breaking news
YSR
-
ఎనిమిది తరగతులు..ముగ్గురు ఉపాధ్యాయులు
బద్వేలు : మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుండి 8 వరకు తరగతులు ఉన్నాయి. అందులో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకూ 20 మంది విద్యార్థులు ఉండగా 6,7,8 తరగతుల్లో 18 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు సబ్జెక్ట్ల వారీగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంది. కానీ ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధిస్తున్నారు. మూడు పాఠ్యాంశాల బోధన ఒకరిచేతే.. ఇటీవల విద్యాశాఖలో జరిగిన బదిలీల్లో చింతలచెరువు పాఠశాలకు ఇద్దరు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు వచ్చారు. వారిలో ఒకరు ఇంగ్లీషు టీచర్ కాగా మరొకరు గణితశాస్త్రం ఉపాధ్యాయురాలు. గణితం ఉపాధ్యాయురాలు గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం బోధిస్తుండగా ఇంగ్లీషు ఉపాధ్యాయుడు ఇంగ్లీషు, సాంఘీక శాస్త్రం పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. తెలుగు, హిందీ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుల నియామకం జరగలేదు. దీంతో 6,7,8 తరగతుల విద్యార్థులకు ఆ రెండు భాషలను బోధించే ఉపాధ్యాయలు కరువయ్యారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్వెస్లీ మాట్లాడుతూ కనీసం డిప్యుటేషన్పై అయినా ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కాగా ఎంఈఓ–1 చెన్నయ్య మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల నియామకం జరిగిందన్నారు. సబ్జెక్టుల వారీగా నియమించలేదన్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకే ఉపాధ్యాయులను కేటాయించిందని స్పష్టం చేశారు. విద్యాశాఖలో వింత పోకడలు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు ఇక్కట్లు -
ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 మాసాల్లో ఎన్ని అప్పులు చేశారో, అవి దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలకు బాండ్లు ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. అన్నీ లెక్కలేసుకున్నాం...ప్రతి పథకమూ అమలు చేస్తాం...అలా చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారన్నారు. ఇప్పుడు వారిని చొక్కాపట్టుకొని నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో ఈ ప్రభుత్వానికి ఓటేసి మోసపోయామని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తే ఆంధ్రాను అమ్మేయాలని అచ్చెన్నాయుడు చెప్పడాన్ని బట్టి చూస్తే ఆ పథకం అమలు చేసే ఉద్దేశం లేదని అర్థమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ చేసిన ఉద్యమాల వల్లే ‘తల్లికి వందనం’ అరకొరగా అమలు చేశారన్నారు. ఇంకా చాలా మంది అర్హులైన తల్లులకు డబ్బులు పడలేదన్నారు. 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇప్పుడు దాన్ని స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చిన్నారులు, మహిళలకు రక్షణ కరువైందన్నారు. మద్యం కేసులో ప్రభుత్వం చెప్పేవన్నీ భేతాళ కథలేనన్నారు. సంబంధం లేని వారిని ఇందులో ఇరికించి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, ఈస్ట్ జోన్ అధ్యక్షుడు బీహెచ్ ఇలియాస్, వలంటీర్స్ విభాగం నాయకులు అఖిల్, భాస్కర్రెడ్డి, వంశీ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
జిల్లా సమగ్రాభివృద్ధికి రాజీలేని పోరాటాలు
బద్వేలు అర్బన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. బద్వేలులో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ జిల్లా మహాసభలు గురువారంతో ముగిశాయి. ఇందులో భాగంగా స్థానిక సీపీఐ కార్యాలయం జేవీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తిచేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న గాలేరు–నగరి, తెలుగుగంగ, రాజోలి, వెలిగొండ రెండవ దశ పనులను పూర్తి చేయడంతో పాటు నికర జలాలు కేటాయించాలని కోరారు. సోమశిల, గండికోట, గాలేరు–నగరి ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరారు. కడప నగరాన్ని స్మార్ట్సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, యర్రగుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కడప – బెంగుళూరు రైల్వే పనులు పూర్తి చేయడంతో పాటు మూతపడ్డ చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాలకేంద్రాలను తెరిపించాలన్నారు. నూతన కమిటీ ఎన్నిక సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా గురువారం జరిగిన ప్రతినిధుల సభలో నూతన జిల్లా కార్యదర్శితో పాటు 17 మంది కార్యవర్గ సభ్యులను, 79 మంది కౌ న్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో జిల్లా కార్యదర్శిగా గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులుగా బి.రా మయ్య, ఎల్.నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, ఎన్.వెంకటశివ, పి.సుబ్బరాయుడు, సి.సుబ్రమణ్యం, వి.వీరశేఖర్, ఎం.వి.సుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్, విజయలక్ష్మి, శ్రీరాములు, కె.సి.బాదుల్లా, గంగాసురేష్, పి.బా లు, జి.మద్దిలేటి, శంకర్నాయక్, వెంకటరాముడుల ను ఎన్నుకున్నారు. సమావేశంలో పలువురు జిల్లా కా ర్యవర్గ సభ్యులతో పాటు సీపీఐ ఏరియా సహాయ కా ర్యదర్శి మస్తాన్, రూరల్ కార్యదర్శి ఇమ్మానియేలు, ఏ ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సీపీఐ పట్టణ సహా య కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన సీపీఐ జిల్లా మహాసభలు -
నిందితులకు వైద్య పరీక్షలు
తొండూరు : ఇటీవల సైదాపురం బస్టాప్ సమీపంలో జరిగిన దాడి కేసులో నిందితులైన తొండూరు మండలం ఇనగలూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దాడి కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను బుధవారం పోలీసులు రిమాండ్కు పంపారు. జడ్జి ఎదుట పోలీసులు తమను చితకబాదారని నిందితులు వాపోయారు. దీంతో జడ్జి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. నేపథ్యంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను కోర్టుకు అందించనున్నట్లు తెలిసింది. సినిమా థియేటర్ వద్ద ఘర్షణ కడప అర్బన్ : డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కథా నా యకుడిగా నటించిన హరహర వీరమల్లు చలనచిత్రం ఈనెల 23న రాత్రి ప్రీమియం షో విడుదల చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా బుధవారం రాత్రి కడప నగరంలోని రాజా (రహత్) సినిమా థియేటర్ వద్ద అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఘర్షణను సద్దుమణిగేలా చేశారు. -
వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని పాపాఘ్ని నదిపై ఉన్న పాత వంతెన వద్ద కడప నగరానికి చెందిన సయ్యద్ రసూల్ (52) విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడపకు చెందిన సయ్యద్ రసూల్ బుధవారం కమలాపురంలో ఉన్న తన కుమార్తె జైబీన్ ఇంటికి వచ్చాడు. పాపాఘ్ని నది వద్దకు వెళ్లి వంతెన కింద విష ద్రావణం తాగి తన కుమార్తెకు ఫోన్ చేసి తనను దేవుడు రమ్మంటున్నాడని, తాను బ్రిడ్జి వద్ద ఉన్నానని, మీ అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. దీంతో కుటుంబీకులు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలో పడి ఉండటంతో చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు కమలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేశారు. లారీ ఢీ కొని రెండు గేదెలు మృతి కొండాపురం : మండల పరిధిలోని ఓబన్నపేట పునరావాస కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిలో పాల లారీ ఢీ కొని రెండు పాడిగేదెలు మృతి చెందాయి. స్థానికుల వివరాల మేరకు మండలంలోని ఓబన్నపేట గ్రామ రైతు తలారి పెద్ద గుర్రప్పకు చెందిన పాడి గేదెలు మేతకోసం వెళ్లి తిరిగి వస్తుండగా ముద్దనూరు వైపు నుంచి వస్తున్న పాలలారీ ఢీ కొంది. దీంతో రెండు పాడిగేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో గేదెకు తీవ్ర గాయాలయ్యయి. గేదెల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్పేటకు చెందిన బాలిక(17)ను ఈనెల 16న అదే ప్రాంతానికి చెందిన సత్యరాజ ముని శ్రావణ్కుమార్ (22) అనే యువకుడు మాయమాటలు చెప్పి, కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్లాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కడప టూటౌన్ ఎస్ఐ ఎస్కెఎం హుసేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బాలికను, నిందితుడిని పట్టుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాలికలు, మహిళలపట్ల ఎవరైనా వేధింపు చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైరు చోరీ ముద్దనూరు : మండలంలోని ఆరవేటిపల్లె గ్రామంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్వైరును బుధవారం రాత్రి చోరీ చేసినట్లు బాధిత రైతు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టారని, దీంతో విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆరా తీయండి.. ఆట కట్టించండి !
మదనపల్లె రూరల్/కురబలకోట : ఆరా యాప్ మోసానికి బలైన బాధితులు గురువారం పెద్ద ఎత్తున మదనపల్లె వన్ టౌన్ పోలీసు స్టేషన్కు క్యూ కట్టారు. వీడియోలు చూస్తే చాలు డబ్బులు వస్తాయన్న అత్యాశకు పోయి ఆరా యాప్లో పెట్టుబడి పెట్టి యాప్ నిర్వాహకులచే మోసానికి గురై లక్షల్లో నగదు వేల సంఖ్యలో బాధితులు పొగొట్టుకున్నారు. ఆరా యాప్ మోసంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వందల సంఖ్యలో బాధితులు బయటకు వచ్చారు. తాము యాప్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టామో, తమను మాయమాటలతో ఎలా మోసం చేశారో విలేకరులకు వివరించారు. మదనపల్లె దిగువ కురవంకకు చెందిన మోహన్బాబు అనే వ్యక్తి నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఆరా యాప్ ద్వారా లక్షల్లో ప్రజల సొమ్ము కాజేసి చేతులెత్తుశాడు. వారం రోజులుగా యాప్ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేయడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. సత్యసాయి జిల్లా, కర్నాటక రాష్ట్రం చింతామణి, మదనపల్లె డివిజన్లోని పెద్దమండ్యం, మదనపల్లె, కలికిరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బాధితులు వన్ టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. యాప్లో పెట్టుబడి పెట్టిన సభ్యులకు మొదట్లో కొంత మందికి నగదు ,బహుమతులు ఇచ్చి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించి భారీ మోసానికి తెరదీశారు. మోసపోయిన బాధితులు యాప్ ద్వారా నగదు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు వ్యక్తిగత ఖాతా వివరాలు, పాన్కార్డు, ఆధార్కార్డు తదితర వివరాలు యాప్కు లింక్ చేశామని, దీని వల్ల తాము భవిష్యత్తులో నష్టపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆరా యాప్ బాధితులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట పడిగాపులు కాశారు. రాత్రి వరకు 300కుపైగా బాఽధితులు తాము నష్టపోయినట్లు ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో బాధితులు వన్టౌన్ పోలీసు స్టేషన్కు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై మోహన్బాబును అదుపులో తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడే నిందితుడి వద్ద యాప్కు సంబంధించిన వివరాలు, వ్యాపార లావాదేవీలు, అందుకు సంబంధించిన అనుమతులు తదితర అంశాలపై విచారించారు. అనంతరం నిందితుడిని రాత్రి వన్టౌన్ పోలీసుస్టేషన్కు తరలించగా అప్పటి వరకు అక్కడే వేచివున్న బాఽఽధితులు పోలీసుల సమక్షలోంనే నిందితుడిని చుట్టుముట్టారు. తమకు యాప్లో నగదు విత్డ్రా అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని వన్టౌన్ సీఐ ఏరిసావలీని కోరారు. యాప్ నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు మోహన్బాబు ద్వారా మెసేజ్ పెట్టించారు. అయినా బాధితుల అకౌంట్లు పునరుద్ధరించడం వీలుకాదంటూ యాప్ నిర్వాహకుల నుంచి తిరుగు మెసేజ్ రావడంతో సభ్యులంతా ఒక్కసారిగా తాము పూర్తిగా మునిగిపోయామని తమ నగదు తిరిగి రాదని సీఐ,ఎస్ఐలకు వివరించారు. అనంతరం నిందితుడు మోహన్బాబును పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ భారీ ఆన్లైన్ మోసానికి పాల్పడిన మోహన్బాబుపై కేసు నమోదు చేస్తామన్నారు. విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా బాధితులు ఈ స్కీంలో వారు వీరు అని కాకుండా వివిధ వర్గాల వారు మోసపోయారు. ఆరా యాప్లోనే దేశ వ్యాప్తంగా 30లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు చూపారు. వేగవంతంగా ప్రాబల్యం పొందింది. కోట్లలో కొల్లగొట్టారు. నిర్వాహకులు ఎవరో ఎవరికీ తెలీదు. అంతా వాట్సప్ చాటింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించారు. రెండు రోజులుగా టాస్క్లు కూడా ఓపన్ కాలేదు. యాక్టివేషన్ చేసుకోవాలని నిర్ణీత నగదు చెల్లిస్తే టాస్క్లు వస్తాయని కండిషన్ పెట్టారు. అసలుకే ఎసరు పడటంతో మళ్లీ నగదు చెల్లించి యాక్టివేషన్ ఎలా అని దిక్కుతోచని స్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. దొరకరంతే..ఆరా యాప్ నిర్వాహకులను నేరుగా చూసిన వారు మాట్లాడిన వారు లేరు. కార్యకలాపాలన్నీ వాట్స్ప్ చాటింగ్ ద్వారానే జరిగాయి. చట్టానికి దొరక్కుండా మొదటి నుండి జాగ్రత్త పడ్డారు. ఇండియా ప్రతినిధిగా లూధియా పేరుతో లావాదేవీలు నిర్వహించారు. ప్రధాన కార్యాలయం లండన్లో ఉన్నట్లు ప్రొఫైల్లో చూపారు. లక్షలాది మందిని నిలువునా ముంచేసిన నిర్వాహకులపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని, పోలీసులను బాధితులు కోరుతున్నారు. పోలీసు స్టేషన్కు క్యూకట్టిన ఆరా యాప్ బాధితులు ఇతర జిల్లాల నుంచి మదనపల్లె స్టేషన్లో ఫిర్యాదు ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ వద్దే నిరీక్షించిన బాధితులు -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
కడప అగ్రికల్చర్ : గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహించి ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. గురువారం కడపలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై రైతు సేవా కేంద్రాల వీఏఏ, వీహెచ్ఏలకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు కడప వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పెండ్లిమర్రి, ఖాజీపేట, చెన్నూరు,ఒంటిమిట్ట, చింతకొమ్మదిన్నె, కడప మండలాల రైతు సేవా కేంద్రాల వీఏఏ, వీహెచ్ఏలు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన నేల సారవంతంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చనే విషయాలను రైతులకు తెలియజేయాలన్నారు. అలాగే పంటసాగు చేసిన ప్రతి రైతుకు ఈ–పంట నమోదు చేయాలన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్ర మాట్లాడుతూ ఉద్యాన పంటలైన అరటి, నిమ్మపంటలను ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించవచ్చో వివరించారు. కడప సహాయ సంచాలకుడు సురేష్ కుమార్రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ప్రకృతి వ్యవసాయ పదెంధతులైన జీవామృతం, ఘణ జీవామృతం, ద్రవ జీవామృతం, కషాయలు ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుని రైతులకు తెలియజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు కృష్ణసుమంత్రెడ్డి, ఈశ్వరరెడ్డి, శ్రీదేవి, నాగార్జున, జయలక్ష్మి, ఉద్యానశాఖ అధికారి జీవన్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల వీఏఏలు, వీహెచ్ఏలు పాల్గొన్నారు. వీఏఏ, వీహెచ్ఏలకు జిల్లా వ్యవసాయ అధికారి సూచన -
ఇద్దరు ఎర్రచందనం దొంగల అరెస్ట్
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని నాగులపల్లె సమీపంలో బుధవారం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని మీనాపురం వద్ద గల జగనన్న కాలనీలో నిల్వ ఉంచిన 14 ఎర్రచందనం దుంగలను ఏపీ07సీఏ9939 నెంబరు గల వోక్స్ వ్యాగన్ కారులో మైదుకూరు వైపు తరలిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రూరల్ సీఐ శివశంకర్ ఆదేశాలతో మండలంలోని నాగులపల్లె వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో వాహన తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారు వేగంగా వస్తుండగా సిబ్బంది అడ్డుకోబోగా వారిపై దూసుకెళ్లి తప్పించుకుని వెళ్తుండగా చాకచక్యంగా కారును పట్టుకున్నారు. పట్టుబడిన కారు నుంచి ముగ్గురు దొంగలు పారిపోగా, ప్రొద్దుటూరు మండలం ఖాదర్బాద్కు చెందిన బోయ కుమార్, బోయ కిషోర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దుంగలు 281 కేజీలు ఉండగా వీటి విలువ అధికారికంగా రూ.1.50లక్షలు ఉంటుంది. అనధికారికంగా రూ.15లక్షలు ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేసి పారిపోయిన మరో ముగ్గురు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు బాషా, నాగేంద్రప్రసాద్ ఎఫ్బీఓ హరినాథరాజు, కానిస్టేబుళ్లు మధు, అభిరాం, బ్రహ్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. 14 దుంగలు, కారు స్వాధీనం పరారీలో మరో ముగ్గురు, ఎర్రచందనం విలువ రూ.1.50 లక్షలు -
మీడియాకు ప్రశ్నించే హక్కులేదు..!
తొండూరు : మీడియాకు ప్రశ్నించే హక్కే లేదంటూ గురువారం జరిగిన మండల సమావేశంలో విలేకరులపై ఎంపీడీఓ విష్ణుప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. తొండూరు ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో ఎంపీడీఓ విష్ణుప్రసాద్ అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చిస్తుండగా.. దీనిపై విలేకరులు నిధుల వినియోగంపై స్పష్టతను కోరారు. దీనిపై ఎంపీడీఓ విలేకరులపై ఒక్కసారిగా మీకు ప్రశ్నించే హక్కు లేదు, కేవలం సమాచారం అడగడమే మీ పని అంటూ విలేకరులపై అసభ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. విలేకరులు హద్దుమీరి ప్రవర్తిస్తే వాళ్ల మీద కేసులు పెట్టండి నేను చూసుకుంటానని జిల్లా కలెక్టర్ చెప్పారని ఎంపీడీఓ తెలిపారు. ఒక అధికారిపై అక్రమాల ఆరోపణలుంటే మీడియా ప్రశ్నించడం తప్పుకాదని, దానిపై అసభ్యంగా స్పందించడమే చట్ట వ్యతిరేకమని స్థానిక విలేకరులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓ విష్ణుప్రసాద్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పాత్రికేయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
యాప్ండి సారూ!
● అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్లో ముప్పుతిప్పలు ● యాప్ల నిర్వహణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అంగన్వాడీ కార్యకర్తలు ● బాలింతలు, గర్భిణుల గుర్తింపులో సరిగా పనిచేయని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కడప కోటిరెడ్డిసర్కిల్: అంగన్వాడీ కార్యకర్తలు యాప్లతో సతమతమవుతున్నారు. లబ్ధిదారులకు పోషణ ట్రాకర్ బాలసంజీవిని అందించడానికి ఒకటా రెండా.. నాలుగు యాప్లను నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఫేస్ రికగ్నైజ్ చేసి యాప్లో నమోదు చేయాలి. ఇక్కడే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫేస్ రికగ్నైజ్ చాలామార్లు సక్సెస్ కావడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవిని ద్వారా లబ్ధిదారులకు ఫేస్ రికగ్నైజేషన్ చేసి బియ్యం ఇస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రాకర్ ద్వారానే లబ్దిదారులను గుర్తించి సరుకులు ఇవ్వాలన్న నిబంధనను తప్పనిసరి చేయడంతో కార్యకర్తలు రెండు యాప్లను నిర్వహించాల్సి వస్తోంది. ఇది చాలా కష్టంగా ఉందని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ యాప్ల గురించి ముందుగా శిక్షణ ఇప్పించాలని విన్నవిస్తున్నారు. పైగా అంగన్వాడీ కేంద్రాల్లో నెట్వర్క్ రావడం లేదని.. మొబైల్స్ ర్యామ్ తక్కువగా ఉండడంతో యాప్ స్పందించక తిప్పలు తప్పడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. చిన్నారుల విద్యకు ఆటంకం ఆయా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్బిణీలు, బాలింతలతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు ప్రతినెల పోషకాహారాన్ని ఇంటి వద్దకే అందజేస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రాల వద్దనే పోషకాహారాన్ని ఇచ్చేవారు. ఎక్కువ మంది తమకు ఇంటివద్దకే పోషకాహారం కావాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో టేక్ హోం రేషన్ (టీహెచ్ఆర్)గా మార్చి పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పుదినుసులు, బియ్యం వంటివి ప్రతినెల రెండు దఫాలుగా అందిస్తున్నారు. నెలలో ఎక్కువ సమయం ఈ పనికే వినియోగించడం వల్ల చిన్నారుల ప్రాథమిక విద్యకు ఇబ్బందిగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీంతోపాటు జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 రకాల రికార్డులను నిర్వహించాల్సి వస్తోంది. దీనివల్ల చిన్నారుల ప్రాథమిక విద్యకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు: 2389 గర్బిణీలు: 10,534 బాలింతలు: 8079 3 ఏళ్లలోపు పిల్లలు: 65,335 ఆరేళ్లలోపు పిల్లలు: 53,162 యాప్ పనిచేయక రేషన్ కోల్పోతున్నాం నా ఫేస్ రికౖగ్నైషన్కు పోషణ్ యాప్ ద్వారా ఎన్నిమార్లు ఐరిస్ తీసినా వీలు కాలేదు. ఒకసారి సక్సెస్ వచ్చినా, రెండవసారి మ్యాచ్ కావడం లేదు. దీనివల్ల నేను రేషన్ కోల్పోతున్నాను. ప్రభుత్వం స్పందించి యాప్ కష్టాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలి. – స్రవంతి, లబ్దిదారు, కడప -
27న ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో ఈ నెల 27వ తేదీ అండర్ –23 సీనియర్స్ మహిళల క్రికెట్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనా లని కోరారు. 01–09–2002 తర్వాత జన్మించిన వాళ్లు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన క్రీడాకారులు ఆధార్ కార్డు కాపీ, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని సూచించారు. ఆరుతడి పంటలకు మేలుకడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కలసపాడులో అత్యధికంగా 36.4 మి.మీ వర్షం నమోదయింది. అలాగే కాశినాయనలో 23.8, పెద్దముడియంలో 18.2 , పోరుమామిళ్లలో 15.4 , దువ్వూరులో 9.2 , రాజుపాలెంలో 8.6 , గోపవరంలో 8 , జమ్మలమగుడులో 7.2 , బికోడూరు, మైదుకూరు, మైలవరంలలో 5.6 , కమలాపురంలో 5.2 , ఖాజీపేటలో 4.4 , బద్వేల్లో 4.2 , చాపాడులో 3.8 , సిద్దవటంలో 3.4 , బి.మఠంలో 3.2 , వల్లూరు, పొద్దుటేరులలో 2.8 , వేములలో 1.2 మి.మీ వర్షం నమోదైయింది. నాలుగు రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న వర్షాలతో ఆరుతడి పంటలకు ఎంతో మేలు జరగనుంది. జీసీడీఓగా రూతు ఆరోగ్య మేరీ కడప ఎడ్యుకేషన్: జిల్లాలో బాలికాభివృద్ధి అధికారి(జిసిడిఓ)గా రూతు ఆరోగ్యమేరీ గురువారం బాధ్యతలను స్వీకరించారు. కడప ఎన్జీఓ కాలనీలోని సమగ్రశిక్ష కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని కస్తూర్భా బాలికల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బాలికలకు అందించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని కేజీబీవీ పాఠశాలల అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కడప ఐసీడీఎస్ పీడీగా రమాదేవి కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా ఐసీడీఎస్ అధికారిగా పి.రమాదేవిని నియమించారు. చింతకొమ్మదిన్నె సీడీపీఓ, అన్నమయ్య ఇన్చార్జ్ పీడీగా పని చేస్తూ పదోన్నతి పై కడప పీడీగా నియమిస్తూ ఆ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సూర్యకుమారి గురువారం రాత్రి ఉత్త ర్వులు జారీ చేశారు. అలాగే ప్రొద్దుటూరు సీడీపీఓగా పని చేస్తున్న హైమావతిని అన్నమయ్య పీడీగా నియమించారు. ప్రొద్దుటూరు అడిషనల్ సీడీపీఓగా పనిచేస్తున్న టి విమల రాణిని విజయనగరం పీడీగా నియమించారు. పోరుమామిళ్ల సీడీపీవోగా పనిచేస్తున్న ఐ విమలను శ్రీకాకుళం పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు -
ఆదాయపు పన్నుతోనే దేశాభివృద్ధి
కడప ఎడ్యుకేషన్: ఆదాయపు పన్నుతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆదాయపు పన్నుశాఖ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని స్పిరిట్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ఆదాయపన్నుశాఖ అధికారులు ఇన్కామ్ టాక్స్డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఆదాయపన్ను కట్టి మన దేశాభివృద్ధికి పాటు పడాలన్నారు. ఆదాయపన్ను శాఖ–2 రఘరామయ్య ఆదాయపు పన్ను లక్ష్యాలను వివరించి విద్యార్థులకు ఆదాయపు పన్ను గురించి ఒక లఘ చిత్రన్ని ప్రదర్శించి ప్రశ్నలు అడిగి వారి ద్వారా సమాధానాలను రాబట్టారు. బాగా సమాధానాలు చెప్పిన ముగ్గురు విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందచేసి అభినందించారు. కళాశాల డైరెక్టర్ రవీంద్ర, విద్యార్థులు, అద్యాపకులు, ఆదాయపు పన్నుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్యం వైపు వసూళ్లు
జిల్లాలో చెక్పోస్టులు: 21 కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీలు సెస్సు వసూళ్లలో మెరుగ్గా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న పది మార్కెట్ కమిటీలకు సంబంధించి 2025–26 ఏడాదికి మార్కెట్ సెస్సు వసూళ్లు రూ.13.53 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. జూన్ చివరి నాటికి రూ. 2.98 కోట్లు వసూలైంది. జిల్లాలో పది మార్కెట్ కమిటీల్లో కొన్ని వసూళ్లలో దూసుకుపోతుండగా.. మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. నాలుగు ఏఎంసీలు వసూళ్లలో మైనస్లో ఉంది... జిల్లాలోని పది అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీలు)లు ఉన్నాయి. ఇందులో ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, సిద్దవటం ఏఎంసీలు వసూళ్లలో గతేడాది కంటే తక్కువగా వసూలైంది. మిగతా కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, ఎర్రగుంట్ల, సింహాద్రిపరం ఏఎంసీల వసూళ్లు గతేడాదికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో భాగంగా కడప మార్కెట్ కమిటి లక్ష్యం ఈ ఏడాది రూ. 205 లక్షలకుగాను ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల కలిపి జూన్ చివరి నాటికి రూ. 69.12 లక్షలు వసూలైంది. అలాగే బద్వేల్ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలు కాగా జూన్ చివరి నాటికి రూ.54.51 లక్షలు, ప్రొద్దటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.199 కాగా జూన్ చివరినాటికి రూ. 21.53 లక్షలు, పులివెందుల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.108 లక్షలు కాగా జూన్ చివరి నాటికి రూ. 29.91 లక్షలు, మైదుకూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 280 లక్షలుకాగా జూన్ చివరి నాటికి రూ. 73.84 లక్షలు, సిద్దవటం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 28 లక్షలుకాగా జూన్ చివరి నాటికి రూ. 4.18 లక్షలు, ఎర్రగుంట్ల మార్కెట్ కమిటి లక్ష్యం రూ. 86 లక్షలుకాగా ఈ ఏడాది జూన్ చివరి నాటికి రూ. 15.28 లక్షలు, సింహాద్రిపురం మార్కెట్ కమిటి లక్ష్యం రూ. 24 లక్షలు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5.24 లక్షలు వసూలు అయ్యింది. ● కడప మార్కెట్కమిటీలో పసుపు, వేరుశనిగ సంబంధించిన క్రయవిక్రయాలు జరగ్గా.. మిగతా మార్కెట్ కమిటీల్లో పండ్లు ఇతర ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి. జిల్లాలో 21 చెక్ పోస్టులు.... జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగ వంటివి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అందుకే కడప మార్కెట్ కమిటి నుంచే ఎక్కువగా సెస్ వసూలు అవుతుంది. గతేడాది కంటే పెరిగిన మార్కెట్ కమిటీల సెస్సు 2025–26 ఏడాది లక్ష్యం రూ. 13.53 కోట్లు ఈ ఏడాది మూడు నెలలకు 2.98 కోట్లు వసూళ్లు లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు జిల్లాలో 2024–25 ఏడాదికి 10 మార్కెట్ కమిటీల పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. అయా చెక్ పోస్టుల ద్వారా వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 13.53 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిసి రూ. 298.16 లక్షల సెస్సు వసూలు చేశాము. ఆగస్టు నుంచి సీజన్ ప్రారంభమౌతుంది. అప్పుడు వసూళ్లు బాగా పెరుగుతాయి. – ఆజాద్ వల్లి, మార్కెటింగ్శాఖ ఇన్చార్జు ఏడీ -
ప్రతి మండలంలో మోడల్ కిచెన్లు
చింతకొమ్మదిన్నె: రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఏర్పాటు చేస్తున్న ఆటోమేషన్ కిచెన్ (మోడల్ కిచెన్) లను జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం చింతకొమ్మ దిన్నె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, జె.కొత్తపల్లె ఉన్నత పాఠశాలలలో జరుగుతున్న సెంట్రలైజ్డ్ ఆటోమేషన్ కిచెన్ హాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాల లో సెంట్రలైజ్డ్ ఆటోమేషన్ ఆఫ్ కిచెన్స్ (మోడల్ కిచెన్) భవన నిర్మాణ పనులను పరిశీలించి సంబందిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్రానికే ఆదర్శంగా జిల్లాలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ హాళ్లను జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కడప ఆర్టీఓ జాన్ ఇర్విన్, ఆగ్రోస్ డీఎం, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ రాజరత్నం, సీకే దిన్నె తహసిల్దార్ నాగేశ్వరరావు, డీఈవో శంశుద్దిన్, ఏపీఎస్పీడిసిఎల్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, ఎస్ఎస్ఏ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ఎంఇఓ, ఆయా పాఠశాలల హెచ్ఎం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిపీ–4 అమలుపై ప్రత్యేక శ్రద్ధ కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4పథకం అమలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రకియ చేపట్టాలని సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంత రం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సేవలు అందించడంలో ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ సేవలు సంతృప్త స్థాయిలో ప్రజలకు అందేలా అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల పరిశీలన
ఉన్నత చదువులకు ఓపెన్ స్కూల్ వరం పోరుమామిళ్ల: మధ్యలో చదువు మానేసినవారు, 14 సంవత్సరాలు పైబడినవారు ఓపెన్స్కూల్ ద్వారా పదవ తరగతి చదివి విద్యాభ్యాసం కొనసాగించవచ్చ ని జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తెలిపారు. బుధవారం పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఓపెన్స్కూల్ వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ సాంబశివారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి, సర్వశిక్షా అభియాన్ ఏఎంఓ విజయభాస్కర్, పోరుమామిళ్ల, కలసపాడు మండలాల ఎంఈఓలు వెంకటయ్య, మస్తాన్వలి, తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు కల్చరల్: మండలంలోని సీతంపల్లెలో శిథిలావస్థకు చేరిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డీఈఓ షంషుద్దీన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు. దీంతో వారు మాట్లాడుతూ పాఠశాల శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులకు సరైన వసతులు లేవని, ఇందువల్ల తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించామని వివరించారు. పాఠశాలకు నూతన భవనం ఏర్పాటు చేయిస్తానని, విద్యార్థులను పాఠశాలకు పంపాలని డీఈఓ కోరగా.. పంపిస్తామని సమాధానమిచ్చారు. ఎంఈఓ సావిత్రమ్మ, ఉపాధ్యాయుడు డీవీ రమణారెడ్డి, సీఆర్పీ భాస్కర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
హంసఫర్కు కడపలో స్టాపింగ్ ఇవ్వండి
పులివెందుల : చైన్నె – అహ్మదాబాద్ మధ్య నడిచే హంసఫర్ ఎక్స్ప్రెస్కు కడపలో స్టాపింగ్ ఇవ్వాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను బుధవారం ఢిల్లీలో కలిసి వినతిపత్రమిచ్చారు. దీంతో పాటు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కడపలోని రాయచోటి రోడ్డులో ఊటుకూరు, ప్రకృతి నగర్ తదితర ప్రాంతాల వాసుల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ప్రస్తుతం తిరుపతి – షిరిడీ మధ్య వారానికి ఒక రోజు మాత్రమే రైలు నడుస్తోందని, అది కూడా మల్టీ చేంజ్ రూట్లుగా వెళ్లడంవల్ల ప్రయాణ సమయం ఎక్కువవుతోందన్నారు. తిరుపతి నుంచి షిర్డీకి నేరుగా ఒక రైలు ను ప్రతిరోజు నడపాలని, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రికి విన్నవించారు. -
శ్రావణం శుభప్రదం
ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండడంతో వివాహాలు, శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. సనాతన ధర్మంలో వివాహం ప్రధానమైనది. వీటిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తే ఆ జంటకు మంగళం జరుగుతుంది. ప్రస్తుతం ఆడంబరాలకు ప్రాధాన్యత పెరిగి ఆచార వ్యవహారాలు తక్కువైపోతున్నాయి. ముందురోజు రాత్రే రిసెప్షన్ ఏర్పా టు వల్ల ముహూర్తానికి హాజరయ్యే వారి సంఖ్య బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఆర్థిక స్తోమత లేని పేద వారికి వివాహ క్రతువును మేము ఉచితంగా నిర్వహిస్తున్నాం. – కె.విజయ్భట్టర్, అధ్యక్షుడు, జిల్లా అర్చక పురోహిత సమాఖ్య, కడప -
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ముద్దనూరులో 26.4 మి.మీ వర్షపా తం నమోదైయింది. కొండాపురంలో 15.2, కమలాపురంలో 12.4, సింహాద్రిపురంలో 10.6, తొండూరులో 3.2, లింగాల, సీకేదిన్నె 2.2, బి.మఠం, పులివెందులలో 1 మి.మీ వర్షం కురిసింది. షోలాపూర్–తిరుపతి రైలు ధర్మవరం వరకు పొడిగింపు కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–షోలాపూర్–తిరుపతి (01437/01438) రైలును ధర్మవరం వరకు పొడిగించారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలును సెప్టెంబరు 27 వరకు రానుపోను 20 ట్రిప్పు లు నడపనున్నారని తెలిపారు. ఈ రైలు గురు వారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్లో బయలుదేరి కురుద్వాడి, బార్సి టౌన్, లాతూర్, లాతూర్రోడ్డు, బీదర్, కలబురిగి, వాడి, యాదగిరి, క్రిష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్లమీదుగా మరుసటిరోజు కడపకు రాత్రి 7.53 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇక్కడినుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి, పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లెరోడ్డు, ములకలచెరువు, కదిరి మీదుగా ధర్మవరం శనివారం ఉదయం 3.30 గంటలకు చేరుకుంటుందన్నారు. అదేరోజు ఉదయం 5.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరి ఇదే మార్గంలో మధ్యాహ్నం 1.30 గంటలకు కడపకు చేరుకుని ఆదివారం ఉదయం 10.45 గంటలకు షోలాపూర్ చేరుతుందని ఆయన వివరించారు. ఎరువుల కొరత సృష్టిస్తే లైసెన్స్ రద్దు ప్రొద్దుటూరు రూరల్: ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే ఎరువుల దుకాణాల లైసెన్స్ను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్ హెచ్చరించారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. నిల్వలలో తేడా వస్తే సరుకులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. కొను గోలు బిల్లులను కచ్చితంగా ఇవ్వాలని తెలిపా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా లో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. ఖరీఫ్ సీజన్కు గాను 70వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. ఈ సీజన్లో మూడు దశల వారీగా ఎరువుల సరఫరా జరుగుతుందన్నారు. తొలి దశలో 25వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయన్నారు. ఏడీఏలు అనిత, అశోక్, ఏఓ వరహరికుమార్ తదితరులు పాల్గొన్నారు. గండిలో హుండీల ఆదాయం లెక్కింపు చక్రాయపేట: గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఉన్న హుండీల ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ సహాయకమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఏడు శాశ్వత హుండీల ద్వారా ఆలయానికి రూ.6,55,549లు, అన్నదానం హుండీ ద్వారా రూ. 7,453లు వెరసి మొత్తం రూ.6,63,002లు వచ్చిందన్నారు. దీంతో పాటు కొన్ని గ్రాముల మిక్స్డ్ బంగారు, వెండి వస్తువులు వచ్చినట్లు తెలిపారు. అలాగే 11 కువైట్ దినార్లు కూడా వచ్చినట్లు చెప్పారు. కడప దేవదాయ శాఖ సహాయ కమీషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆద్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన,ఉప ప్రధాన,అర్చకులు కేసరి,రాజారమేష్,చక్రాయపేట ఏపీజీబీ అధికారులు, ఆలయ సిబ్బంది, సేవకులు పాల్గొన్నారు. టోల్గేట్ టెండరు ద్వారా.. గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో యేడాది కాలం పాటు టోల్గేటు వసూలు హక్కు కల్పించుటకు నిర్వహించిన టెండరు ద్వారా ఆలయానికి రూ.16,10,000లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. అశోక్రెడ్డి అనే వ్యక్తి ఈ టెండర్ దక్కించు కున్నట్లు ఆయన తెలిపారు. -
పారదర్శకంగా పథకాల అమలు
కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో పారదర్శకంగా అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో పీ4, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ తదితర కార్యక్రమాల అమలు నిర్వహణపై కలెక్టర్ జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ది చేయడం కోసం రాంప్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే, గ్రామసభలు ద్వారా గుర్తించామని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రెన్యూర్లను సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ కూడా ప్రభుత్వ రంగానికి ఆర్థిక మద్దతునిస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉద్యం వర్క్షాప్లను నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. పీ4 ఫౌండేషన్ అమలులో భాగంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో ఇప్పటికే జిల్లాలో 78 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, దాదాపు 10 వేల మందిని ఎంపిక చేసిన మార్గదర్శుల ద్వారా అడాప్ట్ చేసుకోవడం జరిగిందన్నారు. ఆగస్టు 10 నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని వివరించారు. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ మెయిన్ స్కూలులో పైలెట్ ప్రాజెక్టుగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మండలంలోను ఇలాంటి ఒకే సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, చంద్రమోహన్, సీపీవో హజరతయ్య, డిఆర్డీఏ, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం చాంద్ బాషా, డీపీఓ ఏవో ఖాదర్ బాషా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
సుముహూర్తాలు ఇవే..
