YSR
-
జగనన్న హయాంలోనే ‘గండి’ అభివృద్ధి
చక్రాయపేట: వైఎస్ జగన్ హయాంలోనే గండి క్షేత్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆలయ మహాకుంభాభిషేకం, హనుమజ్జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.అనంతరం కుంబాభిషేకంలో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించే పలు పూజా కార్యక్రమాల్లో, గర్భాలయం పైభాగాన కలశ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రూ.28.5 కోట్లతో గండి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆలయం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. ఆలయంతో పాటు రాజగోపురాలు కూడా అత్యంత సుందరంగా తయారయ్యాయని చెప్పారు. పూర్ణాహుతి అనంతరం బుధవారం నుంచి భక్తులకు ఆంజనేయస్వామి మూలవిరాట్ దర్శనం ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా గంగాధర్ అనే భక్తుడు తనకు అనుమతులు ఇప్పిస్తే గండిలో తన సొంత నిధులతో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తానని కోరగా, దీనికి స్పందించిన ఆయన కలెక్టర్, కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. చక్రాయపేటలోని శ్రీవేంకటేశ్వర రాచరాయస్వామి ఆలయాలకు అనుసంధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన టూరిజం భవనానికి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా
ప్రస్తుతం రాసిన నీట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్ రద్దు కావడం చాలా బాధగా ఉంది. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈసారైనా పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టాలి. – జె.కీర్తన, కమలాపురం గుణపాఠాలు నేర్వకపోవడం శోచనీయం మా పాప ఫిర్దోస్కు ఇంటర్లో 922 మార్కులు వచ్చాయి. నీట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షను ఇంత అధ్వానంగా నిర్వహించడం దారుణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జరిగిన సంఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్షను నిర్వహించాలి. – షేక్ బాషు, విద్యార్థిని తండ్రి, కమలాపురం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే వైద్య వృత్తిపై ఎన్నో ఆఽశలు పెట్టుకుని నీట్ పరీక్ష రాస్తే ఎక్కడో పేపర్ లీక్ అయిందని దేశ వ్యాప్తంగా పరీక్షను రద్దు చేయడం బాధాకరం. నా కుమారుడు గురు ప్రవీణ్రెడ్డి పరీక్ష బాగా రాశాడు. ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పరీక్ష రద్దు అయిందని తెలియగానే తేగా ఆందోళన చెందుతున్నాడు. పకడ్బందీగా పరీక్షను నిర్వహించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. –కంకర అపర్ణ, విద్యార్థి తల్లి, చిన్నవెంతుర్లగ్రామం, మైలవరం మండలం -
వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం
కడప అర్బన్ : వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు తెలిపారు. కడప నగర శివారులోని రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల(ఐఎంహెచ్)లో మంగళవారం నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల స్థాపించి రెండేళ్లు అయిందని, అప్పటి నుంచి ఈ వైద్యశాలలో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది బాగా పని చేసి వైద్యశాలకు రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని నిలబెట్టారని తెలిపారు. ఇదే విధంగా వైద్య సేవలు స్ఫూర్తిదాయకంగా కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏవో, డైటీషియన్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మైదుకూరు : బతుకు దెరువు కోసం డ్రిల్లింగ్ పని చేస్తూ విద్యాదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నంద్యాల రోడ్డులోని ఎంపీపీ మెయిన్ స్కూల్ సమీపంలో మంగళవారం ఉదయం దెబ్బతిన్న ఓ ఇంటి మెట్లను తొలగించేందుకు డ్రిల్లింగ్ చేస్తూ కై పు రాజేష్ అలియాస్ ఘని (37) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. డ్రిల్లర్కు ఉన్న వైర్లు షార్టేజ్ కావడంతో రాజేష్ విద్యుదాఘాతానికి గురైనట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని, మరికొందరు అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పట్టణంలో గాంధీనగర్కు చెందిన రాజేష్కు జోసెఫ్ పేటకు చెందిన కవితతో 15 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతి గురించి తెలియగానే అతని భార్య కవిత, తల్లిదండ్రులు మైఖేల్, సంతోషమ్మ ఆస్పత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు. మైదుకూరు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యం: ఎస్పీ
కడప కోటిరెడ్డిసర్కిల్: మనుషులంతా ఒక్కటేనని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటిచెప్పి శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని నిరూపించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కడప నగరంలో జరిగిన శోభా యాత్రలో ముస్లిం సోదరులు హిందు సోదరులను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ, నీరు, పానీయాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తదితరులు మాట్లాడుతూ ఇది హిందూ– ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. హిందూ ముస్లిం అంతా ఒక్కటేనని అందరు కలిసి ముందుకు పోవాలన్నా రు. కడప నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు అందరు కలిసి మెలిసి ఉన్నారన్నారు. నగరంలో అందరూ కలిసి, మెలిసి ఉండాలనే భావనలో ఉన్నారని, కడపలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హిందూ ముస్లిం సోదరులలోని అమాయకులను జిల్లా పోలీస్ శాఖ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి, నేతలు అమీర్బాబు, అఫ్జల్ఖాన్, శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, హిందూ, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే సచికేత్ విశ్వనాథ్, చిత్రంలో హిందూ, ముస్లిం నేతలు శోభాయాత్రలో స్వామి వారు -
ఆశావహులకు నిరాశే..
నీట్ ప్రవేశ పరీక్ష బాగా రాశామనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇది నిరాశజనక వార్తే. పరీక్ష రద్దుకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే లక్షల మంది మానసికక్షోభకు గురిచేసిన వారికి ఇంక మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయాలంటే భయం కలిగేలాగా శిక్ష ఉండాలి. అలాగే మళ్లీ పరీక్ష రాయనున్న విద్యార్థులు ఎలాంటి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. – డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి, సైకాలజిస్ట్ -
విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ: విద్యార్థి దశ నుంచే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని డీఎస్డీఓ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక బెంగుళూరు రోడ్డులోని గురు హాకీ క్లబ్ వేసవి శిబిరాన్ని సందర్శించారు. వేసవి శిబిరంలో శిక్షణలో మెళుకువలు నేర్చుకోవాలన్నారు. హాకీ క్రీడకు మదనపల్లెలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఎంతో మంది జాతీయ,రాష్ట్ర స్థాయిలో రాణించారన్నారు. హాకీ పితామహుడు ధ్యాన్చంద్ మదనపల్లెలో హాకీ క్రీడను క్రీడాకారులను నేర్పించారన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్ గురుభాస్కర్,పి.ప్రసాదరెడ్డి, కోచ్లు నౌషాద్,గౌస్, విష్ణు, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ‘రైతు పండుగ‘ను విజయవంతం చేయాలి
కలెక్టర్ శ్రీధర్ కడప సెవెన్రోడ్స్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఉద్యానవన పంటలలో నూతన ఆవిష్కరణలు, మార్కెట్ అవకాశాలను ఒకే వేదికపై పరిచయం చేసే ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ఈనెల 22–24వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్న ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, స్టార్టప్ సంస్థలు, వ్యాపార వేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద అగ్రి – హార్టికల్చర్ ఎక్స్పోగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను జూన్ 1వ తేదీలోపు పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ డాక్టర్ నిధి మీనా, కేఎంసీ కమిషనర్ హెచ్ఎస్ భావనతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా అందించేందుకు వినూత్నంగా అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ నెల 28 లోపు అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తి చేసి.. రెండు రోజులు ట్రయల్ రన్ కూడా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలోసీపీఓ హజరతయ్య, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, డిఎవో శంశుద్దీన్, నేచురల్ ఫార్మింగ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, హౌసింగ్ పీడి రాజరత్నం, ఏపీఎస్పీడిసిఎల్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలతో కడప స్ఫూర్తి పరిశ్రమలు, మౌలిక వసతులు, రోడ్లు, ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, పెట్టుబడులు వంటి అంశాలతో పాటు వినూత్న ఆవిష్కరణలతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రానికి స్ఫూర్తినిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు – వాణిజ్యం (గనులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర– 2047 విజన్కు అనుగుణంగా వైఎస్సార్ కడప జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి వివరించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల అభివద్ధి, వ్యవసాయ పురోగతి తదితర అంశాలపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సమర్పించారు. -
ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది
మా పాప నందినిని విజయవాడలోని గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్తోపాటు రెండు సార్లు లాంగ్టర్మ్ నీట్ కోసం రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నీట్ పరీక్ష బాగా రాసింది. ఫలితాలకు సంబంధించి విడుదలైన ప్రాథమిక కీలో 720 మార్కులకు 590 మార్కులు వచ్చాయి. కోచింగ్ సెంటర్ వాళ్లు కూడా మంచి కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలపైన నీళ్లు చల్లారు. మళ్లీ కోచింగ్కు పంపాలంటే ఆర్థికభారమే. – పోలిరెడ్డి, చిన్నాయపల్లె, బి. మఠం మండలం మళ్లీ కోచింగ్కు పంపాలి నీట్ రద్దు కావడంతో మళ్లీ మా పాప వర్షిణిని కోచింగ్కు పంపాలి. ఇది ఆర్థికబారం కానుంది. ఈ సారి మా పాప నీట్ పరీక్ష బాగా రాసింది. ప్రాథమిక కీ లో కూడా 589 మార్కులు వచ్చాయి. సీటు ఖచ్చితంగా వస్తుందని నిపుణులు కూడా తెలిపారు. ఇంతలో నీట్ రద్దని ప్రకటించారు. ఈ ప్రభావం పిల్లలపైన ఎలా చూపుతుందో తెలియని పరిస్థితి. 2024లో కూడా నీట్ నిర్వహణలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రద్దు చేయలే. కానీ ఇప్పుడు రద్దు చేశారు. – ఆనందరెడ్డి, కడప. నీట్ పరీక్ష రద్దు వల్ల విద్యార్థుల్లో ఆందోళన విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించి నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –షేక్ అమీర్బాషా, విద్యార్థిని తండ్రి, దువ్వూరు -
ఘనంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట : గండి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయన తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం పలు పూజల్లో పాల్గొని గత ప్రభుత్వంలో గండి అభివృద్ధికి మంజూరు చేసిన రూ.28.5 కోట్ల పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి, రితేష్రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయాలకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సహజత్వం లేకుండా గోపురాలపై ఈ రంగులేంటి? సంస్కృతి సంప్రదాయాలతోపాటు సహజత్వం ఉట్టిపడేలా రాతితో నిర్మించిన ఆలయంలో గోపురాలకు ఈ రంగులేంటని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఆయన మంగళవారం గండికి విచ్చేశారు. ఈ సందర్భంగా కుంభాభిషేక ఏర్పాట్లపై పరిశీలించారు. స్వామి వాహనమైన ఒంటె, బలిపీఠాలకు వేసిన రంగులపై కూడా ఆయన పెదవి విరిచారు. వెంటనే వాటికి రంగులను తొలగించి సహజత్వం కనిపించేలా చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు కూడా అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ సందర్భంగా పలువురు గండిలో జరుగుతున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏమైనా ఉంటే తనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, కడప దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ తదితరులు ఉన్నారు. -
అట్లూరు మండల వాసి ఎన్వీహెచ్ కంపెనీలో మృతి
అట్లూరు : అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు(24) అనంతపురంలోని ఎన్వీహెచ్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందాడు. అతను శుక్రవారం మిషనరీలో పడి మృత్యువాత పడ్డాడు. అయితే అతను కియా కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్త వచ్చింది. అది కియా కంపెనీ కాదు.. కియాకు సప్లైర్ కంపెనీ అయిన ఎన్వీహెచ్ కంపెనీగా గమనించగలరు. ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చింతకొమ్మదిన్నె : మండల పరిధి సీఎంఆర్ పల్లె సమీపంలోని అంగడి వీధిలో నివసించే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గోపాలక్రిష్ణ భార్య రేణుకాదేవి(54) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. ఆమె గత నెలలో కూడా రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుడి చేతికి గాయాలు కాగా చికిత్స పొందినట్లు వారు పేర్కొన్నారు. మృతురాలి భర్త గోపాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. నియామకం కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానానికి గవర్నమెంట్ ప్లీడర్గా సీనియర్ న్యాయవాది ఎం.సురేష్ కుమార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను జిల్లా కోర్టులో వాదించనున్నారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ జీపీగా ఆదినారాయణరావు వ్యవహరించారు. అల్మాస్పేట ఘటనలో ముగ్గురి అరెస్ట్కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్మాస్పేట ఘటనలో ఒకవైపున నిందితులుగా వున్న వారిలో బాబుభాయ్, షబ్బీర్ హుసేన్, జాకీర్లను పోలీసు అధికారులు, సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని కడపలోని కోర్టులో హాజరుపరిచారు. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి పుంగనూరు : వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని పట్రపల్లె తండాకు చెందిన గణేష్నాయక్ కుమారుడు వరుణ్నాయక్(14), మణి నాయక్ కుమారుడు నిలేష్నాయక్(8) కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరూ మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలసి హుటాహుటిన వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. వారి మృతదేహాలకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
పులివెందుల రూరల్ : మండల పరిధిలో కొంత మంది యథేచ్ఛగా కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ఇలా ట్రాక్టర్లలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది!
జమ్మలమడుగు(ఎర్రగుంట్ల) : ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన సుగుణమ్మ అనే వృద్ధురాలు తన కుమారులు తనకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వనాథ్రెడ్డి సుగుణమ్మ బాధ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సుగుణమ్మ కుమారులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. తల్లిదండ్రులను పొషించే బాధ్యత పిల్లలపైనే ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం సుగుణమ్మ కోరిక మేరకు తిప్పలూరులో ఉన్న ఎద్దుల పెద్ద శేషయ్య అనాథాశ్రమానికి చెందిన నిర్వాహకుడు నాగేంద్రకు స్టేషన్కు పిలపించుకుని.. ఆమెను బాగా చూసుకోవాలంటూ సూచించారు. ఆమెను ప్రత్యేక ఆటోలో తిప్పలూరు అనాథశ్రమానికి తరలించి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళి, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఉండి అనాథగా మిగిలిన అమ్మ కుమారులు అన్నం పెట్టడం లేదంటూ ఆవేదన పోలీసులను ఆశ్రయించిన వైనం‘అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు’ అనేది సామెత. అది అక్షర సత్యమవుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎర్రగుంట్ల పట్టణంలో జరిగింది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లికి కనీసం అన్నం పెట్టలేదు కన్న కొడుకులు. వృద్ధురాలైన అమ్మను, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. పట్టించుకోవడం మానేశారు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించి.. అనాథాశ్రమానికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. -
‘పచ్చ’పైత్యంతో పిచ్చి రాతలు
సాక్షి ప్రతినిధి కడప: పచ్చ కామెర్లకు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఎల్లో మీడియా తన పైత్యాన్ని అనునిత్యం ప్రదర్శిస్తుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రి కడప నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో రోగుల సహాయకులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.1.2 కోట్లు సొంత నిధులు వెచ్చించి భవనం, వసతి, డైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2019 నుంచి ఆరేళ్లుగా నిరాటంకంగా రోగుల సహా యకులకు భోజన వసతి కల్పించామన్నారు. ప్రతిరోజు ఉదయం 350–450 మంది వరకు, సాయంత్రం 220–250 మంది వరకు భోజనం చేసేవారన్నారు. తమ సిబ్బంది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరితో వసూలు చేయకుండా, ముందస్తు టోకన్లు జారీ చేసి ఉచిత భోజనం కొనసాగించామని వివరించారు. ఆరేళ్లుగా నిరాంటకంగా ప్రతిరోజు భోజన వసతి దాదాపు 700 మందికి కల్పిస్తుంటే, ఒక్కరోజుగా గుర్తించని ఈనాడు పత్రిక ఎల్లో పైత్యాన్ని ఎక్కించుకుని అడ్డగోలు రాతలు రాసిందని మండిపడ్డా రు. అక్కడ నియమించిన మేనేజర్ భోజన, వసతిలో తప్పిదాలు చేయడం వల్ల తొలగించామన్నా రు. సిబ్బంది సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపి వేశామన్నారు. దానిని పట్టుకుని ఈనాడు తన పైత్యాన్ని ప్రదర్శించిందని ధ్వజమెత్తారు. ఛారిటబుల్ ట్రస్టుపై ఈనాడు పిచ్చి రాతలు ఆరేళ్లుగా నిరాటంకంగా రెండు పూటల భోజనం డైలీ 700 మందికి భోజన ఏర్పాట్లు ఈనాడు రాతలపై మండిపడ్డ పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి -
మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి రిమాండ్
కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 6వ తేదీన హత్యకు గురైన కల్లమల్ల పెద్ద దస్తగిరి (53) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కడపలోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మంగళవారం ఆదేశించారు. నిత్యానందరెడ్డి ఈ నెల 11వ తేదీన కడపలోని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఎదుట న్యాయవాది నాగిరెడ్డి ద్వారా లొంగిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిత్యానందరెడ్డిని హత్య కేసు విచారణాధికారి ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మంగళవారం నిత్యానందరెడ్డిని పోలీసులు కడప రిమ్స్కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకునివెళ్లారు. తరువాత కడపలోని కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు. చిన్నచౌక్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి, రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్, ఎస్ఐ చంద్రమోహన్ తమ సిబ్బందితో కలిసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. -
తడ‘బడి’తే తప్పదు మూల్యం
కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పేర్లతో నూతన బ్రాంచ్లు ఎక్కువయ్యాయి. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదో లేనిదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. ఆమోదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవే టు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అను మతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులింటేనే పాఠశాలలను నిర్వహించాలి. వీటిపై ఆరా తీయండి.. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి రికగ్నైజేషన్ పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం తప్పనిసరి. రికగ్నైజేషన్ పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచ్ల పేరుతో పాఠశాలలు, కళాశాలలు నడుపుతూ ఎక్క డో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు విచారణ చేసి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ● తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ● ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి. ● మౌలిక వసతులతోపాటు బాత్రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. విద్యార్థుల మానసిక, శారీకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి. ● అర్హత గల ఉపాధ్యాయులు బోధనలు చేస్తున్నారా లేదా పరిశీలించాలి. ● ప్రాఽథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలు అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. ● సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాన్ని పరిశీలించాలి. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి. ● జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు అర్పే పూర్థి స్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి. ● ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్న వారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడుతాయి. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త ముందస్తు అడ్మిషన్లతో అప్రమత్తత అవసరం ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోస పోకండి పాఠశాలల గురించి తెలుసుకున్నాకే చేర్పించాలినిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్తోపాటు ప్రభుత్వ రికగ్నైజేషన్ పొంది ఉండాలి. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థలను ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను చేర్పించాలి. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్కడపజిల్లా -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పరీక్షా కేంద్రాలలో ఆన్లైన్ విధానంలో 9 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఏపీ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఉదయం, సాయంత్ర రెండు సెషన్స్కు సంబంధించి 1668 మందికిగాను 1567 మంది హాజరుకాగా 101 మంది గైర్హాజరయ్యారు. -
24 మంది విద్యార్థులు డిబార్
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల్లో 24 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. మంగళవారం అన్నమయ్య జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.సుభోష్ చంద్ర విస్తృతంగా తనిఖీ చేశారు. గాలివీడు ఆర్.ఆర్.జి.ఆర్ డిగ్రీ కాలేజీలో 20 మంది, రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు విద్యార్థులు కాపీలు రాస్తుండగా గుర్తించి డిబార్ చేశారు. చిన్న మండెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. ప్రొద్దుటూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోడౌన్లో నిల్వ ఉన్న రూ.కోటి 71 లక్షల విలువైన ఇనుపకడ్డీలు మాయమైనట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గోడౌన్లో 270 టన్నుల ఇనుప కడ్డీలను నిల్వ ఉంచగా ప్రస్తుతం 2.3 టన్నులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రకారం రూ.1.71 కోట్ల విలువైన 268.56 టన్నుల ఇనుప కడ్డీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి.రాజారత్నంతోపాటు ప్రొద్దుటూరు ఇన్చార్జి ఈఈ రాజశేఖర్, రాజంపేట ఈఈ ఎం.మురళి గోడౌన్ను పరిశీలించారు. వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లాలోని ఎండోమెంట్ పరిధిలో ఉన్న 316 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకంను వర్తింపజేస్తున్నట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం స్థానిక నిమ్మనపల్లి రోడ్డు లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆలయాలను పరిరక్షిస్తూ నిత్య పూజలు, కైంకర్యాల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో అర్చకులు నిర్లక్ష్యం వహిస్తే నిధులను రద్దు చేస్తామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రామసముద్రం: రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో లక్ష్మీ నరసయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గది, ఫార్మసీ, వాక్సిన్ రూమ్, లేబర్ రూమ్, వార్డులను పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేసి అక్కడున్న రోగులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. సాక్షి, మదనపల్లె: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా విస్తత స్థాయి సమావేశం ఈనెల 15న నిర్వహించనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణ మంగళవారం తెలిపారు. స్థానిక బైపాస్ రోడ్డులోని జీనత్ కళ్యాణ మండపంలో జరిగే ఈ సమావేశానికి ఎస్సీ విభాగం జిల్లా కమిటీ, ఎస్సీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీకి చెందిన వివిధ భాగాలకు చెందిన ఎస్సీ నాయకులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి ఎస్సీ విభాగాల కమిటీలు, నాయకులు హాజరుకావాలని కోరారు. సమావేశానికి రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గడి కోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలిపారు. -
లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి హైవేలో సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. నడి రోడ్డుపై వెళుతున్న లారీ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడి స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఫైరింజన్కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో లారీ మంటల్లో తగలబడిపోయింది. డ్రైవర్ సురేష్ గమనించి లారీ నుంచి వెంటనే దిగేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి బెల్గాంకు సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో ఆ లారీ వెళ్తుండేది. లారీ కంటేవారిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా వెనుక టైరు పగిలిన శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి డ్రైవర్ సురేష్ బండి దిగి చూడగా అప్పటికే లారీ నుంచి మంటలు చెలరేగాయి. వెనుక టైరు పగిలి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకు దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు లారీని కమ్ముకున్నాయి. చూస్తుండగానే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలు నిలువునా ఎగసి పడుతుండడంతో ఆర్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ రావడానికి ఆలస్యం అయ్యింది. అందరూ చూస్తుండగానే లారీ కాలిపోయింది. లారీతోపాటు సిమెంటు బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా. తర్వాత ఫైరింజన్ రావడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. -
ఘనంగా ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవం
కడప అర్బన్ : కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.జమున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్య రంగంలో అత్యంత బాధ్యతాయుతమైన విభాగమన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలు, వృత్తిధర్మాలు, నిజాయితీ, సేవాభావం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎం.బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.శాంతి, డాక్టర్ అబ్దుల్ ఖాలిద్, డాక్టర్ జి.దినేష్, డాక్టర్ కె.అనుదీప్, డాక్టర్ జి.మౌనిక, డాక్టర్ ఎన్.నవీన్వర్ధన్, డాక్టర్ బి.జోనాథన్, డాక్టర్ వై.అరవింద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
చాపాడు : చాపాడులోని పాత అల్లాడుపల్లె రైతు సేవా సహకార సంఘం బ్యాంక్ ఆవరణలో మంగళవారం మద్యం అధికంగా తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుచ్చుపాప గ్రామానికి చెందిన సంబటూరు నాగసుబ్బయ్య(40) ఇంటి నుంచి ఉదయాన్నే చాపాడుకు వచ్చి సొసైటీ బ్యాంక్ వద్ద అధికంగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మద్యం మత్తులో కిందపడి ఎంతసేపటికీ లేవకపోవడంతో సమీపంలోని హోటల్లో ఉన్న మహిళలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఆధారాలను వెతికి చూడగా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కుచ్చుపాప గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. నాగసుబ్బయ్య మద్యానికి బానిస అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బాగా రాశాను, మరోమారు పరీక్షించుకోవాలి..
చైన్నె వేలామ్మల్ విద్యాలయంలో చదివాను. నీట్–యాజీ పరీక్ష కోసం బాగా కష్టపడ్డాను. అంతే ధీమాగా పరీక్ష రాశాను. కీ పరిశీలిస్తే దాదాపు 661 మార్కులు రానున్నాయని అంచనా దక్కింది. పరీక్ష అయిపోయింది. కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వచ్చాం. దాదాపు 10రోజులుగా పుస్తకాలు పట్టలేదు. తిరిగి పరీక్షించుకోవాల్సి రావడం దురదృష్టకరం. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టచర్యలు చేపట్టాలి. – మనీష్, విద్యార్థి, చైన్నె. -
మండే ఎండ.. జాగ్రత్తలే అండ!
రాజంపేట టౌన్ : భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదాకా ఎండలు మండిపోతున్నాయి. మనిషి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో వాహనాలను కాపాడుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాహనాలు ఎండలో గంటల కొద్ది ఉండటం వల్ల ముఖ్యంగా పెట్రోల్ ఆవిరి అయిపోతుంది, అలాగే వాహనం రంగు వెలిసిపోతుందని మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంకు నిండా పెట్రోల్ పట్టిస్తే ఒక్కోసారి వాహనం పేలి దగ్దం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వేసవి కాలంలో వాహనాలపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. ● వాహనాలు ఎక్కువసేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పెట్టుకోవాలి. ● దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు ఎక్కువ వేడెక్కే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఇంజిన్ను కాసేపు నీడలో నిలిపితే మంచిది. లేకుంటే ఒకొక్క మారు ఇంజిన్లో మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంటుంది. ● అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గుతూ ఉంటుంది. కనీసం వారానికి ఒకమారైనా వాహనాల్లో గాలిని తనిఖీ చేయించుకోవాలి ● వేసవి కాలంలో వాహనాలకు గాలి తగిన మోతాదులో మాత్రమే పట్టించాలి. ఎక్కువ మోతాదులో పట్టిస్తే టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. ● పెట్రోల్ను పగలు కంటే సాయంత్రం వేళల్లో పట్టించడం మంచిది పెద్ద వాహనాలకు ఇలా చేయాలి.. ● కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి ● నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడటం మంచిది. ● వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా ఎప్పటిప్పుడు పరిశీలిస్తుండాలి. ● గ్యాస్ ద్వారా వాహనాలను నడిపేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు అలాంటి వారు గ్యాస్కిట్ను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం ● ఏసీ నిల్వవుండాలంటే అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి ● వేసవి పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు కొత్త టైర్లను వాడితేనే మేలు లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గి పేలిపోయే ప్రమాదముంది. -
బైక్ డివైడర్ను ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి..
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పలి నాగమల్లేష్ (22) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన నాగమల్లేష్ బీటెక్ చదివాడు. సోమవారం పరీక్ష రాసి వచ్చిన అతను తన స్నేహితుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన మహేష్ను బస్సు ఎక్కించేందుకు బైక్లో బయలుదేరాడు. ఈ క్రమంలో బుడ్డాయపల్లె సమీపంలోకి రాగానే బైక్ డివైడర్ను ఢీ కొంది. ఈ ఘటనలో నాగమల్లేష్ అక్కడిక్కడే మృతి చెందగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. నాగమల్లేష్ తండ్రి చిన్న వెంకటేష్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
కన్నీటి మడుగు
గాలివీడు : మండలం పరిధి గండిమడుగులో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మతి చెందాడు.పోలీసుల కథనం మేరకు.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీ కుంట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ నాసిర్ (25) వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి గండిమడుగు వద్ద ఉన్న వెలుగల్లు పార్కును సందర్శించేందుకు వచ్చాడు. అనంతరం గండిమడుగులో ఈత కొట్టేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగి పోయాడు. యువకుడు నీటిలో కనిపించక పోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే గాలివీడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మతదేహాన్ని వెలికితీయించారు. -
ఎండ మండే వేళలో... మంచు కురిసేనెందుకో!
