఫోన్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన ప్రముఖులు.. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారక నాథ్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ, దేశాయి తిప్పారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ మదనపల్లె ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహమ్మద్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ ఛైర్మన్ దశరథరామిరెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. -
కిక్కుకు.. పర్మిట్!
● మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూములు ● నెలాఖరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు ● అప్పటివరకు కూడా ఆగని మద్యం వ్యాపారులు ● ఇప్పటికే అనధికారికంగా ఏర్పాటుకడప వైఎస్ఆర్ సర్కిల్ : మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ అనుమతి పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరుకు పూర్తి చేయడంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. వాస్తవానికి మద్యం షాపులు ప్రారంభమైనప్పటి నుంచే వాటి యజమానులు చాలా చోట్ల గుట్టు చప్పుడు కాకుండా పర్మిట్ రూములు ఏర్పాటు చేసేశారు. ఇప్పుడు ప్రభుత్వమే దీనికి అనుమతులు ఇస్తుందన్న సమాచారంతో ఇంకా విచ్చల విడిగా పర్మిట్ రూములు తెరిచి పూర్తిగా తాగించేస్తున్నారు. గ్లాసులు, వెజ్, నాన్ వెజ్, స్నాక్స్ ఏర్పాటు చేసి మరీ విక్రయిస్తున్నారు. అర్థరాత్రి వరకు తెరిచే ఉంచుతున్నారు. దీంతో మందుబాబులు అక్కడే తాగి తూలుతుండడంతో అటుగా వెళుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పర్మిట్కు రైట్ రైట్... మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణం వద్దే పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని పునః ప్రారంభించే దిశగా ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు పర్మిట్ రూములకు అనుమతులివ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. నూతన విధానంలో భాగంగా కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. అప్పటినుంచి జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి అనుబంధంగా ఒక్కొక్కటిగా చొప్పున 153 సిట్టింగ్ రూములు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేషన్, మున్సిపల్ పరిధిలో పర్మిట్ రూమ్కు రూ.7.50 లక్షలు ఇతర ప్రాంతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు ప్రకటించింది. సగటు చొప్పున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసిన ప్రభుత్వానికి అదనంగా రూ.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పరిమిత ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మారుస్తున్నారు. ఆదాయమే లక్ష్యమా.. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు గాను 3100 దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. తద్వారా రూ.62 కోట్లు ఆర్జించింది. షాపులు దక్కించుకున్న వ్యా పారులు ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజుల్లో 1/6 వంతు చెల్లించారు. పర్మిట్ రూము లు సైతం అందుబాటులోకి వస్తే ఆదా యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వమే ఆదాయం లక్ష్యంగా మద్యాన్ని ఏరులై పారిస్తోందని దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమస్త సౌకర్యాలతో... ఇప్పటికే ప్రతి షాపు వద్ద ఒక పర్మిట్ రూమును అనధికారికంగా తెరిచేశారు. అది కూడా ఏదో చిన్న గది అనుకుంటే పొరపాటే. సువిశాల ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మరీ ఏర్పాటు చేశారు. మందుబాబులు కూర్చుని తాగేందుకు కుర్చీలు, టేబుళ్లు, వేశారు. వర్షం, ఎండా పడకుండా విశాలమైన షెడ్లు వేసి బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షెడ్ల లోపల పెద్ద ఫ్లడ్లైట్లు వేసి మరీ మందు అందజేస్తున్నారు. మంచింగ్ కోసం అన్ని రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలను అక్కడే ఉంచుతున్నారు. ఎంత సేపైనా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తుండడంతో మద్యం ప్రియులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే తప్ప తాగి తూలుతున్నారు. -
అక్రమ వసూళ్లు రూ.16.40 లక్షలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో 2024 ఆగస్టు నెల నుంచి సుమారు రూ.16.40 లక్షలు యూజర్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లు చేసినట్టు తేలిందని కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేయవద్దని చెప్పినప్పటికీ వ్యాపార సంస్థల నుంచి క్లాప్ యూజర్ చార్జీలు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఆరు ప్రత్యేక బృందాలతో పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 2414 మందిని విచారించగా 258 మంది తాము యూజర్ చార్జెస్ ఇచ్చామని చెబుతూ అందుకు సంబంధించిన రశీదులు, ఆధారాలు చూపారన్నారు. మిగిలిన 2156 మంది తాము ఎలాంటి యూజర్ చార్జీలు చెల్లించలేదని చెప్పారన్నారు. రూ.4,20,750లకు స్లిప్పులు తగిన ఆధారాలు ఉన్నాయని, రూ.12,19,500లకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇందులో 2024 ఆగస్టు నుంచి కార్పొరేషన్కు రూ.7 లక్షలు జమ అయిందన్నారు. తమ విచారణలో బయటపడిన నాలుగు లక్షల 20 వేల 750 రూపాయలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. దీనిపై ఇదివరకే ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు మరో ఏడుగురు శానిటరీ సెక్రటరీలు, ముగ్గురు ఆప్కాస్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే తెలపాలని, వాటిపై కూడా విచారణ చేస్తామన్నారు. ఇకపై యూజర్ చార్జీలు వసూలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి అనధికారికంగా లేఔట్లు వేసిన వారు, అందులో ప్లాట్లు కొన్నవారు 24వ తేదీలోపు ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్టర్ అయిన ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. 45 రోజుల్లో మొత్తం ఫీజు చెల్లించిన వారికి 10 శాతం, 90 రోజుల్లో చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కడప నగరంలో సుమారు వందకు పైగా అనధికారిక లేఔట్లు ఉన్నాయని, వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో రూ. 7 లక్షలు నగరపాలక సంస్థకు చెల్లింపు రూ. 4.20 లక్షలకు ఆధారాలు లభ్యం ఆరు బృందాలతో 2414 మందిని విచారణ మీడియాతో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి -
Pulivendula: పులివెందులలో భయానకం.. పోలింగ్ బూత్లను ఆక్రమించిన టీడీపీ గూండాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పులివెందుల మండలంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు అరాచకం సృష్టిస్తున్నారు. అచ్చివెల్లి, ఎర్రిపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. టీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలింగ్ కేంద్రాల నుంచి నిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లు.. టీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఓటర్లు అంటున్నారు.పోలింగ్ బూత్ల్లో బయటి వ్యక్తులు ఉన్నారని ఓటర్లు చెబుతున్నారు. ఒక్క పోలింగ్ బూత్లో కూడా పోలీసులు లేరని ఓటర్లు అంటున్నారు. ఎక్కడికక్కడే పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలు.. వైఎస్సార్సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుపడుతున్నారు. గ్రామాల్లో పచ్చ మూకలు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎర్రిపల్లిలో పోలింగ్ బూత్ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలు.. పోలీసులను సైతం తరిమేస్తున్నారు. గ్రామంలో మహిళలపై కూడా దాడి చేస్తూ.. పచ్చమూకలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు. -
సీఎంఓ డైరెక్షన్లో పులివెందుల ఎన్నిక
కడప సెవెన్రోడ్స్ : ముఖ్యమంత్రి కార్యాలయ డైరెక్షన్లోనే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, అధికార దుర్వినియోగం, దౌర్జన్యా లు, రిగ్గింగ్లతో గెలవాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. సీఎంఓ డైరెక్షన్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పనిచేస్తున్నారన్నారు. సోమవారం సాయంత్రం కడపలోని తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం 10,601 ఓట్లు ఉన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే, ఎస్పీ ఎర్రచందనంపై ప్రెస్మీట్ నిర్వహించడం, డీఐజీ పత్తి వ్యాపారం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డిపల్లె గ్రామంలో, ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఎర్రబల్లి గ్రామంలో తిష్టవేసి చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే మనుషులను తరలించారన్నారు. స్లిప్పులు ఓటర్లకు పంపిణీ చేయకుండా అధికారులు టీడీపీ వారికి ఇస్తున్నారని విమర్శించారు. ఆ స్లిప్పులు తీసుకుని బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లు వేయనున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకు అభ్యంతరం చెప్పే ఏజెంట్లను లేకుండా చేశారన్నారు. మగవాళ్లందరికీ బైండోవర్ కేసులు బనాయించారని, రైతులను తోటల వద్దకు కూడా వెళ్లనీయడం లేదన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలా నాలుగు వేల ఓట్లు రిగ్గింగ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 100 కోట్లు అధికార పార్టీ ఖర్చుచేసేందుకు సిద్దమైందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం ద్వారా ఓటర్ల మనస్సు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాల్సింది పోయి విచ్చలవిడి దౌర్జన్యకాండకు దిగడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. పులివెందులలో గెలిచామని చెప్పుకునేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా ఎన్నికల్లో అక్రమాలు జరగలేదన్నారు. తాము కూడా ఇలా అనుకుని ఉంటే టీడీపీ వారు తిరిగే వారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతీరెడ్డి వాట్సాప్ కాల్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ఎన్నికలు పోలీసు వ్యవస్థకు కూడా సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, నాయకులు పులి సునీల్కుమార్, నిరంజన్రెడ్డి, షఫీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దౌర్జన్యాలు, రిగ్గింగ్తో గెలిచేందుకు యత్నాలు స్లిప్పులు ఓటర్లకు కాకుండా టీడీపీ వారికి పంపిణీ బయట వ్యక్తులతో ఓట్లు వేయించుకునేందుకు కుట్రలు ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ప్రొద్దుటూరు : పోలీసులు – టీడీపీ నేతలు కలసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయా గ్రామాల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సోమవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను ఓటు వేయనీయకుండా.. దౌర్జన్యం చేసి పోలింగ్ ప్రారంభంలోనే వారు ఓటు వేసేకునేందుకు వ్యూహాన్ని రచించారన్నారు. తొలి నుంచి పులివెందుల ప్రాంత వాసులను రౌడీలుగా, గుండాలుగా, రాక్షసులుగా, ఆటవికులుగా చూపి మాట్లాడిన టీడీపీ నేతలు ఈ రోజు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చారన్నారు. పులివెందులకు మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే ఆ కాలేజీలో సీట్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేశారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జగన్మోహన్రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రజల చేతికి ఓటు ఇస్తే ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలే జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడపతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను, అనుచరులను పిలిపించి గ్రామాల్లో తిష్ట వేయించారన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకంటే ముందుగానే వారు గొడవలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఒక్కో పోలింగ్ బూత్కు ఒక్కో నియోజకవర్గ ఎమ్మెల్యేలను టీడీపీ నియమించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించి ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాదులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే పులివెందులలోని జగన్ ఇంటి వద్దకు చేరుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడి పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. లాఠీ చార్జీలకు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ శ్రేణులంతా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వెంట ఉంటూ సంఘటితంగా ఉండాలని కోరారు. చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులందరిని పోలీసులు ఇళ్లకు పంపారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచే టీడీపీ నాయకులు, గుండాలు పులివెందులకు మళ్లీ చేరుకున్నారని, ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ను పోలీసులకు ఇచ్చిందన్నారు. పోలీసులు పూర్తిగా టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కోడ్ చూపించిన వారికి గ్రామాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారన్నారు. ముందుగానే గ్రామాల్లోకి చేరిన టీడీపీ నేతలు ఓటర్ల నుంచి స్లిప్లను సేకరించారన్నారు. మంగళవారం పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేసుకుంటే అడ్డుకోబోయే వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి దౌర్జన్యంగా ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల పోలింగ్ కేంద్రాల్లో ఇతర నియోజకవర్గాల కార్యకర్తలు తిష్ట ఒక్కో బూత్కు ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే నియామకం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
జావెలిన్ త్రో స్టేట్ ఫస్ట్ సూఫియాన్
కమలాపురం : కమలాపురం దర్గా వీధికి చెందిన ఎస్. సూఫియాన్ కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కడపలోని డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సూఫియాన్ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు జరిగిన 36వ ఏపీ స్టేట్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. కాగా స్పోర్ట్స్ స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ను, అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోచ్ వెంకటేశ్వర్లును ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. జావెలిన్త్రోలో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ప్రొద్దుటూరు : పోలీసులు – టీడీపీ నేతలు కలసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయా గ్రామాల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సోమవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను ఓటు వేయనీయకుండా.. దౌర్జన్యం చేసి పోలింగ్ ప్రారంభంలోనే వారు ఓటు వేసేకునేందుకు వ్యూహాన్ని రచించారన్నారు. తొలి నుంచి పులివెందుల ప్రాంత వాసులను రౌడీలుగా, గుండాలుగా, రాక్షసులుగా, ఆటవికులుగా చూపి మాట్లాడిన టీడీపీ నేతలు ఈ రోజు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చారన్నారు. పులివెందులకు మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే ఆ కాలేజీలో సీట్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేశారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జగన్మోహన్రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రజల చేతికి ఓటు ఇస్తే ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలే జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడపతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను, అనుచరులను పిలిపించి గ్రామాల్లో తిష్ట వేయించారన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకంటే ముందుగానే వారు గొడవలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఒక్కో పోలింగ్ బూత్కు ఒక్కో నియోజకవర్గ ఎమ్మెల్యేలను టీడీపీ నియమించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించి ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాదులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే పులివెందులలోని జగన్ ఇంటి వద్దకు చేరుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడి పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. లాఠీ చార్జీలకు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ శ్రేణులంతా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వెంట ఉంటూ సంఘటితంగా ఉండాలని కోరారు. చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులందరిని పోలీసులు ఇళ్లకు పంపారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచే టీడీపీ నాయకులు, గుండాలు పులివెందులకు మళ్లీ చేరుకున్నారని, ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ను పోలీసులకు ఇచ్చిందన్నారు. పోలీసులు పూర్తిగా టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కోడ్ చూపించిన వారికి గ్రామాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారన్నారు. ముందుగానే గ్రామాల్లోకి చేరిన టీడీపీ నేతలు ఓటర్ల నుంచి స్లిప్లను సేకరించారన్నారు. మంగళవారం పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేసుకుంటే అడ్డుకోబోయే వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి దౌర్జన్యంగా ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల పోలింగ్ కేంద్రాల్లో ఇతర నియోజకవర్గాల కార్యకర్తలు తిష్ట ఒక్కో బూత్కు ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే నియామకం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
Pulivendula Vontimitta ZPTC Election.. Polling Updates:పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్భారీగా దొంగఓట్లు వేసిన జమ్మలమడుగు టీడీపీ గూండాలురిగ్గింగ్కు పాల్పడ్డ కమలాపురం,మైదుకూరు టీడీపీ గూండాలుక్యూలైన్లలో నిలబడి టీడీపీ గూండాలే ఓట్లు వేసిన వైనంఅసలు ఓటర్లకు బదులు దొంగ ఓట్లు వేసిన టీడీపీ గూండాలు ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున రిగ్గింగ్టీడీపీ గూండాలకు కొమ్ముకాసిన పోలీసులు ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటువేసేందుకు అవకాశం భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్లను తరలించనున్న అధికారులు పులివెందులపై పోలీసులు పగబట్టారు: అవినాష్రెడ్డిపులివెందులలో భారీ రిగ్గింగ్ జరిగిందిప్రతీ గ్రామంలోనూ టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేశారుపోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్ చేశారుఈ ఎన్నికలను బర్తరఫ్ చేయాలికేంద్ర బలగాలతో రీ పోలింగ్ నిర్వహించాలికార్యకర్తలు సంయమనం పాటించాలిపోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారుఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండిఅన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందాంఓటర్ ప్లిప్లు లాక్కోని బయటకు పంపారుటీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారుఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుకనంపల్లి గ్రామస్తులను ఓట్లు వేసుకోనివ్వలేదుమా ఏజెంట్లను పోలింగ్ బూత్లో లేకుండా చేశారుబయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారుపార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణం : అంబటిపులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగఓట్లు వేస్తున్నారువారికి పోలీసులు సహకరిస్తున్నారుపోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారుటీడీపీ నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణంఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది.డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారుఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది.జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదుజమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు అలాంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పడం డీఐజీ కోయ ప్రవీణ్ దివాలాకోరుతనానికి నిదర్శనంపులివెందులపులివెందులలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 71.36శాతంమొత్తం పోలింగ్ స్టేషన్లు:15మొత్తం ఓటర్లు:10,601పోలైన ఓట్లు:7,565ఒంటిమిట్టఒంటిమిట్టలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 66.39 శాతంమొత్తం పోలింగ్ స్టేషన్లు:30మొత్తం ఓటర్లు:24,606పోలైన ఓట్లు:16,336 టీడీపీ మూకల దౌర్జన్యం.. ఓటర్లు భయభ్రాంతులుమా ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదు: మెట్నూతనపల్లి గ్రామస్థులుఓటు వేయడానికి వస్తే ఓటర్ స్లిప్ తీసుకుని తరిమేశారుబయట వ్యక్తులు వందలాదిగా వచ్చి ఓట్లు వేస్తున్నారుమేము చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోతున్నాంవైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టు వైఎస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తున్న అన్నమయ్య జిల్లా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు అంజాద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశానికి తరలిస్తున్న పోలీసులు ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషదాడి చేసిన అధికార పార్టీ నేతలు కాకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడం దారుణంమంత్రి రాంభూపాల్ రెడ్డి యదేచ్ఛగా పోలింగ్ బూతులకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిఅయినా వారిపై చర్యలు లేవు ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందిపోలీసులు పచ్చ పార్టీ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారుపోలీసులు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మంచిది కాదు దుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి :గోరంట్ల మాధవ్ ప్రజా స్వామ్యం అపహాస్యం చేస్తూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు చేశారుపోలింగ్ బూత్లు స్వాధీనం చేసుకున్నారుపోలీసులు కాళ్లకు ఓటర్లు మొక్కుతున్నారుదొంగ ఓటర్లు గ్రామాల్లో యదేచ్ఛగా ఓట్లు వేస్తున్నారుస్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు..ఇప్పుడు ఇంట్లో నిర్బంధించారుదుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి పాండవులే గెలిచారుప్రజాస్వామ్యం ఖూనీ చేసే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారుపోలీసు అధికారులకు నా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందిజడ్పీటీసీ ఉప ఎన్నికలు పై కోర్టుకు వెళ్తాం, రీపోలింగ్ కోరతాంజమ్మలమడుగు ,కమలాపురం చెందిన వారితో దొంగ ఓట్లు వేయించారుపులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలు నిర్వహణ తీరు ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టుచంద్రబాబు కుట్ర పూరితమైన ఎన్నికల తీరుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారుపోలిసులు, ఈసీ కూటమి ప్రభుత్వానికి లొంగి ఊడిగం చేయడం బాధాకరంఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తుల భేటీతమను ఓటు వేయనీయకుండా టిడిపి గుండాలు అడ్డుకున్నారు.ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారు కర్రలు కత్తులతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారువచ్చిన వాళ్లంతా ఇతర ప్రాంతాల నుంచి మా గ్రామంలోకి వచ్చారు మా గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గుండాలను మోహరించారు మా ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరు ఇచ్చారు గతంలో ఎన్నడు ఇటువంటి దౌర్జన్యాలు జరగలేదు. మహిళలను కూడా చూడకుండా బూతులు తిట్టారు.. చంపుతామని బెదిరించారుఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తులు ఒంటిమిట్టలో అరగంట పాటు నిలిచిన పోలింగ్పోలింగ్ కేంద్రంలో దొంగఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు పోలింగ్ బూత్ లోపల టీడీపీ నేతల్ని నుంచి ఉంచి గడియపెట్టిన పోలీసులు పోలింగ్ కేంద్రం గేటు బయటే వైఎస్సార్సీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రంలో టీడీపీ దొంగఓట్లు వేయిస్తోందంటూ ఆందోళనలోపలికి రానివ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు గందరగోళంతో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ నిలిపివేత ఎంపీ అవినాష్రెడ్డి అరెస్ట్వైఎస్సార్సీపీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశాంఐదు గంటల వరకు అదుపులోనే ఉంటారురిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండిఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి అరెస్టుకు యత్నంఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆఫీసుకు చేరుకున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.ఎస్పీతోపాటు సుమారు 150 మంది పోలీసులుసుబ్బారెడ్డి ఆఫీస్లో వైఎస్సార్సీపీ నేతలు రవీంద్ర నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అమ్జాద్ భాష, కొరుముట్ల శ్రీనివాసులు వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడుతున్న ఎస్పీవైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నంపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వైఎస్సార్సీపీ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులులోపలి వారిని బయటకు, బయటి వారిని లోపలికి అనుమతించని వైనంగేటు వద్ద మహిళలు ఆందోళనమా కార్యాలయంలోకి పంపడానికి ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్తలు..పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయంలో పోలీసుల వీరంగంపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న పోలీసుల వీరంగం పార్టీ గేటు వద్ద లోపలికి కార్యకర్తలను ఎవరినీ రానివ్వకుండా గేట్లు వేసి అడ్డుకుంటున్న పోలీసులుమహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న పోలీసులుతమ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి వద్దకు వెళ్లాలంటూ పోలీసులతో వాదనకు దిగిన మహిళలుఅయినా అడ్డుకుంటున్న పోలీసులు..ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తతటీడీపీ నేతలను లోపలికి పంపి ఓట్లు వేయిస్తున్న పోలీసులువైఎస్సార్సీపీ నేతలను గేటు వద్ద అడ్డుకున్న పోలీసులుగేట్లు తోసుకొంటూ లోపలికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు కనంపల్లిలో పోలీసుల ఓవరాక్షన్ సర్పంచ్ రామాంజనేయులు ఇంట్లో గన్ ఉంచి బెదిరిస్తున్న పోలీసులు కనంపల్లిలో ఓట్లు వేయనియకుండా ఓటర్లును తిప్పిపంపిస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై ఓటర్ల ఆగ్రహం పులివెందులపై పోలీసులు పగబట్టారు: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారుఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండిఅన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాంకార్యకర్తలు సంయమనం పాటించాలి కలెక్టర్కు పులివెందుల జడ్పీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థుల లేఖ పులివెందులలో అరాచకం చేసి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందిఏ ఒక్క ఏజెంటునూ పోలింగ్ బూత్లోకి వెళ్లనివ్వలేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన అభ్యర్థులురీపోలింగ్ జరపాలని కలెక్టర్ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థులుఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆఫీస్కు భారీగా పోలీసులుపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్వైఎస్సార్సీపీ కార్యకర్తలను దూషించిన పోలీసులుపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలు ఉదయం 11 గంటల వరకు 38.64 శాతం నమోదుపులివెందుల:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15మొత్తం ఓటర్లు: :10,601పోలైన ఓట్లు: 4803ఓట్ల శాతం: 45.31ఒంటిమిట్ట:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 30మొత్తం ఓటర్లు: 24,606పోలైన ఓట్లు: 9057 ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ నేతల భారీ ర్యాలీపోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనపులివెందులలో యథేచ్ఛగా రిగ్గింగ్: వైఎస్ అవినాష్రెడ్డిజమ్మలమడుగు టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారుకొత్తపల్లిలో బీటెక్ రవి అనుచరులు రిగ్గింగ్ చేశారుమా పార్టీ ఏజెంట్లను కొట్టి బయటకు పంపారుఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న పట్టించుకోలేదుపులివెందుల మండల ఓటర్లతో రిగ్గింగ్ చేయించడం అసాధ్యంఅందుకే బయట నుంచి దొంగ ఓటర్లను దింపారుపులివెందులలో దౌర్జన్యాలతో ఎవరూ గెలవలేరుదాడులు చేసి గెలిచామనకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదుఎర్రిపల్లిలో బీటెక్ రవి తమ్ముడు మహిళలను కొట్టాడుపోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ బయటకు తీయాలితప్పు చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాంమంత్రి రాంప్రసాద్రెడ్డి అనుచరుల వీరంగంచిన్న కొత్తపల్లిలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్పై చేయి చేసుకున్న టీడీపీ నేతలుఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులుకట్టెలతో కొడుతున్నారంటూ వాపోతున్న ఓటర్లుప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిసుబ్బారెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలుబూతు పురాణం అందుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డిమంత్రి రాంప్రసాద్రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనఓటర్లను ప్రలోభపెట్టేలా మంత్రి పర్యటనఒంటిమిట్ల పోలింగ్ బూత్లోకి వెళ్లిన మంత్రిదొంగ ఓటు వేసిన జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్నల్లపురెడ్డి బూత్ క్యూలైన్లో వైఎస్ ఛైర్మన్మరో బూత్ క్యూలైన్లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరుక్యూ లైన్లో జమ్మలమడుగు వాసులను గుర్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులుపులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లుప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలుక్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్న వైనంక్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు అయినా పట్టించుకోని పోలీసులుపోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను పంపుతున్న టీడీపీ నాయకులుదొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు, వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదని పంపుతున్న టీడీపీ నాయకులునల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలుగ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని టీడీపీ నేతలుకర్రలు, రాడ్లతో పహారా, పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్రఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగింత...గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలుమీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలుప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్...దొంగ ఓటర్లతో నిండిపోయిన పోలింగ్ బూత్లుటీడీపీ అరాచకాల ఆధారాలను ప్రదర్శించిన వైఎస్సార్సీపీ నేతలుప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలువిజయవాడ: ఎస్ఈసీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ నేతలుపులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదుతక్షణమే స్పందించాలంటూ ఈసీ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నేతల నిరసనఎన్నికల కమిషనర్ను కలిసిన మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్..మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డిమొండితోక అరుణ్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డిఎస్పీకి ఫోన్ చేసినా కానీ పట్టించుకోలేదుపులివెందుల జడ్సీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి ఆగ్రహంమా ఇంటి చుట్టూ 150 పోలీసులను పెట్టారుమా ఏజెంట్లు వస్తే కాళ్లు చేతులు విరిచేస్తామంటూ బెదిరించారుఇంటి నుంచి 100 మీటర్ల దూరంలో 100 మందిపైగా టీడీపీ రౌడీ మూకలుఇక్కడ ఉండేది 1200 ఓట్లు.. బయట నుండి వచ్చి 900 మంది రౌడీలు తిరుగుతున్నారు144 సెక్షన్ ఉందన్నా.. బయటకు వాళ్ళకు వర్తించదా?పోలీసులు దగ్గరుండి ఓట్లు వేయించిస్తున్నారునేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదుప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలిగెలుపు ఓటములు సహజంపులివెందులను భ్రష్టు పట్టిస్తున్నారుతప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తున్నారుఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలిఎస్పీకి ఫోన్ చేసిన ఇంతవరకు రెస్పాన్స్ లేదుపోలీసుల తీరుపై ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆగ్రహంపూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా జడ్పీటీసీ ఎన్నికలురాయచోటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీ మూకలను తరలించి ఎన్నికలకు అంతరాయం కలిగిస్తున్నారుప్రతి బూత్ వద్ద బయటి వ్యక్తులు 50కి పైగా ఉన్నాకానీ.. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారుఆ బయట వ్యక్తులు ఉన్నారని పేరుతో సహా చెప్పిన పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారు..పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారుప్రజాస్వామ్యం పద్ధతులకు విరుద్ధంగా ఎన్నికలు జరిగితే దానికి ఎస్పీఏ బాధ్యులవుతారుఉదయం 9 గంటల వరకు 14.87 శాతం నమోదుపులివెందుల:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15మొత్తం ఓటర్లు: :10,601పోలైన ఓట్లు: 2,222ఓట్ల శాతం: 20.96ఒంటిమిట్టమొత్తం పోలింగ్ స్టేషన్లు: 30మొత్తం ఓటర్లు: 24,606పోలైన ఓట్లు:3,658 మహిళల అడ్డగింతతో.. వెనుదిరిగిన పోలీసులువైఎస్సార్ జిల్లా తుమ్మలపల్లి లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులుఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులు‘‘మీరు టీడీపీ వారికే కాపలా.. పోండి’’ అంటూ అడ్డుకున్న మహిళలుఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్ కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారా? అని ఆగ్రహంఅసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడి వచి నీతులు చెప్తారా? అంటూ అడ్డగింతమహిళల అడ్డగింతతో వెనుతిరిగిన పోలీసులుఆ పది మంది టీడీపీ వాళ్లే!పులివెందుల ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకంపోలింగ్ బూత్ ల నుంచి ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలుపోలింగ్ బూత్ లను ఆక్రమించిన టీడీపీ నేతలు.పోలీసులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్న వైనంటీడీపీ అరాచకాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలుఓన్లీ ఎల్లో మీడియా చానల్స్ ను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతిపదిమంది టీడీపీ ఓటర్లను క్యూ లైన్లో నిలబెట్టి వీడియోలు తీయిస్తున్న టీడీపీఎన్నిక సక్రమంగా జరిగిందంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పులివెందుల-నల్లపురెడ్డి గ్రామానికి చెక్ పోస్ట్ఓటర్లకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు నో ఎంట్రీటీడీపీ నాయకుల కార్లు అయితే రైట్ రైట్ఒంటిమిట్టలో టీడీపీ అరాచకంకొనరాజుపల్లి కి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు10 జీపుల్లో బయట నుండి వచ్చిన టీడీపీ శ్రేణులుభారీ ఎత్తున రిగ్గింగ్ కోసం ప్రయత్నాలు ఒంటిమిట్టలో టీడీపీ అరాచకంగొల్లపల్లి , నరసనగారి పల్లి పోలింగ్ బూత్ హేండ్ ఓవర్ చేసుకున్న టీడీపీ శ్రేణులుఓట్లు వేసుకొంటున్న టీడీపీ శ్రేణులుపోలింగ్ బూతుల నుండి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటికి లాగేసిన టీడీపీ శ్రేణులుచోద్యం చూస్తున్న పోలీసులుటీడీపీ రిగ్గింగ్పై ఆగ్రహజ్వాలలుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్కనంపల్లిలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాల్లో టీడీపీ ఇష్టారాజ్యంఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని మహిళల గ్రహంపోలీసుల కాళ్లు పట్టుకుంటున్న ఓటర్లుపులివెందుల నల్లగొండు వారి పల్లె లో ఓటర్ల ఆందోళనఓటు వెయ్యనివ్వండని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్న ఓటర్లుటీడీపీ నేతలు రిగ్గింగ్ చెయ్యడం తో నిజమైన ఓటర్ల ఆందోళనపోలీసులు కి వేడుకుంటున్న ఓటు హక్కు వినియోగించుకొని దుస్థితిఓటరు స్లిప్పులు లాక్కుంటున్న టీడీపీ నేతల పై ఓటర్ల ఆగ్రహం👉లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు: ఎస్వీ సతీష్రెడ్డివేంపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి హౌస్ అరెస్ట్నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: ఎస్వీ సతీష్రెడ్డి లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు లోకేష్ ఆనందం కోసం చంద్రబాబు ధృతరాష్ట్రుడు అయ్యాడు ప్రజాస్వాయం అవహేళనకు గురవుతుంటే చంద్రబాబు లోకేష్ ఆనందిస్తున్నారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు పులివెందులలో ఉన్న పోలీసులకు ఖాకి చొక్కా వేసుకునే అర్హత లేదునేటి పోలింగ్ జరుగుతున్న తీరుతో ప్రజాస్వామ్యం మీద ఆందోళన కలిగిస్తోంది పరిస్థితి ఈ విధంగా ఉన్నాక పోలింగ్ నిర్వహణ ఎందుకు?👉పులివెందులలో మహిళా ఓటర్ల ఆవేదనఓటేయకుండా అడ్డుకుంటున్నారుఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారుమీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారంటూ నానా హంగామా చేశారుఓటర్ స్లిప్పులను లాక్కున్నారుఓటేయడానికి వెళ్లే ఇక అంతే సంగతులు అంటూ హెచ్చరించారుఈస్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదువందల మంది స్థానికేతర రౌడీలు మా ఓట్లను వేస్తున్నారు.👉పులివెందులలో టీడీపీ ఇష్టారాజ్యంఅన్ని పోలింగ్ బూత్ల్లో రిగ్గింగ్చేస్తున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాల చేతిలో నల్లపురెడ్డి పోలింగ్ స్టేషన్జమ్మలమడుగు నుంచి మనుషుల్ని పిలిపించి రిగ్గింగ్అందరి ఓట్లు వాళ్లతోనే వేయిస్తున్న పచ్చగూండాలు👉కనంపల్లిలో గ్రామస్తులను ఓట్లు వేయనివ్వని పోలీసులుఓటు వేయనివ్వండంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లుఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు: స్థానికులుదగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారుబయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాలకే సపోర్ట్ చేస్తున్న పోలీసులు👉పులివెందుల మండలం కనంపల్లి గ్రామంలో ఉద్రిక్తతపోలింగ్ బూత్లకు వెళ్ల నియ్యకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలుఓటు వేయడానికి వెళ్తున్న మహిళ ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ మూకలుతమ ఓటు హక్కును అడ్డుకోవడానికి మీరెవ్వరు అంటూ పచ్చ మూకలపై తిరగబడ్డ మహిళలుకనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు బయటికి రానివ్వకుండా బెదిరిస్తున్న పోలీసులు👉నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా రిగ్గింగ్వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలువిచ్చలవిడిగా రిగ్గింగ్కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు👉ఆర్. తుమ్మలపల్లిలో అరాచకంవైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలుఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలాఎస్ఫీకి కాల్ చేసినా కనిపించని ఫలితంహేమంత్ గన్మెన్ని ఉన్న పళంగా మార్చేసిన అధికారులునిన్నటి వరకు ఉన్న గన్మెన్ను తొలగించి మరొకరిని పంపిన అధికారులుబయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ నేతలుటీడీపీ గూండాలకే వత్తాసు పలుకుతున్న పోలీసులు👉టీడీపీ గూండాల అరాచకాలపై పట్టించుకోని పోలీసులుపులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి ఆగ్రహందాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారుటీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారుఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారునా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారుకర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారుదాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారుఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు👉ఈ కొత్తపల్లిలో రెండు పోలింగ్ బూత్లను ఆక్రమించిన టీడీపీ నేతలుఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యంటీడీపీ ఓటర్లను తప్ప మిగతా వారిని ఓటు వేయడానికి అనుమతించని టీడీపీ నేతలుఓటు వేయడానికి వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్న టీడీపీ గుండాలునిస్సహాయంగా వెనక్కి తిరిగిపోతున్న ఓటర్లుఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాముదౌర్జన్యంగా వెనక్కి పంపించేశారుగతంలో ఎన్నడు బూతులను ఆక్రమించలేదుపోలింగ్ బూత్ల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తులు లేరుబయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే పోలింగ్ బూత్ల్లో ఉన్నారుపోలీసులు వారికే కొమ్ము కాస్తున్నారుఒక్క బూత్లో కూడా పోలీసులే లేరుమా గ్రామాల్లో ఓటు వేయకుండా, పక్క గ్రామంలో బూత్లు మార్చారుఎప్పుడు బూతులు మార్చిన దాఖలాలు లేవంటున్న ఓటర్లు👉పులివెందులలో మీడియాపై దాడికి దిగుతున్న కూటమి నేతలుపోలింగ్ బూత్ లను ఆక్రమించి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని అల్లరి మూకలుఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్న టీడీపీ మూకలుప్రతి గ్రామంలో 300 మందికి పైగా అల్లరి మూకలుమీడియాను సైతం వదలని టీడీపీ మూకలుమీడియా ప్రతినిధులను గ్రామం బయటే అడ్డుకుని కెమెరాలు లాక్కుంటున్న వైనంసాక్షి ప్రతినిధులపై దాడికి దిగిన టీడీపీ గూండాలువైఎస్సార్సీపీ ఏజెంట్లను అసలు బూత్ లోపలికి వెళ్లనివ్వని టీడీపీ👉పులివెందుల, ఒంటిమిట్లలో ప్రజాస్వామ్యం ఖూనీపోలింగ్ బూత్ల్లో టీడీపీ గూండాల స్వైర విహారంవైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలుమీడియా ప్రతినిధులపైనా టీడీపీ గూండాల దాడులుటీడీపీ గూండాల అరాచకాలను పట్టించుకోని పోలీసులు👉పులివెందులలో టీడీపీ గూండాల దౌర్జన్యంఅచ్చివెల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుక్ను టీడీపీ గూండాలుఎర్రిపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో భయాందోళనలునిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లుటీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారని ఆవేదనగతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటున్న ఓటర్లుపోలింగ్ బూత్ల్లో బయటి వ్యక్తులు ఉన్నారంటున్న ఓటర్లుఒక్క పోలింగ్ బూత్లో కూడా పోలీసులు లేరంటున్న ఓటర్లు👉పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభంతీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పోలింగ్ఎక్కడికక్కడే పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలువైఎస్సార్సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలుగ్రామాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్న పచ్చ మూకలు👉పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తతపోలింగ్ బూత్ ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలుపోలీసులను సైతం తరిమేస్తున్న టీడీపీ మూకలుగ్రామంలో మహిళలపై దాడి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న పచ్చ మూకలుగ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ👉పులివెందుల మండలంలో భయానక పరిస్థితులువైఎస్సారసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి హౌస్అరెస్ట్వేంపల్లిలోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులువైఎస్సార్సీపీ నేతల కార్లను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలుమౌన ప్రేక్షక పాత్రలో వందలాది మంది పోలీసులుగ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు👉ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అరెస్ట్తెల్లవారుజామున అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులుఇంటికొచ్చి బలవంతంగా అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులుఎన్నికలు జరిపే విధానం ఇదేనా?: అవినాష్రెడ్డిమా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారుకేవలం వైఎస్సార్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారుపోలీసులు గూండాలుగా వ్యవహరిస్తున్నారుఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు👉వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.👉ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.👉ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది.ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం. -
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.ఏజెంట్లపై దాడి చేసి వెళ్లగొట్టే కుట్ర మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే పోలింగ్ బూత్ నుంచి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి, పోలీసుల ద్వారా వారిని వెళ్లగొట్టేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి వెళ్లగొట్టడం ద్వారా తమ అడుగులకు మడుగులొత్తే పోలీసులు, అధికారుల సహకారంతో పోలింగ్ బూత్ను పూర్తిగా తమ అ«దీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ శ్రేణులను ప్రతి పోలింగ్ బూత్ వద్ద కనీసం వంద మంది చొప్పున ఇప్పటికే మోహరించారు. పోలింగ్ ప్రారంభం కాక ముందే పోలింగ్ బూత్ వద్ద వారితో యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా చేసి.. పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి.. పోలింగ్ బూత్లను ఆక్రమించుకోవడానికి మరో కుట్ర చేస్తున్నారు. తద్వారా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఎస్ఈసీ, పోలీసులు ప్రేక్షకపాత్ర ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పులివెందుల మండల స్థానికులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెనక్కు వెళ్లిపోవాలి. ప్రచారం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాల వారు ఎన్నిక జరిగే ప్రాంతంలో ఉండటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా బస చేస్తే వారిపై ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) అధికారులు, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో వచి్చన టీడీపీ శ్రేణులు పులివెందుల మండలంలోని గ్రామాలకు చేరుకుంటున్నప్పటికీ.. వారిని అడ్డుకోకుండా ఎస్ఈసీ, పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పులివెందుల మండలంలోనే కాదు.. ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. అంతులేని అక్రమాలు ⇒ పులివెందుల మండలంలో ఇటు అధికారులు, అటు పోలీసులు అందరూ ఏకమై వైఎస్సార్సీపీపై కుయుక్తులకు పాల్పడుతున్నారు. పులివెందులకు విలన్లా మారిన మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు కుట్రలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా సరే గెలిచి.. వైఎస్ జగన్ అడ్డాలో పాగా వేశామని చెప్పుకునేందుకు పులివెందులను రణరంగంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ⇒ కూటమి నేతల అరాచకంపై ఎన్నికల కమిషన్కు ఎన్నిమార్లు విన్నవించినా స్పందనే లేదు. మరోవైపు ఆయా కేసుల్లో అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచి్చనప్పటికీ మోట్నూతలపల్లె గ్రామానికి చెందిన అర్జున్, గంగన్న, చంద్రగిరికి చెందిన మస్తాన్వల్లి, మల్లికార్జునపురానికి చెందిన హరి, రచ్చుమర్రిపల్లె మైసూరారెడ్డి, లోపట్నూతల ప్రకాష్రెడ్డి, కారంపల్లె మహేష్నాయక్, బాలాజీ నాయక్, సర్పంచ్ రామాంజనేయులు, కోరా కిరణ్కుమార్రెడ్డి, రవిప్రకాష్రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మరోవైపు ప్రలోభాలకు గురిచేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.⇒ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ సోమవారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లె, కొత్తపల్లె, కనంపల్లె, యర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్చార్జి భూషేష్రెడ్డిలు రౌడీïÙటర్లను వెంటబెట్టుకుని హల్చల్ చేశారు. పోలింగ్ ప్రారంభం కాకముందే కొన్ని ఓట్లు వేసుకునేలా సరికొత్త కుట్రకు పదును పెట్టినట్లు తెలిసింది. ⇒ పోలింగ్ పారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాట మాత్రమే వినాలని పోలీసులకు ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.నేడు పోలింగ్∙ 14వ తేదీన ఓట్ల లెక్కింపు వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
‘టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు ప్రజలు చూశారు’
వైఎస్సార్ జిల్లా: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు ప్రజలు చూశారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. జడ్పీటీసీలాంటి చిన్న ఎన్నికలను సీఎం కార్యాలయం నుండి నడిపిస్తున్నారని, వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి తిరిగి వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘ఓటర్లను తికమక చేసేందుకు జబ్లింగ్ చేశారు. ఒకగ్రామంలో ఓటు ఉంటే మరో గ్రామంలో ఓటు వేసేలా కుట్రలు చేశారు. కిలోమీటర్ల మేర ప్రజలు దూరం వెళ్ళి ఓటు వేసేలా ప్లాన్ వేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలో రిగ్గింగ్ చేయాలని చూస్తున్నారు. జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గం నుండి ప్రజలను రప్పించి రిగ్గింగ్ కు ప్లాన్ వేశారు. ఎక్కడ ఉన్నారో డోర్ నంబర్తో సహా తమ దగ్గర ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసినా స్థానికులు కానీ వారు ఎందుకు ఉన్నారు...?, ఓటు స్లిప్పులు ఓటర్లకు ఇవ్వకుండా బయటి నుంచి రప్పించిన వారికి ఇస్తున్నారు. ఏజెంట్ గా కూర్చోవాలన్నా కేసులు పెడతాం అని భయపెడుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తారు. ఎన్నికలు అనుకున్నారో.. పత్తి వ్యాపారం అనుకున్నారా!, 10 వేల ఓట్లకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది’ అని విమర్శించారు. -
మా ఓటు వేయడానికి మీరెవరూ.. టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చిన ఓటర్లు
సాక్షి,వైఎస్సార్: జిల్లాలోని ఒంటిమిట్టలో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. ధవంతం పల్లి ఎస్సీ కాలనీలో పోలింగ్ బూతు నెంబర్ తేడా పడిందంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఓటర్ స్లిప్పు తీసుకున్నారు. టీడీపీ నేతల తీరుతో ఆగ్రహానికి గురైన ఓటర్లు.. గ్రామమంతా వదిలేసి తమ దగ్గరే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఓటర్ స్లిప్లో తేడా వచ్చింది, మళ్లీ కొత్తవి ఇస్తామంటూ టీడీపీ నేతలు బుకాయించారు. మా ఓట్లు మేమే వేసుకుంటాం.. మధ్యలో మీరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కొత్తస్లిప్లు వస్తాయి.. ఇస్తామంటూ టీడీపీ కార్యకర్తలు మెల్లగా జారుకున్నారు. -
ఈసీ మొద్దు నిద్ర.. పులివెందులలో టీడీపీ ఓట్ల చోరీ: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికార టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎండగట్టారు. టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్పులను సేకరిస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. ఈసీ తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.... పోలింగ్ బూత్లను మార్చడంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశాం. దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు. తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి... కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు. ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు. .. మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు. మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాం. అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్లను అందించాలి. ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి. నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు. ిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు. నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు. దీనిపై మొద్దు నిద్ర వీడి.. ఎన్నికల కమిషన్ స్పందించాలి అని డిమాండ్ చేశారాయన. ఇదిలా ఉంటే.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం నుంచి జరగనుంది. -
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. వైఎస్సార్సీపీ నేతలపై నమోదైన కేసుల్లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తొందరపాటు చర్యలు వద్దంటూ సోమవారం కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.పులివెందుల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఈ నెల 6వ తేదీన వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పోలీసుల దాష్టీకంపై వైఎస్సార్సీపీ నేతల హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు వద్దని, ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పులివెందులలో అధికార పార్టీ టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దాడులకు పాల్పడిన వాళ్లను వదిలేసి గాయపడ్డ వాళ్లపైనే కేసులు కడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి టీడీపీ మూకలు