కడప సెవెన్రోడ్స్/ రాజంపేట టౌన్: శుభాల శ్రావణమాసం వచ్చేస్తోంది. వస్తూ..వస్తూ సుముహూర్తాలన్నో మోసు కొస్తోంది. ఇప్పటికే గురు మూ ఢం కారణంగా 48 రోజులుగా శుభ కార్యాలు లేవు. అందుకే శ్రావణమాసంలో ముఖ్యంగా జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వీటితోపాటు భూమి పూజలు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రావణ పౌర్ణమికి ముందు అంటే ఆగస్టు 8వ తేది వచ్చే వరలక్ష్మి వ్రతం మహిళలకు అత్యంత విశేషమైనది. మాఘం,వైశాఖం, శ్రావణం, మార్గశిర మాసాలు వివాహాలు, శుభ కార్యాలకు అనుకూలమైనవి. ఆశల పల్లకిలో.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని కల్యాణ మండపాలన్నీ రిజర్వ్ అయ్యాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలపై ఆధారపడ్డ వస్త్ర దుకాణదారులు, బంగారు వ్యాపారులు, మంగళ వాయిద్య కళాకారులు, వంట వారు, క్యాటరింగ్ సిబ్బంది, హోటళ్ల యజమానులు, పూల వ్యాపారస్తులు, మండపాల డెకరేషన్ నిర్వాహకులు తదితరులు ప్రస్తుత శ్రావణమాసంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వివాహ క్రతువులను నిర్వహించడంలో పురోహితులే కీలకం. వీరికి ఈ సీజన్లో డిమాండ్ ఉంటుంది. కడ ప నగరంలో ఈ మాసంలో ఒక్కో పౌరోహితుడు సగటున ఐదు వివాహాలు జరిపిస్తారు. ఈనెల 26 నుంచి వరుస ముహూర్తాలు పౌరోహితులు, మంగళ వాయిద్యాలు, డెకరేషన్లకు డిమాండ్ కరువుతో బంగారు, వస్త్రాలకొనుగోళ్లపై ప్రభావం శ్రావణమాసం ప్రారంభమైన మరుసటిరోజు నుంచే మంచి ముహూర్తాలు మొదలవుతాయని పండితులు వివరిస్తున్నారు. జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17వ తేది వరకు ఉన్నాయి. మళ్లీ సెప్టెంబరు 23, 24, 26, 27, 28 తేదీలు మంచి ముహూర్తాలుగా చెబుతున్నారు. అక్టోబరులో 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబరులో 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలని పేర్కొంటున్నారు. -
పొలంలో అక్రమ పైపులైన్ వేస్తే ఆత్మహత్య చేసుకుంటాం
చాపాడు : రెవెన్యూ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పొలంలో అక్రమంగా పైపులైను ఏర్పాటు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని మండలంలోని అల్లాడుపల్లెకు చెందిన రైతు దంపతులు గోసుల ఎరికలయ్య గారి కుళ్లాయిరెడ్డి, పద్మావతి బుధవారం వాపోయారు. మండలంలోని అల్లాడుపల్లె పొలం సర్వే నెంబరు 90–2లోని కుళ్లాయిరెడ్డి పొలంలో బుధవారం తన తమ్ముడైన సుధాకర్రెడ్డి జేసీబీ పెట్టి పైపులైన్ ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా కుళ్లాయిరెడ్డి, తన భార్య పద్మావతి, కూతురు రాజేశ్వరి పనులు అడ్డుకున్నారు. ఇక్కడ పనులు చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. దీంతో పనులు ఆపి వెళ్లిపోయారు. బాధితులు మాట్లాడుతూ.. సర్వే నెంబరు 90–2లో 2.50 ఎకరాల సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అల్లాడుపల్లెకు చెందిన ఓ టీడీపీ నాయకుడు, వీఆర్వో, ముగ్గురు పోలీసులు సహాకారంతో సుధాకర్రెడ్డి బుధవారం తమ పొలంలోకి జేసీబీని తీసుకువచ్చి పైపులైను ఏర్పాటు కోసం పనులు చేస్తున్నారన్నారు. గతంలో ఇలా చేయగా అడ్డుకున్నామని మళ్లీ ఇప్పుడు అధికారులను అడ్డుపెట్టుకుని తహసీల్దారు రమాకుమారి తమకు ఆదేశాలు ఇచ్చిందని చెబుతూ తమ పొలంలో అక్రమంగా పైపులైను వేసేందుకు ప్రయత్నించాడన్నారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. తహసీల్దార్ ఏమన్నారంటే.. అల్లాడుపల్లెలోని రైతు కుళ్లాయిరెడ్డి పొలంలో పైపులైన్ నిర్మాణం విషయమై తహసీల్దార్ రమాకుమారిని వివరణ కోరగా.. కుళ్లాయిరెడ్డి పొలంలో పైపులైను వేసుకోవచ్చని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. తన వద్దకు ఎలాంటి దరఖాస్తు రాలేదని చెప్పారు. అల్లాడుపల్లెలో జేసీబీతో చేస్తున్న పనులు అడ్డుకున్న రైతు దంపతులు -
ప్రజల దృష్టి మరల్చేందుకే ఎంపీ అక్రమ అరెస్టు
– ఎమ్మెల్యే డాక్టర్ సుధ బద్వేలు అర్బన్ : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, ఎంపీ పి.వి.మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. బుధవారం ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని, అందులో భాగంగానే ఎంపీ మిథున్రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఎన్ని కుయుక్తులు పడినా వైఎస్సార్సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని తగ్గించలేరని, నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంటు సిద్దవటం : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంటు పటిష్టమైనదని భారతి సిమెంట్ టెక్నికల్ ఇంజినీర్ ఎస్. శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ అధికారి రమణారెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామంలోని మధర్ థెరిస్సా ఎంటర్ ప్రైజస్ సమీపంలో తాపీ మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతి సిమెంటు రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. అనంతరం వారు 40 మంది మేసీ్త్రలకు లక్ష రూపాయల ఉచిత బీమా బాండ్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ కె. వెంకట్రామిరెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని మామిళ్లపల్లె పరిధిలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు గృహ నిర్మాణానికి లే అవుట్ వేసి స్థలాలు కేటాయించింది. పెద్ద లే–అవుట్ కావడంతో అందులో మిగిలిన ప్లాట్లపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఖాళీగా ఉన్న జాగాలలో కొందరు పునాదులు తీసి బేసిమట్టాలు వేసి తమకు తోచిన వారికి తోచిన రేటుకు బోగస్ డి– పట్టాలతో యాథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నట్లు మామిళ్లపల్లె వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. కొందరు అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై చింతకొమ్మదిన్నె తహసీల్దార్ నాగేశ్వరరావును వివరణ కోర తమ దృష్టికి వచ్చిన వెంటనే మామిళ్లపల్లె గ్రామ రెవెన్యూ అధికారిని పంపి విచారించామన్నారు. డి–పట్టాలు పొందిన వారు కాకుండా ఇతరులు ఇళ్ల నిర్మాణం చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఆడబిడ్డ నిధి’ ఇవ్వకుండానే రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు
కడప కార్పొరేషన్ : ‘ఆడబిడ్డ నిధి’ ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాయాల్సిందేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారని...వాస్తవానికి ఆ పథకం అమలు చేయకుండానే కూటమి నేతలు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్బాషా విమర్శించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నీరుగార్చేందుకు మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారెంటీ’ పేరుతో 143 హామీలు ఇచ్చారని, లోకేష్ యువగళంలోనూ అవే హామీలు ఇచ్చారన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంతాలు పెట్టిన బాండ్లను ప్రతి గడపకు పంపిణీ చేశారన్నారు. అప్పుడు హామీ ఇచ్చిన అదే నోటితో అమలు చేయలేమంటున్నారన్నారు. రాష్ట్రంలో 18ఏళ్లు నిండిన మహిళలు 1.80కోట్ల మంది ఉన్నారని, వారికి మొదటి ఏడాది రూ.32,500 కోట్లు ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది 35,100 కోట్లు బకాయి పడ్డారన్నారు. అన్నీ లెక్కలు వేసుకున్నాం... కచ్చితంగా హామీలు అమలు చేసి తీరుతాం...లేనిపక్షంలో కాలర్ పట్టుకొని నిలదీయాలని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ.3.33 లక్షల కోట్లు అప్పు చేస్తే, చంద్రబాబు 14 నెలల్లోనే రూ.1.87లక్షల కోట్లు చేశారన్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. అక్రమ వసూళ్లే వారి పరమావధి కూటమి నేతలకు కింది నుంచి పైదాకా అక్రమ వసూళ్లు చేయడమే పరమావధిగా మారిందని అంజద్బాషా విమర్శించారు. మహానాడు పేరు చెప్పి ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. తానేం తక్కువ కాదంటూ ఆ పార్టీలోని విద్యార్థి నాయకుడు అన్ని విద్యాసంస్థల నుంచి అక్రమ వసూళ్లు చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, నార్త్ జోన్ అధ్యక్షుడు బీహెచ్ ఇలియాస్, మైనార్టీ నేతలు షఫీ, జమీల్ పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
మహిళ అదృశ్యం
కలసపాడు : మండలంలోని ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన షేక్ మస్తాన్బీ(30) అదృశ్యమైనట్లు ఎస్ఐ తిమోతి బుధవారం తెలిపారు. సోమవారం సాయంత్రం మస్తాన్బీ దుకాణానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె భర్త హసన్వలీ ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9121100632 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓం శాంతి నగర్లో ఈనెల 17వ తేదీన ఉమామహేశ్వరి (52) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కుమారుడు సాయి ప్రతాప్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. అప్పులు చేసి ఇబ్బంది పడిన అతని వ్యవహార శైలి మార్చుకోక పోవడంతో తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వెంటనే బంధువులు కర్నూలుకు తరలించారు. బుధవారం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు. దొంగతనం కేసు నమోదు చాపాడు : మండలంలోని టీఓపల్లెకు చెందిన ఎల్.రవిశంకర్రెడ్డి అనే వ్యక్తిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. టీఓపల్లెకు చెందిన రవిశంకర్రెడ్డి తమ గ్రామంలోని పొలాల్లో నాలుగు విద్యుత్ స్తంభాలను తమ అనుమతి లేకుండా తొలగించుకుని తన అవసరాలకు వాడుకున్నాడని, వీటి విలువ రూ.4వేలు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. వరకట్న వేధింపులపై.. పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లెకు చెందిన షేక్ రేష్మా అనే మహిళ భర్త, అత్తామామలు వరకట్నం తేవాలని వేధిస్తున్నారని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త నవాజ్ షరీఫ్, మామ ఖాజా మొహిద్దీన్, అత్త రహమత్బీలు పెళ్లయినప్పటి నుంచి రేష్మాను అదనంగా వరకట్నం తేవాలని వేధిస్తుండటంతో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు సీఐ చాంద్ బాషా తెలిపారు. లైంగికంగా వేఽధిస్తున్నాడని.. చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని దినకర్ అనే వ్యక్తిపై బుధవారం లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. స్థానిక దళితవాడకు చెందిన దినకర్ తన ఇంటి సమీపంలోని ఓ ఇంటిలోకి వెళ్లి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డబ్బులు ఎగ్గొట్టాడని..పులివెందుల రూరల్ : కర్నూలు జిల్లా బేతేంచర్ల గ్రామానికి చెందిన కరీం బాషాపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చాంద్ బాషా తెలిపారు. ఏడాది క్రితం పులివెందుల చీనీ కాయల మార్కెట్లో వేలం పాట పాడి సుమారు రూ.30 లక్షలు ఇవ్వకుండా వెళ్లిపోవడంతో చీనీ వ్యాపారులు సూరారెడ్డి, సాదిక్ బాషా, హనుమంతురెడ్డిలతోపాటు మరో ఐదుగురు వ్యాపారులు బుధవారం కరీం బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
ఆరా పేరుతో టోకరా !
మదనపల్లె రూరల్ : ఆరా యాప్.. కేవలం రూ.2వేలు చెల్లించండి. ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్నకు మేము పంపే 5 వీడియోలు చూస్తే చాలు.. మీ ఖాతాలో వేలకు వేలు డబ్బులు జమ అవుతాయంటూ పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, భారీ స్థాయిలో ఆన్లైన్ మోసానికి పాల్పడిన వైనం బుధవారం మదనపల్లెలో వెలుగు చూసింది. బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని మీడియాతో తమ గోడును వినిపించారు. ఆరా బురిడీ కొట్టించిన వైనంపై సైబర్ క్రైమ్ సెల్కు స్థానికుడైన వి. రాజ్కుమార్ ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం ఎగువ కురవంకకు చెందిన మోహన్బాబు.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆరా యాప్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆరా యాప్లో.. రూ.2వేలు డిపాజిట్ చెల్లించి సభ్యులుగా చేరితే.. సభ్యులను గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపునకు ఒక్కో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అందులో ప్రతిరోజు 5 వీడియోలను వాట్సప్ లింక్ ద్వారా పంపుతారు. వాటిని వీక్షిస్తే..ఒక్కో వీడియోకు రూ.65 చొప్పున నగదు నేరుగా సభ్యుడి బ్యాంకు వ్యక్తిగత ఖాతాకు ఆన్లైన్లో జమచేస్తామని చెబుతారు. ఇలా మొదట్లో చేరిన సభ్యులకు...ఠంచనుగా డబ్బులు ఖాతాలకు జమచేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ యాప్లోని స్పిన్ వీల్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటే, అందులో గెలిచిన బహుమతులను సైతం ఇస్తామని ప్రకటించారు. మొదట్లో గెలిచిన కొద్దిమందికి ఇచ్చారు. బహుమతులు, డబ్బులు జమ అయిన సభ్యులతో తాము ఎలా లాభం పొందిందనే విషయం వారి మాటల్లోనే చెప్పిస్తూ వీడియోలు తీసి విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో వేలసంఖ్యలో ప్రజలు ఆరా యాప్లో సభ్యులుగా చేరారు. సులభంగా డబ్బులు వస్తాయనే దురాశతో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో సుమారు 6వేల మందికి పైగా డిపాజిట్లు చెల్లించి సభ్యులుగా చేరారు. ఆరా యాప్ నిర్వాహకులు చెప్పినట్లుగానే వీడియోలు చూశారు. డబ్బులు ఖాతాకు జమచేసినట్లు యాప్లో మెసేజ్ వచ్చింది. అయితే డబ్బులను ఖాతా నుంచి తీసుకునేందుకు వెళితే మాత్రం డబ్బులు జమ కాలేదని తెలవడంతో మోసపోయామని గుర్తించారు. కొద్ది రోజులుగా ఆరా యాప్ పేరుతో క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్ ఇన్యాక్టివ్లోకి వెళ్లింది. దీంతో బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆరా యాప్ సొమ్ముల కోసం నిర్వాహకులకు తెలియజేసిన ఆధార్, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల సమాచారంతో భవిష్యత్తులో తమకు ఏదేని ఇబ్బందులు తలెత్తవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన మోసంపై పోలీసుల సలహా మేరకు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిర్వాహకుడైన మోహన్బాబును ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తే.. అందుబాటులోకి రాలేదు. వీడియోలు చూడండి.. డబ్బులు సంపాదించండి నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా లక్షలు వసూళ్లు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో 6 వేలకు పైగా బాధితులు న్యాయం చేయాలంటూ తాలూకా పోలీస్ స్టేషన్కు పరుగులు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిన బాధితులు -
పాలక వర్గాలపై పోరాటం
బద్వేలు అర్బన్ : అపసవ్య విధానాలు అవలంబిస్తున్న పాలక వర్గాలపై పోరాటాలే లక్ష్యంగా ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సీపీఐ 25వ జిల్లా మహాసభల సందర్భంగా రెండవ రోజైన బుధవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని రాఘవేంద్ర గ్రాండ్లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఓట్లు, సీట్లు కొలమానం కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల జీవన స్థితిగతులు మారుస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం పేద ప్రజల, రైతుల, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కేవలం కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం పరితపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలపై ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లు అనే ముద్ర వేసి ఆపరేషన్ కగార్ పేరుతో కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద, అటవీ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మంచి ప్రభుత్వం, సుపరిపాలన అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, నాగసుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, రామయ్య, వెంకటశి వ, బాదుల్లా, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, ఏరియా సహా య కార్యదర్శి మస్తాన్, పట్టణ, రూరల్ కార్యదర్శులు బాబు, ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు. -
కడప, చిత్తూరు జట్ల ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లో కడప, చిత్తూరు జట్లు ఘన విజయం సాధించాయి. బుధవారం మూడో రోజు వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 51 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 74.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు సాధించింది. ఆ జట్టులోని మహ్మద్ షారుఖ్ అక్తర్ 105 పరుగులు, ఎస్ఎంజి ప్రభాకర్ 37 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంజయ్ 3 వికెట్లు, కిరణ్కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో చిత్తూరు జట్టు విజయం సాధించింది. కాగా అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. చిత్తూరు తొలి ఇన్నింగ్స్లో 184 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 197 పరుగులు చేసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో... కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో బుధవారం మూడో రోజు 95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 66.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని ఎస్వి చైతన్య 4 వికెట్లు, సుశాంత్ 2 వికెట్లు, రిత్విక్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 215 పరుగులు చేసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్లో 155 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు విజయం సాధించింది. -
ప్రక్షాళన దిశగా కడప కేంద్ర కారాగారం
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో సెల్ఫోన్లు దొరుకుతున్నాయని, నిబంధలకు విరుద్ధంగా కొందరు అధికారులు, సిబ్బంది ప్రవర్తిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ప్రక్షాళన చేసేందుకు తనను విచారణకు పంపించారని జైళ్లశాఖ రాయలసీమ రేంజ్ ఇన్చార్జి డీఐజీ ఎం.ఆర్ రవికిరణ్ తెలిపారు. బుధవారం ఆయన తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ విచారణలో సెల్ఫోన్లు బయటనుంచి విసిరేస్తున్నారని తెలుసుకున్నామన్నారు. సెల్ఫోన్లు దొరికిన ప్రతిసారీ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించి విచారణ చేసి వుంటే బాగుండేదన్నారు. కొన్ని సందర్భాలలోనే ఫిర్యాదులు చేశారని ఇందుకు బాధ్యులైన వారిపై ప్రాథమికంగా విచారణ చేసి నివేదికలను డీఐజీకి పంపించామన్నారు. డీజీ దేశాల మేరకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్స్ ఇద్దరు, ముగ్గురు వార్డర్లను సస్పెండ్ చేశారన్నారు. కారాగార నిబంధనల మేరకు ఖైదీలను బ్యారక్లలో వుంచి, సెల్ఫోన్లు బయట నుంచి రాకుండా వుండేందుకు పకడ్బందీగా చర్యలను చేపడుతున్నామన్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. రాయలసీమ జైళ్లశాఖ ఇన్చార్జి డీఐజీ ఎం.ఆర్ రవికిరణ్ -
యువతి ఆత్మహత్య
మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన కుండా లక్ష్మీదేవి(39) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ శ్యాం సుందర్రావు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుండా లక్ష్మీదేవికి భర్త తరపున ఆడపడచులతో మనస్పర్థలు వస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని తమ దృష్టికి తీసుకుని వస్తే కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. జీవితాలకు ఇలా అర్థంతరంగా ముగింపు పలికితే పిల్లల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. అస్సాంలో మెడికో ఆత్మహత్య జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన పడిగేపాటి లక్ష్మిరెడ్డి కుమార్తె పడిగేపాటి హేమలత(25) వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. హేమలత ఇంటర్మీడియట్ నుంచి చదువులో బాగా రాణిస్తుండటంతో మెడిసిన్లో ఉచితంగా సీటు దక్కించుకుంది. పీజీలో సైతం ఉచిత సీటు రావడంతో అస్సాంలోని బార్పేట జిల్లా ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ మెడికల్ కాలేజిలో గైనకాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. గైనకాలజీ కోర్సులో భాగంగా హాస్పిటల్స్లో వర్కింగ్ విధులు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల మానసిక వత్తిడి తట్టుకోలేక ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో వైద్యుల వద్దకు వెళ్లి చూపించుని ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి రెండు నెలల క్రితం అస్సాం వెళ్లింది. తిరిగి మానసిక వత్తిడికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోట్లదుర్తిలో ఉన్న తల్లిదండ్రులకు కాలేజి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు అస్సాంకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇనగలూరు దాడి కేసులో ఐదుగురి అరెస్టు తొండూరు : మండలంలోని ఇనగలూరు గ్రామానికి సంబంధించి సైదాపురం బస్టాప్ సమీపంలో జరిగిన దాడి ఘటన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఘన మద్దిలేటి తెలిపారు. బుధవారం ఇనగలూరు క్రాస్ రోడ్డు వద్ద ప్రశాంత్రెడ్డి, ఓబుళరెడ్డి, మధుసూదన్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి, గంగిరెడ్డిలను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించిన కేసులో మిగిలిన ఆరుగురిని కూడా త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. పోలీసులు కొట్టారని నిందితుల ఆరోపణ ఇనగలూరు గ్రామంలో జరిగిన దాడి సంఘటనకు సంబంధించిన నిందితులు తమను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టి వేధింపులకు గురి చేశారని జడ్జి ఎదుట వాపోయినట్లు తెలిసింది. దీంతో జడ్జి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. ఇరువర్గాల వారు అధికార పార్టీకి చెందినవారే అయినప్పటికీ ఒక వర్గానికి పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మద్దతు తెలపడంతోనే పోలీసులు తమను చితకబాదారని బాధితులు పేర్కొంటున్నారు. కారును ఢీ కొన్న లారీ ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంగంపేట వద్ద కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజంపేటలోని నూనెవారిపల్లికి చెందిన నలుగురు కారులో కడపకు వెళ్తుండగా మంటపంపల్లి వద్ద ఉన్న డాబాల సమీపానికి రాగానే కడప నుండి చైన్నె వెళ్తున్న గ్యాస్ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొంది. దీంతో కారులోని తరుణం (17), కిరణ్ (20), రాఘవేంద్ర (20), బాలు (23) అనే నలుగురు యువకులకు రక్త గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. -
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం కలిశారు. కడపలోని రాయచోటి రోడ్డులో ఊటుకూరు, ప్రకృతినగర్ తదితర ప్రాంతాల వాసుల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రైల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చిన అవినాష్ రెడ్డి.. ఎల్సీ 122 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేయాల్సిందిగా వినతించారు.చెన్నై- అహ్మదాబాద్ మధ్య నడిచే హంసఫర్ ఎక్స్ప్రెస్ను కడపలో స్టాపింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తిరుపతి - షిర్డీ మధ్య వారానికి ఒక రోజు మాత్రమే రైలు నడుస్తోందని.. అది కూడా మల్టీ చేంజ్ రూట్లుగా వెళ్లడం వల్ల 126 గంటల ప్రయాణ సమయం పడుతోందన్నారు. అదే తిరుపతి నుంచి షిర్డీకి నేరుగా ఒక రైలును ప్రతి రోజు నడపాలని కేంద్ర మంత్రిని వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. తద్వార ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం
లక్కిరెడ్డిపల్లి: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా మని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పార్టీ నాయకుడు సుగవాసి బాల సుబ్రమణ్యంలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ గొంతునొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడటానికి ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి మాజీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ స్టేట్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి, రాజంపేట అసెంబ్లీ పబ్లిసిటీ వింగ్ మాదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి, మాన్యం సంతోష్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీలు అంబాబత్తిన రెడ్డయ్య, తిమ్మిరెడ్డి ఉమాపతి రెడ్డి, ఉప మండల అధ్యక్షులు సమరసింహారెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి రమేష్కుమార్ రెడ్డిని పరామర్శించిన పార్టీ సీనియర్ నాయకులు -
ప్లాస్టిక్ హానిపై ప్రజలకు విస్తృత అవగాహన
కడప సెవెన్రోడ్స్ : ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే హానిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధికారులను కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్తో కలిసి ఆయన అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రధానంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అవగాహనతోపాటు విస్తృత ప్రచా రం నిర్వహించాలన్నారు. మార్కెట్లు, హోల్సేల్లను తనిఖీలు చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించాలన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేందుకు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలన్నారు. దేవాలయాల్లో ప్రసాదం, అన్నదానం పంపిణీకి ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుధ, పరిశ్రమలశాఖ జీఎం చాంద్బాషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్ మనోజ్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నీళ్లపై రాజధాని నిర్మిస్తున్నారు
కడప రూరల్: టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతిలో నీళ్లపై రాజధాని నిర్మిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. మంగళవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో మూరెడు మట్టి తీస్తే.. చారెడు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దేవతల నగరం అంటున్నారని, అక్కడ మాత్రం కర్రతుమ్మ చెట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల ప్రజల్లో రాజధానిపై అసంతృప్తి ఉందన్నారు. రాయలసీమలో పరిపాలనా రాజధాని, విశాఖపట్నంలో హైకోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆ దిశగా సీఎం చంద్రబాబు ఆలోచించాలని సూచించారు. రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక, బనకచర్ల అంశాన్ని పరిశీలించాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయని, మరో 5 వేల పాఠశాలలను మూత వేయా లనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్య అందని పరిస్థితి ఏర్పడటం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం లేదన్నారు. బీటెక్, ఎంబీఏ చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలపై వస్తున్న విమర్శలు కరెక్టే అన్నారు. తిరుపతి లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కొంతమంది తన వద్దకు వచ్చి.. ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని చెబితే ఆశ్చర్యపోయానని అన్నారు. వారు చెప్పిన కొన్ని ఉదాహరణలు వింటే నిజమే అనిపించిందన్నారు. మోడరన్ టెక్నాలజీ ద్వారా, రిమోట్తో టీవీని కంట్రోలు చేసే విధంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని వివరించారన్నారు. అందుకు ప్రతిఫలంగా వారు రాజకీయంగా పెద్ద పెదవినే కోరడంతో వారికి ఒక దండం పెట్టి నాకీ సమస్యలు వద్దని చెప్పానని పేర్కొన్నారు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో, కీలకమైన ప్రదేశాల్లో ట్యాంపరింగ్ ద్వారా ఓడిపోయే వారిని గెలిపిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించి రూ. 14.50 లక్షల కోట్లు ఎన్పీఎల్ అయ్యాయని చింతా మోహన్ అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం రుణ మాఫీ చేసిందని తెలిపారు. అందుకు గాను 10 శాతం డబ్బును వసూలు చేశారని ఆరోపించారు. గుజరాత్కు చెందిన వారికే ఎక్కువగా రుణ మాఫీ జరిగిందన్నారు. ఇందులో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలున్నాయి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆగ్రహం -
జీతాలు ఎప్పుడిస్తారు!
కడప ఎడ్యుకేషన్: బదిలీలు ఉపాధ్యాయులకు శాపంగా మారాయి. ఈ ఏడు బదిలీల ప్రక్రియ ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యలు ఎదుర్కొంటున్న గురువులకు.. తాజాగా జీతాల సమస్య వారిని తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. స్థాన చలనం కలిగిన వారికి జీతాల చెల్లింపులో తీవ్రజాప్యం జరుగుతోంది. బదిలీ అయి న ఉపాధ్యాయులకు విద్యాశాఖ పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంతో వారికి జీతాలు పడట్లేదు. బదిలీల సాకుతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉపాద్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బదిలీ అయిన ప్రాంతాల్లో.... ఉద్యోగులైనా.. ఉపాధ్యాయులైనా సాధారణంగా బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా ఆ ప్రాంతంలోని డీడీఓలకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, దీని కోసం ఉపాధ్యాయులకు ఐడీలు కేటాయించాలి. బదిలీ ప్రక్రియ పూర్తయి నెల రోజులు దాటినా ఇంత వరకు చాలామంది ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలను కేటాయించలేదు. పాఠశాలల ప్రారంభంమైన జూన్ నెలలో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి, దుస్తులు ఇలా వేలకు వేలు వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, ఇంటి అద్దెలు ఇలా పలు రకాల ఖర్చులు తడిసి మోపెడవుతున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4217 మంది... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4217 మంది వివిధ క్యాడర్లలో ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వీరిలో 202 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు కాగా, 1815 మంది స్కూల్ అసిస్టెంట్లు, 2047 మంది సెకండ్ గ్రేడ్ టీచర్స్, 114 మంది లాంగ్వేజ్ పండిట్లు, 11 మంది ఏఆర్టీ, క్రాప్ట్, మ్యూజిక్, ఒకేషన్ ,28 మంది ిఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఇలా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో జూన్ 15 నాటికి 4217 మంది వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. వీరిలో కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యా రు. అలాగే మోడల్ ప్రైమరీ పాఠశాలలు, హైస్కూ ళ్లు కొత్తగా ఏర్పడటంతో ఇక్కడకు వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా 1000 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. వీరందరికీ ఇప్పుడు జీతాలు పడలేదు. ఈ విషయంపై డీఈఓను వివరణ కోరగా బదిలీ అయిన వారి వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపించామని.. ఈ నెలాఖరుకంతా సమస్య పరిష్కారం అవుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ●జీతాల చెల్లింపులో జాప్యం తగదు కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా గత జూన్ మాసంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల ద్వారా ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయుల జీతాలు చెల్లింపులో ఆలస్యం తగదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్,పాళెం మహేష్ బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. జీతాలు చెల్లించుటకు అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బదిలీలకు ముందే ఏ పోస్టు ఏ పాఠశాలకు షిఫ్ట్ అవుతుందో విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంలో జాప్యం చేశారని మండిపడ్డారు. జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్,డి సుజాత రాణి జిల్లా కార్యదర్శులు సివి రమణ, ఏజాస్ అహమ్మద్, ప్రసన్న లక్ష్మి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, రూతు ఆరోగ్యమేరీ నాయకులు గాజులపల్లి గోపీనాథ్, రామకేశవ, వీరనారాయణ, శంకర్ రెడ్డి, దేవదత్తం,ఈశ్వర రావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బదిలీ టీచర్లకు వేతన కష్టాలు పొజిషన్ ఐడీల కేటాయింపులోప్రభుత్వ నిర్లక్ష్యం బదిలీలు జరిగి నెలరోజులైనా ఇవ్వని ఐడీలు జిల్లాలో వేలాదిమంది టీచర్ల కుటుంబాలపై ప్రభావం -
ఎమ్మెల్యే, ఆమె భర్త అండతోనే తిరుమలేష్ అవినీతి అక్రమాలు
కడప కార్పొరేషన్ : కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) అండతోనే వారి అనుచరుడు టీఎన్ఎస్ఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి దత్త ఆరోపించారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి విభాగం నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాడకుండా అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడన్నారు. తాను చేస్తున్న అక్రమాలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పేరు చెప్పుకుని అందరినీ బెదిరించాడన్నారు. మహానాడు సందర్భంగా జిల్లాలో విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే మెప్పు కోసం మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేశాడని, ఎలాంటి సంబంధం లేకపోయినా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటి వద్ద ధర్నా చేయించాడన్నారు. సాక్షి కార్యాలయం లోపలికి చొరబడి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి సందీప్రెడ్డి, నగర అఽధ్యక్షుడు శివారెడ్డి, జబ్బార్, నౌమాన్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
గండి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండిలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ అధికారులు, పాలకవర్గం ఇప్పటికే పోలీసు, పారిశుధ్యం, వైద్యం, విద్యుత్, ఇంజినీరింగ్, రవాణా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆ మేరకు ఏర్పాట్లను చేపట్టారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పాపాఘ్ని నదిలో మహిళలు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక వసతిని కల్పిస్తున్నట్లు ఆలయ అధికారి వివరించారు. గండి ఉత్సవాల సందర్భంగా పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు చక్రాయపేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తరపున ఉచితంగా ఇస్తున్నట్లు మేనేజర్ భానుచందర్ తెలిపారు. పాసులు కలిగిన వారు, వీఐపీలకు ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. -
సౌమ్యనాథస్వామికి రూ.6, 06,780 ఆదాయం
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 40 రోజులకు సంబంధించి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.6,06,780 వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్లు చెప్పారు. ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి జనార్ధన, భక్తులు పాల్గొన్నారు. అన్నదాన ట్రస్టు డిపాజిట్లు రూ.2,24,13,591 మండలంలోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం సమీపంలోని సౌమ్యనాథ అన్నదాన ట్రస్టు డిపాజిట్లు బ్యాంకు ఖాతాల్లో రూ.2,24,13,591 ఉన్నట్లు ట్రస్టు అధ్యక్షుడు ఎద్దుల సుబ్బరాయుడు, కోశాధికారి చక్రాల రామసుబ్బన్న పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం శనివారం, ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్నామని, శుక్రవారం కూడా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు.అన్నదాన సత్రంలో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శైలేంద్రనాథ్, సభ్యులు గంట వాసుదేవయ్య, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, పల్లె సుబ్రమణ్యం, సర్దార్ హుస్సేన్, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సోమశిలలోకి కృష్ణమ్మ పరుగులు !