చౌడేపల్లెలో కాలం తిరగబడింది.. వేసవిలోనూ దట్టంగా కురిసిన పొగమంచుచౌడేపల్లె:అసలే మే నెల.. భానుడి భగభగలకు జనం విలవిలలాడాల్సిన సమయం. కానీ చౌడేపల్లె పరిసరాల్లో కాలం ఒక్కసారిగా తిరగబడింది. ఎండల తీవ్రతతో సెమటలు పట్టాల్సిన వేళ, చలికాలంలా మంచు తెరలు అలుముకోవడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు.మంగళవారం ఉద యం 8 గంటలైనా దట్టమైన పొగమంచు వీడకపోవడంతో చౌడేపల్లె వాసులు ఆశ్చర్యపోయారు. అసలే ఎండలు మండే మే నెలలో ఈ మంచు ముచ్చట్లు ఏమిటబ్బా అంటూ కాఫీ షాపుల వద్ద చర్చలు సాగాయి. మంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో కూడా వాహనాలకు లైట్లు వేసుకుని మంచు మబ్బుల్లో నెమ్మదిగా ప్రయాణిస్తున్న చిత్రాలు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డాయి. ప్రకృతిలో వస్తున్న ఈ వింత మార్పులను చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. –ఫొటో: రసూల్, చౌడేపల్లి -
ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉత్పన్నం
ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉందనేది నిత్యసత్యం. నేను హరిప్రియలో ఇటీవల ప్రయాణిస్తే నీళ్లులేవు. లాంగ్ ట్రైన్స్ అయితే నీళ్లు అయిపోతే, అడిగే నాథుడే లేకుండా పోతున్నాడు. తిరుమల, ఇంటర్సిటీ, హరిప్రియ, చైన్నె–ముంబై రైళ్లలో నీటి నిల్వలు ఎప్పుడో అయిపోయింటాయి. నీటి వాడకం లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారిపోతున్నాయి. గుత్తి–రేణిగుంట మధ్య అటు చైన్నె, ఇటు ముంబై రైళ్లకు సెంటర్పాయింట్గా నందలూరులో వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు నీటి సమస్య తీరుతుంది. –వేపగుంట శ్యామ్రాజ్, సంఘసేవకుడు, నందలూరు రైల్వేకేంద్రం -
సౌతాఫ్రికాలో కలిచెర్ల వాసి మృతి
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్లకు చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వివరాలలోకి వెళితే.. పెద్దమండ్యం మాజీ ఎంపీపీ పి. ప్రసాద్రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన కుమారుడు శ్రీకాంత్రెడ్డి సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా డు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడి, అలసటగా ఉందని చెప్పి కుప్పకూలినట్లు అతని స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుకు గురి కావడంతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మాజీ ఎంపీపీ తనయుని ఆకస్మిక మరణంతో కలిచెర్ల, యర్రగుట్టపల్లెలో విషాదం నెలకొంది. భార్య ఇటీవల స్వగ్రామానికి వచ్చి సౌతాఫ్రికాకు వెళ్లి 20 రోజులు అవుతోంది. మృతుని భార్య, బిడ్డను తిరిగి కలిచెర్లకు పంపించేందుకు అక్కడి కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీపీ తనయుని అకస్మిక మృతిపట్ల తంబళ్లపల్లె ఎమ్యెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్విండో మాజీ ఛైర్మన్ కలిచెర్ల సుధాహరరెడ్డి, ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డిలు దిగ్బాంతి వ్యక్తం చేశారు. రుణాల పేరిట మోసం సాక్షి, మదనపల్లె : రుణాలు ఇప్పిస్తామని, అందుకు సంఘాలు ఏర్పాటు చేయాలని నమ్మించిన ఇద్దరు మహిళలు అందిన కాడికి దండుకున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం బి.కొత్తకోట పోలీస్స్టేషన్కు చేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు. ఫరీదా అనే మహిళ, ఆమె కూతురు నస్రిన్ బి.కొత్తకోట పట్టణం, మండలానికి చెందిన మహిళలతో పరిచయాలు పెంచుకున్నారు. వారికి వివిధ పథకాలు మంజూరు చేస్తామంటూ నమ్మించారు. 13 నుంచి 15 మంది మహిళలను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి 38 సంఘాలను ఏర్పరిచారు. వీరికి రూ.ఐదు లక్షల దాకా రుణాలు ఇప్పిస్తామని అందుకు రూ.3 వేల దాకా ఖర్చవుతుందని చెప్పి వసూలు చేశారు. తర్వాత కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశారు. వారిని నమ్మి డబ్బు చెల్లించిన మహిళలకు రుణాలు అందక, కుట్టు మిషన్లు మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ విషయమై వారిని నిలదీయగా సమాధానం లేదు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్కు వచ్చిన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని కోరారు. -
14న జిల్లా రైతు సంఘం మహాసభలు
చింతకొమ్మదిన్నె : ఏపీ రైతు సంఘం కడప జిల్లా 6వ మహాసభ ఈనెల 14న సీకే దిన్నె మండలం గంగమ్మ తోపు ఆంజనేయస్వామిగుడి దగ్గర జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, దస్తగిరిరెడ్డి తెలిపారు. సోమవారం మహాసభకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 86 శాతం రైతులు చిన్న సన్నకారు రైతులే అని, సరైన మద్దతు ధర లేక, రుణాలందక అప్పుల బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని , డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ మహాసభలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి సమీక్షించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళిక రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి మహాజభకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి,చిన్న సిద్దయ్య,నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాయకులు, కార్యకర్తలను పట్టించుకోని కూటమి సర్కార్
పులివెందుల రూరల్ : టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఉన్న తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఇళ్లకు వెళ్లి వారిని కూడా ఆప్యాయంగా పలకరించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు లేదన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్థాయి వ్యక్తులను కలుస్తున్నారే తప్పా.. టీడీపీ సీనియర్ నాయకులను కలవడంలేదని అన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు (చంద్రబాబు) ఇక్కడ నుంచి 34మంది కార్యకర్తలను పిలిపించి మాతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఆ సంతోషంగా ఎంతోకాలం నిలబడలేదని, అధికారం వచ్చిన తర్వాత మాకు గౌరవ మర్యాదలు, కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని భావించామన్నారు. కానీ రెండేళ్లవుతున్నా టీడీసీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పిలిపించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. అధికారంలో ఉండేది ఐదేళ్లు కాబట్టి.. ఐదేళ్ల తర్వాత మా అవసరం వస్తుందని, దయచేసి మమ్ములను ఎన్నికలప్పుడు ఉపయోగపడే యంత్రాలుగా కాకుండా, మేం మనుషులమని, మీరు పిలిపించి మాట్లాడితే గౌరవం పెరుగుతుందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి హోదాలో కలుస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి -
ఈ–ఆఫీసు వినియోగం తప్పనిసరి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు తప్పనిసరి అని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ–ఆఫీసు ద్వారా ఫైళ్లు పంపాలని గత ఆరునెలలుగా ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని కార్యాలయాల్లో భౌతికంగానే ఫైళ్లు నడుపుతున్నారని తెలిపారు. ఇది క్రమశిక్షణా రాహిత్యమే కాకుండా చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రతి అధికారి తన లాగిన్కు వచ్చిన ఫైళ్లను రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఫైళ్ల పరిష్కారానికి 6–11 రోజుల సమయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో రీఓపెన్ అయిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏలో లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తొలగించిన వెంకటేశ్ అనే కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్ కోరారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ నిబంధనలు పాటించని ఈగల్ హంటర్ సెక్యూరిటీ సర్వీసు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ● తనభూమికి పాసు పుస్తకం మంజూరు చేయాలని కడపకు చెందిన వెంకట సుబ్బయ్య కోరారు. ● వేముల మండలానికి చెందిన చెంగల్రెడ్డి తనకు ప్రభుత్వ పెన్షన్ మంజూరు చేయాలని, కొండాపురం మండలానికి చెందిన కుమారి రేషన్కార్డు మంజూరు చేయాలని కోరారు. ● తన గ్రామ పొలం సర్వే నెంబరు 262/ఎలోని 19 సెంట్ల స్థలంలో తాను రేకుల ఇళ్లు, మరుగుదొడ్డి నిర్మించుకున్నానని కలసపాడుకు చెందిన నాగశేషయ్య తెలిపారు. ఆ స్థలం తాను శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానన్నారు. కాగా ఆ స్థలంలో బంగారు ఉందని చెబుతూ కొందరు తనను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా
వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్తోపాటు 15మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని గౌరీ నగర్, సంఘం వీధి, కరణంవీధి తదితర ప్రాంతాల నుంచి నందిపల్లె గ్రామ పొలాల్లోకి వ్యవసాయ కూలీ పనికి ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్ వేరే వాహనాన్ని తప్పించబోయి మట్టి కుప్పను ఎక్కించాడు. అధిక లోడు ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8మందికి తీవ్రంగా, మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ నిత్యానంద, వీరమ్మ, మహబూబ్ బీ, పద్మావతి, అమరావతి, అంజనమ్మ లక్ష్మీదేవిలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.15మంది కూలీలకు తీవ్ర గాయాలు -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
కలకడ : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. హెడ్కానిస్టేబుల్ ముజీర్ కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, ఎర్రకోటపల్లెపంచాయతీ, మల్లవరంవాండ్లపల్లె గ్రామానికి చెందిన మల్లూరి.రవీంద్రరెడ్డి కుమారుడు చంద్రశేఖర్రెడ్డి (22) స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బొంతలవారిపల్లెలో జరిగే జాతరకు బయలుదేరాడు.మార్గమధ్యలో బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సూచికబోర్డును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ ముజీర్ తెలిపారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2026 నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్)విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 14846 మంది ఇంజనీరింగ్కు, 3985 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనున్నారు. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్న సెషన్కు 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా... ఏపీ ఈపీపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఆరు, ప్రొద్దుటూరులో రెండు, రాజంపేటలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషయంలో హాడావుడి పడకుండా చూసుకోవాలి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
లైంగిక వేధింపులపై కేసు
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పారిశుధ్య కార్మికురాలైన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఏడాది కాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేదిస్తున్నాడని బాధితురాలు పిర్యాదు చేసింది.ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నియామకంకడప వైఎస్ఆర్ సర్కిల్ : కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షునిగా దాసరి శ్రీనివాసులు నియమించినట్లు డీసీసీ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి పేర్కొన్నారు. సోమవారం కడపలోని ఇందిరాభవన్లో శ్రీనివాసులుకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, ఏఐసీసీ కోఆర్డినేటర్ అబ్దుల్ సత్తార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూరతోటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజమ్మలమడుగు : నిరుపేద రజక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు, అందుకోసం దరఖాస్తులు చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కారదర్శి లక్షుమయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన నిరుపేదలైన రజక విద్యార్థులకు ఆర్థికం సాయం చేయడంకోసం రజక వేల్పేర్ ఆసోషియేషన్ తరపున తీర్మానం చేసినట్లు చెప్పారు. పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు 500కంటే ఎక్కువ మార్కులు, అలాగే ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్కాలేజీల్లో చదువుకుని అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అత్యధిక మార్కులు సాధించిన వారిని డ్రా తీసి వైఎస్సార్సీపీ రజకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు లోగిడి జయన్నతో కలిసి తమ సొంత నిధులు వెచ్చించి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల రజక విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. వివరాలకు 9949669637,9505502212 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హత్యకేసులో నిందితులు అరెస్టులక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, బీసీ కాలనీకి చెందిన చిన్నక్క హత్యకేసులో తల్లీ, కొడుకులైన సావిత్రి, వేణులను సోమవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. పందిళ్లపల్లి కస్సాలోని పసుపులేటి చిన్నక్క (65) ఒకే బజారులో ఉన్న సావిత్రి, వేణులు ఏప్రిల్ 25న ఇంటిముందర గొడవపడ్డారు. తల్లీ కొడుకులు చిన్నక్కను గోడకేసి కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో తిరుపతికి తరలించారు.అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెపారు. దీంతో ఆమెను ఈనెల 7న పందెళ్లపల్లికు తీసుకువచ్చారు.అదేరోజు రాత్రి మృతి చెందింది. సావిత్రి, వేణులు కొట్టిన దెబ్బలకు మా అత్త మృతి చెందినట్లు చిన్నక్క కోడలు రామాంజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
మైనర్లు, అమాయకులను వదిలేయండి
కడప కార్పొరేషన్: కడప నగరం అల్మాస్పేటలో ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్బాబులతో కలిసి ఆయన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు కడపలో ఏనాడూ జరగలేదన్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన మైనర్లు, అమాయకులు, సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి, వివిధ జైళ్లకు పంపించారన్నారు. మరో మారు విచారించి సంబంధం లేని వారిని విడుదల చేయాలన్నారు. అల్మాస్పేట నాలుగు రోడ్ల కూడలి కావడంతో అటు, ఇటు వెళ్లే వారంతా అక్కడకు చేరుకుని గుమికూడారని, వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఘటనతో సంబంధం ఉన్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, సంబంధం లేనివారు, అమాయకులు, మైనర్లపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టి విడుదల చేయాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి కడపను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, తోటక్రిష్ణ, షఫీ, షఫీవుల్లా, శ్రీరంజన్రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఘటనతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోండి ఎస్పీతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు -
14న అండర్–14, 16 క్రికెట్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న అండర్ 14 16, బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు . ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కాపీ,బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), లాస్ట్ 3 సంవత్సరాల మార్కులిస్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అండర్– 16 ఎంపికలకు 2010 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. అండర్ –14కి 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వివరించారు. ప్రొద్దుటూరు కల్చరల్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రచారార్థం జయహో బీమా సంకల్ప్ మెగా మేళాను ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి.కిరణ్ సోమవారం తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో జయ హో బీమా సంకల్ప్ నిర్వహించనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ రేట్లు అందిస్తూ, ఇతర బీమా సంస్థలతో పోలిస్తే ప్రజ లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి గ్రామస్తుడు తమ సమీపంలోని పోస్టా ఫీసు ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరవచ్చని పేర్కొన్నారు. కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 24 మందికి గాను 21 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: గతంలో ఓకా–మధురై–ఓకా మధ్య స్పెషల్ రైలు నడిచేదని, దాని స్థానంలో ఓకా–తిరుపతి (19560), తిరుపతి–ఓకా (19559) వీక్లీ రెగ్యులర్ రైలుగా నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి సోమవారం ఓకాలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి ద్వారక, కంబాలియా, జామ్నగర్, రాజ్కోట్, సురేంద్రానగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, అకోల, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూలు, డోన్, తాడిపత్రి మీదుగా కడపకు మరుసటిరోజు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి రాత్రి 11.30 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి గురువారం తిరుపతిలో ఉదయం 8.15గంటలకుబయలుదేరి ఇదే మార్గంలో శనివారం రాత్రి 11.50 గంటలకు ఓకా చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కడప కార్పొరేషన్: జిల్లాలో ఇటీవల అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఏపీ ట్రాన్స్ కో కీలకమైన అభివృద్ధి పనులను చేపడుతోందని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యరగ్రుంట్ల 220/132 కేవీ సబ్స్టేషన్లో ఒక 160కేవీఏ, 220/132 కేవీ వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తయిన తర్వాత, జిల్లాలో విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరిగి, భవిష్యత్ లోడ్ అవసరాలను సులభంగా తీర్చగలుగుతామన్నారు. ఈ అత్యవసర పనులను సురక్షితంగా నిర్వహించడానికి ఈనెల 11 నుంచి 24వ తేది వరకూ జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో పగటి పూట స్వల్ప కాలి క, తాత్కాలిక అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అవసరమన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు భరత్ (20) ద్విచక్ర వాహనంలో పులివెందులకు వెళ్లి పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. కదిరి రోడ్డులో వస్తుండగా.. కదిరి నుంచి పులివెందుల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్కు తీవ్ర గాయాల య్యాయి. యువకుడిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భూకబ్జాలు ఆపాలని ధర్నా
గోపవరం : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంతంలో జరుగుతున్న భూకబ్జాలను వెంటనే ఆపాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారికి అండగా నిలుస్తున్నారని వారు ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని రూపరాంపేటలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క పేదవాడికి కూడా స్థలం ఇవ్వకపోగా కనీసం ఇళ్లు కూడా మంజూరు చేయలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు కేటాయించాలన్నారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నాగరాజు, మహిళా సంఘం నాయకురాలు విజయమ్మ, ఏఐవైఎఫ్ నాయకులు మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఉదయమే ‘ములాఖత్’
కడప అర్బన్: రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్కు అవకాశం ఉంటుందని కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండుటెండల నుంచి రక్షణ పొందడానికి వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ములాఖత్కు వచ్చే వారు మారిన సమయాన్ని గుర్తించి, అధికారులకు సహకరించాలని కోరారు. చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నాలుగోరోజు సోమవారం పలు కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ మహాయజ్ఙం, తుంబూర వేషాలంకారంతో పాటు నాగవళ్లి దళాలతో(తమలపాకులతో) సహస్ర నామార్చన నిర్వహించారు.అనంతరం శాత్తమొరై జరిపారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతలకు కార్పొరేషన్ అధికారులు బందీగా మారారు. నిబంధనలకు పాతరేస్తూ.. పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన గాలికొదిలేశారు.. కూటమినేతలు చెప్పిందానికల్లా తలాడిస్తూ.. చట్టాన్ని వారి చుట్టంగా మార్చేశారు.. ఫలితంగా వ్యవస్థ గాడితప్పింది.. సమాజంలో శాంతిభ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. ఏదైనా సంఘటన జరిగేదాకా కళ్లు తెరవనంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపలో కార్పొరేషన్ అధికారుల అడ్డగోలు నిర్ణయాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సిన వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. అధి కార పక్షం అభిమానం దక్కితే చాలన్నట్లుగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాల్సిన జిల్లా సర్వోన్నతాధికారి చూస్తుండిపోతున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన కడపలో ఘర్షణలకు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే సమాజానికి భారీ కీడు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా అధికారపార్టీని మెప్పిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తోంది. అధికారపక్షం ఏం చేసినా వత్తాసుగా నిలవడం మినహా, నిబంధనలకు వ్యతిరేకమని చెప్పే సాహసం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చలానా స్వీకరణలో నిర్లక్ష్యం... కార్పొరేషన్ పరిధిలో ప్లెక్సీలను చలానా చెల్లించి ఏర్పా టు చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టానుసారం ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 3రోజులకు 10/15 ప్లెక్సీకు రూ.15వందలు చలానా చెల్లించాలి. ఇతరులను రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కంటెంట్ ఉందా లేదా పరిశీలించి అనుమతించాల్సిన బాధ్యత కూడా కేఎంసీదే. ఇవేవీ గత కొంతకాలంగా కేఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి ధోరణిలోనే తగిన చలానాలు స్వీకరించకుండా.. కంటెంట్ను పట్టించుకోకుండా అల్మాస్పేట సర్కిల్లో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలకు అవకాశమిచ్చారు. వెరసి రెండు వర్గాలు విడిపోయి ఘర్షణలు దిశగా అడుగులు పడ్డాయని పరిశీలకులు వివరిస్తున్నారు. ఇన్చార్జి కమిషనర్పై చర్యలు... అల్మాస్పేటలో శనివారం చోటుచేసుకున్న ఉద్రికత్తలు, ఘర్షణలకు ప్రధాన కారణం ప్లెక్సీలు అనుమతేనని ఓ నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం కడప ఇన్చార్జ్ కమిషనర్ రాకేష్చంద్రను బదిలీ చేసింది. ఆస్థానంలో రాజంపేట సబ్కలెక్టర్ హెచ్ఎస్ భావనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పుతున్నప్పుడే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టి సారించింటే ఇలాంటి విపత్కర పరిస్థితి చోటుచేసుకునేది కాదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అధికారులు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తూ, ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నప్పుడు కలెక్టర్ కర్రపెత్తనం చలాయించాల్సి ఉంది. అలా కాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు అమలు చేయడంలోఅధికారయంత్రాంగం విఫలం అధికార పక్షానికి చుట్టంగామున్సిపల్ కార్పొరేషన్ అడ్డగోలు వ్యవహారమేఇరువర్గాల ఘర్షణలకు కారణం కడప కార్పొరేషన్ యంత్రాంగం నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు. ముందే చేసిన పనులు టెండర్లు పిలిచి కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. లెస్కు కోట్ చేసినా పనులు ఇవ్వకపోవడం.. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే టెండర్లు దక్కేలా ప్రణాళిక రచించడం వంటివి చేస్తున్నారు. దీనికి 4వ డివిజన్లో చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివర వరకూ రోడ్డు నిర్మాణానికి(టెండర్ ఐడీ 903811) పిలిచిన టెండరే ఉదాహరణ. ఇలా కేఎంసీలో అన్నీ విభాగాల అధికారులు అధికార పక్షం మెప్పుకోసమే తాపత్రయం చూపుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇక వైరిపక్షం ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద పుట్పాత్లు తొలగించడం కూడా కేఎంసీ చేస్తూ వచ్చింది. నగరమంతా అవే నిబంధనలు పాటించారా?అంటే అలాంటిదేమి లేదు. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లుగా కేఎంసీ చర్యలుండిపోయాయి. కేఎంసీ చర్యలే ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
ద్వారకకు రైలు!
రాజంపేట: జిల్లా మీదుగా నేరుగా గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు వెళ్లే వీక్లీ ట్రైన్కు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. జిల్లాలో ఓకా–తిరుపతి మధ్య 19560/19559 నెంబర్లతో ఈ రైలు నడవనుంది. ఈ నెల 19న ఓకా స్టేష్టన్లో అక్కడ ఎంపీ పూరంభీన్, ఎమ్మెల్యే పభూభా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ రైలుకు రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించారు. దేశంలో ప్రసిద్ధి చెందిన రెండు పుణ్యక్షేత్రాలను అనుసంధానంగా నడుస్తున్న ఈ రైలుకు భక్తుల నుంచి పెద్ద ఆదరణ వస్తుందని రైల్వే శాఖ భావిస్తుంది. ఓకా–తిరుపతి రైలు ఇలా ఓకా–తిరుపతి మధ్య (19560) వారంలో ఓకా నుంచి సోమవారం బయలుదేరుతుంది. 19550 నెంబర్తో వారంలో ప్రతి గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. కోచ్ పొజిషన్: ఓకా–తిరుపతి మధ్య నడిచే రైలుకు సెకెండ్ ఏసీ రెండు, థర్డ్ ఏసీ 3, స్లీపర్ల కోచ్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు రాష్ట్రంలోకి ప్రవేశించిన అనంతరం కర్నూల్ టౌన్, డోన్, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి స్టేషన్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో... ఇప్పటికే జిల్లా మీదుగా ద్వారకా వరకు దక్షిణ రైల్వే జోన్ వారు రామేశ్వరం నుంచి ఓఖా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నడుపుతున్నారు. కానీ ఈ రైలుకు రాజంపేట రైల్వే స్టేషన్లో సదుపాయం లేకపోవడంతో కడప లేదా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి నుంచి ద్వారకా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మొట్ట మొదటి సారి రాజంపేట రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్, రాజ్ కోట్, ద్వారకా లాంటి పట్టణాలతో ఈ నూతన రైలు ద్వారా అనుసంధానం ఏర్పడింది. ద్వారక ఆలయం జిల్లా మీదుగా పయనం కడప, రాజంపేటలో హోల్డింగ్ -
‘సీమ’ఎత్తిపోతలకు నీళ్లొదిలారు!