పులివెందుల రూరల్, ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు(ఆగస్టు 12న) ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే అధికార పార్టీ టీడీపీ అరాచకాలు, వైఎస్సార్సీపీ ప్రతిఘటనలతో పులివెందుల ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. వైఎస్సార్ జిల్లావిచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి దూరుతున్న టీడీపీ మూకలుకొత్తపల్లిలో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది మోహరింపుటీడీపీ జమ్మలమడుగు ఇంఛార్జి భూపేష్ రెడ్డి ఆద్వర్యంలో మరో వంద మంది నల్లపురెడ్డిపల్లిలోకి చొరబాటుతుమ్మలపల్లిలో ముసలిరెడ్డిపల్లి రఘు ఆధ్వర్యంలో మరో వందమందిరేపు దొంగ ఓట్లు, కొట్లాటలకు వీరిని వినియోగించనున్న టీడీపీఅయినా ఏమాత్రం స్పందించని పోలీసులు ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి జోగిరమేష్చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడుదీన్ని ఎన్నిక అంటారా? చంద్రబాబుచంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందాఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారుగతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించాడుపులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదుఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందిపులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నాడుప్రతీ పోలింగ్ కేంద్రం... లోపలా... బయట... సీసీ కెమెరాలు పెట్టాలని కోరాంపులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించాడుఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైసీపీనేరాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది వైసీపీ జెండానేచంద్రబాబూ.. ఇంత దిగజారాలా?: పేర్ని నానిఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి పేర్ని నానిపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోందిప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారుకొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారుఓటుకి పదివేలు ఆశచూపిస్తున్నారుఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారుగన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే రక్షణ లేదుఅవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారుదాడులు చేస్తాం.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారుపోలీసులు.. షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారురికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరుచంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టీడీపీ వాళ్లే 5 వేలు నొక్కేస్తున్నారురేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలికాల్ సెంటర్ పెట్టాలి.. స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలిఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలిపులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదురాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలుపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు,దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి నేతలుఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్న టీడీపీ నేతలుఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులిస్తున్న టీడీపీ నేతలుఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్న టీడీపీ నేతలుటీడీపీ ప్రలోభాల పై ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్,జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్,, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లుపులివెందులలోనే కూటమి నేతల తిష్టపులివెందుల మండలంలోనే కూటమి నేతలుఎన్నికల ప్రచార గడువు ముగిసినా పల్లెల్లో తిష్ట వేసిన టీడీపీ నేతలుఎర్రబెల్లి, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్య రెడ్డిఅయినా పట్టించుకొని పోలీసులుఎస్ఈసీ వద్దకు వైసీపీ నేతలుమరికొద్ది సేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న వైసీపీ నేతలుపులివెందుల జడ్పీటిసి ఎన్నికల్లో టిడిపి ప్రలోభాలు, దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు వైసీపీ నేతల రాక నేపధ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు బందోబస్తుటీడీపీ నేతల కుట్రలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ఓటరు స్లిప్పులను టీడీపీ నేతలు తీసుకోవటంఫై వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ ఆగ్రహంకొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారుఇవ్వకపోతే బెదిరిస్తున్నారుమూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాంఅయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదుటీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారుడబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారుదీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదుతాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చిందిఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోందిఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలిప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్లను అందించాలిఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలిఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారుఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారుమా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారునల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారుఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారురిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారునిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారుదీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలిపోలింగ్ బూత్ల మార్పు.. హైకోర్టులో విచారణఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్ మోషన్ పిటిషన్పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతులు మార్పులు సవాలు చేస్తూ పిటిషన్మధ్యాహ్నం విచారణ చేయనున్న ఏపీ హైకోర్టుఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్ల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషన్పులివెందులలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కారుమూరితణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుస్వతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది.తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణకు 72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే.ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎం ట్యాపరింగ్లు జరిగిందని చెప్పిన మొదటి వ్యక్తి నేనే.ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు .కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురుపులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి సందర్భంలో నిర్వహించిన ర్యాలీపై పోలీసుల కేసువైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టిన పోలీసులుహైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను సోమవారం ఆదేశించిన హైకోర్టుపులివెందుల ఆగని పోలీసుల దాష్టీకంపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల దాష్టీకంవైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధంఆరుగురిని ఆదివారం ఉదయం నుంచి పీఎస్లోనే ఉంచిన ఖాకీలుపులివెందుల అప్గ్రేస్ పీఎస్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులుపోలీసుల అదుపులో అర్జున్ (మొట్నుతలపల్లి), మస్తాన్ వలి (చంద్రగిరి), హరి (మల్లికార్జునపురం), మైసూరారెడ్డి (లక్షుంవారిపల్లి), రవి ప్రకాష్ రెడ్డి, నాయక్ (కనంపల్లి)ఎన్నికల నేపధ్యంలో కీలకంగా ఉన్న నాయకులను వేధిస్తున్నారంటున్న వైఎస్సార్సీపీపోలింగ్ టీడీపీకి అనుకూలంగా మార్చడానికే అక్రమ నిర్బంధం అంటున్న వైఎస్సార్సీపీఒంటిమిట్టలో..ఒంటిమిట్టలో పోలింగ్ ఏర్పాట్లపై అధికారుల స్పందనమీడియాతో మాట్లాడిన రిటైనింగ్ అధికారి రామలింగయ్య రేపు 7 గంటల నుండి 5గంటల వరకు పోలింగ్ప్రతి పోలింగ్ స్టేషన్కి నలుగురు అధికారులుబ్యాలెట్ బాక్స్ లు, ఎలక్షన్ మెటీరియల్ అందిస్తున్నాం..సెక్యూరిటీతో పాటు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తున్నాం..రేపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం మౌలానా అబ్దుల కలాం ఆజాద్ యూనివర్సిటీ లో భద్రపరుస్తాం14వ తేదీ కౌంటింగ్ ఉంటుందిపులివెందుల మండలంలో నేడు..స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్స్ ల పంపిణి ప్రారంభంజెడ్పీటీసీ ఉపఎన్నిక కు కావాల్సిన బ్యాలెట్ బాక్స్ ల పంపిణి చేస్తున్న ఎన్నికల అధికారులుపోలింగ్ సిబ్బంది కి బూత్లవారీగా ఎలక్షన్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణిపులివెందుల జడ్పీటీసీ స్థానానికి 15 పోలింగ్ బూత్లు ఏర్పాటుపోలింగ్ బూత్ల సిబ్బందికి ఎలక్షన్ సామగ్రి పంపిణిరోజుకో కుట్ర.. కూటమి కుయుక్తిజెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ప్రభుత్వ అడ్డదారులువైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలుఅదే సమయంలో ఓటర్లకూ వేధింపులుపోలింగ్ బూత్ల మార్పు తో ఓటర్లకు ఇబ్బందిఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రంపోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, ఓటర్లు నిలువరించే ప్రయత్నాలు చేస్తారని వైఎస్సార్సీపీ పిర్యాదుప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ, గవర్నర్లకు వినతిటార్గెట్ వైసీపీ కేడర్పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా టీడీపీ అరాచకాలు ఇప్పటికే దాడులు, హత్యయత్నాలతో అట్టుడుకుతున్న పులివెందులగ్రామాల్లో కీలక వైఎస్సార్సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో అరెస్ట్వందల మందిపై బైండోవర్ కేసులుపోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలుకూటమి కుట్రలతో రణరంగంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపులివెందుల, ఒంటిమిట్ట మొత్తం 750 మందిపై బైండోవర్ కేసుఒక్క పులివెందుల మండలంలోనే 500 మందిపై బైండోవర్ కేసులు52 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు, 9 మంది వైఎస్సార్సీపీ నాయకులను రిమాండ్ కు పంపిన పోలీసులుకోడ్ ఉల్లంఘించి మరీ.. ప్రచార సమయం ముగిసిన కొనసాగుతున్న టీడీపీ పాలిటిక్స్ ఒంటిమిట్టలో ఏదేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కూటమి కీలక నేతలుఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన ప్రచారంఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతర్ చేసిన కూటమి ప్రభుత్వ నేతలు ఆరు గంటల టైంలోనూ హరిత హోటల్ లో మకాం వేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ...ముఖ్య నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులుపులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు.. రేపే పోలింగ్పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారంరేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలుపులివెందులలో 10,601 ఓట్లు, ఒంటిమిట్టలో 24,600 ఓట్లుపులివెందులలో భారీ బందోబస్తుసెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న పోలీసులుపులివెందులలో ఐదు, ఒంటిమిట్టలో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపుప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘారెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటుపోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరిక -
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
కడప అర్బన్: మోస్ట్వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.రామమోహన్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
సీ అండ్ డీ ప్రదేశంలో బీ గ్రేడ్ బైరెటీస్ ఖనిజం
ఓబులవారిపల్లె : తక్కువ గ్రేడ్ ఖనిజమైన సి అండ్ డి గ్రేడ్ యాడ్లో విలువైన బి గ్రేడ్ ఖనిజం తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆదివారం పెద్దఎత్తున బయట ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగంపేట ఏపీఎండీసీలో ఖనిజం అమ్మకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. సి అండ్ డీ గ్రేడ్ 0.4 గ్రావిటీ కలిగి ఉండి రూ. 2200 టన్ను ధరతో ఏపీఎండీసీ విక్రయాలు చేస్తోంది. అయితే 1.2 గ్రావిటీ కల్గిన బి గ్రేడ్ ఖనిజం టన్ను ధర దాదాపు రూ. 6 వేలు ఉంది. గనుల నుండి వెలికి తీసిన బి గ్రేడ్ ఖనిజాన్ని కేటాయించిన స్థలంలో కాకుండా సి అండ్ డి గ్రేడ్ ఖనిజం ఉన్న యార్డుకు తరలించి సి అండ్ డి గ్రేడ్ ధరకు బి గ్రేడ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించుకుని పోతున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. శనివారం బి గ్రేడ్ ఖనిజాన్ని సి అండ్ డి యార్డులో తోలినట్లు గమనించిన సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఖనిజాన్ని పరిశీలించారు. ఈ విషయంపై సీపీఓ గోపినాథ్ను వివరణ కోరగా బైరెటీస్ ఖనిజాన్ని పరిశీలించామన్నారు. అనాలసిస్ చేసిన అనంతరం 0.7 గ్రావిటీ వచ్చిందని అది సి అండ్ డి గ్రేడ్ ఖనిజమే అని నిర్ధారించినట్లు తెలిపారు.కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వైనం -
పెన్నానదికి నీరు విడుదల బంద్
జమ్మలమడుగు : మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి అధికారులు నీటి విడుదలను ఆపేశారు. శనివారం నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో కొన్ని గ్రామాలకు సంబంధించిన రాకపోకలు బంద్ అయ్యాయి. ముఖ్యంగా వేపరాల–జమ్మలమడుగు రహదారిపై రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో పాటు రోడ్డు కొట్టుకునిపోయింది. అదేవిధంగా ఎర్రగుంట్ల మండలంలోని థర్మల్ , ముద్దనూరుకు వెళ్లే పెన్నానది రహదారి నీటి పెరుగుదల వల్ల రోడ్డు కోసుకుపోవడంతో ఈ ప్రాంతంలో కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదివారం ఉదయం పెన్నానదిలో ముగ్గురు భక్తులు కన్యతీర్థం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో వాహనం పెన్నానదిలో చిక్కుకోవడంతో బాధితులను బయటికి తీయడం కోసం నీటిని బంద్ చేశారు. మైలవరంలో పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం.. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. ప్రస్తుతం జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా రోజుకు 13 వేల క్యూసెక్కుల నీరు గండికోట ప్రాజెక్టులోనికి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం గండికోటలో 14.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీని పూర్తి నీటి సామర్థ్యం 26 టీఎంసీలు. ప్రస్తుతం కృష్ణా జలాలు వస్తున్న నీటితో చిత్రావతి, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరలం జలాశయంలో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సోమశిల ప్రాజెక్టులోనికి సైతం కృష్ణా జలాలు పెన్నానది ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 5.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో గండికోట నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీరు మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వదిలేయాలి. దీంతో గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు గండికోట నుంచి వదిలే నీటిని బంద్ చేశారు. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి నీటిని అధికారులు విడుదల చేస్తే గండికోట నుంచి మైలవరం జలాశయం లోనికి నీటిని విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యంతో ఉండటంతో వచ్చే నీరు దిగువకు వదలాల్సి ఉంది. ప్రస్తుతం బంద్ కావడంతోనే గండికోట నుంచి నీటిని బంద్ చేసినట్లు గండికోట, మైలవరం ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు -
కూలిన మట్టి మిద్దె
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని తిరువెంగళాపురం పంచాయతీలోని తిరువెంగళాపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మట్టి మిద్దె కూలిపోయింది. తిరువెంగళాపురం ఎస్సీ కాలనీకి చెందిన నాగిపోగు బాలకృష్ణ కొన్నేళ్లుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిలోని ఓ గది పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు వేరే గదిలో నిద్రిస్తుండటంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం కడప అర్బన్ : కడప నగరం బిల్డప్ సర్కిల్ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ కింద పడి దొరబోయిన సుదర్శన్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై కడప ట్రాఫిక్ సీఐ జావీద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నూరు మండలం కొక్కిరాయపల్లె గ్రామానికి చెందిన దొరబోయిన సుదర్శన్ (21) ఐటీఐ చదువుకుంటున్నాడు. అతని అన్న కడప కార్పొరేషన్కు సంబంధించి చెత్త సేకరించేందుకు తమ ట్రాక్టరు బాడుగకు ఇచ్చాడు. ఆదివారం కావడంతో సుదర్శన్ కూడా ట్రాక్టరుతోపాటు వచ్చాడు. విజయదుర్గాదేవి ఆలయం నుంచి బిల్టప్ మార్గమధ్యంలోకి రాగానే బర్రె అడ్డు రావడంతో ట్రాక్టరు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టరులో ఉన్న సుదర్శన్ జారి అదే ట్రాక్టరు క్రింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. త్రుటిలో తప్పిన ప్రమాదంచిన్నమండెం : పవిత్ర పుణ్య క్షేత్రం గండి నుంచి మదనపల్లెకు వెళ్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మదనపల్లెకు చెందిన ప్రయాణిలు గండి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లె వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు -
స్వర్ణ దుకాణంలో చోరీ
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గల జె.బి. స్వర్ణ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 72 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలోని మార్కెట్వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా స్వర్ణ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరే శనివారం కూడా వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఫోన్ రావడంతో దుకాణంలో ఉండే పిల్లలను చూస్తూ ఉండమని చెప్పి దుకాణం నుండి బయటికి వచ్చాడు. అప్పటికే కాపు కాసిన ఇద్దరు యువకులు దుకాణంలోకి వెళ్లి బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్లో పరారయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమై గట్టిగా కేకలు వేస్తూ వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దుకాణ యజమాని అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టణంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని క్లూస్టీం పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఆరా.. వైఎస్సార్సీపీ నాయకుడైన జబీవుల్లాకు చెందిన స్వర్ణ దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులతో ఫోన్లో మాట్లాడి నిందితులను గుర్తించి బాధితుడికి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్రామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
పోరుమామిళ్ల : కలసపాడు మండలం గంగాయపల్లెలో ఈనెల 7న నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ముట్టే నరేంద్ర( 20) అలియాస్ జగన్ను ఆదివారం మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నరేంద్ర జులాయిగా తిరిగేవాడన్నారు. మద్యానికి బానిసయ్యాడని, తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టేవాడన్నారు. సెల్ఫోన్లో అసభ్య వీడియోల ప్రభావంతో పథకం ప్రకారం చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పెడతామన్నారు. సమావేశంలో కలసపాడు, పోరుమామిళ్ల ఎస్ఐలు తిమోతి, కొండారెడ్డి పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో విద్యుత్ సామగ్రి దగ్ధం
అట్లూరు : ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పాటుకు మండల పరిధిలోని వళసపాళెం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామస్తుల వివరాల మేరకు శనివారం రాత్రి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో విస్తారంగా వర్షం కురిసింది. అయితే అదే తరుణంలో భయంకరమైన మెరుపుతో గ్రామంలోని చిట్టెం వెంకటసుబ్బారెడ్డి, రామసుబ్బమ్మల ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో వెంకటసుబ్బారెడ్డి బద్వేలులో వివాహ కార్యక్రమానికి వెళ్లారు. ఆయన భార్య రామసుబ్బమ్మ కూడా గ్రామంలోని రామాలయంలో భజన కార్యక్రమంలో ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. వారి ఇంటిలోని విద్యుత్ పరికరాలు, ఫ్రిజ్, తాగు నీటి మోటారుకు సంబంధించిన స్టార్టర్ పూర్తిగా కాలిపోయాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వీధిలైట్లు సైతం పగిలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. -
పెన్నానదిలో చిక్కుకున్న వృద్ధ దంపతులు
ప్రొద్దుటూరు క్రైం : పెన్నానదిలో చిక్కుకున్న ఇరువురు వృద్ధులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రేగుళ్లపల్లె గ్రామానికి చెందిన గండి చిన్న సుబ్బరాయుడు, ఆయన భార్య నారాయణమ్మలు ఆదివారం పెన్నానదిలోకి వెళ్లా రు. అయితే పెన్నా నదికి మైలవరం నీరు వదలడంతో నీటి ప్రవాహం ఒక్క సారిగా పెరిగింది. దీంతో వృద్ధ దంపతులు నీళ్లలో చిక్కుకున్నారు. వారిని స్థా నికులు గుర్తించి డయల్ 100కు ఫోన్ చేశారు. రూ రల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానదికి చేరుకున్నారు. బోటు ద్వారా నీళ్లలోకి వెళ్లి వృద్ధులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.సురక్షితంగా కాపాడిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది -
జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు
కడప అర్బన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 1400 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా విధులను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో మీడియాకు వివరాలను తెలియజేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించనున్నామన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో ఉప ఎన్నికకు 650 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారన్నారు. ఇప్పటివరకు పులివెందులలో 500 మందిపై, ఒంటిమిట్టలో 650 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడిందన్నారు. స్థానికేతరులు ఆయా ప్రాంతాలలో వుండకూడదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా వుంచుతామన్నారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 1400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విధులు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ వెల్లడి -
‘విద్యాదీపం’ సినిమా షూటింగ్ ప్రారంభం
కాశినాయన : మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన ముత్తుముల లోకేష్ హీరోగా ‘విద్యాదీపం’ అనే సినిమా షూటింగ్ను ప్రారంభించారు. శనివారం రాత్రి ఉప్పలూరులోని శ్రీఅభయాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో షూటింగ్ చేశారు. హీరో లోకేష్, హీరోయిన్ సావిత్రికృష్ణలపై ఎంఈఓ నిర్మల క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి పిల్లి రమణారెడ్డి, సంఘ సేవకుడు బీఎస్ నారాయణరెడ్డితోపాటు 40 మంది సినిమా యూనిట్ సభ్యులు, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.ఎలుగుబంటి దాడిపోరుమామిళ్ల : మండలంలోని ఎరసాలకు చెందిన బాయకట్టు నాగరాజు ఆదివారం ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఊరికి సమీపంలోని కొండలో గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. కొండపొలంలో గొర్రెలు మేస్తుండగా పిల్లలున్న ఎలుగుబంటి నాగరాజుపై దాడి చేసింది. హఠాత్తుగా వచ్చిన ఎలుగుబంటిని చూసిన నాగరాజు పెద్దగా కేకలు వేస్తూ తనను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో దగ్గరలో ఉన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో ఎలుగుబంటి పిల్లలతో పారిపోయింది. ముఖానికి, చేతులకు బాగా గాయాలవడంతో నాగరాజును పోరుమామిళ్లలో ప్రథమ చికిత్స అనంతరం కడపకు తరలించారు.గోడపై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలుమదనపల్లె రూరల్ : ఇంటి గోడపై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రెడ్డెమ్మ ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వగా, ఆ వైరు కిందకు వేలాడుతుండటంతో, ఇంటిగోడ పైకి ఎక్కి సరిచేసే క్రమంలో అదుపుతప్పి కిందకు పడి తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.రైలు కింద పడి ఆత్మహత్యరైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్ మధ్యలో ఆర్.రాచపల్లి రైల్వేగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వృద్ధుడు(60) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
కడప సెవెన్రోడ్స్: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12వ తేది జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆదివారం ఎస్పీ ఈజీ అశోక్కుమార్తో కలిసి కలెక్టరేట్లో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసేంతవరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. సోమవారం సాయంత్రానికంతా పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించిన తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, రెండవ విడత సోమవారం నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. వీటిలో సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉంటాయన్నారు. వెబ్కాస్టింగ్కు అవకాశం లేనిచోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని తెలిపారు. ప్రచారం ఆదివారం సా యంత్రం 5 గంటలకు ముగిసిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలన్నారు. లేనిపక్షంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని, ఇంకా మిగిలిన వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలతో కూడిన పలు వినతులు రాగా, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఓటర్ల కోసం బస్సులు, ఆటోలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండే ఓటర్లు వీటిని సద్వినియోగం చేసుకుని ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే హెల్ప్డెస్క్, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, వి.కొత్తపల్లె ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చడం పట్ల వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, వివరాలను తొలుత ప్రదర్శించి అభ్యంతరాలను ఆహ్వానించామని కలెక్టర్ చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం వల్ల వీటిని ఖరారు చేశామన్నారు. ఈనెల 14వ తేది కడప సమీపంలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. కట్టుదిట్టమైన భద్రత – ఎస్పీ పోలింగ్ సజావుగా సాగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. సీసీ కెమెరాలతోపాటు రూట్ మొబైల్స్, స్టైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 13 జిల్లా సరిహద్దు చెక్పోస్టులతోపాటు పులివెందుల, ఒంటిమిట్ట పరిసరాల్లోని 15 చెక్పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామన్నారు. పెట్రోలింగ్ పార్టీలు, మొబైల్ వీడియో కెమెరాలు, నేత్ర వాహనాలతోపాటు రెండు అత్యాధునిక డ్రోన్స్ వినియోగిస్తున్నామని వివరించారు. రిటర్నింగ్ అదికారి ఓబులమ్మ పాల్గొన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు ఓటర్ల సౌలభ్యం కోసం బస్సులు, ఆటోలు ఏర్పాటు కలెక్టర్ శ్రీధర్,ఎస్పీ అశోక్కుమార్ -
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఆదివారం మోట్నూతలపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్నదని, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కొడుకు హేమంత్రెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ బరిలోకి దించిందన్నారు. సాధారణంగా ఈ ఎన్నికను సానుభూతికి వదిలేస్తారన్నారు. కానీ, ఆదినారాయణరెడ్డి లాంటి జిమ్మిక్కులు చేసే వ్యక్తులకు తోడు చంద్రబాబు, లోకేష్ పోటీకి వ చ్చారన్నారు. పోటీ చేయడం తప్పేమి లేదు గానీ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం, కొంతమందిని ఆర్థికంగా ప్రలోభాలతో మభ్య పెట్టడం దారుణమన్నారు. దీంతో పాటు భౌతిక దాడులకు దిగడం అరాచకానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపైనే రివర్స్గా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు పెట్టించడం అన్యామన్నారు. ఇలా దుర్మార్గమైన పరిస్థితులలో ఎలెక్షన్లు జరుగుతున్నాయన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల మార్పుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఓటు వేయడానికి ఓటర్లు రాకుండా కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది తప్పుడు విధానమన్నారు. లోకేష్ ఆది నారాయణరెడ్డి ట్రాప్లో పడ్డారని, ఆదినారాయణరెడ్డి లేనిపోని అబద్దాలు మా ట్లాడుతూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని గొప్పగా చెప్పి.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్లు పులివెందులను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు.ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
వైఎస్సార్సీపీ విజయం తథ్యం
ఒంటిమిట్ట(రాజంపేట): జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచార చివరిరోజు ఆదివారం ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ చేపట్టింది.ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా కొనసాగిన ర్యాలీకి విశేషస్పందన లభించింది. రాములోరి కల్యాణవేదిక ప్రాంతం నుంచి కొనసాగిన ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు,వివిధ ప్రాంతాల రైతులు, యువకులు, విద్యార్థులు, ముస్లీంమైనార్టీలు, దళితులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమాను వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట వైఎస్ జగన్ అడ్డా అన్నారు. ఎంతమంది ఎన్నికుట్రలు పన్నినా, కేబినెట్ కదిలివచ్చినా చేసేదేమి ఉండదని, ఓటమి చవిచూడటం తప్ప అన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూటమి కుట్రలను ఒంటిమిట్ట వాసులే ఓటు అనే ఆయుధంతో తిప్పికొడతారన్నారు. ఎన్నికలకోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా ఒంటిమిట్టలో కొనసాగిందని ఉన్నతాధికారులకు తెలిసినా అడ్డుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజలే అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థిచారు. ● ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజద్బాషా, కొరముట్ల, కడప జెడ్పీచైర్మన్ రామగోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో భారీ ప్రచార ర్యాలీ -
సహకార సంఘాలకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు
కడప అగ్రికల్చర్: జిల్లాలోని 30 సహకార సంఘాలకు ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక చైర్మన్తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. సాధారణంగా ఎన్నికలను నిర్వహించి ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకుండా సొసైటీలో సభ్యత్వం ఉన్న వారిలోనే ఒకరిని చెర్మెన్గా మరో ఇద్దరిని కమిటీ మెంబర్స్గా ఎంపిక చేయడం గమనార్హం. జిల్లా స్కౌట్ రోవర్కు ‘నేషనల్ లీడర్‘ పురస్కారం కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ కడప జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు చెందిన స్కౌట్ రోవర్ సగినాల అహమ్మద్ ‘నేషనల్ కంటింజెంట్ లీడర్ అవార్డు‘ సాధించారు. ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబూరు (సదరన్ రైల్వే)లో నేషనల్ రోవర్/ రేంజర్ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రేంజర్లు, రోవర్లు హాజరు కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి పులివెందులకు చెందిన సగినాల అహమ్మద్ పాల్గొని వివిధ అంశాల్లో చక్కటి ప్రతిభను కనబరచటంతో పాటు ఓవరాల్గా ‘స్టేట్ బెస్ట్ కంటింజెంట్ లీడర్‘ అవార్డుకు ఎంపికయ్యాడు. జిల్లాకు చెందిన స్కౌట్ జాతీయస్థాయిలో కంటింజెంట్ లీడర్ అవార్డును అందుకోవడంపై జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్ఏ–1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ఎఫ్ఏ– 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని దీంతోపాటు ప్రతి విద్యార్థికి అసెస్మెంట్ బుక్లెట్ అందాలని పాఠ్యపుస్తకాల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రాము ఆదేశించారు. ఆదివారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కడప నగరంలోని సీఎస్ఐ పాఠశాలలో గల డీసిఈబీ హాల్ను, వల్లూరు మండల వనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి తరగతి వారీగా సబ్జెక్టు వారీగా అసెస్మెంట్ బుక్కును తప్పనిసరిగా అందించా లని సూచించారు. అసెస్మెంట్ బుక్లో ఆగస్టు, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు అసెస్మెంట్ బుక్స్ను భద్రంగా ఉంచుకొని తర్వాత పరీక్షలకు ఇందులో నిర్వహించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ విజ య భాస్కర్ రెడ్డి, కడప మండల విద్యాశాఖ – 2 షేక్ ఇర్షాద్ అహ్మద్, ఉమ్మడి జిల్లా బుక్స్ గోడౌన్ మేనేజర్ రామాంజనేయమ్మ , జిల్లా బుక్స్ గోడౌన్ సిబ్బంది నరేష్, అనిల్, కడప సీఆర్ఎంటిలు పాల్గొన్నారు. జిల్లాలో జోరు వర్షం కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి, ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, ముద్దనూరు మినహా మిగతా 32 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో పెండ్లిమర్రిలో అత్యధికంగా 69.6 వర్షం నమెదుకాగా అత్యల్పంగా వీఎన్పల్లిలో 1.4 మి.మీ వర్షం నమోదైంది. -
ఆరుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు. ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు. విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్ఎస్టిఎఫ్ సీఐ సి.శంకర్రెడ్డి, ఆర్ఎస్ టాస్్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్ » ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు » రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్తో చెట్టాపట్టాలుకడప అర్బన్: మోస్ట్వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
రగిలిపోతున్న నల్లగొండువారిపల్లి
పులివెందుల/వేంపల్లె: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉపఎన్నికలో భాగంగా నల్లగొండువారిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పక్క గ్రామంలోకి మార్చడంపై ఆ గ్రామస్తులు రగిలిపోతున్నారు. పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి నల్లగొండువారిపల్లిలో 632 ఓట్లు ఉన్నాయి. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పోలింగ్ బూత్ ఉండేది. స్థానికులంతా అక్కడే ఓటు హక్కు వినియోగించుకునే వారు. కానీ, వీరంతా ఇప్పుడు నల్లపురెడ్డిపల్లిలో ఓటు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదే పరిస్థితి ఎర్రబెల్లి ఓటర్లకు కూడా ఉత్పన్నౖమెంది. ఇక్కడి వారంతా నల్లపురెడ్డిపల్లికు వెళ్లి వేయాల్సిన దుస్థితి. నల్లపురెడ్డిపల్లి ఓటర్లు అటు నల్లగొండువారిపల్లి, ఇటు ఎర్రబెల్లి పోయి ఓటు వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్కుమార్ తీరుపై నల్లగొండువారిపల్లి గ్రామ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే టీడీపీ కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. వారి ఆవేదన వారి మాటల్లోనే..మా గ్రామంలోనే ఓటు వేసుకోనివ్వాలిపోలింగ్ బూత్ను మా గ్రామంలో కాకుండా వేరే గ్రామానికి తరలించడం సరికాదు. అధికారులు అన్యాయం చేశారు. ఇప్పటికైనా మా గ్రామంలోనే మా ఓట్లు వేసుకునేలా చూడాలి. – విశ్వనాథ్, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్ను ఇక్కడే ఏర్పాటుచేయాలి నాకు 72 ఏళ్లు. ఎన్నో ఏళ్లుగా మా ఊరిలోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. అలాంటిది.. ఇప్పుడెందుకు మార్పు చేస్తున్నారో అర్ధంకావడంలేదు. పోలింగ్ బూత్ను ఇక్కడే ఏర్పాటుచేయాలి. వేరే గ్రామానికి తరలించడం మంచిది కాదు. – మస్తాన్, నల్లగొండువారిపల్లి20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూలేదు. ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలోని పక్క గ్రామానికి వెళ్లాలి. 20 ఏళ్లుగా నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. – అర్జున్, నల్లగొండువారిపల్లి ఓడిపోతారనే భయంతోనే నల్లగొండువారిపల్లిలోనే పోలింగ్ బూత్ను ఏర్పాటుచేయాలి. ఉన్నట్లుండి బూత్ను తరలించడం మంచి పద్ధతి కాదు. ఓడిపోతారనే భయంతోనే కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. – నరసింహారెడ్డి, నల్లగొండువారిపల్లివేరే గ్రామానికి మార్చడం మంచి పద్ధతి కాదు మా ఊరి పోలింగ్ బూత్ ఓటర్లను నల్లపురెడ్డిపల్లెకు మార్చడం సరికాదు. ఎన్నో ఏళ్ల నుంచి మా ఊరి పోలింగ్ కేంద్రంలోనే మా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు వేరే గ్రామానికి మార్చడం మంచి పద్ధతి కాదు. – ఆదినారాయణ, నల్లగొండువారిపల్లిఅక్కడకెళ్లి ఓటు వేయాలంటే ఇబ్బందేనల్లపురెడ్డిపల్లికు వెళ్లి ఓట్లు వేయాలంటే ఇబ్బందులు పడాలి. మా ఊర్లోని ఓటర్లను నల్లపురెడ్డిపల్లి పోలింగ్ కేంద్రానికి మార్చడంవల్ల పోలింగ్ రోజు వ్యయ ప్రయాసలు అవుతాయి. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. – చెన్నకేశవరెడ్డి, నల్లగొండువారిపల్లి -
రౌడీయిజం వికటాట్టహాసం
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యయుతంగా గెలవడం అసాధ్యమని ఆదిలోనే గ్రహించిన సీఎం చంద్రబాబు తొక్కని అడ్డదారులు లేవు.. సామ దాన భేద దండోపాయాలను వాడిగా ప్రయోగించినా విజయం దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామనే దుగ్ధతో అరాచకాలకు మరింతగా పదును పెట్టారు. కాలకేయులు.. పిండారీలు.. బందిపోట్లను మరిపించే గూండాలతో కూడిన టీడీపీ మూక, రౌడీ గ్యాంగ్కు కొమ్ముకాసే కొంత మంది పోలీసు అధికారులను ముఠాగా ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియను హైజాక్ చేసే కుట్రకు తెర తీశారు.వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై అత్యంత కిరాతకంగా పాశవికంగా దాడులు చేసి, దౌర్జన్యం చేసి పోలింగ్ శాతాన్ని తగ్గించడం– పోలింగ్ బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకోవడం, ఈ అరాచకకాండ బయటకు తెలియ నీయకుండా చేసేందుకు మీడియాను కూడా పోలీసులతోనే కట్టడి చేయిస్తున్నారు. దేశ చరిత్రలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఈ స్థాయిలో వికృత దాడులు, దౌర్జన్యాలు.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలాలు లేవంటూ సీనియర్ రాజకీయ నేతలు నివ్వెరపోతున్నారు.14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం సీఎం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడం.. ఆ రెండు స్థానాల్లో టీడీపీ ఘోర పరాజయం పొందడం ఖాయమని తాను నిర్వహించిన అంతర్గత సర్వేల్లో తేలి పోవడంతో సీఎం చంద్రబాబు విద్యార్థి దశ నుంచే అలవర్చుకున్న రౌడీ రాజకీయానికి మరింత పదునుపెట్టారు.అధికార దుర్వినియోగానికి పరాకాష్ట పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆ మండలాల్లోనే వైఎస్సార్సీపీ కీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలపై సీఎం చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి బైండోవర్ కేసులు పెట్టించారు. వందల కొద్దీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెరకపోవడంతో.. కోట్ల కట్టలను వెదజల్లి ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రలోభపర్వం కూడా బెడిసికొట్టడంతో దౌర్జన్యకాండకు తెరతీశారు. సీఎం చంద్రబాబు రచించిన పథకం మేరకు.. ఆగస్టు 5న పులివెందులలో ఓ పెళ్లికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు వికృతంగా దాడి చేశారు.ఆగస్టు 6న నల్లగొండువారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం చేయించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఈ దాడి కళ్లెదుటే జరుగుతున్నప్పటికీ ప్రేక్షక ప్రాత వహించారు. పోలీసులు అధికార టీడీపీకి ఏకపక్షంగా వత్తాసు పలుకుతుండటం అడుగడుగునా కనిపిస్తోంది. ఏకంగా డీజీపీ కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అరాచకం, రౌడీయిజం, పోలింగ్ బూత్ల మార్పిడిపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తుండటం దుర్మార్గం. ఓటింగ్ క్యాప్చర్ లక్ష్యం⇒ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే అధికారులు వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు గ్రామాల పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఒక ఊరిలోని ఓటర్లు మరో ఊరికి వెళ్లి ఓటు వేసేలా సరికొత్తగా ‘జంబ్లింగ్’ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామాల ప్రజలు ఓటేయడానికి వెళ్లనివ్వకుండా బెదిరించడం, భౌతికదాడులకు పాల్పడి భయపెట్టడం, తద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించడం, రిగ్గింగ్కు పాల్పడేందుకు పన్నాగం పన్నారు.⇒ మరోవైపు ప్రచారం ముగియడంతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు గుంపగుత్తగా ఓట్లు కొనేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇంత దారుణం జరుగుతుంటే సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్కుమార్లు ప్రకటించారు. ఇప్పటికే ఓటర్లు స్లిప్పులు 95 శాతం పంపిణీ చేశామని చెప్పారు. వాస్తవానికి స్లిప్పులు ఓటర్లకు చేరలేదు. ⇒ ఎన్ని అక్రమాలు చేసినా విజయ సూచనలు ఏమాత్రం కనిపించక పోవడంతో అరెస్టులు, దౌర్జన్యాలపై టీడీపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తప్పుడు ఫిర్యాదుతో నల్లగొండుగారిపల్లిలో జరిగిన దాడిలో బాధితులపైనే వేల్పుల రాము సహా 50 మందిపై రివర్స్లో ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని.. పోలింగ్ రోజున వారంతా ఉండకుండా అరెస్టులకు ఉపక్రమించారు. తద్వారా పోలింగ్ ప్రక్రియను టీడీపీ గూండాలు హైజాక్ చేసేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. ⇒ టీడీపీ నేతల దాడులకు నిరసనగా పులివెందులలో వైఎస్సార్సీపీ చేసిన శాంతి ర్యాలీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనంటూ మరో 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గోటూరు చిన్నప్పలకు నోటీసు జారీ చేశారు. ఇంకా వైఎస్సార్సీపీ నేతల వేట కొనసాగుతూనే ఉంది.సోమవారం రాత్రి లోగా టీడీపీ పెద్దలు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసి స్వామిభక్తి చాటుకునే పనిలో కొంత మంది అధికారులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ నాటికి వైఎస్సార్సీపీ క్రియాశీలక నేతలెవ్వరు బయట ఉండకుండా చేయాలనే లక్ష్యం మేరకు ఏకపక్ష చర్యలు తీవ్రతరమయ్యాయి. తద్వారా పూర్తిగా టీడీపీ అనుకూల ఓటింగ్కు రంగం సిద్ధం చేస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఇంతగా ఖూనీ కావడంపై.. వ్యవస్థలు నిర్వీర్యం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు..ఈసీ ఆదేశాలూ టీడీపీ బేఖాతర్
సాక్షి,వైఎస్సార్: జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్టవేశారు. హరిత హోటల్ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మకాం వేశారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు హరిత హోటల్ వేదికగా కుట్ర రాజకీయాల్ని నెరుపుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, హోటల్ యాజమాన్యం, స్థానిక పోలీసుల మద్దతుతో కూటమి నేతలు అక్కడే ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేసే వ్యక్తి కాదని జగన్ దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘చంద్రబాబు కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్ను పోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు’ అని జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాల్ని వైఎస్ జగన్ ట్వీట్ రూపంలో ప్రస్తావించారు. .@ncbn అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే… pic.twitter.com/MaZrGo174C— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2025 1. పులివెందుల, ఒంటిమిట్ట ZPTCల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందలమంది వైయస్సార్సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారంచేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.2. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్రెడ్డి, సైదాపురం సురేష్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికిదిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.3. ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ MLC రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్యచేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లెవద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు,రాళ్లు, రాడ్లతో దాడిచేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కార్ని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నంకూడా చేశారు. రమేష్ యాదవ్కు గాయాలుకాగా, తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈరకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.4. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6, మధ్యాహ్నం 3.30గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడిచేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముసహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు హత్యాయత్నం కేసుపెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింతమంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.5. ఆగస్టు8, వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడ్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమవైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని, తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైయస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీచేశారు.6. ఆగస్టు8: అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు4వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఈ రకంగా ఇబ్బందిపెట్టి, వీళ్లు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడ్డం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్ను తగ్గించడం, బూత్లను ఆక్రమించుకుని రిగ్గింగ్కు పాల్పడ్డం, చంద్రబాబుగారు ఈమాదిరి కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్లను అడ్డగోలుగా ఎలా మార్చారన్న టేబుల్ను అటాచ్ మెంట్లో ఉంది. పరిశీలించగలరు)7. ఆగస్టు8 రాత్రి, నల్లగొండువారిపల్లెవద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీకేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్లు బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్స్టేషన్లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వారిమీదకూడా ఎస్సీ, ఎస్టీకేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వీరిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.8. ఇక ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారు. వారిపై దాడులకూ సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి.అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
పులివెందులలో టీడీపీ అరాచకాలు.. డీజీపీ ఆఫీస్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై తక్షణం స్పందించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం ఆదివారం.. డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. గత నాలుగు రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు.దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు ఇంతగా అధికారపార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ ఇప్పటికైనా స్పందించి, ప్రజాస్వామ్య రక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా పార్టీ నేతలు వినతిపత్రంలో కోరారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా పోలీసుల తీరు: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒకవైపు, కూటమి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు చూస్తుంటే, పోటీ కూటమి పార్టీలతో కాదు, పోలీసులతోనే అని అర్థమవుతోంది.పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు. దాడులకు గురైన మా పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధిస్తారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు. ఇదీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిస్తే, అది పోలీసులు గెలిచినట్లుగా భావించాలి. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి గురించి వినలేదు.డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి.. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా డీజీపీ నుంచి సమయం ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు? ఎవరి ఒత్తిడితో డీజీపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధి బృందం నుంచి కనీసం స్వేచ్ఛగా వినతిపత్రంను కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు? మరోవైపు ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రామాలకు మార్చేశారు. ఓటర్లు ఏ ధైర్యంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? పోలీసులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును టీడీపీ గూండాలు కాలరాస్తుంటే, పోలీసులు వారికి అండగా నిలబడటం దారుణం. ఇప్పటికైనా డీజీపీ కళ్లు తెరవాలి.రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పోలీస్ టోపీపై కనిపించే మూడు సింహాలు నీతీ, నిజాయితీ, ధైర్యం కు మారుపేరు అని ఇప్పటి వరకు ప్రజలు భావిస్తూ వచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీతో పోలీసులు కుమ్మక్కై అరాచక శక్తులకు అండగా నిలుస్తున్న వైనంను చూసిన తరువాత వారి టోపీపై కనిపిస్తున్నవి టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రమే. ఖాకీ యూనిఫారం తీసేసి, పచ్చచొక్కాలతో పోలీసులు పనిచేస్తున్నారు. పులివెందుల్లో జరిగే చిన్న ఎన్నికల్లో ఒక పెద్ద యుద్దంగా మార్చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, పోలీసులు నిర్భందంలోకి తీసుకుంటున్నారు. మరోవైపు నేరుగా టీడీపీ గూండాలు నామినేషన్ వేసిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాపైనే నేరుగా దాడిచేసి, హతమార్చేందుకు ప్రయత్నించారంటేనే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న నాకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, ఒక ప్రతిపక్షంలోని కార్యకర్తల పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీకి బీసీలంటేనే చాలా చులకనభావం. ప్రతిపక్షంకు చెందిన మాజీ మంత్రి విడతల రజిని, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక, ఇప్పుడు నాపైన జరిగిన దాడులే దీనికి నిదర్శనం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే దానికి కూడా సరైన విధంగా స్పందించకపోవడం దారుణం. చట్టాన్ని కాపాడే స్థానంలో ఉన్న వారే చట్టాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాటకే విలువ ఉండదు. రాజ్యాంగ స్పూర్తిని నీరుగారుస్తున్నారు: మేరుగు నాగార్జునపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నంచి టీడీపీకి చెందిన వారు దాడులు, దౌర్జన్యాలతో మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం పాలు చేసేలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పులివెందుల్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలో స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను, కార్యకర్తలను కూడా భయబ్రాంతులకు గురి చేసేందుకు తెగబడ్డడారు.ఈ నెల అయిదో తేదీన ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పలువురు నాయకులుపై కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్ళతో పది వాహనాల్లో వచ్చిన టీడీపీ అరాచక శక్తులు దాడికి పాల్పడ్డాయి. ఏకంగా వారి వాహనాలపై పదిలీటర్ల పెట్రోల్ కుమ్మరించి వారిని సజీవంగానే దహనం చేసే దారుణానికి సిద్ధపడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములు గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వద్దకు వెళితే ఆయన కూడా పట్టించుకోలేదు. దీనిపై చట్టప్రకారం పోలీసులు వ్యవహరించేలా చూడాలని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.ఆయన దీనిపై స్పందిస్తూ పత్తేపారం కోసం ఆ గ్రామానికి వెళ్ళారా... మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేకపోతే తలలు తెగిపోయేవే' అంటూ చాలా హేళనగా మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ పచ్చచొక్కాలు వేసుకున్న వారిలా అధికారపార్టీకి అండగా నిలబడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని పోలీస్ వ్యవస్థే నీరుగారుస్తోంది. పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతుంటే, దానిని కూడా సహించలేక ఎవరైతే మాపైన దాడుల చేశారో వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని, బాధితులైన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకానికి, పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషంగా చంద్రబాబు పాలన సాగుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.పులివెందులలో టీడీపీ దౌర్జన్యం: మల్లాది విష్ణుమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పులివెందులలో టీడీపీ దౌర్జన్యం చేసి హింసను ప్రోత్సహిస్తోంది. మా నాయకులపై బైండోవర్లు పెట్టించారు. పోలింగ్ స్టేషన్లు నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చేశారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని టీడీపీ చూస్తోంది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ దిగజారిపోయి వ్యవహరిస్తోంది. కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసుల తీరు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టంమవుతోందిటీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలపై రివర్స్లో కేసులు పెడుతున్నారు. ఈ మొత్తం తతంగానికి బాస్ డీజీపీనే. బాధితులపైనే తిరిగి కేసులు పడుతున్నారు. పోలీసుల తీరును న్యాయ స్థానాలు తప్పుపడుతున్నా వారు మారడం లేదు. పులివెందులలో మంత్రులకు,ఇతర ఎమ్మెల్యేలకు పనేంటి?. బయటి ప్రాంతాల నుంచి పులివెందులలో తిష్టవేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలను తక్షణమే పులివెందుల నుంచి బయటికి పంపించాలి. సత్వరమే డీజీపీ చర్యలు తీసుకోవాలి. డీజీపీ వాట్సాప్ నెంబర్కు కూడా మా ఫిర్యాదును పంపిస్తాం. టీడీపీ రౌడీయిజం, గూండాయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత డీజీపీ పైన ఉంది.చంద్రబాబు పతనానికి ఇది నాంది: మేయర్ భాగ్యలక్ష్మివిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మేమేమీ సంఘ విద్రోహ శక్తులం కాదు. మేం ప్రజాప్రతినిధులం. డీజీపీ కార్యాలయంలోకి మమ్మల్ని పంపించడానికి సమాలోచనలు చేయడమేంటి?. మేం చెప్పులరిగేలా ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాం. మాట్లాడితే నేను 40 ఏళ్ల సీనియర్నంటూ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. పులివెందుల ఎన్నికల్లో ఇంతలా దిగజారిపోవాలా?. చంద్రబాబు పతనానికి ఇది నాంది గుర్తుంచుకోండి. -
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. చివరికి అరాచకానికి కూడా తెరలేపింది. ఉప ఎన్నిక గండం గట్టెక్కేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలు బట్టబయలవుతున్నాయి.ఓటర్ల జాబితా గందరగోళంగా తయారైంది. గతంలో వేసిన పోలింగ్ బూత్లను మార్చేసిన అధికారులు.. గ్రామాల్లో ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేయలేదు. మొత్తం 15 పోలింగ్ బూత్లలోనూ ఓటర్ల జాబితా జంబ్లింగ్ జరిగింది. ఓటింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రల చేస్తున్నారు.సరిగ్గా 8 ఏళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేతగా.. సీఎంగా చంద్రబాబు లెక్కలేనన్ని కుట్రలు పన్నారు. వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కారు. మోసపు హామీలెన్నో ఇచ్చారు. ఓటర్లకు తాయిలాల ఆశ చూపెట్టారు... వినకుంటే బెదిరించారు. తాజా గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే ఫార్మూలాను అమలు చేస్తున్నారు. వందలాది మందికి ఉద్యోగ జాయినింగ్ లెటర్లు ఇస్తున్నారు. వేలాది మందికి ఏవేవో ఆఫర్లు ఇస్తున్నారు. అయినప్పటీకీ ఇవేవి పనిచేసేలా లేవని ఏకపక్ష పోలింగ్ కోసం చేపట్టాల్సిన చర్యలన్నీ ఎంచుకున్నారు. అదీ కూడా కుదరదంటే ఏకంగా బ్యాలెట్ బాక్సులే మారుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు.పులివెందుల జెడ్పీటీసీ సీటు ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామంటూ .. టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉద్యోగం కావాలా? జాయినింగ్ లెటర్ రెడీ ఎన్నికల తర్వాత మీ బిడ్డల్ని ఉద్యోగంలో చేర్పించండి. లేదు డబ్బులు కావాలా? గుంప గుత్తగా ఎంతో చెప్పండి ఇస్తాం. అలా కాదంటారా...ఓటుకు వెళ్లొద్దు ఇదో ఇది ఉంచుకోండి. ఇంకా కాదు కూడదంటే బడితె పూజ తప్పదు.. ఇలా పులివెందులలో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో బరి తెగిస్తున్నారు. కుదిరితే ప్రలోభాలతో.. కాదంటే బెదిరింపులతో ముందుకు సాగుతున్నారు.వైఎస్సార్సీపీకి చెందిన క్రియాశీలక నేతలందర్నీ కట్టడి చేసే ఎత్తుగడను టీడీపీ ఎంచుకుంది. అందుకు వ్యవస్థలు అనుకూలంగా నిలుస్తున్నాయి. పోలింగ్ జనరల్ ఏజెంటు కూడా క్రియాశీలక నేతకు ఇవ్వకూడదనే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి పోలింగ్ జనరల్ ఏజెంటుగా నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. ఆమేరకు అనెగ్జర్–15, ఫారం–11కు ఒరిజనల్ ఆధార్, ఓటరు కార్డు జత చేశారు. శనివారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కు లెటర్ పెట్టుకున్నారు.దీనికి కూడా టీడీపీ నేతల నుంచి క్లియరెన్సు వస్తే తప్ప ఇవ్వమనే దిశగా అధికారులు బాహాటంగా వ్యాఖ్యనిస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు, వ్యవస్థలు అండతో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. వరుస హత్యాయత్నం ఘటనలతో ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న నేపఽథ్యంలో టీడీపీ కేవలం వ్యవస్థల ఆధారంగా పోలింగ్ నిర్వహించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికలు నిర్వహించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని మండి పడింది. దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్కుమార్ యాదవ్, సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్కుమార్, సుధాకర్బాబు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తదితరులను పోలీసులు బయటే ఆపేయడంతో తోపులాట జరిగింది. దీంతో వారంతా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరుగుతూ వాగ్వాదానికి దిగారు.‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి విడనాడాలి..’ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వారిని వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు అనుమతించారు. పోలింగ్ బూత్లు మార్చడానికి వీల్లేదని, బైండోవర్ కేసులు పెట్టి కనిపించకుండా దాచిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని వారు ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దయనీయం.. ఘోరం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, దయనీయంగా, ఘోరంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కళ్లు, చెవులు మూసుకొని కమిషన్ ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రోత్సహించడం కోసం, ఓటింగ్ శాతం పెంచడానికి వ్యవస్థను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సింది పోయి.. పులివెందులలో అందుకు విరుద్ధంగా ఓటర్లకు దూరంగా పోలింగ్ కేంద్రాలను తీసుకెళుతుండటం దారుణం. – పేర్ని నాని, మాజీ మంత్రి దేవుని దయవల్ల బతికి బయట పడ్డానుబీసీ సామాజిక వర్గానికి చెందిన నాపై అతి ఘోరంగా బండరాళ్లు, సుత్తులతో దాడి చేశారు. పెట్రోలు పోసి నన్ను చంపేందుకు ప్రయతి్నంచారు. దేవుని దయతో బతికి బట్ట కట్టాను. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తామే గెలవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చారు. – రమేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఈ అధికారం శాశ్వతమా? పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే ఇక్కడ మమ్మల్ని పోలీసుల చేత నెట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ఎందుకంత కండకావరం? ఈ అధికారం శాశ్వతమా? – టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల కమిషనర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. – దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
ఏపీకే ఫైల్.. బీ కేర్ ఫుల్ !