రాజంపేట : సోమశిలలోకి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. సోమవారం నమోదైన 3, 055 క్యూసెక్కుల ప్రవాహం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అధికారుల అంచనా కన్నా ముందే జలాలు సోమశిలకు చేరుతున్నాయి. కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కుందూ నది ద్వారాను కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదినిమ్మాయపల్లె వద్ద.. ఈ ఏడాది జూలై నెలలోనే కృష్ణానదికి వరదలు ఉధృతృంగా వచ్చాయి. దీంతో శ్రీశైలం జలాశయం నిండిన సంగతి విదితమే. సాగర్కు నీటిని విడుదల చేశారు. అవి కాస్తా పెన్నా (సిద్ధవటం, ఒంటిమిట్ట) ద్వారా సోమశిలకు చేరుతున్నాయి. శ్రీశైలంలో 203.43 టీఎంసీలు ఉండగా, జలాశయంలోకి 1,75,233 క్యూసెక్కులు వస్తోంది. దాంతో తెలుగుగంగకు విడుదలను మరింత పెంచే అవకాశం ఉంది. అదే స్థాయిలో సోమశిలకు రానున్నాయి. కడప జిల్లా ఆదినిమ్మాయపల్లె వద్ద పెన్నాలో 1800 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 27.616 టీఎంసీల నిల్వ.. సోమశిలలో 27.616 టీఎంసీల నీటి నిల్వ ఉండగా , కృష్ణా జలాలు జత కావడంతో జలాశయంలోకి 3,055 క్యూసెక్కుల ప్రవాహమే ఉంది. జూలైలో వర్షాల కారణంగా ప్రవాహం క్రమంగా పెరిగే పరిస్థితి ఉంది. సోమశిల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇన్ఫ్లో క్రమంగా పెరిగే అవకాశం ఉందని జలాశయం అధికారులు అంటున్నారు. వెనుక జలాలు నిలకడగా.. సోమశిల జలాశయం కెపాసిటీ 77.988 టీఎంసీగా ఉంది. జలాశయంలో నీటి మట్టం 90,879 మీటర్ల వ ద్దకు చేరుకుంది. అన్నమయ్య, కడప జిల్లాలో విస్తరించి ఉన్న అట్లూరు, ఒంటిమిట్ట, నందలూరు మండలా ల పరిధిలో వెనుక జలాలు నిలకడగానే ఉన్నాయి. 27.616 టీఎంసీలు నిల్వ డ్యాంలోకి ఇన్ఫ్లో 3,055 క్యూసెక్కులు -
వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య
చాపాడు : వివాహేతర సంబంధాలు పెట్టుకుందనే కారణంతో మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో ఈ నెల 17న నల్లబోతుల సుజాత (37) అనే వివాహితను ఆమె భర్త గోపాల్ హత్య చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. ఈ హత్య కేసులో భర్త గోపాల్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు. మంగళవారం రూరల్ సీఐ వివరాలను వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం గోపాల్ చియ్యపాడు గ్రామంలోనే ఉన్న తన అక్క గుజ్జల పార్వతమ్మ పెద్ద కూతురు సుజాతను వివాహం చేసుకున్నాడు. పదేళ్ల పాటు అన్యోన్యంగా జీవిస్తున్న వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గత కొన్నేళ్ల క్రితం నుంచి తన భార్య సుజాత ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుందనే అనుమానంతో గోపాల్ తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 17న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భార్యతో గొడవపడ్డ గోపాల్ టవల్తో తన భార్య గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టుకుని తనకున్న ఏపీ04ఏఏ4288 నెంబరు గల స్కార్పియో కారులో తీసుకెళ్లి మైదుకూరు మండలం పోరుమామిళ్ల రహదారిలోని ముదిరెడ్డిపల్లె సమీపంలో ఎద్దడుగు కనుమ అటవీ ప్రాంతంలోని మట్టి కాలువలో పడేశాడు. ఇంట్లో, గ్రామంలో సుజాత కనిపించకపోవడంతో తన తల్లి గుజ్జల పార్వతమ్మ తన అల్లుడు గోపాల్పై అనుమానంతో గాలించింది. అతను పరారీలో ఉండంతో ఈ నెల 19న చాపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టగా గోపాల్ తన భార్యను హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కుందూనది సమీపంలోని చియ్యపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా నిందితుడైన గోపాల్ తన స్కార్పియో వాహనంలో పారిపోతుండగా పోలీసు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ సీఐ తెలిపారు. వివరాలు వెల్లడించిన మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ -
పోరాటాలకు సమాయత్తం కావాలి
బద్వేలు అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోవు రోజుల్లో లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను కూడగట్టుకుని పోరాటాలకు సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ 25వ జిల్లా మహాసభల సందర్భంగా మంగళవారం పట్టణంలోని మార్కెట్యార్డు నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్న మోదీ.. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పేద ప్రజల, రైతుల, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కేవలం కార్పొరేట్ వర్గాల సేవలో పరితపిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం వెలికి తీస్తామని చెప్పిన మోదీ ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో, ఎంత నల్లధనం వెలికి తీశారో సమాధానం చెప్పాలన్నారు. పేదలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించాల్సింది పోయి మత విద్వేషాలు సృష్టిస్తూ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో చేస్తున్న అప్పులను ఉద్దేశించి రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని అన్న చంద్రబాబునాయుడు నేడు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.75 లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడటం చంద్రబాబు నైజమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం విద్యుత్ వినియోగదారులపై ఇంత భారం ఏ ప్రభుత్వం మోపలేదన్నారు. చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగానే గాలిలో మేడలు కడుతున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధిపైన ఏ మాత్రం దృష్టి సారించడం లేదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యుడు శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, నాగసుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, రామయ్య, వెంకటశివ, బాదుల్లా, భాగ్యలక్ష్మి, ఏరియా సహాయ కార్యదర్శి మస్తాన్, పట్టణ, రూరల్ కార్యదర్శులు బాబు, ఇమ్మానియేలు, ఏరియా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బద్వేలులో ప్రారంభమైన సీపీఐ జిల్లా మహాసభలు -
కల్వటాలలో షెల్.. చల్!
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి నేతల అండ చూసుకుని షెల్ సోలార్ కంపెనీ ప్రతినిధులు పేద రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. వారి సొంత భూములపై కూడా హక్కుల్లేకుండా చేస్తున్నారు. అడిగితే బెదిరిస్తున్నారు. ఇంకా ముందుకెళ్లి అక్రమ కేసులూ పెడుతున్నారు. నోరున్నోళ్లకు మాత్రమే కాస్తా వెనక్కి తగ్గుతున్నారు.● కడప–నంద్యాల జిల్లాల సరిహద్దుల గ్రామాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం షెల్ కంపెనీ ముందుకు వచ్చింది. పెద్దముడియం మండలం కల్వాటాల గ్రామం పంట పొలాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖత చూపలేదు. దాంతో 30ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎకరానికి రూ.32వేలు లీజు చెల్లిస్తామని ముందుకు వచ్చారు. అయినప్పటికీ రైతులు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించలేదు. వెంటనే దళారులను ప్రవేశ పెట్టి రైతుల మధ్య ఉన్న అనైక్యతను సొమ్ము చేసుకునేందుకు సన్నాహాలు చేశారు. వారి వ్యూహం ఫలించి, కొంతమంది రైతులు సోలార్ కంపెనీకి అనువుగా లీజుకు భూములిచ్చారు. మరికొందరు తమకున్న ఆదరువు భూమి ఒక్కటేనని.. ఉన్న భూమికి మీకు అప్పగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో షెల్ కంపెనీ ప్రతినిధులు లేరు, వారికి అండగా నిలుస్తోన్న కూటమి సర్కార్ నేతలకు అస్సలు లేదు. బెదిరింపులకు దిగుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇష్టం లేకపోయినా కొందరు రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకున్నారు.అడ్డం తిరిగిన రైతులకు అందలం...నోరున్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడికే అండగా నిలుస్తారని కల్వాటాల గ్రామంలో మరోమారు రుజువయ్యింది. తమ భూమిలోకి దిగొద్దు, తాము లీజుకు ఇవ్వం అన్నోళ్లకు.. మీరెవరికీ చెప్పొద్దంటూ ఎకరం రూ.14లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఇలా అందరికి అదే స్థాయిలో చెల్లించి భూములు కొనుగోలు చేశారా? అంటే అదీ లేదు. కొందరికి ఎకరం రూ.8లక్షలకు కూడా కొనుగోలు చేసి, స్వాఽధీనం చేసుకున్న భూములు కూడా ఉన్నాయి.ఈ మహిళా రైతు పేరు పామిడి వరలక్ష్మి. ఈమెది పెద్దముడియం మండలం కల్వటాల గ్రామం. ఆ గ్రామంలో సర్వే నంబర్ 306లో 2.69 ఎకరాలు భూమి ఉంది. ‘షెల్’సోలార్ కంపెనీ వారు ఆమె అనుమతులు లేకుండా పొలంలో 6 అడుగుల లోతు రంధ్రాలు వేశారు. అందులో సిమెంటు దిమ్మెలతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే భూమిని కంపెనీకి లీజు రూపంలో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తమకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. లీజుకిస్తే వారి వివాహాలకు ఇబ్బందవుతుంది.. ఇతర రైతుల భూములు కొనుగోలు చేసినట్లుగా తమ భూమి కొనుగోలు చేయాలని కోరింది. అలా కుదరదు మీ భర్త సంతకాలు తీసుకున్నాం. మీరు సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఆపై బెదిరింపులకు దిగుతున్నారు.అదే గ్రామానికి చెందిన అక్కంరెడ్డి సుజాత పేరిట ఉన్న భూమిలో ఎలాంటి సమాచారం లేకుండా కనీస అనుమతి లేకుండా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త మధుసూదన్రెడ్డితో కలిసి పొలం వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తమ భూమిలో ఎలా పనులు చేస్తారంటూ నిలదీశారు. అంతే సదరు కంపెనీ ప్రతినిధులు పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి మధుసూదనరెడ్డిపై నాన్బెయిల్బుల్ కేసు నమోదు చేయించి, రిమాండ్కు పంపించారు. 33రోజులు భర్త రిమాండ్లో ఉండడంతో సుజాత జిల్లా యంత్రాంగాన్ని కలిసి మొరపెట్టుకుంది. ఎవరు కనికరించలేదు. కలెక్టర్ సైతం పట్టించుకోలేదు. ఈ రెండు కుటుంబాలే కాదు... కల్వటాల గ్రామంలో చాలా మంది రైతుల దుస్థితి ఇది. ● అక్రమాలను అడ్డుకునేవారేరీ!రైతులకు తెలియకుండానే వారి భూముల్లో స్తంభాలు వెలిశాయి. పెంచుకున్న చీని చెట్లు నెలకొరిగాయి. ఇదేమి అన్యాయమంటూ కొంతమంది రైతులు పెద్దముడియం పోలీసుస్టేషన్ను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఉచిత సలహాలు తెరపైకి వచ్చాయి. ఒక్కరో ఇద్దరో రైతులు అడ్డం తిరిగితే వారిపై అధికార పార్టీ నాయకుల్ని ప్రయోగిస్తున్నారు. అప్పటికీ విన్పించుకోకపోతే అలాంటి వారిపై అక్రమ కేసులు తెరపైకి వస్తున్నాయి. పాపం రైతులు...ఎవరూ పట్టించుకోకపోవడంతో దిగాలు పడుతున్నారు. -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్రమ అరెస్టులు
కమలాపురం: రాష్ట్రంలో నెలకొ న్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కూటమి సర్కార్ వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తోందని ఆ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ అన్నారు. మంగళవారం ఆయన కమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డిని ఈ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్ సీపీని అడ్డుకోలేరని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమ పార్టీదేనని స్పష్టం చేశారు. ఈ అక్రమ అరెస్టులపై రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికల సమయంలో జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు ఆపి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై , రాష్ట్ర సమస్యల పై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. సూపర్ సిక్స్ అమలుపై ప్రశ్నించకూడదని భావించిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ -
బాలిక హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష
కడప అర్బన్ : కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మూడేళ్ల బాలికను హత్య చేసిన కేసులో నిందితుడికి పదేళ్లు జైలు శిక్షతోపాటు 1000 రూపాయలు జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ ఎస్టీ సెల్ జడ్జి మంగళవారం తీర్పునిచ్చారు. కర్నూలుకు చెందిన కత్తెర విశ్వనాథం కూలి పనుల కోసం కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అద్దె ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నాడు. విశ్వనాథం బంధువు సుజాత కూడా అక్కడే ఉండేది. సుజాత కుమార్తె శ్రీలత (3) రాత్రి సమయంలో నిద్రకు భంగం కలిగిస్తుందన్న ఉద్దేశంతో ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో 2017 ఫిబ్రవరి నెలలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వాదో పవాదాలు విన్న జడ్జి నేరం రుజువు కావడంతో విశ్వనాథంకు పదేళ్లు జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
అమరావతి అవినీతిపై
విచారణ చేయించాలి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వైఎస్సార్సీపీ నాయకుల లేఖ కడప కార్పొరేషన్ : అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి పి. సంపత్ కుమార్, చైతల్య కోరారు. మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వారు లేఖ రాసి రిజిస్టర్ పోస్ట్ చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నందున వారు విచారణ చేసే అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ గోపాలక్రిష్ణ పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్టు
– కత్తి, మోటార్ సైకిల్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం కడప అర్బన్ : కడప నగరం గంజికుంట కాలనీలో గత నెల 25వ తేదిన గొంటుముక్కల వెంకటసుబ్బయ్యపై కత్తితో దాడి చేసిన కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు చిన్నచౌకు సీఐ ఓబులేసు తెలిపారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో సీఐతో పాటు ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కడప మాసాపేటకు చెందిన తాటిగిరి అనూష, పాలెం సుబ్బరాయుడు అలియాస్ సుబ్బన్న, చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లికి చెందిన సోమ ప్రశాంత్, సుగమాల నవీన్ అలియాస్ శిగనమాల నవీన్, సిబ్యాల సుబ్బరాయుడు మాసాపేటకు చెందిన తాటిగిరి నిర్మలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి, మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెంకటసుబ్బయ్య, తాటిగిరి అనూష మధ్య మనస్పర్థలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీ వెంకటసుబ్బయ్యపై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు -
రైతులకు సకాలంలో ఎరువులందాలి
కడప సెవెన్రోడ్స్: రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో ఎరువుల నిల్వలు,విక్రయాలు, మార్కెటింగ్, పంటలు తదితర అంశాలపై వ్యవసాయ, మార్కెటింగ్, డీఎస్ఓ శాఖా అధికారులు, ప్రైవేట్ ఎరువుల కంపెనీల ప్రతినిధులుతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎరువు లు అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిమాండ్ ఆధారంగా ఎరువులు ఆర్బీకేల ద్వారా అందజేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఆర్బీకేలలో 2900 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు వినియోగించుకోవాలన్నారు. ప్రైవే టు ఎరువుల డీలర్లు నిబంధనల ప్రకారం ఆన్లైన్ ఈ–పాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. బల్క్స్టాక్ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎంత ఎరువులు అలాట్మెంట్ ఉంది,రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల వారీగా ఆర్బీకేలలో స్టాక్ వివరాలను ప్రతిరోజు మీడియా ద్వారా రైతు లకు తెలియజేయాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వల్లి,మార్క్ ఫెడ్ డీఎం పరిమళజ్యోతి, హార్టికల్చర్ అధికారి రవిచంద్రబాబు,డీసీఓవెంకటసుబ్బయ్య, కోర మాండల్, స్పీక్, ఐపీల్ ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల భూ కబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. అట్లూరు మండల పరిధిలోని మాడపూరు రెవెన్యూ పొలం సర్వే నంబరు 1039లో 11.45 ఎకరాలు(పదకొండు ఎకరాల 45 సెంట్లు విస్తీర్ణం) ప్రభుత్వ భూమి ఉంది. ఇది మంచి సారవంతమైన భూమి కావడంతో పాటు బద్వేలు–ముత్తుకూరు రోడ్డుకు సమీపంలో ఉండడంతో ఆ భూమికి విలువ బాగా ఉంది. దీంతో ఆ భూమిపై కన్నేసిన కోనరాజుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు గత ఏడాది కబ్జాకు యత్నించారు. అయితే రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. డోజ ర్లు, జేసీబీ యంత్రాలతో ఆ భూమిని శనివా రం రాత్రి నుంచి చదును చేయడం మొద లుపెట్టారు. రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకుడితో కుమ్మక్కయ్యారో ఏమో అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం మండల ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. హెచ్చరిక బోర్డును లెక్క చేయని వైనం.. మాడపూరు రెవెన్యూ పొలంలోని సర్వే నెంబరు 1039లో 11.45 ఎకరాలు విస్తీర్ణం ప్రభుత్వ స్థలమని, ఆక్రమిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్టు తమకు కాదనుకున్నారో ఏమో బోర్డును సైతం లెక్క చేయకుండా ఆక్రమించేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో కబ్జాకు గురైన స్థలాలను కబ్జాదారుల చెర నుండి విముక్తి కల్పిస్తామని ప్రగల్బాలు పలికారు నియోజక వర్గ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారి అనుచరులే బద్వేలు నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడడం పరిపాటిగా మారింది. చర్యలు తీసుకుంటాం మండల పరిధిలోని సర్వే నంబరు 1039లో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేసిన విషయమై తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ సెలవులో ఉండటంతో ఆర్ఐ రమణను ఫోన్లో వివరణ కోరగా ఆదివారం ఆ భూమిలో యంత్రాలతో చదును చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాల మేరకు సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లామన్నారు. అప్పటికే అక్కడ ఎవరూ లేరని భూమి మాత్రం చదును చేశారన్నారు. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అట్లూరు మండలంలో అంతులేని ఆక్రమణలు చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు -
అక్రమ కేసులతో పోరాటాలను ఆపలేరు
బద్వేలు అర్బన్: ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన చేసే పోరాటాలను ఆపలేరని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి అన్నారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బైపాస్రోడ్డులోని వైఎస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ మిథున్రెడ్డి పాత్ర ఉన్నట్లు నిరూపించే ఒక్క ఆధారం కూడా పోలీసుల వద్ద లేకపోయినప్పటికీ కేవలం పెద్దిరెడ్డి కు టుంబం వైఎస్జగన్కి అండగా ఉంటుందన్న కారణంతోనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారన్నారు. ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి ఎంపీ మిధున్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బద్వేలులో ర్యాలీ -
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో ఊరేగారు. సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగు రంగులపూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ఊరేగించారు. జైళ్లశాఖ ఎఫ్ఏసీ డీఐజీగా రవి కిరణ్ కడప అర్బన్: రాయలసీమ జైళ్ల శాఖ ఫుల్ అడిషనల్ చార్జ్ డీఐజీగా రవికిరణ్ను నియమిస్తూ డీజీ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఐజీ, కడప సెంట్రల్ జైలు పర్యవేక్షణ అధికారిగా ఉన్న రాజేశ్వరరావును తొలగిస్తూ రవి కిరణ్కు పూర్తి బాధ్యతలను అప్పగించారు. పచ్చిరొట్టతో భూసారం మెరుగు కడప సెవెన్రోడ్స్: రైతులు పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం వల్ల భూసారం మెరుగవుతుందని ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లో ‘పచ్చిరొట్ట ఎరువు తో మట్టికి జీవం’అనే వాల్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ ఎరువుల వల్ల నీటి నిలుపుదల సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. మొక్కలు వేగంగా పెరగడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుందన్నారు. నిధులు మంజూరు రాజుపాళెం: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ ఆలయ పున:నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు దేవదాయశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల కింద రూ.3.20 కోట్లు, ఆలయ కాంట్రిబ్యూషన్ రూ.80 లక్షలతో ఈ నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే శ్రీసంజీవరాయ స్వామి ఆలయ నిర్మాణాకికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3.55 కోట్లు నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. ఈ రెండు ఆలయాలు నిర్మాణాలు పూర్తయితే వెల్లాల పుణ్యక్షేత్రం మరింత శోభాయమానం కానుంది. ఇంటర్ విద్య బలోపేతానికి కృషి కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తానని ఆర్ఐవో (ఎఫ్ఏసీ)గా బాధ్యతలు చేపట్టిన వేంకటేశ్వర్లు తెలిపా రు. సోమవారం ఆర్ఐవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆర్ఐవోగా పనిచేసిన వెంకటసుబ్బయ్య నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీపై వెళ్లారు. -
జిల్లా అంతటా వర్షం
కడప అగ్రికల్చర్: హమ్మయ్యా.. వరుణుడు కరుణించాడు. ఖరీప్ సీజన్కు ముందే పలకరించిన వరుణుడు ఆపై ముఖం చాటేశాడు. దీంతో సాగు చేసిన ఆరుతడి పంటలు ఎండముఖం పట్టాయి. రైతుల్లో ఆందోళన మొదలైంది. దాదాపు జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. ఈ తరుణంలో అల్పపీడనం కారణంగా రెండు రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడతూ వచ్చాయి. ఇక ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఫలితంగా ఆరుతడి పంటలకు ప్రాణం పొసినట్లయింది. జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ, కంది, పసుపు, మినుము వంటి ఆరుతడి పంటల సాగుకు అదును ఇదేనని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురిసిన వర్షంతోపాటు ఇంకా రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతోపాటు గతంలో సాగుచేసిన ఆరుతడి పంటలకు కూడా ఈవర్షం ఎంతో మేలని వ్యవసాయ అధికారులు తెలిపారు. కేసీ కాలువ నీటికితోడు... జిల్లావ్యాప్తంగా ఇటీవల అధికారులు జీలుగలు, జనుములు, పెసలను పంపిణీ చేశారు. దీంతో చాలామంది రైతులు ప్రస్తుతం కురిసిన వర్షంతో వాటిని సత్తువ పంట కింద సాగు చేయనున్నారు. దీనికితోడు కేసీ కాలువకు నీరు కూడా విడుదలైయింది. ఇక కేసీ రైతులు సాగు పనులను ఆరంభించనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు కేసీ కెనాల్ కింద నారుమడులను సాగు చేస్తున్నారు. ఈ కేసీ నీటికి తోడుగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు మేలు జరగనుంది. జిల్లాలో 7 వేల హెక్టార్లలో పంటలసాగు... ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటికే దాదాపు 7 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు.ఇందులో 16 వందల హెక్టార్లలో వరి, 717 హెక్టార్లలో మొక్కజోన్న, 827 హెక్టార్లలో మినుము, 871 హెక్టార్లలో వేరుశనగ, 70 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 358 హెక్టార్లలో సజ్జ, 30 హెక్టార్లలో సోయాబీన్, 2658 హెక్టార్లలో పత్తి, 16 హెక్టార్లలో చెరకు ఇలా జిల్లావ్యాప్తంగా 7 వేల హెక్టార్లలో వివిధ ఆరుతడి పంటలు సాగయ్యాయి. ● అల్పపీడనం కారణంగా జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఈ వర్షం ఆరుతడి పంటలకు ఎంతో మేలు. ప్రస్తుతం కేసీ కెనాల్కు నీరు వస్తోంది.ఇప్పటికే చాలామంది రైతులు నారుమడులను సాగు చేస్తున్నారు. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఆరుతడి పంటలకు జీవం కాశినాయన మండలంలో అత్యధికంగా 55 మి.మీ వర్షం -
వంచన, మోసం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి వీరపునాయునిపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మోసం చేయడం, వంచనకు గురిచేయడం రెండూ వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. సోమవారం కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అనిమెలలో చంద్రబాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి గతంలో జగన్మోహన్ రెడ్డి అందించిన పాలనకు ప్రస్తుతం చంద్రబాబు అందిస్తున్న అరాచక పాలనకు ఉన్న తేడాను వారికి వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అందించాడని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అర్హత ఉన్నవారికి కూడా సంక్షేమ ఫథకాలు రద్దు చేసిన విషయాన్ని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాతూ ఎన్నికలకు ముందు బాబు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడన్నారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త సైనికుడిలా పని చేసి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. మండల కన్వీనర్ రఘునాథ రెడ్డి, మైనింగ్ మాజీ డైరెక్టర్ వీరప్రతాప్రెడ్డి, అనిమెల సర్పంచు నరేష్రెడ్డి, ఎంపీటీసి రాఘవ యాదవ్, సంగమేశ్వర దేవస్థానం మాజీ చైర్మెన్ శివాంజనేయరెడ్డి, రైతు నాయకుడు భాస్కర్రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి, శ్రీనివాసుల్రెడ్డి, శంబురెడ్డి పాల్గొన్నారు. -
ధైర్యంగా ఉండండి.. పార్టీ అండగా ఉంటుంది
సాక్షి, రాయచోటి: అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులు, దౌర్జన్యాలకు భయపడవద్దని.. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అందుకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం మదనపల్లె పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్కుమార్రెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరం తోడుగా ఉంటామని పేర్కొన్నారు. ప్రతి దానికి చెల్లింపులుంటాయని, ఽధైర్యంగా ముందుకు సాగాలని వైఎస్ జగన్ సూచించారు. ● రమేష్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం స్టేషన్ బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్రెడ్డిలపై చేసిన రాజకీయ విమర్శలను సాకుగా చూపి ఆదివారం రమేష్కుమార్రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.రమేష్కుమార్రెడ్డిని ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ -
బౌలర్ల ధాటికి చతికిలబడ్డ బ్యాటర్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లో తొలి రోజు సోమవారం వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో అనంతపురం జట్టు 38.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆదినారాయణ రెడ్డి 44 పరుగులు, సాత్విక్ 38 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని దినేష్ చక్కటి లైనప్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. తేజేష్ 2 వికెట్లు, నిహాల్ మాలిక్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 50.5 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మహ్మద్ షారుఖ్ అక్తర్ 81 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 4 వికెట్లు, కిరణ్ కుమార్ 4 వికెట్లు తీశారు కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో... కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కడప– నెల్లూరు. జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 29.3 ఓవర్లకు 78 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని గురు 25 పరుగులు చేశాడు. కడప జట్టులోని కాశ్యప్ రెడ్డి 5 వికెట్లు, గైబు 5 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లకు 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నాగ కిషోర్ 21 పరుగులు, చిన్నకేశవ 21 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుశాంత్ 3 వికెట్లు, ఎస్వీ చైతన్య 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 19 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. కడప జట్టులోని గైబు 3 వికెట్లు తీశాడు. కడప బౌలర్ గైబు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయగా రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీయడం విశేషం. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. ప్రారంభమైన ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లు -
రెండు ఇళ్లలో చోరీ
7.7 తులాల బంగారు నగలను దోచుకెళ్లిన దొంగలు ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని నేతాజినగర్లో ఏక కాలంలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. సత్యాల దస్తగిరి, పఠాన్ గైబూసాహెబ్ ఇళ్లలో సుమారు 7.7 తులాల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యాల దస్తగిరి ఇంట్లో విద్యుత్ లేకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి పడుకున్నారు. అలాగే పఠాన్ గైబూసాహెబ్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని దాదాపహాడ్కు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు రెండు ఇళ్లకు వేసిన తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. నేతాజినగర్–4లోని దస్తగిరి ఇంట్లో 5 తులాలు, నేతాజినగర్–2లోని గైబూసాహెబ్ ఇంట్లో 27 గ్రాముల బంగారు, 600 గ్రాములు వెండి నగలను దోచుకెళ్లారు. సోమవారం వేకువ జామున 2.40 గంటల సమయంలో చోరీ జరిగినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వన్టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డిలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. -
ఇలాగైతే ఎలాగండి !
చక్రాయపేట : శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా గండి ఆలయ ప్రాంగణంలో ప్రతి యేటా వేసే జర్మన్ షెడ్డు ఈసారి సమస్యగా మారింది. దీనికి తోడు పారిశుధ్య కార్మికుల సమస్య కూడా ఉత్సవాల్లో తలెత్తడంతో ఇబ్బందికర పరిస్థితులు నెల కొంటున్నాయి. ఇందుకు ఆలయ సహాయ కమిషనర్ ఒంటెద్దు పోకడే కారణమని పాలక మండలి, కూటమి నేతలు, పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. అధికారి అన్నీ తానే అని భావించడంతోనే.. ఉత్సవాల సందర్భంగా ఆలయ పాలక మండలి, సిబ్బంది కలిసి అధికార పార్టీకి చెందిన నేతల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి వారి ద్వారా టీటీడీ వారిని కలిసి జర్మన్ షెడ్డు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయించుకొనేవారు. కాని ఈ దఫా మాత్రం ఆలయ అధికారితో పాటు కాబోయే చైర్మన్ అని ప్రచారం చేసుకునే వ్యక్తి, ప్రధాన అర్చకుడు మాత్రమే నేరుగా టీటీడి అధికారులను కలసి జర్మన్ షెడ్డు, పారిశుధ్య కార్మికులు కావాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈఓ ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉంది. టీటీడీ ఎందుకు ఇవ్వాలి. దేవదాయ శాఖ తరపునే వాటిని సమకూర్చుకోవాలని లేఖ ద్వారా తెలియజేశారు. గతంలో శ్రావణ మాస ఉత్సవాలు అనగానే కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి ముందుగానే ఇక్కడి అధికారులను అప్రమత్తం చేసి తానూ ప్రత్యేక చొరవ చూపేవారు. దీంతో టీటీడీ వారు మారు మాట్లాడక నేరుగా వచ్చి జర్మన్ షెడ్డు వేసి పారిశుధ్య కార్మికులను ఇక్కడ వదిలి వెళ్లేవారు. నేడు అధికారి నేతల సహకారం తీసుకోనందునే ఇబ్బంది పడాల్సి వస్తోందని పలువురు భక్తులు ఆలయ అధికారి తీరును తప్పు పడుతున్నారు. దిక్కుతోచక నేతల వద్దకు.. టీటీడీ అధికారులు జర్మన్ షెడ్డు, పారిశుధ్య కార్మికులను పంపడం లేదని చెప్పడంతో దిక్కుతోచక ఆలయ అధికారి కాబోయే చైర్మన్ సహకారంతో పులివెందుల నియోజకవర్గ టీటీడీ ఇన్చార్జి బీటెక్ రవిని కలిసి తమ ఇబ్బందిని వివరించారు. కానీ టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్సీ రామ గోపాల్రెడ్డిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ల లేదని ఆయన అనుచరులు ఆలయ సహాయ కమిషనర్పై మండి పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సారీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో జర్మన్ షెడ్డు, పారిశుధ్య కార్మికులు వస్తే నిరుడు జరిగిన శ్రావణ మాస ఉత్సవాల సమయంలో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి చొరవ చూపడంతో వాటిని వేశారని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఈసారి ఎమ్మెల్సీని ఆలయ అధికారి ఖాతరు చేయక పోవడం వెనుక కారణం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. జర్మన్ షెడ్ ఎందుకంటే.. ఉత్సవాల సందర్భంగా గండిలో ప్రతి యేటా టీటీడీ వారు వేసే విశాలమైన జర్మన్షెడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. వర్షం వస్తే అందులో సుమారు 2వేల మంది వరకు తలదాచుకొనేవారు. పైగా భక్తుల కాలక్షేపం నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందులోనే నిర్వహించేవారు. పారిశుధ్య కార్మికులు లేకుంటే..టీటీడీ తరపున వచ్చే పారిశుధ్య కార్మికులు నెల రోజుల పాటు ఉచితంగా ఆలయ ప్రాంగణంతో పాటు పాపాఘ్ని నదిని పరిశుభ్రంగా ఉంచే వారు. జర్మన్ షెడ్డుతో పాటు పారిశుధ్య కార్మికుల ఖర్చు టీటీడీ వారు భరించడంతో ఆలయ ఆదాయానికి గండి పడేది కాదు. నేడు టీటీడీ వారు మొండి చేయి చూపడంతో జర్మన్ షెడ్డుతో పాటు పారిశుధ్య కార్మికుల ఖర్చును ఆలయం నుంచి భరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రూ.15 లక్షల పైగా ఆలయ నిధులే ఖర్చు చేయక తప్పదు. మా దృష్టికి రాలేదు.. జర్మన్ షెడ్డు, పారిశుధ్య కార్మికుల విషయం తన దృష్టికి కానీ, పాలక మండలి సభ్యుల దృష్టికి కానీ రాలేదు. సహాయ కమిషనర్ ఏమి చేస్తున్నాడో తెలియలేదు. చివరకు తానే జర్మన్ షెడ్, పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఏంటని అడిగితే టీటీడీ వారు నిరాకరించారని వారు పంపిన లేఖను తనకు వాట్సాప్లో పంపారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. అని ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ పేర్కొన్నారు. ఆలయ అధికారి ఏమంటున్నారంటే.. టీటీడీ వారు జర్మన్ షెడ్డు, పారిశుధ్య కార్మికులను తాము ఇవ్వలేమని లేఖ పెట్టారు. వెంటనే బీటెక్ రవిని కలిసి పరిస్థితి వివరించాను. ఎమ్మెల్సీ రామ గోపాల్రెడ్డిని కూడా కలుస్తాము. ఆలయంలో చలువ పందిళ్లు టెండర్లు దక్కించుకున్న వారికై నా చెప్పి ఆలయ ఖర్చుతోనే షెడ్డు వేయించాలి. లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాను.. అని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య వివరించారు. గండి ఆలయ అధికారి ఏకపక్ష ధోరణిపై విమర్శలు జర్మన్ షెడ్డు వేసేందుకు టీటీడీ నిరాకరణ పారిశుద్ధ్య సిబ్బందిని పంపేందుకూ అంగీకరించని వైనం రూ.15 లక్షలు ఆలయ ఆదాయానికి గండి -
అది పరువు హత్యేనా ?