కడప సెవెన్రోడ్స్: సీమ ఎత్తిపోతల పథకంపై కూటమి సర్కార్ కుట్రలు పన్నుతోందన్న అనుమానం నిజమైంది. ఇరిగేషన్ క్యాలెండర్ సాక్షిగా సీమ ఎత్తిపోతల పథకానికి బాబు సర్కారు నీళ్లొదిలింది. రాయలసీమ వాసులకు మరోసారి మోసం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల సమావేశ సందర్భంగా ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్ను ప్రకటించారు. రాష్ట్రంలోని 25 సాగునీటి ప్రాజెక్టులను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారో గడువును నిర్ణయిస్తూ రూపొందించిన క్యాలెండర్ను ఆయన విడుదల చేశారు. ఇందులో రాయలసీమకు ప్రాణప్రదమైన ఎత్తిపోతల పథకం ఊసే లేదు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించే గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, వెలిగొండలతోపాటు చైన్నెకి తాగునీరు అందించడంలో అత్యంత కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తావన లేకపోవడంపై జిల్లాకు చెందిన పలువురు రైతు నాయకులు, వామపక్షాల నేతలు తప్పుబడుతున్నారు. ‘సీమ’ ప్రాజెక్టుల జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా అధికార టీడీపీ నేతలు పెదవి విప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తిపోతలు ఎందుకంటే.... శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు అవసరమైన సాగునీరు అందే వీలుండదు. ఇక 841 బెడ్లెవెల్లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇక చెప్పాల్సిన పనే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 80 శాతం జగన్మోహన్రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ‘సీమ’ ప్రాజెక్టులకు ప్రాణప్రదం రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించడంలో ఎత్తిపోతల పథకం ప్రాణప్రదమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ఒక్కటే రాయలసీమ అవసరాలు తీర్చలేదు. శ్రీశైలం ఫోర్షోర్లో 800 అడుగుల నుంచి నీటిని తీసుకొచ్చే ఈ పథకం ద్వారానే సీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. అలాంటి ప్రాజెక్టులు విస్మరించడం తగదు. ఈ విషయంలో అధికార టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే చరిత్ర క్షమించదు. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప ‘సీమ’ ద్రోహి చంద్రబాబు అననుకూల పరిస్థితుల్లో కూడా రాయలసీమ దాహార్తి తీర్చడంలో ఎత్తిపోతల పథ కం జీవనాడిగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంపై ఆయనకున్న వివక్ష వల్ల ఎత్తిపోతల పథకానికి మరణశాసనం వినిపించారు. దీంతో సీమ ద్రోహిగా నిరూపించుకున్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్లో సీమ ఎత్తిపోతల పథకానికి చోటు కల్పించకపోవడం ఈ ప్రాంతాన్ని శాశ్వత ఎడారిగా మార్చడమే. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి -
ఆధునిక ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి..ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు..అదే పెద్దతరం వారు వింటే పులకరించిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. కాలానికి పరిమితమైన వారు కాదు..తరతరాలకు గుర్తుండిపోయే మానవతావాది. గొప్ప దార్శనికుడిగా,రచయితగా అంతకు మించి విద్యావేత్తగా,ధార్మికుడిగా, తత్వవేత్తగా ఆయన ఫిలాసిపీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ,రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించాడు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్గా ఎదిగిన ఆయన 60 ఏళ్లకు పైగా ప్రపంచ దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించాడు. ప్రదానంగా సత్యాన్ని తెలుసుకోడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలరన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్రాలోచన కల్గించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి..టీచర్ విద్యార్థి లోని సృజనాత్మకతను తట్టి మేల్కొపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమ ఉన్న వారు మంచి తప్ప చెడు చేయలేరని చెప్పారు. మనిషి సంపూర్డుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటితరం వారు చిన్న పదవులు లభిస్తే వదలమన్నా వదలరు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్దురువును చేయాలని ఆర్డర్ ఆఫ్ది స్టార్ అనే సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని కూడా వదులుకున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయంపై అప్పట్లో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. ఇది అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలచిపోయింది.మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశాడు. మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. జిడ్డు కృష్ణమూర్తికి చదువు సంధ్యల పట్ల పెద్దగా ఆసక్తిలేకపోయినా 15 ఏళ్లవయస్సులో అట్ ది ఫీట్ ఆఫ్ది మాస్టర్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారు. మదనపల్లె పట్టణంలో 1895 మే 11న తల్లితండ్రులు సంజీవమ్మ, నారాయణయ్యకు ఎనిమిదో సంతానంగా జన్మించిన ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. వీటన్నింటి కన్నా దేశంలోని మదనపల్లె దగ్గరున్న రిషివ్యాలీ స్కూల్ ప్రత్యేకతను సంతరించుకుంది. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారితీసింది. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు సామాజిక అవసరాలను గుర్తించి మనిషిలో జ్ఞాన తృష్ణను రగిలిస్తాయి.ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించాడు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తి గురించి యావత్ ప్రపంచం కొనియాడుతోంది.నేడు జయంతి -
భక్తిలో మునిగారు
ఆలయం లేదు..మూలవిరాట్టులు లేరు..ఆలయం సోమశిల వెనుక జలాల్లో మునిగింది..అయినా గ్రామస్తులు ఏటా ఉత్సవ విగ్రహాలతో కల్యాణం చేయించి.. భక్తిపారవశ్యంతో పరమానందం పొందుతున్నారు.. అదెక్కడో కాదు..సోమశిల బ్యాక్వాటర్ పరీవాహక గ్రామం యల్లంపేట. దీనిపై ప్రత్యేక కథనం.. రాజంపేట: అది సోమిశిల వెనుకజలాలల్లో మునిగి పోయిన గ్రామం..యల్లంపేట .. చుట్టూ పచ్చటి పొలాలు..ఆహ్లాదకరమైన వాతవరణం. ఏరు ఉంటుంది. ఈ గ్రామంలో అప్పట్లో 300 కుటుంబాలకుపైగా నివాసం ఉండేవారు. యల్లంపేట, ఓబులంపేట రెండు గ్రామాలు ఉండేవి.ఈ గ్రామానికి చెందిన ఆలయం మునకలోకి వెళ్లిపోయింది. గ్రామస్తులకు పునరావాసం లేదు..ఆలయం నిర్మించలేకపోయారు. గ్రామంలో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీమంత్రి బండారు రత్నసభాపతి(ఓబులంపేట), ఎమ్మెల్యే లేని రోజుల్లో జిల్లా డిస్ట్రిక్బోర్డు మాజీ సభ్యుడు తాండ్ర పేరమనాయుడు (యల్లంపేట) పెద్ద కుటుంబాలు ఉండేవి. ● సోమశిల బ్యాక్వాటర్లో ఇప్పటికీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. బ్యాక్వాటర్లో మునిగిపోయి, గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం కనిపించగానే అధ్యాత్మికభావన మనుసులో పుట్టుకొస్తుంది. ప్రతి ఇంటిలో ఒకరికి స్వామిపేరు.. శ్రీ రుక్మిణి, సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామిపై అపారమైన భక్తి భావం, ప్రగాఢ విశ్వాసం పెంచుకున్నారు. ఈ క్రమంలోని యల్లంపేటలో ప్రతి ఇంటిలో ఒకరికి స్వామి పేరుపెట్టుకోవడం గమనార్హం. ఏటా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఒక్కటిగా స్వామి వారి ఎదుట కలుసుకొని పరస్పరం సంతోషాలతో గడుపుతారు. భక్తులకు అన్నప్రసాదాలను అందచేస్తారు. సోమశిల బ్యాక్వాటర్ మునిగిన యల్లంపేట రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, యేటా గ్రామస్తులు నిర్వహించే కల్యాణంలో ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామిపై తరగని భక్తి గ్రామం మునిగిపోయి నాలుగుదశాబ్దాలు దాటుతున్నా యల్లంపేట వేణుగోపాలస్వామిపై భక్తిభావం తరగలేదు. ఆలయం మునిగిపోయింది, గ్రామం ఖాళీ అయింది. యల్లంపేటకు పునరావాసం లేదు. ప్రభుత్వాలు ఆలయం నిర్మాణంతోపాటు పునరావసం కల్పిస్తే, మళ్లీ గ్రామస్తులు ఒక్కచోట కలిసి ఉండేందుకు మార్గం సుగమమవుతుంది. –తాండ్ర రమేష్నాయుడు, యల్లంపేట, నందలూరు ● సోమశిల బ్యాక్వాటర్లో యల్లంపేట గ్రామంతోపాటు ఆలయం మునకకు గురైంది. ● గ్రామానికి 1986 ప్రాంతంలో నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను చేపట్టారు. 1990 నుంచి గ్రామాన్ని దశలవారీగా ముంపువాసులు వదలివెళ్లారు. తమకు అనుకూలమైన ప్రాంతాలకు, రాష్ట్రంలో నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు. ● గ్రామం ఖాళీ అవుతున్న క్రమంలో, మరోవైపు నీళ్లు గ్రామానికి చేరువలో రావడంతో మానవసమాజం ఆలయానికి దూరమైంది. ఈ నేపథ్యంలో గుప్తనిధుల ముఠా ఆలయాన్ని తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ఊరేగించే వాహనాలు, పంచలోహ విగ్రహాలు మాత్రం మిగిలాయి. ● దొరల కాలంలో యల్లంపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మితం చేశారు. ఆలయంలో రాతి విగ్రహామూర్తులు ఉండేవి. అయితే ఇక్కడ ఎక్కడాలేని విధంగా చెక్క విగ్రహాలే మూలవిరాట్టులు చేసి, పూజలు నిర్వహించేవారు. పంచలోహవిగ్రహాలే ఉత్సవ మూర్తులుగా నిర్వహించేవారు. ఏటా పెద్దఎత్తున యల్లంపేట తిరునాల జరిగేది. 8రోజుల పాటు తిరునాల నిర్వహించేవారు. ● ఆలయానికి సోమశిల నష్టపరిహారం చెల్లించారు. రెవెన్యూ డిపాజిట్ చేశారు. అప్పట్లో రూ.80లక్షలు ఉన్నట్లు సమాచారం. ● గ్రామాన్ని వదలివెళ్లినప్పటికి గ్రామస్తులు ఏటా శ్రీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం రోజున అందరూ ఏకమవుతారు. గ్రామంలేకున్నా స్వామిని మాత్రం భక్తులు మరవేలదనడానికి ఇదే నిదర్శనం. మొన్నటి వరకు ఒంటిమిట్ట రామాలయంలో..ఇప్పుడు సౌమ్యనాథాలయం(నందలూరు)లో పంచలోహ విగ్రహాలు భద్రపరిచారు. ఈ విగ్రహాలతో స్వామివారి కల్యాణం నిర్వహించుకునేవారు. వాహన సేవలకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి. ● రాజంపేట మండలంలో యల్లంపేట వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం వివాదంలో ఉందని భక్తులు చెపుతున్నారు. బ్యాక్వాటర్లో వేణుగోపాలస్వామి ఆలయం మునక అయినా యల్లంపేట గ్రామస్తుల్లో తరగని భక్తిభావం ఏటా ‘వేణు గోపాలస్వామి కల్యాణం -
కడప కమిషనర్గా హెచ్ఎస్ భావన
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ కమి షనర్గా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనను నియమిస్తూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. కడప కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రను రిలీవ్ చేశారు. కడప కమిషనర్గా భావన వెంటనే బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జమ్మలమడుగు: నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. రకరకాల పూలు ఒక్కచోటకు చేరి స్వామి సన్నిధి లో కొలువుదీరాయి. వేదపండితులు నారాపురస్వామికి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా యువతకు నైపుణ్య నిధిగా, రాష్ట్రానికే స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్ అప్ కడప‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ిపీ4 విధానం ద్వారా ఇన్నోవేటీవ్ గా నిర్మిస్తున్న ‘స్టార్ట్ అప్ కడప‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని కడప నగర నూతన కమిషనర్ భావనతో కలిసి పరిశీలించారు. బాహ్య నిర్మాణ పనులను పూర్తిగా వారంలోగా కంప్లీట్ చేయాలన్నారు. స్టార్టప్ కడప’’కేవలం ఒక భవనం మాత్రమే కాదని.. ఇది యువత కలలకు రూపురేఖలు ఇచ్చే వేదిక అన్నారు. ఆవిష్కరణ, ఆధునికత, అభివృద్ధికి దిక్సూచిగా నిలవనుందన్నారు. -
ప్రజలు సంయమనం పాటించాలి
కడప కారొపరేషన్/చింతకొమ్మదిన్నె : కడప నగరం అల్మాస్పేట ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ సంయమనం పాటించాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా కోరారు. సీకే దిన్నె, రిమ్స్, చిన్నచౌక్, వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఉన్న యువతను, వారి కుటుంబాలను అంజద్బాష పరామర్శించారు. పోలీసులు సంఘటనకు సంబంధం లేని వారిని కూడా అదుపులోకి తీసుకున్నారని, మరోసారి విచారించి సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఆయన కోరారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసే జీవించే సంప్రదాయం కడపలో ఉందని, ఎప్పటికీ కడపలో సామరస్యపు జెండానే ఎగురుతుందన్నారు. ఉన్నతాధికారులతో, మత పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. అల్మాస్పేటలో జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా శనివారం దురదృష్టకర సంఘటన జరిగిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.ఆదివారం చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో నిర్భందించిన ఇరువర్గాల వారిని అయన పీస్ కమిటీ మెంబర్, వైఎస్సార్ సీపీ నాయకుడు సుభాన్బాషాతో కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. అలాంటి కడపలో జరిగిన దురదష్టకరమైన సంఘటనను ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పరామర్శ -
భక్తుల వాహనాన్ని ఢీకొన్న లారీ
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం వేకువజామున ముంబై టు చైన్నె జాతీయ రహదారిలో ఉన్న రాయల్ వుడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి, తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం, కడవకల్లు గ్రామానికి చెందిన 60మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో వెళ్లే క్రమంలో మదనపల్లె బైపాస్ లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గరకు ఐషర్ లారీ రాగానే వెనకనే వచ్చిన మరో లారీ ఐషర్ను ఢీకొంది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి, మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి (25), లక్ష్మీనారాయణ (42)లకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర (13), అశ్వని (28), లక్ష్మీదేవి (52), రమాశ్రీ (38), అరుణ (36), పుల్లమ్మ (35), గంగాధర్ (16), వెంకటరాయుడు (55), కుల్లాయమ్మ (42), శివశంకర్ (32), లక్ష్మి (31), రాజా (15), లక్ష్మీదేవి (32), భవ్యశ్రీ (13) మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి, ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.16మందికి గాయాలు -
వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు
లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్త లక్ష్మీరెడ్డిపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో అక్రమంగా కేసు బనాయించి విచారణ నిమిత్తం విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు తీసుకొచ్చి రాత్రంతా పోలీసు స్టేషన్లో పెట్టినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని అప్పకొండయ్యగారిపల్లికు వచ్చిన గిద్దలూరు పోలీసులు విచారణ నిమిత్తం లక్ష్మీరెడ్డి సోదరుడుని విచారించి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్న లక్ష్మీరెడ్డిని శనివారం అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కాకునూరి హిమశేఖర్ రెడ్డి ఆదివారం బాధిత వ్యక్తులకు బెయిల్ ఇప్పించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వాల్మీకిపురం : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. సోమల మండలం, కందూరుకు చెందిన ప్రభాకర్ ఇదే పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లిలో పోస్ట్మెన్గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనుల నిమిత్తం గుర్రంకొండ మండలం, రామాపురంలోని తన మేనమామ ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చి, తిరిగి ప్రయాణమయ్యాడు. మండలంలోని చింతలవారిపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఢీకొన్న వాహనం లారీగా గుర్తించి, తిరుపతిలో సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రామాపురం : మండలంలోని బండపల్లి టోల్గేట్ సమీపంలో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బైక్ ఢీకొనడంతో తీగల భార్గవాచారి(41) అక్కడిక్కడికే దుర్మరణం చెందినట్లు రామాపురం ఎస్సె శివకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు రాయచోటి నుంచి కడప వెళుతున్న లారీకి పంచర్ కావడంతో బండపల్లి టోల్గేట్ సమీపంలో నిలిపి మరమతులు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాత్రి 11 గంటలకు రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న స్కూటీ ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తీగల భార్గవాచారి(41)తలకు బలమైన గాయమై అక్కడిక్కడికే మృతి చెందాడు.మృతుడు రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంలోని ఎర్రంరెడ్డిపల్లికి చెందిన వాడు కాగా, ప్రస్తుతం రాయచోటి పట్టణం కొత్తపేటలోని చౌడేశ్వరీ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.గుండెపోటుకు గురై యువకుడు..చౌడేపల్లె : గుండెపోటుకు గురై యువకుడు వెంకటేష్(29)మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి.. పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేష్ సహచర స్నేహితులతో కలిసి ఉదయంనుంచి 11 గంటల వరకు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికివచ్చిన వెంకటేష్ స్నానం చేసి విశ్రాంతి తీసుకొన్నాడు.అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే వెంకటేష్ మృతిచెందినట్లు నిర్ధారించడంతో వెనుతిరిగారు.వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకొన్నాయి. మృతుడి భార్య నాలుగునెలల గర్ణిణీ.భర్త మృతితో ఆమె, కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రుల రోధన పలువురిని కలచివేసింది. -
సుందరయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీలో 75 ఏళ్ల వృద్ధ రైతు భూమిని ఆక్రమించేందుకు యత్నించి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రత్యర్థులు దాడి చేయడంతో బాధితులు ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించిన సీపీఐ నాయకులు కష్ణప్ప, సాంబశివ, శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, దేలకుప్పానికి చెందిన సుందరయ్యకు సర్వే నంబర్ 32/12లో 1.9 సెంట్ల పట్టా భూమి ఉందన్నారు. ఆదివారం ఉప్పరపల్లి పంచాయతీ నాగిళ్లవారిపల్లికి చెందిన యదుశేఖర్ నాయుడు, కోటినాయుడు తమ అనుచరులతో వచ్చి సుందరయ్య భూమిని జేసీబీతో ఆక్రమించేందుకు యత్నించారు. అడ్డు వెళ్లిన సుందరయ్య, ఆయన కుమారుడు, కోడలిని కొట్టి సెల్ ఫోన్లు లాక్కొని దుర్భాషలాడుతూ ‘‘అడ్డొస్తే జేసీబీతో తొక్కిస్తాం’’ అంటూ బెదిరించారన్నారు. భూమిలో ఉన్న మామిడి చెట్లు, ఫారం పాండ్ ట్యాంక్, రాతి కూసాలు, కంచె ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో సుమారు రూ.10 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గాయపడతాము చేసేదిలేక మదనపల్లి ప్రభుత్వాసుపత్రుల చేరి చికిత్స పొందుతున్నామని వాపోయారు. -
13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
కాశినాయన : మండలంలోని ఆనంవారిపల్లె గ్రామంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మొదటి బహుమతి హోండా యూనికాన్ బైక్, రెండో బహుమతి హోండా షైన్, మూడో బహుమతిగా రూ.80వేలు గెలుపొందిన ఎడ్ల యజమానులకు అందిస్తామని వారు వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన రైతులు 13న మధ్యాహ్నం తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441337657 నంబర్లో సంప్రదించాలని కోరారు. బంగారు, వెండి నగల చోరీ పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ ఉప్పరవాండ్లపల్లిలో మావిళ్ల చెన్నకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చెన్నకృష్ణ సోదరుడు లక్ష్మినారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా.. చెన్నకృష్ణ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ 15 రోజులకోసారి కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆయన ఎప్పటి లాగానే భార్యా, పిల్లలను వెంట బెట్టుకుని ఉద్యోగరీత్యా తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఈ తరుణంలో ఈ నెల 8న గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు, సుమారు 200ల గ్రాముల బంగారంతో పాటు వెండి నగలు అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ పరమేశ్ నాయక్లు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడింది స్థానికులా, బయట వ్యక్తులా, అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.రైలు కింద పడి వ్యక్తి మృతిపీలేరు రూరల్ : రైలు కింద పడి గుర్తతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలో జరిగింది. వివరాలిలావున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ముంబై నుంచి నాగర్కోయిల్ వెళుతున్న రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి రైల్వేపోలీసుల కు సమాచారం ఇచ్చారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఒంటికి నిప్పు అంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. బి. కొత్తకోటకు చెందిన వై. వెంకటరమణారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి (30) కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండేళ్ల తర్వాత ఇంటికి రావడంతో కుటుంబీకులు మహేందర్రెడ్డి తీరు మార్చుకొని బుద్ధిగా ఇంటివద్దే ఉండాలని మందలించారు. దీంతో అతను తీవ్ర మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడుని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డిని ఓ ప్రైవేట్ వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాముకాటుతో మహిళ మృతి
వాల్మీకిపురం : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని ఫత్తేపురంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు.. వాల్మీకిపురం పంచాయతీ ఫత్తేపురానికి చెందిన అంజి భార్య యమున (38) ఆదివారం ఉదయం ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ నుంచి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయాకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యమున భర్త అంజి గతంలో మృతి చెందగా.. ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుండగా యమున మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటేసి వ్యక్తికి అస్వస్థతమదనపల్లె టౌన్ : పొలంలో దోస కాయలు కోస్తుండగా విష సర్పం కాటేసి కూలి పనులకు వచ్చిన సత్యసాయి జిల్లా వాసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న గోపాల్ కుమారుడు రవి (48) ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు సాగుచేసిన దోసకాయ పంటను వడపడానికి ఓ టెంపోలో కూలీలను తీసుకొని చిత్తూరు జిల్లా, చౌడేపల్లి సమీపంలోని బోయకొండకు ఆదివారం ఉదయం వచ్చాడు. కూలీలతో దోస కాయలు కోయిస్తుండగా చెట్ల మధ్యన ఉన్న విష సర్పం రవి కాలిపై కాటేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని సహచరులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. దీంతో రవి ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు. -
ప్రాణం తీసిన ఈత సరదా
బద్వేలు అర్బన్ : ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్పూల్కు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన దాసరినారాయణ, రమాదేవి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వ్యాపార నిమిత్తం గత కొన్నేళ్లుగా వీరు పట్టణంలోని మార్తోమానగర్లో నివసిస్తున్నారు. వీరి కుమారుడైన దాసరిఅర్జున్ (10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. ఈత నేర్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం పోరుమామిళ్ల బైపాస్రోడ్డులోని స్విమ్మింగ్పూల్కు అర్జున్ తన సోదరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. నడుముకు ట్యూబ్ వేసుకుని నీటిలోకి దిగిన అర్జున్ కొద్దిసేపటికి ట్యూబ్ తీసేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారించి మళ్లీ ట్యూబ్ వేసుకుని స్విమ్మింగ్పూల్లోకి దిగమని సూచించారు. అయితే కొద్దిసేపటికి మళ్లీ ట్యూబ్ తీసేసిన అర్జున్ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు అర్జున్ను స్విమ్మింగ్పూల్ నుంచి బయటికి తీసుకువచ్చి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా ఈతకు వెళ్ళి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృ తిచెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని తల్లిదండ్రులు దమ్మనపల్లె గ్రామానికి తీసుకెళ్లారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.స్విమ్మింగ్పూల్లో పడి బాలుడు మృతి -
మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి
● 13 వరకు టూ టౌన్, వన్ టౌన్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ● కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్కడప : కడపలోని అల్మాస్పేట సర్కిల్లో ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన సంఘటన దురదృష్టకరం, మతసామరస్యం కలిగిన దేశంగా మన దేశాన్ని పిలుస్తారని ఇందుకు ప్రతి వర్గం వారు కట్టుబడి ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలియజేశారు. కడప అల్మాస్పేట వద్ద హనుమాన్ సర్కిల్ అని ఒక వర్గం వారు, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ఒక వర్గం వారు పరస్పరం రాళ్లు రువ్వుకునేందుకు ప్రేరేపించారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నిందితులను గుర్తించామని కొందరు అదుపులో ఉన్నారని, కొందరు పరారీలో ఉన్నారన్నారు. 144 సెక్షన్ కడప టూ టౌన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 13వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. తరువాత పరిస్థితిని బట్టి 144 సెక్షన్ను సడలింపు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కడప ఇన్ఛార్జ్ డిఎస్పీ బాలస్వామిరెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కడప అల్మాస్పేట సర్కిల్ ఈనెల 9న ఉద్రిక్తతల మధ్య అట్టుడికిపోయింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆదివారం నిర్మానుష్యంగా మారింది. అల్మాస్పేట ఘటనలో 60మందిపై కేసుకడప అర్బన్ : కడపలోని అల్మాస్పేట సర్కిల్లో ఈనెల 9వ తేదీన రాళ్లు రువ్వుకున్న సంఘటనలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు దాదాపు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులలో కొందరు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం. -
కియా కంపెనీలో అట్లూరు మండలవాసి మృతి
అట్లూరు : విధి నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లా కియా కంపెనీలో అట్లూరు మండలం జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు (24) కియా కంపెనీలో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుని తల్లి, తమ్ముడు, చెల్లెలు ఇదివరకే మృతి చెందారు. తండ్రి లక్షుమయ్య ఉన్న ఒక్క కొడుకు రామాంజనేయులను కూలి పనులు చేసుకుంటూ బీటెక్ చదివించాడు. రామాంజనేయులు ఆరు నెలల కిందట కియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు రామాంజనేయులు మిషనరీలో పడి మృతి చెందాడు. విషయాన్ని కియా కంపెనీ యాజమాన్యం బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం జొన్నవరం ఎస్సీ కాలనీకి రామాజంనేయులు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి
శాంతిసౌభ్రాతృత్వాలతో మెలగాలి మతసామరస్యానికి, స్నేహభావానికి ప్రతీక కడప అని ఎంపీ అవినాష్రెడ్డి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా శతాబ్దాల చరిత్ర కలిగిన కడపలో విద్వేషాలకు తావు లేదన్నారు. ఎవరికి వారు సమన్వయం ప్రదర్శించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా మతసామరస్యాన్ని, సోదర భావాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఆదర్శవంతమైన కడపను కొనసాగించాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. సోదర భావానికి ప్రతీక వైఎస్సార్ కడప జిల్లాతో పాటు కడప నగరం సోదర భావానికి ప్రతీక అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. నగరంలో కొన్ని దుష్ట శక్తుల స్వార్థపూరిత ప్రేరేపణల కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం దురదుష్టకరమన్నారు. దుష్టశక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విజ్ఞులైన కడప ప్రజలు దుష్టశక్తుల ప్రయత్నాలను విఫలం చేసి దేశానికి ఆదర్శవంతంగా నిలవాలని కోరారు. మత సామరస్యానికి నిలయం కడప కడప నగరం మతసామరస్యానికి నిలయమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాష అన్నారు. కడప చరిత్రలో ఎన్నడూ జరగని దురదృష్ట సంఘటన అల్మాస్పేట సర్కిల్లో చోటుచేసుకుందన్నారు. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడపలో ఎప్పుడూ పరమత ద్వేషాలకు తావులేదన్నారు. పెద్దలు చూపించిన ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యత కడప సంస్కృతికి మూలస్తంభాలని, కొంతమంది చేసే ప్రేరేపిత చర్యల వల్ల శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆజాద్నగర్కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్బాషా(20), అనంతపురంలోని రాణినగర్కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖాసీంవలీని కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే మహబూబ్బాషాకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఘటనపై అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చక్కగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.300 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రాంతంలో రూ.90 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. పొట్టిపాడు రోడ్డులో 220 కేవీ సబ్స్టేషన్ను మంజూరు చేయించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు భూపేష్రెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, సీఎం సురేష్నాయుడు, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, ఆసం రఘురామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, వక్ఫ్బోర్డు స్టేట్ డైరెక్టర్ జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఎలుకల నివారణ మందు తాగి ఓ డ్రైవర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చౌడేపల్లి మండలంలోని ఆమనకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు చందు(27) ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్గా పని చేస్తూ, తల్లిదండ్రులతోపాటు భార్య, పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
పోరుమామిళ్ల : చిన్న యరసాల సమీపంలోని అప్పన్నబావి దగ్గర ఈనెల 5న మానేపాటి సురేష్(30)ను చంపి, కాల్చివేసిన ఘటనలో నిందితులు షేక్ జాఫర్వల్లి, అతని భార్య హాసీనాలను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ హేమసుందరరావు, ఎస్ఐ హనుమంతు తెలిపారు. ప్రొద్దుటూరుటౌన్ ఆర్ట్స్కాలేజీ రోడ్డు గురవయ్యతోటకు చెందిన జాఫర్వల్లి దంపతులు కోతులు పట్టుకునే వృత్తిలో ఉన్నారన్నారు. సురేష్ భార్య వెంకటేశ్వరితో శారీరక సంబంధం పెట్టుకున్న జాఫర్ వల్లి ఆమెను వివాహం చేసుకునేందుకు.. సురేష్ అడ్డుగా ఉన్నాడని భావించి హత్యకు ప్లాన్ చేశాడన్నారు. 5వ తేది రాత్రి రాయితో ముఖంపై కొట్టి, కిందపడ్డ సురేష్ను జాఫర్వలి, హసీనాలు చంపి, అప్పన్నబావిలో వేసి చెత్తలో కాల్చి వేశారన్నారు. ఈ విషయం వెంకటేశ్వరికి చెప్పి, బయటికి చెపితే చంపుతామని బెదిరించారన్నారు. వెంకటేశ్వరి వారి నుంచి తప్పించుకొని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. శనివారం మధ్యాహ్నం నిందితులను సీతారామపురం క్రాస్రోడ్డు వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజుల్లోనే విశ్వసనీయ సమాచారంతో నిందితులను అరెస్టు చేశామన్నారు. దీనిపై మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పోరుమామిళ్ల సిబ్బందిని అభినందించారన్నారు. -
కోట అందం.. చూసొద్దాం
● రాజరికానికి దర్పణం గుర్రంకొండ కోట ● అన్నమయ్య జిల్లాకు మణిహారం ● నిత్యం పర్యాటకుల సందడిగుర్రంకొండ : వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం చారిత్రాత్మాక గుర్రంకొండ కోట. అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీషు వారి పాలనకు నిలువుటద్దం ఈ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. ముఖ్యంగా కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పు సూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషు వారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘన చరిత్ర కలిగిన ఈ కోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండీ. రంగిణీ మహల్ గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్. పురాతన రాజభవనం. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగానూ, వెనకవైపు నుంచి మూడు అంతస్తులు నూ కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రురాజులు దండెత్తినప్పుడు ఈ మార్గం గుండా కోట బయటికి వెళ్లేందుకు ఆస్కారం ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుర్రంకొండ కోటను విజయనగర రాజులు పాలించే కాలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని.. అప్పటి పాలకులు శ్రీకృష్ణ దేవరాయులు కోటలోని కొండపైభాగంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శిల్పకళాసౌందర్యంతో ఈ దేవాలయ స్తంభాలు ఇట్టే ఆకట్టుకొంటాయి. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా నిర్మిస్తే.. దీన్ని పశ్చిమముఖంగా నిర్మించడం విశేషం. ఇక్కడి నుంచి చూస్తే గుర్రంకొండ పట్టణంతోపాటు పరిసర గ్రామాల పచ్చటి పొలాలు, రాయల కాలం నాటి చెరువులు కనిపిస్తాయి. కోట ముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. ఈ కందకాల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆ నీటిలో మొసళ్లను వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించే వారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. మగ్బీరా కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్ మేనమామ మీర్రజాఆలీఖాన్ పాలించే వారు. అతను మృతి చెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం(రీసౌండ్) ఇక్కడి ప్రత్యేకత. షాహజాదీ మసీదు టిప్పు సుల్తాన్ కాలంలో రాజవంశీయుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మసీదు ఇది. పూర్తిగా రాతితోనే నిర్మించారు. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించారు. ఇలాంటివి కోట పరిసరాల్లో మరో రెండు ఉన్నాయి. షాకమాల్ దర్గా మైసూర్ పాలకులు, అప్పటి గుర్రంకొండ కోట పాలకులు అయిన టిప్పు సుల్తాన్ ఆస్థాన గురువు షాకమాల్ దువ్వమ్. ఆయన ఈజిప్టు దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన గొప్పతనం విన్న అప్పటి మైసూర్ పాలకులు హైదరాలీ తన కుమారుడు టిప్పుసుల్తాన్ను గుర్రంకొండలోని అతని మేనమామ మీర్రజా ఆలీఖాన్ వద్ద ఉంచి షాకమాల్ దగ్గర విద్యాబుద్ధులు నేర్పించారు. తదనంతర కాలంలో షాకమాల్ దువ్వమ్ టిప్పుసుల్తాన్ గురువుగా నియమింపబడ్డాడు. ఇతని సమాధినే ఇక్కడ గొప్ప దర్గాగా ప్రజలు కొలుస్తారు. ఇంకా చూడదగిన విశేషాలు ● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది. ● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది. ● శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్ కాలం నాటి ఈద్గాలు ఉన్నాయి. ● గుర్రంకొండ పట్టణంలో శ్రీ షాకమాల్ దర్గా దగ్గర టిప్పుసుల్తాన్ చదువుకొన్న పాఠశాల యూసూఫ్ సాహేబ్ తకియా ఉంది.ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీమహల్వెనుకవైపు నుంచి మూడు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీ మహల్ -
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు
– కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ కడప సెవెన్రోడ్స్: జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి భద్రతా, రక్షణ చర్యలను పటిష్టం చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ లు సంయుక్తంగా పేర్కొన్నారు. కడపలోని అల్మాస్ పేట సర్కిల్లో శనివారం ఉదయం చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాత్రి కలెక్టర్, ఎస్పీలతోపాటు జేసీ డాక్టర్ నిధి మీనా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అసాంఘిక దుష్టశక్తుల ప్రభావం వల్లనే అల్మాన్ పేటలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, మత సామరస్యానికి ప్రతీక అయిన కడప నగరాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం యాధృచ్ఛికమే అన్నారు. ప్రజలను వెంటనే ప్రభావితం చేసే సోషల్ మీడియా ద్వారా కొంత అవాస్తవ ప్రచారం ప్రజల్లోకి వెళుతోందని, వాస్తవాలను అందించేలా సామాజిక మాధ్యమాలు ఉండాలి తప్ప ప్రజలను భయగోలిపేలా, రెచ్చగొట్టేలా ఉండకూడదన్నారు. అల్లర్లకు కారణమైన వాటిపై చర్యలు తీసుకుని భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు తావులేకుండా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసి అల్లర్ల ప్రభావం, ఉనికి ఎక్కడా కనిపించకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు సమైఖ్య భావంతో నడిచేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. జిల్లా, నగర ప్రజలకు ఎలాంటి శాంతికి విగాధం లేకుండా జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. కడప మత సామరస్యాన్ని కాపాడాలి కడప నగరం ఎప్పటి నుంచో మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి ప్రాంతంలో విద్వేషాలకు, అల్లర్లకు తావిచ్చే దుష్టశక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. కడపలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో శనివారం రాత్రి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో కలిసి.. జిల్లాలోని అన్ని మతాల సంఘ పెద్దలతో జిల్లా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడప నగరంలో పరమత ద్వేషాలకు ఎప్పుడూ తావులేదని స్పష్టం చేశారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ. రాజకీయ ప్రయోజనాల కోసం మత ఘర్షణలను ప్రేరేపించడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐక్యతకు ప్రతీక అయిన కడపలో విద్వేషాలకు స్థానం లేదని, అల్లర్లకు పాల్పడిన వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు అల్మాస్ పేట సర్కిల్ కు సంబంధించి.. పేరు మార్పును ఆకాంక్షించే వారి తరపు అభిప్రాయాలను, సలహాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, జిల్లాలోని హిందు, ముస్లిం మత పెద్దలు సామాజిక సంఘాల పెద్దలైన శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అల్మాస్పేటలో పర్యటిస్తున్న కలెక్టర్, ఎస్పీ, జేసీ తదితరులు, శాంతికమిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు, మత పెద్దలు, నగర ప్రముఖులు -
ఆర్టీసీ బస్టాండ్లో దొంగల చేతివాటం
మైదుకూరు : మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్లో శనివారం ఉదయం ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ బ్యాగ్ నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. మైదుకూరు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లెకు చెందిన కంసల సుభాన్బీకి ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన అబ్దుల్ ఖాదర్తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వరుసకు తమ్ముడైన యువకుని పెళ్లి కోసం ప్రొద్దుటూరు నుంచి సుభాన్ బీ 7వ తేదీ శెట్టివారిపల్లెకు వచ్చింది. వివాహం అనంతరం 9వ తేదీ (శనివారం) ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు మైదుకూరు బస్టాండ్కు వచ్చింది. మైదుకూరు బస్టాండ్లో ఉదయం 8.45 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కి టికెట్ కోసం ఆధార్కార్డు తీసేందుకు బ్యాగ్లో ఉన్న పర్సు తీయబోయింది. అప్పటికే పర్సు జిప్ తెరిచి ఉండటంతో కంగారుపడి పర్సులో వెతకగా.. అందులో ఉంచిన నల్లపూసల దండ, లాంగ్ చైన్, హారం తదితర 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే బస్సు దిగిన ఆమె భర్తకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారంతా మైదుకూరు పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. పీఎండీఎస్తో ప్రధాన పంటకు రక్షణమైదుకూరు : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్)తో ప్రధాన పంటకు రక్షణ కలుగుతుందని మైదుకూరు మండలం వనిపెంటలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. శనివారం మండలంలోని ఆదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లెలో రైతులు సాగు చేసిన అరటి పంటలో పీఎండీఎస్ కింద 20 ఎకరాల విత్తనాలను వెదజల్లారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీవిద్యారాణి, డాక్టర్ కాంతిశ్రీ, డాక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ అరటి పంటలో పీఎండీఎస్తో ఏర్పడే పచ్చదనంతో అరటి పంటకు వేడి నుంచి రక్షణ కలుగుతుందన్నారు. అదే విధంగా 45–50 రోజుల పాటు కలుపును నివారించవచ్చని పేర్కొన్నారు. అనంతరం 20 రకాల విత్తనాలతో మొలిచిన పంటలతో ఆదాయం పొందడమే కాక పశువుల మేతకు వాడుకోవచ్చని తెలిపారు. ఇంకా మిగిలిన దానిని కలియదున్నితే ప్రధాన పంటకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పసుపు పంటపై మహిళా రైతులతో చర్చించారు. సమతుల్యత ఎరువులను వినియోగించాలని సూచించారు. పసుపు పంటను ఎత్తు మడులలో సాగు చేయాలని తెలిపారు. హక్కుల సాధనకు దళిత క్రైస్తవులు పోరాడాలికడప రూరల్ : హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు నడుం బిగించాలని అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పాత రిమ్స్లో గల బీసీ భవన్లో దళిత క్రైసవ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కుల కోసం మాల, మాదిగ వర్గానికి చెందిన సోదరులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ అంశానికి సంబంధించి క్రైసవ సంఘాలన్నీ ఏకం కావాలన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ, అనుబంధ సంస్థలకు చెందిన వారు ప్రమాదకంగా మారారన్నారు. ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో గాలి చంద్ర, డేనియల్, రమేష్ బాబు, సంగటి మనోహర్, మల్లెం భాస్కర్, జయరాజు, పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డిపీలేరు రూరల్ : భారతీయ రైల్వే బోర్డులో అత్యుతన్నత గ్రేడ్ 16 అదనపు రైల్వే బోర్డు సభ్యుడిగా పీలేరు ప్రాంతానికి చెందిన కె.వి.రెడ్డి (కె.వెంకటరమణారెడ్డి)కి పదోన్నతి లభించింది. కె.వి.రెడ్డి గుంతకల్లు డీఆర్ఎంగా, దక్షిణ మధ్య రైల్వేలో పీసీఎస్వోగా, ఐఆర్ఐఎస్ఈటీలో ప్రొఫెసర్గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పీలేరు రైల్వే స్టేషన్ను అమృత్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయడంలో, అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు పీలేరులో స్టాపేజీలకు విశేష కృషి చేశారు. ఆయన 1990 ఐఈఎస్ బ్యాచ్కు చెందిన అధికారి.మహిళ బ్యాగ్ నుంచి బంగారు చోరీ -
● మాతృత్వానికే వన్నె తెచ్చిన నిర్ణయం
ప్రొద్దుటూరు క్రైం: తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. త్యాగానికి మరో రూపం అమ్మ. కన్నబిడ్డ కోసం తన జీవితాన్నే ధారపోస్తున్న ఓ మాతృమూర్తి పోరాటం ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒకవైపు ప్రాణాంతక వ్యాధితో క్షీణిస్తున్న కొడుకు.. మరోవైపు అతడిని కాపాడుకోవాలని తాపత్రయపడే తల్లి.. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఆ తల్లి ప్రేమ ‘మందు’ లేని మహమ్మారిపై నిరంతర యుద్ధం చేస్తోంది. కలలు కన్న వేళ.. కీడు శంకించిన విధి ప్రొద్దుటూరు కొవ్వూరు గ్యారేజి సమీపంలో నివసించే పతంగె గిరిధర్రావుకు, 2013లో గుంతకల్లుకు చెందిన శిల్పతో వివాహమైంది. ఎంఏ హెచ్పీటీ చదివిన శిల్ప, వివాహానికి ముందు టీచర్గా పనిచేశారు. కుమారుడు శ్రీనివాసరావు పుట్టినప్పుడు ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు. అయితే, నాలుగేళ్ల వయసులో ఆ పసివాడికి ‘డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ (DMD) అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు తెలియడంతో వారి ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది. దేశమంతా తిరిగినా దొరకని మోక్షం బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్, కేరళలోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా.. ‘ఈ వ్యాధికి మందు లేదు, కేవలం సేవ మాత్రమే శరణ్యం‘ అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లి గుండె పగి లింది. అప్పటి నుంచి ఏడేళ్లుగా శిల్ప తన కొడు కు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంది. త్యాగమే తోడుగా.. శ్రీనివాసరావుకు ఇప్పుడు పదకొండేళ్లు. కానీ కనీసం నడవలేడు.. కూర్చోలేడు. సోఫాలో కూర్చోబెట్టినా ఎక్కడ కింద పడిపోతాడోనని శిల్ప క్షణం కూడా పక్క నుంచి తప్పుకోదు. అన్నం తినిపించడం దగ్గర నుంచి కాలకృత్యాల వరకు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందుకోసం ఆమె తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ‘క్లౌడ్ కిచెన్’ వ్యాపారాన్ని, టీచర్ వృత్తిని వదులుకుంది. కొడుకుకు తోడుగా తానూ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తింటూ, బాబుకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. కొడుకును కంటికి రెప్పలా గుండెలకు హత్తుకున్న అమ్మ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నచిన్నారి శ్రీనివాసరావు మరో మగ సంతానం కలిగినా ఇదే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక వేళ వారికి ఆడపిల్ల జన్మిస్తే ఆమెకు డీఎండీ వ్యాధి వచ్చే అవకాశం ఉండదని, అయితే భవిష్యత్తులో ఆ అమ్మాయికి పెళ్లై మగపిల్లాడు జన్మిస్తే మాత్రం బాలుడికి డీఎండీ వ్యాధి వస్తుందని వారన్నారు. ఈ కారణంగా శిల్ప మాతృత్వాన్ని త్యాగం చేసింది. శిల్ప తన మాతృత్వాన్నే త్యజించింది. ఉన్న ఒక్కగానొక్క కొడు కును సంతోషంగా ఉంచడమే తన జీవితాశయమని నిర్ణయించుకుంది. లోపల కట్టలు తెంచుకుంటున్న బాధ ఉన్నా, కొడుకు ముందు మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది. ‘నేను ఏడిస్తే వాడు తట్టుకోలేడు‘ అంటూ కన్నీటిని దిగమింగుకుంటున్న ఆ తల్లి ప్రేమకు సాటి ఏది? వంద మంది దేవుళ్లు దిగి వచ్చినా అమ్మ చూపే అనురాగం ముందు తక్కువే అని శిల్ప నిరూపిస్తోంది. -
విద్యార్థి మృతిపై అన్నీ అనుమానాలే!
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మిద్దె పై నుంచి పడి మృతి చెందడం పాఠకులకు విదితమే. ఎంబీఏ విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసిన మదనపల్లె రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. పుంగనూరు మండలం కుక్కలపల్లికి చెందిన గంగరాజు(24) కురబలకోట మండలం అంగళ్ళులోని మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్లో బాడుగకు ఉంటూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్ సబార్డినేట్గా పని చేస్తున్నాడు. గంగరాజు ఇంటికి వచ్చిన సమయంలో గోవర్ధన్ నాయక్ ఇంట్లో లేకుండా పోవడంతో.. అతని భార్యతో గంగ రాజు మాట్లాడుతుండగా సడన్గా వచ్చినట్లు సమాచారం. దీంతో గోవర్ధన్ నాయక్ భార్య దొంగా దొంగా అని కేకలు పెట్టడంతో.. భవనం మూడవ అంతస్తు పై నుంచి గంగరాజు తప్పించుకునే క్రమంలో కిందికి దూకి తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న లాప్టాప్, సెల్ఫోన్ కూడా పగిలిపోయాయన్నారు. తీవ్రంగా గాయపడ్డ గంగరాజును విష్ణు నాయక్ వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి భార్యతో కలిసి తీసుకువెళ్లి ప్రథమ చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అతని పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడని, దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా గంగరాజు మృతి మిస్టరీని తేల్చునున్నామని చెప్పారు. -
గంగమ్మ ఆలయంలో చోరీ
పులివెందుల రూరల్ : మండల పరిధి ఆర్.తుమ్మలపల్లె గ్రామ సమీపంలోని గంగమ్మ చింతల ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్లు, తలకు టోపీలు ధరించి తలువులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారికి అలంకరించి ఉన్న సుమారు 3.750 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని, వీటి విలువ రూ.3.90 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని సీసీ కెమెరాలలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి ఆభరణాలు అపహరించిన దృశ్యాలు రికార్డు అయ్యాయన్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు స్పందించి ఆలయాల వద్ద గస్తీ ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కడపలో ఇరువర్గాల ఘర్షణ
సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరం అల్మాస్పేటలో ఓ ఘటన ఇరువర్గాల మధ్య చిచ్చు రేపింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడులకు దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నంలో సీఐ నరసింహరాజు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, మరో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యా హ్నం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్మాస్పేట సర్కిల్లో ఓ వర్గం బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. బ్యానర్ల ఏర్పాటుపై అభ్యంతరం చెబుతూ మరోవర్గం నిరసనకు దిగింది. ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.దీంతో ఇరువర్గాలూ బ్యానర్లు తీసేసి, శాంతియుత వాతా వరణం కల్పించేందుకు సహకరించాలని పోలీసు లు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా ఇరువర్గాలు రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో పోలీసులూ గాయాలపాలవడంతో ఇరు వర్గాలపై లాఠీ ఝుళిపించారు. అల్లరి మూకలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పరస్పర కవ్వింపు చర్యలకు పాల్పడడంతోనే ఘర్షణ ఉత్ప న్నమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
● ఎస్ఈ కార్యాలయంలో తన్నుకున్న పచ్చ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా నడుచుకుంటోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా దోపిడీదారులకు అండగా నిలుస్తోంది. టెండర్ బిడ్ను అడ్డగోలుగా రద్దు చేస్తూ అయినా వారికి కట్టబెట్టే చర్యలను ఎంచుకుంది. నిబంధనల మేరకు తక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సిందిపోయి, ఏకంగా టెండర్ బిడ్నే రద్దు చేశా రు. అదే పనికి తిరిగి టెండర్కు పిలవడం, అయిన వారికి కట్ట బెట్టడం ఇదే వరుసను కొనసాగిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లుతో పనులు చేయించడం తర్వాత టెండర్లు తంతు ప్రక్రియను పూర్తి చేయిస్తున్నారు. ● కడప నగర పరిధిలోని పుష్పగిరి స్కూల్ రోడ్డు వెళ్లే రహదారిపై చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివరి వరకు రోడ్డు వేసేందుకు (టెండర్ ఐడీ 903811) రూ.16.15లక్షలకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచి 24వ తేది తుది గడువు నిర్ణయించారు. ఆ టెండర్లను ఓపెన్ చేయగా ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అందులో ఎస్వీఎస్ఎస్ కన్స్ట్రక్షన్ 1.17శాతం తక్కువకు కోట్ చేయగా, ఎస్.యల్లారెడ్డి 10.08శాతం తక్కువకు కోట్ చేశారు. 10శాతం తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్ యల్లారెడ్డి పనులు చేసేందుకు సుముఖంగా ఉన్నానని తనకు పనిని అప్పగించాలని కమిషనర్కు లేఖ కూడా ఇచ్చారు. అధికారులు తిరిగి అదే పనిని రీ టెండర్లకు ఆహ్వానించారు. 8వతేది శుక్రవారం సాయంత్రం 3వ కాల్గా టెండర్ కొనసాగించారు. ఇలా కార్పొరేషన్లో నిబంధనలు విరుద్ధంగా తెలుగుతమ్ముళ్లుకు వంతపాడుతున్నారు. దీన్నిబట్టి కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎంత నీతివంతంగా పనిచేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వింతపోకడలో ఇంజనీరింగ్ సెక్షన్... కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్ వింత పోకడలో ఉండిపోయింది. టెండర్లు బిడ్లో కాంట్రాక్టర్లు పాల్గొంటే బెదిరింపులకు దిగుతోందనే ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ ఎవరైనా కాంట్రాక్టర్లు పాల్గొంటే విత్డ్రా చేయించడం లేదంటే టెండర్లు రద్దు చేయించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలా కుదరకపోతే అనుకున్న వ్యక్తులతో పనులు ముందే చేయించి తర్వాత టెండర్లకు పోతున్నారు. ప్రస్తుతం చంద్రవర్ధిని నగర్ 3వ కాల్గా పిలిచిన 7921/జీఎఫ్/24–25/ఏటీఓ/ఎంసీకే బిడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పనికి టీడీపీ నేతలతో ముందే చేయించారు. తర్వాత టెండర్లు పక్రియను కొనసాగించారు. ఇదే పక్రియ పరిపాటిగా ఇంజనీరింగ్ విభాగం కొనసాగిస్తోంది. రోడ్డు ముందే వేయించి ఆపై టెండర్లు 10శాతం లెస్కు టెండర్ దాఖలు చేసినా బిడ్ రద్దు తెలుగుతమ్ముళ్ల అక్రమార్జనకు అండగా యంత్రాంగం ఇంజనీరింగ్ విభాగం అడ్డగోలు వ్యవహారం కారణంగా ఇటీవల తెలుగుతమ్ముళ్లు పరస్పరం తన్నుకున్నారు. అడ్డగోలు పనుల పందేరాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పనుల కోసం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోసాగారు. ఈ నేపధ్యంలో బుచ్చంపల్లెలో చేపట్టిన పనుల కోసం తెలుగుతమ్ముళ్లు ఇంజనీరింగ్ కార్యాయ లంలో పరస్పరం దాడులు చేసుకొని కార్యాలయం ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వేదికగా నిలుస్తోంది. ఇంతటి దుశ్చర్యలు కేఎంసీలో చోటుచేసుకుంటున్నా ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ శ్రీధర్లో కనీస స్పందన లేకపోవడంతోనే ఇంజనీరింగ్ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహహారిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
స్కూల్ బస్.. ఫిట్ లెస్
కడప వైఎస్ఆర్ సర్కిల్: స్కూల్ బస్సులు ఫిట్నెస్ సాధించడంలో ఫెయిలవుతున్నాయి. తనిఖీ చేసిన ప్రతీసారి లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారులు పలు స్కూల్, కాలేజీ బస్సులు తనిఖీ చేయగా అనేక లోపాలు వెలుగుచూశాయి. లోపాలను గుర్తించిన అధికారులు వాటిని సరిచేయాలంటూ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో ఆ లోపాలను సరి చేస్తేనే మళ్లీ తనిఖీ చేసి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 680 పాఠశాల కళాశాల బస్సులు ఉండగా ఇప్పటివరకు 270 బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. గుర్తిస్తున్న లోపాలు ఇవీ...... రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్ లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయటకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయకపోవడం, అత్యవసర ద్వారా వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించారు. వాటితోపాటు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించాల్సిన హ్యమర్లు బస్సులో అందుబాటులో లేకపోవడం, మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్ మెంట్, ఎక్స్పైరి డేట్ తో ఉండడం వెలుగుచూశాయి. వీటి పైనే దృష్టి..... రవాణాశాఖ అధికారులు వారి తనిఖీల్లో ముఖ్యంగా టైర్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎక్కే డోర్ మెట్లు సక్రమంగా ఉన్నాయా, గ్రిల్స్, సీట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్, వైపర్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, గ్లాస్, బండి కండిషన్, రూప్ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు బయటకు ఎమర్జెన్సీ సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు. నిబంధన పాటించని స్కూల్ బస్సులు రవాణా శాఖ తనిఖీల్లో వెల్లడవుతున్న వాస్తవాలు -
గండిలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నూతన ఆలయ జీర్ణోద్ధరణ,మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం సాయంత్రం నుంచి సాంప్రదాయబద్ధంగా పాపాఘ్ని నదీ జలాలను తెచ్చి స్వామి వారికి సమర్పించిన అనంతరం వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భగవత్ విజ్ఞాపనం, విశ్వక్షేన ఆరాధన,రక్షాబంధనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయశాఖ డిప్యూటి కమిషనర్ ఆలయ సహాయకమిషనర్ గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ఉపప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్,రాజగోపాలాచార్యులపర్యవేక్షణలో టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారులు రాజేష్స్వామి, విజయ్ స్వామి శిష్య బృందం వేద మంత్రాలతో ప్రారంభించారు. గండి భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజీ, వేదపారాయణదారు రామమోహన్ శర్మ,గండి ఆలయ మాజీ సహాయకమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి,మాజీ చైర్మన్ వీరభాస్కర్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీకొని..
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి– మహేంద్ర షోరూం మార్గమధ్యంలో శుక్రవారం కారు, బైక్ నుఢీకొనడంతో డీ. చౌడయ్య (40) అనే బేల్దారి దుర్మరణం చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్, మృతుని భార్య అమృతమ్మ, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కడపలోని చిన్న చౌక్ వడ్డే కాలనీ లో నివాసం ఉంటున్న దండే చౌడయ్య బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య అమృతమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమృతమ్మ కొన్ని రోజుల క్రితం తన పిల్లలతో కలిసి ఖాజీపేటలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. వారిని పిలుచుకుని రావడానికి బైక్లో ఇంటి నుంచి బయలుదేరాడు. సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఎగిరి పడ్డాడు. బైక్, కారుపై పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. చౌడయ్య శరీరమంతా ఛిద్రమైపోయింది. కాసేపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. స్థానికుల సమాచారంతో బంధువులు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. కడప ట్రాఫిక్ సిఐ తులసి రామ్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. -
దౌర్జన్యకారుల నుంచి కాపాడి న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇంటి కొనుగోలుకు సంబంధించి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వారి బారి నుంచి తమను కాపాడి న్యాయం చేయాలని వేంపల్లెకు చెందిన నాగిశెట్టి రాజేశ్వరి, శ్రీనివాసులు కోరారు. శుక్రవారం వారు మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లె ప్రాంతానికి చెందిన తమకు కరీముల్లా, అమానుల్లాలు 32 లక్షలకు నాలుగురోడ్ల కూడలిలో ఓ ఇంటిని అగ్రిమెంట్ రాసిచ్చారన్నారు. అనంతరం పలుమార్లు అగ్రిమెంట్ చేయించాలని కోరుతున్నా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. కరీముల్లా 33 లక్షలు తీసుకుని పారిపోయి 8 సంవత్సరాలు తర్వాత వచ్చి మా పట్ల దౌర్జన్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఇంటికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ రౌడీలను తీసుకొచ్చి ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా నేడు, రేపు అంటూ కేసు నమోదుకు కాలయాపన చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు తగిన న్యాయం చేయాలని, దౌర్జన్యపరుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
పోలీసులే దౌర్జన్యం చేయడం తగునా.!
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో గురువారం పోలీసులు, టీడీపీ నాయకులు కలసి హైడ్రామా నడిపి రాత్రి సమయంలో ఫిర్యాదుదారుడు వెంకటసుబ్బయ్యతో కలిసి దౌర్జన్యంగా మా ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్లు తీసుకెళ్లడం ఎంతవరకు సబబు.. ఇది న్యాయమేనా అని మహిళలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం చవ్వారిపల్లె గ్రామంలో మహిళలు మాట్లాడుతూ గ్రామంలో దేవాలయానికి సంబంధించి 8ఎకరాల దేవుని మాన్యం భూమి ఉందని, గతంలో గ్రామస్తులంతా కలిసి మూడేళ్లకొకసారి ఆ భూమికి వేలంపాట నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆ వేలంపాటలో ఎక్కువ పాడిన వారు ఆ రోజే రెండేళ్లకు సంబంధించి డబ్బు కట్టి భూమి పనులు చేస్తున్న సమయంలో మరొక సంవత్సరం డబ్బు కట్టాల్సి ఉందని, కానీ ఇది ఏమి చేయకుండా టీడీపీ వారు దౌర్జన్యంగా కట్టుబడి వెంకటసుబ్బయ్య కలసి ట్రాక్టర్ సహాయంతో దేవునిమాన్యం భూమిలో దున్నడానికి వెళ్లారన్నారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు ఇది మంచి పద్ధతి కాదని, గ్రామ కట్టుబాటు ప్రకారం జరగాల్సిందేనని, దున్నే ట్రాక్టర్ను అడ్డుకోవడం జరిగిందన్నారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన 12మందిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్ను పోలీసులచేత సీజ్ చేయించారన్నారు. అయితే బుధవారం టీడీపీ నాయకులు పోలీసులను వెంట పెట్టుకుని దౌర్జన్యంగా ఆ భూమిని దున్ని చదును చేసుకున్నారని, అయితే ఎండోమెంట్ వారు దేవాలయానికి సంబంధించిన భూమి వేలం పాట నిర్వహించడానికి ఒక తేదీని ఖరారు చేసి ప్రకటించాలని నివేదిక పంపారన్నారు. ఇదేమి పట్టించుకోని పోలీసులు మళ్లీ గురువారం రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నాయక్ పోలీసులు, ఫిర్యాదుదారుడు వెంకటసుబ్బయ్యతో వచ్చి ఒక ట్రాక్టర్ను వెంకటసుబ్బయ్య, మరొక టాక్టర్ను పోలీస్ సిబ్బంది తీసుకెళ్లారన్నారు. పోలీసులు న్యాయపరంగా వ్యవహరించాలి తప్ప.. టీడీపీ నాయకులు ఏది చెబితే అది చేయడం, దొంగ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటే టీడీపీ కార్యకర్తలుగా వ్యవవరించడమేనా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును ఎండగట్టడానికి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మహిళలు పేర్కొన్నారు.న్యాయ పోరాటానికి సిద్ధమైన చవ్వారిపల్లె మహిళలు -
చౌక దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో ఓ చౌక దుకాణంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని 10వ వార్డు పరిధిలో కొన్ని గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే 34వ దుకాణంలో అధికారులు తనిఖీలు చేశారు. బియ్యం, జొన్నలు, అంగన్వాడీలకు వచ్చే సన్నబియ్యం నిల్వలు పంపిణీపై ఆరా తీశారు. వాసంతి అనే మహిళ పేరుతో ఉన్న చౌకదుకాణాన్ని ఆమె బంధువు సుబ్బారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు కడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో గోపాల్రెడ్డి కాలనీలో నివాసం వుంటున్న బావమరిది అజయ్కుమార్ (19)పై బావ మహమ్మద్ అజీజ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటనలో నిందితుడైన, రౌడీషీటర్గా పేరొందిన మహమ్మద్ అజీజ్ అనే యువకుడిని చిన్నచౌక్ సీఐ బి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రతాప్రెడ్డి తమ సిబ్బందితో అరెస్ట్ చేశారు. అతనిన కోర్టులో హాజరు పర్చగా రిమాండ్కు తరలించారు. వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కీలకం రాజంపేట : వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ పాత్ర అత్యంత కీలకమని, అందువల్లనే ఆ కోర్సులకు డిమాండ్ పెరిగిందని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పాగంగిరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్సైన్సెస్ ప్రెషర్స్డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో హెల్త్కోర్సులకు అధిక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ డా.శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సైన్సెస్ తీసుకొచ్చిన ఘనత ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, గెస్ట్ హాఫ్ ఆనర్ డా.రామ్నిఖి చక్రవర్తి, ఎఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అలైడ్ హైల్త్ ప్రొఫెషనల్స్ ఇన్చార్జి ద్వారకనాథరెడ్డిలతో పాటు అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లితండ్రులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సన్మానించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలిఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ ఽథర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లోని 600 మెగావాట్ల ప్లాంట్లోని 4వ దశలో పనిచేస్తున్న ఏఎంసీ (యాన్యువల్ మెయింటెన్స్ కాంట్రాక్ట్) కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్లాంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు ఆదినారాయణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఎంసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నాయకులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గెలిచిన తర్వాత కార్మికులను ఆవేదనను ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదన్నారు. మా న్యాయమైన డిమాండ్లను నెల రోజుల్లోగా పరిష్కంచకపోతే భవిష్యత్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నీడ.. జాడే కరువు
నీడ.. జాడ కరువు కడప సిటీ: మండుటెండల్లో కాసింత నీడ కరువైంది. చెట్టు నీడే వారికి ఆసరాగా మారింది. ఇక వేసవి అలవెన్సు రాక.. తాగను గుక్కెడు నీళ్లు లేక.. వారి అవస్థ వర్ణణాతీతంగా మారింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల దుస్థితి ఇది. మండు వేసవిలో సౌకర్యాలు కరువై .. పని పథకం బరువైంది. ఇప్పటికే వడదెబ్బతో ఓ శ్రామికుడు మృత్యువాత చెందడంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. నిప్పుల కుంపటిలా.... రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పని ప్రదేశంలో గుడారాలు (షెడ్స్) నిర్మించాల్సి ఉంటుంది. భోజన విరామంలో షెడ్ల నీడనే కూర్చొని భోంచేయడంతో పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆ గూటినీడలోనే ప్రాథమిక చికిత్స అందించడం, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించడం చేస్తుంటారు. కానీ నీడ లేకపోవడంతో ఈ పరిస్థితి లేదు. బడ్జెట్ లేనందువల్ల గుడారాలను ఏర్పాటు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే ఒంటిమిట్ట మండలంలో ఓ శ్రామికుడికి వడదెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ పరిస్థితిని చూసి మిగతా వారు బెంబేలెత్తుతున్నారు. పని ప్రదేశంలో చాలా చోట్ల కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ వాటి జాడ కనిపించడం లేదు. గతంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ ఇచ్చే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వసతులు అంతంత మాత్రమే ఉపాధి హామీపథకంలో సాధారణంగా వేసవి కాలంలో వేసవి అలవెన్సు కింద అదనంగా వేతనంతో కలిపి ఇస్తారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఈ అలవెన్సు శ్రామికులకు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ వేసవి అలవెన్సును తీసి వేశారు. గతంలో వేసవిలో సైతం లక్షకుపైగా రోజుకు నమోదు కావా ల్సి ఉండగా, ప్రస్తుతం వేలల్లో మాత్రమే హాజరవుతుండడం గమనార్హం. 21 మంది ఎంపీడీఓలకు నోటీసులు ఇటీవల కలెక్టర్ శ్రీధర్ జిల్లాలోని 21 మంది ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పనుల పర్యవేక్షణ సరిగా లేదని, కూలీల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఆయన ఆరా తీసి షోకాజ్ నోటీసులు అందజేశారంటే అధికారులు క్షేత్ర స్థాయిలో ఎలా పరిశీలన చేస్తున్నారో అర్థమవుతుంది. గుడారాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలు చెట్టు నీడలోనే కాలంవెళ్లదీస్తున్న శ్రామికులు బడ్జెట్ లేదంటున్న అధికారులు ఇప్పటికే ఒంటిమిట్టలో వడదెబ్బతో ఓ శ్రామికుడు మృతి -
కార్పొరేషన్లో ఒకరి సస్పెన్షన్
కడప కార్పొరేషన్: జన గణన మొదటి దశ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ నగరపాలక కమిషనర్ రాకేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం, అధికారుల ఫోన్ కాల్స్కు స్పందించకపోవడం వంటి కారణాలతో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశామని, అలాగే జనగణన ప్రారంభమై ఏడు రోజులు పూర్తయినా ఇప్పటి వరకూ విధులు ప్రారంభించని ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జనగణనలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వ జీఓ నెం. 70 ప్రకారం గతంలో ఇచ్చిన 138 అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్ను రద్దు చేశామని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, పొఫెసర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుమును తిరిగి పొందేందుకు సంబంధిత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ల తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటిస్తామని వివరించారు. జమ్మలమడుగు: నారాపురస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దేవదేవుడు సూర్యప్రభ వాహనంపై ఽభక్తులకు దర్శనం ఇచ్చారు. కల్యాణోత్సవం, రథోత్సవం పూర్తయిన తర్వాత శుక్రవారం ఉదయం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామివారిన దర్శించుకుని తరించారు. పులివెందుల టౌన్: ఈసెట్ ఎంట్రెన్స్ ఫలితాలలో పులివెందుల లయోలా పాల్టెక్నిక్ (వైఎస్ఆర్ఆర్) కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన విద్యార్థిని ఎం.గీతిక రాష్ట్రస్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ బ్రిట్టో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలుపుతూ తమ కళాశాలకు చెందిన ఎన్.పద్మప్రియ స్టేట్ 3వ ర్యాంకు, జి.లోకేష్ స్టేట్ 25వ ర్యాంకులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారన్నారు. రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతిక తండ్రి శివశంకర్రెడ్డి పులివెందులలో సాధారణ రైతు కాగా.. తల్లి ఎం.కేశవి గృహిణిగా ఉంటూ కుమార్తెను బాగా చదివించడంపట్ల స్థానిక ప్రజలు, కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుని జయంత్యుత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజు తాళ్లపాక ధ్యానమందిరంలో మోహన్, గోపికృష్ణ బృందం సంకీరన్తలు ఆలపించారు. బోయనపల్లె గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ కళానాట్యమండలి మహేంద్రస్వామి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జీవిత ఘట్టాల ప్రదర్శన కన్నులపండువగా సాగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ సీ.లత, తాళ్లపాక దేవాలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలను ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
గంగమ్మా.. దీవించమ్మా
రాజంపేట టౌన్: పట్టణంలోని బలిజపల్లె గ్రామంలో గత రెండు రోజులుగా జరిగిన గంగమ్మ జాతర ముగిసింది.శుక్రవారం ఉదయం అమ్మవారి ప్రతిమను ఊరేగింపుగా పొలిమేర్లకు సాగనంపడంతో ఈ ఏడాదికి జాతర ఘట్టం ఘనంగా పరిసమాప్తమైంది. గంగమ్మను పొలిమేర్లకు తరలించే ఊరేగింపు కార్యక్రమం వేకువ జామున ప్రారంభమై ఉదయం 8 గంటల వరకు సాగింది.ఈసందర్భంగా పలువురు భక్తులు గంగమ్మకు ఎదురుగుంభంగా ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. ఆసాదులు దారిపొడవునా కథ చెబుతూ.. దీవెనలిస్తూ సాగారు. ఈ ఏడాది జాతరలో దాదాపు లక్షమందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకుల అంచనా. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు గురువారం పొద్దుపోయే వరకు దారివెంబడి నీళ్లు,, మజ్జిగ పాకెట్లు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. జాతర నిర్వాహకులు, పోలీసు అధికారుల సమష్టి కృషి ఫలితంగా బలిజపల్లె గంగమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్హెగ్డే ఆధ్వర్యంలో రాజంపేట అర్బన్, మన్నూరు సీఐలు, ఎస్ఐలు, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది, ముఖ్యంగా మహిళా పోలీసులు రాత్రి వేళలో సైతం భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించడంలో, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కృషి చేశారు. కోటి రూపాయలకు పైగా వ్యాపారం బలిజపల్లె గంగమ్మ జాతరను పురస్కరించుకొని వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగాయి. వందలాది మంది భక్తులు గంగమ్మకు నైవేద్యాలుగా పొట్టేళ్లు, మేకపోతులు, కోడిపుంజులు వంటివి సమర్పించారు. అలాగే బలిజపల్లె గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేశారు.ఈ ఏడాది దాదాపు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ముగిసిన జాతర ఘట్టం పొలిమేర్లకు తరలిన అమ్మవారు -
రక్తమోడిన రహదారులు
రాజంపేట : రాజంపేటలోని తిరుపతి, కడప బైపాస్ రోడ్లో శుక్రవారం వేర్వేరు రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఓబులవారిపల్ల మండల గాడివారిపల్లెకుచెందిన కోటకొండ సుబ్బమ్మ (56), తిరుపతి ఆటోనగర్కు చెందిన పూర్ణచంద్రరాజు మృతి చెందారు.పోలీసులు స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీళ్లు చల్లించేందుకు వచ్చి కాటికి... తిరుపతి ఆటోనగర్కు చెందిన పూర్ణచంద్రరాజు , బత్తలబాలాజీ, కృష్ణమనేని శశిధర్లు గురువారం రాత్రి కడపకు కారులో బయలుదేరారు. రాజంపేట బైపాస్లో ఉస్మాన్నగర్ వద్దకు రాగానే ప్రైవేటుబస్సు, కారు ఢీ కొన్నాయి. ముందుసీటులో ఉన్న పూర్ణచంద్రరాజు అక్కడక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న బత్తలబాలాజీ, వెనక సీట్లో కూర్చున్న కృష్ణమనేని శశిథర్ గాయపడ్డారు.బత్తల బాలాజీ పెద్దనాన్న ఇటీవల మృతి చెందారు. పెద్దకర్మలో భాగంగా వీరు నీళ్లు చల్లించేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. విషాదం నింపింది.వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
పెళ్లికి బయలుదేరి..