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ఏపీకే (అండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైల్స్) ద్వారా ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. మోసం చేసే విధానం.. ● నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్ట్రాగామ్ ద్వారా ఒక లింక్ పంపుతారు. ● డెలివరీ బాయ్, రీఫండ్ లింక్, డిజిటల్ కేవైసీ, ఎస్బీఐ, రివార్డ్స్ అప్డేట్, ఫ్రీ గిఫ్ట్, అర్జెంట్ డాక్యుమెంట్, ఈ–చలానా, పీఎం కిసాన్ వంటి పేర్లు గల లింక్తో వినియోగదారులను ఆకర్షిస్తారు. ● ఆ లింక్ ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడు దాన్ని యాప్ అనుకుని ఇన్స్టాల్ చేస్తాడు. ● ఆ యాప్ పర్మిషన్స్ (అనుమతులు) అడుగుతుంది. ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాక్స్, స్టోరేజ్, నోటిఫికేషన్స్, అసెస్బులిటీ తదితరాలు అనుమతులు ఇచ్చిన వెంటనే ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది. ● ఫోన్లోని ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది. ● కొన్నిసార్లు యూపీఐ యాప్లను కూడా నేరుగా యాక్సెస్ చేసి ఖాతాలోని డబ్బును దొంగిలిస్తారు. ● అదనంగా, కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్మెయిల్కు కూడా ప్రయత్నిస్తున్నారు. అమాయకులే లక్ష్యం అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. ● ప్లే స్టోర్ తప్ప మరో వేదికల నుంచి ఏ యాప్ను డౌన్లోడ్ చేయకండి. ● గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దు. ● ఫోన్లోని ప్రతి యాప్కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించాలి. ● బ్యాంక్ అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు. ● మీరు ఫోన్లో అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే వెంటనే ఆ యాప్ను అన్ ఇన్స్టాల్ చేయండి. ● మొబైల్ను రీసెట్ చేసి ట్రస్ట్ చేసిన యాప్లను మాత్రమే తిరిగి ఇన్స్టాల్ చేయాలి. ● ఫోన్లో భద్రతాపరమైన భరోసా ఇచ్చే యాప్ (యాంటీ వైరస్/యాంటీ మాల్వర్) ఉపయోగించాలి ● బ్యాంకింగ్ అప్లికేషన్లలో బయోమెట్రిక్/2–ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడాలి. మోసానికి గురైతే.. ● తక్షణం 1930 నంబర్కు కాల్ చేయాలి (నేషనల్ సైబర్ హెల్ప్లైన్) ● డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సైబర్ క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. ● మీ దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ● ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహనతో ఉండాలి. నేటి మోసాలు ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ● సైబర్ భద్రత జాగ్రత్తలు పాటించి మోసాల నుంచి దూరంగా ఉండాలి. ● ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ వాట్సాప్ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు. ● మీరు ఏపీకే ఫైల్స్ లింకును క్లిక్ చేసిన వెంటనే ఆ లింకు మీరు ఉన్న అన్ని గ్రూపులలో కూడా ఫార్వర్డ్ అవుతుంది. ● ఏపీకే ఫైల్స్ లింకులను క్లిక్ చేయకూడదని సూచిస్తున్నాం. ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ మోసాలు లింకులను క్లిక్, డౌన్లోడ్ చేస్తే వెంటనే వాట్సాప్ హ్యాక్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి -
బాబు మెప్పు కోసమే టీడీపీ నేతల కుట్రలు
పులివెందుల: ఎంతోమందికి వైఎస్సార్ కుటుంబం రాజకీయ బిక్ష పెట్టిందని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో మార్పు ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు మెప్పు పొందడం కోసం టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ‘తలకాయలు లేచిపోయేవి కదా’.. అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆలోచించాలన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నామని, రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం కోసమో...తెలుగుదేశం పార్టీ బాగుందనో ప్రజలను నమ్మించడానికి నానా పాట్లూ పడుతున్నారన్నారు. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలు వైఎస్ కుటుంబం చేసిన మంచిని మరిచిపోరన్నారు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడిందని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడాల్సిన టైం వచ్చిందని.. కచ్చితంగా బలంగా నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినదని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుస్తామని అవతలి వాళ్లకు అంత నమ్మకం ఉంటే శాంతియుత వాతావరణంలో సీసీ కెమెరాల నీడలో ఎన్నికలను నిర్వహించాలని అధికారులకు విన్నవించాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి -
ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం
చిన్నమండెం : ట్రాక్టర్ ఒరగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మజ్హీసింగ్(23), గలగసింగ్(20), లక్ష్మణ్సింగ్లు చిన్నమండెం–పెద్దమండ్యం జాతీయ రహదారిలో హైవోల్టేజీ విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. పనులు ముగించుకొని ట్రాక్టర్లో చిన్నమండెంకు వస్తుండగా పడమటికోన గ్రామం తొగటపల్లె సమీపంలో ట్రాక్టర్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో మజ్హీసింగ్(23), గలగసింగ్(20) అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్సింగ్కు గాయాలయ్యాయి. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వృద్ధురాలి మృతి సిద్దవటం : కడప రిమ్స్లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన పడిఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని కడప రిమ్స్లో చేర్పించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు ఒంటిమిట్ట సీఐ బాబు, 9121100581, సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ 9121100584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాదంలో గాయపడి.. కోలుకోలేక..ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాలు... స్థానిక మండల కేంద్రం ఇందిరా కాలనీకి చెందిన వెంకటరమణ, భార్య శాంతమ్మలు కలిసి గత గురువారం ద్విచక్రవాహనంలో పనుల మీద మదనపల్లెకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో వేపూరికోట వద్ద శాంతమ్మ చీర బైక్ చక్రానికి చుట్టుకొని కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య గాలివీడు : మండలంలోని కొర్లకుంట పంచాయతీ పెద్దరెడ్డివారిపల్లెకు చెందిన నిర్జీ శంకరయ్య (38) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం మేరకు.. మృతుడు రజక వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిని పోషించడంలో అప్పులు ఎక్కువ చేశాడు. వాటిని తీర్చుకోలేక గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో వివాహిత.. రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని సూర్య నగర్లో నివాసముంటున్న విద్యుత్ శాఖ ఏఈ యోగానంద్ భార్య చిన్న రెడ్డెమ్మ (40) శనివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
బ్రహ్మంసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి శనివారం తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈ వెంకటరామయ్య ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సాగర్లోకి 1350 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు వస్తుందన్నారు. రైతులు సాగు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, ఎస్సార్ శ్రీనివాసులరెడ్డి, జోగయ్య, నరసింహులు, సాంబశివారెడ్డి, నారాయణ యాదవ్, శివయ్య యాదవ్, డీఈఈ మురళీమోహన్, ఏఈఈ మద్దం నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీకి రాఖీ కట్టిన ఓం శాంతి అక్కయ్యలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్కు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శాంతి సాధనకు తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సంస్థ ప్రతినిధులు బ్రహ్మకుమారి గీతా అక్కయ్య, సుశీల అక్కయ్య, ఈశ్వరీ అక్కయ్య, ప్రదీప అక్కయ్య పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ కడప రూరల్ : జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ కడప నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వెస్ట్, పొల్యూషన్, ధరల పట్టిక, నీటి వసతి, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే అర్హత కలిగిన సిబ్బంది గురించి ఆరా తీశారు. నిబంధనలను అతిక్రమించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కుమారి తదితరులు పాల్గొన్నారు. జూటూరు డిజిటల్లో ఆఫర్లు ప్రొద్దుటూరు : శ్రావణ మాసం పురస్కరించుకుని జూటూరు డిజిటల్ షోరూంలలో ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ యజమాని జూటూరు మధుసూదన్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం, ఆది వారం ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని జూటూరు డిజిటల్ షోరూంలలో డిస్కౌంట్ ధరలలో ఎలక్ట్రానిక్ పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, హోమ్, కిచెన్ అ ప్లైన్స్తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 50 శా తం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నట్టు తెలిపా రు. జీరో శాతంతో వడ్డీ రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ను ఇస్తున్నట్లు తెలిపారు. -
కడప– బద్వేలు మార్గంలో కూలిన వంతెన
సిద్దవటం : కడప– బద్వేలు మార్గంలోని అటవీ ప్రాంతంలో సాహెబ్ బావి రహదారికి సమీపంలో కిటికీల వంతెన శనివారం కూలిపోయంది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ రహదారి గుండా నెల్లూరు, బద్వేలు కలువాయి, పోరుమామిళ్ల తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వెళుతుంటారు. 1983లో ఈ వంతెన నిర్మించారు. శనివారం అధిక లోడుతో వాహనాలు ప్రయాణించడంతో వంతెన కూలిపోయిందని ద్విచక్ర వాహనదారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి ప్రయాణికులు ఎవరినీ రోడ్డు దాటనీయకుండా చర్యలు చేపట్టారు. అధికారులు రెండు జేసీబీ యంత్రాలతో వంతెన పక్కనే అప్రోచ్ రోడ్డుకు చర్యలు చేపట్టారు. ఈ పనులను బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ పరిశీలించారు. అనంతరం సాయంత్రానికి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. -
గండి క్షేత్రం.. జనసంద్రం
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసి పోయింది. శ్రావణ మాసం మూడవ శనివారోత్సవం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లు భక్తులతో రద్దీగా మారాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు అద్దాలమర్రి క్రాస్, ఇడుపుల పాయ క్రాస్ల వద్దనే వాహణా లను నిలిపి వేశారు. వృద్ధులు, మహిళల కోసం వేంపల్లె ప్రైవేట్ పాఠశాలల వారు ఉచితంగా వ్యాన్లు ఏర్పాటు చేశారు. కొందరు వేంపల్లె చక్రాయపేట,నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సహాయకమీషనర్ వెంకటసుబ్బయ్య చైర్మన్ కావలి కృష్ణతేజ పాలకమండలి సభ్యులతో పాటు,ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య,ఆర్కేవ్యాలీ ఎస్సై రంగారావు ఆద్వర్యంలో సుమారు 200 మంది పోలీ సులు బందో బస్తు నిర్వహించారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, అర్చకులు కేసరి,రాజారమేష్, అర్చకులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఏర్పాట్లలో విఫలం.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ తగు ఏర్పాట్లు చేయడంలో అదికారులు విఫలమయ్యారు. క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ వర్గాలకు సంబంధించి వచ్చిన బంధుమిత్రులకే ఇక్కడ రాచ బాటలు ఉన్నాయని విధులకు వచ్చిన వారికి అవమానాలే దక్కుతున్నాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు -
● దౌర్జన్యం...రౌడీయిజం
సాక్షి ప్రతినిధి, కడప: సరిగ్గా 8 ఏళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేతగా.. సీఎంగా చంద్రబాబు లెక్కలేనన్ని కుట్రలు పన్నారు. వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కారు. మోసపు హామీలెన్నో ఇచ్చారు. ఓటర్లకు తాయిలాల ఆశ చూపెట్టారు... వినకుంటే బెదిరించారు. తాజా గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే ఫార్మూలాను అమలు చేస్తున్నారు. వందలాది మందికి ఉద్యోగ జాయినింగ్ లెటర్లు ఇస్తున్నారు. వేలాది మందికి ఏవేవో ఆఫర్లు ఇస్తున్నారు. అయినప్పటీకీ ఇవేవి పనిచేసేలా లేవని ఏకపక్ష పోలింగ్ కోసం చేపట్టాల్సిన చర్యలన్నీ ఎంచుకున్నారు. అదీ కూడా కుదరదంటే ఏకంగా బ్యాలెట్ బాక్సులే మారుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు. ఓటర్లకు ఆశల ఎర.. పులివెందుల జెడ్పీటీసీ సీటు ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామంటూ .. టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉద్యోగం కావాలా? జాయినింగ్ లెటర్ రెడీ ఎన్నికల తర్వాత మీ బిడ్డల్ని ఉద్యోగంలో చేర్పించండి. లేదు డబ్బులు కావాలా? గుంప గుత్తగా ఎంతో చెప్పండి ఇస్తాం. అలా కాదంటారా...ఓటుకు వెళ్లొద్దు ఇదో ఇది ఉంచుకోండి. ఇంకా కాదు కూడదంటే బడితె పూజ తప్పదు.. ఇలా పులివెందులలో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో బరి తెగిస్తున్నారు. కుదిరితే ప్రలోభాలతో.. కాదంటే బెదిరింపులతో ముందుకు సాగుతున్నారు. వ్యవస్థల అండతో గెలుపే లక్ష్యంగా... వైఎస్సార్సీపీకి చెందిన క్రియాశీలక నేతలందర్నీ కట్టడి చేసే ఎత్తుగడను టీడీపీ ఎంచుకుంది. అందుకు వ్యవస్థలు అనుకూలంగా నిలుస్తున్నాయి. పోలింగ్ జనరల్ ఏజెంటు కూడా క్రియాశీలక నేతకు ఇవ్వకూడదనే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి పోలింగ్ జనరల్ ఏజెంటుగా నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. ఆమేరకు అనెగ్జర్–15, ఫారం–11కు ఒరిజనల్ ఆధార్, ఓటరు కార్డు జత చేశారు. శనివారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కు లెటర్ పెట్టుకున్నారు. దీనికి కూడా టీడీపీ నేతల నుంచి క్లియరెన్సు వస్తే తప్ప ఇవ్వమనే దిశగా అధికారులు బాహాటంగా వ్యాఖ్యనిస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు, వ్యవస్థలు అండతో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. వరుస హత్యాయత్నం ఘటనలతో ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న నేపఽథ్యంలో టీడీపీ కేవలం వ్యవస్థల ఆధారంగా పోలింగ్ నిర్వహించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల ఎన్నికల వేళ.. బాబు మాటలు.. తాయిలాలు! ‘మీరు మాకే ఓటు వేయాలి.. గెలిస్తేనే ఇళ్లు కడతాం..’ కొత్తగా 10 వేల పెన్షన్లు కేటాయింపు.. ముస్లీం మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని మహిళకు కుట్టు మిషన్ల పంపిణీ 40 వేల మంది డ్వాక్రా మహిళలు అకౌంట్లలో రూ.4 వేలు చొప్పున డబ్బులు జమ 20 మంది మంత్రులు అక్కడే ఉండి రూ.200కోట్లు ఖర్చు చేశారు. ‘నేనిచ్చిన పెన్షన్ తీసుకొంటూ, నేనిచ్చిన రేషన్ తింటూ నేను వేసిన రోడ్డు మీద తిరుగుతూ నాకు ఓటు వేయకపోతే నేను మాత్రం మీకు ఎందుకు ఇవ్వాలి’అని సీఎం హోదాలో చంద్రబాబు ఆ రోజు అమలు చేసిన ఫార్మూ లానే పులివెందులలోనూ ప్రయోగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కళ్లముందు కళకళలాడుతున్న అభివృద్ధి పులివెందులలో అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా అనేది అందరికీ తెలిసిందే. మరోవైపు టీడీపీకి పులివెందులలో నిర్థిష్టమైన అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదు. అదే వైఎస్సార్సీపీకి కోకొల్లలు. విద్యారంగంలో జేఎన్టీయూ, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నాడు–నేడు స్కూల్స్, ఫుడ్ సైన్స్ కాలేజి ఏర్పాటును గుర్తు చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో వైఎస్సార్ మెడికల్ కళాశాల, నర్శింగ్ కళాశాల, ఉపాధి రంగంలో యూసీఐల్, ఆదిత్య బిర్లా ఫ్యాష న్స్, గోవిందరాజా టెక్స్టైల్స్, వ్యవసాయ రంగంలో చీని మార్కెట్ యార్డ్, బనానా రీసెర్చ్ సెంటర్, వాటర్ ఇరిగేషన్ ఐజిసీఏఆర్ఎల్ (ఐజీ కార్ల్), డాక్టర్ వైస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ విస్తరింపు.. ఇలా ఎన్నో..ఎన్నెన్నో. ఇక నీటివనరుల గురించి చెప్పుకుంటే గండికోట, మైలవరం ఆధునికీకరణ, పైడిపాలెం, చిత్రావతి విస్తరణ, చిత్రావతి రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాలే తమ అభివృద్ధిని వివరిస్తాయి. రోడ్లు–భవనాలు గురించి బెంగుళూరు – విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్స్, విలేజ్ కనెక్టివిటీ రోడ్స్, సచివాలయాలు, వరల్డ్ క్లాస్ ఆర్టీసీ బస్టాండ్, క్రికెట్ స్టేడియం, మినీ సెక్రటేరియట్, ఉలిమెల్ల లేక్వ్యూ, రాణి తోపు చెప్పకనే చెబుతాయి. వెల్ఫేర్ ఆక్టివిటీస్, 20వేల జగనన్న ఇల్లు ఇలా.. అభివృద్ధి పనుల గురించి ఓటర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి చేశామనే స్థితిలో టీడీపీ లేదు. దీంతోనే ఆ పార్టీ వక్రమార్గాలు ఎంచుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అభివృద్ధి చేయకపోగా.. వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకున్న నీచపు నైజం టీడీపీది.. ఆపార్టీ అధినేతది. రూ.530కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాలలో మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లు కూడా వద్దని చెప్పిన నేపధ్యం. ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం చెప్పుకునేందుకు ఏమి లేకపోవడంతోనే రౌడీయిజం చేస్తూ, దౌర్జన్యాలకు దిగుతున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓటర్లు ఓటుకు వెళితే వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుపై పడుతుందనే నమ్మకంతోనే పోలింగ్ కూడా ఏకపక్షంగా చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు వ్యవస్థలను సమర్థవంతంగా వాడుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. నంద్యాల తరహాలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక! వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు. మోసపు హామీలు.. ఇప్పుడూ అంతే! ఎలాగైనా గెలవాలంటూకేడర్కు బాబు దిశా–నిర్దేశం క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న తెలుగుతమ్ముళ్లు -
విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్/రూరల్ : రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేసి తక్షణమే విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడెం రెడ్డిబాబు డిమాండ్ చేశారు. శనివారం కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విద్యా హక్కు చట్టం అమలు చేస్తారా? లేదా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి బీసీ, ప్రజా, విద్యార్థి సంఘాలు అనుమతి లేకుండా ప్రవేశించరాదని జీఓ జారీ చేయడం దారుణమన్నారు. ఈ జీఓ కారణంగా ఆయా విద్యా సంస్థల యాజమన్యాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముదిరాజ్ కులస్తులు చైతన్యవంతులు కావాలి రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు చైతన్యవంతులై తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడెం రెడ్డిబాబు పిలుపునిచ్చారు. శనివారం కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్, ఉపాధ్యక్షులుగా మణికుమార్, వివేకానంద, ప్రధాన కార్యదర్శిగా సునీల్, కార్యదర్శిగా నరసింహులుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ముదిరాజ్లను ప్రస్తుతం ఉన్న బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మార్చి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ముదిరాజ్ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్కు ఇవ్వడం తగదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : విజయవాడ నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ గవర్నరుపేట 1–2 డిపోలకు, పాత బస్టాండుకు సంబంధించిన నాలుగు వందల కోట్ల రూపాయల విలువ గల 4.15 ఎకరాల స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోసుబాబు, రామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం కడపలోని అసోసియేషన్ జోనల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ రెండు డిపోలలో 200 బస్సులతో పాటు 1100 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తూ ఓ పారిశ్రామికవేత్తకు జీఓ నంబర్. 137 ద్వారా కట్టబెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. గవర్నరుపేట డిపోలకు 1, 2, పాత బస్టాండ్ స్థలాన్ని 1959లో గజం రూ. 16 చొప్పున సుమారు నాలుగు లక్షల ఆరు వేల రూపాయలకు ప్రభుత్వం కేటాయించిన రేటుకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఇలాంటి విలువైన స్థలాన్ని వ్యాపార వేత్తలకు ధారాదత్తం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యం.మల్లికార్జున, కడప డిపో అధ్యక్షుడు ఈ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ విల్సన్, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనుడు, పీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు -
ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్సార్సీపీదే
ఒంటిమిట్ట: తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ఈ నెల 12న జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించేది వైఎస్సార్సీపీయేనని వైఎస్సార్సీపీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేశారు. .శనివారం మండల పరిధిలోని మంటపంపల్లి, రామచంద్రాపురం, అచ్చంపేట, ఎస్టీ కాలనీ, పెన్నపేరూరు గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి ఇరగంరెడ్డి సు బ్బారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట, పులివెందుల అభ్యర్థులను గెలిపించి, వైఎస్ జగన్ మోహన్రెడ్డికి బహుమతిగా అందిస్తామన్నారు. ● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని అన్నారు. ● వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ..పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తీసుకొచ్చారని, కేవలం 8 నెలలు ఉన్న ఈ పదవికి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు. ● ఓటర్లను కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ..ముస్లిం, మైనారిటీలకు మేలు చేసింది ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ అన్నారు. ఇంతటి మేలు చేసిన వారికి మద్దతుగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సుబ్బారెడ్డి ని గెలిపించాలని కోరారు. ● రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..కుప్పంలో గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వంద శాతం వైఎస్సార్సీపీ కై వసం చేసుకోవడంతో సీఎం చంద్రబాబు అవమానాన్ని భరించలేక వైఎస్ జగన్ ఇలాక అయిన కడప జిల్లాలో వైఎస్సార్సీపీ ని ఓడించి జగన్ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారన్నారు. ● మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి మాట్లాడారు. -
ఆటోను ఢీకొన్న కారు
వేంపల్లె : మండలంలోని కత్తులూరు క్రాస్ వద్ద ఆటోను కారు ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న గండ్లూరు పుల్లయ్య (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు ఇచ్చిన వివరాల మేరకు.. మండలంలోని టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన మెకానిక్ వలీ శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా గండి క్షేత్రానికి తన సొంత ఆటోలో కుటుంబ సమేతంగా బయలుదేరాడు. కత్తులూరు క్రాస్ వద్దకు ఆటో రాగానే రాజంపేటకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కారులో పులివెందుల నుంచి రాజంపేటకు వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. దీంతో ఆటో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు కింద పడ్డారు. గండ్లూరు పుల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే డ్రైవింగ్ చేస్తున్న వలీ, చిన్నారులైన సయాన్, మెహిరున్, వలిమాలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ సంఘటనను చూసిన స్థానికులు 108 వాహనం ద్వారా హుటాహుటిన వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన సయాన్, మెహిరున్, వలిమాలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో గండ్లూరు పుల్లయ్య మృతి చెందడంతో వేంపల్లె ప్రభుత్వాసుపత్రి వద్దకు టి.వెలమవారిపల్లె ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు -
వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం
పులివెందుల/వేంపల్లె: పులివెందుల మండల జెడ్పీటీసీ మరోసారి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం పులివెందుల మండల పరిధిలోని నల్లగొండువారిపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి నల్లగొండువారిపల్లె గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి పులివెందుల మండల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాల ని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా ఆ గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. గ్రామంలో మహిళలు రక్షా బంధన్ సందర్భంగా ఎంపీని అన్నగా భావించి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అడుగడుగునా బాణా సంచా పేల్చుతూ గ్రామస్తులు స్వాగతం పలికారు. ప్రచారానికి విచ్చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు విశేష ఆదరణ లభించింది. మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అని చెప్పి అరకొర మందికి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ఒకేసారి రూ 20 వేలు ఇస్తామని చెప్పి మాట మార్చిందన్నారు. గ్రామ ప్రజలు ఏమన్నారంటే... ఎన్నికల ప్రచారంలో తమ ఊరిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పక్క గ్రామానికి తరలించారని ఎంపీ దృష్టికి పలువురు గ్రామస్తులు తీసుకొచ్చారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఎక్కడ కూటమి నేతలు ఓడిపోతారేమోనని వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పోలింగ్ బూత్ ను తమ గ్రామంలోని ఏర్పాట్లు చేయించేటట్లు అధికారులతో మాట్లాడాలని కోరారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, దాడులను పోలీసులు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దుర్మార్గాలను చేస్తున్న టీడీపీ నాయకులకు బుద్ధి వచ్చేలా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఆ గ్రామ ప్రజలు భరో సా ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నాయ కులు నరసింహారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి,వైఎస్ మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ప్రచారం అడుగడుగునా స్వాగతంపలుకుతూ రాఖీలు కట్టిన మహిళలు -
హరిత హోటల్ వేదికగా ఎల్లో పాలిటిక్స్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కడప: ఒంటిమిట్టలో యధేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు మాత్రం పత్తా లేకుండా ఉన్నారు. హరిత హోటల్ వేదికగా తిష్ట వేసిన మంత్రులు.. ఎల్లో పాలిటిక్స్కు తెరలేపారు. హరిత హోటల్ను కూటమి కార్యాలయంగా మార్చేశారు మంత్రులు, టీడీపీ నేతలు. హరిత హోటల్లో మకాం వేసి మంత్రులు.. పచ్చదండు కార్యకర్తలతో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు మంత్రులుగా వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పార్టీ కోసం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే కాకుండా, అదే సమయంలో ప్రభుత్వ వాహనాలను సైతం ఉపయోగిస్తున్నారు. మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నికల కోడ్ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం, ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మాత్రం పత్తాలేకుండా ఉన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి అనుకూలమనే సంకేతాలతో టీడీపీ అధిష్టానం రాష్ట్ర కేబినెట్ను ఇక్కడికి పంపుతోంది . రోజుకొక మంత్రి వస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం కేబినెట్ కదిలిరావడం చూసి ఓటర్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. కులాలవారీగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, జనార్ధన్రెడ్డి, ఫరూఖ్లు ఒంటిమిట్టలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పోలింగ్ నాటికి ఎంతమంది మంత్రులు దిగుతారో చెప్పలేని పరిస్థితి. తమవంతుగా జనసేన నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,ఎమ్మెల్సీ అనురాధలు ఉన్నారు.కాగా, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కొన్ని పరిమితులతో కూడిన అంశం. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయకూడదు. మరి మంత్రులు తమ హోదాలో ఇంత చేస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
‘ఒక గ్రామంలో ఓట్లు మరో గ్రామంలో వినియోగించకోవడం ఏంటి?’
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. ఒక గ్రామంలోని ఓట్లను మరో గ్రామంలోకి వెళ్లి ఓటేసేలా చేయడం వెనుకు ప్రభుత్వం కుట్ర దాగి ఉందని విమర్శించారు.ఒక గ్రామంలో ఓట్లు మరో గ్రామానికి వెళ్లి వినియోగించుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 9వ తేదీ) మాట్లాడిన రాచమల్లు.. ‘వింత పోకడలకు చంద్రబాబు ప్రేరేపిస్తే, ఎన్నికల కమిషన్ సహకరిస్తోంది. చంద్రబాబు ఇగోను సంతృప్తిని పరచడానికి పోలీస్ శాఖ పని చేస్తుంది. మేము శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు కోరుకుంటున్నాం. మాపై మేము దాడులు చేసుకోవడానికి మాకు పిచ్చి, వెర్రి లేదు. వైఎస్సార్సీపీకి సంబంధించిన చివరి కార్యకర్తలను అరెస్టు చేసినా మేము భయపడం. మా పార్టీ మహిళలు బూత్కు వెళ్లి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాడులు, విధ్వంసాలతో నెగ్గాలి అనుకోవడం కుటిల ఆలోచన. 12వ తేదీ పులివెందుల రూరల్ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టడం ఖాయం’ అని రాచమల్లు సృష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ నేత సతీష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. ‘‘నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి. నాపై దాడి జరిగితే లోకేష్, బీటెక్ రవే బాధ్యత వహించాలి’’ అని సతీష్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.‘‘నాకు ఏమైనా జరిగితే సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదు. ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు’’ అంటూ సతీష్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి కల్గిస్తున్నాయి. పోలీస్, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అది మరువక ముందే మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీ, వేల్పుల రాముపై హత్యాయత్నం చేశారు...దాడి చేసిన వారే వైఎస్సార్సీపీ నేతలపై ఎదురు కేసు పెట్టీ ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. ఒక డీఐజీ స్థాయి అధికారి పత్తి వ్యాపారానికి వెళ్లారా అని మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడే తీరు చూస్తే మీకు కానిస్టేబుల్కి ఇచే గౌరవం కూడా ఇవ్వరు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ఉండి కూడా మీ పోలీసులు రాలేదు. మీరు లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటున్నారా?. ఇంత పనికిమాలిన వ్యవస్థ అండ చూసుకుని టీడీపీ చెలరేగిపోతోంది. ఇప్పుడు సాక్షి వాహనాలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తావా?. కొంత మంది వ్యక్తులు చేస్తున్న పైశాచికాన్ని మీ ప్రభుత్వం కాపాడుతున్నారు..నాకు కూడా భద్రత లేదు.. అయినా ఎన్నికలను జరిపిస్తాం. ఒక వైపు వీళ్లే దాడి చేయడం, ఆ నెపం మాపై నెట్టడం వాళ్లకి రివాజుగా మారింది. నిన్న రాత్రి మా వాళ్లను కొంత మంది అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వాళ్లు ఆ సమయంలో పోలీసు స్టేషన్లోనే ఉన్నారు. ఈ అరాచకాలు భరించలేక ఈ ఎన్నిక వదిలిపెడతాం అనుకుంటున్నారేమో.. మా మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారు. చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి..? మాకు హై కమాండ్ నుంచి ఆదేశాలు అని చెప్తున్నారు..లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా పులివెందుల గెలిచి తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాడు. లోకేష్ మీరు అనుచితంగా మాట్లాడితే.. మేము అలానే మాట్లాడతాం. నేను మాట్లాడానని నాపై వేధింపులు చేస్తానంటే భయపడే వారు లేరు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలు అన్నీ తీసుకెళ్లాం. మీకు ఎన్నిక నిర్వహించలేనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం..?. ఒక గ్రామ ఓటర్లు వేరే గ్రామంలో ఓటు వేయాలా..?. ఈ అరాచకాలు ఆగేటట్లు లేవు...పులివెందుల ఆడబిడ్డలు ముందుండి నడపండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు. దాని కోసం అక్రమ మార్గాలు, దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారు..ప్రజలు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, పిల్లలకు వస్తున్న కృష్ణా జలాలను చూడండి. స్వార్థంతో కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిండి. ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందులకు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో గమనించండి. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 మెడికల్ సీట్లు వెనక్కి పంపిన వాళ్లు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ నాయకులు, వారికి మద్దతు పలికే నాయకులను ప్రశ్నిస్తున్నా.. మీరు పులివెందులకు ఏమి చేశారు..?.అసలు మీరు ధైర్యంతో పులివెందుల ప్రజల ఓట్లు అడుగుతున్నారు?. ఏమి చూసి మీకు ప్రజలు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నా.. పైగా అరాచకాలు, మీడియా వాహనాలు పగలగొడతాం అంటున్నారు. ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ ఆపాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయడం లేదు. చివరి అంకంలో చంద్రబాబు ఇలాంటివి అనుమతించి మరింత చెడ్డపేరు తెచ్చుకుంటారు. మీరు దాడులు, అక్రమాలు చేసి గెలిచినా అది గెలుపు కాదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. డీఐజీ ఒక ఉన్నత అధికారిగా వ్యవహరించడం లేదు.’’ అంటూ సతీష్రెడ్డి మండిపడ్డారు. -
టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్న పోలీసులు: రాచమల్లు
సాక్షి, పులివెందుల: టీడీపీ నేతలు పులివెందులలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోంది. అధికారం అండతో టీడీపీ అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటుంది. పులివెందులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరుకు పులివెందులలో ఓటమి లేదు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు. సాక్షి మీడియా సిబ్బందిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. సాక్షి సిబ్బంది వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు’ అని చెప్పుకొచ్చారు. -
AP: యువకుడి బొటనవేలు కొరికేసిన కానిస్టేబుల్
కడప జిల్లా: భూ తగాదా విషయంలో యువకుడి బొటనవేలు కానిస్టేబుల్ కొరికేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. వీరబల్లి మండలం ఈడిగపల్లిలో నివాసముంటున్న వీరబల్లి దయానందం కుమారుడు వేంకటేశ్వర్లు ప్రస్తుతం విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరబల్లి శివకుమార్ కుమారుడు వినోద్ కుమార్తో వీరికి భూమి తగాదా ఉంది. శుక్రవారం ఈ విషయపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో వినోద్కుమార్ బొటనవేలును వేంకటేశ్వర్లు కొరికేయగా, అతడి కుమారుడు వినయ్ వినోద్ కుమార్ కారును పగులగొట్టారు. ఈ సంఘటనపై వినోద్కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. -
ఇష్టానుసారం పోలింగ్ బూత్లను మార్చేయొచ్చా?