జమ్మలమడుగు : గండికోటలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించినట్లు తెలిసింది. నిందితులను గుర్తించినట్లు సమాచారం. చిన్న చిన్న సాంకేతిక అడ్డంకులు ఉండటంతో నిందితుల వివరాలు వెల్లడించలేకపోతున్నారని తెలుస్తోంది. ఈనెల 15వ తేదీన ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవి అనే 17 ఏళ్ల బాలిక గండికోటలో హత్యకు గురైన విషయం విదితమే. తమ కూతురు కనిపించలేదంటూ బాలిక తల్లిదండ్రులు ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసు స్టేషన్లో 14వ తేదీ ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గండికోటలోని రంగనాథస్వామి ఆలయం వెనుకవైపు మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. లోకేష్ను అనుమానించి... బాలికను ప్రొద్దుటూరు నుంచి లోకేష్ అనే యువకుడు ఈనెల 14వతేదీ సోమవారం ఉదయం గండికోటకు బైక్పైన తీసుకువచ్చాడు. తిరిగి రెండు గంటల తర్వాత బైక్పైన ఒక్కడే వెళ్లిపోయాడు. హత్యచేసింది లోకేష్గానే మొదట పోలీసులు భావించారు. తర్వాత పోలీసులు గండికోట ప్రాంతంలో పూర్తిగా విచారించడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. లోకేష్ వెళ్లిపోయిన తర్వాత కూడా బాలిక గండికోటలో సంచరించిందనే నిర్ధారణకు వచ్చారు. దీంతో లోకేష్ పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో హత్య కేసు మృతురాలి కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. సురేంద్ర ప్రవేశంతోనే.. బాలికకు సంబంధించిన ప్రేమ వ్యవహారాన్ని పెద్దనాన్న కుమారుడైన సురేంద్రనే డీల్ చేస్తూ వచ్చాడు. అతను లోకేష్ను అనేక సార్లు మందలించాడు. అయితే 14వతేదీన బాలిక కాలేజికి రాలేదని యాజమాన్యం తల్లికి ఫోన్ చేయడంతో ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. బాలిక స్నేహితులు గండికోటకు వెళుతున్నట్లు తమతో చెప్పిందని సురేంద్రకు తెలపడంతో లోకేష్తో వెళ్లిందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే సురేంద్ర గండికోటకు వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ ఏం జరిగింది.. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. సోమవారం బాలిక లోకేష్తో గండికోటకు వెళ్లింది. తనకోసం వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న లోకేష్ బాలికను అక్కడే వదిలేసి ఉదయం 10:40 నిమిషాలకు గండికోటనుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సురేంద్ర గండికోటకు వెళ్లాడు. బాలిక కోసం గండికోటలో వెతుకుతున్న అతనికి ఆమె రంగనాథస్వామి ఆలయం సమీపంలో కనిపించింది. తన కోసమే వస్తున్నాడని భావించి ఆమె పరుగులు తీసింది. ఆ సమయంలో ఆమె కాలికి ఉన్న చెప్పులు రెండు చోట్ల పడిపోయాయి. రంగనాథస్వామి ఆలయం వెనుకవైపు బాలికను చిక్కించుకుని తీవ్రంగా కొట్టడంతో కాలేయం దెబ్బతిని మరణించింది. బాలిక హత్యను లోకేష్ వైపు మళ్లించడం కోసం ఆమె శరీరంపై ఉన్న పంజాబీ డ్రస్సును తొలగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద బాలిక హత్య కేసులో కుటుంబ సభ్యులపైనే బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్తె చనిపోయిందన్న బాధ వారిలో ఏ కోశానా లేదని, పైగా హత్య జరిగిన ప్రదేశాన్ని మొదట వారే గుర్తించి తమకు తెలపడం, సురేంద్ర గండికోటలో పర్యటించిన సమయంలోనే ఈ హత్య జరిగినట్లు తేలడం.. ఈ అన్ని కారణాల రీత్యా కుటుంబ సభ్యుల ప్రమేయం ఇందులో ఉందనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు సోమవారం కుటుంబ సభ్యులను జమ్మలమడుగులోని పోలీసు స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. ఒకటి రెండు రోజుల్లో నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీడనున్న బాలిక హత్య మిస్టరీ! అన్ని కోణాల్లో దర్యాప్తు నేడో రేపో నిందితుల వివరాలు వెల్లడించనున్న పోలీసులు -
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
కడప అర్బన్ : ఐన్యూస్ ఉమ్మడి కడప జిల్లా బ్యూరో చీఫ్ శ్రీనివాసులుతో పాటు ప్రొద్దుటూరు రిపోర్టర్ చెన్నయ్యపై నిరాధారమైన ప్రచారం చేసి వారి గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు ఎం. బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ తక్షణమే కేసు నమోదు చేసి వారంలోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే నాయకులు మాట్లాడుతూ సంస్థకు తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేయడమే కాకుండా, మహిళలను అందులో ప్రస్తావించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవాధ్యక్షుడు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఐన్యూస్ బ్యూరో చీఫ్ శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యుజే నాయకులు సర్దార్, సుబ్బారెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, శ్యామ్, వీరాంజనేయులు, భువనేశ్వర్ రెడ్డి, పూల వెంకటసుబ్బయ్య, చెన్నయ్య, నరసింహులు, సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
జేబీ ఆసుపత్రిలో ట్యూమర్ ప్రాసెస్ సర్జరీ విజయవంతం
కడప రూరల్ : కడప నగరంలోని జేబీ ఆసుపత్రిలో ట్యూమర్ ప్రాసెస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జహంగీర్బాషా వివరాలను వెల్లడించారు. చాగలమర్రికి చెందిన వృద్ధురాలు మహబూబ్చాన్ మోకాలి ఆపరేషన్ చేయించుకొని, చీము పట్టి నడవలేని స్థితిలో ఉండేవారని పేర్కొన్నారు. ఆమె జేబీ ఆసుపత్రికి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో ఎముక పూర్తిగా పాడైపోయినట్లు ధృవీకరించామని తెలిపారు. ఆమె 120 కేజీల బరువు ఉండడం చేత సర్జరీ చేయడం కష్టంగా మారిందన్నారు. పూర్తిగా చెడిపోయిన 25 సెంటీ మీటర్ల ఎముకను తొలగించి, దాని స్థానంలో ఇంప్లాంట్ను అమర్చామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ట్యూమర్ ప్రాసెస్ తెప్పించి సర్జరీని విజయవంతంగా నిర్వహించడంతో పాటు పేషెంట్ను మరుసటి రోజే నడిపించామన్నారు. ఇలాంటి ఆపరేషన్లు చాలా అరుదుగా జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ జయభారతి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో లభించే అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేషెంట్ మహబూబ్చాన్ మాట్లాడుతూ సర్జరీ తరువాత ఆరోగ్యంగా ఉన్నానని, అందరిలా నడవగలుగుతున్నానని తెలిపారు. -
జర్నలిజం కోర్సులో నేరుగా ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమో కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21 నుంచి 31 తేదీ వరకు నేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్షీప్రసాద్ తెలిపారు.జర్నలిజం శాఖ ఆధ్వర్వంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే), ఫైన్ ఆర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుందని తెలిపారు. పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తర్ణీత సాధించినవారు అర్హులని చెప్పారు. వివరాలకు www.yvu.edu.in ను సందర్శించాలని ఆయన సూచించారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ● ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తాము అందజేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ● డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. ‘పాలకొండ’లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కడప వైఎస్ఆర్ సర్కిల్: శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా కడప నగర శివార్లలోని శ్రీ పాలకొండ్రాయస్వామి ఆలయంలో ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయం, అంతరాలయం,షోడశ మండపం, ఆలయ ప్రాంగణం, ప్రాకారపరిసరాలను ఆలయ సేవకులు, అధికారులు శుభ్రపరిచారు. ఆలయ పరిసరాలలో ఉన్నటువంటి చిన్న కోనేరు ,పెద్ద సెలయేరు, ఆలయ చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నటువంటి అపరిశుభ్ర వ్యర్థాలను తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కడప నగరానికి చెందిన శ్రీ భువనేశ్వరి మాత సేవా సమితి సేవకులు, శ్రీ సుముఖీ అన్నపూర్ణేశ్వరి సేవా సమితి సభ్యులు,ఆలయ అర్చకులు యోగేశ్వర శర్మ, ఆలయ చైర్మన్ రెడ్డయ్య యాదవ్, స్వామివారి భక్తులు పాల్గొన్నారు. పిల్లల్లో ఎదుగుదల లోపాలపై నిర్లక్ష్యం తగదు కడప కోటిరెడ్డిసర్కిల్: పిల్లల్లో ఎదుగుదల లోపాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని, ఈ విషయంగా నిర్లక్ష్యం తగదని ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ సోమశేఖర్ తెలిపారు. ఆదివా రం కడప పట్టణంలోని ఐఎంఏ హాలులో ఆర్టి జం స్పెక్ట్రం డిసార్డర్ అనే అంశంపై అషూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆటిజం పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలలు నిండిన వెంటనే పిల్లల ప్రవర్తన, ఎదుగుదల, మాటలు వంటి వాటిని తల్లిదండ్రులు పరిశీలించాలని, ఏమాత్రం తేడా ఉన్న వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ , రిమ్స్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ వంశీధర్, ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ఓబుల్ రెడ్డి మాట్లాడా రు. రత్న స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ స్పీచ్ థెరపిస్టులు బాబురావు, ప్రవల్లిక అషుర్ సంస్థ ప్రతినిధులు న్యాయవాది కిషోర్ కుమార్, నాగరాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తోరణం
● గండి ఉత్సవాలకు వేళాయె! ● మొదలైన ఉత్సవ సందడి ● ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు చక్రాయపేట: శుభాల శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈమాసం అంటే ఆంజనేయుడికి ప్రీతికరం. అలాగే ఆయన భక్తులకు కూడా ఈ మాసమంటే ఎంతో ఇష్టం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఆంజనేయ స్వామి గుళ్లు పత్యేక అలంకరణకు నోచుకుంటాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అవును.. ఇక్కడి వీరాంజనేయ విగ్రహాన్ని స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి తన స్వహస్తాలతో చెక్కడంతోపాటు ఆయనే ప్రతిష్టించారని ప్రతీతి. దీంతో భక్తులు ఇక్కడి స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. సీతమ్మ తల్లి కోరిక తీర్చడం కోసం.. రావణున్ని సంహరించిన అనంతరం సీతా సమేతుడైన శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు తిరిగి వెళుతున్న సమయాన గండి క్షేత్రానికి వచ్చే సరికి చీకటి పడిందట. ఈ సమయంలో సేద తీరుతున్న సీతమ్మ తల్లి అక్కడ కొండకు కనిపించిన పెద్ద రాయిని చూసి శుభగడియలు ముగిసేలోపు ఆంజనేయుడి విగ్రహాన్ని బాణపు ములికితో చెక్కాలని కోరిందట. దీంతో శ్రీరాముడు ఆమె కోరిక మేరకు ఆంజనేయుడి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించారు. శుభగడియలు ముగిసే సరికి ఆంజనేయుడి ఎడమచేయి చిటెకెన వేలు కొదవ పడింది. అంతటితో ఆపేసి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు. ● కాలక్రమంలో పూర్వీకులు భిన్నంగా ఉన్న విగ్రహం పూజలకు పనికి రాదని భావించి చిటికెన వేలిని చెక్కించేందుకు శిల్పిని రప్పించారు. స్వామి వారి చిటికెన వేలు చెక్కాలని సూచించారు. ఇందుకు ఉపక్రమించిన శిల్పి ఉలి దెబ్బ వేయగానే అక్కడ నుంచి రక్తం వచ్చిందట. దీంతో ఆ ప్రయత్నాన్ని పూర్వీకులు విరమించుకున్నారు. సీతాదేవి ఆంజనేయుడిని చిరంజీవిగా వర్ధిల్లు అని ఆశీర్వదించినట్లుగా గుర్తుకు రావడంతో స్వామి వారు ఇక్కడ సజీవంగా ఉన్నాడని భావించి అప్పటినుంచి పూజలు చేయడం ప్రారంభించారు. గండి అంటే.. గండిలో ఉన్న కొండలను శేషాచల కొండలు అంటారు. ఇవి తిరుమల నుంచి గండి వరకు మధ్యలో ఎక్కడేగాని తెగకుండా ఉన్నాయట. అలాంటి ఈ శేషాచల కొండలను పాపాఘ్ని నది మధ్యలో గండి పెట్టడంతో ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చిందంట. ఇక్కడ వెలసిన స్వామిని గండి వీరాంజనేయస్వామి అని పిలుస్తారు. పాపాఘ్ని నది పాపాఘ్ని నది కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని నంది కొండల్లో పుట్టి గండి మీదుగా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో కలుస్తుంది. నంది పాద సముద్భూతా పాపాఘ్ని పుణ్యదాయినీ అని వాయు పురాణం చెప్పింది. అందువల్లే ఈనది పాపాలను హరించివేస్తుందని అందుకే దీన్ని పాపాఘ్ని నది అని పిలుస్తారు. పైగా దీన్ని ఉత్తర వాహిణిగా పిలవడం కూడా ఓ ప్రత్యేకతే. గండిలో తపస్సు చేసుకుంటుండిన వాయుదేవుడు సీతారాముల వారు లంక నుంచి వస్తున్న విషయం తెలిసి రెండు కొండల మధ్యన బంగారు తోరణం నిర్మించి వారికి స్వాగతం పలికాడట. ఆ బంగారు తోరణం నేటికి కూడా ఉందని భక్తుల నమ్మకం. అది పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుందట. ఇప్పటివరకు ఆ తోరణం కొందరికి మాత్రమే కనిపించిందట. వారిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్న సమయంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేస్తుండిన సర్ థామస్ మన్రో ఒకరని చెబుతారు. -
● ఒంటికాలిపై నిరసన
కడప కార్పొరేషన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఆదివారం కార్మికులు ఒంటికాలిపై నిల్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తాము గొంతెమ్మ కోర్కె లు కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సోమవారం నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎస్. రవి, గోపి, కె. శ్రీరామ్, కిరణ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోంది
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే పరమావధిగా పెట్టుకొని ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపి ఆనందించడం వారికి పరిపాటిగా మారిందన్నారు. లేని మద్యం కేసును సృష్టించి, తప్పుడు విచారణలు చేస్తూ రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇలా విపక్ష నేతలపై కేసులు పెట్టుకుంటూ పోతే దానికి అంతే ఉండదన్నారు. రాబోవు రోజుల్లో వారు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోక తప్పదన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వారు ప్రజా సేవ చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో వేధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక, వారు చెప్పినట్లు అక్రమాలు చేయలేక నిజాయితీ కలిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
హామీలు కొండంత, చేసింది గోరంత
కూటమి ప్రభుత్వంపై యూటీఎఫ్ నేతల విమర్శ కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొండంత అని, చేసింది గోరంత మాత్రమేనని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు. ఆదివారం కడపలోని యూటీఎఫ్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సహకరించారన్నారు. ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత పీఆర్సీ బకాయిలతో పాటు డీఏ, సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లింపులకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఉద్యోగులకు జీవన్మరణ సమస్యగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.రూతు ఆరోగ్య మేరి, నాయకులు డి.సుబ్బారావు, సూర్య కుమార్, హిఫాజతుల్లా, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవై.. వర్ధిల్లు!
సీతమ్మవారి కోరికతో శ్రీరాముడు చెక్కిన పవిత్ర విగ్రహమది.. ఆంజనేయుడు చిరంజీవిగా వర్ధిల్లుతున్న క్షేత్రమది... కొండకు గండికొట్టి.. పాపాలను హరిస్తూ ప్రవహించే పుణ్యనదీ తీరమది.. బంగారు తోరణం కొలువై ఉన్న ప్రాంతమది.. భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఆధ్యాత్మిక ఆలయమది.. అదే గండి క్షేత్రం. శ్రావణం వస్తున్న వేళ .. అంజన్న ఆలయం ఉత్సవాలకు ముస్తాబవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండల పరిధిలోని శాటిలైట్ సిటీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులకు గాయాలయ్యాయి. చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి కథనం మేరకు వల్లూరు మండలం, రామిరెడ్డి కొట్టాలకు ఇరువురు ద్విచక్ర వాహనంపై కడప వైపు వెళుతుండగా శాటిలైట్ సిటీ వద్ద డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది – ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కడప ఎడ్యుకేషన్ : వృత్తులో కెల్లా నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప సాయికృప నర్సింగ్ కళాశాలలో జ్యోతి ప్రజ్వలన, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సాయిబాబా విద్యాసంస్థల సీఈఓ ఎంవీ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలని కోరారు. ప్రజలకు సేవచేయడానికి నర్సింగ్ వృత్తి దోహదపడుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యావతి మాట్లాడుతూ సాయికృప నర్సింగ్ కళాశాలలో అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ నర్సింగ్ సూపరింటెండెంట్లు రమణమ్మ, కాంతమ్మతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు ఒంటిమిట్ట : మండలంలో మంటపంపల్లి గ్రామంలోని కడప–చైన్నె జాతీయ రహదారిౖపై ఈనెల 18న శుక్రవారం సాయంత్రం మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. -
సిమెంట్ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు
చాపాడు : మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లే సిమెంట్ రోడ్డు ధ్వంసం ఘటనపై పడమర అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులైన నందిమండలం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు బాల సుబ్బారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లేదారిలో ఐదేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మించారని, ఈ స్థలం తమదని శనివారం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు రోడ్డును తొలగించడంపై అక్కడి దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇరువర్గాల గొడవ – ఇద్దరు యువకులకు గాయాలు పులివెందుల రూరల్ : పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న వైఎస్సార్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఇరువర్గాలవారు గొడవపడ్డారు. దీంతో వంశీ, వలీ అనే యువకులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మారుతీహాలు సమీపంలో నివాసం ఉంటున్న వంశీ న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమించాలని వేధిస్తుండేవాడు. కాలనీవాసులు అనేక మార్లు మందలించినా వినలేదు. ఈ నేపథ్యంలో వంశీ తన మిత్రులతో కలిసి ఆదివారం కాలనీలో ఉన్న యువతి ఇంటి దగ్గరకి వెళ్లి గొడవకు దిగాడు. దీంతో స్థానికుల దాడిలో వంశీ, వలీ అనే మరో యువకుడికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి సంఘటనపై కేసు నమోదు తొండూరు : తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు దస్తగిరి రెడ్డి (బాబురెడ్డి) మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఘణ మద్దిలేటి తెలిపారు. శనివారం ఇనగనూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సమరసింహారెడ్డి, హరికిషోర్రెడ్డిలు ద్విచక్ర వాహనంలో పులివెందులకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దస్తగిరి రెడ్డి కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రాడ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడికి సంబంధించి ఆదివారం దస్తగిరిరెడ్డితో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. గ్రామంలో పోలీస్ పికెట్.. ఇనగనూరు గ్రామంలో దస్తగరి రెడ్డి, బాల ఓబుల్రెడ్డిలు పరస్పరం దాడి చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మెరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు ముద్దనూరు : మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో ఓ డాబా వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పులివెందులకు చెందిన రవిశంకర్ అనే వ్యక్తి మోటార్బైక్లో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. కిందపడిన క్షతగాత్రున్ని కొద్దిదూరం అలాగే లాక్కొని వెళ్లింది. దీంతో అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చోరీ రాజుపాళెం : మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలో రెండు ఇళ్లల్లో పట్టపగలే దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని గోపిరెడ్డి సుస్మిత, ప్రభావతి ఇళ్లల్లో దొంగలు పడ్డారు. ప్రభావతి ఇంటిలో దొంగలకు ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి వారు గోపిరెడ్డి సుస్మిత ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు ఉన్న బీగాలను పగుల గొట్టారు. బీరువాను పగులగొట్టి దుస్తులను చెల్లాచెదురుగా వేసి 5 తులాల బంగారు దొంగిలించినట్లు సుస్మిత ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్ఐ వెంకటరమణ, ఏఎస్ఐలు రామకృష్ణారెడ్డి, సిద్ధయ్య, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. దొంగతనం జరిగిన ఇంటిలో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు సంఘటనపై గోపిరెడ్డి సుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
● తరాలు మురిసేలా–సంస్కృతి వెలిగేలా..
తరతరాలు మురిసి పోయేలా సంస్కృతి వెలిగేలా ఆలయ పునర్నిర్మాణ పనులు గండిలో చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గండిని టీటీడీలో విలీనం చేయించి ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే గత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గండి ఆలయం పునర్ని ర్మానానికి రూ.28 కోట్ల మేర నిధులు మంజూరు చేయించారు. ఈనిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు సుమారు 95శాతం మేర పూర్త య్యాయి. ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిల రాయితోనే నిర్మిస్తున్నారు. ఆల యంలో భక్తులు అడుగు పెట్టగానే దైవత్వం ఉట్టి పడేలా తరాలు మురిసి పోయి సంస్కృతి ఉట్టిపడుతూ చరిత్రలో నిలిచి పోయేలా ప్రతి రాయిపైనా పలు దేవతా మూర్తుల బొమ్మలు చెక్కించారు. ఆలయం నిర్మాణంలో ఉండటంతో ఇక్కడ బాలాలయం నిర్మించి ధారువుతో చేయించిన స్వామి విగ్రహాన్ని ఉంచి పూజలు చేయిస్తున్నారు. -
మహాసభలను జయప్రదం చేయండి
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి రాజంపేట టౌన్: విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవరుచుకుంటే చదువులో రాణించగలరని ప్రేమ్చంద్ హిందీభవన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్చంద్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక బీవీఎన్ పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ్చంద్కి జీవని అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా సర్తాజ్ హుస్సేన్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షల్లో పాల్గొనాలన్నారు. అప్పుడే తమలోని ప్రతిభ ఏమిటన్నది తెలుస్తుందన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: కడప నగర వేదికగా సెప్టెంబర్ 12,13,14 తేదీలలో నిర్వహించనున్న అఖిల భార త విద్యార్థి బ్లాక్ ( ఏఐఎస్బి) 9వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగరంలోని సెవంత్ కేఫ్ మిని హాల్లో జాతీయ మహాసభలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థి సంఘాల పాత్ర చాలా కీలకమైనదన్నారు. అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలు కడప నగర వేదికగా జరుగుతున్న శుభ సందర్భంగా విద్యావంతులు మేధావులు, విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి.వి.సుందర రామరాజు, ఆహ్వాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్ మాట్లాడారు. ఏఐఎస్బీ నాయకులు పాపి రెడ్డి పల్లి పథ్వి,రాజేంద్రప్రసాద్ మనోజ్,చిరంజీవి, విష్ణు,కిరణ్ పాల్గొన్నారు. -
అంధకారంలో పట్టణాలు
కడప కార్పొరేషన్: కుళాయిల్లో నీళ్లు రావడం గగనమైంది.. ఆరు దాటిందంటే చాలు చీకటి కమ్ముకుంటోంది. ఇంకేముంది ఓ వైపు ఈగలు,దోమల తాకిడి.. మరోవైపు విష పురుగుల అలికిడి.. ఇదీ వారం రోజులుగా ప్రజల దుస్థితి. కూటమి పాలన అధ్వాన తీరిది. ఒకటా రెండా 8 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేకుండా పోయింది. దీనికి తోడు కార్మికుల సమ్మెకు పారిశుధ్య కార్మికులు కూడా మద్దతివ్వడంతో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. ● తమ డిమాండ్లు పరిష్కరించాలని మున్సిపల్ కార్మి కులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సుమారు నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న కార్మికులు ఈ నెల 12వ తేది అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. 8 రోజులుగా వారు తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి సేవలు బంద్ చేసి సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. 12 నుంచి ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లగా 16 నుంచి పారిశుధ్య కార్మికులు కూడా వారిని అనుసరించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. కడపలో 344 మంది ఇంజినీరింగ్ కార్మికులు, 664 మంది పారిశుధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లగా, జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 మంది సమ్మె చేస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మె ప్రభావంతో ఆయా పట్టణాల్లో ఆదివారం తీవ్ర తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కడప నగరంలో కొళాయిల్లో నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి ఉంది. గండి, లింగంపల్లి పంపింగ్ స్కీంల నుంచే కడప నగరానికి ప్రధానంగా తాగునీటి సరఫరా అవుతుంది. సచివాలయ ఉద్యోగుల ద్వారా తాత్కాలిక సిబ్బందిని నియమించుకొని తాగునీటిని సరఫరాకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. వాల్వ్లు తిప్పి నీటిని విడుదల చేసిన తర్వాత మళ్లీ ఎవరూ వాటిని ఆఫ్ చేయకపోవడంతో చాలాచోట్ల తాగు నీరు వృథాగా పోతున్న పరిస్థితి ఉండగా, మరికొన్ని ప్రాంతాలకు నీరే సరఫరా కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కడప నగరంలోని గంజికుంట కాలనీ, గౌస్ నగర్ వంటి ప్రాంతాల్లో చుక్క నీరు రాక ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది. 8 రోజులుగా వీధి దీపాల నిర్వహణ బంద్.. నీటి సరఫరా అంతంతే! సాయంత్రమైతే చాలు అంధకారంలో కూరుకుపోతున్న సర్కిళ్లు కార్మికుల సమ్మెనుపట్టించుకోని ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న ప్రజలు మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల కడప కార్పొషన్తోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ పట్టణాల్లో అంధకారం నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం వీధి దీపాలు ఆన్ చేసి, ఉదయం 6 గంటలకు ఆఫ్ చేసే వారు లేకపోవడంతో ప్రధాన వీధుల్లో కూడా చిమ్మ చీకటి ఏర్పడింది. అక్కడక్కడ మాత్రమే లైట్లు ఆన్ చేస్తున్నారుగానీ, అధిక శాతం ప్రాంతాలు కటిక చీకటిలోనే మగ్గుతున్నాయి. అలాగే మరమ్మతులకు గురవుతున్న వీధి దీపాలను సరిచేసే వారు కూడా కరువయ్యారు. వీధి దీపాలు వెలుగుతున్న చోట 24 గంటలు వెలుగుతూనే ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వెలగని పరిస్థితి ఉంది. మరోవైపు పారిశుద్ద్య కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం వల్ల ఆయా పట్టణాల్లో పారిశుధ్యం కూడా అధ్వానంగా మారింది. సమ్మె ప్రభావం కనబడనీయకుండా ప్రధాన రహదారుల్లో మాత్రమే చెత్తను ఎత్తుతున్నారే తప్పా అనేక కాలనీల్లో వీధుల్లో చెత్త ఎత్తేవారు కరువయ్యారు. -
వడ్డీ రహిత రుణాలే అమానత్ బ్యాంక్ లక్ష్యం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేయడమే అమానత్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశమని ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి జనాబ్ అబ్దుల్ రఖీబ్ తెలిపారు. ఆదివారం కడప నగరంలో అమానత్ మ్యూచువల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మూడో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేసి వారు ఆర్థికంగా కుదుటపడేందుకు, వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు ఈ బ్యాంకు కృషి చేస్తుందన్నారు. 2019లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఇస్లామిక్ బ్యాంక్ ఆవశ్యకతను తీసుకెళ్లామన్నారు. ఆయన స్పందించి ఆనాటి మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు విషయాన్ని ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముతీకుర్రహ్మాన్, సంఘ సేవకులు సల్లావుద్దీన్, కడప ఇస్లామిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మా స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారు – న్యాయం చేయాలని ఒంటరి మహిళ వేడుకోలు కడప కార్పొరేషన్ : కడప నగర శివార్లలోని ఇందిరానగర్లో సర్వే నంబర్ 715లో 112 ప్లాట్ నంబర్లో తాము పదేళ్లుగా పొజిషన్లో ఉన్నామని, ఇప్పుడు వేరేవాళ్లు వచ్చి ఆ స్థలం తమదంటున్నారని ఒంటరి మహిళ రఖీబ్ జాన్ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం ఉదయం కొంతమందిని పోగేసుకొని వచ్చి తమ స్థలంలో ఉన్న రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించారని వాపోయింది. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2010లో తమ తల్లి ఖాతూన్ బీ పేరుతో రెవెన్యూ అఽధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని, ఆ స్థలంలో తాము బేస్మట్టం వేసుకొని రేకుల షెడ్డు, కట్టెలు ఏర్పాటు చేసుకొని ఉన్నామన్నారు. 2018లో ఖాతూన్ బీ మరణించడంతో ఆమె కుమార్తెగా తాను ఆ స్థలాన్ని కాచిపెట్టుకొని ఉన్నానన్నారు. కాగా ఇటీవల రైల్వేకోడూరుకు చెందిన రుద్రరాజు శంకర్రాజు అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్నని చెబుతూ ఆ స్థలం తన భార్య రుద్రరాజు లక్ష్మిదేవి పేరున ఉందని మరొక పొజిషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చారన్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా వారు రిపోర్టు కోసం రెవెన్యూ వారికి రాశారన్నారు. ఆ నివేదిక ఏదీ తమకు ఇవ్వకుండానే తమ స్థలంలోకి వచ్చి దౌర్జన్యంగా రేకుల షెడ్ తొలగించడం అన్యాయమన్నారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి ఎన్నో ఏళ్లుగా పొజిషన్లో ఉన్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేష్మ పాల్గొన్నారు. -
రక్తదానం సామాజిక బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్తదానం సామాజిక బాధ్యతగా భావిస్తూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్త వారోత్సవాల రెండో వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం మొదటిరోజు కడప నగరం బాలాజీ నగర్లో జేబీవీఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్వో, డీఎంహెచ్ఓ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత పవిత్రమైన సేవా కార్యక్రమమన్నారు. రానున్న రోజుల్లో వర్షాకాల ప్రభావం వల్ల రక్త అవసరాలు పెరగనున్న తరుణంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరాలు ఎంతో సహాయపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ , సభ్యులు ఈశ్వరయ్య, వికసిత ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీదేవి, వెంకటనారాయణ రెడ్డి, ప్రభుత్వ సిబ్బంది, డాక్టర్ ఓ.వి.రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగనాథరెడ్డి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు. -
స్టాపింగ్ కోసం నిరీక్షణ !
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లు స్టాపింగ్ ఎత్తివేసి దాదాపు ఐదు నెలలు అయింది. రైల్వే అధికారులు కాని నాయకులు కాని స్టాపింగ్ పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి రైల్వే చరిత్ర కలిగిన ఓబులవారిపల్లె రైల్వే పరంగా జంక్షన్ కాక ముందు నుంచి దశాబ్దాలుగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ ఉండేది. ఇక్కడి నుండి చె విలువైన కలపను చైన్నెకి రవాణా చేస్తుండేవారు. అప్పట్లో ఎలకంటి సుబ్బయ్య శ్రేష్టి అనే సామాన్య వ్యక్తి రైల్వేశాఖ అధికారులతో పోరాడి పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల చేయించారు. అప్పటి నుంని నిరంతరాయంగా రాయలసీమ, జయంతి జనతా ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగేవి. కాలక్రమేణా వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ ఎక్స్ప్రెస్లు ఆగేవి. టీడీపీ రైల్వేకోడూరు ఇన్చార్జి, రైల్వేకొడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు మండల కేంద్రానికి చెందిన వారే. అయినా ఐదు నెలలుగా ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ తొలగించినా వారు ఏమీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టించుకోని రైల్వే శాఖ.. మండలం నుంచి చిట్వేలి, రాపూరు, వెంకటాచలం మీదుగా రైలుమార్గం ఏర్పాటు చేయడంతో ఓబులవారిపల్లె జంక్షన్ అయింది. రైల్వేపరంగా అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. అభివృద్ధి మాట దేవుడెరుగు ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ కూడా ఎత్తివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ మార్గంలో నంద్యాల మీదుగా గుంటూరుకు, రేణిగుంట మీదుగా కన్యాకుమారి, చైన్నె, విశాఖపట్టణానికి రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయి. అయితే చాలా ఎక్స్ప్రెస్ రైళ్లు రేణిగుంట, కడపలో గంటల తరబడి నిలబడుతున్నాయి. అలాంటి ఎక్స్ప్రెస్లకు రెండు నిమిషాల పాటు ఓబులవారిపల్లెలో హాల్టింగ్ కల్పిస్తే రైల్వే శాఖకు ఎలాంటి నష్టం ఉండదు. కడప నుండి హరిప్రియ ఎక్స్ప్రెస్ ఉదయం 4.45 నిమిషాలకు బయలుదేరి నందలూరుకు 5.10కి చేరుకుంటుంది. అక్కడ 20 నిమిషాల పాటు ఉంటుంది. రేణిగుంట నుండి తిరుమల ఎక్స్ప్రెస్ ఆపై గుంతకల్లుకు వెళ్లే రైలు రేణిగుంటలో 4.58కి బయలుదేరి కడపకు 7 గంటలకు చేరుకుంటుంది. అక్కడ 45 నిమిషాలు హాల్టింగ్ అనంతరం గుంతకల్లుకు బయలుదేరుతుంది. అదేవిధంగా గుంటూరు ఎక్స్ప్రెస్ రెండు రైళ్లు నంద్యాల రైల్వేస్టేషన్లో గంటకు పైగా ప్రతి రోజు నిలబడుతున్నాయి. ఇలా ఇంకా చాలా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వాటికి రెండు నిమిషాలు హాల్టింగ్ కల్పిస్తే రైల్వేశాఖకు నష్టం లేదకపోగా ఇంకా ఆదాయం పెరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఓబులవారిపల్లె జంక్షన్గా మారి ఐదేళ్లయినా కనీసం బోర్డులో కూడా జంక్షన్ అని పేరు మార్చలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రయాణికుల అగచాట్లు మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట బైరెటీస్ గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఖనిజం విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ఏపీఎండీసీ మంగంపేట కార్యాలయంతో పాటు దాదాపు 150 పల్వరైజింగ్ మిల్లులు, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. చాలామంది వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా బొప్పాయి, అరటి, తమలపాకు, మామిడి తదితర పంటలను రైతులు సాగుబడి చేస్తుంటారు. వారు చైన్నె, ముంబై తదితర నగరాలకు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. నగరాలలో చదువుల కోనం, ఉద్యోగులు తమ విధుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ తొలగించడంతో వారంతా రైల్వేకోడూరు, రాజంపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు స్పందించి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఓబులవారిపల్లె జంక్షన్పై రైల్వేశాఖ శీతకన్ను ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఎత్తేయడంతో అవస్థలు జాతీయ స్థాయి నాయకులున్నా ఫలితం శూన్యం ఎక్స్ప్రెస్లకు స్టాపింగ్ కల్పించాలి ఐదు నెలలుగా ఎక్స్ప్రెస్ రైళ్లు నిలబడటం లేదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఆసుపత్రులకు తిరుపతికి, హైదరాబాదుకు వెళ్లలన్నా రైళ్లు చాలా అనుకూలంగా ఉండేవి. దూర ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణాలు సాగించలేము. ఇప్పటికై నా నాయకులు స్పందించాలి. – ఆర్. వెంకటేష్, రైతు, వై.కోట, ఓబులవారిపల్లె. ఎంపీ చొరవతో గతంలో స్టాపింగ్ కోవిడ్ అనంతరం స్టాపింగ్లు ఎత్తి వేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చొరవతో రైల్వే మంత్రిని కలిసి రెండు సార్లు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ కల్పించారు. ఈ విషయంపై ఎంపీ ఇప్పుడు కూడా దిల్లీలో రైల్వే శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు, రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – తల్లెం భరత్ కుమార్రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్, ఓబులవారిపల్లె. -
నిరసన గళం!