ఓబులవారిపల్లె మండలానికి చెందిన కోటకొండ సుబ్బమ్మ (56) రాజంపేటలో జరిగే పెళ్లికి శుక్రవారం బయలుదేరింది. తిరుపతి నుంచి తాడిపత్రికి వెళుతున్న కారులో ఓబులవారిపల్లె మండలం వడ్డెపల్లెకు చెందిన మహాలక్ష్మీ ,జీ.ప్రసాద్, శివయ్య, వెంకటసుబ్బమ్మ, ఏరుకులమ్మలు కారులో ఉన్నారని పోలీసులు తెలిపారు. రాజంపేట మండలం వెంకటరాజంపేట వద్ద కారును ఎదురుగా కడప నుంచి ఓబులవారిపల్లెకు వెళుతున్న సిమెంట్లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో కోటకొండ సుబ్బమ్మ మృతి చెందింది. స్ధానికులు కారులో ఉన్నవారిని బయటికి తీశారు. స్ధానికులు 108కు ఫోన్ సమాచారం ఇచ్చారు. గంటసేపటి వరకు రాలేదని ఆ గ్రామానికి చెందిన పూలభాస్కర్ విమర్శించారు. -
అధికార బలంతో అక్రమ నిర్మాణం
ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని బుడ్డాయపల్లెలో అధికార పార్టీ బలంతో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అక్రమ నిర్మాణం చేపడుతోంది. యధేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుడ్డాయపల్లెలోని సర్వే నంబర్ 344/2లో 77 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో మున్సిపల్ స్థలం పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలాన్ని గీతాంజలి స్కూల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 15 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి స్కూల్ నిర్మించారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం స్కూల్ ముందు ఉన్న 7 సెంట్ల మున్సిపల్ స్థలంలో అదనపు భవనాలను నిర్మిస్తున్నారు. ఈ 7 సెంట్ల స్థలం విలువ రూ.కోటికిపైగా అవుతుంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ మాత్రం పట్టించుకోని స్కూల్ కరస్పాండెంట్ తనకు అధికార పార్టీ నేతల అండ ఉందని, సమస్య రాకుండా తాను చూసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా యధావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కళ్లు తెరవకపోతే మిగతా స్థలం కూడా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై పాఠశాల కరస్పాండెంట్ శివరామిరెడ్డిని వివరణ కోరగా మున్సిపల్ స్థలంలో కేవలం ప్రహరీ గోడను మాత్రమే నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లల రక్షణ కోసమే నిర్మిస్తున్నామని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రహరీని తొలగిస్తామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.7 సెంట్ల మున్సిపల్ స్థలంలో ప్రైవేట్ స్కూల్ నిర్మాణం -
నీటి ఎద్దడి లేకుండా చూడండి
కడప సెవెన్రోడ్స్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన నీటి ఎద్దడిపై ఆరా తీశారు. ఇందుకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు బదులిస్తూ రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, చెన్నూరు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు నిధులు కావాలంటూ తరచూ జెడ్పీటీసీలు అడుగుతుంటారని చెప్పారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే నిధులు సమకూరుతాయని తెలిపారు. గ్రామీణ రహదారుల గురించి జెడ్పీ చైర్మన్ సమీక్షించారు. ఇందుకు పంచాయతీరాజ్ ఎస్ఈ బదులిస్తూ జిల్లాలో 20 బీటీ రోడ్ల మరమ్మతులకు రూ. 65 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోందన్నారు. 74 బీటీ రోడ్ల పనులు రూ. 35 కోట్ల తో, 79 మెటల్ రోడ్ల పనులు రూ. 17 కోట్లతో పూర్తి చేశామని వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లించాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ జువారి సిమెంటు కర్మాగారం నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళి వద్ద ఇప్పటికే 10 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతి చెందారన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లారని, ఇందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెనగలూరు జెడ్పీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
రేషన్కార్డుదారులు ఈ–కేవైసీ చేసుకోవాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని రైస్ కార్డుదారులలో ఇంకా ఈ–కేవైసీ పూర్తి చేయించుకోని సభ్యులు వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణ డీలర్, స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటికీ మొత్తం 39,104 మంది ఈ–కేవైసీ పూర్తి చేయించుకోలేదని, అందులో అత్యధికంగా కడప నియోజకవర్గంలో 7,633 మంది, ప్రొద్దుటూరులో 4,297 మంది, రాజంపేటలో 3,029 మంది ఈ–కేవైసీ చేయించుకోవలసి ఉందని వివరించారు. అందువల్ల జిల్లాలోని అన్ని తహశీల్దార్లు, సీఎస్డీటీలు తమ పరిధిలోని వీఆర్వోలు, రేషన్ దుకాణ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, పెండింగ్లో ఉన్న ఈ–కేవైసీలను ఈ–పోస్ లేదా జీఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్ ద్వారా త్వరితగతిన పూర్తి చేయించవలసిందిగా ఆదేశించామన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి
బద్వేలు అర్బన్ : జీరామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల సందర్భంగా గురువారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా మార్కెట్యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్యార్డు ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేస్తోందని అన్నారు. నిధుల కేటాయింపులో బాధ్యత నుండి తప్పుకునేలా వ్యవహరిస్తోందని, దీనివల్ల ఉపాధి హామీ కూలీలకు కూలీ గిట్టుబాటు కాక పనులు సరిపడక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికి మూడు సెంట్లు ఇంటి స్థలంతో పాటు నిర్మాణ వ్యయానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, అన్వేష్, సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, ఆవాజ్ జిల్లా కార్యదర్శి చాంద్బాష, సీపీఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జాతర.. జనసంద్రం
రాజంపేట పట్టణంలోని బలిజపల్లెలో గురువారం గంగమ్మ జాతర సంబరం అంబరమంటింది. బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైన జాతరలో భాగంగా తొలుత నారపురెడ్డిపల్లె నిర్వాహకులు, ప్రజలు గంగమ్మ సోదరుడైన పోతురాజును ఊరేగిస్తూ అమ్మవారికి నవధాన్యాలు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మకు పుట్టినిల్లయిన తుమ్మల అగ్రహారం నుంచి ఆ గ్రామ మహిళలు పెద్దఎత్తున గండదీయలను బలిజపల్లెకు తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆ గ్రామానికి చెందిన నిర్వాహకులు, యువకులు తప్పెట్ల దరువుకు, కేరళా వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. కర్రసాము విన్యాసాలతో.. బాణాసంచా వెలుగులతో బలిజపల్లెకు చేరుకున్నారు. బలిజపల్లెలో అమ్మవారి ప్రతిమ తయారైన అనంతరం నిర్వాహకులు గురువారం తెల్లవారుజామున రథంలో గంగమ్మను ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలోకి తీసుకొచ్చి కొలువు దీర్చారు. గంగమ్మను గుడిలోకి తీసుకొచ్చే సమయంలో భక్తులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. చల్లంగా చూడాలని వేడుకున్నారు. గంగమ్మను దర్శించుకున్న ఆకేపాటి, పోలా జాతర సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ కరుణతో ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. –రాజంపేట టౌన్ -
ఇల్లు.. ఇంకెన్నాళ్లు!
కడప సిటీ : గ్రామీణ ప్రాంత పేద ప్రజలపై కూటమి ప్రభుత్వం కత్తిగట్టింది. వారి సొంతింటి కల సాకారానికి అడుగడుగునా అడ్డుపడుతోంది. ఇదిగో అదిగో అంటూ సర్వేలతోనే కాలయాపన చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0తో పట్టణ ప్రజలకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 గ్రామీణ పేరుతో పల్లెవాసులకు అర్హులకు ఇళ్లు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకం పట్టణాల్లోనే అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమలు కావడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహ నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే సర్వే చేసి నివేదికలు ప్రభుత్వానికి అందజేశారు. సర్వే పూర్తయి చాలారోజులైనప్పటికీ ఇళ్లు మంజూరు కాకపోవడంతో పల్లె ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరుణించని బాబు సర్కారు ఒకటా రెండా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు కోసం అధికారులు సర్వే చేసి నెలలు గడుస్తోంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అనర్హులను తొలగించి అర్హుల జాబితా నివేదికలను ప్రభుత్వానికి కూడా అందజేశారు. కానీ ఇల్లు మంజూరుకు కూటమిసర్కారుకుమనసు రావడం లేదు. మరోవైపు పీఎంఏవై అర్బన్ 2.0 అనే పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం సాగుతోంది. నియోజకవర్గాల వారీగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై 2.0 పథకం కింద ఇప్పటివరకు 36,477 మందికి ఇళ్లు అవసరమని సర్వేలో తేల్చారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కమలాపురంలో 3987, ప్రొద్దుటూరు 3747, జమ్మలమడుగు 5,805, పులివెందుల 6088, రాజంపేట 8991, బద్వేలు 3982, మైదుకూరు 3877, రాజంపేటలో 8991 ఇళ్లను నిర్మించుకునేందుకు మంజూరు చేయాలని అఽధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు కాని ఇళ్లు సర్వేతో కాలయాపన 30 వేల ఇళ్లు మంజూరు ఎప్పుడో? -
మధురఫలం.. విషతుల్యం
● కార్బైడ్తో ఆరోగ్యంపై తీవ్రప్రభావం ● మార్కెట్లోకి విచ్చలవిడిగా పండ్లు ● దాడులు చేసిన దాఖాలాలు లేవు ● అమలుకాని ఆహారసంరక్షణచట్టంరాజంపేట : ఫలరాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యంగా మారుతోంది. పక్వానికి రాకముందే కాయలను విష రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. కార్బైడ్తో మాగిన పండ్లు తిన్న వారికి అనారోగ్యసమస్యలు వస్తున్నాయి. ఒకసారి తిన్న వ్యక్తి మరోసారి తినేందుకు ఇష్టపడటంలేదు. రాజంపేట వ్యవసాయమార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైల్వే కోడూరుకు మామిడి కాయలను తీసుకెళుతున్నారు. ధరలేక.. తగ్గిన మామిడిసాగు.. మామిడికి సరైన ధర లేదనే కారణంతో జిల్లాలో మామిడి సాగు తగ్గిపోయింది. నిల్వ ఉంచుకునేందుకు ఏసీ గౌడౌన్లు లేవు. ఎగుమతులకు సరైన అవకాశాలు లేవు. దళారుల వల్ల మామిడి రైతులు నష్టపోతున్నారు. తినేవాడికి..పండించే వాడికి మధ్యలో దళారులకు లాభం చేకూరుతోంది. కాపు వచ్చేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. తియ్యటిపండ్ల వెనుక చేదు నిజాలు.. 2011 ఆహార భద్రత ప్రమణాల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది, సహజంగా పండించే ఇథలిన్కు మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథలిన్ను వినియోగించాల్సి ఉంటుంది. వ్యాపారులు పండ్లు మేలిమిగా కనిపించేందుకు కార్బైడ్ను వినియోగిస్తున్నారు. అమోదించిన ఇథిలిన్తో పోల్చితే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తాయి. త్వరగా పండ్లు మాగుతాయి. దీంతో వ్యాపారులు యథేచ్చగా కార్బైడ్ వాడుతున్నారు. తింటే ఏమవుతుందంటే.. ప్రమాదకర రసాయనాలతో పక్వానికి వచ్చిన పండ్లను తింటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో పుండ్లు ఏర్పడతాయి. కాలేయం, జీర్ణకోశం దెబ్బతింటాయని, క్యాన్సర్ వంటివి వ్యాపించే ప్రమాదం ఉందని, కాళ్లు, చేతులు, తిమ్మర్లు రావడం శరీరం పై మచ్చలు వస్తాయని చెబుతున్నారు. కాల్షియం కాౖర్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని, దీని వల్ల తలనొప్పి , దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని, గర్భిణుల్లో హోర్మన్లు దారితప్పుతాయని చెబుతున్నారు. జరిమానా.. జైలు శిక్ష తప్పదు.. ఆహారసంరక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాలతో మామిడిపండ్లను మాగబెట్టినా, అమ్మినా ఏడాది జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో అధికారులు కొన్నేళ్లుగా దాడులు చేసిన దాఖాలాలు లేవు. దీంతో విచ్చలవిడిగా ప్రమాదకర రసాయనాలతో మాగబెట్టిన పండ్లను వ్యాపారులు విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. వ్యాపారులు పండ్లు పక్వానికి రాకముందే కాయలు కోసి మండీలకు తరలించి కార్బైడ్ ఇతర ప్రమాదకర రసాయనాలు వినియోగించి మాగబెడుతున్నారు. మాగబెట్టిన వాటిని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. వీధి వ్యాపారులు మండ్లీలో నుంచి వీటిని తెచ్చుకొని వ్యాపారాలు సాగిస్తూ అనారోగ్యాన్ని పంచుతున్నారు. -
ఇద్దరి మరణానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 1న జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లెకు చెందిన అందె నరసింహలు, నంద్యాల జిల్లా, చాగమలమర్రికి చెందిన ఆకుమల్ల షరీఫ్, చిన్నవంగలికి చెందిన ఇమాంఖాసీంలు నిలుచుని ఉండగా నంగనూరుపల్లెకు చెందిన పోతుబోయిన సుమన్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడుపుతూ ఈ ముగ్గురు వ్యక్తులను ఢీ కొన్నాడు. ఈ ఘటనలో అందె నరసింహులు, ఆకుమల్ల షరీఫ్లు అక్కడిక్కడే మృతి చెందగా ఇమాంఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్తో వారిని ఢీ కొన్న అతను అక్కడి నుంచి ట్రాక్టర్తో సహా పరారయ్యాడు. రూరల్ సీఐ నాగభూషణ్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐలు శ్రీకాంత్, రాజులు నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో డ్రైవర్ పోతుబోయిన్ సుమన్ను గురువారం అరెస్ట్ చేశారు. పట్టణ శివారు ప్రాంతంలో దాచిన ట్రాక్టర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించనున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇమాంఖాసీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
వేముల : రోడు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన వేముల సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన జయపాల్రెడ్డి, గంగన్నలు ద్విచక్రవాహనంలో పులివెందులలో జరిగే వివాహానికి బయలుదేరారు. వీరు వేములకు సమీపంలోని చెరువు కట్ట వద్దకు రాగానే వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జయపాల్రెడ్డి (65) మృతి చెందగా, గంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు శివమోహన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. -
కడప–బద్వేలు రహదారిలో చిరుత సంచారం
సిద్దవటం : సిద్దవటం రేంజ్లోని కడప–బద్వేల్ ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి చిరుతపులి సంచరించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రధాన రహ దారి నుంచి అడవిలోకి వెళ్తున్న చిరుతను చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళన చెందారు. వాహనదారులు రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. లంకమల అభయారణ్యంలో వన్యప్రాణులున్న విషయం తెలిసిందే. కడప ఎడ్యుకేషన్: విద్యాహక్కుచట్టం (ఆర్టీ ఈ 12.1 సి) కింద రెండు విడతలో జిల్లాకు 254 సీట్లు లాటరీలో కేటాయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. 1 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో 254 మందికి అడ్మిషన్లు లభించాయన్నారు. ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్ల ద్వారా సమాచారం పంపినట్లు తెలిపారు. ఈ నెల 17లోగా ఎంపికై న విద్యార్థులు ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఆయా ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోకుంటే చర్య లు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంఈఓలు చర్యలు తీసుకుని అడ్మిషన్ గడువు తేదీలోపు పూర్తి చేయాలని డీఈఓ ఆదేశించారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్) ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు కడప నగరంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుందని యోగి వేమన విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి. లక్ష్మి ప్రసాద్ తెలిపారు. యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థుల సౌకర్యార్థం ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఈనెల 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు సైకాలజీ సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభవుతాయని పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో ప్రతి రోజు 3 సెక్షన్లలో ఉదయం 9 గంటలకు, మధ్యా హ్నం 12:30 గంటలకు సాయంత్రం 4 గంటలకు పరీక్షలు సబ్జెక్టుల వారీగా ఉంటాయన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లలోని సమయాన్ని గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు. కేఎస్ఆర్ఎం కళాశాల కేంద్రంగా నాలుగు రోజులపాటు జరిగే పరీక్షలకు 859 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. కడప సెవెన్రోడ్స్: దేశ స్వాతంత్య్రం కోసం చిన్న వయస్సులోనే ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావా లని ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి అన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు వర్దంతిని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన అల్లూరి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఇన్చార్జి డీఆర్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరు దొంగలు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారులోని ఇందిరానగర్ కాలనీలో ఉ న్న సీతారాముని ఆల యంలో గత నెల 30న చోరీకి పాల్పడిన ఇద్ద రు నిందితులను రూర ల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన వెంటనే కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐలు శ్రీకాంత్, రాజులు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో చోరీకి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సుందరాచార్యుల వీధికి చెందిన పిట్టా బాలజి, అమృతానగర్కు చెందిన షేక్ ఇబ్రహీంలను గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గణపతి విగ్రహం, రూ.1500, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు వివరించారు. ప్రభుత్వాసుపత్రిలో మహిళా జూనియర్ అసిస్టెంట్పై దాడి మదనపల్లె టౌన్ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్ పై అదే విభాగంలో పనిచేసే మరో జూనియర్ అసిస్టెంట్ దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. గురువారం వెలుగు చూసిన ఘటనపై బాధితురాలి కథనం.. ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే నందిని పై అదే విభాగంలో పని చేస్తున్న మరో జూనియర్ అసిస్టెంట్ సాయి ఆస్పత్రి స్కానింగ్ రూములో అందరూ చూస్తుండగానే బుధవారం చేయి చేసుకున్నాడు. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యం అందించడంతో కోలుకుంది. దాడి వ్యవహారం ఆస్పత్రి ఆర్ఎంఓ రాధిక దృష్టికి వెళ్లడంతో మహిళా జూనియన్ అసిస్టెంట్ నందినితో పాటు మరో జూనియర్ అసిస్టెంట్ సాయిని చాంబర్ కు పిలపించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఏ వైనా వ్యవహారాలు ఉంటే అస్పత్రి బయట చూసుకోవాలే తప్ప ఇక్కడ కొట్టు కోవడాలు, బెదిరించడం చేస్తే కేసులు పెట్టాల్చి వస్తుందని హెచ్చరించి పంపేసిందనిఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరూ గత కొంత కాలంగా సన్నిహితంగా ఉండేవారని తెలిసింది. ఇద్దరి మద్య ఏం జరిగిందో ఏమో కొట్టుకోవడం వెలుగులోకి రావడంతో అస్పత్రిలో వ్యవహారం తీవ్ర చర్చినియాంశంగా మారింది. -
నేటి నుంచి గండిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట: ప్రముఖ గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నాలుగున్నరేళ్లుగా అంజన్న మూల విరాట్ దర్శనం లేక నిరుత్సాహంతో ఉన్న భక్తులకు కుంభాభిషేకం అనంతరం దర్శనం కలగనుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి సుమారు రూ. 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గండి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహాకుంభాభిషేకం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి పట్టెం గురుప్రసాద్ తెలిపారు 9న శ్రీరామ సహస్ర లక్ష తులసీ అర్చన, 10న సీతా సహస్ర లక్ష కుంకుమార్చన, 11న ఆంజనేయ సహస్రనామ నాగవళ్లి దళార్చన, 12న హనుమజ్జయంతి సందర్భంగా మూలవర్లకు సహస్ర కలశాభిషేకం, చివరిరోజు 13న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. -
8న బాస్కెట్ బాల్ వేసవి శిక్షణ శిబిరం
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరం జయనగర్ కాలనీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 8న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి జూన్ 8 వరకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు. తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డిసర్కిల్ : వేసవి రద్దీని పురస్కరించుకుని తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలును నడపుతున్నారని కడప రైల్వేకమర్షియల్ మేనేజర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రైలు (07433) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి,డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తిరోడ్డు, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్, ముడ్కేడ్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోల, మల్కాపూర్, ఖాడ్వా, ఇట్సాసి, భూపాల్, బిన, లక్ష్మీభాయిజాన్సీ, ఓరాయి కన్పూర్, లక్నో, అయోధ్య కెంట్, అయోధ్యమ్, బస్తీ, గోరక్పూర్, సిజ్వాన్ మీదుగా చాప్రాకు 10వ తేది ఉదయం 7.45 గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 12వ తేదీ ఉదయం 5.00 గంటలకు చాప్రాలో బయలుదేరి 14వ తేది మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుతుందని తెలిపారు. రెమెడియల్ తరగతులకు హాజరుకావాలి – పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ కడప ఎడ్యుకేషన్: ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రెమెడియల్ తరగతులకు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్లాస్ టీచర్స్ బాధ్యత తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ ఆదేశించారు. బుధవారం కడప నగరంలోని నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ప్రభుత్వ పాఠశాల, నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ పాఠశాలలలో నిర్వహిస్తున్న తరగతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెమెడియల్ క్లాసుల నిర్వహణ బాధ్యతలను మండల విద్యాశాఖ అధికారులు ఉపవిద్యా శాఖ అధికారులతోపాటు జిల్లా విద్యా శాఖ అధికారి ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి సప్లిమెంటరీలో పాస్ అయ్యే విధంగా ప్రణాళిక బద్ధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి అహ్మద్, ఇర్షాద్ అహ్మద్ పాల్గొన్నారు. -
కల్యాణం..కమనీయం !
కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు కల్యాణ వేదికపై ఆశీనులపై స్వామి, అమ్మవార్లు జమ్మలమడుగు: నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి,భూదేవి సమేతుడైనా దేవదేవుడి కల్యాణం కన్నులపండువగా సాగింది. బుధవారం సాయంత్రం తిరుమల తిరుపతికి చెందిన పండితులు వేదమంత్రాలతో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. దేవదేవుడి కల్యాణం వీక్షించడానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సర్వభూపాలుడిపై ఊరేగింపు... నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సర్వభూపాలుడి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు రథోత్సవం... బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నిమిషాలకు స్వామి వారికి ప్రత్యేక అలంకారంతోపాటు పూజల అనంతరం 8గంటల నుంచి ఆలయ ప్రాంగణం నుంచి స్వామి వారి రథోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు వాస్తు దోషమంటా..