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి ఈసీ కొమ్ము కాస్తోందని, అందుకు ఆధారాలూ ఉన్నాయని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మీడియా ముందుకు రావడం తెలిసిందే. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక కోసం ఎన్నికల అధికారులు ఉన్నపళంగా పోలింగ్ బూత్లను మార్చేయడం(జంబ్లింగ్) విమర్శలకు దారి తీసింది. ఇంతకీ ఇలా ఇష్టానుసారం మార్చేయొచ్చా?.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని సంస్కృతికి అధికారులు తెర లేపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిల్లో దాదాపు ఆరు(6, 7, 8 ,9 ,10 ,11) పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేశారు. అదీ రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండానే. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో అవాక్కు కావడం అందరి వంతు అయ్యింది. ఈ నిర్ణయంతో.. ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఆ ఓటర్ మాత్రం తన ఓటును నాలుగు కిలోమీటర్ల వెళ్లి వేసుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. అదే సమయంలో రాజకీయ దుమారమూ చెలరేగింది.రాజ్యాంగం ఏం చెబుతోందంటే.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండా ఇలా పోలింగ్ బూత్లను మార్చేయడం తీవ్రమైన చర్యనే. తద్వారా పారదర్శకత, నిష్పాక్షికత రెండూ దెబ్బతింటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం..కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ (ఓటర్ల జాబితాల తయారీ సహా) అప్పగించబడ్డాయి. ఇందులో ఓటర్ల జాబితాల తయారీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ బూత్లను ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చొచ్చు. ఈ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు ముందుగా సమాచారం ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదు. కానీ అదే సమయంలో.. ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా, ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న అంశం మాత్రం నొక్కి చెబుతోంది. పులివెందుల పోలింగ్ బూత్ల మార్పు నిర్ణయం ఎన్నికల పారదర్శకత, నిష్పాక్షికత ఈ రెండింటినీ దెబ్బ తీసే అంశాలేనన్న చర్చ నడుస్తోంది.వైఎస్సార్సీపీ అభ్యంతరాలుపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 10,601 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో 4,000 ఓట్లు ఉన్న ఆరు పోలింగ్ కేంద్రాలను ఆ ప్రాంతాలలో కాకుండా మరో ప్రాంతానికి మార్చడమే అసలు సమస్యగా మారింది. మొత్తం ఓట్లలో 65 శాతం ఓట్లున్న కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లోనే తమ పార్టీకి పట్టుందని, ఉద్దేశపూర్వకంగానే పోలింగ్ బూత్ల మార్పు జరిగిందని, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు పోలింగ్ కేంద్రాలను మార్చారని వైఎస్సార్సీపీ అంటోంది. స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ టీడీపీ ఎత్తుగడగా కనిపిస్తోందని చెబుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా చేయడం వల్ల పోలింగ్ బూత్లను ఆక్రమించుకొని సైక్లింగ్ లేదంటే రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. కోర్టులు ఏం చెబుతున్నాయంటే..1951 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఎన్నికల సంఘానికి పోలింగ్ ఏర్పాట్లు నిర్వహించేందుకు, బూత్ల స్థానాలను నిర్ణయించేందుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. అయితే 2018లో కమల్ నాథ్ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో పార్టీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈసీ ఈ తరహా చర్యలు తీసుకోవడం నిషేధించాలంటూ దిశానిర్దేశాలు కోరారు. ఈ క్రమంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు పట్ల రాజకీయ పార్టీల ఆందోళనలను సుప్రీం కోర్టు నిశితంగా పరిశీలించడం గమనార్హం. అంతేకాదు కోర్టులు గతంలో ఎన్నికల సంబంధిత నిర్ణయాల్లో పారదర్శకత, ప్రక్రియాత్మక న్యాయత అవసరాన్ని స్పష్టంగా హైలైట్ చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఎన్నికల సంఘానికి పరిపాలనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. పోలింగ్ బూత్ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోవడం, సహజ న్యాయం, ఎన్నికల న్యాయత సూత్రాలకు విరుద్ధమే. ఈ అభ్యంతరాలతో పార్టీలు న్యాయస్థానాలనూ ఆశ్రయించవచ్చు. -
కమ్ముకొస్తున్న కరువు మేఘం
ఖరీప్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటికీ సరైన వర్షం కురవకపోవడంఓత అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ కరువు మేఘం కమ్ముకొస్తోంది. ఎటు చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. కేసీ కెనాల్ కింద మినహా చాలా ప్రాంతాల్లో అధిక శాతం బీడుగా దర్శనమిస్తున్నాయి. గతేడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టాలను చవిచూసిన జిల్లా రైతులు తాజాగా వరుణుడి కరుణలేక నష్టపోతున్నారు. కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 77475 హెక్టార్ల సాధారణ సాగుకుగానూ 14,467 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇది కేవలం 18.67 శాతం మేర మాత్రమే. మరో 50 రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరవు పరిస్థితి తప్పదని అన్నదాతలు అందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు కొంతమేర ఆశలు చిగురించినా ఏ మాత్రం పంటల సాగుపై ప్రభావం చూపడంలేదు. గత ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురియడంతో రైతులు అశలు పెట్టుకున్నారు. జూన్లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి వరుణుడు ముఖం చాటేయడం, జులైలోనూ సాధారణ వర్షపాతం 96.7 శాతం కాగా.. కేవలం 59.7 శాతం కురవడంతో ఆశలు నీరుగారిపోయాయి. ఆగస్టులో ఇప్పటి వరకూ 22.9మేర వర్షం కురిసింది. 18.67 శాతం భూముల్లోనే పంటల సాగు జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం 18.67 శాతం మేర వివిధ పంటలు సాగయ్యాయి. ఇంకా 80 శాతం భూములు బీడుగానే కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 77474 హెక్టార్లు ఉంది. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 14467.58 శాతం మేర పంటలు సాగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్థమవుతోంది. అడపాదడపా నీటివసతి లేని ఆరుతడి పంటలు ఎండుతున్నాయి. కేసీ కెనాల్ పరీవాహన ప్రాంతంలో 30,804 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 6098 హెక్టార్లలో వరిపంట సాగైది. జొన్న 29 హెక్టార్లు, సజ్జ 689 హెక్టార్లు, మొక్కజొన్న 1728 హెక్టార్లు, కొర్ర 11.6 హెక్టార్లలో సాగు చేశారు. ఇక వేరుశనగ 926, పత్తి 3185, మినుము 1388 హెక్టార్లలోనూ సాగు చేశారు. కంది విస్తీర్ణం బాగా తగ్గిపోయి 112 హెక్టార్లకే పరిమితమైంది. సోయాబీన్ 45 హెక్టార్లలో సాగైంది. ఇంకా వర్షాలు కురవకపోవడంతో తాము పంటలు వేసే పరిస్థితి లేదని.. ఈ ఏడాది కరవు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల సాధారణ నమోదైన వర్షపాతం వర్షపాతం (మి.మీలలో) (మి.మీలలో) జూన్ 68.2 21.6 జులై 96.7 59.7 ఆగస్టు 118.8 22.9(ఇప్పటికి) ఖరీప్ ప్రారంభమైనా 14,467 హెక్టార్లలోనే పంటల సాగు కేసీ కెనాల్ కింద కాసింత సాగు ముమ్మరం -
ఏకశిలానగరిలో వేడెక్కిన ప్రచారం
సాక్షి, రాయచోటి : కూటమి సర్కార్ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అడ్డదారుల వైపు అడుగులు వేస్తోంది. సాధారణ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా మంత్రులు మకాం వేసి అధికార దుర్వినియోగం చేయడం ఇందుకు అ ద్దం పడుతోంది. ఎలాగైనా సరే గెలవాలనే సంకల్పంతో అవసరమైన అన్ని వనరులను ఉపయోగిస్తున్నా రు. అధికారంలో ఉండడంతో తాము ఓటమి పాలైతే సర్కార్ ప్రతిష్ట మంటగలుస్తుందనే ఆలోచనతో ఇతర పార్టీలవారిని భయపెట్టడమో.. ఆదుకుంటామని చెబుతూ పార్టీలో చేర్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఒంటిమిట్ట, పులివెందుల లాంటి కేంద్రాల్లో తిరుగులేని ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటికే ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెపుపే లక్ష్యంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల్లో పట్టున్న వారితో చర్చించడంతోపాటు ఓట్లు భారీగా పడేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరోపక్క ప్రచారంలో ప్రజలతో కలిసిపోయి... వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. ఓటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వేయాలంటూనే ఎన్నికల ముందు హామీలిచ్చి తరువాత విస్మరించిన కూటమి సర్కార్ మోసాలను కూడా వివరిస్తున్నారు. టీడీపీ వేస్తున్న ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జోరుగా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా చింతరాజుపల్లెలో కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యంలు ప్రచారం నిర్వహించారు. అలాగే మృకుంద ఆశ్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, కడప నగర మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, యువజన విభాగం నాయకులు దేవిరెడ్డి ఆదిత్యలు ప్రచారం చేశారు. కోదండరామనగర్, మంటపంపల్లి తదితర ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్కుమార్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యంలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గంగపేరూరు పంచాయతీలోని చిన్నకొత్తపల్లెలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి తదితరులు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో సుబ్బారెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే ప్రజల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ సంపూర్ణమద్దతు లభిస్తోంది. ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఫరూక్ లతో పాటు పలువురు నాయకులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారం ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో పోలింగ్పై దృష్టి సారించిన పోలీసులు పోలింగ్ కేంద్రాల పరిశీలన ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఒంటిమిట్టతో పాటు మంటపంపల్లి, ఇతర అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్కుమార్, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎక్కడికక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలను కింది స్థాయి అధికారులను ఆదేశించారు. పులివెందుల : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసుల ఆరాచకాలు ఎక్కువయ్యాయని, ఒకే వర్గాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల మండలం కొత్తపల్లెలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో మేం లేకపోతే ప్రాణాలు తీసి ఉండేవారని స్వయానా డీఐజీ చెప్పడం చూస్తే.. దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతోందన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ అధికారులే మాట్లాడటం నీచమైన సంస్కృతి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా పోలీసు ఆరాచకాలే ఎక్కువయ్యాయని, ఒక వర్గాన్ని ప్రోత్సహించడం మంచి పద్దతి కాదన్నారు. ఏదీ ఏమైనా రెండు, మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డీఐజీ ఈ మెసేజ్ ఇవ్వడమనేది బాధాకరమైన విషయమన్నారు. కిందిస్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారి మెసేజ్ను బట్టి అలా చేయడం దారుణమన్నారు. గతంలో ఒక గ్రామంలో మూడు, నాలుగు ఇళ్లను ఓటు అడిగి వచ్చేవారని, క్రమేనా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని అడగాలనే సంస్కృతి వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలు వైఎస్సార్ ఆశయాలు, వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఓటు వేస్తారన్నారు. -
మైలవరం జలాశయానికి నీరు విడుదల
కొండాపురం : గండికోట జలాశయం గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి ఐదువేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేసినట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆవుకు రిజర్వాయర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా 13 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి కొనసాగుతున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నిల్వలు ఉన్నాయని తెలిపారు. శెట్టివారిపల్లె మొయిన్ రెగ్యులేటర్ నుంచి గాలేరి నగరి సృజల స్రవంతి కాల్వ ద్వారా వామికొండ రిజర్వాయర్కు 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు. గండికోట ఎత్తిపోతలపథకం ద్వారా నాలుగు మోటర్లతో నీటిని చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
కమలాపురం : కమలాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంనగర్కు చెందిన మునీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు.. మునీంద్ర క్రాస్ రోడ్డు నుంచి కమలాపురం పట్టణంలోకి బైక్పై వస్తుండగా ఆర్చి వద్ద వేగ నిరోధక హెచ్చరిక బోర్డును ఢీ కొన్నాడు. ఈ ఘటనలో తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉత్సాహంగా క్రీడల పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : 2025 జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం క్రీడల పోటీలు ఉత్సాహంగా సాగాయి. నగరంలోని క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ, వెయిట్ లిప్టింగ్ పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు, డీఎస్ఎ క్రీడా మైదానంలో బాస్కెట్బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించగా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ప్రతిభ చూపిన వారిని జట్టుగా ఏర్పాటుచేస్తామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 11న తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. -
గండి ఆంజన్న దర్శనానికి ఏర్పాట్లు
చక్రాయపేట : శ్రావణమాసంలో మూడో శనివారం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహా య కమిషనర్ వెంకట సుబ్బయ్య, చైర్మన్ కావలికృష్ణతేజ తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేశామని తెలిపారు. రాత్రి బసచేసే వారి కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దాతలు అన్నదానం చేస్తారన్నారు. వీఐపీ పాసులు పొందినవారు నిర్ణయించిన సమయంలో వస్తేనే అనుమతిస్తామని తెలిపారు. ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు వచ్చి దర్శనం చేసుకోవాలన్నారు. గత శనివారం జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం(ఏకాంతం), అలంకరణ, ఆరాధన, ఐదు గంటలకు మహామంగళ హారతి నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. స్వామి సన్నిధిలో తిరుపతి జిల్లా జడ్జి గండి వీరాంజనేయ స్వామిని శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనచే ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగనాయకులు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ మూడో శనివారం కావడంతో పులివెందుల డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులు, హోం గార్డులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. వాహనాలను గండిలోకి అనుమతించమని వారు తెలిపారు. -
ఎన్నికల భగ్నానికి కూటమి నాయకుల యత్నం
కడప ఎడ్యుకేషన్ : ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన జెడ్పీటీసీ ఉప ఎన్నికను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు పోలింగ్ కేంద్రాల మార్పు చేయరాదని కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ను శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు ఒక ఊరు నుంచి మరో ఊరికి పోలింగ్ కేంద్రాలను మార్పు చేయడంతో ప్రజలు ఓటు వేసేందుకు రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. వారి కుట్రలేవీ పనిచేయవన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్సే రమేష్ యాదవ్, నాయకులు రామలింగారెడ్డిలపై కూటమి నాయకులు దాడిచేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఇవన్నీ మనం సినిమాల్లోనే చూసేవారమని.. ఇప్పుడు రియల్గానే చూస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరగలేదా? అని ప్రశ్నించారు. 2024లో బీటెక్ రవి పోటీ చేసినప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ఎక్కడా రీపోలింగ్ జరిగిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజలను బయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్చడం చూస్తుంటే.. పరీక్షల సమయంలో జంబ్లిగ్ విధానం గుర్తుకు వస్తోందన్నారు. కేంద్రాలను మార్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాము గతంలో ఇలా చేసి ఉంటే నారా లోకేష్ ప్రజాగళం యాత్ర, పవన్ కళ్యాన్ వారాహి యాత్ర చేసేవారే కాదన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పులిసునీల్కుమార్, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. ప్రజలను భయాందోళనకుగురి చేస్తున్నారు ఓటింగ్ శాతం తగ్గించేందుకు పోలింగ్ కేంద్రాల మార్పు కలెక్టర్కు విన్నవించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
పులివెందుల/వేంపల్లె: ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి పులివెందుల మండల పరిధిలోని చంద్రగిరి, ఇ.కొత్తపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఆ గ్రామ అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఎక్కడ చూసినా బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను వింటూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. త్వరలోనే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ఆయా గ్రామాల ప్రజల ఉత్సాహాన్ని చూసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కచ్చితంగా అఖండ మెజార్టీతో గెలవడం తథ్యమని పేర్కొన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబం వైఎస్సార్ కుటుంబమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన పథకాలైన విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను నీరుగార్చారన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం వైఎస్ కుటుంబంతోనేనన్నారు. ప్రజల నుంచి విశేష స్పందనప్రచారంలో ప్రజల నుంచి వైఎస్సార్సీపీకి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రభోవాలు పెట్టినా.. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రజలు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి రూ.18వేలు అని నమ్మబలికి ఏ పథకం అమలు చేయలేదని వారు పేర్కొ న్నారు. కావున జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా ఉంటూ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బలరామిరెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాల గంగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆది, చంద్ర, గంగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వైస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరుతున్న నాయకులు జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఐదు రోజులుగా జోరుగాజెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామంలో టీడీపీ నుంచి 40 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. శుక్రవారం జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో బాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కడప ఎంపీ వైఎస్ అవినాస్రెడ్డి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న దాడులు, హింసలు, అరాచకాలను చూసి ఇష్టపడక వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, బలరామిరెడ్డిలకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. -
పోలింగ్ బూత్ల మార్పుతో ప్రభుత్వం కుట్ర
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ బూత్లను మార్చడం దారుణమన్నారు. ఎర్రబల్లె గ్రామానికి చెందిన పోలింగ్ బూత్ను నల్లపురెడ్డిపల్లె గ్రామానికి, నల్లపురెడ్డిపల్లె పోలింగ్ బూత్ను ఎర్రబల్లెకు, నల్లగొండువారిపల్లెకు చెందిన పోలింగ్ బూత్ను నల్లపురెడ్డిపల్లెకు మార్చారన్నారు. ఈ విధంగా చేయడంవల్ల ఎర్రబల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాలి, నల్లపురెడ్డిపల్లె ప్రజలు ఎర్రబల్లెకు వెళ్లి ఓటు వేయాలని, అలాగే నల్లగొండువారిపల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందన్నారు. నల్లగొండువారిపల్లెలో దాదాపు 632 ఓట్లు ఉన్నాయని, వీరందరూ 4 కి.మీ. దూరంలోని నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్లపురెడ్డిపల్లె ప్రజలందరూ నల్లగొండువారిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. అదే 2021లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ గ్రామంలోని ఓట్లు ఆ గ్రామంలోనే వేసేలా బూత్లు ఏర్పాటు చేయడంతో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లను ఎలా ధ్వంసం చేశారో, పెట్రోలు క్యాన్లు తెచ్చి కార్లను తగలబెట్టే ప్రయత్నం చేశారో, మనుషుల తలలను పగులగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుప రాడ్లు, కర్రలు ఎలా వాడారో చూసిన తర్వాత ఓటర్లు ఏ ధైర్యంతో 4కి.మీ. ప్రయాణం చేసి నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు ఎలా వేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ఎందుకు చేశారనేది ఆలోచిస్తే కేవలం పోలింగ్ శాతం తగ్గించడానికి, పోలింగ్ బూత్లలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసేందుకా అనిపిస్తోందన్నారు. అధికార పార్టీ ప్రభావంతోనే..ప్రతి ఒక్కరు ఓటు వేసే సౌలభ్యం కల్పించాల్సిన ఎలక్షన్ కమిషన్, ఇవాళ రూలింగ్ పార్టీ ప్రభావంతో పనిచేస్తోందన్నారు. ఈ ఓటర్ల మార్పు ఆరు పోలింగ్ కేంద్రాలపై ఉందని...అంటే 3,900 ఓట్ల మీద ఉందని, ఈ ఎలెక్షన్ 10,600 ఓట్లకు కాగా, 36 శాతం ఓటర్లకు ఈ సమస్య ఉంటుందన్నారు. ఇప్పటికే ఇష్టమొచి్చనట్లు తమ కార్యకర్తలపై బైండోవర్, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంకో ఘనకార్యం చేశారని.. బూత్లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేశారని చెప్పారు. విషయం తమకు తెలిసిన వెంటనే ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఎన్నికల అధికారి తదితరుల దృష్టికి తీసుకెళ్లామని, తమ నాయకులు కూడా వాళ్లను కలుస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని సరిదిద్ది ఏ ఊరి ఓటరు ఆ ఊరిలోనే స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలన్నారు. ఎన్నికల కమిషన్కు చాలా వినతులు చేశామని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలెక్షన్ కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద, పరిసరాలలో కూడా సీసీ కెమెరాలను అమర్చాలని అడిగామన్నారు. ముఖ్యంగా సైక్లింగ్, రిగ్గింగ్ జరగకుండా ఉండాలంటే కంప్లీట్ సీసీ ఫుటేజీ ఎన్నికల కమిషన్ వద్ద ఉండాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోర్టుకు కూడా వెళతామన్నారు. -
పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి (ఈవో) నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను అసౌకర్యానికి గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను (ఎస్ఈసీ) కోరింది. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి మాజీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్లు ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మూర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విపరీత పోకడలకు పోకుండా ప్రజస్వామ్య పద్ధతిలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిపిస్తే, ప్రజలే తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘పులివెందుల జెడ్పీటీపీ ఉప ఎన్నికలో ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లోని రెండు సెంటర్లను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్ఎస్కు, నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్ను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్ఎస్కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లోని రెండు సెంటర్లను ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉన్న మరో సెంటర్ను నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్కు మార్చాలని ఎన్నికల అధికారి నిర్ణయించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓటర్లు చాలా ఇబ్బందిపడతారు. ఈ ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఎస్ఈసీని కోరాం. ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. మార్చిన పోలింగ్ కేంద్రాలను చూస్తే... ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నారా? మీరెవరూ ఓటు వేయొద్దు. మేమే వేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాకు వర్తించదు అని చెప్పదల్చుకున్నారా? ఇక్కడున్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగం, దాని ద్వారానే ఇష్టం వచి్చనట్లు చేస్తాం? అనే ఉద్దేశంలో ఉన్నారా?. దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎత్తేసిఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులను అధికారులు కల్పించాలి. కానీ, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 2 కి.మీ., నల్లగొండువారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 4 కి.మీ. దూరం. గతంలో పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు దగ్గరగా ఉండేవి. ప్రజలు ఇబ్బంది లేకుండా ఓటు వేసేవారు. దూరంగా తరలించడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడతారు. దూరంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు వారంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి, ఓటు వేయనీయకుండా టీడీపీ నిరోధించే ప్రమాదం ఉంది. ఉప ఎన్నిక ప్రచారంలో ఈ నెల 6న మా పార్టీ నాయకులపై ఏ స్థాయిలో భౌతిక దాడి జరిగిందో అందరూ చూశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయాలన్న కుట్రతోనే అధికార పార్టీ వారు ఈ దాడికి పాల్పడ్డారు. అందుకని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 6 పోలింగ్ కేంద్రాలను (6వ నంబరు నుంచి 11 వరకు) ఏ మార్పు లేకుండా యథాతథంగా కొనసాగేలా చూడాలి. ఎలాగైనా గెలవాలని టీడీపీ దుశ్చర్యలు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఖాకీ చొక్కాలను పక్కనపెట్టి పచ్చ చొక్కాలను ధరించి వైఎస్సార్సీపీ నాయకులను అడుగడుగునా భయపెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయినా, ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఆలోచనతో ఏదో ఒకలా వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దాడులకు దిగుతున్నారు. చివరికి బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రెవెన్యూ యంత్రాంగం.. ఎలాగైనా టీడీపీని గెలిపించాలని పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిస్సిగ్గుగా చెబుతోంది. 20 ఏళ్ల క్రితం బిహార్ లో ఉన్న పరిస్థితులను టీడీపీ ఇప్పుడు ఏపీలో తీసుకొస్తోంది. హైకోర్టు తీర్పును గౌరవించండి సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్, మానిటరింగ్, అభ్యర్థులకు రక్షణ, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అమలు చేయాలి. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మేం ఏనాడూ తప్పుడు పనులు చేయలేదు. ప్రజాస్వామ్యవాదులంతా రాష్ట్రంలోని అప్రజాస్వామ్యిక పాలనను గమనించాలి. -