● ఎంపీ మిథున్రెడ్డిపై తప్పడు కేసు నమోదుపై ఆగ్రహం ● కూటమి వైఖరిని తప్పుపట్టిన నేతలు ● పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్కు సంబంధించి ఓటమి లేకుండా వరుస గెలుపులతో రికార్డు సృష్టిస్తున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై అధికార పార్టీ కన్నుపడింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ కీలక నేతలను మద్యం కేసు పేరుతో అరెస్టు చేసి పలువురిని జైలుకు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాయలసీమలో రాజకీయంగా మంచి పట్టు ఉన్న పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షపూరితంగా ప్లాన్ చేసి ఇరికించారు. అంతకు ముందు జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులోనూ ఎంపీ మిథున్రెడ్డి కుటుంబాన్ని ఇరికించేలా పన్నాగం పన్నారు. అయితే అప్పట్లో సీఎంఓ ఆదేశాలతో సీఐడీ విచారణ చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో మద్యం కేసులో అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విచారణ అనంతరం ఎంపీని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడంపై జిల్లాలో పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు. కక్షసాధింపునకు పరాకాష్ట కూటమి ప్రభుత్వం ఒక దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించింది. మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట. రాష్ట్రంలో నియంతృత్వ రాక్షస పాలన కొనసాగుతోంది. ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించేది లేదు. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. – ఎస్బీఅంజాద్ బాషా , మాజీ డిప్యూటీ సీఎం ఎంపీ మిథున్రెడ్డి అరెస్టుపై వైఎస్సార్సీపీ శ్రేణులు కూటమి సర్కార్పై రగిలిపోతున్నాయి. ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు కలకలం రేపింది. పార్టీ శ్రేణులు ఇతర నేతలంతా సీఐడీ విచారణకు హాజరైనా తిరిగి పంపిస్తారనుకునే లోపే అరెస్టు ప్రకటన అలజడి సృష్టించింది. వైఎస్ఆర్సీపీ నాయకులను ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తుండటంతో ఆగ్రహం మీద ఉన్న పార్టీ శ్రేణులకు ఎంపీ అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు వెళ్లినా అందరినీ ఆప్యాయంగా పలుకరించి కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఎంపీని అరెస్టు చేయడంపై పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. మొత్తం మీద ఎంపీ అరెస్టుపై పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు -
దుండగుల దుశ్చర్య
ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు ఘాట్రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పురాతన మునయ్యకోనలోని శివాలయంలోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి అందులోని పూజా, దేవతా సామగ్రిని చెల్లాచెదురు చేశారు. స్థానిక ఎత్తులేటికట్ట సమీపంలోని ఏసుక్రీస్తు విగ్రహం రెండు చేతులను పగలగొట్టారు. శుక్రవారం రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత ఈ రెండు సంఘటనలు జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. జనసంచారం లేని ఈ ఘాట్రోడ్డు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
తొండూరు : అధికార టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో తొండూరు మండలం ఇనగలూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన దస్తగిరిరెడ్డి (బాబురెడ్డి), అదే పార్టీకి చెందిన బాల ఓబుళరెడ్డిల మధ్య ఉపాధి హామీలో చీనీ బిల్లుల విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో దస్తగిరిరెడ్డి తమకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారని బాల ఓబుళరెడ్డి వర్గీయులు ఈ ఏడాది జనవరి మాసంలో దస్తగిరిరెడ్డిపై దాడి చేశారు. దీంతో అప్పటి నుంచి బాల ఓబుళరెడ్డి వర్గీయులు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇనగలూరు గ్రామానికి వెళ్లకుండా బయట తిరిగేవారు. నెల రోజుల క్రితం పోలీసులు ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి ఘర్షణలకు దిగకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. దీంతో బాల ఓబుళరెడ్డి వర్గీయులు ఇనగలూరు గ్రామంలోకి వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. శనివారం బాల ఓబుళరెడ్డి కుమారులు సమరసింహారెడ్డి, హరికిశోర్రెడ్డిలు ద్విచక్రవాహనంపై ఇనగలూరు నుండి పులివెందులకు వస్తుండగా సైదాపురం బస్టాప్ దాటగానే వెనుకవైపు నుంచి దస్తగిరిరెడ్డితోపాటు మరికొంతమంది కారులో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి సమర సింహారెడ్డి, హరికిశోర్రెడ్డిలపై రాడ్లతో దాడి చేశారు. దీంతో వారి తలకు బలమైన రక్తపు గాయాలతోపాటు కాలు విరిగినట్లు తెలిసింది. దాడి జరిగే సమయంలో కొంతమంది స్థానికులు వచ్చి గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమరసింహారెడ్డి, హరికిశోర్రెడ్డిలను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐ వెంకటరమణలు దాడి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ ఘన మద్దిలేటిలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి చేసిన వైనం ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు -
● మందుల కొరత
కడప రిమ్స్లో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ప్రజల అవస్థలు వైద్య సేవలు పొందుతున్న జ్వర పీడితులు కడప రూరల్: ప్రజలపై జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో పెను మార్పులు రావడంతో జ్వరాలు చుట్టుముట్టాయి. దీనికి కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణం తోడైంది. ఫలితంగా విష జ్వరాలు దాడి చేస్తున్నాయి. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యానికి సమస్యల జబ్బు పట్టింది. దీంతో సక్రమంగా వైద్య సేవలు అందకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ● కమలాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మౌళిక సదుపాయాలు పడకేశాయి. ఇక్కడ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే కీలకమైన ఎక్స్ రే సౌకర్యం లేదు. ఆఖరికి ఈసీజీ సదుపాయం కూడా లేదు. ఈ రెండు రకాల పరీక్షలకు రోగులు కడపకు వస్తున్నారు. ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో నీటి సౌకర్యం లేకపోవడం దారుణం. ● ప్రొద్దుటూరు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చక్కెర వ్యాధిని నియంత్రించే ఇన్సులిన్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న జిల్లా ఆసుపత్రికి ఒక రోజుకు 800 నుంచి 1000 వరకు ఔట్ పేషెంట్స్ వస్తారు. అందులో దాదాపు 200 మంది వరకు జ్వరాలతో బాధపడే వారే ఉన్నారు. ● జమ్మలమడుగులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడొస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఫేషియల్ అటెండెన్స్ మాత్రం వేసి, వెళ్లిపోతుంటారు. పులివెందుల ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. సకల వైద్య సౌకర్యాలతో ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి నిర్వీర్యంగా మారింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువ... ఇప్పుడిప్పుడే వ్యాధుల తీవ్రత పెరిగిపోతోంది. కలుషి త నీరు, అపరిశుభ్రత వాతావరణం తదిర కారణాల వల్ల వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ జ్వరాలు సంక్రమిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించి, సరైన మందులు వాడితే ఒక వారంలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. అలాగే డయేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. వివిధ రకాల వ్యాధులతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల విశ్వాసం కోల్పోవడంతో చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్ధికంగా చితికి పోతున్నారు. వ్యాధుల సంఖ్య అధికారిక లెక్కల కంటే అనధికారికంగా అధిక సంఖ్యలో ఉన్నట్లుగా వైద్యులు చెపుతున్నారు. వైద్య రంగంపై పాలకులకు చిన్న చూపు... వైస్సార్సీపీ పాలనలో వైద్య రంగం విలసిల్లింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలతో ఉండేవి. ఏ వ్యాధి వచ్చినా సత్వర వైద్య సేవలు లభించేవి. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం సక్రమంగా అమలైంది, వైద్య రంగానికి సంబంధించిన 108 అంబులెన్స్, 104 సంచార వైద్య శాల తదితర విభాగలు విజయవంతగా అమలు అయ్యేవి. ఇప్పుడు కూటమి పాలనలో ఆ రంగాలన్నీ కుదేలయ్యాయి. వైద్య రంగంపై చిన్న చూపు చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జనవరి 1 నుంచి జూన్ 23 వరకు నమోదైన వ్యాధుల వివరాలు వ్యాధులు సంఖ్య మలేరియా 03 డెంగ్యూ 76 చికున్గున్యా 06 డయేరియా 1,276 టైఫాయిడ్ 261 జిల్లాలో కడప నగరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (పెద్దాసుపత్రి), ప్రొద్దుటురులో జిల్లా ఆసుపత్రి, పులివెందులలో సర్వజన ఆసుపత్రి, వైద్య విధాన పరిషత్లో పోరుమామిళ్ల, మైదుకూరు, చెన్నూరు, బద్వేల్, సిద్దవటం, కమలాపురం, వేంపల్లెలో కలిపి మొత్తం 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిల్లో దాదాపుగా అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందించాలి. ఏదైనా పెద్ద జబ్బు, సమస్యతో కూడకున్నదైతే కడప రిమ్స్లో వైద్యం చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక ఆసుపత్రిలో 172 రకాల మందులను అందుబాటులో ఉంచాలి, 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లు 342 ఉన్నాయి. ఒక క్లినిక్ ద్వారా 108 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. చాలా వరకు ఆసుపత్రుల్లో మందులకు కొరత ఏర్పడింది. జ్వరం, జలుబు, దగ్గుకు మందులకు కొరత ఉంది అలాగే చక్కెర వ్యాధిని నియంత్రించే ఇన్సూలిన్ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. కొన్ని ఆసుపత్రులు ప్రక్కన ఉన్న ఆసుపత్రుల నుంచి లేని మందులను తెచ్చుకొని రోగులకు ఇస్తున్నారు. ఏమని అడిగితే...సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందులు రావాల్సి ఉందని వైద్య సిబ్బంది చెపుతున్నారు. -
సమస్యలు పరిష్కరించేవరకు పనులు జరగనివ్వం
వేముల : తమ సమస్యలు పరిష్కరించేవరకు టెయిలింగ్ పాండ్ వద్ద ఎలాంటి పనులు జరగనివ్వమని.. సమస్యలపై స్పష్టత ఇచ్చాకే పనులు చేసుకోవాలని కె.కె.కొట్టాల గ్రామస్తులు యురేనియం అధికారులకు సూచించారు. శనివారం ప్రొక్లెయిన్ల సహాయంతో పనులు చేపట్టేందుకు యురేనియం అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కె.కె.కొట్టాల గ్రామస్తులు టెయిలింగ్ పాండ్ వద్దకు చేరుకుని పనులు చేయవద్దని నిరసనకు దిగారు. దీంతో యురేనియం అధికారులు బాధితులతో చర్చించినా వారు అంగీకరించలేదు. కాగా యురేనియం ముడి పదార్థాన్ని శుద్ధి చేయగా, వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్కు తరలిస్తున్నారు. అయితే టెయిలింగ్ పాండ్ వ్యర్థాలతో నిండే స్థాయికి చేరుకుంది. దీంతో యురేనియం అధికారులు రోజుకు 3వేల టన్నుల ముడి పదార్థాన్ని శుద్ధి చేయాల్సి ఉన్నా.. టెయిలింగ్ పాండ్ తొందరగా నిండిపోయే ప్రమాదం ఉండటంతో ప్రస్తుతం రోజుకు 1500 టన్నులు మాత్రమే ముడి పదార్థాన్ని శుద్ధి చేస్తున్నారు. ఈ లెక్కన ముడి పదార్థాన్ని శుద్ధి చేసిన నాలుగైదు నెలల్లో టెయిలింగ్ పాండ్ నిండుతుందని యురేనియం అధికారులు చెబుతున్నారు. అంతేకాక ఈ లోపు భారీ వర్షాలు కురిస్తే టెయిలింగ్ పాండ్ వర్షపు నీటితో పొర్లిపొయే ప్రమాదం ఉంది. దీంతో యురేనియం అధికారులు ప్రొక్లెయిన్ సహాయంతో టెయిలింగ్ పాండ్ వద్ద మట్టిని పోసే పనులను చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రొక్లెయిన్లను సిద్ధంగా ఉంచుకుని పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు ఈ సమాచారం కె.కె.కొట్టాల గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు టెయిలింగ్ పాండ్ వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పనులు చేయడానికి వీల్లేదనడంతో నిరసనకు దిగారు. యురేనియం వ్యర్థాలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. యురేనియం వ్యర్థాలు దుమ్ము, ధూళి గాలి ద్వారా గ్రామం వైపు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వాదించారు. కిడ్నీ వ్యాధులు, గర్భస్రావాలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయని యురేనియం అధికారులకు విన్నవించారు. టెయిలింగ్ పాండ్ పనులు జరగాలంటే తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు. రాత్రికి రాత్రే ప్రొక్లెయిన్లను టెయిలింగ్ లోనికి పంపి పనులు చేపట్టడంపై గ్రామస్తులు యురేనియం అధికారులను నిలదీశారు. ఇళ్లు, పొలాలు తీసుకుని పరిహారంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని తర్వాతనే పనులు చేసుకోవాలని గ్రామస్తులు తేల్చి చెప్పారు. యురేనియం అధికారులు నవీన్కుమార్రెడ్డి, టెయిలింగ్ పాండ్ ఇన్ఛార్జి నాగరాజులు గ్రామస్తులతో చర్చించారు. మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎలాంటి ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు నచ్చజెప్పారు. మీ ప్రకారమే అన్ని జరుగుతాయని, అయితే ఇందుకు సమయం కావాలని, అప్పటివరకు పనులు చేసుకునేందుకు సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఇందుకు గ్రామస్తులు తమ సమస్యలపై హామీ ఇచ్చిన తర్వాతనే పనులు చేసుకోవాలని, అంతవరకు టెయిలింగ్ పాండ్లో పనులు చేపట్టవద్దని, పనులు చేస్తే ధర్నాకు వెనుకాడమని హెచ్చరించారు. దీంతో టెయిలింగ్ పాండ్ వద్ద పనులు నిలిచిపోయాయి. టెయిలింగ్ పాండ్ వద్ద పనులు నిలిపివేయాలని గ్రామస్తుల నిరసన యురేనియం అధికారులు చర్చించినా పట్టువీడని బాధితులు నిలిచిపోయిన పనులు -
ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!
ఎదురుచూడటం తప్ప... అన్నదాత సుఖీభవ నిధుల కోసం ఎదురుచూస్తున్నాం. గతేడాది ఒక్క రుపాయి కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఖరీప్ సీజన్ కూడా ప్రారంభమయింది. వర్షా లు పడుతున్నాయి. పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికై నా అన్నదాత సుఖీభవ నిధులను ఇస్తే పెట్టుబడికి సాయంగా ఉంటుంది. – చిన్న సుబ్బరాయుడు, కానపల్లి, పొద్దుటూరు మండలంకడప అగ్రికల్చర్: ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 20 వేలు అందజేస్తాం. ఎరువుల, విత్తనాలను సకాలంలో సరఫరా చేస్తాం. ఎక్కడ ఎరువుల కొరత లేకుండా చేస్తాం..’ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊదరకొట్టిన మాటలివి. అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు అన్నదాతలకిచ్చిన వాగ్దానాలు మాత్రం గాలిలో కలిసి పోయాయి. ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం పరుగులు తీస్తున్నారు. అన్నదాత సుఖీభవ నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖరీఫ్, రబీ రెండు సీజన్లు ముగిశాయి. రెండు సీజన్లకు ఒక్క రుపాయి కూడా విడదల కాలేదు. మళ్లీ తాజాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు రెండు నెలలు కావొస్తుంది. ప్రస్తుతం జిల్లాలో వర్షాలతోపాటు కేసీ కాలువకు నీటిని కూడా వదిలారు. ఇక అన్నదాతలు కాడీ మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమతున్నారు. ఇప్పుడు రైతన్నలకు పెట్టబడి సాయం అవసరం. విత్తనాలు, ఎరువులను తెచ్చుకునేందుకు డబ్బులు ఎంతో అవసరం. కానీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఇప్పటికి ఒక క్లారిటి ఇవ్వలేదు. ఇటీవలే రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి ఈకేవైసీ కూడా తీసుకున్నారు. కానీ నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అన్నదాతలు ఊసూ రుమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 77475 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకానున్నాయి. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 205600 మంది రైతులకు రైతు భరోసా ఇవ్వగా ఈ ఏడాది ఈకేవైసీ పేరుతో దాదాపు 9700 మంది రైతులకు జిల్లాలో కోత విధించి 1,95,892 మంది రైతులు అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. వీరికై నా సకాలంలో నిధులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఠంచన్గా కేంద్ర ప్రభుత్వ సాయం... పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఠంచన్గా సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా మూడు విడతల్లో 6 వేలు సాయం అందచేస్తామని ప్రకటించింది. ఈ మేరకు గతేడాది జూన్ నెలలో రూ. 2 వేలు, అక్టోబర్లో 2 వేలుతోపాటు ఈ ఏడాది మార్చి నెలలో మూడవ విడదను విడుదల చేసింది. ఇలా జిల్లావ్యాప్తంగా గతేడాది 1.89 లక్షల మంది రైతులకు ఒకొక్కరికి 2 వేల చోప్పున రూ. 37.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు వివరాలు ఇలా.. సంవత్సరం రైతుల విడుదలైన నిధులు సంఖ్య (కోట్లలో) వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో... వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న ఐదెళ్లలో పంటల సాగుకోసం క్రమం తప్పకుండా పెట్టబడి సాయం అందించింది. ఏటా ఖరీప్ ఆరంభంలోనే పెట్టుబడి సాయాన్ని అందించి పంటలసాగుకు చేయూత నిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వంలో పంటలసాగుకు అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. దీనికితోడు గత ఖరీఫ్, రబీ సీజన్లలో అకాల వర్షాలు, తుఫాలతో రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. వారిని కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడి కూడా ఇవ్వలేదు. ఇటు ఇన్పుట్ సబ్సిడీ అందక.. అటు అన్నదాత సుఖీభవ నిధులు రాక జిల్లా రైతులు నష్టపోయారు. ఇతని పేరు ఆదినారాయణరెడ్డి. ఊరు పెండ్లిమర్రి మండలం కోనాయపల్లె. ఐదు ఎకరాల మెట్ట పొలం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మినుము, బుడ్డ శనగ సాగు చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం విత్తనాలు అవసరం. ప్రభుత్వం అన్నదాత సుభీభవ నిధులను విడుదల చేస్తే పంటలసాగుకు ఆసరాగా ఉంటుందని, విత్తనాలు, ఎరువులను తెచ్చుకునేందుకు వీలుగా ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆలస్యం చేస్తే సాగుకైన దూరం కావాల.. లేదంటే బయట వ్యక్తుల వద్ద అప్పైన చేయాల. జిల్లా వ్యాప్తంగా రైతుల దుస్థితి ఇది. రెండేళ్ల నిధులు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. గతేడాది రైతులకు ఇవ్వా ల్సిన అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది రైతులు నష్టపోయారు. గతేడాది అన్నదాత సుఖీభవ నిధులతో కలిసి ఈ ఏడాది నిధులను ఇచ్చి రైతులను ఆదుకోవాలి.– భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ అన్నదాత సుఖీభవ నిధుల విడుదలెప్పుడో ఈకేవైసీ పూర్తయినా నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వని సర్కార్ విత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు అప్పులు భూమి ఉన్న ప్రతి రైతుకు ఇవ్వాలి అన్నదాత సుఖీభవ నిధులను భూమి ఉన్న ప్రతి రైతుకు ఇవ్వాలి. అలాగే కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ఈకేవైసీ పేరుతో జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించచడం అన్యాయం. దీంతో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ నిధులురాక నష్టపోనున్నారు. –దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. సీపీఎం 2019–20 206708 279.93 2020–21 208747 280.06 2021–22 199344 269.11 2022–23 202598 235.68 2023–24 205600 277.56 -
బాలిక హత్య కేసులో పోలీసుల తాత్సారం
జమ్మలమడుగు : గండికోటలో మైనర్ బాలికను హత్యచేసిన నిందితులెవరో పోలీసులకు తెలిసినా వివరాలను వెల్లడించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకురాలు వరలక్ష్మి ప్రశ్నించారు. శనివారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తిలో బాధితురాలి తల్లిదండ్రులతో, బాలికను బైకుపై తీసుకెళ్లిన లోకేష్ తల్లితో మాట్లాడారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లును కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనర్ బాలిక హత్య జరిగిందని తెలిసిన వెంటనే లోకేష్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారన్నారు. ఐదురోజులు గడిచినా ఇంతవరకు అతన్ని కోర్టు ముందు హాజరు పరచలేదన్నారు. నిందితులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నామంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. నిందితుల వివరాలు ఎందుకు దాచిపెడుతున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. సంఘటన స్థలాన్ని కూడా తాము పరిశీలించామని, ఆ ప్రాంతం పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందన్నారు. గండికోటలో టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప ఎక్కడా సెక్యూరిటి గాని సీసీ కెమెరాలు గాని లేవన్నారు. ఈ ప్రాంతానికి విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని, ఇలాంటి సంఘటనలు జరిగితే విదేశాల్లో సైతం మన పరువు పోతుందన్నారు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ పెంచి, పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదులు, మహిళా సంఘాలు, సీపీఎం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు
వల్లూరు: వైఎస్సార్సీపీ పోరాటాలతో సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే ఆయన ఆ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ లేనికేసులు సృష్టించి అణచివేతకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. లేని మద్యం కేసు సృష్టించి జగన్ చుట్టూ వున్న వారిని అరెస్టు చేసేందుకు ఎల్లో మీడియాతో కలిసి డ్రామాలాడుతున్నారని అన్నారు. ఎంపీ మిథున్రెడ్డిని అక్రమ కేసులో ఇరికించడం అందులో భాగమేనని ఉదహరించారు. కేసుకు సంబంధించి ఎక్కడైనా డబ్బు సీజ్ చేయడం, పెట్టుబడులు పెట్టినట్లుగానీ ఆధారాలు లేకున్నా.. నోటి మాటతో కథలు అల్లుతున్నారని విమర్శించారు. ఏడు కేసుల్లో బెయిల్పై వున్న చంద్రబాబునాయుడు తనపై కేసులన్నింటినీ నీరు గార్చడానికి ప్రయత్నిస్తూ కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం:రాచమల్లు ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని, కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్పై రాచమల్లు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం 13 నెలల పాలనలో అక్రమ అరెస్ట్లు తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సిట్ అధికారులు లిక్కర్ కేసులో ఇంత వరకు ఒక్క రూపాయిని కూడా సీజ్ చేయలేదన్నారు. సంస్థలో పనిచేసే చిన్న ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు స్టేట్మెంట్లతో ప్రముఖ నేతలను ఇరికించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని బాధించేందుకే మిథున్రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఆధారాలు లేని కేసులు కోర్టులో నిలబడవన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విత్తనం వేస్తోందో భవిష్యత్తులో అదే ఫలం వస్తుందని హెచ్చరించారు.జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
ప్రవర్తన మార్చుకోలేదని భార్యను కడతేర్చాడు
చాపాడు : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మా ర్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు. గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కన్పించలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి ఎద్దడుగు కనుమలో పడేశాడు పోలీసుల అదుపులో భర్త గోపాల్ -
దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు
చాపాడు : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం.. 30 ఏళ్లుగా సిమెంట్ రోడ్డుకు నోచుకోని మండలంలోని తిప్పిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ(దళితవాడ)కి మెయిన్ రోడ్డు నుంచి 2019–20లో 14వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకం కింద రూ.4లక్షలతో ప్రభుత్వం సిమెంట్ రోడ్డు నిర్మించింది. ఆ సమయంలో రోడ్డు నిర్మాణం చేపట్టే స్థలం తమదని మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత నందిమండలం మల్లికార్జునరెడ్డి అడ్డుపడ్డాడు. ఎస్సీ కాలనీ లే అవుట్లో దారి స్థలం ఇదేనని అధికారులు తేల్చడంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఈ రోడ్డు నిర్మాణంపై ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం తన అనుచరులతో వచ్చి జేసీబీతో 40 కుటుంబాల వారు నివసిస్తున్న దళితవాడకు వెళ్లే సిమెంట్ రోడ్డు పూర్తిగా తొలగించి ధ్వంసం చేయించాడు. ఈ సమయంలో దళితవాడకు చెందిన వారందరూ ఉపాధి హామీ పనులకు వెళ్లగా అక్కడ ఉండే కొంత మంది రోడ్డు తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమను బెదిరించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దళితులందరూ ఇంటికి రాగా అప్పటికే వారి ఇళ్లకు వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయి ఉంది. దీంతో ఫోన్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరి సంఘటన స్థలాన్ని పరిశీలించి దళితులను విచారించారు. ఈ రోడ్డును టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి తొలగించినట్లు వారు ఎంపీడీఓ వీరకిషోర్కు తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న పెద్దయ్య సంఘటనా స్థలం వద్దకు చేరుకుని రోడ్డు తొలగింపును పరిశీలించారు. ఈ చర్యను అడ్డుకోబోగా అనంతపురం, ఓబాయపల్లె, నక్కలదిన్నె గ్రామాలకు చెందిన టీడీపీ వర్గీయులు చంపుతామని బెదిరించి భయాందోళనకు గురి చేసినట్లు వారు ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు తొలగింపు ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక దళితులు ఎస్ఐ చిన్న పెద్దయ్య, డిప్యూటీ తహసీల్దారు కృష్ణారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ స్థలంపై తనకు హక్కు ఉందని కోర్టులో దీనిపై కేసు నడుస్తోందని స్టే కూడా ఉందని మల్లికార్జునరెడ్డి చెబుతున్నాడు. ఎంపీడీఓ ఏమన్నారంటే.. తిప్పిరెడ్డిపల్లె దళితవాడకెళ్లే రోడ్డును టీడీపీ నేత తొలగించడంపై ఎంపీడీఓ వీర కిషోర్ను వివరణ కోరగా.. ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును తొలగించడం చట్టరీత్యా నేరమన్నారు. రోడ్డు తొలగింపు, స్థల సమస్యపై రెవెన్యూ అధికారులతో కలసి సమగ్ర విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లెలో టీడీపీ నేత దుశ్చర్య టీడీపీ నేత మల్లికార్జునరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు : దళితులు 30 ఏళ్ల క్రితం ఊరి బయట ఉన్న తాము ఇళ్లు నిర్మించుకునేందుకు పామిడి బుడ్డయ్య కుమారుడు వీరయ్య నుంచి ఇంటింటికి చందాలు వేసుకుని 70 సెంట్ల స్థలం కొనుగోలు చేశామని దళితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ కాలనీ పెద్ద మనిషి గయన్నతో పాటు మరికొందరు పెద్ద మనుషుల నిర్ణయంతో ఊర్లో పెద్ద మనిషిగా ఉన్న నందిమండలం వీరారెడ్డి పేరుతో స్థలం రాయించుకున్నామన్నారు. అప్పటి నుంచి వీరారెడ్డి పేరు మీదనే స్థల పత్రాలు ఉన్నాయన్నారు. వీరారెడ్డి తమ్ముడి కుమారుడు అయిన పడమర అనంతపురం గ్రామంలో ఉన్న టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ స్థలం తమ పెదనాన్నదని తనకు హక్కు ఉందని వస్తున్నాడని, గతంలో అధికారులు చెప్పినా వినకుండా ఇప్పుడు ఇలా దౌర్జన్యంగా రోడ్డును తొలగించాడని దళితులు వాపోతున్నారు. -
యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డి సర్కిల్: నిరుద్యోగ యువతకు బెంగుళూరులోని ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, ట్యాలీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సెంటర్ అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమో, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు 18 నుంచి 28ఏళ్ల లోపు ఉండాలన్నారు. 35రోజులపాటు శిక్షణ ఉంటుందని, శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఇతర వివరాలకు 9000487423 అనే ఫోన్ నెంబర్కు సంప్రదించాలని సూచించారు. నేడు చైల్డ్ డెవలప్మెంట్పై అవగాహన సదస్సు కడప కార్పొరేషన్: పిల్లల ఎదుగుదల, తెలివితేటలు, ఎదుగుదలలోని లోపాలను, చదువులో వెనుకబాటుతనం, మాట సరిగా రాకపోవడం, వినికిడి లోపాలు మొదలగు సమస్యలపై అనుభవజ్ఞులైన వైద్యులచే అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అస్యూర్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మద్రాసు రోడ్డులోని ఐఎంఏ హాలులో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ అవగాహన సదస్సులో ఆటిజమ్– ఆక్టివిటీ, బుద్ధిమాంద్యం తదితర సమస్యలపై కూడా వైద్యులు పరీక్షిస్తారన్నారు. చిన్న పిల్లల వైద్యులు హాజరై అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నేటితో గడువు ముగింపు కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్లో 2వ విడత అడ్మిషన్లకు 20వ తేదీతో గడువు ముగుస్తుందని ప్రభుత్వ మైనారిటీస్ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా పెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ .. ఆపై అర్హతలు ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు. అభ్యర్థులు నేరుగా తమ 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్, ఫొటో, మొయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తీసుకుని ఐటీఐ వద్దకు వచ్చి ఉచితంగా ఆన్లైన్ ద్వారా iti.ap.gov.in అను పోర్టల్లో దరఖాస్తును సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా కూడా దరఖాస్తు వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోదండ రామయ్యకు స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యా ల నడుమ స్నపన తిరుమంజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో సుప్రభాత సమయాన శ్రీరామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, అభిషేక సామగ్రి సమ ర్పించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణ మూర్తులకు అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేద పారాయణం, సహస్త్ర నామార్చన, కుంకుమార్చన, మంగళహారతులతో విశేష పూజలు నిర్వహించారు. పాఠశాల తనిఖీ బద్వేలు: బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శనివారం ప్రాంతీయ విద్యా సంచాలకులు కె.శామ్యూల్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థునులకు అవసరమైన వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల సమావేశ మందిరంలో జరుగుతున్న పాఠశాల సముదాయ ఉపాధ్యాయుల సమావేశ ంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడి శామ్యూల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎవరి పాఠ్యాంశంలో వారు అంకితభావంతో ఆహ్ల్లాదకరమైన వాతావరణలో నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్న ప్రతి నిమిషాన్ని విద్యార్థుల ఉన్నతికి ఉపయోగించాల ని తెలిపారు. అనంతరం పాఠశాలలోని సర్వేపల్లి రాధాక్రిష్ట విద్యామిత్ర కిట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి చెన్న య్య, హెచ్ఎం కొండా వెంకటరామిరెడ్డి మాట్లాడారు. పాఠశాల సముదాయ ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
కర్నూలు, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లో శనివారం మూడో రోజు కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాఽధించాయి. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టు రెండవ ఇన్నింగ్స్లో 39.2 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సీఎండీ ఫైజాన్ 30 పరుగులు, గైబు 35 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి విఘ్నేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. రుత్విక్ కళ్యాణ్ 2 వికెట్లు, వివేక్ 2 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 66 పరుగులతో విజయం సాధించింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 157 స్కోరు, రెండవ ఇన్నింగ్స్లో 140 స్కోరు చేసింది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 114 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 117 పరుగులు మాత్రమే చేసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో... కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజు నెల్లూరు–అనంతపురం జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. 225 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 63.5 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని యశ్వంత్ 24 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 5 వికెట్లు, సంజయ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 43.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కార్తీక్ రెడ్డి 27 పరుగులు, కిరణ్కుమార్ 24 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నేత్రానంద 3 వికెట్లు, రిత్విక్ 3 వికెట్లు, విక్రాంత్ రెడ్డి 2 వికెట్లు, సుశాంత్ 2 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 75 పరుగులతో విజయం సాధించింది. -
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి
కడప అర్బన్ : సమస్త జీవరాశికి, పర్యావరణానికి పెనుముప్పులా మారిన ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి సవాలుగా మారిన ప్లాస్టిక్ వాడకం లేకుండా ఇతర పర్యావరణహిత ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని సూచించారు. రేపటి తరానికి ప్లాస్టిక్ రహిత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. పోలీసులు క్రమశిక్షణతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏ.ఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్.ఐ లు ఆనంద్, టైటస్, శివరాముడు, శ్రీశైల రెడ్డి, వీరేష్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సింగసాని గురుమోహన్, కల్లూ రు నాగేంద్రారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించడం జరుగుతుందని, వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయ కారిగా వ్యవహరించనున్నారు. కాగా సింగసాని గురుమోహన్ బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్గా, కడప అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు. కల్లూరు నాగేంద్రారెడ్డి ప్రొద్దుటూరు మండల కన్వీనర్గా, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్గా పనిచేశారు. వీరు పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఈ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
భార్యకు అదే పిచ్చి... భర్త ఏం చేసాడంటే!
కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కని్పంచలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. -
అవినీతికి కేంద్రం.. కారాగారం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం అవినీతికి చిరునామాగా మారింది. ఇక్కడ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వివిధ అంశాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది కొందరు అధికారులు, సిబ్బందికి కాసుల పంటగా మారింది. ఎర్రచందనం స్మగ్లర్గా అనేక కేసుల్లో నిందితుడిగా వున్న జాకీర్ పీడీ యాక్ట్ కింద రిమాండ్లో వున్నాడు. అతని వద్దనే ఆకస్మిక తనిఖీల్లో దశల వారీగా 12 సెల్ఫోన్లు, ఛార్జర్ లభించినట్లు విచారణ అధికారిగా వచ్చిన డీఐజీ ఎంఆర్ రవికిరణ్ నిర్ధారణకు వచ్చారు. బాధ్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు సిద్ధం చేసి పంపనున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు బయటి నుంచి విసిరేస్తే లోపలికి వచ్చి పడుతున్నాయని, కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది సహకారంతో రిమాండ్ ఖైదీల చేతికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బయటి నుంచి వచ్చిన సెల్ఫోన్లను కొన్ని సమయాల్లో ఖైదీలే తీసుకుని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. సెల్ఫోన్ల వ్యవహారం తెలిసినా, తాము విధుల్లో వున్నపుడు రిమాండ్ ఖైదీ మాట్లాడుకుంటున్నా తమకేమీ పట్టనట్లు వుండే వారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సెల్ఫోన్ల వ్యవహారంపై ప్రాథమిక విచారణకు వచ్చిన డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమికంగా విచారణకు వచ్చామని, నివేదికను తయారు చేసి డీజీకి సమర్పిస్తామన్నారు. ఈ రిపోర్టు అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డెయిరీ పాలు ఏమవుతున్నాయో? కడప కేంద్ర కారాగారంలోని కీలక అధికారికి సంబంధించిన పెంపుడు కుక్క టామీకి రెండు లేదా మూడు లీటర్ల పాలు పంపించాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఓ హెడ్ వార్డర్ తన పెంపుడు పిల్లికి కూడా పాలు ఇవ్వాలని పట్టుపట్టి మాట్లాడినట్లు సమాచారం. డెయిరీలో వచ్చిన 16 లీటర్ల పాలల్లో 14 లీటర్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం రెండు లీటర్ల పాలల్లో నీళ్లను కలిపి, రిజిస్టర్లో మాత్రం 16 లీటర్ల పాలు లోపలికి పంపిస్తున్నట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్యాకెట్ పాలను నేరుగా వ్యాన్ ద్వారానే లోపలికి పంపిస్తున్నట్లు.. లోపల లెక్క చూసుకుంటున్నారని సమాచారం. ఖైదీలను ఆస్పత్రులకు తీసుకెళ్తూ.. కొంత మంది జీవిత ఖైదీలు కొందరు అవినీతి అధికారులను ఆశ్రయించి వైద్య పరీక్షలు, చికిత్సలు అంటూ కడప రిమ్స్కు, అక్కడి నుంచి కర్నూలు, విజయవాడ, హైదరాబాద్లకు రెఫర్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతిసారి వేలాది రూపాయలను ముట్టజెపుతున్నట్లు తెలిసింది. డాక్టర్ల రిపోర్ట్ మేరకు కడపకు చెందిన ఓ ప్రముఖ జీవిత ఖైదీకి ప్రతి నెలలో కనీసం రెండు లేదా మూడు సార్లు రిమ్స్కు పంపించి ‘సకల మర్యాదలు’ చేస్తున్నట్లు సమాచారం. పెట్రోల్ బంకులో చేతివాటం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన ఖైదీ వద్ద సెల్ఫోన్ అభ్యం నజరానాను బట్టి కొందరికి సౌకర్యాలు అక్రమాలపై డీఐజీ నివేదిక సిద్ధం కడప కేంద్రగారం ఆధ్వర్యంలో ఓ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న జీవిత ఖెదీల్లో కొందరు అక్రమార్జనకు సహకరించి కొందరు కారాగార అధికారులకు రూ.వేల నుంచి లక్షలాది రూపాయలను ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఇక్కడ పని చేస్తున్న కారాగార సిబ్బంది, ఔట్గ్యాంగ్ ఖైదీలను ఎప్పటికప్పుడు విధులను మారుస్తూ, తప్పు జరిగినపుడు సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా వుంది. పెట్రోల్ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంది. -
మహిళలంటే కనీస గౌరవం లేదు
తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలలంటే కనీస గౌరవం లేదు. ఇందుకు నిదర్శనం మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలే. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మహిళా లోకం అసహ్యించుకునేలా ట్రోల్ చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నందుకే రోజాను టార్గెట్ చేశారనిపిస్తోంది. – టీపీ వెంకట సుబ్బమ్మ, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 క్రికెట్ మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండో రోజున ఉత్సాహంగా సాగాయి. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు– అనంతపురం జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. 93 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 60.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని టి.కిరణ్కుమార్ 66, సాత్విక్ 23 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నేత్రానంద నాలుగు, విక్రాంత్రెడ్డి 2, రిత్విక్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు మోహన్ 66 పరుగులు, రిషికుమార్రెడ్డి 57 పరుగులు, చేశారు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 3 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 246 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో...... వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప– కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. రెండో రోజు శుక్రవారం 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కడప జట్టు 51.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సీఎండీ పైజాన్ 40, కశ్వప్రెడ్డి 23 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని వై.రిత్విక్ కల్యాణ్ ఐదు, సాయి విఘ్నేష్ 2, వివేక్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 57.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రోహిత్ గౌడ్ 51 పరుగులు, హరిహరన్ 22 పరుగులు చేశారు. కడప జట్టులోని జయ ప్రణవ్ శ్రాస్తి 3 వికెట్లు, చెన్న కేశవ 2 వికెట్లు, గైబు 2 వికెట్లు తీశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
రోజాపై వ్యాఖ్యలపై.. ఆగ్రహం
● టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్పై ధ్వజం ● క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ కడప కార్పొరేషన్/బద్వేలు అర్బన్: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి ఆర్కే రోజాపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన రోజాను దుర్భాషలాడటాన్ని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించడం, కించపరడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని, భాను ప్రకాష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
పాత పింఛన్ అమలు చేయాలని నిరసన
కడప ఎడ్యుకేషన్ : తమకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం నాయకులు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో నెంబర్ 57ను అమలు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటజనార్దనరెడ్డి, ఎన్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు జనార్దన్రాజు, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఎస్ఎల్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ ప్రకారం అర్హులైన వారందరికీ పాత పెన్షన్ వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కన్వీనర్లు సుధాకర్, చాంద్బాషా, రాచమల్లు ప్రసాద్రెడ్డి, సునీత, రవీంద్రనాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
●డీఐజీ అత్యుత్సాహం
డాగ్ స్క్వాడ్తో శోధనగండికోటలో పరిశీలిస్తున్న ఎస్పీ, పోలీస్ అధికారులుసాక్షి ప్రతినిధి, కడప: గండికోటలో బాలిక హత్య సంఘటన మిస్టరీగా మారింది. క్లూస్ టీమ్ పరిశీలించింది. డాగ్ స్క్వాడ్ పర్యటించింది. టవర్ లోకేషన్ తీశారు. ఫోన్ కాల్స్ టెక్నికల్ విశ్లేషణ చేస్తున్నారు. ఐదు రోజులుగా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు దృష్టి పెట్టారు. అవసరమైన మేరకు పోలీసులు ఉన్నారు. అయిన్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. సస్పెన్ష్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటన పర్యాటక ప్రాంతమైన గండికోటలో మైనర్ బాలిక హత్య. ఒక్కమారుగా యావత్తు సమాజం ఉల్కిపాటుకు గురైంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక హత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్నేహితుడు లోకేష్తోపాటు బైక్లో గండికోటకు వెళ్లిన బాలిక.. తిరుగు ప్రయాణంలో లేదు. లోకేష్ ఒక్కరే మోటారు బైక్పై వస్తున్న ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దాంతో ఒక్కమారుగా లోకేష్ హత్య చేశారని అందరూ భావించారు. కాగా సాయంత్రానికి లోకేష్ వ్యవహారం తారుమారైంది. హత్యలో లోకేష్ ప్రమేయం లేదని ప్రకటన వెలువడింది. మరోవైపు అన్ని వ్రేళ్లు బంధువుల వైపు చూపాయి. స్నేహితుడు హత్య చేయలేదంటే.. పరువు హత్య చోటుచేసుకుందా? అనే కోణంలో విశ్లేషణలు, వ్యాఖ్యానం నడించింది. మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకున్నారు. అటు వైపు కూడా ఆధారాలు లభ్యం కాలేదు. ఆపై మరోమారు దర్యాప్తు మొదటికి వచ్చింది. ఈమారు జిల్లాలోని అధికారులు బృందాలుగా విడిపోయి హత్య కేసు విచారణ చేపట్టుతున్నారు. తల పట్టుకుంటున్న పోలీసు అధికారులు మైనర్ బాలిక హత్య కేసులో దర్యాప్తులో పోలీసు అధికారులు తలమునకలై ఉన్నారు. ఎస్పీ అశోక్కుమార్ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో.. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ట్రైనీ డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు బృందాలు విడిపోయి పలు రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు ఆధారంగా అనుమానిత వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. టవర్ లోకేషన్ ద్వారా ఫోన్కాల్స్ విశ్లేషణ చేస్తున్నారు. ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నా వివరాలు బహిర్గతం అవుతుండటం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తును కొనసాగిస్తోంది. సంక్లిష్టత మొత్తానికి ఉన్నతాధికారి తొందరపాటు చర్యలేనని పలువురు దెప్పి పొడుస్తుండటం గమనార్హం. ‘తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది’ అన్నట్లుగా మైనర్ బాలిక హత్య కేసులో.. కర్నూలు రేంజ్ డీఐజీ తొందరపాటు చర్య స్పష్టంగా కన్పిస్తోంది. ఇలాంటి ఘటనల్లో ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో చొరవ చూపడం సహేతుకం. ఎస్పీ ఆశోక్కుమార్తోపాటు ఘటన స్థలానికి చేరకున్న డీఐజీ కోయ ప్రవీణ్ తొందరగా నిర్ధారణకు వచ్చారు. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా సాయంత్రం నిందితుల్ని అదుపులోకి తీసుకొని.. ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని తెలిపారు. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే.. డీఐజీ స్థాయి అధికారి అలా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. అనుమానితుడిగా భావిస్తున్న లోకేష్కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో.. ఒక్కమారుగా దృష్టి మళ్లింది. బాలిక సమీప బంధువుల వైపు అందరి దృష్టి మళ్లింది. పోనీ అటువైపు ఆధారాలు ఉన్నాయా? అంటే ఇప్పటికీ ఎలాంటి క్లూస్ లభించలేదు? బంధువులంతా దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినా వెళ్లేందుకు అందుబాటులో ఉన్నారు. -
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
కడప ఎడ్యుకేషన్: గండికోటలో జరిగిన బాలిక హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక సీమ కన్వీనర్ ఆంజనేయులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప డిమాండ్ చేశారు. బాలిక మృతికి సంతాపంగా ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా గండికోట పర్యాటక కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురైందన్నారు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా వాస్తవాలను ప్రకటించక పోవడంలో రాజకీయ జోక్యం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. హోంమంత్రి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ ఎస్టీ ఉమెన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ, సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య, ఎంఆర్పీ జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యస్.రామాంజనేయులు, యస్.సుబ్బరాజు, హేతువాద సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ నాయక్, పీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.నాగరాజు, ఐసా జిల్లా కార్యదర్శి ప్రసన్న, ఎస్సీ యాదవ్, లోకసత్తా పార్టీ అధ్యక్షులు దేవర కృష్ణ, రసూల్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ నాగరాజు పాల్గొన్నారు. -
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
ఏడుగురు నిందితుల అరెస్ట్పీలేరు : రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీ నం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పీలేరు డీఎఫ్వో గురుప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన మారుతి సుజుకీ వాహనాన్ని తనిఖీ చేయగా 13 ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంతోపాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏలుమలై, సెంథిల్, అన్బలగన్, రామన్, అన్నాదొరై, కుప్పుస్వామి, మణి ఉన్నట్లు డీఎఫ్వో వివరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సిబ్బంది ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డిప్రసాద్, నందీశ్వరయ్య పాల్గొన్నారు. -
సర్వేను అడ్డుకున్నారు
కడప రూరల్ : తన భూమి సర్వే చేయించుకునేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని హైదరాబాద్కు చెందిన క్రిష్ణయ్య ఆరోపించారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కడప మండలంలోని సర్వే నెంబరు 78–బీలో తన తండ్రి నరసరామయ్యకు 2.52 ఎకరాల స్థలం ఉందన్నారు. అందులో 2006లో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీకి 1.25 ఎకరాలను విక్రయించామని, మిగిలిన స్థలం సర్వే చేయించుకోవాలని కోర్టును ఆశ్రయించామని అన్నారు. కోర్టు నుంచి అనుమతి రావడంతో స్ధానిక రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లగా ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ వారు అడ్డగించారని ఆరోపించారు. మహమ్మదీయ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు జవాబ్ ఎక్యు మాట్లాడుతూ శుక్రవారం దీప, విజయ, మరికొందరు స్దలం వద్దకు వచ్చి దౌర్జన్యం చేయగా తాము ప్రశ్నించామని పేర్కొన్నారు. ఆ స్థలం నరసయ్య, నరసింహమూర్తిది కావడంతో తాము చట్ట ప్రకారం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తాము కూడా న్యాయ స్ధానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దారు నారాయణరెడ్డి మాట్లాడుతూ పోలీసుల పర్యవేక్షణలో వచ్చే వారంలో సర్వే చేస్తామన్నారు. బీసీ వసతి గృహంలో విచారణకు ఆదేశం సుండుపల్లె : మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహ భవనంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక అప్పన్నకుంటలో సర్వే నెంబర్–2169లోని ప్రభుత్వ స్థలంలో చెరువుకిందపల్లెకు చెందిన తిరుమలరెడ్డి శివారెడ్డి భవనం నిర్మించి బీసీ బాలల వసతి గృహానికి అద్దెకు ఇచ్చారని బీజేపీ నాయకుడు వెంకటరామరాజు మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకుని ఇప్పటివరకూ తీసుకున్న అద్దె రికవరీ చేయాలని ఆయన కోరారు. వెంటనే విచారించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. కాన్వకేషన్కు రావాలంటూ గవర్నర్కు ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్కు అనుమతి ఇవ్వాలని, కులపతి హోదాలో కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్నజీర్ను వైవీయూ ఇన్చార్జి వీసీ అల్లం శ్రీనివాసరావు కోరారు. విజయవాడ రాజభవన్లో రాష్ట్ర గవర్నర్ను శుక్రవారం ఆయన కలిసి మొక్క అందజేసి దశ్శాలువాతో సత్కరించారు. యోగి వేమన విశ్వ విద్యాలయం గురించి గవర్నర్కు వివరించారు. గవర్నర్ స్పందిస్తూ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కాన్వకేషన్ నిర్వహించుకోవాలని, ఆయా తేదీల వివరాలు తమ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఉపకులపతి వెంట విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ.కృష్ణారావు ఉన్నారు. -
స్వచ్ఛందంగా యువకుల రక్తదానం
కడప ఎడ్యుకేషన్ : కడప బాలాజీ నగర్లోని నెహ్రూ కేంద్ర యూత్ హాస్టల్ నందు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని స్టెప్ సీఈవో సాయి గ్రేస్, పైడి కాల్వ విజయ్కుమార్, ఖూన్కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్అలీ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు , ఖూన్ కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ మాట్లాడుతూ జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ఐక్యమతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ నందు రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి మూడు నెలలకోకసారి రక్తదానం చేయుటకు ముందుకు రావాలన్నారు. దీంతో పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చి ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు.. ఖూన్ కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్అలీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాల్లో ఇప్పటివరకు 315 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటురు విజయ్ కుమార్, వి.శివశంకర్, పట్టుపోగుల సుబ్బారావు, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. స్టెప్ సీఈఓ సాయి గ్రేస్ -
ఆటోమొబైల్ దుకాణం తనిఖీ
రాయచోటి జగదాంబసెంటర్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాయచోటి–చిత్తూరు రోడ్డులోని రాందేవ్ ఆటోమొబైల్స్ షాపును విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో కొనుగోలు చేసే వస్తువులపై ఎంఆర్పీ ధరలు లేవని, జీఎస్టీ లైసెన్సు లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. రాజధాని ఆటో మొబైల్స్, రాందేవ్ ఆటోమొబైల్స్ పేర్లతో వేర్వేరుగా యజమాని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ షాపులో సేల్ బిల్స్ ఇవ్వడంలేదని గుర్తించి దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనికీల్లో ఎం.శివన్న, గీతావాణి, బాబుమోజెస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ వంక వడ్డిపల్లెకు చెందిన ఈశ్వరయ్య(65), అతడి భార్య సుందరమ్మ(60) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చారు. గ్రామంలో గొడవ విషయమై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొత్తవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా పీలేరుకు చెందిన తరుణ్(20), అష్రఫ్(22), నిఖిల్(21), బాలాజీ(23), ప్రేమ్కుమార్(22) వ్యక్తిగత పనులపై గురువారం కారులో మదనపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున తిరిగి పీలేరుకు బయలుదేరారు. బైపాస్ దారిలో వెళుతుండగా కొత్తవారిపల్లె సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు గాయపడగా స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా బి.కొత్తకోటకు చెందిన హేమకుమార్ గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు వెళ్తున్నారు. గౌనిపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
బద్వేలులో భారీ వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం బద్వేలు అర్బన్ : బద్వేలులో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరింది. పట్టణంలోని మైదుకూరు రోడ్డు, మెయిన్బజార్, ఆంజనేయనగర్, రామాంజనేయనగర్, శాస్త్రినగర్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో రహదారుల పైకి మురుగునీరు చేరింది. మైదుకూరు రోడ్డులో భారీగా వర్షపునీరు నిలిచి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ గ్యారేజీలోకి మోకాలిలోతు నీరు చేరడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యారేజీలోకి చేరిన నీటిని ఫైరింజన్ సహాయంతో బయటికి పంపించారు. మహబూబ్నగర్, మెయిన్బజార్, త్యాగరాజకాలనీ చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీల్లో చెత్త నిల్వలు పేరుకుపోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరింది. మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో పూడికతీత పనులు చేపట్టి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. -
వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
బ్రహ్మంగారిమఠం : జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మాస కళ్యాణోత్సవానికి బి.మఠం సిద్ధమైంది. ఇప్పటివరకూ స్వామికి ఏటా మహాశివరాత్రి, జయంతి రోజున కల్యాణ వేడుక నిర్వహించేవారు. భక్తులు, ఉభయదాతల విన్నపం మేరకు ప్రతినెలా స్వామి కల్యాణం నిర్వహించేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో ప్రత్యేక కళ్యాణ మండపం నిర్మించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారి పేరుతో ఉన్న ఈ మండపంలో ప్రథమ మాస కళ్యాణోత్సవాన్ని శుద్ధ ద్వాదశి రోజున నిర్వహించనున్నారు. ప్రతినెలా శుద్ద ద్వాదశి నాడు మాస కళ్యాణం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. శాశ్వత ఉభయదాతలుగా చేరుటకు లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మఠం పిట్పర్సన్ శంకర్బాలాజీ తెలిపారు. క్రీడల అభివృద్ధే లక్ష్యం కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా వ్యాయామోపాధ్యాయుల సంఘం పటిష్టత, క్రీడల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ పీఈటీ అండ్ ఎస్ఏ పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్కిరణ్, ఎస్ఏపిఈ ఆసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్రెడ్డి తెలిపారు. కడప శంకరాపురంలోని స్కౌట్ హాల్లో విలేకరులతో వారు మాట్లాడుతూ జిల్లాలోని ఏపీ పీఈటీ అండ్ ఎస్ఏ పీఈటీ ఆసోసియేషన్, ఎస్ఏ పిఈటీ అసోసియేషన్లను విలీనం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబయ్య, శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎరువుల విక్రయం నిలిపివేత కడప అగ్రికల్చర్ : కడప నగరంలోని మార్కెఫెడ్ ఎరువుల గోదామును జిల్లా వ్యవసాయ అధికారి(జేడీఏ) బి.చంద్రానాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. నిల్వలు పరిశీలించి జిల్లా వ్యాప్తంగా డీర్లు, ఆర్బీకే, పీఎసీఎస్ కేంద్రాలకు ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయశాఖ కర్నూలు డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో గోవర్ధన్, వ్యవసాయాధికారి సురేష్కుమార్రెడ్డి సంయుక్తంగా కడప పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. అనుమతి పొందిన పురుగుమందులు అమ్మాలని, రైతులకు రసీదు ఇవ్వాలని సూచించారు. రికార్డులు సరిగా నిర్వహించని 26.94 లక్షల విలువ గల వాటర్ సాలిబుల్ ఎరువుల విక్రయం నిలిపివేసినట్లు వారు తెలిపారు. -
ఉపాధ్యాయుల వేతన సమస్యలను పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి కోరారు. జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లును శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్లో టీచర్ల బదిలీలు జరగ్గా.. రీఅపోర్షన్లో భాగంగా నూతన పాఠశాలలలో చేరిన ఉపాధ్యాయులకు వెంటనే పొజిషన్ ఐడీలను కేటాయించాలన్నారు. జూన్ నెల నుంచి వేతనం చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 24 ఏళ్లు పూర్తయిన టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చూడాలని, పదవీవిరమణ చెందిన టీచర్లకు పెన్షన్ మంజూరు పత్రాలు పంపడంలో జాప్యం చేయవద్దని డిమాండ్ చేశారు. సరెండర్ లీవు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఖాదర్బాషా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు హరిబాబు, జిల్లా కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, రామసుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
11 మంది గంజాయి విక్రేతల అరెస్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగర శివారులో గంజాయి విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు చేసి చింతకొమ్మదిన్నెకు చెందిన కవ్వాజి పవన్కుమార్, మద్దెల వెంకట రమణ, ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన రాజోలు చంద్రశేఖర్రెడ్డి, కడప నగరం అక్కాయపల్లెకు చెందిన షేక్ ఇంతియాజ్, చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన కె.వెంకటసాయి, చప్పిడి దేవేంద్ర కలిసి బద్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద కిలో గంజాయి రూ.15 వేలుకు కొనుగోలు చేశారన్నారు. వాటిని చిన్న 10 గ్రాముల ప్యాకెట్గా చేసి రూ.500కు కళాశాలలు, సర్కిల్ల్లో అమ్మేవారన్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నరసింహ, సిబ్బంది దాడి చేసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారన్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందిరానగర్లో..... ఇందిరానగర్లో కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ ఎస్ఐ మహేంద్ర సిబ్బంది దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన తొండూరి అపెనుకొండ అలియాస్ బాబీ, కడప నగరం రాజీవ్ నగర్కు చెందిన గొడుగు అజీజ్ నుంచి కొని అక్కాయపల్లెకు చెందిన దేరంగుల పవన్ కళ్యాణ్, చెమ్ముమియ్యాపేటకు చెందిన ఓర్సు నరసింహ, పుట్లంపల్లెకు చెందిన పొడుతూరు గౌస్ మోహిద్దీన్ అమ్మకాలు సాగించేవారన్నారు. గంజాయి అమ్మకాలపై నిరంతరం తమ సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలు ప్రాంతానికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. విద్యార్థులు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. నాలుగు కిలోల గంజాయి, ఏడు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని గంగాదేవిపల్లె సమీపంలో శుక్రవారం వేగంగా వస్తున్న లారీ రహదారి ప్రక్కనే వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కమల్ సాహెబ్(64), క్లీనరు ఫకృద్దీన్(45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. బళ్లారి నుంచి ఇనుప పైపుల లోడుతో లారీ చైన్నెకు వస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున గంగాదేవిపల్లె సమీపంలోకి రాగానే వేగం అదుపుతప్పి లారీ రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనరుపై ఇనున పైపులు పడిపోయాయి. దీంతో ఇరువురు క్యాబిన్లో ఇరుక్కపోయి చనిపోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందిన వారు బళ్లా రి వాసులుగా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దేశాన్ని ప్రగతి పథాన నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. కడప నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ భవన్లో సీపీఐ కడప నగర సమితి ఏడో మహా సభలు శుక్రవారం నిర్వహించారు. ముందుగా కడప నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్, గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ మీదుగా విశ్వేశ్వరయ్య మందిరం వరకూ ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచిపెడుతున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేయడం, మనుస్మతి విధానాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, బాబు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాయని, చంద్రబాబు 21 సార్లు దిల్లీకి వెళ్లి రూ.3600 కోట్లు అప్పు తెచ్చారన్నారు. పెండింగ్లో ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి బసకచర్ల నిర్మాణం అంశాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరో 40 వేల ఎకరాల భూ సేకరణ, మెట్రో రైలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నాయని, మద్యం అమ్మగా వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎన్.వెంకటశివ, ఎల్.నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, జి.వేణుగోపాల్, విజయలక్ష్మి, నాగార్జునరెడ్డి, చెంచయ్య మల్లికార్జున, మనోహర్రెడ్డి, లింగన్న పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య -
ఈ కందిపప్పు మాకొద్దు
వెనక్కు పంపించేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు బద్వేలు అర్బన్ : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యతలేని కందిపప్పు సరఫరా అవుతోంది. నాసిరకంగా ఉన్న ఈ కందిపప్పు మాకొద్దు అని అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి పంపేయడం ఇందుకు అద్దం పడుతోంది. బద్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బద్వేల్ మున్సిపాలిటీ, బద్వేల్ రూరల్, గోపవరం, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో 180 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో కొన్నింటికి ఇటీవల సరఫరా చేసిన కందిపప్పు పురుగులతో బూజుపట్టి ఉంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు తీసుకునేందుకు నిరాకరించారు. చేసేది లేక అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎల్ఎస్ పాయింట్లో తిరిగి ఇచ్చేస్తున్నారు. నాసిరకం కందిపప్పు పంపిణీ చేయడంతో సమస్యలు ఎదురైతే మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. 36 క్వింటాళ్ల నాసిరకం కందిపప్పు వచ్చింది ఇటీవల ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చిన 36 క్వింటాళ్ళ కందిపప్పు నాసిరకంగా ఉంది. ఆగస్టు వరకు గడువు ఉన్నా.. కొంతమేర బూజు పట్టి ఉండడం చూసి జిల్లా ఉన్నతాధికారులకు విషయం విన్నవించాను. తక్షణమే కందిపప్పును వెనక్కి పంపించాలని ఆదేశాలిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తెస్తున్న కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు అందిస్తున్నాం. – అలీఖాన్, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి -
వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారికి భక్తులు కిలో వెండిని వితరణగా అందజేశారు. శుక్రవారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన గురుమూర్తయ్య, చతురాచారి మట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి కిలో వెండిని సమర్పించారని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. . దీనికి సంబంధించి ఆలయ అధికారులు రశీదును అందజేశారు. వీరి పేరున అర్చకులు స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రాసాదాలు అందజేశారు. విరబూసిన బ్రహ్మకమలాలు రామసముద్రం: రామసముద్రం మండల కేంద్రంలోని బయన్న ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు గురువారం రాత్రి విరబూశాయి. వారి ఇంటి పెరట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టుకు సుమారు 15 పుష్పాలు పూశాయి. చుట్టుపక్కల ప్రాంతాలల ప్రజలు వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏటా పుష్పాలు పూస్తాయని కుటుంబీకులు తెలిపారు. అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించాలి కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించేలా సంఘ నాయకులు బాధ్యతలు తీసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ కోరారు. శుక్రవారం కడప డీఈఓ కార్యాలయ సమావేశం మందిరంలో ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యం పెంపొందించే విషయమై ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడితే విద్యలో నాణ్యత పెరిగి విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ వంతుగా ఉపాధ్యాయులకు అవగాహన పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. డెయిరీ స్థలంలో బోర్డుల ఏర్పాటుపై సర్వే మదనపల్లె రూరల్: అమూల్ డెయిరీ స్థలంలో ప్రైవేట్ వెంచర్కు చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రచార బోర్డులు ఏర్పాటుచేశారని ‘సాక్షి’ శుక్రవారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఆదేశాలతో ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం తదితరులు సంబంధిత స్థలంలో జాయింట్ సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో నేషనల్ హైవే ఎంతవరకు ఉందో, అంతవరకు కొలతలు వేసి హద్దులను మార్కింగ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఆర్అండ్బీ స్థలంలో ఉన్నట్లు నిర్ధారించారు. బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేసి, పంచాయతీకి పన్ను కట్టించుకోవాల్సిందిగా కార్యదర్శికి సూచించారు. అయితే..రియల్టర్లు డెయిరీకి, బెంగళూరు ప్రధాన రహదారికి మధ్య తమకు చెందిన 7 సెంట్ల స్థలం ఉందని, అందులోనే బోర్డులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో కేఎంసీకి మూడో ర్యాంకు
కడప కార్పొరేషన్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)కు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు వచ్చింది. 2019 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ కింద ఇచ్చిన ర్యాంకుల్లో ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం. 2019లో జాతీయ స్థాయిలో 62వ ర్యాంకు రాగా, 202లో 54, 2021లో 56, 2022లో 56, 2023లో 58వ ర్యాంకులు లభించాయి. 2024 సంవత్సరంలో నిర్వహించిన సర్వేల్లో కడపకు అతి తక్కువగా 31వ ర్యాంకు లభించింది. చెత్తను తడి, పొడి చెత్తలుగా విడదీయడంలో 48 శాతం, ఆ చెత్తలు ప్రాసెసింగ్ చేయడంలో 98 శాతం మార్కులు లభించాయి. గత ఏడాది జీఎఫ్సీ స్టేటస్లో త్రీస్టార్ రాగా, ఈ ఏడాది సింగిల్ స్టార్ వచ్చింది. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల ఓడీఎఫ్(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్లస్, ప్లస్ స్టేటస్ వచ్చింది. విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ్లో అన్ని విభాగాల్లో కడపకే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు -
● ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి..