● ప్రధాన ద్వారం గేటు మార్చాలని ఎస్ఐ హుకుం జారీ ● అవాక్కవుతున్న సిమెంట్ కంపెనీల డీలర్లు, బ్రిక్స్ యజమానులుసాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లాలోని సింహాద్రిపురంలోని పోలీస్స్టేషన్కు వాస్తు దోషమని ప్రధాన ద్వారానికి తాళం వేసి మరొక గుమ్మం ద్వారా పోలీసులు నడుస్తున్నారు. దీంతో పోలీస్స్టేషన్ మెయిన్ ద్వారానికి తాళం వేయడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఇదేమిటని పోలీసులను ప్రశ్నించడంతో స్టేషన్కు వాస్తు దోషం పట్టిందని చెబుతున్నారు. పోలీస్స్టేషన్కు వాస్తు దోషంవల్ల అనర్థాలు జరుగుతున్నాయని జ్యోతిష్యుడు చెప్పారని పోలీసులు తెలిపారు. బయట ఉన్న ఇనుప గేటును మార్చాలని జ్యోతిష్యుడు చెప్పడంతో గత నెల 21న పోలీసులు ఈ చర్య చేపట్టారు. 2023లో రూ. కోటి వ్యయంతో అన్ని హంగులతో పోలీస్స్టేషన్ను నిర్మించారు. అప్పటినుంచి ఎందరో పోలీసులు, ఎస్ఐలు వచ్చి ఉద్యోగాలు చక్కగా చేశారు. అలాగే కొందరు ఎస్ఐలు సీఐలుగా పదోన్నతి కూడా పొందారు. కానీ 2026 ఫిబ్రవరిలో లంచం తీసుకుంటూ ఎస్ఐ, సీఐలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం విధితమే. లంచం తీసుకుంటూ పట్టుబడినా కూడా వాస్తు దోషమని చెప్పడం ఎంతవరకు సమంజసమో వారికే అర్థమవ్వాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉన్న ప్రధాన ద్వారాలకు తాళం వేసి వేరే ద్వారం గుండా నడుస్తుండడం, ప్రధాన గేటును కూడా మూసివేసి ఇంకో భాగానికి మార్చాలనుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడినా కూడా దీనికి పోలీసులు వాస్తు దోషం అనడంపై విస్మయం చెందుతున్నారు. అయినా ఎస్ఐ ఇవేమీ పట్టించుకోకుండా గత మంగళవారం ఐదు కంపెనీల సిమెంట్ డీలర్లను, ఇద్దరు బ్రిక్స్ యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి సిమెంట్, ఇటుకలు ఉచితంగా పోలీస్స్టేషన్కు అందించాలని హుకుం జారీ చేశారు. ఎస్ఐ సడన్గా వారితో ఈ మాట అనడంతో డీలర్లు ఆయనకు ఏమి చెప్పాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. -
టూరిజం పేరుతో ప్రైవేటీకరణకు కుట్ర
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని, కేవలం ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ విమర్శించారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన స్థానిక హరిత హోటల్ ను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరిత హోటల్స్లో గతంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న గదుల అద్దెలను ఇప్పుడు ‘డైనమిక్ పాలసీ’ పేరుతో విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. విమాన టికెట్ల తరహాలో గంటగంటకు రేట్లు మారుస్తూ, ఉదయం రూ. 2వేలు ఉన్న గదిని మధ్యాహ్నానికి రూ. 4 వేలు వసూలు చేయడం పర్యాటకులను దోచుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక రంగంపై తనకు ఎంతో మక్కువ ఉందని చెప్పుకునే చంద్రబాబు, మరి ఆ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం ఆచరణలో శూన్యమని ఎద్దేవా చేశారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేయడం వల్ల వందలాది మంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీని ప్రసన్నం చేసుకునే క్రమంలో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది మరోకటి ఇప్పటికై నా మాటలు కట్టిపెట్టి క్షేత్రస్థాయిలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ జాతీయ నేత కె. నారాయణ ధ్వజం -
ఆటోను ఢీకొన్న టిప్పర్
మైదుకూరు : మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లెకు సమీపంలో మైదుకూరు – బద్వేలు రహదారిపై బుధవారం టిప్పర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ పీట్ల సంటెయ్య (53) మృతి చెందాడు. ఆటోలో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సోమయాజులపల్లెకు చెందిన నాగసుబ్బయ్య కుమార్తె వివాహం రెండు రోజుల్లో జరగనుంది. ఆ సందర్భంగా ఇంటికి రంగులు వేయించేందుకు జీవీ సత్రంలోని టెంట్ హౌస్ నుంచి ఇనుప స్టాండ్లు అద్దెకు తీసుకొచ్చారు. రంగులు వేయడం అయిపోవడంతో స్టాండ్లను తిరిగి ఇచ్చేందుకు నాగసుబ్బయ్య కుమారుడు మల్లికార్జున బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన పీట్ల సంటెయ్య ఆటోలో తీసుకొని జీవీ సత్రానికి వెళుతున్నారు. పెద్దశెట్టిపల్లెకు సమీపంలో వెనుక వైపు నుంచి వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొంది. ఆటో జాతీయ రహదారిపై పల్టీలు కొట్టడంతో ఆటో డ్రైవర్ సంటెయ్య తలకు తీవ్ర రక్తగాయాలు కాగా, మల్లికార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. సంటెయ్యను చికిత్స కోసం 108 అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఒకరు మృతి -
‘సీమ’ ఎత్తిపోతల పనులు చేపట్టాలి
కడప సెవెన్రోడ్స్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరమణిరెడ్డి, కడప నగర అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ చంద్రగిరిలో విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న జోనల్ సమావేశానికి బుధవారం తరలివెళ్లారు. ఈ సందర్బంగా కడప ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద వారు మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఎత్తిపోతల పథకం జీవనాడిలాంటిదని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తరలిస్తోందని, ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు నీరందడం కష్టతరమవుతుందన్నారు. అందుకే వైఎస్ జగన్ ముందుచూపుతో సీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రయో జనాలను తెలంగాణకు తాకట్టుపెట్టి ఎత్తిపోతల పనులను చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వానికి సీమపై చిత్తశుద్ది ఉంటే ఈ పథకం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కడప, కర్నూలు జిల్లాల విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల చేతుల్లో చిక్కి శల్యమవుతున్న నదులు నిబంధనల హద్దులు మీరి.. ఇసుకను సరిహద్దులు దాటిస్తున్న పచ్చ నేతలు
సాక్షి అన్నమయ్య : తెలుగు తమ్ముళ్లు ఇసుకలో తైలం పిండుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ్ముళ్లకు ఆర్థిక వనరులు అనుకున్న మేర లభించలేదు. దీంతో ఉచిత ఇసుక పేరుతో దండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పలు నదుల్లో పొక్లెయిన్లు పెట్టి టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. చెయ్యేరు పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ కొనసాగుతున్నా ఎవరూ కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ● అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో విస్తరించి ఉన్న చెయ్యేరు నదిపై పచ్చనేతల కన్ను పడింది. ఒక వైపు ట్రాక్టర్ల ద్వారా ఎక్కడికక్కడ ఇసుక తోడేస్తుండగా, అది చాలదన్నట్లుగా మరోవైపు ఏకంగా టిప్పర్లు పెట్టి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించి పచ్చనేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. చెయ్యేరు ప్రాంతంలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల సరిహద్దులోని పలు గ్రామాల నుంచి ఇసుకను నిత్యం తరలిస్తున్నారు. జంగాలపల్లె సమీపంలోని దర్జిపల్లె వద్ద టిప్పర్లతో తోడేస్తున్నారు. అలాగే నందలూరు మండలంలోని కుమారునిపల్లె, బాలరాజుపల్లె సమీపంలో బుడుగుంటపల్లె, సుండుపల్లె మండలంలోని పలు ప్రాంతాలతోపాటు రామసముద్రం మండల పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను అటు బెంగుళూరు, ఇటు చైన్నెలకు తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చెయ్యేరు, పెన్నానదులకు ఇసుకాసురులు గర్భశోకం మిగుల్చుతున్నారు. అధికారులు ఒకచోట అనుమతులు ఇస్తే....కుంటి సాకులు పెట్టి మరొకచోట తవ్వుతూ ఇసుక దోపిడీ చేస్తున్నారు. కొన్నిమీటర్ల మేర మాత్రమే ఇసుకను తీయాల్సి ఉండగా, పెద్ద పెద్ద గుంతలు తీసి తరలిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా, మనకెందుకులే మనవారేనని కూటమి పెద్దలు చూస్తుండిపోతున్నారు. కొన్ని చోట్ల నదుల్లో దారులు ఏర్పాటు చేసుకుని ఇసుకను రాత్రిళ్లే కాకుండా పగలు కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల సుండుపల్లె మండలంలో ప్రజలు టిప్పర్లను సైతం అడ్డుకుని తిరుగుబాటు చేశారంటే అక్రమ తవ్వకాలు ఎలా కొనసాగిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఎప్పుడో ఒకసారి అలా నదుల్లో ఇసుకను కూటమి సర్కార్లోని కొంతమంది పెద్దలు దోపిడీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. పత్రికల్లో వార్తలు ప్రచురితమైతే అప్పుడప్పుడు అలా దాడులు జరిపి... పట్టుకున్నట్లు హడావుడి చేస్తున్నారు. రోజుల తరబడి ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా పట్టించుకోరుగానీ, ఎప్పుడో ఒకసారి దాడులు చేసి తామున్నామంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఏదిఏమైనా కూటమి సర్కార్ ఉచిత ఇసుక పేరుతో తెచ్చిన విధానం కొంతమంది పచ్చనేతల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోందని పలువురు పేర్కొంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లి చింతలకుంటవాళ్లపల్లి మార్గమధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పకీరమ్మ (68) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. కోనంపేట పంచాయతీలోని కాలాడివాళ్లపల్లికి చెందిన పకీరమ్మ ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం బ్యాంకులో అగ్రికల్చర్ సంబంధించిన పని పూర్తి చేసుకొని, కూరగాయలు తీసుకొని కాలాడివాళ్లపల్లెకు కాలినడకు వెళ్తుండగా కోనంపేట నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే రెండు కాళ్లు చేతులు విరిగిపోయి మృత్యువాత పడింది. ఈ మేరకు కార్ డ్రైవర్పై కేసు నమోదు చేసి మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. గుండ్లగుట్ట తాండాలో పిచ్చి కుక్క వీరంగం మదనపల్లె టౌన్ : గుర్రంకొండ మండలంలో పిచ్చికుక్క వీరంగం సృష్టించి పలువురి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ మండలంలోని గుండ్ల గుట్ట తండా లోకి ఎక్కడి నుంచో ఒక పిచ్చికుక్క ఉన్నట్లుండి వచ్చింది. కనిపించిన వారిని కనిపించినట్లే కరచి తీవ్రంగా గాయపరిచింది. పిచ్చికుక్క దాడి చేయడంతో గ్రామానికి చెందిన జయమ్మ (56), హరిత (28), నాగిరెడ్డి ( 37), తో పాటు మరో నలుగురు గాయపడడంతో వారిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నారు -
కణితిపై కుక్కల దాడి
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం కుక్కల దాడిలో వన్యప్రాణి కణితి తీవ్రంగా గాయపడింది. ఫారెస్ట్ అధికారుల వివరాల మేరకు..ఒంటిమిట్ట చెరువులోని నీరు తాగేందుకు సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన కణితిని 7 కుక్కలు వెంటాడి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో కణితి వెనుక వైపు ఉన్న కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. అయినా కుక్కలు కణితిని వెంటాడటం వదలలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు కణితి పొదల్లోకి దూరినా వేట ఆపలేదు. ఈ క్రమంలో అటుగా వెళుతూ అది చూసిన భవన కార్మికుడు యారాసి నాగరాజు వేటాడుతున్న కుక్కలను చెదరగొట్టి, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ముళ్ల పొదల్లో ఇరుక్కున్న కణితిని కాపాడి, చికిత్స నిమిత్తం స్థానిక పశువైద్య శాలకు తరలించారు. అక్కడ ఒంటిమిట్ట పశుసంవర్ధక శాఖ ఏడీ ఉమా కణితికి ప్రథమ చికిత్స అందించి, ఫారెస్ట్ సిబ్బందిని మూడు రోజుల పాటు కణితికి వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. అనంతరం గాయపడిని కణితిని స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంకడప ఎడ్యుకేషన్ : కడపలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ మునీష్ మీనా తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశాలు కేవలం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకే కాకుండా, స్టేట్ బోర్డ్ (ఇ) మరియు ఇతర నాన్–కేవి విద్యార్థులకు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 5వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 70361 56284, 08662–225661 నెంబర్లతోపాటు పాఠశాల వెబ్సైట్ https://kadapa.kvs.ac.in/ ను సందర్శించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం మదనపల్లె టౌన్ : టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుంగునూరు మండలం అడవినాధుని కుంటకు చెందిన రైతు చెన్నారెడ్డి కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి(51), సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లి కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా మార్గమధ్యలోని పుంగనూరు రోడ్డు నయారా పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ ఢీ కొట్టి రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. -
చారాల వద్ద రోడ్డు ప్రమాదం
మదనపల్లె టౌన్ : చౌడేపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి బాధితుల కుటుంబీకుల కథనం.. చౌడేపల్లి మండలం, చారాల పంచాయతీ, మొటుకుపల్లి కు చెందిన దంపతులు ద్విచక్ర వాహనంలో సొంత పని మీద చౌడేపల్లి కు బయలు దేరారు. స్కూటర్ మార్గ మధ్యంలోని చెరువు ముందర వడ్డిపల్లె వద్ద కు రాగానే ఎదురుగా వస్తున్న ఓ బస్ ను తప్పించబోయి బైకు అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో భార్య, భర్తలు మునిరాజా(30), మంగ (26) లతో వారి కుమారుడు సంతోష్ 8 కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి దంపతులతోపాటు సంతోష్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ట్రాక్టర్ ను ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొని ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకి చెందిన రైతు ఎస్.వెంకటరమణ (50) వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను పిలవడానికి పొరుగు గ్రామమైన దండువారి పల్లెకు బైకుపై బయలుదేరాడు. స్కూటర్ మార్గ మధ్యంలోని దండువారిపల్లె సమీపానికి వెళ్ళగానే రోడ్డు పక్కన లైట్లు ఆర్పి నిలబెట్టి ఉన్న ట్రాక్టర్ను గుర్తించలేక ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతును స్థానికులు గమనించి చికిత్స కోసం మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. కారు ఢీకొని తమిళనాడు వాసికి.. మదనపల్లె టౌన్ : కారు ఢీకొని తమిళనాడు వాసి తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం తిరుచి గ్రామానికి చెందిన నెహ్రు రాజా(48), వరి కోత యంత్రాన్ని తీసుకుని పుంగనూరు మండలం ఈడిగపల్లి కు వచ్చాడని తెలిపారు. గ్రామానికి సమీపంలోని ఓ రైతు పొలంలో మరో డ్రైవర్ పంట వడుపు తుండగా, వాహనానికి డీజిల్ అవసరమై క్యాన్ తీసుకొని ఈడికి పల్లె వద్దకు వచ్చాడు. పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటే క్రమంలో ఓ కారు వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం అతడి పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా పై వేలూరుకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పుంగనూరు పోలీసులు తెలిపారు. -
చనిపోకనే పెన్షన్ ఇచ్చి ప్రాణాలు నిలపండి
మదనపల్లె టౌన్ : తాను డయాలసిస్ చేయించుకుంటూ రోజులు లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తున్నాను. రోజూ డయాలసిస్ చేయించు కోవడానికి ఆర్థిక స్తోమత లేదు. డయాలసిస్ చేయించుకోకుంటే ఎప్పుడు చనిపోతానో చెప్పలేమని వైద్యులు తెలిపారు. డయాలసిస్ చేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. తన బాధను అర్థం చేసుకుని, పెన్షన్ మంజూరు చేయిస్తే కొంతకాలమైనా బతుకుతానని ఆశగా ఉంది. ఈ అభాగ్యురాలిపై దయతలచి పెన్షన్ మంజూరు చేయించండి సారూ.. అంటూ ఓ యువతి డీఎంహెచ్ఓ ను బుధవారం కలిసి వినతి పత్రం అందజేసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలం , మద్దినాయినిపల్లె పంచాయతీ, బండపల్లికి చెందిన వెంకటరమణ, రామలక్ష్మి దంపతుల కుమార్తె రవణమ్మ (21). ఈమె ఇంటర్ వరకు చదువు కుంది. చదువుకునే సమయంలో కడుపునొప్పి అని వెళితే మదనపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యుడు మూడు సార్లు ఆపరేషన్ చేసి తన రెండు కిడ్నీలు పాడయ్యేలా చేశాడని తెలిపింది. అప్పటి నుంచి గత ఆరేళ్లుగా డయాలసిస్ తో ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ పెన్షన్ కోసం తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.. ఇటీవల మదనపల్లె కలెక్టరేట్ కు వెళ్లా పీజీఆర్ఎస్ లో కలెక్టర్కు మొరపెట్టుకుంటే వారు డీఎంహెచ్ఓ వద్దకు వెళ్లాలని రాసిచ్చినట్లు తెలిపింది. అందుకే మీ వద్దకు వచ్చాననీ.. తమరైనా పెన్షన్ మంజూరు చేయండని సారూ.. అంటూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్యను రవణమ్మ వేడుకుంది. -
యువతి ఆత్మహత్యపై అనుమానాలెన్నో..?
జమ్మలమడుగు : ఇటీవల ఉప్పలపాడు సమీపంలో బీటెక్ యువతి లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి కుమారుడితో ప్రేమాయణం నడిపి అతని చేతిలో మోసపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందా అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యువతి లావణ్య బీటెక్ చదువుకుంది. రెండు సంవత్సరాల క్రితం పట్టణంలోని ఒక ‘జిం’ సెంటర్లో ఇరువురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వ్యాపారస్తుడి కుమారుడు తనకు పెళ్లి కాలేదని పెండ్లి చేసుకుంటానని లావణ్యతో ప్రేమాయణం నడిపించాడు. అయితే అప్పటికే వివాహం జరిగి అతనికి పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతికి నిజం తెలియడంతో తనను మోసం చేశాడని గతంలో అతనితో గొడవ పడటం జరుగుతూ వచ్చింది. ఇంటి వద్దకు వెళ్లి గొడవపడ్డారు.. యువతి కుటుంబ సభ్యులు పట్టణంలోని వస్త్ర వ్యాపారి ఇంటి వద్దకు వెళ్లి తమ పాపతో అక్రమ సంబంధం కలిగి ఉండటంపై ఇంటి వద్దకు వెళ్లి గొడవపడినట్లు సమాచారం. అయితే కొంత మంది పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి పంపించేశారు. దీంతో వ్యాపారి కుటుంబంలో సైతం భార్యభర్తలు గొడవపడినట్లు సమాచారం. మీకు న్యాయం చేయించే బాధ్యత తమదేనంటూ కొంత మంది భరోసా ఇచ్చి పంపించారని తెలిసింది. ఆత్మహత్యకు ప్రేరణ కల్పించిందెవరు! యువతి లావణ్య దొమ్మరనంద్యాల గ్రామం నుంచి పట్టణంలోని పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని ఆత్మహత్య చేసుకోవటానికి తీసుకుపోయింది. అయితే అప్పటికే ఆమె పట్టణంలో ఎవరితో మాట్లాడింది.. ఏమి జరిగిందో ఏమో తెలియదు కాని నేరుగా పెట్రోల్ బంకు వద్ద బాటిల్లో పెట్రోల్ పోయించుకుని కోవెలకుంట్ల బైపాస్ వద్ద నుంచి నేరుగా ఉప్పలపాడు రహదారిలో ఉన్న రోడ్డు పక్కన ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే పెట్రోల్ పట్టించుకునే ముందు సైతం ప్రేమించిన వ్యక్తికి ఫోన్ చేసి తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిందని.. నీవు చస్తే నాకేమిటని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. మృతురాలు చివరి కాల్ కూడా అతనికే చేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో లావణ్యకు సంబంధించిన ఫోన్ మాయమైపోయింది. ఆమె ఎవరితో మాట్లాడిందన్న కోణంతోపాటు, ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్లో ఎవరితో మాట్లాడిందన్న విషయాన్ని బయటకు తీస్తే ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపించిన వ్యక్తుల వివరాలు బయట పడుతాయని లావణ్య బంధువులు , గ్రామస్తులు పేర్కొంటున్నారు. యువకుడికి పెండ్లి అయినా కూడా కాలేదని ఆమెను మోసం చేశాడని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోర్టుమార్టం రిపోర్టు వస్తే తెలుస్తుంది.. లావణ్య మృతికి కారణం ఏమిటో అన్న విషయం పోర్టుమార్టం రిపోర్టులో తెలుస్తుంది. ఆ రిపోర్టులో ఆమె గర్భవతా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి మేమేమీ చెప్పలేము. – నరేష్బాబు, అర్బన్ సీఐ, జమ్మలమడుగుప్రేమ పేరుతో మోసం చేశాడనే మనస్థాపంతోనేనా..? -
ఉద్యోగుల పోరుబాట
● హామీలపై రెండేళ్లవుతున్నా స్పందించిన కూటమి ప్రభుత్వం ● డిమాండ్ల సాధనకు సకుటుంబ ఉద్యమం ● మే 15న మంత్రి లోకేష్ ఇంటికి పాదయాత్ర కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడి నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనా పాలన, బడి నిర్మాణం.. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్రశిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ● మండల వనరుల కేంద్ర(ఎమ్మార్సీ) నిర్వహణలో సమగ్రశిక్ష ఉద్యోగులు కీలకం. మొత్తం కార్యకలాపాలకు సయన్వయకర్తగా ఎంఐఎస్ కో ఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను, క్టస్టర్ రిసోర్సు పర్శన్(సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా నిలుస్తారు. అలాగే పాఠశాలల్లో క్రాప్టు, డ్రాయింగ్, పీఈటీ తదితర విధుల నిర్వ హణలో పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లుగా సేవలందిస్తారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించే భవనాల నిర్వహణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీర్ పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభు త్వం చిన్నచూపు చేస్తోందని సమగ్రశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే... ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకే్ష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్రశిక్ష ఉద్యోగుల తమ డిమాండ్ను అయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారి డిమాండ్లను పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును సైతం.. సమగ్రశిక్ష ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్రశిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించింది. దీంతో సమగ్రశిక్ష ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలు మూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న విజయవాడలోని ప్రశాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మంత్రి నారా లోకే్ష్ ఇంటికి పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సిగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణం. – ఎన్. చిన్నయ్య, కడపజిల్లా సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ. సమగ్రశిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఈ నెల 15వ తేదీన మహా పాద యాత్ర చేపట్టనున్నాం. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో సహా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి. – చంద్రశేఖర్, కడపజిల్లా సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ -
పారదర్శకంగా ఇసుక సరఫరా
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజంపేట మండల పరిధిలోని కొన్ని భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతిపై చర్చించి, నిర్ణయాన్ని కమిటీ తీసుకోనుందని పేర్కొన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాలో బాహుదా నదిలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్కు సంబంధించిన ఏజెన్సీ అధిక ఖర్చులు, తక్కువ ఇసుక లభ్యత కారణంగా పనులు నిలిపివేయాలన్న అభ్యర్థనపై కూడా సమావేశంలో చర్చించారు. దీనిపై తుది నిర్ణయాన్ని కమిటీ తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షా కాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు నిరంతర ఇసుక సరఫరా కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లక్ష్యాన్ని నిర్ణయించిన నేపథ్యంలో,6 సెమీ–మెకనైజ్డ్ రీచ్లు, 2 మాన్యువల్ రీచ్లను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !
● గ్రీన్హైవే నిర్మాణప్రక్రియలో సర్వీస్ రోడ్లు లేకపోవడంపై స్థానికుల్లో ఆందోళన ● సర్వీస్ రోడ్లు నిర్మించాలని భక్తులు,యాత్రికుల డిమాండ్ రాజంపేట: గ్రీన్ హైవే (కడప–రేణిగుంట నేషనల్ హై వే) నిర్మాణంలో సర్వీసు రోడ్డుకు మోక్షం కరువైంది.. శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో పయ నించే గ్రీన్హైవే నుంచి మెయిన్ రోడ్డుపైకి రావడానికి ‘కనెక్టివిటీ’ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రఖ్యాత ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి కూడా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా రూ.4వేల కోట్ల వ్యయంతో రా యలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన ఈ గ్రీన్హైవేని మరో రెండేళ్లలో పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. గ్రీన్హైవే నుంచి సర్వీసురోడ్డు లేదంటా.. గ్రీన్హైవే నుంచి పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు సర్వీసురోడ్లు నిర్మించడం లేదంటూ నిర్మాణ సంస్థలు తేల్చిచెప్పాయి. అసలు గ్రీన్హైవే రోడ్ మ్యాప్లో సర్వీస్ రోడ్ల ప్రతిపాదనే లేదని కాంట్రాక్ట్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. సర్వీసురోడ్డు నిర్మాణం చేయాలంటే కేంద్రం నుంచే ఆదేశాలు రావాలని వివరిస్తున్నారు. రామయ్య వద్దకు వెళ్లేదేలా.. కడప–రేణిగుంట నేషనల్హైవేలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. గ్రీన్ హైవే నుంచి సర్వీస్ రోడ్డు లేకపోతే ఈ ప్రముఖ ఆలయాలకు, ఆయా ప్రాంతాల కు వెళ్లేదెలా అంటూ యాత్రికులు,భక్తులు, పర్యాటకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాలకు సంబంధంలేని ఏరియాలో సుదూర ప్రాంతంలో కనెక్టటివి ఇవ్వడంవల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే భూసేకరణ చేసైనా సర్వీ స్ రోడ్లు నిర్మించాలని పర్యాటకులు కోరుతున్నారు. కూటమి ఎంపీలు స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం చెందిన జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట నందలూరు కేంద్రాలకు కడప–రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కనెక్టిటివి రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని భక్తులు గట్టిగా వాదిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ఎంపీలు స్పందించి కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
మఠం సత్రాలపై అడ్డంకులు తొలగేనా..?
● సత్రాలపై బద్వేల్ కోర్టు స్టేటస్ కో తీర్పు ● 11 మందికి నోటీసులు ● మఠం యాజమాన్యం ఎలా స్పందిస్తుందో..?బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పరిధి 7 ఎకరాలు 77 సెంట్లు. ఈ పరిధిలో ఎలాంటి స్థలాలు, కట్టడాలు ఉన్నా మా పరిధిలో ఉంటాయని గత 50 ఏళ్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. అది ఏమిటంటే దేవస్థానం దక్షణ భాగంలో రథశాల దగ్గర గతంలో కొంతమంది ఆర్యవైశ్యులు భక్తులకోసం విడిది సత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సత్రాలు మఠం పరిధిలో ఉన్న 7.77 ఎకరాలలో ఉన్నాయి. ఆర్ ఎస్సార్ లో మఠం పోరంబోకు స్థలంగా ఉందని మఠం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ స్థలంలో గతంలో దాతలు సత్రాలు కట్టించారు. అయితే ఆ సత్రాలు మా పూర్వీకులు కట్టించినవి.. అవి మావి అంటూ జి.సతీష్, ఎస్ సుప్రజ, ఎ వెంకటసుబ్బయ్య, ఎస్ చిన్న సిద్దయ్య, వై సురేంద్ర, దొంతు వెంకటసుబ్బయ్య, డి వెంకటేశ్వర్లు, వై మల్లి, ఎస్ వెంకటేశ్వర్లు, ఎస్ శేషాద్రి, పి పద్మా అనే 11 మంది ఆ సత్రాలలో వ్యాపారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మఠం నిర్వాహకులకు ఎలాంటి సిస్తు(రుసుం) చెల్లించకుండా ఉండడంతో మఠం అభివృద్ధి కోసం కనీసం బాడుగ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో సత్రాలు పై పూర్తి హక్కులు మావేనని మఠం నిర్వాహకులు చెప్పినా వారు పెడ చెవిన పెట్టడంతో మఠం నిర్వాహకులు ఈ అంశంపై బద్వేల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో గత కొన్ని ఏళ్లుగా కేసు నడుస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా గతంలో ఉన్న పిట్పర్సన్ శంకర్బాలాజీ, స్థానిక నాయకుల సహకారంతో అభివృద్ధి కోసం 11 సత్రాలతో పాటు మిగిలిన సత్రాలను తొలగించి కొంతదూర ప్రాంతంలో తాత్కాలిక రేకుల షెడ్లు నిర్మాణంకు శ్రీకారం చుట్టారు. మొత్తం 24మందికి మఠం నిర్వాహకులు బాడుగలకు ఇవ్వడంతో పాటు వారే షెడ్లను ఏర్పాటు చే సుకున్నారు. ఈ 11 మంది కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు ఇంకా ఆ రేకుల షెడ్లలో చేరలేదు.. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం కోర్టు ఈ అంశంపై 11 మందికి స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం సత్రాలు ఎలా ఉన్నాయో అవి అలానే ఉండాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మఠం మేనేజర్ ఈశ్వరాచారి మాత్రం మఠంకు బాడుగ చెల్లిస్తే మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవాళ్లం.. కానీ వారు గత కొన్ని ఏళ్లుగా మఠంకు ఎలాంటి రుసుం చెల్లించకుండా కాలయాపన చేశారు. ప్రస్తుతం కోర్టు ఆర్డర్ ప్రకారం మేము నడుచుకుంటామన్నారు. -
శృంగారంలో అపశృతి.. నాలుక కొరికిన మహిళ..!