టీడీపీ తొండాట!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం చేస్తారో చేయండి.. అక్కడ మనం బలం చాటుకోవాలి.. ఎప్పటికప్పుడు మీకు ఏ సహాయం కావాలో చెబితే వెంటనే అందే ఏర్పాటు చేస్తాం.. అధికారులంతా మీకు సహకరిస్తారు.. రాష్ట్రంలో అందరి దృష్టీ ఆ ఎన్నికపైనే ఉండాలి’ అని ‘ముఖ్య’ నేత కొందరు టీడీపీ నేతలకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేయడం వల్లే కొద్ది రోజులుగా ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. స్థానిక టీడీపీ నేత బీటెక్ రవి, మరికొందరు నేతలు రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, తప్పుడు కేసులు, భయభ్రాంతులకు గురి చేయడాలు, ప్రలోభాలు.. ఇలా ఏవీ ఫలితమివ్వక పోవడంతో తాజాగా మరో కుట్రకు తెరలేపారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గించి, అధికార టీడీపీకి మేలు చేకూర్చాలన్న కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్ బూత్లు, నల్లగొండువారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్లు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఇలాగైతే తాము మూకుమ్మడిగా పోలింగ్ బహిష్కరిస్తామని నల్లగొండువారిపల్లె గ్రామస్తులు అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా మార్చారని ఆరా తీస్తే.. టీడీపీ నేతల కుట్రను అధికారులు అమలు చేస్తున్నారని స్పష్టమైంది. పోలింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. అందులో కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లో 65 శాతం ఓటర్లు ఉన్నారు. ఆయా పంచాయతీల్లో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. ఈ పరిస్థితిలో అక్కడి ఓటర్లు ఓట్లు వేస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం. ఈ క్రమంలో ఓటర్ల బూత్లను తారుమారు చేశారు. దీంతో స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ నేతల ఎత్తుగడ. పైగా ఓటింగ్ వెళ్లే దారిలో ప్రలోభ పెట్టేందుకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఎత్తు వేసినట్తు తెలుస్తోంది. దీంతోపాటు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయడం మొదలెట్టారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థికి పడిన ఓట్లు ఎక్కువగా చెల్లనివిగా చేసేందుకు బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా ఎత్తుగడలు వేశారని తెలుస్తోంది. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్క పేజీలో బ్యాలెట్ పేపర్ ముద్రిస్తే సరిపోతుంది. అలా కాకుండా డబుల్ సైడ్ గుర్తులు ఇస్తూ బ్యాలెట్ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా ఒకటవ గడిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి గుర్తుపై ఓటు వేయడం ద్వారా ఆ ఓటు చెల్లకుండా పోవాలనే కుట్ర దాగి ఉంది. ‘ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. మెరుగైన సమాజం కోసం ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించండి. ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనండి.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి’ అన్న ప్రచారానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా సరే గెలవడానికి ఓటర్లను గందరగోళానికి గురి చేసి, పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా చేయాలన్న ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రోజుకో దాడితో భయభ్రాంతులకు గురిచేసే ఎత్తుగడవైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించి కుట్రలు, కుతంత్రాలకు తెర లేపింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలుపు దరిదాపులకు వెళ్లడం అటుంచి.. డిపాజిట్ కూడా దక్కదనే విషయం తెలిసి రౌడీయిజంతో బందిపోట్ల తరహాలో వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులకు తెగబడింది. ఇందులో భాగంగా మంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్కుమార్రెడ్డి (చంటి), అమరేష్రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డిలపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై బందిపోటు దొంగల ముఠా తరహాలో టీడీపీ రౌడీ మూకలు మెరుపు దాడి చేశాయి.ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారుణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టు బెట్టేందుకు యత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యునర్, స్కార్పియో వాహనాలనూ సమ్మెటలతో ధ్వంసం చేశారు. రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మూకలు పారిపోయాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీసు క్యాంప్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. ఫ్లెక్సీని వారే చింపేసుకుని వైఎస్సార్సీపీ నేతలపై కేసు సాక్షి, టాస్క్ ఫోర్స్: పులివెందులలో కూటమి నాయకులు, పోలీసుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓబుల్ రెడ్డి పేరుతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పులివెందుల పోలీసులు అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ నారాయణకు ఫోన్ చేసి, అక్కడ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని సూచించారు. దీనిపై శంకర్ నారాయణ స్పందిస్తూ.. ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. అనంతరం కొద్ది గంటల్లోనే శంకర్ నారాయణతో పాటు మరో ముగ్గురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. కూటమి నాయకుల ఆదేశాలతో పోలీసులు ముందస్తు వ్యూహంలో భాగంగా ఈ అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
‘ఈసీ ప్రకటించిన పోలింగ్ బూత్ లిస్ట్ దారుణంగా ఉంది’
వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరలేపుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఎన్నికకు ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ చూస్తే దారుణంగా ఉందన్నారు. ‘ ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరతీసింది. నల్లపురెడ్డిపల్లె వారు ఎర్రబెల్లి వెళ్ళి ఓటేయాలి అంటున్నారు. గతంలో ఏ గ్రామంలో ఉండే బూత్ లో వాళ్ళు ఓటేసుకున్నారు. ఇప్పుడు మార్చిన తీరు ప్రకారం 4 కిలో మీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సి వస్తోంది. దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది. మొన్న నల్లగొండపల్లిలో ఎంత దాడికి దిగారో మీకు తెలుసు. మరి ఈ ఓటర్లు వేరే ఊరికి వెళ్లి ధైర్యంగా ఎలా ఓట్లు వేయగలరు. ఇది అర్థరహితం. కేవలం పోలింగ్ శాతం తగ్గించాలి అనే టీడీపీ ఈ ప్రయత్నం చేస్తోందా..?, ఎన్నికల కమిషన్ అందరూ ఓటేసేలా చూడాల్సిన బాధ్యత ఉంది. 6 పోలింగ్ బూత్ లపై ఈ ప్రభావం ఉంది. 3,900 ఓట్లు 36 శాతం మందికి ఈ సమస్య తలెత్తింది. ఎప్పుడైతే బూత్ ల లిస్టు విడుదలైందో అప్పుడు టీడీపీ కుట్ర బయటపడుతుంది. ఇప్పటికే దాడులు, బైండోవర్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మరో ఘనకార్యం చేసారు...బూత్ లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేసారు. ఎట్టిపరిస్థితుల్లో ఏ ఊర్లో వాటిని అదే ఊర్లో ఓటేసి అవకాశం కల్పించాలి. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలి. తప్పనిసరిగా పోలింగ్ బూత్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 2021లో ఏవిధంగా అయితే బూత్ లు ఉన్నాయో అలానే ఉంచాలని వినతి’ అని ఎంపీ అవినాష్ స్పష్టం చేశారు. -
ఓటమి భయం.. పులివెందులలో కూటమి కుతంత్రాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రశాంత వాతావరణంలో గనుక పోలింగ్ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న అధికార టీడీపీ.. ఎప్పటికప్పుడు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీస్తోంది. తాజాగా..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక భాగం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. ఇందులో అధికంగా ఓట్లు ఉన్న నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్లనే జబ్లింగ్ చేయడం గమనార్హం. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ బూత్, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు ఎర్రిబల్లిలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల ఓట్లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. అయితే.. ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారంటున్న వైఎస్సార్సీపీ అంటోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన పోలింగ్ బూత్ల లిస్టును మళ్లీ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోంది. బూత్లు మార్చేప్పుడు రాజకీయ పార్టీలతో సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుందని.. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్లను మార్చారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్ బూత్లను జంబ్లింగ్ చేయడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. -
‘పులివెందులలో ఎన్నిక వచ్చింది.. సునీత మళ్లీ దిగారు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. తన తండ్రిని ఓడించిన వారికి ఈరోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు.. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె, అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి మేగురు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఓ వైపు అరాచకాలు చేస్తూనే.. మరోసారి వివేకా హత్యను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఏరోజూ నిజాయితీగా రాజకీయాలు చేయలేదు. ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నాడు. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె, అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుసు. అందుకే హఠాత్తుగా సునీతను రంగంలోకి దింపారు. సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారింది. గత రెండు ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసును వాడుకుని లబ్ది పొందాలని చూశాడు.అవినాష్ రెడ్డిపై కుట్ర..వివేకానందరెడ్డిని చంపింది తానే అని దస్తగిరి ఒప్పుకున్నది నిజం కాదా?. వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది. వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి. చంద్రబాబు చేతిలో వ్యవస్థలు ఉన్నా సీబీఐ చేతికి కేసు వెళ్లింది నిజం కాదా?. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయనగానే వస్తారు.. నాలుగు నిందలు వేసి వెళ్లిపోతారు. చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత తోలుబొమ్మగా మారింది. తన తండ్రికి బద్ధశత్రువులైన వారితోనే సునీత చేతులు కలిపారు.బాబు ప్లానే..వివేకానందరెడ్డి రెండో భార్య విషయం.. ఆమెతో జరిగిన ఛాటింగ్ ఎందుకు బయటకు రావడం లేదు. ఎవరి ప్రోద్భలంతో బయటికి రావడం లేదో సునీత చెప్పాలి. హత్య ఎవరు చేశారో చెప్పిన తర్వాత కూడా అతన్ని అప్రూవర్గా మార్చింది ఎవరో తెలియదా?. వెయ్యి రూపాయలు లేని కారు డ్రైవర్ దస్తగిరి.. ఈరోజు కాన్వాయ్కు ఓనర్ అయిపోయాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దస్తగిరి తరపున వాదిస్తున్నాడు. సిద్ధార్ధ్ లూథ్రా.. చంద్రబాబు మనిషి అని మీకు తెలియదా?. నీ తండ్రిని ఓడించిన వారికి ఈరోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలి. పులివెందులలో వ్యవస్థలను చంద్రబాబు తన చేతిలో పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఓ చర్చ నడుస్తోంది. వందకు వందశాతం 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. 2024 ఎన్నికలు జరిగిన తీరుపై మాకు కొన్ని సందేహాలున్నాయి. విజయనగరంలో ఎన్నికలప్పుడు 40% శాతం ఎన్నికలయ్యాక 90% ఈవీఎంలలో చార్జింగ్ ఉంది. వీవీప్యాట్స్ స్లిప్పుల్లో తేడాలున్నాయి. కౌంటింగ్ సీసీ ఫుటేజీని కోరాం. మా సందేహాలను నివృత్తి చేయమని మేం ఎన్నికల కమిషన్ను కోరాం’ అని చెప్పుకొచ్చారు. -
ఇద్దరు దొంగల అరెస్టు
● అర కిలో బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం ● నాటు తుపాకీ, బొలెరో వాహనం, ఎర్రచందనం దుంగలు స్వాధీనం కడప అర్బన్ : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ చేసే అర కిలో బంగారం, రూ.10 లక్షల విలువ చేసే పది కిలోల వెంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు. కడప జిల్లా బద్వేల్ టౌన్ పరిధిలోని చెన్నంపట్టిమిట్ట వద్ద నివాసముంటున్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, గౌరీశంకర్నగర్కు చెందిన నూతి వెంకటసుబ్బయ్య గత రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లు పగలు గుర్తించడం, రాత్రి చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నారు. వీరు ఎరచ్రందనం అక్రమ రవాణా చేయడమేగాక, కడప, నెల్లూరు జిల్లాలో తాళం వేసిన ఇళ్ల తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే ఇళ్ల చోరీలో తక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు లభించడంతో సంతృప్తి చెందక, ఎక్కువ మొత్తంలో ఆభరణాలు దోచుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప, అన్నమయ్య, సత్యసాయి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లోని బంగారు దుకాణాలకు తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గుంటూరులో బైక్ చోరీ చేశారు. ఈ ప్రయత్నంలోనే గతంలోనూ అరెస్టుయి జైలుకు వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. తీరికసమయాల్లో పేకాడడం, సహచరులతో లంకమల అడవికి వెళ్లి నాటు తుపాకీతో వన్యప్రాణులను వేటాడడం చేశారు. గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై గతంలో 28 వరకూ ఎర్ర చందనం అక్రమ రవాణా, 38 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతడిపి పీడీ యాక్ట్ ఉండడమేగాక, జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. చోరీలు పెరగడంతో పోలీసుల నిఘా జిల్లాలోని పోరుమామిళ్ల, బి.కోడూర్, మైదుకూర్, బద్వేల్ టౌన్, కలసపాడు, ఖాజీపేట, కాశినాయన, దువ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లపై పగలు రెక్కీచేసి, రాత్రి సమయాలలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీలు ఇటీవల పెరిగాయి. దాదాపు 12 ఇళ్లు, బంగారు దుకాణంలోనూ ఈ చోరీలు జరగడంతో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు మైదుకూర్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, మైదుకూరు యూసీపీఎస్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, బద్వేల్ రూరల్ ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బందిని ప్రత్యేక బృందంగా నియమించి నిఘా పెంచారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని చెలిమికుంట అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలు నరికి కర్ణాటకలోని కటికనహళ్లికి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్య ఎరచ్రందనం రవాణా చేసూం్త పట్టుబడ్డారు. వారి నుంచి బొలెరో వాహనం, నాలుగు ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారించగా గత నేరచరిత్ర కలిగిన వ్యక్తులని గుర్తించారు. అనంతరం పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు తెలియడంతో అరెస్టు చేశారు. పోలీసులకు ఎస్పీ ప్రశంస మోస్ట్ వాంటెడ్గా ఉన్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్యలను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసి, చోరీ సొత్తు, ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ రికవరీ చేసిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ రూరల్ సీఐ ఎ.నాగభూషణ్, ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎస్ఐలు కె.శ్రీకాంత్, చిరంజీవి, శివప్రసాద్, తదితర సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. -
ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల ఏర్పాటు
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 11 మంది ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లపై చర్చించి అంతర్ జిల్లాల సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర్పాటుచేశామన్నారు. పార్టీ నాయకులు ప్రచారానికి ముందస్తుగా సమాచారం ఇస్తే భద్రత కల్పించామన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నల్లగొండువారిపల్లెకు వెళ్లి అక్కడ ప్రచారంలో టీడీపీకి చెందిన గూటూరు ధనుంజయపై వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డి, మరింతమంది కులం పేరుతో దూషించి మారణాయుధాలతో దాడి చేశారన్నారు. పరస్పర దాడులు జరుపుకోవడంతో మారెడ్డి జయవర్థన్రెడ్డి, చప్పిడి శ్రీనాథరెడ్డి, కిరికిరీ బాషా, అక్కులగారి విజయ్కుమార్రెడ్డి, పేర్ల కళ్యాణ్రెడ్డి, పేర్ల సత్యనారాయణరెడ్డి, పేర్ల శేషారెడ్డి, ధనుంజయరెడ్డిలతోపాటు కొంతమంది కంప్లయింట్ ఇచ్చారని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ధనుంజయ తనను కులం పేరు దూషించినట్లు కంప్లయింట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల నియమావళి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి తీసుకోకుండా పోలీసుల రాకపోకలకు అంతరాయం కలిగించడంపై ఎంపీడీఓ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, బయపురెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డిలతోపాటు 150మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులతోపాటు కోరా విశ్వనాథరెడ్డి ఫోన్లలో నీ అంతు చూస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు రావడంతో వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డి, తుమ్మల గంగాధరెడ్డిలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యులైన వారిని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ -
చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
రాజుపాళెం : పట్ట పగలే రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఓ దొంగ చోరీకి యత్నించగా.. గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాజుపాళెం మండలం టంగుటూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు. కానగూడూరు ప్రధాన రహదారిలోని ఉంటున్న రైతు నంద్యాల వెంకట సుబ్బయ్య గ్రామానికి దూరంగా ఉన్న సచివాలయం వద్ద పని నిమిత్తం వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటి తలుపులు మూసివేసి దుండగుడు ఇంట్లో ఉన్న ఇనుప బీరువా పగలగొట్టే పనిలో కనిపించారు. రైతు వెంకటసుబ్బయ్యను చూసి దుండగుడు ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన వెంకట సుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్ఐ వెంకటరమణ పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగుడు దూవ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, షేక్ మహమ్మద్ రఫీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. -
పొడదుప్పి మృతి
అట్లూరు : కుక్కల బారిన పడి పొడదుప్పి మృతిచెందిన సంఘటన అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లంకమల్లేశ్వర అభయారణ్యం నుంచి ఎస్.వెంకటాపురం కాలనీ లోకి గురువారం ఉదయం ఓ పొడదుప్పి వచ్చింది. కుక్కలు దాడి చేస్తుండగా స్థానికులు గమనించి తప్పించారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీషర్ సురేష్కు సమాచారం అందించగా ఆయన వచ్చేలోపే పొడదుప్పి మృతిచెందింది. స్థానిక పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం ఖననం చేసినట్లు సెక్షన్ ఆఫీషర్ సురేష్ తెలిపారు. గది అద్దెకిస్తే.. నగదు, నగలు అపహరణ లింగాల : గది అద్దెకిస్తే.. నమ్మించి..నగదు, నగలు అపహరించిన సంఘటన లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన హసీనా, మాబాషా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. తమకు ఆశ్రయం కల్పించాలని పార్నపల్లి గ్రామానికి వచ్చారు. ఆ యువతీ యువకులు అరటి కాయలు మోసే కూలిపనులు చేస్తూ గత ఆరు మాసాలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇల్లు అద్దెక్కించిన మహిళ ఇంట్లో లేనిది చూసి గురువారం ఆమె ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో దాచిన రూ.1.10లక్షల నగదు, జత బంగారు కమ్మలు, మాటీలు, కాళ్ల గొలుసులు అపహరించి పారిపోయారు. ఈ విషయమై ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తితోపాటు పారిపోయిన హసీనా, మాబాషాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇల్లూరులో మహిళపై దాడి జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామంలో నివాసముంటున్న లక్ష్మీదేవిపై అదే గ్రామానికి చెందిన నరేంద్ర దాడి చేశాడు. కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్ వివరాల మేరకు.. వినాయకచవితిని పురస్కరించుకుని ఇల్లూరు గ్రామంలో చందా వసూలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన నరేంద్ర లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి చందా ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మాటా మాటా పెరిగి నరేంద్ర కర్ర తీసుకుని లక్ష్మీదేవిపై దాడి చేశాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బాధితురాలిని పరామర్శించారు. యువకుడు ఆత్మహత్య జమ్మలమడుగు రూరల్ : విషద్రావణం తీసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. ఎస్ఐ రామక్రిష్ణ వివరాల మేరకు.. మోరగుడి గ్రామానికి చెందిన చాకలి జగన్ (33) మద్యానికి బానిసయ్యారు. కుటుంబ సమస్యలతో ఈ నెల 4న విష ద్రావణం తీసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. భార్య విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. దేవగుడిలో వివాహిత... మండలంలోని దేవగుడి గ్రామానికి చెందిన వివాహిత రేవతి దేవి(40) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రేవతి దేవి గత కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది గురువారం ఫ్యాన్కు ఉరివేసుకోని అత్మహత్య చేసుకుంది. భర్త బాబు ఖాజీపేటలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సినట్లు పోలీసులు తెలిపారు. -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..!
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసేందుకు విద్యా శాఖ ఏటా ఫార్మెటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మెటివ్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి అసెస్మెంట్ మోడల్ పేపర్–1ను ఈ నెల 11వతేదీ నుంచి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను విధానంలో నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరం వరకూ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఏ విధానం అమలుచేయగా ఈ ఏడాది ఆ విధానాన్ని 9వ తరగతి వరకూ పొడిగించారు. కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్ పరీక్షలను జరపనున్నారు.జిల్లాలో విద్యార్థుల వివరాలిలా...జిల్లాలో 1912 ప్రభుత్వ, ఎయిడెడ్, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 96382 మంది విద్యార్థులున్నారు. 273 యూపీ స్కూల్స్లో 33226, 634 హైస్కూల్స్లో 165350 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 2819 పాఠశాలల్లో 2,94,958 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.పరీక్షల షెడ్యూల్ ఇదీ...ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. 11వ తేదీన ఉదయం 9.30 నుంచి 10.45 వరకూ తెలుగు/ ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదే రోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 గంటల వరకు మ్యాథ్మాటిక్స్, 12న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం ఎన్విరాల్మెంట్ సైన్సు పరీక్ష ఉంటాయి. 13న ఉదయం ఓఓస్ఎస్సీ పరీక్ష 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉంటుంది.6,7,8 తరగతులకు సంబంధించి...ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు 11న ఉదయం 9.30 గంటల నుంచి 10.45 వరకు తెలుగు/ఉర్దూ/కాంజోజిట్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటలకు మ్యాథమాటిక్స్ పరీక్ష ఉంటాయి. 12న హిందీ/స్పెషల్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం జనరల్ సైన్సు/ఫిజికల్ సైన్సు పరీక్ష, 13న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్ పరీక్ష, 14న 6,7వ తరగతులకు ఏఎస్ఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు.9,10 తరగతులకు సంబంధించి...హైస్కూల్స్లో 9, 10వ తరగతులకు 11న ఉదయం 11 గంటల నుంచి 12.15 వరకు తెలుగు/ఉర్దూ/కాంపోజిట్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 4 గంటల వరకు మ్యాథ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 12న ఉదయం హింది/ స్పెషల్ తెలుగు, మధ్యాహ్నం ఫిజికల్ సైన్సు, 13న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్ పరీక్ష ఉంటాయి. 13న ఉదయం 9.30 నుంచి 10.45 వరకు 8, 9, 10వ తరగతులకు బయోలాజికల్ సైన్సు, ఉదయం 11 గంటల నుంచి 12.45 వరకు ఓఎస్ఎస్సీ –1, మధ్యాహ్నం 2,45 నుంచి 4 గంటల వరకు ఓఎస్ఎస్సి–2 పరీక్ష నిర్వహించనున్నారు.బైలింగ్విల్లో ప్రశ్నాపత్రం...సిబిఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు పశ్నాపత్రం బైలింగ్విల్ ఽవిధానంలో ఉంటుంది. విద్యార్థికి ఆంగ్లం అర్థకాకుంటే తెలుగులో చదవి అర్థం చేసుకునే విధానం 2023–24 నుంచి ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలో పది ప్రశ్నలు అబ్జెక్టివ్ విధానంలో, మరో ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇవ్వనున్నారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. ఓఎంఆర్ పత్రాల్లో జవాబు నింపి జిల్లాకు పంపాల్సి ఉంటుంది. సీబీటీ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లో నింపాల్సి ఉంటుంది.ఎమ్మార్సీ కేంద్రాలకు...ప్రశ్న పత్రాలుసెల్ప్ అసెస్మెంట్ మోడల్ పేపర్ –1 పరీక్షలకు సంబంధించిన పశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలలోని ఎమ్మార్సీలకు తరలించాం. పరీక్ష పత్రాలకు ఎంఈఓలు కష్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని మార్గదర్శకాలు ఎంఈఓలు, హెచ్ఎంలకు జారీ చేశాం.– విజయభాస్కర్రెడ్డి, సెక్రటరీ, డీసీఈబీ, కడపపరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలిఎస్ఏఎంపీ–1 పరీక్షలను ప్రధానోపాధ్యాయుడు పకడ్బందీగా నిర్వహించాలి. ఏ రోజు పరీక్షకు ఆ రోజే ప్రశ్న పత్రాన్ని తీసుకెళ్లి పరీక్ష నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా హెచ్ఎంలు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలి. పరీక్ష పేపర్లు లీకై తే సంబధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.– షేక్ షంషుద్ధీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
శిక్షణ ఫలాలు సఫలీకృతం కావాలి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ సఫలీకృతమయ్యే విధంగా చూడాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యనందరాజు సూచించారు. కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ వివిధ ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులకు ఇచ్చిన శిక్షణ గురువారం ముగిసింది. ఏపీసీ నిత్యానందరాజు మాట్లాడుతూ జీసీడీవో దార్త రూత్ ఆరోగ్యమేరీ ఆధ్వర్యంలో కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, నెల్లూరు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారన్నారు. బీడు, చౌడు భూముల్లో సేద్యం చేసి పంటలు పండించడం ఎంతకష్టమో. వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం అంతే కష్టమన్నారు. శిక్షణ తరగతుల్లో 21 మంది రిసోర్సు పర్సన్స్ పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి దేవస్థానంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ గురువారం ఆలయంలో విచారణ జరిపారు. ఆలయంలో అక్రమాలు జరిగాయంటూ తెల్లాకుల మనోహర్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం డిప్యూటీ కమిషనర్ ఆలయానికి వచ్చి ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావును విచారించారు. దసరా పండగ తర్వాత వివరాలను అందిస్తామని ఆయన చెప్పగా.. నెల రోజులలోపు పూర్తి వివరాలు అందించాలని డీసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. నవోదయ ప్రవేశ దరఖాస్తులకు గడువు పొడగింపు కడప ఎడ్యుకేషన్ : జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13వతేదీ వరకూ గడువు పొడగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్కూటీ డిక్కీలో నగదు మాయం – చాకచక్యంగా రూ.3.95 లక్షలు కొట్టేసిన దొంగ ప్రొద్దుటూరు క్రైం : స్కూటీలో డిక్కీలో రూ.3.95 లక్షల నోట్ల కట్టలను ఓ దొంగ చాకచక్యంగా కొట్టేశాడు. ఇంటికెళ్లి డిక్కీ తెరవగా డబ్బు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్న కల్లూరు రమణారెడ్డి రాజుపాలెం మండలంలోని టంగుటూరు ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సబితారెడ్డి అన్నమయ్య జిల్లాలో టీచర్గా పని చేస్తోంది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలోని తన సొంత స్థలాన్ని ఈ నెల 5న కడపకు చెందిన మల్లేశ్వరికి రూ.4,95,500లకు విక్రయించాడు. ఆ మొత్తాన్ని రమణారెడ్డి బ్యాంక్ అకౌంట్లో వేసింది. బుధవారం గాంధీ రోడ్డులోని ఇండియన్ బ్యాంక్కు వెళ్లి ఆ డబ్బు రమణారెడ్డి డ్రా చేసుకున్నాడు. నోట్ల కట్టలను స్కూటీ డిక్కీలో పెట్టుకొని నేరుగా కొర్రపాడు రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. స్కూటీ కార్యాలయం ఎదుట పార్క్ చేసి స్థలం అమ్మిన పత్రాల్లో సంతకాలు పెట్టాడు. తిరిగి స్కూటీలో ఇంటికి వెళ్లి చేసుకోగా డిక్కీలోని నోట్ల కట్టల్లో రూ. 3.95,500 కనిపించలేదు. డిక్కీలో నగదు కాజేసి చాకచక్యంగా మళ్లీ డిక్కీ మూసివేశారని గుర్తించి అతను టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు దినం కడప కోటిరెడ్డి సర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 12దీన దుకాణాలు, సంస్థలలోని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని వైఎస్సార్ కడప జిల్లా ఉప కార్మిక కమిషనర్ డి.వి.రంగరాజు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఈ నెల 1న మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నందున ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలి కడప అర్బన్: జిల్లాలో పీ–4 విధానాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. పీ–4పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్ వీసీ ద్వారా గురువారం సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులతో మాట్లాడుతూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ జిల్లాలో గ్రామసభల ద్వారా నిర్వహిస్తున్న అసెస్మెంట్ సర్వే త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. డాక్యుమెంట్స్ అప్లోడ్ కార్యక్రమం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి దుర్మరణం చాపాడు: మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని పల్లవోలు గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబవరం శివ(31) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన అంబవరం శివ ట్రాక్టర్లో రాళ్లలోడుతో అన్నమయ్య జిల్లా రాయచోటికి వెళుతున్నాడు. చాపాడు మండలం పల్లవోలు గ్రామం వద్ద ప్రమాదశాత్తూ శివ క్రింద పడిపోయాడు. రోడ్డు ప్రక్కనే డివైడర్కు తల తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మృతుడు శివకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చిన్నమండెం : మండలంలోని కలిబండ గ్రామం కొల్లవాండ్లపల్లెకు చెందిన రైతు ఈశ్వర్రెడ్డి(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈశ్వర్రెడ్డి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. -
వరాల పండుగకు వేళాయె!