నాపేరు వేమిరెడ్డి చంద్ర ఓబుల్రెడ్డి. మాది దువ్వూరు మండలం క్రిష్ణంపల్లి గ్రామం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ప్రస్తు తం 4 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశాను. పంటల సాగుకు సంబంధించిన ఎరువులను గతంలో మేము మా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. దువ్వూరులోని ప్రైవేటు డీలర్ల వద్ద అతి కష్టం మీద తెచ్చుకున్నాను. యూరియా కావాలని ప్రత్యేకంగా అడికితే కాంప్లెక్స్ ఎరువులను తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేకపోయినా యూ రియా కోసం కొనక తప్పడం లేదు. పైగా గతంలో గ్రామంలోని ఆర్బీకే సిబ్బంది విత్తనాలు, ఎరువులను పరీక్షించి నకిలీవా, నాణ్యమైనవా పరిశీలించి ఇచ్చేవారు. ఇప్పుడు అ పరిస్థితి లేదు. విత్తనాలు, ఎరువులను బయట నుంచి తెచ్చుకుని సాగు చేసుకోవాల్సి వస్తుంది. అవి మంచివో లేక నకిలీవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య వ్యవసాయ సాగు భారంగా ఉంది. కడప అగ్రికల్చర్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఊర్లలోనే రైతన్నలకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో లభించేవి. నేడు ఆ పరిస్థితి కరువైంది. ఎరువులు, విత్తనాల కోసం మండల కేంద్రాలకు పరుగు తీయాల్సి వస్తోంది. దీంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్లో 77475 హెక్టార్ల సాగు లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షం లేకపోవడంతో.. సాగు పనులు అంతగా ఊపు లేవు. రెండు రోజుల క్రితం కేసీ కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద రైతన్నలు పంటల సాగుకు సమాయత్తం అయ్యారు. అయితే ఎరువులు, విత్తనాలు అవసరం మేరకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తులపైన ఆధార పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలకు ఎరువులు, విత్తనాలను అరకొరగా కేటాయించడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఎరువులు సకాలంలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రైవేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రతిపాదనలు పంపినా.. తక్కువగా కేటాయింపు ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు 69,653 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 40,390 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇందులో 7146.30 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే మంజూరు చేశారు. గతేడాదివి 27073.08 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా.. ఇందులో రీటైలర్, హోల్సెల్ డీలర్లు వద్ద 26,466.74 మెట్రిక్ టన్నుల ఉంచగా.. రైతు సేవా కేంద్రాల్లో కేవలం 606.38 మెట్రిక్ టన్నులు ఉంచారు. ఈ విషయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలలో అధిక ఎరువులను ఉంచితే రైతులకు సమస్య లేకుండా పోయేదని పేర్కొంటున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. పంట పేరు సాధారణ సాగు సాగైన పంట (హెక్టార్లలో) (హెక్టార్లలో) వరి 30804 1571.43 జొన్న 517 6 సజ్జ 1089 358 మొక్కజొన్న 932 717.44 కంది 5761 42 మినుము 3806 827.7 వేరుశనగ 5976 870.93 సన్ఫ్లవర్ 1142 65.7 సోయాబీన్ 1030 21 పత్తి 24036 2429.07 ప్రభుత్వం అరకొరగా మంజూరు విత్తనాల కేటాయింపు అంతంత మాత్రమే అధిక ధరకు విక్రయిస్తున్న డీలర్లు అన్నదాతకు తప్పని అవస్థలు ఖరీఫ్ సీజన్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు 20538 మెట్రిక్ టన్నుల యూరియా అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలను పంపగా.. ఇందులో 12025 టన్నులు కేటాయించారు. ప్రస్తుతం 3062.3 టన్నులను మాత్రమే మంజూరు చేశారు. డీఏపీకి సంబంధించి 9862 మెట్రిక్ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. 4860 మెట్రిక్ టన్నులను కేటాయించారు. ప్రస్తుతం 1826 టన్నులు మంజూరు చేశారు. కాంప్లెక్స్ ఎరువులు 32704 మెట్రిక్ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. 20195 టన్నులు కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 2258 టన్నులు మంజూరు చేశారు. ఎంఓపీకి సంబంధించి 2791 టన్నుల కోసం ప్రతిపాదనలు పంపగా, 1620 టన్నులు కేటాయించారు.. కానీ ఏమీ మంజూరు చేయలేదు. ఎస్ఎస్పీకి సంబంధించి 3758 మెట్రిక్ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 1690 టన్నులు కేటాయించారు. కానీ ఏమీ మంజూరు చేయలేదు. ఇలా మొత్తంగా ఖరీఫ్ సీజన్కు 69,653 మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 7146.3 మెట్రిక్ టన్నులు మాత్రమే మంజూరు చేశారు. రీటైల్స్, హోల్సెల్, ఆర్ఎస్కేలలో కలిపి.. గతేడాది రీటైలర్స్, హోల్సెల్, ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేయగా.. మిగిలిన ఎరువులను రీటైలర్స్, హోల్సెల్, ఆర్ఎస్కేలలో అందుబాటులో ఉంచారు. ఇందులో యూరియా రీటైలర్ వద్ద 3546.52 మెట్రిక్ టన్నులు, హోల్సెల్ డీలర్ల వద్ద 2630.57 మెట్రిక్ టన్నులు ఉండగా.. రైతు సేవా కేంద్రాలలో కేవలం 321.03 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీకి సంబంధించి రీటైలర్ వద్ద 1121.65 మెట్రిక్ టన్నులు, హోల్సెల్ డీలర్ల వద్ద 1544 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రంలో 136.4 టన్నులు అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్లు రీటైలర్ వద్ద 7236.76 టన్నులు, హోల్సెల్ డీలర్ల వద్ద 5204.92 టన్నులు, రైతు సేవా కేంద్రంలో 101.45 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఎంఓపీ రీటైలర్ వద్ద 1648.60 మెట్రిక్ టన్నులు, హోల్సెల్ డీలర్ వద్ద 1241.35 మెట్రిక్ టన్నులు, ఆర్ఎస్కే కేంద్రాల్లో 47.75 టన్నులు ఉంచారు. ఎస్ఎస్పీకి సంబంధించి 2074.04 మెట్రిక్ టన్ను లు రీటైర్స్ వద్ద, 218.35 మెట్రిక్ టన్నులు హోల్ సెట్ వద్ద ఉండగా.. ఆర్ఎస్కేలో మాత్రం లేవు. -
ఆశ్రమ స్థలంపై కన్ను
అధికారమే దన్ను.. సాక్షి టాస్క్ఫోర్స్: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్న చందంగా అధికార పార్టీ నేతలు అనుకుంటే.. ఏమైనా చేయగలరు అనడానికి చక్కటి ఉదాహరణ.. ప్రొద్దుటూరులోని మహర్షి ఆశ్రమం కొనుగోలు వ్యవహారం. నిబంధనల ప్రకారం ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ఎవరికీ హక్కులేదు. కేవలం ఆశ్రమ నిర్వహణతోపాటు పేదలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు మాత్రమే పూర్వం మహర్షి విద్యామందిరాన్ని ఏర్పాటు చేశారు. అధికార పార్టీ అండతో స్థానిక ప్రజాప్రతినిధి తనయుడు చక్రం తిప్పి.. ఈ స్థలాన్ని కొనుగోలు చేయించారు. త్వరలో ఈ స్థలంలో వెంచర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేయనున్నారు. దానంగా ఇచ్చిన స్థలం ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరంలో పూర్వం ఢిల్లీకి చెందిన మహర్షి విద్యామందిరం నిర్వాహకులు ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆశ్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పట్లో గురుదేవ్ రామిరెడ్డి ఈ ఆశ్రమానికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ ఆశ్రమ నిర్వహణ తీరును మెచ్చి బొల్లవరానికి చెందిన కందుల బాలనారాయణరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి ఎకరా 15 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చారు. సర్వే నంబర్ 592లోని ఈ స్థలాన్ని 1978 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. తర్వాత కాలంలో నరసింహారెడ్డి కుటుంబీకులు తమకు ఉన్న మరో 50 సెంట్ల స్థలాన్ని మహర్షి ఆశ్రమానికి అమ్మడం జరిగింది. మొత్తం ఎకరా 65 సెంట్లలో ఆశ్రమాన్ని, పాఠశాలను నడిపేవారు. గత కొన్నేళ్లుగా ఆశ్రమ నిర్వహణ గురించి నిర్వాహకులు పట్టించుకోవడం వదిలేశారు. ఈ కారణంగా ఈ సంస్థలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. విలువైన ఈ స్థలాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. చుట్టూ జనావాసాల మధ్య ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం పెరిగింది. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేయాలని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు ఈ స్థలాన్ని కారుచౌకగా కొనుగోలు చేశారు. ఇందులో ప్రజాపతి తనయుడు స్లీపింగ్ పార్టనర్గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాదం కూడా చోటు చేసుకుంది. ఆశ్రమ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని మొత్తం స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భవనాలు జేసీబీతో నేలమట్టం గత పది రోజులుగా ఆశ్రమంలోని జ్ఞాన మందిరం, పాఠశాల భవనాలతోపాటు ఇతర నిర్మాణాలను జేసీబీతో తొలగించి నేలమట్టం చేశారు. దానంగా ఇచ్చిన ఈ స్థలంలో పాఠశాలను నిర్వహించాలని, ఆశ్రమాన్ని నెలకొల్పాలని ఈ స్థలంపై తనకు, తన వారసులకు ఎలాంటి హక్కు లేదని ఆనాడే నరసింహారెడ్డి రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ప్రకారంగా దానంగా ఇచ్చిన భూములు, స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. నాడు సమాజ హితం కోసం.. ప్రొద్దుటూరులోని ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలకు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తండ్రి నాగిరెడ్డి పూర్వం పది ఎకరాలకుపైగా స్థలాన్ని దానంగా ఇచ్చారు. అలాగే ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు పూర్వం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి తండ్రి పేర్ల నాగిరెడ్డి 10 ఎకరాలకుపైగా స్థలం ఇచ్చారు. నాడు సమాజ శ్రేయస్సు కోసం ధనవంతులు భూములను విరాళంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. నేడు అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమాజ హితం కోసం ఇచ్చే స్థలాలను ఆక్రమిస్తున్నారు. మహర్షి ఆశ్రమం భూమి హాంఫట్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు భారీ విలువ ఉండగా.. కారు చౌకగా.. రియల్ ఎస్టేట్వ్యాపారం కోసం పన్నాగం -
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు సర్వీసులో ఉన్న ఒప్పంద అధ్యాపకులు 2025–26 విద్యా సంవత్సరానికి రెన్యూవల్స్ చేసుకోవాలని కడప జిల్లా ఐడి కళాశాల(ఆర్ట్స్ కళాశాల) ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. వారు పని చేస్తున్న కళాశాలల్లోని ప్రిన్సిపాల్లకు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కడప ఎడ్యుకేషన్: కడప శివారులోని కేఎస్ఆర్ఎం కళాశాలలో 1996–2000 సంవత్సరాల మధ్య ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల సమ్మేళనం శనివారం నిర్వహించనున్నట్లు పూర్య విద్యార్థులు తెలిపారు. కళాశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ అల్యుమినీ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాలేజ్ అభివృద్ధిపై చర్చ, సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పూర్వ విద్యార్థులు 8123417684కు వివరాల కోసం ఫోన్ చేయవచ్చునని తెలిపారు. నాలుగు ఏఎంసీలకు చైర్మన్ల నియామకం సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మార్కెట్ యార్డ్ కమిటీలకు సర్కార్ చైర్మన్ లను నియమించింది.. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించగా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు.. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పి.విజయలక్ష్మి( బీజేపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బోడిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ), లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎస్ ఎండి షఫీ, మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్గా జంగాల శ్రీనివాస్(జనసేన)ను నియమించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పేర్లు ప్రకటించింది. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. బాలిక హత్యపై స్పందించిన కమిషన్ కడప కోటిరెడ్డి సర్కిల్: గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వైష్ణవి ఇంటి నుంచి బయలుదేరి, ఆ తర్వాతకు హత్యకు గురైందని పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇంటర్ విద్యార్థిని చనిపోవడం బాధాకరమని, వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. ఎన్ని గంటలకు వెళ్లింది, ఎక్కడి నుంచి వెళ్లింది, సంఘటన జరగడానికి కారణాలు తదితరాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లాలోని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. తిరుపతి– చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: ఆగస్టులో తిరుపతి– చర్లపల్లి మధ్య మరో ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతి ఆదివారం, సోమవారం ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. తిరుపతిలో ఆగస్టు 3, 10, 17, 24వ తేదీల్లో (ఆదివారం) 07481 రైలు 9.10 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్ నగర్, జడ్చర్ల, కాచిగూడ, మల్కాజ్గిరి మీదుగా చర్లపల్లికి వెళ్తుందన్నారు. ప్రతి సోమవారం చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. కేసీ కెనాల్కు నీటి విడుదల వల్లూరు: మండలంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద పెన్నానది నుంచి కేసీ కెనాల్కు గురువారం నీటిని విడుదల చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పూజలు జరిపి అనంతరం గేట్లు తెరిచి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ చిన్న పుల్లయ్య, ఏఈ గంగిరెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మెన్ వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విత్తనం.. గగనం
● జీలుగలు 3308.7 టన్నులు కేటాయించగా.. ఇందులో 1967.8 టన్నులు మంజూరు చేయగా.. 1222 టన్నులు రైతులు తీసుకెళ్లారు. ● జనుములు 982.1 కేటాయించగా, ఇందులో 862.4 మంజూరు చేయగా 487.9 టన్నులను రైతులు తీసుకెళ్లారు. ● వేరుశనగ 3577 టన్నులు కేటాయించగా, 2718.6 మంజూరు చేయగా.. ఇందులో 2673.9 టన్నులు రైతులు తీసుకుని వెళ్లినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. యూరియా దొరకడం లేదు నేను ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. ప్రస్తుతం యూరియా అవసరం ఉంది. యూరియా కొందామంటే దొరకడమే లేదు. ఒక వేళ దొరికితే.. యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు కొనాలని డీలర్లు సూచిస్తున్నారు. – వెంకటసుబ్బయ్య, తుడమలదిన్నె, ఖాజీపేట ఎరువుల రేట్లను పెంచడం అన్యాయం రసాయనిక ఎరువుల రేట్లను పెంచడం చాలా అన్యాయం. ఎరువుల పెరుగుదల ప్రభావం వ్యవసాయంపైన తీవ్రంగా పడుతుంది. సాగుకు కౌలు రైతులు ముందుకు రాక, సొంత భూమి ఉండే రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. – సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు 40,390 మెట్రిక్ టన్నుల కేటాయింపు 2025 ఖరీఫ్ సీజన్లో ఏప్రి ల్ నుంచి జూలై వరకు 40930 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు కేటాయించారు. ఇందులో ఇప్పటికి 7146.3 మెట్రిక్ టన్నుల వివిధ రకాల కంపెనీల ఎరువులను జిల్లాకు సరఫరా చేశారు. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్
ప్రభుత్వ సేవలపై సంతృప్త స్థాయి పెంచాలి కడప సెవెన్ రోడ్స్: ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయి పెంచేలా పనిచేయాల్సి ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు స్టోన్ ఫౌండేషన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జీరో పావర్టీ, పీ–4పాలసీ, బంగారు కుటుంబాలు, మార్గదర్శులు గ్రామ సభలు, జనాభా నిర్వహణ అంశాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా జిల్లాలో మిగిలిన వున్న గ్రామాలను కవర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీవో హజరతయ్య, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం పీ.గోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్.బాబు, అధికారులు పాల్గొన్నారు. -
ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభమయ్యాయి. కడప వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి రోజున కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలుచుకున్న కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రుత్విక్ కల్యాణ్ 40 పరుగులు, రోహిత్ గౌడ్ 35 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నకేశవ అద్భుతంగా చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా జయప్రణవ శాస్త్రి 2, క్యాశప్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 59.5 ఓవర్లకు 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అలెన్ లియో 61 పరుగులు, సుశాంత్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టి.కిరణ్కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశారు. సంజయ్ 2, దేవాన్ష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాత్విక్ 23 పరుగులు చేశాడు దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
రైతుకు సోలార్ ముప్పు
జమ్మలమడుగు/మైలవరం : సోలార్ ప్యానెల్ ముప్పు రైతులకు సంకటంగా మారుతోంది. భూముల యజమానుల అనుమతి లేకుండానే పొలాల్లో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రత్యేక బృందాలతో బెదిరింపులకు దిగుతున్నారు. ఏదో ఒక లింకు పెట్టి భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సెల్(ఎస్ఏఈఎల్) కంపెనీ సోలార్ ప్రాజెక్టు చేపడుతోంది. తమ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలకు పాతర వేస్తోంది. రైతులు తమ పొలాలు ఇవ్వకున్నా.. ఏదో లింకు పెట్టి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక రైతులపై రోజు రోజుకూ బెదిరింపుల పర్వం పెరిగిపోతోంది. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పొలాల యజమానులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. విచిత్రమేమిటంటే గతంలో చాలామంది రైతులను తప్పుదోవపట్టించి భూములను లీజుల రూపంలోనూ, కొనుగోలు రూపంలో తీసుకున్న సంస్ధ వ్యక్తులు ఇపుడు కొత్త కోణాన్ని తీసుకువస్తున్నారు. భార్య పేరు మీద భూములుంటే భర్తలను మభ్యపెట్టి ఇంట్లో వారికి సమాచారం లేకుండానే ఒప్పంద పత్రం రాయించుకుంటున్నారు. భార్యపేరిట భూములున్నా భర్త పేరుతో ఒప్పందం ఇచ్చి తీరాలంటూ సోలార్ యాజమాన్యం బెదిరింపులు -
ఆర్బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయాలి
కడప సెవెన్ రోడ్స్ : ఖరీఫ్ రైతులకు అవసరమైన ఎరువులను ఆర్బీకేల ద్వారా బస్తా రూ.267కే సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడును గురువారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కెసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయడంతో వరి, ఉల్లి, పత్తి, ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు ఎరువులు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బయట మార్కెట్లో బస్తా రూ.350 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఆర్బీకేలో సమాధానం చెప్పే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నప్పటికీ రైతులకు ఏ ఒక్క సాయం చేయలేదని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో రైతు భరోసా కింద రూ.13500 ఇచ్చారన్నాఉ. తాము అధికారంలోకి వస్తే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చేసిన వాగ్ధానం ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వరి, మినుము తదితర పంటలకు కనీస మద్దతు ధర లేక రైతు అవస్థపడుతున్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి హయాంలో ఖరీఫ్ పంటలకు నష్టం జరిగితే పరిహారం అందించి అదుకున్నామని చెప్పారు. జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. ఇన్చార్జి కలెక్టర్ తీరుపై ఆగ్రహం రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించాలని ముందస్తుగా ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ను అపాయింట్మెంట్ కోరగా.. సాయంత్రం 5 గంటలకు వచ్చి కలవాలని ఆమె క్యాంప్ క్లర్క్ ద్వారా చెప్పారని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. తాము కలెక్టరేట్కు వస్తే ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఆమె వెళ్లిపోవడం భాద్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే ఎవరూ పట్టించుకోవద్దని ప్రభుత్వం మౌఖిక అదేశాలు జారీ చేసిందా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులు తమ వైఖరి మార్చుకొని అందరికీ అందుబాటులో ఉండాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరుప్రసాద్రెడ్డి, నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పులి సునీల్కుమార్, శ్రీరంజన్రెడ్డి, చెన్నూరు ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్, సీహెచ్ వినోద్కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంధ్రనాథ్రెడ్డి -
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
కాశినాయన : ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని నాయునిపల్లె రెవెన్యూ పొలంలో ఆక్రమించిన ప్రభుత్వ, అటవీ భూములను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నాయునిపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 129/1, 130, 217లో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ స్ట్రెంచ్ తీయాలని తహసీల్దార్ను ఆదేశించారు. వెంటనే ఆక్రమిత పొలాల్లో నోటీసు బోర్డు ఏర్పాటుచేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, డీటీ రవిశంకర్, ఆర్ఐ అమరనాథ్రెడ్డి, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లెల్లో విద్యుత్తు అధికారుల తనిఖీలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్తు అధికారులు గురువారం విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు. మైదుకూరు డివిజన్ పరిధిలోని 40 మంది విద్యుత్తు సిబ్బంది 24 బ్యాచ్లుగా ఏర్పడి తనిఖీల్లో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై 55 కేసులు నమోదు చేసి రూ.2 లక్షల అపరాద రుసుము వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బి.మఠం సబ్ స్టేషన్ వద్ద జరిగిన సమావేశంలో మైదుకూరు డివిజన్ ఈఈ ఎన్.భరణీకృష్ణ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వ్యవసాయ మోటార్లకు సంబంధించి రూ.3.59 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రూ.4 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బిల్లులు వసూలు చేస్తామన్నారు. వినియోగ దారులు సకాలంలో బిల్లు చెల్లిస్తే అపరాధ రుసుము పడదన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రవిచంద్ర, డీఈఈలు కుళ్లాయప్ప, శ్రీకాంత్, ఏఏఓ శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.55 విద్యుత్తు చౌర్యం కేసులు నమోదు -
గాయపడిన వ్యక్తి మృతి
పెండ్లిమర్రి : మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన పి.కాళీప్రసాద్(54) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... బుధవారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో ప్రసాద్ కడపకు బయలుదేరాడు. యోగి వేమన యూనివర్శిటీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్షాక్తో ఎద్దు, దూడ మృతిమైలవరం : మండలంలోని తొర్రివేముల గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకట సుబ్బమ్మకు చెందిన ఎద్దు, అవు దూడ విద్యుత్ షాక్తో గురువారం మృతిచెందాయి. బాధితురాలి వివరాల మేరకు.. పొలం వద్ద గడ్డి మేపుకోవడానికి సుబ్బమ్మ ఎద్దులు, ఆవుదూడలను విడిచిపెట్టింది. బోరుబావి వద్ద ఉన్న స్టార్టర్ వద్దకు వెళ్లిన ఎద్దు పొరపాటున స్టార్టర్కు తగలడంతో అక్కడ ఉన్న తీగలు పశువులపై పడ్డాయి. విద్యుత్తు షాక్ తగలడంతో రెండు పశువులు మృతి చెందినట్లు బాధితురాలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించినట్లు తెలిపారు. బోగాధమ్మ ఆలయంలో చోరీకమలాపురం : మండలంలోని పందిళ్లపల్లె శివారులో ఇటీవల పునర్నిర్మించిన బోగాధమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయం తాళం పగులగొట్టి హుండీని రంపంతో కోసి అందులో నగదు చోరీ చేశారు. ఆలయం బయట పడేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు. రైల్వే స్టేషన్ గోదాములో తనిఖీలుకడప అగ్రికల్చర్ : కడప రైల్వేస్టేషన్లోని రేక్ పాయింట్, ట్రాన్స్పోర్టు గోదాముల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ మల్లికార్జునరావు, కర్నూలు డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, కడప ఏవోలు గోవర్ధన్, సురేష్కుమార్రెడ్డి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎరువు నిల్వలు, పంపిణీకి సంబంధించిన పత్రాలు, రికార్డులు పరిశీలించారు. జిల్లాకు 991 మెట్రిక్ టన్నుల ఎరువు వచ్చినట్లు తెలిపారు. సరైన పత్రాలు చూపితేనే జిల్లాలోని డీలర్లు, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలకు పంపిణీ చేయాలని సిబ్బందికి వారు సూచించారు. గోదాముల్లో నిషేధిత పురుగు మందులు ఉన్నాయా అని తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు పంపేవారు, తీసుకునేవారి చిరునామాలు నమోదు చేయాలని సూచించారు. -
ఒంటరి మహిళలే టార్గెట్
కడప అర్బన్ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు చైన్ స్నాచింగ్కు పాలం్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 52 గ్రాముల బంగారు చైన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో విలేకరులకు గురువారం వివరాలు తెలిపారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన పట్టనేతి నవీన్(26) గత కొద్ది నెలలుగా చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తెలిపారు. కడప రూరల్ సీఐ చల్లనిదొర, పెండ్లిమర్రి ఎస్ఐ జి.మధుసూదన్రెడ్డి, సిబ్బంది ఈ నెల 2వతేదీన నవీన్ను అరెస్ట్ చేశారని తెలిపారు. విచారించి అతడి నుంచి 1,150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని జైలుకు పంపినట్లు తెలిపారు. అనంతరం జూలై 16న పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించగా నిందితుడు నవీన్ ఆరుచోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు రుజువైందని తెలిపారు, తొండూరు, చెన్నూరు, పులివెందుల, గంగిరెడ్డిపల్లి పోలీస్స్టేషన్, కమలాపురం, పెండ్లి మర్రి పోలీస్ స్టేషన్లలోని పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అక్కడ చోరీ చేసిన బంగారు చైన్లు అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దుకాణదారులు నిందితుడిని తగిన రసీదు చూపించమని అడిగారన్నారు. భయంతో తిరిగి తన ఇంటిలోనే బంగారు గొలుసు దాచి పెట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడిని విచారించి బంగారు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు, రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్ఐలతోపాటు క్రైమ్ స్టేషన్ ఏఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది బాషా, బి.రవి కుమార్, సుభాన్బాషా, కిరణ్కుమార్, సూర్యప్రకాశ్రెడ్డిలను ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన దొంగ అరెస్ట్ రూ.15.32 లక్షల విలువైన చైన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు -
ఎమ్మెల్యే చెప్పారని పట్టా భూమిలో రోడ్డేశారు
కడప రూరల్ : ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అనుచరులమంటూ కొంతమంది వచ్చారు. వారితోపాటే స్థానిక తహసీల్దారు తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే చెప్పారంటూ తమకు చెందిన 2.25 సెంట్ల స్థలంలో అక్రమంగా రోడ్డు వేశారు. న్యాయం చేయాలంటూ బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లెకు చెందిన మన్యం సుబ్బలక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కుమారుడు రామచంద్రారెడ్డితో కలిసి గురువారం కడపకు వచ్చారు. అక్కడ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఉండడంతో ఆయను తన సమస్య విన్ననించారు. తమ గ్రామంలోని సర్వేనెంబర్ 82లో 2.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ నెల 5న సర్వేయర్ వచ్చి తమ భూమికి బౌండరీ లైన్ ఫిక్స్ చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటుచేశారని తెలిపారు. 16న తహసీల్దారు, కొందరు వ్యక్తులు వచ్చారని, తాము ఎమ్మెల్యే అనుచరులం అంటూ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. దౌర్జన్యంగా తమ భూమి చుట్టూ వేసిన ఇనుప కంచె తొలగించారని ఆరోపించారు. అధికారులు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా దారిని ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. స్పందించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ఱెడ్డి న్యాయం చేయాలని బద్వేల్ ఆర్డీఓకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే చెప్పారని నోటీసులు ఇవ్వకుండా పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. తక్షణం బాధితురాలి సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటికే బద్వేల్ ఆర్డీఓ, జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాఽథ్రెడ్డి -
అధిక వడ్డీల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
సింహాద్రిపురం : అధిక వడ్డీల వేధింపులతో సింహాద్రిపురం మండలం అగ్రహారానికి చెందిన రైతు సాకే అమర్నాథ్(35) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి భార్య గంగాదేవి కథనం మేరకు.. తన భర్త అమర్నాథ్కు 2 ఎకరాల భూమి ఉండడంతోపాటు ఫైనాన్స్లో జేసీబీ తీసుకుని పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులకు గానూ గ్రామంలో రూ.10 చొప్పున వారం వడ్డీ చెల్లిసూ్త్ గ్రామానికి చెందిన శంకర్రెడ్డి, మరింతమంది వద్ద అప్పు డబ్బు తీసుకున్నారు. ఆ వడ్డీ పెరిగి ఐదింతలు కాగా, ఒత్తిడి తట్టుకోలేక అప్పు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఎనిమిది తులాల బంగారు వారికి ఇవ్వగా.. ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని అడగడంతో అమర్నాథ్ ఇబ్బందిపడ్డారు. ఇది చెల్లించలేని పరిస్థితిలో తన రెండెకరాల భూమి అగ్రిమెంట్ లేకుండా దౌర్జన్యంగా తీసుకుని శంకర్రెడ్డి సాగు చేసేందుకు పొలం సిద్ధం చేశారన్నారు. అంతేగాక తన భర్తను ఫోన్ద్వారా వడ్డీ డబ్బు ఇవ్వాలని వేధించేవాడన్నారు. ఈ విషయం అమర్నాథ్ ఫోన్లో రికార్డు అయ్యింది. వేధింపులు తాళలేక అమర్నాథ్ మనస్థాపానికి గురై ఈ నెల 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. భర్త హత్య కేసులో భార్య, బావమరిది అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎర్రముక్కపల్లి బాల వికాస్ స్కూల్ వెనుక నివాసముంటున్న దేరంగుల సుబ్బరాయుడు (32) హత్య కేసులో మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. మద్యం తాగి రావడంతో భార్య హరిత, బావమరిది హరి కృష్ణ గొడవపడ్డారు. ఈ క్రమంలో సుబ్బరాయుడును గోడకేసి తోయడంతో పదునైన మోటు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ బి.రామకృష్ణ దర్యాప్తు చేశారు. -
రైతులపై ఇంత నిర్లక్ష్యమా!
పులివెందుల: శ్రీశైలం, పీబీసీ, సీబీఆర్, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అంబకపల్లె రోడ్డులోని ఇరిగేషన్ డీఈ కార్యాలయానికొచ్చి అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా రైతులకు సాగునీరు ఎందుకందించలేదని ప్రశ్నించారు. గత ఐదారేళ్లలో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదని అధికారులపై మండిపడ్డారు. దీనికి అధికారులు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదని సమాధానమిచ్చారు. దీనికి ఎంపీ స్పందిస్తూ గతంలో మోటార్లు పనిచేయలేదన్నారు.., ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడంలేదని కుంటి సాకులు చెబుతున్నారా అంటూ మండిపడ్డారు. రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు విలువ చేసే మరమ్మతులు కూడా చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. దీనివల్ల రైతులకు కోట్లాది రూపాయలు నష్టపోతారన్నారు. ఇలాంటి చిన్నపాటి రిపేర్లకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లను రిపేరు చేయించి ఎర్రబల్లె చెరువు, భూమయ్యగారిపల్లె చెరువులకు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ● అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గండికోట, సీబీఆర్, పైడిపాలెం ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా ఆయకట్టు చెరువులకు నీరు విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. లింగాల చెరువు, ఎరబ్రల్లె చెరువుకు సత్వరమే నీటిని విడుదల చేయాలని అధికారులను కోరామన్నారు. ఎరబ్రల్లి చెరువును నీటితో నింపితే పది గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయం గురించి రెండు నెలల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మోటర్లు కాలిపోయాయని చెబుతున్నారని, తాము మోటార్లు రిపేరు చేయిస్తామని చెబితే ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వమే చేయాలి, కూటమి నాయకులే చేయాలంటున్నారు.. వారు చేయరు చేసేవారిని చేయనివ్వరని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పులివెందులను హార్టికల్చర్ హబ్గా చేస్తానని గొప్పగా చెబుతుంటారని, కానీ పులివెందుల రైతులకు నీరు ఇవ్వడానికి మీనమేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యాన పంటల సాగుపైనే ఆధారపడిన నియోజకవర్గానికి నీరు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రతిరోజు కొత్తపల్లె, నల్లపు రెడ్డి పల్లె గ్రామాల్లో కొత్త బోర్లు వేయడం మొదలుపెట్టారని, రోజుకు 15 నుంచి 20 కొత్త బోర్లు వేస్తున్నారని, ప్రతిరోజు రైతులకు రూ.40లక్షల దాకా ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటికై నా నిద్ర మేల్కొని సత్వరమే వాటర్ మేనేజ్మెంట్ పై శ్రద్ధ పెట్టాలని, సత్వరమే ఎరబ్రల్లె చెరువు, భూమయ్యగారిపల్లె చెరువులను నీటితో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, మండల నాయకులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, బాబురెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులలో నీరు ఉన్నా రైతులకు ఎందుకివ్వడం లేదు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజం -
● కేసీ నీటితో కాస్త ఊరట
కడప అగ్రికల్చర్: ఆకాశమంతా మబ్బులు...నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. ఇలా చల్లగా ఉండాల్సిన జూలై నెలలో ఎండలు మండుతున్నాయి. అసలిది వానాకాలమా.. ఎండా కాలమో అనే అనుమానం కలుగుతోంది. దీనికితోడు ఉక్కపోత. ఇది చాలదన్నట్లు గంటకు 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంలో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఇక వర్షాలకు కొదవ ఉండదనుకున్న అన్నదాతల ఆశలు ఆదిలోనే అడియాసలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత వానదేవుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు కాస్తా వాడుముఖం పడుతున్నట్లు పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రుతుపవనాలు ఎప్పుడొస్తాయో వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని అన్నదాతలు నింగికేసి చూస్తున్నారు. జిల్లాలో 6.52 శాతం పంటలు సాగు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి 77,475 హెక్టార్లలో సాధారణ సాగుగా అధికారులు ఖరారు చేశారు. సీజన్ ప్రారంభమై 45 రోజులు అయింది. ఇప్పటికి జిల్లావ్యాప్తంగా 6941.37 హెక్లార్లలో వివిధ పంటలు సాగై 6.52 శాతంగా పంటలసాగు నమోదయింది. ప్రస్తుతం జిల్లాలో 1571.43 హెక్టార్లలో వరిపంట, 358 హెక్టార్లలో సజ్జలు, 717.44 హెక్టార్లలో మొక్కజొన్న, 6 హెక్టార్లలో జొన్న, 42 హెక్టార్లలో కంది, 827.6 హెక్టార్లలో మినుము, 7 హెక్టార్లలో పెసర, 870.6 హెక్టార్లలో వేరుశనగ, 65.7 సన్ప్లవర్, 9.2 హెక్టార్లలో ఆముదం, 21 హెక్టార్లలో సోయాబీన్, 2429.07 హెక్టార్లలో పత్తి, 16 హెక్టార్లలో చెరకు మొత్తం కలిసి జిల్లావ్యాప్తంగా 6941.37 హెక్టార్లలో పంటలు సాగులో ఉన్నాయి. లోటు వర్షపాతమే... ఖరీప్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సంవృద్ధిగా వర్షాలు కురవలేదు. దీంతో పంటలు వాడుముఖం పడుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం సాగు చేయాల్సిన వేరుశనగ, పసుపు, మినుము, జొన్న, సజ్జ, వరి వంటి పంటలసాగు అనుకున్న మేర సాగు కాలేదు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు కూడా వాడుముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్ నెలలో 68.2 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 22.8 మి.మీ మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 66.6 శాతం తక్కువ వర్షం కురిసింది, అలాగే జులై నెలకు సంబంధించి ఇప్పటి వరకు 43.67 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటికి 7.1 మి.మీ మాత్రమే కురిసి లోటు వర్షపాతంగా మిగిలింది. ముఖం చాటేసిన వరుణుడు వర్షం కోసం రైతుల ఎదురు చూపులు విపరీతంగా వీస్తున్న ఈదురుగాలులు ఎగువన కురిసిన వర్షాలకు ఈ ఏడాది శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో ఈ ఏడాది సకాలంలోనే కేసీ కెనాల్కు నీరు విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద ఇక సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కేసీ కెనాల్ కింద సాగులో ఉన్న పంటలకు నీరు అందనుంది. దీంతోపాటు కేసీ రైతులు ఇక నారుమడులను సాగు చేయనున్నారు. కాకపోతే విపరీతమైన గాలులు వీస్తుంటంతో నారుముడులు సరిగా మొలకెత్తవని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాటు వేసినా ఈ గాలికి సాగు చేసిన వరిపంట ఎండుముఖం పట్టే అవకాశం కూడా ఉన్నట్లు రైతులు తెలిపారు. -
డిగ్రీ ప్రవేశాలు డీలా!
● నేటికీ జారీకాని ప్రవేశాల నోటిఫికేషన్ ● ఆన్లైన్, ఆఫ్లైన్పై స్పష్టత కరువు ● సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టులపై సందిగ్ధం ● ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూపు కడప ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు దాటింది. జూలై మాసం కూడా ముగుస్తోంది. ఇంతవరకు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో ఆందోళనలతోపాటు గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా విద్యార్థులు డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12878 మందికిగాను 9698 మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారు ఉన్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి నిర్లక్ష్యం.... ఉన్నత విద్యపై కూటి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 40 నుంచి 50 శాతం సీట్లు మిగిలిపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అలస్యంగా అడ్మిషన్ల పక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలోనే పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు ప్రారభమయ్యాయి, మరో వైపు డిగ్రీ కళాశాలలు కూడా నెల రోజుల క్రితమే పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో పలు ప్రెవేటు డిగ్రీ కళాశాలలు మాత్రం గుట్టుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి చప్పు డు కాకుండా తరగతులను నిర్వహిస్తున్నట్లు సమా చారం. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం చేయడం ద్వారా పేద, మద్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు వెనకబడి పోతున్నాయి. 21న ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అలసత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ 21వ తేదీ ప్రైవేటు డిగ్రీ కళాశాల బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాలు పూర్తయి తరగతులు ప్రారంభమైనా ఏపీ ప్రభుత్వం విద్యా ప్రణాళిక కూడా తీసుకరాలేకపోతోందని ఆరోపించింది. ఇందుకు నిరసనగానే 21వ కళాశాల బంద్ను నిర్వహించి నిరసనను తెలియ చేయనున్నారు. డిగ్రీ విద్యపై కుట్ర డిగ్రీ విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సింగల్ మేజర్, డబుల్ మేజర్ అంటూ డిగ్రీ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోంది. ఇంజనీరింగ్ విద్యను ప్రొత్సహించి డిగ్రీ చదువును నిర్లక్ష్యం చేస్తుంది. డిగ్రీ విద్యను పాత పద్దతిలో కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. డిగ్రీ కోర్సులలో విద్యార్థులకు అభద్రతా భావం కల్పిస్తూ డిగ్రీ అడ్మిషన్లు తగ్గించే నిర్ణయాలు చేయడం తగదు. –ఎస్. వెంకటరమణ, యోగివేమన ప్రైవేటు డిగ్రీ కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ డిగ్రీ ప్రవేశాలను వెంటనే చేపట్టాలి విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రవేశాలను ప్రారంభించపోవడం సరికాదు. తెలంగాణాతోపాటు పొరుగు రాష్ట్రాలలో సైతం నెల రోజుల క్రితమే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కానీ మన దగ్గర అడ్మిషన్ల పక్రియ ఆలస్యమయింది. దీంతో డిగ్రీ చేరే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే డిగ్రీ ప్రవేశాలను ప్రారంభించాలి. – వీరనాల శివకుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నత విద్య నిర్వీర్యం కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే ఉన్నత విద్యను నిర్వీర్యం చేసేలా ఉంది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ పెద్దల తీరుతో జిల్లావ్యాప్తంగా వేల మంది పేద, మద్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దల్లో మార్పు రావాలి. – సాయిదత్త, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
సాగర్ పనుల్లో జాప్యమేల !