వైఎస్ఆర్(కడప)జిల్లా : ఒంటిమిట్ట మండలంలో ఓ దినపత్రిక (సాక్షి కాదు) విలేకరి రవిబాబు(పుచ్చకాయల వ్యాపారి) నాలుకను ఓ మహిళ కొరికి వేసిన సంఘటన ఒంటిమిట్ట హరిత హోటల్లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే వివరాలు ఏమీ వెల్లడించలేదు. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. కర్బూజ కాయల వ్యాపార క్రమంలో విలేకరి, ఆటో యజమానిలకు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. విలేకరి రవి, ఆటో యజమాని ఒకరు ఆ మహిళతో కలిసి హరిత హోటల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా, గది అద్దె తీసుకోకుండానే అక్రమంగా ప్రవేశించడానికి వీల్లేదని హరిత హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే విలేకరి పరపతితో ఎట్టకేలకు గదిలోకి ముగ్గురు వెళ్లారు. ముగ్గురూ మద్యం తాగారు. ఈ క్రమంలో శృంగార కార్యక్రమం నేపథ్యంలో విలేకరి నాలుకను మహిళ కొరికివేసింది. అయితే ఆ మహిళ ఇద్దరి చేతిలో జరుగుతున్న అఘాయత్యం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా కొరికి వేసిందా, కామక్రోధంతోనా అనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. ఆ ప్రాంతం కొంత రక్తమయం అయింది. తీవ్ర భయాందోళనకు గురైన రవి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అక్కడికి వైద్యులు 108 ద్వారా కడప రిమ్స్కు రెఫర్ చేశారు. ఆటో డ్రైవర్ హరి ఆ తర్వాత మహిళతో శృంగారం పూర్తి అయిన తర్వాత ఆమెను ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టారు. ఇక ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఒంటిమిట్టలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆటో డ్రైవర్ హరిని అదుపులో తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆటో డ్రైవరు హరి సంఘటన తర్వాత ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టిన మహిళ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలియాల్సి ఉంది.వరుస వివాదాల్లో హరిత హోటల్ఒంటిమిట్ట హరిత హోటల్ వరుస వివాదాలయమంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని హరిత హోటల్ భక్తులు, యాత్రీకులు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తే, ఆ క్రమం ఇప్పుడు దారి తప్పింది. వరుస ఘటనలతో రచ్చకెక్కుతోంది. గత ఏడాది అధికార పారీ్టకి చెందిన కొందరు అక్రమ మట్టి తవ్వకాల కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. మందుబాబులకు నిలయంగా మారిన క్రమంలో మద్యం మత్తులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే హరిత హోటల్లో పని చేస్తున్న దళిత యువకుడిపై, హోటల్ పక్కన కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడి చేసిన సంగతి విదితమే.డివిజనల్ మేనేజరు ఏమంటున్నారంటే..ఇన్చార్జి మేనేజరు రాజశేఖర్రెడ్డిని జరిగిన సంఘటనపై డివిజనల్ మేనేజరు మల్లికార్జున గౌడ్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజరుకు మోమో ఇచ్చామన్నారు. సిబ్బంది పాత్రపై ఆరా తీశామన్నారు. విచారణలో అలాంటిది ఏమీ లేదన్నారు. స్థానికంగా ఉన్న వారిని దరిచేయనీయవద్దని హెచ్చరించారు. -
పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు
తిరుపతి అర్బన్: విశ్వం విద్యా సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాలిసెట్–2026 ఉత్తమ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు శిక్షణ పొందిన విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజన్లోనూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్ స్కూల్ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ తులసి విశ్వనాథ్ రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలకు 8688888802, 9399976999 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. -
స్మార్ట్గా మంట పెడుతున్నారు !
● మధ్యాహ్న భోజన కార్మికులపై ‘స్మార్ట్’కిచెన్ పిడుగు ● స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం అందించే దిశగా అడుగులు ● ఇప్పటికే నాలుగు మండలాల్లో అమలు ● త్వరలో మిగతా మండలాల్లో కూడా అమలుకు శ్రీకారం కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు తమ ఉపాధిని కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు మండలాల్లో ఈ స్మార్ట్ కిచెన్ను ప్రారంభించి అక్కడ నుంచి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలకు తరలించి పిల్లలకు వడ్డిస్తున్నారు. ఇక మిగిలిన మండలాల్లో కూడా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చేస్తే తమ పరిస్థితేంటని జిల్లాలో సుమారు 2980 మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను తొలగించే కుట్ర చేయడంతో పాటు .. కూటమి వర్గీయుల జేబులు నింపేందుకే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి.... మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తోంది. 1500 నుంచి 2000 వేల మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ కిచెన్ ఉంటుందని విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి ఒకటి లేదా రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కడప, సీకేదిన్నె, జమ్మలమడుగు, దేవగుడిలలో స్మార్ట్ కిచెన్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ నుంచి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తూ పిల్లలకు వడ్డిస్తున్నారు. మిగతా మండలాల్లో కూడా చాలా మేర స్మార్ట్ చికెన్ షెడ్డు నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశ్నార్థకంగా కార్మికుల భవిష్యత్తు... జిల్లావ్యాప్తంగా 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనంతోపాటు హైస్కూల్లో విద్యార్థికి రూ. 8.55, ప్రాథమిక పాఠశాలల్లో రూ. 5.50 చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. చాలీ చాలనీ జీతాలతో ఏళ్ల తరబడి ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటుతో ఉపాధి కోల్పోతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లో వంట తయారీ చేస్తూ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు కూటమి ప్రభుత్వం చిరుకూలీల పొట్టకొడుతోంది. పొమ్మనలేక ‘స్మార్ట్’గా మంట పెడుతోంది. అవును.. ఇన్నాళ్లు వంటనే నమ్ముకుని బతుకుతున్న మధ్యాహ్న భోజన కార్మికలోకం తమ ఉపాధిని ‘స్మార్ట్ కిచెన్’ లాగేసుకుంటుందేమోనని కలవరపడుతోంది. పాఠశాలలో పిల్లలకు వంట ఏజెన్సీలు వేడివేడిగా అన్నం వండి వడ్డిస్తున్నారు. ఎక్కడో వండిన అన్నం అన్ని పాఠశాలకు వాహనాల్లో తీసుకొచ్చి వడ్డిస్తే అధి చల్లబడడంతోపాటు మెత్తగా తయారవుతుంది. ఏ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అక్కడే కొనసాగించాలి. – చాన్బాషా, మధ్యాహ్న భోజన పథక గౌరవాధ్యక్షుడు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ కిచెన్ విధానంతో జిల్లాలో చాలా మంది పేద మహిళల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ఇప్పటికే మా డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చాలా మంది ఏళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి ఇబ్బందులు కలగలేదు, స్మార్ట్ కిచెన్ విధానాన్ని వెనక్కు తీసుకోవాలి. – మేరీ, మధ్యాహ్న భోజనం వర్కిర్ యూనియన్ నాయకురాలు -
పవిత్ర లడ్డూ ప్రసాదమేదీ !
జమ్మలమడుగు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగే నారాపురస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. ఏటా వైశాఖ మాసంలో జరిగే నారాపురస్వామి బ్రహ్మోత్సవాలలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం స్వామి వారి అలంకారాలను వీక్షించటానికి సాయంత్రం పూట వేలాది మంది వస్తుంటారు. ఉత్సవాల్లో స్వామివారం పవిత్ర లడ్డూ ప్రసాదం లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించలేమా! నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో బుధవారం సాయంత్రం స్వామి వారికి కల్యాణోత్సవం జరగనుంది. రూ.300 రుసుం చెల్లించిన వారికి మాత్రమే ఈ కల్యాణోత్సవంలో పాల్గొనాలని.. చెల్లించనివారు బయటి నుంచి వీక్షించే విధంగా టీటీడీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో భక్తులు భగ్గుమంటున్నారు. గతంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ తిలకించేవారు. టీటీడీలో కలిసి దాదాపు 20 సంవత్సరాలు.. నారాపుర స్వామి ఆలయాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో టీటీడీలో వీలినం చేశారు. అప్పటి నుంచి స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం స్వామి వారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో తిరుమల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఇప్పటివరకు టీటీడీ అధికారులు లడ్లు సరఫరా చేయలేదు. సాధారణ సమయంలో లడ్డూ ప్రసాదం లేకున్నా పర్వాలేదు గానీ.. ఉత్సవాల సమయంలోనైనా లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల లడ్లు అందుబాటులోకి తేవాలి.. నారాపురస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ తిరుమల లడ్డు ప్రసాదం అందుబాటులోనికి తీసుకురావాలి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. లడ్డూ ప్రసాదం లేకపోవడంపై భక్తులు నిరాశ చెందుతున్నారు. టీటీడీ అధికారులు అలోచించి భక్తులకు తిరుమల లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలి. – భూతమాపురం సుబ్బారావు, న్యాయవాది, జమ్మలమడుగు. -
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల మొదటి సెమిస్టర్ (ఆనర్స్) పరీక్షల ఫలితాలను వీసీ రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో కులసచివులు ఆచార్య పి పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె ఎస్వీ కృష్ణా రావుతో కలిసి పరీక్షల వివరాలు వెల్లడించారు. బీఏలో 58.35 శాతం, బీబీఏలో 72.63 శాతం, బీసీఏ 51.74 శాతం, బీకాంలో 63.84 శాతం, బీఎస్సీలో 63.72 శాతం, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులో 53.50 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగ సహాయ అధికారులు డా. సుభోష్ చంద్ర, డా.గణేష్ నాయక్ పాల్గొన్నారు. పదికి పది జీపీఏ సాధించిన ఎస్పీ డిగ్రీ కాలేజీ జమ్మలమడుగు: యోగివేమన యూనివర్శిటి ప్రకటించిన డిగ్రీ పరీక్ష ఫలితాల్లో ఎస్పీ డిగ్రీకాలేజికి చెందిన విద్యార్థులు యూనివర్శిటిలో మొదటిర్యాంకులు సాధించినట్లు కాలేజి కరస్పాడెంట్ పాల నాగేశ్వరరెడ్డి అన్నారు. దువ్వూరి మౌనిక బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో బోటని విభాగంలో పదికి పదిపాయింట్లు, టి, ఈశ్వర సాహితి బీఎస్సీ బోటని విభాగంలో పదికి పది పాయింట్లు సాధించడంతోపాటు హుస్సేన్బీ కంప్యూటర్ సైన్సు విభాగంలో పదికి పది పాయింట్లు సాధించి యూనివర్శిటిలోనే మొదటి ర్యాంకు సాధించినట్లు వివరించారు. పదికి పది పాయింట్లు సాధించిన మౌనిక, ఈశ్వర సాహితి, హుస్సేన్బీ -
రాజంపేట వాసికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు
రాజంపేట టౌన్: దర్శకరత్న దాసరినారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవం సందర్భంగా ఈనెల 4వ తేదీ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజంపేట మండలం ఎస్.ఎర్రబల్లెకు చెందిన ఆదిత్య వంశీ బెస్ట్ షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఈవిషయాన్ని ఆయన మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. తన దర్శకత్వంలో రూపొందిన మధురం కదా బాల్యం, ఉత్తరం అనే షార్ట్ ఫిల్మ్లకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చినట్లు తెలిపారు. మధురం కదా బాల్యం, ఉత్తరం షార్ట్ఫిల్మ్లకు కథను, లిరిక్స్ను ప్రముఖ లిరిక్ రైటర్ ఎండి.రఫి అందించారని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో ఉరుసు ఖాజీపేట: కులమతాలకతీతంగా అందరూ కలసికట్టుగా నిర్వహించుకునే నత్తడ్షా వలీ ఉరుసు ఉత్సవం వైభవంగా జరిగింది. ఖాజీపేటలోని అగ్రహారం గ్రామంలో జరిగే ఈ ఉరుసు మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా 5వ తేదిన ఉరుసు భక్తిశ్రద్ధలతో జరిగింది. దర్గా చుట్టు ప్రత్యేక దీపకాంతులతో ఆకర్షనీయంగా అలంకరణ చేశారు. దర్గాలోని మజార్ను పూలతో సుందరంగా అలంకరించారు. సర్వర్ ఖాన్ పేటలోని మసీదు నుంచి జెండాను తీసుకొచ్చారు. ఆకట్టుకున్న ఖవ్వాలి ఉరుసు ఉత్సవాన్ని పురస్కరించుకుని సర్ఫరాజ్సాబ్రి, మోహసీన్ చిష్టి చే నిర్వహించిన ఖవ్వాలి ఆకట్టుకుంది. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం చౌడేపల్లె: పుంగనూరు మండలంలోని అడవినాథనకుంట సమీపంలో గల ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లుకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మదన్మోహన్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.మే 5వ తేదీ నుంచి మే 21 వ తేదీవరకు మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పాసైన వారు రెండేళ్ల కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఇంగ్లీషు మీడియంలో బోధిస్తామని, డిప్లొమో కోర్సు పూర్తిఅయిన తరువాత ఉన్నత విద్యతోపాటు ఉపాధి అవకాశాలు పొందే సౌకర్యం ఉందని వివరించారు.ఆసక్తి గల వారు 9381359956 నంబరులో సంప్రదించాలన్నారు. -
విలేకరి నాలుక కొరికిన మహిళ!
● హరిత హోటల్లో ఘటన ● విచారణ చేసిన పోలీసులుఒంటిమిట్ట(రాజంపేట) : ఒంటిమిట్ట మండలంలో ఓ దినపత్రిక (సాక్షి కాదు) విలేకరి రవిబాబు(పుచ్చకాయల వ్యాపారి) నాలుకను ఓ మహిళ కొరికి వేసిన సంఘటన ఒంటిమిట్ట హరిత హోటల్లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే వివరాలు ఏమీ వెల్లడించలేదు. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. కర్బూజ కాయల వ్యాపార క్రమంలో విలేకరి, ఆటో యజమానిలకు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. విలేకరి రవి, ఆటో యజమాని ఒకరు ఆ మహిళతో కలిసి హరిత హోటల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా, గది అద్దె తీసుకోకుండానే అక్రమంగా ప్రవేశించడానికి వీల్లేదని హరిత హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే విలేకరి పరపతితో ఎట్టకేలకు గదిలోకి ముగ్గురు వెళ్లారు. ముగ్గురూ మద్యం తాగారు. ఈ క్రమంలో శృంగార కార్యక్రమం నేపథ్యంలో విలేకరి నాలుకను మహిళ కొరికివేసింది. అయితే ఆ మహిళ ఇద్దరి చేతిలో జరుగుతున్న అఘాయత్యం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా కొరికి వేసిందా, కామక్రోధంతోనా అనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. ఆ ప్రాంతం కొంత రక్తమయం అయింది. తీవ్ర భయాందోళనకు గురైన రవి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అక్కడికి వైద్యులు 108 ద్వారా కడప రిమ్స్కు రెఫర్ చేశారు. ఆటో డ్రైవర్ హరి ఆ తర్వాత మహిళతో శృంగారం పూర్తి అయిన తర్వాత ఆమెను ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టారు. ఇక ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఒంటిమిట్టలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆటో డ్రైవర్ హరిని అదుపులో తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆటో డ్రైవరు హరి సంఘటన తర్వాత ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో విడిచిపెట్టిన మహిళ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలియాల్సి ఉంది. వరుస వివాదాల్లో హరిత హోటల్ ఒంటిమిట్ట హరిత హోటల్ వరుస వివాదాలయమంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని హరిత హోటల్ భక్తులు, యాత్రీకులు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తే, ఆ క్రమం ఇప్పుడు దారి తప్పింది. వరుస ఘటనలతో రచ్చకెక్కుతోంది. గత ఏడాది అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమ మట్టి తవ్వకాల కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. మందుబాబులకు నిలయంగా మారిన క్రమంలో మద్యం మత్తులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే హరిత హోటల్లో పని చేస్తున్న దళిత యువకుడిపై, హోటల్ పక్కన కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడి చేసిన సంగతి విదితమే. డివిజనల్ మేనేజరు ఏమంటున్నారంటే.. ఇన్చార్జి మేనేజరు రాజశేఖర్రెడ్డిని జరిగిన సంఘటనపై డివిజనల్ మేనేజరు మల్లికార్జున గౌడ్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజరుకు మోమో ఇచ్చామన్నారు. సిబ్బంది పాత్రపై ఆరా తీశామన్నారు. విచారణలో అలాంటిది ఏమీ లేదన్నారు. స్థానికంగా ఉన్న వారిని దరిచేయనీయవద్దని హెచ్చరించారు. -
లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపిన భర్త
ప్రొద్దుటూరు : తన భార్య పద్మజ లావుగా ఉందని విషమిచ్చి చంపిన భర్త కిరణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూ కృష్ణ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. భార్య పద్మజ లావుగా ఉందని, విపరీతమైన మాంసహారం, ఫాస్ట్ ఫుడ్ తింటుండటం గమనించిన భర్త బద్రిపల్లె కిరణ్కుమార్ భార్యకు విషమిచ్చి చంపాడన్నారు. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన బద్రిపల్లె కిరణ్కుమార్ 8 ఏళ్ల క్రితం ముద్దనూరుకు చెందిన పద్మజతో వివాహం అయిందన్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉందన్నారు. భార్యను ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి కిరణ్ గత నెల 26న తీసుకొచ్చాడని పేర్కొన్నారు. ఇల్లరికంలో ఉన్న కిరణ్కుమార్ను చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతుండే వారని, కిరణ్కుమార్ మరో మహిళను ప్రేమించినట్లు, దానివల్ల భార్యాభర్తలకు మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. ఎలాగైనా భార్య పద్మజను చంపాలనుకున్న కిరణ్కుమార్ యూట్యూబ్లో వీడియోలు చూస్తుండగా, డేంజరస్ పాయిజన్ అవేలబుల్ అనే క్యాప్షన్తో వీడియోను చూసి.. అందులోని ఫోన్ నంబర్కు సంప్రదించి రూ.80 వేలు పెట్టి కొరియర్ ద్వారా విషం కొనుగోలు చేశాడన్నారు. గత నెల 29న రాత్రి 11.30 గంటల సమయంలో కవ్వాలో విషం కలిపి భార్యకు కిరణ్కుమార్ ఇచ్చి ఆమె ముఖంపై ఊపిరి ఆడకుండా తలదిండు ఒత్తి పెట్టడం వల్ల ఆమె మృతి చెందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. విషం అమ్మిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నామని, తర్వాత విచారణలో విషం అమ్మిన వ్యక్తితోపాటు తయారు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. తొలుత పద్మజ మృతిని అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని, వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి విచారణ చేసి కేసును నిగ్గుతేల్చారన్నారు. నిందితుడు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో వన్టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
పాలిసెట్లోనూ బాలికలదే హవా !
● జిల్లాలో 89.96 శాతం ఉత్తీర్ణత ● 119 మార్కులతో జిల్లా టాపర్స్గా నిలిచిన నల్లమారు నాగసంతోష్, టాస్ప గ్లోరీ హదస్సా కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్–2026 ప్రవేశ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో నూ బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఏప్రిల్ 25వ తేదీ జిల్లావ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 9410 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 8465 మంది ఉత్తీర్ణులై 89.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 5389 మందికిగాను 4775 మంది ఉత్తీర్ణులై 88.61 శాతం, బాలికలు 4021 మంది పరీక్ష రాయగా అందులో 3690 మంది ఉత్తీర్ణులై 91.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా టాపర్స్ వీరే... పాలిసెట్ పరీక్షలో జిల్లా టాపర్స్గా నల్లమారు నాగ సంతోష్ 120 మార్కులకుగాను 119 మార్కులను సాధించగా, టాస్ప గ్లోరీ హదస్సా 120 మార్కులకు 119 మార్కులను, ఉట్ల వెంకట నాగ తనూష్ 118 మార్కులను సాధించి జిల్లా టాపర్స్గా నిలిచారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్లో మంచి ర్యాంకు సాధించి సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాలనేదే తన లక్ష్యమని జిల్లా టాపర్ నాగసంతోష్ పేర్కొన్నాడు. -
ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు
ప్రేమజంట యోగీంద్రకుమార్ వర్మ, హేమశ్రీ (ఫైల్ ).. జంటగా అంత్యక్రియలు చేస్తున్న దృశ్యంతెలిసీ తెలియని వయసు వారిది.. చూడగానే ఒకరినొకరిపై ఆకర్షణ కలిగింది.. మెల్లగా మాట కలిసింది.. ఆపై ప్రేమ చిగురించింది.. ఊహల్లో విహరించారు.. ఊసులెన్నో చెప్పుకున్నారు.. కలిసి జీవించాలని కలలుగన్నారు.. ఏమైందో.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థ తలెత్తింది.. మాటల్లో తేడా వచ్చింది.. తెలియని సంఘర్షణ ఏదో ఆ లేత మనసును గాయపరిచింది. అంతే ..కలిసి జీవించాలనుకున్న వారే విడివిడిగా బలవన్మరణానికి ఒడిగట్టారు.. కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చారు.. ప్రేమ జంట యోగీంద్రకుమార్, హేమశ్రీ విషాదగాథ ఇది. జీవితమంతా కలిసుందామనుకున్న ఆ ఇద్దరిని వారి తల్లిదండ్రులు కలిసి అంతిమసంస్కారాలు నిర్వహించారు. మంగళవారం చెన్నూరు గ్రామశివార్లలో పక్కపక్కనే సమాధి చేశారు. కాగా, అంత బాధలోనూ రిమ్స్ సమీపంలోని డాక్టర్ ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సిఫారసు మేరకు యువకుడి తల్లిదండ్రులు కొడుకు నేత్రదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. – కడప అర్బన్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతుగంటి ఖాజావలీ(48) అనే వ్యక్తి మృతి చెందాడు. కాశినాయన మండలం చెన్నవరం గ్రామానికి చెందిన ఖాజావలీ బైక్లో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వాహనం ఢీకొట్టడంతో బైక్తో సహా ఖాజావలి రోడ్డు పక్కన కాలువలో పడి పోయాడు. చెన్నవరం నుంచి రాజాసాహేబ్పేటకు ఓ ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన కొద్ది సేపటికే వెనుక వస్తున్న అదే గ్రామానికి చెందిన వారు గమనించి ఖాజావలీని ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. తలకు తీవ్రంగా గాయమైందని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రిలో చేర్చారని, ఆసుపత్రికి వచ్చిన కొద్దిసేపటికే ఖాజావలి మృతి చెందినట్లు తెలిసింది. ఖాజావలికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారని, ఎవరికీ వివాహం కాలేదని తెలిసింది. ఖాజావలికి జీవనాధారం వ్యవసాయం. మంగళవారం రాత్రికి సమాచారం బంధువులకు తెలిసింది. దాంతో చెన్నవరంలో విషాదం అలుముకుంది. ఈ విషయమై ఎస్ఐ హనుమంతును వివరణ కోరగా.. పూర్తిగా తెలియదని, విచారణ చేస్తున్నామన్నారు. తేనెటీగల దాడిమదనపల్లె టౌన్ : తేనెటీగల దాడిలో పలువురు గాయపడ్డ సంఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుల కథనం.. ముదివేడుకు చెందిన నిర్మలమ్మ(60), చంద్రశేఖర్రెడ్డి(50), నిర్మల(40), వారి పిల్లలు గీతిక(7), ఫియాన్సి(5)లు ఊరికి సమీపంలోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో పెద్దపెరా తేనెటీగల గుంపు వచ్చి దాడి చేసింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి నిర్మలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కాఫీ మీద పడి.. బాలుడిపై కాఫీ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మదనపల్లిలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లి పట్టణం కొత్త ఇండ్లలో కాపురం ఉంటున్న దంపతులు రామాంజులు, రాణెమ్మలు తాము ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు సామగ్రిని సర్ది మూటల్లో భద్రపరిచారు. అలసిపోయిన దంపతులు కాఫీ తాగాలి అనుకున్నారు. వెంటనే రాణి వెళ్లి కాఫీ పెట్టుకుని వచ్చి భర్తకు ఒక గ్లాసులో పోసి తాగమని టేబులుపై పెట్టింది. అదే సమయంలో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన ఏడాది కొడుకు నవీన్ కాఫీని చేత్తో పట్టుకొని మీద పోసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కవులు, కళాకారుల గడ్డ రాజంపేట
రాజంపేట : కవులు, కళాకారుల గడ్డ రాజంపేట అని రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. తాళ్లపాకలో అన్నమాచార్య జయంత్యుత్సవాలలో భాగంగా మంగళవారం అన్నమాచార్య ప్రాజెక్టు(టీటీడీ) వారి సౌజన్యంతో శ్రీ అన్నమాచార్య కళాకారులు ఐక్యవేదిక అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి రాజంపేట మండలం తాళ్లపాక కావడం రాజంపేట ప్రాంతీయుల అదృష్టంగా భావించాలన్నారు. అన్నమాచార్య కీర్తనలు నలుదిశలా ఈ ప్రాంత కవులు, రచయితలు కృషిచేయాలన్నారు. అన్నమాచార్య జయంతి రోజున కవులను సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం కవులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, సి.జయరామిరెడ్డి, పలుకూరు వెంకటరమణ, గంగనపల్లె వెంకటరమణ, బాలరాజు జనార్ధన్రాజు, యూపీ రాయుడు అల్లంఅశోక్కుమార్, ఏవీ సుబ్బరాజు, బొడ్డుబోయన రాజగోపాల్, డా.నూకరాజు వెంకటసుబ్బయ్య, అడపాల వెంకటరమణ, హైమావతి, చమర్తి సుబ్బరాఘవరాజు, కొత్తపల్లె రామాంజినేయులుకు టీటీడీ తరఫున పారితోషికంతోపాటు ప్రసాదాలను అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి లత అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు చొప్పా ఎల్లారెడ్డి, గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెంభరత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాపినేని విశ్వనాథరెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
పీలేరు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన స్థానిక కడప మార్గంలోని కేవీఆర్ లడ్జీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కేవీపల్లె మండలం తీతవగుంటపల్లెకు చెందిన మిన్నంరెడ్డి సుధాకర్రెడ్డి(62) ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. స్థానిక కడప రోడ్డు మార్గం ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న ఆయన మంగళవారం సాయంత్రం కడప రోడ్డు మార్గంలో వాకింగ్ వెళ్లడానికి ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చారు. గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో సుధాకర్రెడ్డి తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాప్ రే.. ‘యాప్’!