కడప సెవెన్రోడ్స్: మహిళలు తమ సౌభాగ్యం కోసం ప్రార్థించే పండుగల్లో శ్రీ వరలక్ష్మిమాత వ్రతం ముఖ్యమైనది. శుక్రవారం పండుగ నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లలో ప్రజలు నిమ గ్నమయ్యారు. వరలక్ష్మీదేవి ఆరాధన కోసం అవసరమైన పూలు, పండ్లు, అరటి పిలకలు, మామిడాకులు, తమలపాకులు, టెంకాయలు, కర్పూరం, గంధం, కడ్డీలు తదితర పూజా సామగ్రి దుకాణా లు మహిళలతో రద్దీగా మారాయి. ముఖ్యంగా కడప నగరంలోని పాత బస్టాండు, గర్ల్స్ జూనియర్ కళాశాల, వన్టౌన్ సర్కిల్, బీకేఎం స్ట్రీట్, ఆర్టీసీ బస్టాండు, కాగితాలపెంట, దొంగలచెరువుకట్ట, అప్సర సర్కిల్ తదితర ప్రాంతాలు జనంతో కిటకిటలాడాయి. పండుగ కావడంతో పూజా సామాగ్రికి అవసరమైన వస్తువుల ధరలు కూడా వ్యా పారులు అమాంతం పెంచేశారు. కనకాంబరాలు పావు రూ.100, మల్లె, జాజి పూలు పావు రూ.80, చెండుమల్లె కిలో రూ.150, చేమంతి, రోజా పూలు కిలో రూ. 400 చొప్పున విక్రయించారు. అరటి పిలక రూ.30, అరటి పండ్లు డజన్ రూ. 60, మామిడి ఆకులు రూ.30 చొప్పున విక్రయించారు. తాము నందలూరు, రాజంపేట వంటి దూర ప్రాంతాల నుంచి అరటి పిలకలను తీసుకొచ్చి విక్రయిస్తున్నామని, కనీసం రూ. 50 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు బ్రాహ్మణులు, వేద పండితుల ఆధ్వర్యంలో వరలక్ష్మివ్రతం కోసం అమ్మవారి కలశ ప్రతిష్ఠ చేసేందుకు భక్తులు సన్నాహాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల సామూహిక వ్రతాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అమ్మవారు కరుణించి కోరిన వరాలిస్తారని, సౌభాగ్యం అందజేస్తారని భక్తుల విశ్వాసం. కడప నగరంలో శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ఉదయం నిర్వాహకులు భక్తులచే సామూహికంగా అమ్మవారి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు వరలక్ష్మివ్రతం ఆలయాలు, ఇళ్లల్లో విశేష పూజలు -
గ్రామాల్లో వైఎస్సార్సీపీకి విశేష ఆదరణ
పులివెందుల/వేంపల్లె: గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి వైఎస్సార్సీపీకి విశేష ఆదరణ లభిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె, తండా, మల్లికార్జునపురం (దళితవాడ), ఎర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆ గ్రా మంలోని శివాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెడ్పీటీసీ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. కూటమి కుట్రలను ఓటుతో తిప్పికొడదాం ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతల కుట్రలు, కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు కృష్ణా జలాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా చేసిన ఘనత వైఎస్సార్సీపీదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకట్రెండు అమలు చేసి అన్ని ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50ఏళ్లకుపైబడిన వారికి పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పి తుంగలో తొక్కిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఓడిపోతామని తెలిసి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ పేరుతో పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులను ప్రచారం చేయనీయకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ గ్రామంలో టీడీపీ, కూటమి నేతలు ఉన్నారని వైఎస్సార్సీపీ నాయకులను అక్కడికి ప్రచారానికి వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప క్రీడా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు భరత్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలోఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి -
జిల్లాలో పలు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ఒంటిమిట్టలో అత్యధికంగా 70.8 మి.మీ కురిసింది. అలాగే అట్లూరులో 48.2 , గోవపరంలో 40, పెండ్లిమర్రిలో 28.4, చక్రాయపేటలో 20.4, సిద్దవటంలో 10.2, బద్వేల్లో 12.2, బి. కోడూరులో 6.2, బిమఠంలో 4.8 , ప్రొద్దుటూరులో 5, రాజుపాలెంలో 3.4, కమలాపురంలో 2.6, కడప, వీఎన్పల్లిలలో 2.2 , వేములలో 2 చెన్నూరు, తొండూరులలో 1.2 మి.మీ వర్షపాతం నమోదయింది. ఈ వర్షంతో వరినాట్లతోపాటు ఆరుతడి పంటలకు కొంత మేలు జరగనుంది. సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహించకూడదు కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల వారు ప్రభుత్వ సెలవు రోజు ల్లో తరగతులు నిర్వహించకూడదని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. నిబంధలకు వ్యతిరేకంగా ఎవరైనా ఎలాంటి తరగతులు, ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని చెప్పారు. జిల్లాలోని డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈ ఉత్తర్వులు పాటించేలా చూడాలని.. పర్యవేక్షించాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆదేశించారు. 11వ తేదీ నుంచి అనుమతి లేని ప్లే స్కూల్స్ తెరవకూడదు... జిల్లావ్యాప్తంగా 11వ తేదీ సోమవారం నుంచి అనుమతులు పొందని ప్లేస్కూల్స్ తెరవకూడదు, తరగతులను నిర్వహించకూడదని ఆయా యాజమాన్యాలకు డీఈఓ షేక్ షంషుద్దీన్ సూచించారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై తగు చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. యూరియాను అధిక ధరకు అమ్మితే చర్యలుకడప అగ్రికల్చర్: జిల్లాలో ఎరువుల డీలర్లు ఎవరైనా యూరియాను అధిక ధరలకు అమ్మితే చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్కు వచ్చిన యూరియా రాక్ను జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్థన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉమ్మడి కడప జిల్లాకు 1335 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. ఇందులో వైఎస్సార్జిల్లాకు 870 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 400 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్కు కేటాయించామన్నారు. మిగతా 470 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించామన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 465 టన్నులు రాగా ఇందులో 265 టన్నులను మార్కెఫెడ్కు, మిగతా 200 టన్నులను ప్రైవేటు డీలర్లు కేటాయించామని తెలిపారు. ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు: ఎస్పీ
కడప అర్బన్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో జరిగిన దాడులు, అల్లర్ల సంఘటనలపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతరులకు అనుమతి లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు దాదాపు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు. ‘గండికోట’ కేసులో టెక్నికల్గా విచారణ గండికోటలో జరిగిన మైనర్బాలిక హత్య కేసులో ఇంకా టెక్నికల్గా ఆధారాలపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలియజేశారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని వెల్లడించారు. గండిలో ట్రాఫిక్ ఆంక్షలు చక్రాయపేట: శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా మూడవ శనివారం రోజు వాహనాలను ఎట్టి పరిస్థితిలోను గండిలోకి అనుమతించే ప్రసక్తి లేదని ఆర్కే వ్యాలీ ఎస్సై రంగారావు తెలిపారు.శ్రావణ మాసం మూడవ శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు ఆయన వివరించారు. ఉదయం 5గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని చెప్పారు. సాయంత్రం భక్తుల రద్దీని బట్టి ఆంక్షలను సడలిస్తామని చెప్పారు. -
బరి తెగించారు!
పచ్చ సైకోలు ఊరిమీద పడ్డారు. బరిలోకి దిగి ఓటర్ల మనసులు గెలవాల్సింది పోయి అధికారదర్పాన్ని ఒళ్లంతా పూసుకుని బరితెగిస్తున్నారు. ప్రత్యర్థులపై రాళ్లూరప్పలు విసురుతున్నారు. కర్రలు..రాడ్లతో దాడులకు తెగబడుతున్నారు. పెట్రోల్ క్యాన్లు పట్టుకుని తిరుగుతూ పల్లెల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇదంతా చేసేది ఒక్క జెడ్పీటీసీ సీటు కోసమే. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న 'ముఖ్య'నేతల నుంచి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నేతలు వీరంగం చేస్తున్నారు. 'ఆపరేషన్ పులివెందుల' అంటూ పల్లెల్ని రణరంగంగా మారుస్తున్నారు.సాక్షి టాస్క్ఫోర్స్: జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి. ఎంత అరాచకమైనా సరే, ఎన్ని కేసులైనా పర్వాలేదు. ‘ఆపరేషన్ పులివెందుల’లో టీడీపీ జెండా ఎగరాలి.. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన మార్గదర్శకాలివి. దీనికనుగుణంగానే క్షేత్ర స్థాయిలో చర్యలుంటున్నాయి. టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుట్రలు, కుయుక్తులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చొకూడదనే దిశగా పథకరచన చేస్తున్నారు. ఆమేరకు వరుసగా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పచ్చని పల్లెల్లో ప్రత్యక్ష భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.పులివెందులలో 30ఏళ్ల క్రితం ఇలాంటి సంస్కృతి ఉండేది. 20ఏళ్లుగా పట్టణ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. తాజా ఉప ఎన్నికలు ఒక్కమారుగా భయానక వాతావరణం తీసుకొచ్చాయి. వ్యవస్థలు చేష్టలుడిగి కూర్చుండిపోవడమే అందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మొన్న అ కారణంగా హత్యాయత్నం ఘటన ఉత్పన్నమైంది. 24 గంటలు గడవకముందే ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదుకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు నిందితులు మరికొంతమందిని టార్గెట్ చేసి కొడతామంటూ యఽథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రచారం ఉన్న ప్రాంతాలకు మాత్రమే బందోబస్తు కేటాయిస్తున్న పోలీసు అధికారులు.. దుండగుల కట్టడికి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.చెప్పినట్లు వింటారా... మీకు అదే గతి కావాలా?!పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెప్పినట్లు వింటారా...మీకు అలాంటి గతి పట్టించాలా?అంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఏస్థాయికి బరితెగించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలన్నీ కూడా కేవలం పోలింగ్ రోజు ఏకపక్ష పోలింగ్ కోసమేనని పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందులలో టీడీపీ బలంతో పోలిస్తే వైఎస్సార్సీపీ బలం గణనీయంగా ఉంది. అయినప్పటికీ టీడీపీ నేతలు యథేచ్ఛగా దాడులు తెరపైకి తీసుకొస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.ఎల్లో గ్యాంగ్ హల్చల్....వరుసగా హత్యయత్నం ఘటనలకు పాల్పడిన తెలుగుదేశం మూకలు గురువారం సైతం పులివెందులలో యథేచ్ఛగా సంచరించారు. వాహనాల్లో మారణాయుధాలు వెంటబెట్టుకొని వాహన శ్రేణితో హల్చల్ చేశారు. టార్గెట్ నిర్ణయించిన వ్యక్తుల కోసం అన్వేషించినట్లు సమాచారం. పట్టణంలోని ఓ యూట్యూబర్, మరో ఇద్దరు వేముల మండల నాయకుల కోసం విశేషంగా అన్వేషణ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అధికారుల కళ్ల మందే అటు ఇటు తచ్చాడుతున్నా కట్టడి చేయాలనే ఆలోచన వారికి ఏమాత్రం కన్పించలేదు. కాగా, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏకంగా దిశా–నిర్దేశం చేస్తూ ఎల్లో గ్యాంగ్ను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కొంతమంది అధికారులు, తెలుగుతమ్ముళ్లు, బీజేపీ నేతలు సంయుక్తంగా అడ్డదారుల్లోనైనా సరే, పులివెందుల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలనే ఉత్సాహాన్ని అధికంగా కనబరుస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు.త్రిముఖ వ్యూహం.. అధికారం ఉంది, ప్రతి చర్యలుండవు అనే ధీమా తెలుగుదేశం పార్టీ నేతల్లో బలంగా ఉంది. వెరసి తరచూ హత్యాయత్నం ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈక్రమంలో ముందుగా నాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయడం, తర్వాత ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచడం, ఆ తర్వాత అధికారుల ద్వారా ఏకపక్ష పోలింగ్ నిర్వహించడం. అప్పటికీ గెలుపు అంచనాకు రాకుంటే విచ్చలవిడి హింసకు పాల్పడడంతోనైనా గట్టెక్కాలనే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఆమేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రణాళికలు రచించినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. -
ఒకటే గమనం.. గెలుపే గమ్యం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక కేంద్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకపక్క ప్రచారంతోపాటు మరోపక్క ఓటు బ్యాంకు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇప్పటికే దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ నేతలకు.. విజయ బావుటా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వివరించారు.ప్రస్తుత రోజులతోపాటు ఎన్నికల ముందు అనుసరించాల్సిన విధానాన్ని వివరించడంతోపాటు సమష్టిగా పని చేస్తూ.. ఒక పథకం ప్రకానం ముందుకు వెళితే విజయం తథ్యమని వివరిస్తూ వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, నేతలు, శ్రేణులు ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి అతిథి గృహం వద్ద రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి నేతలతో చర్చించడంతోపాటు సమీక్షించి విజయానికి వ్యూహం రచించారు.కొత్త మాధవరంలో ముమ్మరంగా ప్రచారంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గురువారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, కడప మేయర్ సురేష్ బాబు, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ గూండాల అరాచకంపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల అరాచకం, నిర్వీర్యమైన శాంతిభద్రతలు, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్ధుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ను కలిశారు.ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ గూండాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్కు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసి, ఎలా గాయపరిచారో తెలియచేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాజ్భవన్ వెలుపల బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి, ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారు.కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరాం. ఎన్నికల కమిషన్కు కూడా దీనిపై ఫిర్యాదు చేశాం. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం.ఆ విషయాన్ని కూడా గవర్నర్కు వివరించాం. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనంను ఆధారాలతో సహా గవర్నర్కు తెలియచేశాం. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడిన మాటలు పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్ని సందర్భాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వ్యవస్థలు చట్టప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదు.గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నౌడు వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, సతీష్రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో కూటమి వేధింపులు కొనసాగుతున్నాయి. పులివెందులలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడిని నిరసిస్తూ శాంతియుతంగా చేసిన ర్యాలీపై ఎన్నికల కోడ్ ఉల్లంఘిచారంటూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.న్యాయం కోసం పోలీసులకు వినతిపత్రం ఇస్తే దానిపైనా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము, హేమాద్రిపై టీడీపీ మూకలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సురేష్ రెడ్డి, అమరేశ్వర రెడ్డిపై కూడా దాడి చేశారు.వైఎస్సార్సీపీ శ్రేణులపై వరుస దాడులు, హత్యాయత్నాలపై వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ముందురోజే నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఎమ్మెల్సీపై దాడి జరిగేది కాదని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. -
పులివెందులలో రౌడీ రాజ్యం.. వైఎస్సార్సీపీ నేతలపైనే ఎదురు కేసులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు వేళ.. తెలుగు దేశం పార్టీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్గా దాడులకు తెగబడిన పచ్చదండు.. ఇప్పుడు పోలీసుల సాయంతో గాయపడినవాళ్లపైనే తిరిగి కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.బుధవారం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేల్పుల రాము, హేమాద్రిలతో పాటు 52 మందిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం కొసమెరుపు. మంగళవారం బీటెక్ రవీ అనుచరులు వీరంగం సృష్టించడం, తదనంతరం బుధవారం నల్లగొండువారి పల్లె ఘటనల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా జరుగుతున్న పరిణమాల్లో దాడికి పాల్పడిన ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా ఒంటిపై గాయాలే కనపడకపోతే ఎలా అరెస్ట్ చేస్తాం? అంటూ డీఐజీ కోయ ప్రవీణ్ వెటకారంగా మాట్లాడడమూ చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిపై ఎదురు కేసులు పెడుతున్నారు. మరో వైపు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులపై కొనసాగుతున్న బైండోవర్ కేసులు పెడుతున్నారు. రక్తమొడుతున్నట్లు తలలు పగులగొట్టినా.. ఒంటిపై గాయాలు లేవంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రచారం చేసే పల్లెల్లో కాకుండా వేరే చోటికి వెళ్లి పత్తి వేపారం చేస్తే రక్షణ కల్పించలేమని, తాము లేకపోతే తలకాయలే ఎగిరి పోయేయంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు దాడులకు తెగబడిన వాళ్ల జోలికి వెళ్లడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
టీడీపీ నేత బీటెక్ రవి బరి తెగిస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన సతీమణిని అభ్యర్థిగా నిలబెట్టిన ఆయన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పచ్చని పల్లెల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ విష సంస్కృతికి తెర తీస్తున్నారు. ఆది నుంచి హత్యా రాజకీయాల్నే నమ్ముకున్
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. గతంలో ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు చేసిన ఆయన తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కేంద్రంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. భౌతిక దాడులు.. హత్యాయత్నం ఘటనలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. తీవ్ర ఘర్షణలు..అల్లర్లు సృష్టించేందుకే నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమందిని బ్యాచ్లుగా ఎంపిక చేసి.. ఎంచుకున్న వారిపై హత్యాయత్నానికి కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవికి హైటెక్ తెలివితేటలు అధికమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. అది నిజమని పలుమార్లు రుజువైంది. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహాద్రిపురం ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మా రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. ఒకే ఒక ఎంపీటీసీ సభ్యుడి ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. మెజార్టీ సభ్యుడిగా ఉన్న కొమ్మారామలింగారెడ్డి హత్యతో ఎంపీపీ ఖాళీ ఏర్పడితే ఆస్థానం గెలుపొంది చేజేక్కించుకోవచ్చునే ఎత్తుగడను బీటెక్ రవి ప్రయోగించారు. వెరసి ఎంపీపీ కొమ్మా రామలింగారెడ్డి హత్య తెరపైకి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆపై ఏర్పడ్డ ఫ్యాక్షన్ నేపధ్యంలో ప్రతీకార హత్యలు లేకపోలేదు. ఇంటి వాస్తు కోసం రోడ్డుకు అడ్డంగా గోడ ఏర్పాటు కసనూరు గ్రామానికి చెందిన బీటెక్ రవి సింహాద్రిపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి పరమడ వైపు రోడ్డు ఉంది. రోడ్డు అడ్డంగా గోడ కట్టారు. కారణమేమంటే వాస్తుకు అనువుగా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు. అటువైపు ఇళ్లున్న వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. బీటెక్ రవి అనుచరులు దాడులు చేస్తారనే భయం వారిని బాహాటంగా ప్రశ్నించకుండా చేసింది. ఫలితంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించినా చూస్తుండిపోయిన దుస్థితి నెలకొంది. జెడ్పీటీసీ ఎంట్రీలోనూ అదే పరిస్థితి... సింహాద్రిపురానికి చెందిన బీటెక్ రవి తన సతీమణి లతాను పులివెందుల జెడ్పీటీసీగా పోటీ చేయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల పట్టణం, రూరల్లో దందాలు, సెటిల్మెంట్లు మొత్తం వ్యవహారం గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. స్థానికంగా టీడీపీ నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నా, బీటెక్ రవి తన కుటుంబ సభ్యుల్ని పోటీలో దింపడం వెనుక ఈ ప్రాంతంపై పట్టు సాధించాలనే తపన అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి లోకల్. ఇక టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత నాన్ లోకల్ అయినప్పటికీ పోటీకి ఆసక్తి చూపడం వెనుక బహుళ ప్రయోజనాలున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందుల ప్రశాంతతకు భంగం... ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ప్రజలు, రైతులు కక్షలకు దూరంగా ఉండి పూర్తిగా వ్యవసాయం బాటపట్టారు. అందుకు అనువైన పరిస్థితులు మహానేత కల్పించారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు వచ్చి చేరింది. ఆదాయం కళ్లు చూడడం, క్రమేపి ప్రశాంత వాతావరణానికి జనాలు అలవాటు పడ్డారు. 2004 నుంచి 2024 వరకూ పులివెందులలో ప్రశాంత వాతావరణం కొనసాగేది. కూటమి అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతతకు భంగం ఏర్పడింది. తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అది మరింత ఎక్కువైంది. మంగళవారం రాత్రి సైదాపురం సురేష్కుమార్రెడ్డి, అమరేష్రెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం నల్లగొండుగారిపల్లెలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. టీడీపీ మూకలు బరితెగించి గ్రామస్తుల సమక్షంలోనే వేల్పుల రామలింగారెడ్డి హత్యకు విశ్వయత్నం చేశారు. పెట్రోల్ పోసి నిలువునా అంటించడానికి ప్రయత్నించారు. వాహనాలు ధ్వంసం చేశారు. అద్దాలను సమ్మెటతో పగలగొట్టి వాహనంలోకి పెట్రోల్ చల్లారు. తీవ్ర భయాందోళనలు సృష్టించారు. నల్లగొండుగారిపల్లె గ్రామస్తులు అడ్డుగా నిలవడంతో వేల్పుల రామలింగారెడ్డి ప్రాణాలతో బతికిపోయారని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే అరాచకానికి నిలువెత్తు రూపంగా బీటెక్ రవి నిలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు! తాజాగా పులివెందులలో ఎంట్రీలోనూఇదే సంస్కృతికి బీజం పట్టణ ప్రశాంతత కలుషితం అవుతోందనిప్రజాస్వామ్యవాదుల ఆవేదన లోకల్ నాయకులకు అవకాశం ఇవ్వకుండా రంగప్రవేశం వెనుక అతి పెద్ద స్కెచ్ -
టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి
పులివెందుల: సాధారణ ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి మోసం చేసిన టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కనంపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్లతో కలిసి ఇంటింటి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12న జరిగే జెడ్పీటీసీ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఒకేసారి రూ.20వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు ఇస్తామన్న పింఛన్ పథకం ఏమైందని ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేయలేని ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే ఎక్కడ ఓడిపోతామోనని వైఎస్సార్సీపీ నాయకులపై దాడు లు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమ ర్శించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ పేరుతో పోలింగ్కు రాకుండా నియంత్రించే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గాలను చేస్తున్న టీడీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కనంపల్లెలో ఘన స్వాగతం మండలంలోని కనంపల్లె గ్రామంలో బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఘనంగా గ్రామస్తులు స్వాగతం పలికారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కనంపల్లెలో ఇంటింటి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయనకు విశేష ఆదరణ లభించింది. ప్రచారంలో భాగంగా జగనన్న పాటకు మహిళలు నృత్యాలు చేస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి పులివెందుల: ఈనెల 12వ తేదీన జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందుల మండలం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో పులివెందుల ఎంతో ప్రశాంతంగా ఉండేదన్నారు. ఎలాంటి దాడులు గానీ, దుస్సంఘటనలు గానీ జరగలేదని, అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. మన పులివెందుల ప్రశాంతంగా ఉండాలంటే, మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, ఇక్కడి ప్రాంతాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్సీపీఅభ్యర్థిని గెలిపించండి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలోఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి -
ఊయలే.. ఉరితాడై
– గొంతుకు బిగుసుకుపోయి బాలిక మృతి జమ్మలమడుగు : సరదాగా ఆడుకునే ఊయలే.. గొంతుకు బిగుసుకుపోయి అరీఫా(9) ప్రాణం తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరు మున్నీరయ్యారు. ఎర్రగుంట్ల పట్టణం వినాయకనగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను విషాదంలో నింపింది. సీఐ నరేష్బాబు వివరాల మేరకు.. వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న అలీబాషా స్థానిక నాపరాయి గనిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమార్తె ఆరీఫా పట్టణంలోని ప్రభు త్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సా యంత్రం స్కూల్నుంచి వచ్చిన ఆరీఫా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో ఊయలతో సరదాగా ఆడుకుంటోంది. ఈ సందర్భంగా చీర ఊయల మెడకు బిగించుకుపోవడంతో ఊపిరాడక మరణించింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పాపను చూసి సృహ కో ల్పోయిందని భావించి ఆసుపత్రికి తీసుకుపోయారు. వైద్యులు పరీక్షించి ఆరీఫా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పాప మరణం స్థానికులను కలవరపెట్టింది. మహిళ అదృశ్యం బి.కోడూరు : మండలంలోని మున్నెల్లి పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన కొండా దొరసానమ్మ ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదని తండ్రి కొండావెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుఎస్ఐ సురేష్ తెలిపారు. ఆయన వివరాల మేరకు... తనపై దొంగతనం మోపారని మనస్తాపానికి గురైన దొరసానమ్మ ఈ నెల 3న ఇంటినుంచి వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి వస్తుంటుందని వెంకటరామిరెడ్డి తెలిపారని ఎస్ఐ పేర్కొన్నారు. -
భక్తిభావంపై రాజకీయ కుట్ర
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి నేతల కక్ష పూరిత రాజకీయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమ రాజకీయ ప్రాబల్యం నిరూపించుకునేందుకు చివరికి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు వెనుకాడటంలేదు. ఈ కోవలోనే బద్వేల్కు సమీపంలో సగిలేరు ఒడ్డున ఓ వైఎస్సార్సీపీ నేత ఏర్పాటుచేసిన స్నానాల ఘాట్ను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ సమయంలో భక్తులు అడ్డుపడటంతో వెనుదిరిగారు. మంగళవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ చర్య రెవెన్యూ అధికారులు చేసిందా లేక అధికార పార్టీ నాయకులు చేసిందా? అనేది అంతుపట్టడం లేదు. ఘాట్ తొలగించేందుకు యత్నం మండలంలోని కొంగలవీడు సమీపంలో సగిలేరు ఒడ్డున వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వంకెలపోలిరెడ్డి సుమారు రూ.12 లక్షల సొంత నిధులతో స్నానాల ఘాట్ ఏర్పాటు చేయించారు. ఈ ఘాట్ను గతేడాది నవంబర్ 11న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధల చేతులమీదుగా ప్రారంభించారు. బద్వేల్ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి సారిగా నదీ పరివాహక ప్రాంతంలో ఘాట్ ఏర్పాటు చేయడంతో గతేడాది శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో వందలాది మంది భక్తులు, అయ్యప్ప దీక్షాపరులు, మహిళలు నదీస్నానాలు చేరశారు. దీపాలు నదిలో వదిలి భక్తిభావంతో పరవశించిపోయారు. దీంతో ఘాట్ ఏర్పాటు చేయించిన వైఎస్సార్సీపీ నేత పోలిరెడ్డికి చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి పేరు లభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ నేతలు పోలిరెడ్డిని టార్గెట్ చేశారు. సిద్దవటం రోడ్డులో తన కుటుంబసభ్యులు నిర్మించుకున్న ఇళ్లకు అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చి సీజ్ చేశారళ్లీ ఘటన మరువకముందే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన స్నానాల ఘాట్ను తొలగించాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ వ్యవహారం జేసీ కోర్టులో నడుస్తోంది. అవేమీ పట్టించుకోకుండా రాత్రి సమయంలో జేసీబీతో వచ్చి స్నానాలఘాట్ వద్ద ఏర్పాటుచేసిన గదిని తొలగించేందుకు యత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు గమనించి ఘాట్ను తొలగించకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక తొలగించేందుకు వచ్చిన వారు వెనుదిరిగారు. స్నానాల ఘాట్ తొలగించేందుకు యత్నం