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ ఆనకట్ట ఆధునికీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ఆనకట్ట లీక్లను అరికట్టేందుకు 2021లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.70కోట్లు నిధులు విడదల చేసింది. ఈ నిధులద్వారా కట్టకు పడ్డ రంధ్రం మరమ్మతులు కట్టపైన బీటీ రోడ్డు, సేఫ్టీ గ్రిల్స్ , లైటింగ్స్, పార్కుల ఆధునికీకరణ, గెస్ట్హౌస్ మరమ్మతులు తదితర పనులకు టెండర్లు పిలవగా మెగా కంపెనీ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. లీకులు సరిచేసి.. టెండర్లు దక్కించుకున్న సదరు కంపెనీ ఆనకట్టకు పడ్డ రంధ్రం మరమ్మతులు చేసింది. 12 టీఎంసీ వరకు నీరు నిల్వ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇంతలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అంతే పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం సదరు కంపెనీపై ఒత్తిడి తెచ్చి మిగిలిన పనులు చేయాలని ఆదేశించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. పనులు పూర్తి చేస్తేనే బిల్లులు కూడా పూర్తి స్థాయిలో వస్తాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా సాగర్ కట్టపైన మిగిలిన పనులు పూర్తిచేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాలో రూ.70 కోట్ల నిధులు విడుదల కూటమి ప్రభుత్వంలోముందుకు సాగని పనులు -
ఉప ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీ కై వసం
చాపాడు : మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్ష పదవి వైఎస్సార్సీపీ కై వసమైంది. ఎంపీటీసీ సభ్యులు బాలనరసింహారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పల్లవోలు ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షురాలు నగర్తి సుందరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఉప ఎంపీపీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. చియ్యపాడు ఎంపీటీసీ ఎస్ఆర్.బాలనరసింహారెడ్డిని ఉప ఎంపీపీగా మండల అధ్యక్షుడు తెలిదేల లక్షుమయ్య ప్రతిపాదించగా, చియ్యపాడు–2 ఎంపీటీసీ సుబ్బరామిరెడ్డి బలపరిచారు. వారితోపాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడంతో బాలనరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరకిషోర్, ఎంపీటీసీలు చాపాడుఆస్మ, పార్వతమ్మ, ఈశ్వరమ్మ, శివ, సీమోన్, రమాదేవి, అజ్మతుల్లా పాల్గొన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికై న ఎస్సార్ బాలనరసింహారెడ్డిని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖర్రెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, జయసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేష్యాదవ్, మనోహర్, రమేష్ తదితరులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సీతారామాపురం ఉప సర్పంచ్గా లక్ష్మీదేవి.. మండలంలోని సీతారామాపురం పంచాయతీ ఉప సర్పంచ్గా భూమిరెడ్డి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అనారోగ్యం కారణంగా ఉప సర్పంచ్ గుర్రప్ప తన పదవికి రాజీనామా చేయగా ఎన్నిక కమిషన్ బుధవారం ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించింది. ఎన్నికల అధికారి హరికృష్ణ పర్యవేక్షలో జరిగిన ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు మార్తల నరసింహారెడ్డి వర్గీయురాలు భూమిరెడ్డి లక్ష్మీదేవిని ఉప సర్పంచ్గా వార్డు మెంబర్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి, పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. బాలనరసింహారెడ్డిని ఎన్నుకున్న ఎంపీటీసీలు -
యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలల కోర్సుకు సంబంధించి పదవ తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈనెల 17వ తేదీలోపు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9392348430 అనే ఫోన్ నెంబర్కు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో పొలిటికల్ సైన్సు, హిస్టరీ, ఎకనామిక్స్, జియాలజి,కంప్యూటర్ సైన్సు/అప్లికేషన్ సబ్జెక్టులకు అతిథి అధ్యాపక ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 18 వ తేదీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపాల్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని వివరించారు. నెట్, స్లెట్ , పీహెచ్డీ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్టు జిరాక్సు కాపీలతో హాజరు కావాలని ఆయన సూచించారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 07009 నంబరుగల రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్లో ఈనెల 31, ఆగస్ట్ 7, 14, 21, 28వ తేదీల్లో, 07010 నంబరు గల రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రతి శుక్రవారం ఆగస్ట్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో నడుస్తుందన్నారు. సికింద్రాబాద్లో ప్రతి గురువారం రాత్రి 10గంటలకు బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా కడపకు ఉదయం 7.05గంటలకు చేరుకుని, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి ఉదయం 10.30గంటలకు చేరుకుంటుందన్నా రు. అలాగే ప్రతి శుక్రవారం తిరుపతిలో సాయంత్రం 4.40గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో సికింద్రాబాద్కు ఉదయం 6.45గంటలకు చేరుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు. -
కారాగారంలో సెల్ఫోన్.. రచ్చ
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో సెల్ఫోన్ లభ్యం కావడంపై రచ్చ రేగుతోంది. తాను డబ్బులు ఎరవేశానంటూ రిమాండ్ ఖైదీ ఒకరు తెలియజేసినట్లు సమాచారం బయటకు రావడం చర్చనీయాంశమవుతోంది. పలువురు బాధ్యులైన సిబ్బందిపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల సెల్ ఫోన్లు పదే పదే తనిఖీలలో లభ్యం కావడం, పత్రికల్లో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 15న ‘కడప కేంద్ర కారాగారంలో మరోసారి సెల్ఫోన్, ఛార్జర్ లభ్యం’ వార్త ప్రచురితమైంది. దీంతో జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు.. రాజమండ్రి రీజియన్ (నార్త్జోన్) డీఐజీ ఎంఆర్ రవికిరణ్ కడప కేంద్ర కారాగారంలో విచారణకు బుధవారం విచ్చేశారు. నేరుగా కారాగారంలోని బ్యారక్ల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పీడియాక్ట్లో రిమాండ్లో వున్న జాకీర్ను పిలిపించి స్టేట్మెంట్ను రికార్డ్ చేయించారు. రిమాండ్ ఖైదీ ఏమాత్రం తడబడకుండా శ్రీతాను సెల్ఫోన్ బయటనుంచి తెప్పించుకోవడానికి జైలర్ నుంచి ఆపై అధికారుల వరకూ డబ్బు ఎర వేశాననీ తెలియజేసినట్లు సమాచారం. కేంద్ర కారాగార సూపరింటెండెంట్ కుమార్తె వివాహానికి వెళ్లేటపుడు అక్షరాలా రూ. 80వేలు నజరానాగా తీసుకువెళ్లాడని, తనకు సహకరించిన జైలర్ నుంచి అధికారి స్థాయి వరకు తాను రూ.7లక్షలు లంచంగా ఇచ్చాననీ తెలియజేసినట్లు తెలిసింది. జాకీర్ నుంచి దశల వారీగా ఇప్పటివరకూ 12 సెల్ఫోన్లు, ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు. మొదట దొరికిన సెల్ఫోన్ నుంచి లభించినరిపోర్ట్ను డిఐజీ క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. విచారణలో బాధ్యులైన 12 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని, కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావుపై బదిలీ వేటు వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కారాగారం నుంచి బయటకు వెళుతున్న ‘ఔట్ గ్యాంగ్’ ఖైదీల వద్ద యథేచ్చగా మద్యం లభ్యమవుతుందని తాజా సమాచారం. పెట్రోల్ బంకులో ఎలాంటి లాభాలను అక్రమంగా పొందవచ్చో అక్కడ విధులను నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు గ్యాంగ్లో అరెస్టయి శి అనుభవిస్తున్న ఓ ఖైదీ మీద ఆధారపడి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. విచారణకు వచ్చిన డిఐజీ ఎం.ఆర్ రవికిరణ్ శ్రీసాక్షిశ్రీతో మాట్లాడుతూ డీజీ ఆదేశాల మేరకు కడప కేంద్ర కారాగారానికి విచారణకు వచ్చామన్నారు. విచారణ ఇంకా జరుగుతోందనీ, పూర్తి సమాచారం రానున్న రోజుల్లో వివరిస్తామని తెలియజేశారు. పదే పదే లభ్యం కావడంపై డీఐజీ విచారణ స్టేట్మెంట్ ఇచ్చిన రిమాండ్ ఖైదీ జాకీర్ 12 మంది బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ బదిలీకి అవకాశం? -
వృద్ధుడు అదృశ్యం
కడప అర్బన్ : కడప గౌస్ నగర్కు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్(65)గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు వృద్ధాప్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేదని అందులో పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 8555903070కు సమాచారం ఇవ్వాలని వారు విన్నవించారు. మైనర్ బాలికకు అంత్యక్రియలు జమ్మలమడుగు : గండికోటలో హత్య కాబడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్టవి అంత్య క్రియలు బుధవారం స్వగ్రామం హనుమనగుత్తిలో నిర్వహించారు. మంగళవారం రాత్రి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బుధవారం హనుమనగుత్తిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. బాలికను హత్య చేసిన వారిని శిక్షించాలని నిరసన ప్రొద్దుటూరు : బాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, ఐద్వా నాయకులు గురమ్మ, రమాదేవి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో మహిళల హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, అభం, శుభం తెలియని చిన్నపిల్లలను చిదివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికను యువకుడు లోకేష్ గండికోటకు తీసుకుపోయాడని, అక్కడ ఆమె హత్యకు గురైందని తెలిపారు. ఆమెను ఎవరు హత్య చేశారనేది స్పష్టంగా ఇంతవరకూ బయటికి రాలేదని, రాజకీయాలకు లొంగకుండా ఆమెను చంపిన వారిని పోలీసులు త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు లక్ష్మీదేవి, ఝాన్సీరాణి, విజయకుమారి, కళావతి, మేరి, నీతమ్మ, అన్నమ్మపూర్ణ, సీఐటీయూ పట్టణ కార్యదర్శి విజయ్కుమార్, సాల్మన్, రాఘవ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ములకలచెరువు రాజా నగర్కు చెందిన గంగన్న కుమారుడు నరసింహులు(60) గత కొంతకాలంగా షు గర్, బీపీతోపాటు, కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. వ్యాధి నివారణకు చికిత్స తీసుకున్నా ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఇంటి వద్దే సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
ఎస్ఈ రమణ కడప కార్పొరేషన్ : విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రమణ ఆదేశించారు. కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బుధవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కడప డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవాడలో సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఉత్పత్తి అనుకున్నంత మేర జరగదన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్తు భద్రతా నియమాలు పాటించాలని, నిర్లక్ష్య ధోరణి వీడాలని సూచించారు. ఇండక్షన్ టెస్టర్ను ప్రతి ఒక్కరూ జేబులో ఉంచుకుంటే విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించి ప్రమాదాలు నివారించవచ్చన్నారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ పరిష్కరించాలని సూచించారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, రీ కనెక్షన్ వంటివి వినియోగదారులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులను సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఈ హరిసేవ్యానాయక్, సుబ్రహ్మణ్యం, రామచంద్రారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వాటర్షెడ్ పనుల్లో నాణ్యత పాటించండి
బి.కోడూరు: మండలంలో జరుగుతున్న వాటర్షెడ్ పనులను నిబంధనల ప్రకారం నాణ్యతతో చేయాలని వాటర్షెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పెద్దుళ్లపల్లె వాటర్షెడ్ పరిధిలో జరిగిన పనులను స్టేట్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపినాఽథ్, జిల్లా క్వాలిటీ ఆఫీసర్ విజయభాస్కర్, ఏపీఓ వేణుగోపాల్రెడ్డితో కలిసి విడిరాళ్ల కట్టలు, కుంటలు, డకౌట్ గుంతలు, పారంఫండ్స్ వంటి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వాటర్షెడ్ సిబ్బంది, పెద్దుళ్ళపల్లె వాటర్షెడ్ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీసర్వే పక్కాగా నిర్వహించాలి
కడప సెవెన్ రోడ్స్: జిల్లాలో భూ రీసర్వేను పక్కాగా నిర్వహించాలని మండల, గ్రామస్థాయిలో తహసిల్దార్లు సర్వేయర్లు, వీఆర్వోలను ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. బుధవారం భూముల రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అదనపు సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నక్కల ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇంచార్జి కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలు ఎక్కడా పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఫేజ్ 1 లో ఉన్న భూముల రీసర్వే వేగవంతంగా, పకడ్బందీగా ఈ నెలాఖరు లోపల పూర్తి చేయాలన్నారు. భూముల రీసర్వే లో రెవెన్యూ, సర్వే ల్యాండ్ శాఖల అధికారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తప్పనిసరిగా వ్యవసాయ అధికారులు ఆధార్ అప్డేషన్ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, సర్వే ల్యాండ్ అధికారి మురళీకష్ణ,జిల్లా వ్యవసాయ శాఖ జేడి చంద్రా నాయక్,రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవల్లో వేగం పెరగాలి ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి పనితీరు మెరుగుపరచుకొని జవాబుదారీతనంతో పనిచేయాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో వీఆర్వోలు, సచివాలయ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీలు,మండల గ్రామ సర్వేయర్ల తో ఐవీఆర్ఎస్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ నివేదికల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అందజేత, అర్జీలు పరిష్కారం చూపడంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ నివేదికలలో పనితీరు మెరుగ్గా లేని అధికారులపై తహసీల్దార్లు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ -
విద్యార్థుల సమస్యలను డీన్లకు విన్నవించాలి
వేంపల్లె : విద్యార్థులకు సమస్య ఎదురైనప్పుడు అకడమిక్ అసోసియేట్ డీన్, నాన్ అకడమిక్కు అయితే వార్డెన్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ను సంప్రదించాలని డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలనాధికారి రవికుమార్ అన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కొత్తగా చేరిన విద్యార్థులకు బుధవారం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది పీయూసీ–1లో సెమిస్టర్ విద్యా విధానానికి బదులుగా వార్షిక పరీక్షలు, మధ్యలో ఆరు మాసాంత(మిడ్) పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థుల సంరక్షితార్థం ఓల్డ్ క్యాంపస్ మొత్తం పీయూసీ1–2 బాలికలకు కేటాయించామని, అక్కడే తరగతులు, వసతులు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బాలురకు ఏబీ–1లో తరగతులు, బీహెచ్–1లో వసతి కేటాయించారన్నారు. పోస్టాఫీస్, బ్యాంకింగ్, 24/7 అంబులెన్స్, హాస్పిటల్ డాక్టర్స్ గురించి వివరించారు. రెండో విడతలో ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 17న సెంట్రల్ లైబ్రరీలో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ డాక్టర్ రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ వెంకటేష్ , ఆసోసియేట్ డీన్స్ రాఘవరెడ్డి, రఫి, పీఆర్ఓ తిరుపతిరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శంషాద్ బేగం, ఓబయ్య, డాక్టర్ కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భార్య చేతిలో భర్త హతం
కడప అర్బన్ : రోజూ మద్యం తాగి అనుమానంతో గొడవపడడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య గోడకేసి తోసింది.. బలమైన దెబ్బ తగలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కడపలో బుధవారం చోటుచేసుకుంది. కడప వన్టౌన్ పోలీసుల కథనం మేరకు..కడప నగరంలోని ఎర్రముక్కపల్లి బాల వికాస్ హైస్కూల్ వెనుక వీధిలో దేరంగుల సుబ్బరాయుడు(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య హరిత, కుమార్తె, కుమారుడు వున్నారు. ఈ క్రమంలో సుబ్బరాయుడు ప్రతి రోజూ మద్యం తాగివస్తుండడంతె భార్య హరిత గొడవపడేది. హరిత ఇంటి ప్రక్కనే ఆమె తల్లి, సోదరుడు హరికృష్ణ నివాసముంటున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో దేరంగుల సుబ్బరాయుడు మద్యం తాగి భార్య హరితతో గొడవపడ్డాడు. అదే సమయంలో హరిత అన్న హరికృష్ణ వచ్చి ఎందుకు రోజూ మద్యం తాగి గొడవపడతావని నిలదీశాడు. వాగ్వాదం పెరగడంతో తన భర్తను హరిత గోడకేసి తోసింది. గోడ మోటు బలంగా తగలడంతో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప వన్టౌన్ సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ ప్రతాప్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రోజూ మద్యం సేవించి వస్తున్నాడని వాగ్వాదం ఈ ఘటనలో భార్యతో పాటు, బావమరిది నిందితుడే -
జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పొడిగింపు
కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా గడువు 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించిందని ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారీ రూ.2 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందుతాయన్నారు. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. ఎంప్లాయీస్ హె ల్త్ స్కీమ్ తరహాలో వైద్య సేవలు పొందవచ్చని, ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని పేర్కొన్నారు. నిర్దేశిత చికిత్సకు ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని వివరించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియో గించుకోవాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జివోవి.ఐఎన్ వెబ్సైట్ ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్ 8342–00–120–01–03–001–001డీడీవో కోడ్ 2703–0802–003 అనే పద్దుకు రూ.1250 చెల్లించి వచ్చే ఏడాది మార్చి 31 వరకు హెల్త్ స్కీం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ జిరాక్సు, హెల్త్ స్కీమ్ దరఖాస్తు, కుటుంబ సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డు కాపీ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు కడప వైఎస్ఆర్ సర్కిల్ : క్రీడాకారులు ప్రతిభ చూపితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్ జిల్లా సెలెక్షన్స్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా ఫుట్బాల్ జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సుధీర్కుమార్, ఎన్.అనిల్ కుమార్, హరి, ఎం.గంగయ్య, తదితరులు పాల్గొన్నారు -
గండి ఉత్సవాలకు పక్కా ప్రణాళిక
చక్రాయపేట : గండిలో శ్రావణ మాసోత్సవాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పాలకమండలి సభ్యులు సహకరించాలని ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య విజ్ఙప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణపై చైర్మన్ కావలి కృష్ణతేజ అధ్యక్షతన గండి క్షేత్రంలోని ఈవో కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాజగోపురం నిర్మాణం నేపథ్యంలో ఇరుకుగా ఉన్న రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యను ఆయన కోరారు. ప్రతి శనివారం భక్తుల రద్దీని బట్టి అద్దాలమర్రి క్రాస్, ఇడుపులపాయ క్రాస్ వద్దే వాహనాలు ఆపేయాలని, ట్రాఫిక్ ఆంక్షలు విధించడమేగాక, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటుచేస్తామని సీఐ వివరించారు. ఉత్సవ సమయంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటామని చక్రాయపేట వైద్యాధికారిణి వాణి చెప్పారు. విద్యుత్తు, నీటి సమస్య, బారికేడ్లు, క్యూలైన్లు, దుకాణాల నిర్వహణ, అలంకరణ, రవాణా సౌకర్యాలు, అగ్నిమాపక శాఖ పాత్రలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కేసరి, రాజా రమేష్, పాలకమండలి సభ్యులు రాశినేని మధు, పబ్బతి బిందుసాగర్, కొండారెడ్డి, మాజీ చైర్మన్ వెంకట స్వామి, అధికారులు పాల్గొన్నారు. టెండర్లు మళ్లీ వాయిదా గండి ఆలయ పరిధిలో టోల్గేట్ వసూలుకు నిర్వహించిన టెండర్లు మూడో సారీ వాయిదాపడ్డాయి. ధరావత్తు చెల్లించిన వారు వేలం పాడకపోవడంతో నిలిపివేసినట్లు ఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు. శ్రావణ మాసంలో ప్రత్యేక పుష్పాలంకరణ నిమిత్తం పూలు సరఫరా చేసే హక్కు పొందే టెండర్కు హెచ్చు పాట పాడిన మల్లికార్జునకు టెండరు ఖరారు చేశామని ఆయన తెలిపారు. -
ఇందిరానగర్లో ఇంటి స్థలాల కబ్జా
చింతకొమ్మదిన్నె : కడప సమీపంలోని ఇందిరానగర్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జాకు తెగబడుతున్నారు. అధికారపార్టీ పెద్దల పేర్లు చెప్పి పార్కు, హౌసింగ్, ప్రజావసరాలకు రిజర్వు చేసిన స్థలాలను చదును చేసేస్తున్నారు. తమ సొంత భూముల్లా ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. కబ్జాదారులు, అధికార నేతల పేర్లు చెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇందిరానగర్ వాసులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 732లో హౌసింగ్కు రిజర్వు చేసిన స్థలానికి అధికార పార్టీ నాయకులు బోగస్ డి.పట్టా సృష్టించి ప్లాట్లు వేశారు. ఒక్కో రూ.4 లక్షల ధర చెప్పి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం సాయంత్రం చింతకొమ్మదిన్నె రెవెన్యూ అధికారుల వివరణ కోరగా తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని, సిబ్బందిని పంపి ప్రభుత్వ స్థలంలో వేసిన ప్లాట్ల రాళ్లను తొలగించడం జరిగిందన్నారు. -
సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
బద్వేలు అర్బన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభు త్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాసులు, మున్సిపల్ వర్క ర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.నాగేంంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజినీరింగ్ కార్మికుల నైపుణ్యం ఆధారంగా వేతనాలు చెల్లించలేదన్నారు. గతంలో సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం సరికాదన్నారు. ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలనుకోవడం దారుణమన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం మంచిది కాదన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, మట్టి ఖర్చు డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని హె చ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు నాగార్జున, వెంకటరమణ, డి.హరి, డి.నాగేంద్రబాబు, దేవమ్మ, చంద్రశేఖర్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్య పరిష్కరించుకునే ప్రక్రియే మధ్యవర్తిత్వం
కడప అర్బన్ : కక్షి దారుల సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియనే మధ్యవర్తిత్వం అంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కడపలో నిర్వహించిన వన్ కే వాక్ఙ్ ర్యాలీని బుధవారం పచ్చజెండా ఊపి ఆమె ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ కూడలి నుంచి న్యాయ సేవా సదన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అంతుకు ముందు ర్యాలీని ప్రారంభించిన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని మాట్లాడుతూ మధ్యవర్తి అంగీకార పత్రంలో షరతులను కక్షిదారులకు వివరించి స్పష్టంగా ఒప్పంద పత్రాన్ని తయారుచేస్తారని, ఇది ఆంతరంగికమైన ప్రక్రియ అని వివరించారు. ఈ స్వచ్ఛంద ప్రక్రియకు నిర్దిష్టమైన ఆదేశిక నియమాలు లేవని, ఏడాది పొడవునా చేసుకునే ప్రక్రియ అని వివరించారు. ఈ కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి గరికపాటి దీనబాబు, ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.శాంతి, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాఫకృద్దీన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జి.సి.ఆసిఫా సుల్తానా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.ఈశ్వర్ వెంకటప్రసాద్, మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, బార్ అసోసియేషన్ సెక్రెటరీ చంద్ర వదన, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ హరిబాబు, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి రమణయ్య, ప్యానల్ న్యాయవాదులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. వన్కే వాక్ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
గండికోట: వైష్ణవిది హత్యా? పరువు హత్యా?
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది. ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్తో బైక్పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
కార్పొరేటర్కు బ్రోకర్గా పని చేస్తున్నావా?
కడప కార్పొరేషన్: ప్రభుత్వ విప్, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చిపోయారు. సచివాలయ ఉద్యోగి అయిన వీఆర్ఓపై నోరుపారేసుకున్నారు. పది మంది చూస్తుండగానే ‘నీవు కార్పొరేటర్కు బ్రోకర్గా పని చేస్తున్నావా’ అని వీఆర్వోపై మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు– ఇంటింటికీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 30వ డివిజన్లో ప్రభుత్వ విప్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఇటీవల తన రేషన్ కార్డులో ఉన్న అమ్మానాన్నలను తొలగించి.. తమ భర్త, పిల్లలతో రేషన్ కార్డు చేయించాలని వీఆర్ఓ మహేందర్ను ఆశ్రయించింది. ఆయన డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని కలవాలని సూచించారు. కాగా సదరు సెక్రటరీ ఆ ఫ్యామిలీకి హెడ్ అయిన భర్త వేలిముద్రలు కావాలని చెప్పడంతో.. ఆమె మళ్లీ వీఆర్ఓ వద్దకు వచ్చి చెప్పింది. ఈ విషయం 30వ డివిజన్లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవికి తెలియడంతో ఆమె చిర్రెత్తిపోయారు. ‘రేషన్ కార్డులో ఏం సమస్య ఉందో చెప్పి పరిష్కరించడమే నీ పని.. నీలాంటి బ్రోకర్లను పెట్టుకొని నడుపుతున్నారు. కార్పొరేటర్ పేరు రాసి ఆయన్ను కలువు.. పో అంటావా.. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ కార్పొరేటర్కు బ్రోకర్గా పని చేస్తున్నావా? నగర ప్రజలు కార్పొరేటర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలా.. వాళ్లింటి దగ్గర కూర్చొని వారు రేషన్ కార్డులిస్తే తీసుకోవాలి’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో నివ్వెరపోయిన వీఆర్ఓ తాను అలా అనలేదని చెబుతున్నా వినకుండా నోర్మూయ్ అంటూ ఎమ్మెల్యే మాధవి గదమాయించారు. సాక్షాత్తు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర సమక్షంలో పది మంది ముందూ ఇలా ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అంటూ పరుష పదజాలం ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి. -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
కడప అర్బన్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పలు దొంగతనాలు చేసిన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగ గజ్జల శ్రీనివాస్ (47)ను అరెస్టు చేయడంతోపాటు మరో బాల నేరస్తున్ని అదుపులోకి తీసుకున్నట్లు కడప డీఎస్పి ఏ. వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను తెలియజేశారు. గజ్జల శ్రీనివాస్పై ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 15 కేసులు ఉన్నాయన్నారు. చలమారెడ్డి పల్లి ఎమ్మెస్సార్ హిల్స్లోని ఒక ఇంటిలో, కడప పాత బైపాస్ రోడ్డులోని వెంకట సాయినగర్లోని 2 ఇళ్లలో, సాయి నగర్లో ఒక ఇంటిలో చోరీ చేశాడన్నారు. కొన్ని రోజులుగా జరిగిన దొంగతనాలకు సంబంధించిన చోరీ సొమ్మును అతని వద్ద నుంచి పూర్తిగా రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన వాటిలో ఒక జత బంగారు బుట్ట కమ్మలు, ఒక బంగారు ఉంగరం, ఒక కేజీ 500 గ్రాముల వెండి వస్తువులు, మోటార్ సైకిల్, ఆరు చేతి గడియారాలు, రెండు కెమెరాలు ఉన్నాయని తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడ ప ఆర్చి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి ఇంకొక బాలనేరస్తుడిని అదుపులోకి తీసుకొని ఈ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయ డంలో కృషి చేసిన కడప చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ జి.ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర్రెడ్డి, రవికుమార్, సీసీఎ స్ సిబ్బందిని, ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ చంద్రమోహన్, సుదర్శన్రెడ్డి, ఏఎస్ఐ సుబ్బరాజు, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుల్ ఖాదర్ హుస్సేన్, శ్రీనివాసులు, మాధవరెడ్డి, సుధాకర్ యాదవ్ నాగరాజులను కడప డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం సిఫార్సు చేసినట్లు వివరించారు. ఈ కేసు ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. 1.5 కేజీల వెండి, బంగారు స్వాధీనం -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు క్రిష్ణవేణి, మూలే సరస్వతితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన నాయకులు రాళ్లు, కట్టెలు, బండరాళ్లతో దాడులు చేయడం హేయమన్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. కాకినాడ జీజీహెచ్లో ఓ వైద్యుడు 32 మంది విద్యార్థినుల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదన్నారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి గానీ, డిప్యూటీ సీఎం గానీ, హోంమంత్రి గానీ స్పందించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని, మహిళలపై దాడులు జరక్కుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గవర్నర్ జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, మహిళా నేతలు పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి, బి.మరియలు, సుశీలమ్మ, తులశమ్మ, నారాయణమ్మ, మల్లీశ్వరి, సుజిత, పద్మ, శివమ్మ పాల్గొన్నారు. -
గ్రామస్థాయికి జన్ సురక్ష పథకాలు
కడప సెవెన్రోడ్స్: జన సురక్ష పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని బోర్డు రూమ్ కాన్ఫరెన్స్ హాల్లో జన్ సురక్ష పథకాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఈ నెల నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కు సంబంధించి సంబంధిత అధికారులతో తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లి నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని ఎల్డీఎంను ఆదేశించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి, వారిచే బ్యాంకు ఖాతాలను తెరిపించాలని ఆదేశించారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాల ఈ కేవైసీ చేయనివారిని గుర్తించి ఈ కేవైసీ అప్డేషన్ ప్రక్రియను వేగంగా చేయాలన్నారు. డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు,లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, నాబార్డ్ ఏజిఎం విజయ విహారి, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జెడ్పి డిప్యూటీ సీఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకే పీ4 రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా, ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే ద్వారా గుర్తించామన్నారు. తుది జాబితాను తయారు చేసేందుకు గ్రామ వార్డు సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామసభల నిర్వహణకు 17వ తేదీ లోపు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ నెల 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీవోలు , రాష్ట్ర సమగ్ర టీమ్ ప్రతినిధి సాయి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. ● జులై నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ క్యాంపెయిన్ ● ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ -
వివాదాస్పద ఫ్లెక్సీ కేసులో ఇద్దరు అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కేసులో డాక్టర్తోపాటు ఫ్లెక్సీ డిజిటల్ షాపు యజమానిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ రాత్రి దాదాపు 7 గంటల సమయంలో కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ వద్ద ‘ఎంత పని సేచ్చివయ్య జగనూ’ అని హెడ్డింగ్ పెట్టి 12 పాయింట్స్ కలిగిన ఒక బ్యానర్ను చైన్నె చిల్డ్రెన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నారపురెడ్డి నాగార్జునరెడ్డి, గ్లేస్ ఫ్లెక్సీ డిజిటల్ షాపు యజమాని అమృతరాజు ఏర్పాటు చేశారన్నారు. ఈ బ్యానర్ను పరిశీలించగా అందులో రెండు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి, ఘర్షణ వాతావరణం సృష్టించి ప్రజా శాంతికి, లా అండ్ ఆర్డర్కు భంగం కలిగించే విధంగా ఉండటంతో.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై వచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు క్రైం నంబరు 148/2025, యు/ఎస్ 61(2) 325 ఆర్–డబ్ల్యు 3(5) బి.ఎన్.ఎస్ కింద వన్టౌన్ పోలీసు స్టేషన్లో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి వారిని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఎవరైనా కానీ తమకు గల వాక్ స్వాతంత్రపు హక్కును దుర్వినియోగం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద అంశాలు కలిగిన బ్యానర్లను తయారు చేయకూడదని ఫ్లెక్సీ ప్రింటింగ్ తయారీ యజమానులకు డీఎస్పీ సూచించారు. వివాదాస్పద అంశాలు కలిగిన బ్యానర్లు తయారు చేయాలని మీ వద్దకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్కు తెలియజేయాలన్నారు. బ్యానర్ కింద ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఫోన్ నంబరును తప్పకుండా ముద్రించాలన్నారు. -
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి
జమ్మలమడుగు : ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల గ్రామంలోని కృష్ణానగర్కు చెందిన సువార్తమ్మ(35) డ్వాక్రా సంఘానికి డబ్బులు కట్టాలని, డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడిని కోరింది. దీంతో తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో డ్వాక్రా సంఘానికి డబ్బులు కట్టలేక.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు చీరెతో ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. అయితే చుట్టుపక్కల వారు గుర్తించి వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని కల్లమల్ల పోలీసులు పేర్కొన్నారు. కందుల నాని అలియాస్ ఓబుల్రెడ్డి దౌర్జన్యం – కందుల రాజమోహన్రెడ్డి తనయుడు కందుల మురళీమోహన్రెడ్డిపై దాడి కడప అర్బన్ : కందుల రాజమోహన్రెడ్డి తనయుడు బీజేపీ నేత కందుల మురళి మోహన్రెడ్డి (42)పై కేఎస్ఆర్ఎం గ్రూప్ అఫ్ కాలేజెస్ చైర్మన్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి అలియాస్ నాని తన అనుచరులతో కలిసి మంగళవారం ఉదయం విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనలో బీజేపీ నేత కందు మురళీమోహన్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ముక్కు, ఎడమ కంటికి గాయాలయ్యాయి. ఇంకా శరీరమంతా దెబ్బలు తగిలాయి. గాయపడిన కందుల మురళీమోహన్రెడ్డిని వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ క్రమంలో బాధితుడు మురళీమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప నగరం రాజారెడ్డి వీధిలోని కందుల రెసిడెన్సీలో 105 ప్లాట్లో తాను వుంటున్నానని, అదే అపార్ట్మెంట్లో 6వ అంతస్తులో కందుల చంద్రఓబుళరెడ్డి అలియాస్ నాని నివాసం వుంటున్నాడన్నారు. అదే ఇంటిలో తన పెద్దమ్మ వుంటున్నారని మంగళవారం ఉదయం వాళ్లింటికి తాను కాఫీ తాగేందుకు, టిఫిన్ తినడానికి వెళ్లి మంచిచెడ్డలు పలుకరింపుగా వెళ్లానన్నారు. అదే సమయంలో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్న సమయంలో.. కందుల చంద్ర ఓబుళరెడ్డి అలియాస్ నాని తన అనుచరులతో కలిసి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ సంఘటనపై అతనిపై, బాధ్యులైన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ఒన్టౌన్ సీఐ బి.రామకృష్ణ తెలియజేశారు. తీవ్రంగా గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న మురళీమోహన్రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బా రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, ఇతర బీజేపీ నాయకులు, బంధువులు, స్నేహితులు వచ్చి పరామర్శించారు. -
వైవీయూలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2025– 26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం వైవీయూలోని ప్రిన్సిపల్ చాంబర్లో పలువురు డీన్లతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)– 2020ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో భాగంగా బీఎస్సీ(హానర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్, ఎర్త్ సైన్స్ కోర్సులలో త్వరలో ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. బీఎస్సీ(ఆనర్స్) ఫిజిక్స్ సబ్జెక్టుతోపాటు కంప్యూటర్ సైన్స్, నానో–సైన్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, టెక్నాలజీలను విద్యార్థులు ఎంపిక చేసుకొని చదివే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ (ఆనర్స్) రసాయన శాస్త్రం మేజర్ సబ్జెక్టుగా తీసుకోవడంతోపాటు అప్లికేషన్ కెమికల్ సైన్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ చదవచ్చన్నారు. బీకాం (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ ప్రధాన అంశంగా కలిగి ఉందన్నారు. ఈ సమావేశంలో పూర్వ ప్రధానాచార్యులు, ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, డీన్ ఫర్ అకడమిక్ అఫైర్స్ చంద్ర ఓబులరెడ్డి, డీవోయే డైరెక్టర్ టి లక్ష్మి ప్రసాద్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య విజయభారతి తదితరులు పాల్గొన్నారు. -
సొమ్మొకరిది.. సోకొకరిదన్నట్లు ఎమ్మెల్యే వ్యవహారం
● 13 నెలల్లో నగరపాలక సంస్థకు నయాపైసా నిధులు తేలేదు ● మేం ప్రతిపాదించి, ఆమోదించిన పనులకు శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటు ● తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మేయర్ సురేష్బాబు ● 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 కోట్ల పనులకు శంకుస్థాపన కడప కార్పొరేషన్ : ‘సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి వ్యవహారం ఉంది’ అని మేయర్ సురేష్ బాబు విమర్శించారు. మంగళవారం 5,9,10, 11,12,13, 14, 20, 21,23, 24 డివిజన్లలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 కోట్లతో చేపడుతున్న పనులను ఆయన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలతో కలిసి టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2014–19 వరకూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అప్పుడు కూడా జిల్లా అభివృద్ధికి గానీ, కడప నగరాభివృద్ధికి గానీ ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలవున్నా నగరపాలక సంస్థకు నయాపైసా నిధులు ఇవ్వలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం కింద నిధులు మంజూరైతే డివిజన్లలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించగా, తాము సర్వసభ్య సమావేశంలో ఆమోదించామన్నారు. డిసెంబర్ 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి నానా రచ్చ చేసి 15వ ఆర్థిక సంఘ పనులు ప్రతిపాదించిన అజెండా పేపర్లను చించి వేశారని, ఇప్పుడేమో ఆ పనుల ప్రారంభోత్సవాలకు పాలవర్గ సభ్యులను గానీ, మేయర్గా తనను గానీ పిలవకుండా ఏకపక్షంగా ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందిందంటే అది వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిల వల్లేనన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నగరాభివృద్ధికి రూ.2400 కోట్లు విడుదల చేశారన్నారు. నగరంలో ఏడు రహదారులను విస్తరించి సుందరీకరణ చేశామని, రూ.57 కోట్లతో బుగ్గవంక వాల్ను పూర్తి చేసి, 40 అడుగులతో అప్రోచ్ రోడ్లు మంజూరు చేశామన్నారు. రూ.78 కోట్లతో వరదనీటి కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్మెల్యే మాధవి బంధువు కావడం వల్ల .. అంతా ఆమె చెప్పినట్లు జరుగుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కడప నగరానికి రూ.10 కూడా మంజూరు చేయలేదని, ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులను జీవోలు, తేదీలు మార్చి తమ ఘనతగా చెప్పుకోవడం దారుణమన్నారు. బుగ్గవంకపై నాగరాజుపేట, షామీరియా మసీదుల వద్ద బ్రిడ్జిలకు గత ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తే.. గెలిచిన వెంటనే ఆ బ్రిడ్జిల వద్దకు పోయి ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇంతవరకూ చేయలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైతే ఆ టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని ఎమ్మెల్యే బెదిరించారని, ఆ టెండర్లన్నీ నలుగురికే కట్టబెట్టారన్నారు. కార్పొరేషన్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు మేయర్ను, కార్పొరేటర్లను పిలవకుండా.. వార్డు మెంబర్గా గెలవలేని వారితో టెంకాయలు కొట్టించడం అన్యాయమన్నారు. శిలాఫలకాల కోసం, అందులో తన పేరు కోసం ఎమ్మెల్యే పాకులాడుతున్నారే తప్ప, ప్రజా సమస్యలపై కాదన్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, మల్లికార్జున, గంగాదేవి, వై.మాధవి, కె.బాబు, మేసా ప్రమీలరాణి, రామలక్ష్మణ్రెడ్డి, షఫీ, డివిజన్ ఇన్చార్జులు బండి ప్రసాద్, మేసా ప్రసాద్, ఐస్క్రీం రవి, వైఎస్సార్సీపీ నాయకులు పి.జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్, బీహెచ్ ఇలియాస్, శ్రీరంజన్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, యానాదయ్య, గుంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన హుసేని పీర్ దర్గా ఉరుసు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గా వీధిలో వెలసిన హుసేనిపీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు మంగళవారం నిర్వహించిన తహలిల్ ఫాతిహతో ముగిసాయి. ఇందులో భాగంగా సాయంత్రం స్వామి వారసులు స్వామి సమాధికి పూలచాదర్ సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారసులతోపాటు శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్గా ఆవరణలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో స్వామి నాల్గవ, ఐదవ తరం వారసులు మున్వర్బాష, సలీం, దర్గారహమతుల్లా, దర్గాషఫివుల్లా, దర్గాకరీముల్లా, ఆర్గనైజర్లు షరీఫ్, అంజాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏసీఏ పోటీల్లో చిత్తూరు జట్టు విజయం కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లో మూడవ రోజైన మంగళవారం కడప జట్టుపై చిత్తూరు జట్టు 5 పరుగులతో విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 193 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 85 ఓవర్లకు 239 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని క్యాశప్రెడ్డి 37 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని జయప్రకాశ్ 3, దినేష్ 3, తేజేష్ 2 వికెట్లు తీశారు. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 139 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 239 పరుగులు మాత్రమే చేసింది. చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులు చేసిన విషయం తెలిసిందే.