● ఉపాధి హామీ కూలీలకు కొత్త విధానం ● వెంటాడుతున్న సాంకేతిక కష్టాలు ● హాజరు కోసం అవస్థలుజిల్లాలో జారీ చేసిన జాబ్కార్డులు 2,30,198కూలీల సంఖ్య 4,12,054యాక్టివ్ జాబ్కార్డులు 3,08,613 పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య 67,500 (ప్రస్తుతం)కడప సిటీ : ఉపాధి హామీ పథకంలో వేతన జీవులకు హాజరు కష్టాలు తప్పడం లేదు. కేవైసీ అయిన వేతనదారులకు మాత్రమే ఫొటో అప్లోడ్ అవుతుండడం వల్ల కేవైసీ పెండింగ్ ఉన్న వారి పరిస్థితి దారుణంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీలో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు గతంలో గ్రూప్ ఫొటో బదులుగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో ఒక్కొక్కరి ఫొటో తీసుకున్న తర్వాత పనికి ఉపక్రమించాల్సి ఉంటుంది. కొంతమందికి ఐరిస్ గ్రూప్లో ఫొటో తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి.. సాధారణంగా మార్చి చివరి నాటికి ఉపాధి హామీ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. అయితే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల మే 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏప్రిల్ మాసమంతా పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాజరు విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఉపాధి హామీ పథకంలో గతంలో పనికి హాజరయ్యేటపుడు గ్రూప్ ఫొటో తీసేవారు. కానీ కొత్త విధానంలో ఒక్కొక్కరి ఫొటో ఒక్కొసారి తీయాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల సగానికి పైగా కూలీలకు ఐరిస్ యాప్లో ఫొటోలు అప్లోడ్ కావడం లేదు. ఎందుకంటే వృద్ధులకు, గతంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులకు ఫొటో అప్లోడ్ కాక హాజరు నమోదు కావడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం వృథా కొత్త విధానం వల్ల ఒక్కొక్కరి ఫొటో అప్లోడ్ చేసేందుకు సమయం వృథా అవుతోంది. ఒక్కొక్క గ్రూప్లో 30–40 మంది వరకు ఉంటారు. వీరి ఫొటోలు తీసేందుకు మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో వేతనదారులు పని చేసే సమయానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇంకా సాంకేతిక లోపం తోడైతే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కూలీలు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవైసీ 85 శాతం మాత్రమే జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో బయో మెట్రిక్ (కేవైసీ) 85 శాతంగా నమోదైంది. ఇంకా 15 శాతం నమోదు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం ఊరిలో లేని వారు కొంత మంది ఉన్నారని, వివాహాలు చేసుకుని వేరే ఊర్లకు వెళ్లారని సాకులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో లోపాలు కనిపిస్తున్నాయి. చాలా మంది వృద్ధులకు సింగిల్ ఫొటోలో ఐరిస్ తీసుకోవడం లేదు. అంతేకాకుండా కంటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులకు కూడా ఈ పరిస్థితి ఎదురవుతోంది. అటువంటి వారికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. అక్రమాల నిరోధానికి మరింత పకడ్బందీగా.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో అక్రమాలు నిరోధించేందుకు గతం నుంచి విధి విధానాలను మార్చుకుంటూనే వస్తోంది. అయినప్పటికీ ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికార పార్టీ నాయకులు కలిసి నకిలీ మస్టర్లు తయారు చేసి పనులకు రాకున్నా డబ్బు లు తీసుకునేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధా నం ప్రారంభంలో ప్రతి ఒక్క కూలీ ఫొటోను సింగిల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లేటపుడు గ్రూప్ ఫొటో తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట ఫొటో తీయించుకుని, తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చి గ్రూప్ ఫొటో తీయించుకుని అక్రమాలకు పాల్పడేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమయం వృథా కాకుండా పనికి వ చ్చిన వెంటనే కాకుండా భోజన విరామంలో ఫొటోలు అప్లోడ్ చేసుకుంటే సమయం కలిసి వస్తుందని కూలీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అక్రమాలు నిరోధించాలంటే ఇంటికి వెళ్లేటపుడు కూడా సింగిల్ ఫొటో తీస్తేనే సాధ్యమవుతుంది.వంద శాతం కేవైసీకి కృషి ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో 85 శాతం కేవైసీ పూర్తయింది. ఇంకా 15 శాతం కేవైసీ చేయాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో మరింత పకడ్బందీగా మిగిలిన శాతాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం. సమయం వృథా కాకుండా ఫొటోలు తీసేందుకు పునరాలోచన చేసి చర్యలు తీసుకుంటాం. – బి.ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప -
లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపిన భర్త
ప్రొద్దుటూరు : తన భార్య పద్మజ లావుగా ఉందని విషమిచ్చి చంపిన భర్త కిరణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూ కృష్ణ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. భార్య పద్మజ లావుగా ఉందని, విపరీతమైన మాంసహారం, ఫాస్ట్ ఫుడ్ తింటుండటం గమనించిన భర్త బద్రిపల్లె కిరణ్కుమార్ భార్యకు విషమిచ్చి చంపాడన్నారు. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన బద్రిపల్లె కిరణ్కుమార్ 8 ఏళ్ల క్రితం ముద్దనూరుకు చెందిన పద్మజతో వివాహం అయిందన్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉందన్నారు. భార్యను ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి కిరణ్ గత నెల 26న తీసుకొచ్చాడని పేర్కొన్నారు. ఇల్లరికంలో ఉన్న కిరణ్కుమార్ను చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతుండే వారని, కిరణ్కుమార్ మరో మహిళను ప్రేమించినట్లు, దానివల్ల భార్యాభర్తలకు మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. ఎలాగైనా భార్య పద్మజను చంపాలనుకున్న కిరణ్కుమార్ యూట్యూబ్లో వీడియోలు చూస్తుండగా, డేంజరస్ పాయిజన్ అవేలబుల్ అనే క్యాప్షన్తో వీడియోను చూసి.. అందులోని ఫోన్ నంబర్కు సంప్రదించి రూ.80 వేలు పెట్టి కొరియర్ ద్వారా విషం కొనుగోలు చేశాడన్నారు. గత నెల 29న రాత్రి 11.30 గంటల సమయంలో కవ్వాలో విషం కలిపి భార్యకు కిరణ్కుమార్ ఇచ్చి ఆమె ముఖంపై ఊపిరి ఆడకుండా తలదిండు ఒత్తి పెట్టడం వల్ల ఆమె మృతి చెందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. విషం అమ్మిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నామని, తర్వాత విచారణలో విషం అమ్మిన వ్యక్తితోపాటు తయారు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. తొలుత పద్మజ మృతిని అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని, వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి విచారణ చేసి కేసును నిగ్గుతేల్చారన్నారు. నిందితుడు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో వన్టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు
కడప: తెలిసీ తెలియని వయసు వారిది.. చూడగానే ఒకరినొకరిపై ఆకర్షణ కలిగింది.. మెల్లగా మాట కలిసింది.. ఆపై ప్రేమ చిగురించింది.. ఊహల్లో విహరించారు.. ఊసులెన్నో చెప్పుకున్నారు.. కలిసి జీవించాలని కలలుగన్నారు.. ఏమైందో.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థ తలెత్తింది.. మాటల్లో తేడా వచ్చింది.. తెలియని సంఘర్షణ ఏదో ఆ లేత మనసును గాయపరిచింది. అంతే ..కలిసి జీవించాలనుకున్న వారే విడివిడిగా బలవన్మరణానికి ఒడిగట్టారు.. కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చారు.. ప్రేమ జంట యోగేంద్రకుమార్వర్మ (19), హేమశ్రీ (19) విషాదగాథ ఇది.చెన్నూరుకు చెందిన వీరిద్దరూ కడప నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతుండగా కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. చిన్నపాటి మనస్పర్థలతో చిన్నవయసులో తనువు చాలించారు. మరణంలోనైనా ఒక్కటిగా సాగనంపాలని చెన్నూరు సమీపంలో ఒకే ప్రాంతంలో పక్కపక్కన ఇద్దరికీ మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత బాధలోనూ రిమ్స్ సమీపంలోని డాక్టర్ ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సిఫారసు మేరకు యువకుడి తల్లిదండ్రులు కొడుకు నేత్రదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. -
పవన్ సార్.. మమ్మల్ని బానిసలుగా మార్చకండి!
సాక్షి ప్రతినిధి, కడప: తమిళనాడుకి కాబోయే సీఎం విజయ్కు శుభాకాంక్షలంటూనే, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్పై జనసేన నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘విజయ్ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25శాతం ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నప్పటికీ మీరెందుకు పోరాటం చేయలేకున్నారు. మీరెందుకు సీఎం కాలేకున్నారు. మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు’’ అంటూ నిలదీస్తున్నారు. తాజాగా రాజంపేట జనసేన ఇన్చార్జి కొనిశెట్టి హరి రాయల్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరి రాయల్ వీడియో సారాంశం ఇలా ఉంది. పవన్ సార్ విజయ్ను చూడండి.. ''పవన్కళ్యాణ్ సార్ మిమ్మల్ని తప్పుబట్టట్లేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఈ జనసేన బిళ్లను చూడండి. 2014లో పార్టీ పెట్టారు. ఆరోజు నుంచి బిళ్లను మోస్తున్నాం. కానీ మా బతుకులు చూడండి, కుక్కల్లాగా బతుకున్నాం. మాది కూడా ఒక బతుకేనా! మాకు ఆత్మగౌరవం లేదు. అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు. పార్టీ గెలవకపోయినా వందేళ్లు మీతో నడుస్తాం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కడప జిల్లాకు వస్తే, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టుకోరు. పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎందుకు కలవరు? నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బందేమిటీ? పార్టీని నిర్మాణం చేసుకుని జనాల్లోకి తీసుకు వెళ్లకుండా ఇలా ఎందుకు సార్! జనాల్లో నమ్మకం పోయింది.ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేసి కమిటీలు, ఇన్చార్జీలను వేయండి సార్. పార్టీ పెట్టి 15 ఏళ్లు అయింది. ఎందుకు ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెడుతున్నారు? తమిళనాడులో విజయ్ వెనుక ఎలాంటి కులం లేదు. కానీ మీ వెనుక 25 శాతం ఓట్లు ఉన్న కులం ఉంది. విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చారు. విజయ్ మాలాంటి వారికి నమ్మకం కలిగించారు. ఇప్పటికైనా పార్టీని ముందుకు నడిపించి మీరు సీఎం అవ్వండి సార్. మీ కాళ్లు పట్టుకుంటాం. మా జీవితాలను నాశనం చేయవద్దు. మాట్లాడితే సస్పెన్షన్లు తగవు. జనసేన పార్టీ మాది. మెగా ఫ్యామిలీతో మాది పేగు బంధం. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోతాం. మీరు ముంచినా మునిగేందుకు మీ వెంట నడుస్తున్నాం. కష్టపడే వారికి అవకాశం ఇవ్వండి సార్..'' అంటూ హరిరాయల్ పవన్ను వేడుకుంటూ వీడియోను ముగించారు. -
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
మిద్దె కూలి మహిళ మృతి
కడప అర్బన్: కడప నగరం మాచుపల్లి బస్టాండ్ సమీపంలోని ఆకుల వీధిలో సోమవారం ఓ పాత మిద్దె కూలిపోయింది. ఈ ప్రమాదంలో కాకర్ల సరస్వతి (42) అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ఇంట్లో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు. కడప టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు ఎస్సై రఫీ.రెవిన్యూ. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని భవనంలో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. కడప టూ టౌన్ సీఐ వివరాల మేరకు.... ఆకుల వీధికి చెందిన సరస్వతి చౌడుమిద్దెలో నివాసం ఉంటున్నారు. మిద్దె కిందికి వంగిపోవడంతో పనులు చేయించేందుకు సోమవారం ఉదయం బేల్దారి వీరన్న, లక్ష్మీదేవిలను పిలిపించుకున్నారు. సరస్వతి చిన్నాయన సూరయ్య కూడా ఇంటి వద్ద ఉండి వంగిపోయిన ఇంటిని పరిశీలిస్తున్నారు. పనులు చేయాలనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వారిపై మిద్దె కూలిపోయి పడిపోయింది. ఈ ప్రమాదంలో సరస్వతి మృతి చెందింది. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. -
స్టార్టప్ టీ హబ్ను సందర్శించిన కలెక్టర్
కడప సెవెన్రోడ్స్ : ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్(హైదరాబాద్ గచ్చిబౌలిలోని) అయిన టీ హబ్ను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ సోమవారం సందర్శించారు. యువతకు కొత్త ఆవిష్కరణలు, ఉపాధి, అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో త్వరలో ప్రారంభించనున్న స్టార్ట్ అప్ కడప ద్వారా కొత్త ఆవిష్కరణలకు వేదిక కానున్న నేపథ్యంలో టీ హబ్ను సందర్శించారు. స్టెప్ సీఈఓ విజయ్ కుమార్, ఆస్పిరేషన్ డిస్టిక్ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఎంపీహెచ్ఎస్గా పదోన్నతులు కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయం కార్యాలయం పరిధిలో సోమవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎంపీహెచ్ఏ (ఎఫ్) నుంచి ఎంపీహెచ్ఎస్గా నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జోన్–4 పరిధిలో మొత్తం 86 మందికి గాను 77 మంది పదోన్నతులు పొందారు. ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య, డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలోని ప్రతి పాఠశా ల,కళాశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విజయ్ భాస్కర్, ఇస్మాయిల్, ఏఎంవీఐ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. సోమవారం ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల, కళాశాల బ స్సులను తనిఖీ చేశారు. ఫిట్నెస్ పత్రాలు లేకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.టీడీపీ నేతపై కేసు నమోదు ప్రొద్దుటూరు : స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ బాబా ఫకృద్దీన్పై దాడి చేసిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీనేత నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మందిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లబోతుల నాగరాజు శ్రీరామ్ ఫైనాన్స్లో రూ.40లక్షల రుణాన్ని 2024లో తీసుకున్నారు. ఈ రుణానికి సంబంధించి ప్రతినెల రూ.1.31 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా కంతులు చెల్లించకపోవడంతో గత నెల 30న డివిజనల్ మేనేజర్ టీడీపీ నేతకు ఫోన్ చేశారు. ఈ విషయంపై నాగరాజు తన ఇంటికే ఫోన్ చేస్తా వా అని శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి బాబాఫకృద్దీన్పై దాడి చేసి కార్యాలయంలో దౌర్జన్యం చేశారు. పోలీసులు డివిజనల్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కోర్టుకు పంపడంతో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతో టోకరా కడప అర్బన్: రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నబీకోటలో నివాసముంటున్న ఎలిశెట్టి రవిచంద్ర ఏపీజీబీలో పనిచేస్తూ వీఆర్ఎస్ తీసుకున్నాడు. తన కుమారుడు, కూతురికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో యోహాన్, శ్రీనివాసులు, అభినవ్ సింగ్ పరిచయమయ్యారు. తాము రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో రవిచంద్ర తన వీఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బును సదరు ముఠాకు విడతలవారీగా రూ.34.50 లక్షలను వారి ఖాతాలకు జమ చేశాడు. ఈ నేపథ్యంలో సదరు ముఠా సభ్యులు రవిచంద్రకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారు. వాటిని రైల్వే అధికారుల వద్దకు తీసుకెళ్లిన ఆయనకు అసలు విషయం తెలిసింది. మోసపోయానని గ్రహించిన రవిచంద్ర పోలీసులను ఆశ్రయించారు. కడప తాలూకా సీఐ నరసింహారాజు బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు విచారణ చేస్తున్నారు. -
‘అర్జీ’లకు పరిష్కారమేదీ !
కడప సెవెన్రోడ్స్ : పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల వినతులు ఆయన పరిశీలించారు. ప్రజల సమస్యలను జీరో శాతానికి తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్జీదారుల సమస్యలను నాణ్యతతో గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల్లో కొన్ని.. వీఆర్వో నా భూమి ఆక్రమించారు మా గ్రామ పొలం సర్వే నెంబరు 408లో 1.18 ఎకరాలు, 409లో 0.30 సెంట్ల భూమి నాకు పూర్వీకుల నుంచి సంక్రమించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ల ఆధారాలు సైతం ఉన్నాయి. కాగా, కిశోర్ అనే వీఆర్వో నా భూమిని ఆక్రమించారు. విచారించి న్యాయం చేయాలని కోరేందుకు వచ్చాను. – నీరుగట్టు రామయ్య, రేకులకుంట, బి.మఠం మండలం రహదారి సౌకర్యం కల్పించాలి నేను 1998లో మా గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామసుబ్బమ్మ వద్ద నుంచి సర్వే నెంబరు 978/2లో 2.51 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. రిజిస్టర్ కూడా జరిగింది. పూర్వం నుంచి అక్కడ రహదారి ఉంది. ఇప్పుడు అడ్డంకులు కల్పిస్తున్నారు. భూమి సర్వే చేయించి ఉత్తరం వైపు ఉన్న పూర్వపు దారిని పునరుద్ధరించాలని కోరుతున్నాను. – మునెయ్య, రమణమ్మ, గోపవరం అర్జీలకు స్పందించేవారే లేరు మా గ్రామ పొలం సర్వే నెంబరు 155లో నా పేరిట 2.91 ఎకరాల భూమి ఉంది. నా భూమి పక్కనే మైలవరం రిజర్వాయర్ అధికారులు నేల బ్రిడ్జి నిర్మించా రు. ఇందువల్ల 2019 నుంచి 15 సెంట్లు నా భూమి ముంపునకు గురవుతోంది. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలుమార్లు అర్జీలు సమర్పిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – నాగలింగం, పి.సిరిగేపల్లె, జమ్మలమడుగు ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి -
విజిలెన్స్ అధికారుల దాడులు
కడప అర్బన్: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం సీకేదిన్నె మండలం ఊటుకూరు వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ మేరకు కడపకు చెందిన శేఖర్ రెడ్డి అనే వ్యక్తి కడప నగరం చుట్టుపక్కల మండలాల నుంచి సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఓ టీచర్ వాహనంలో రవాణా చేస్తుండగా తనిఖీ అధికారులు గుర్తించి ఈచర్ వాహనాన్ని సీజ్ చేశారు. 205 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డి తో పాటు డ్రైవర్ గూడూరు ప్రసాద్పై సికెదిన్నె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శ్రీనివాసరెడ్డి, సీకే దిన్నె సీఎస్డీటీ పి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
ఆటవిక రాజ్యం.. అనాగరిక పాలన
● ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ లేదు ● ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ● దశరథరామిరెడ్డికి అండగా నిలుస్తాం ● వైఎస్సార్సీపీ నేతలు ఆకేపాటి, కొరముట్ల, చింతల సాక్షి, మదనపల్లె: రెండేళ్ల కూటమి పాలన ఆటవిక రాజ్యాంగ మారిందని, రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరామిరెడ్డిపై టీడీపీ మూకల పాశవిక దాడి, హత్యాయత్నం ఘటనపై ఆ పార్టీ నేతలు సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు జి.షమీంఅస్లాం, మున్సిపల్ మాజీ చైర్మన్ వి.మనూజ, పార్టీ నేతలు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. రాయచోటిలో దశరథరామిరెడ్డిపై జరిగిన దాడి, హత్యాయత్నం, ఆస్తినష్టం గురించి ఎస్పీకి వివరించారు. మూకదాడిలో గాయపడిన బాధితుల గురించి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు దారుణమని, తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నేతలు ఆ తర్వాత తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. రక్షణ ఎక్కడ కూటమిపాలన వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. అధికార అండతో దాడులకు తెగబడుతున్నారని, ఆస్తులను ఆక్రమిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దశరథరామిరెడ్డిపై పైశాచికంగా జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడి హత్యాయత్నానికి తెగబడటం ఆటవిక రాజ్యం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. . దశరథరామిరెడ్డి పై జరిగిన దాడికి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, తామంతా అండగా ఉన్నామని చెప్పారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు, దశరథరామిరెడ్డికి న్యాయం జరిగేదాకా పార్టీ అండగా ఉంటుందని, పోరాటం చేస్తామని అన్నారు. ఫ్యాక్షన్కు ఆజ్యం పోస్తున్నారా ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్నారా అని టీడీపీ నేతలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను రాయచోటిలో మళ్లీ పునరావృతం చేస్తున్నారని అన్నారు. దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడి అశాంతి సృష్టించారని అన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం
కడప అర్బన్: ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమంలో వచ్చే అర్జీలకు చట్టపరిధిలో నాణ్యమైన పరిష్కారం చూపాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారుల తో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నా రు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 145 ఫిర్యాదులు పీఆర్ఎస్కు వచ్చాయని పోలీస్ అధికారులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ కె. ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
కష్టమంతా నేలపాలు !
● జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలుల బీభత్సం ● నేలకూలిన అరటి.. మామిడి, నిమ్మ పంటకు నష్టం.. ● విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు వేంపల్లె/చింతకొమ్మదిన్నె/పెండ్లిమర్రి : అసలే పంట ఎగుమతుల్లేక.. ఆపై ధరల్లేక అష్టకష్టాలు పడుతున్న రైతులకు గాలివాన మరింత కష్టాలోకి నెట్టింది. చేతికొచ్చే పంటను నేలవాల్చి తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ఆది, సోమవారాల్లో వీచిన గాలులకు పెద్ద మొత్తంలో అరటి పంట నేలకొరిగింది. వేంపల్లె, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల్లో భారీ స్థాయిలో పంట దెబ్బతింది. వేంపల్లె మండలంలోని అయ్యవారిపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి తన 3ఎకరాల్లో సాగుచేసిన 800 అరటి చెట్లు నేలకొరిగాయి. దాదాపు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. అలాగే వేంపల్లెకు చెందిన మురికూటి రెడ్డయ్య పాములూరు రోడ్డులోని పంట పొలాల్లో సాగు చేసిన అరటి చెట్లు నేలకూలాయి. దాదాపు రూ.4లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నేలకూలిన విద్యుత్ స్తంభాలు భారీ ఈదురుగాలులకు వేంపల్లెలోని పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు 3 గంటలపాటు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈదురుగాలుల బీభత్సం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె, బుగ్గలపల్లె తదితర గ్రామాలలో వేసిన అమృతపాణి రకం చెట్లు పూర్తిగా నేలకూలగా, గ్రాండ్నైన్ రకం అరటి తీవ్రంగా ఊగిపోవడంతో పంట నాణ్యత తెబ్బతింది. బుగ్గలపలెకు చెందిన రైతు శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ తన రెండు ఎకరాల అమృతపాణి అరటి చెట్లు కూలడంతో పెట్టుబడితో పాటు ఏడాదిపాటు పడ్డ కష్ట మంతా నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మామిడి తోటలలో అక్కడక్కడా కాయలు రాలాయి. పెండ్లిమర్రి మండలంలో.. పెండ్లి మర్రి మండలంలో ఆదివారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. మాచునూరు, రేపల్లె, కొత్త సంగటి పల్లె, పెండ్లిమర్రి, వెల్లటూరు, చిన్న దాసరి పల్లె, చీమల పెంట, తదితర గ్రామ పొలాల్లో సాగులో ఉన్న అరటి నిమ్మ మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి కొన్ని గ్రామాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. -
రారండోయ్.. ట్రిఫుల్ ఐటీకి
వేంపల్లె: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల సందడి మొదలైంది.పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఆర్జీయూకేటీ సంస్థలో పేద, మధ్యతరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందుతున్నారు. ఇక్కడ చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్ ఐటీ సీట్లలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమానంగా కేటాయిస్తారు . శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. స్పెషల్ కేటగిరి (పీహెచ్/ఎన్సీసీ/ స్పోర్ట్స్/ భారత్ స్కౌట్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్లు జూన్ మొదటి వారం లో చేపట్టి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు : రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి., ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఒక్కో ట్రిపుల్ ఐటీలో సుమారు వెయ్యి సీట్లు ఉన్నాయి. ఓబీసీ కింద ఒక్కో ట్రిపుల్ ఐటీకి 100 సీట్లు అదనంగా కేటాయించగా మొత్తం కలిపి 4400 సీట్లు అవుతాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నారు. సమీకృత ఇంజినీరింగ్ కోర్స్ ఆరేళ్లు కాగా .. అందులో రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్స్), నాలుగేళ్ల ఇంజినీరింగ్ లో చేరుతారు. నూతన విద్యా విధానం –2020 మేరకు పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులు రిలీవ్ కావచ్చు. ఇంజనీరింగ్ సైతం ఏటా రిలీవ్ కావచ్చు. విద్యార్హత ఆధారంగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజనీరింగ్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్ లు నిర్వహిస్తున్నారు. రిలీవ్ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంతోపాటు గేట్ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ..ఎంపిక ప్రక్రియ : 2026–27 విద్యా సంవత్సరానికి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ సండ్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరికి సమాన మార్కులు వస్తే ముందు గణితం, తరువాత జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషియల్, చివరిగా ఫస్ట్ లాంగ్వేజీలో మార్కులు పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు. అప్పటికీ సమ ఉజ్జీగా ఉంటే పుట్టిన తేదీ, హల్ టిక్కెట్ నంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్( డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ, ఆర్జేయుకేటీ.ఇన్/ ఎపీ వైబ్సెట్) ద్వారా స్వీకరించనున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.400, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు రూ.250గా నిర్ధారించారు. జూన్ 12వ తేదీన ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ.. ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జులై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త వారు కూడా వారితో కలిసి చదువు కొనసాగించేలా ఈ మార్పు చేశారు. 2026–27 విద్యా సంవత్సరానికినోటిఫికేషన్ విడుదల ఆన్లైన్ దరఖాస్తులకుఈనెల 30 తుది గడువు అన్ని జిల్లాలకు సమానంగా సీట్ల కేటాయింపు రాష్ట్రంలోని 26 జిల్లాలకు సమానంగా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లను ఆర్జీయూకేటీ అధికారులు కేటాయించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి పాసైన విద్యార్థులకు నాలుగు శాతం డిప్రియేషన్ స్కోర్ జోడించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ డైరెక్టర్, ఇడుపులపాయగ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభం లో ఒక్కో ట్రిపుల్ ఐటీ కి 2వేల సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించి 4 వేల సీట్లలో ఓపెన్ కేటగిరీలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ, ఎన్ఆర్ఎ తదితరులకు, మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు. -
● టీడీపీ శ్రేణులు పెట్రేగిపోతున్నారు: మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి
సాక్షి అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అనుచరులు చెలరేగిపోతున్నారు. అధికారం ఉండగా... మంత్రి అండగా... వైఎస్సార్సీపీలోని కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇదేమని అడిగే పోలీసులు లేకపోగా.. ఇది తప్పు అని చెప్పే వారు లేకపోవడంతో వారు అనుకున్న ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఒకప్పుడు అన్నమయ్య జిల్లా కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా ఉండేది. కానీ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వరుసగా ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న దాడులతో అలజడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దాడులు ఎక్కువగా జరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఆదివారం మధ్యాహ్నం ఒక స్థల వివాదంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డితోపాటు మరికొంత మందిపై పచ్చ మూకలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఒక రకంగా భయోత్పాతం సృష్టించి అలజడులు రేకెత్తించడం చూస్తే అధికార పార్టీ నేతలు అమలు చేసిన ప్రణాళికలో భాగంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్లో వరుస దాడులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉండేది. ఎక్కడికక్కడ శాంతి భద్రతల పరంగా గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వారానికో, పది రోజులకో అలజడులు జరుగుతూనే ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల పర్వం ముగియగానే రాయచోటి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, బీసీ నాయకుడు వెంకటేష్పై.. తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే తొలిగా రాయచోటి మండల ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై దాడి, తర్వాత రాయచోటిలో కౌన్సిలర్ల ఇళ్ల వద్ద దాడులకు పూనుకోవడం, లక్కిరెడ్డిపల్లెలో ఎంపీపీ రెడ్డయ్య ఇంటిపై దాడులు చేయడం, రాయచోటికి చెందిన వైఎస్సార్సీపీ బీసీ నాయకుడు సిబ్యాల విజయభాస్కర్పై దాడి, రామాపురం మండలంలో కూడా పలు చోట్ల వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లను కూల్చివేసిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల రాయచోటి పరిధిలోని ఒక అంగన్వాడీ భవనం వద్ద జరిగిన గొడవలో కూడా మంత్రి అనుచరులు భయానక వాతావరణం సృష్టించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో గుర్రంకొండ పోలీస్స్టేషన్పైకే టీడీపీ నేతలు దాడులకు వెళ్లడం అప్పట్లో ఎస్పీ సీరియస్గా తీసుకుని కేసులు నమోదు చేశారు. పీలేరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఇంటిపై దాడులకు పురిగొల్పారు. అంతేకాకుండా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ఇలా చెబుతూ పోతే అన్ని చోట్ల అధికారం అండ చూసుకుని దాడులకు తెగబడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్గా.. జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్గా పచ్చ ముఠా దాడులకు ప్రణాళిక రచిస్తోంది. ఆదివారం పచ్చ మూకల దాడిలో తీవ్ర స్థాయిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డి రెండు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే మరుసటి రోజు సంఘటన ప్రాంతంలో ఆయనపై దాడి జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితయ్యారని.. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రధానంగా రాయచోటి ప్రాంతంలో మంత్రి అండ చూసుకుని అనచరులు టార్గెట్ చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయచోటిలో అలజడి అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఆదివారం అలజడి చెలరేగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన పచ్చ మూకలు దశరథరామిరెడ్డితోపాటు మిగతా వారిపై మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడులు చేశారు. పచ్చ ముఠాను ఆపేవారు లేరు. పదుల సంఖ్యలో వచ్చిన వారు రావడం రావ డంతోనే దాడులకు తెగబడటం.. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు గాయపడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్ను కూడా అడ్డుకోవడంపై తీవ్ర చర్చసాగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్గాసాగుతున్న దాడులు మంత్రి మండిపల్లి అనుచరుల దాడులతో రాయచోటిలో భయం భయం తాజాగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం నేతలను భయపెట్టిభయాందోళనలతో అలజడులు ప్రేక్షక పాత్రకేపరిమితమవుతున్న పోలీసులు రాయచోటి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో.. ఎక్కువగా రాయచోటిలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత దశరథ రామిరెడ్డి, అతని అనుచరులపై ఆదివారం జరిగిన దాడులపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గూండాలు పెట్రేగి పోతున్నారన్నారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను, స్టేటస్ కోలను అధికార పార్టీ నాయకులు తమకున్న అధికార బలంలతో లెక్కచేయకుండా దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక, దౌర్జన్యకర పాలనతో అస్థిరత నెలకొందన్నారు. రాయచోటి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు భూ ఆక్రమణలు, దోపిడీలు, సెటిల్మెంట్ల పేరుతో స్థానిక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకపోగా ఫిర్యాదు చేసిన వారిపైనే తప్పుడు కేసులు బనాయిస్తుండడం దారుణమన్నారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడరని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని రమేష్ కుమార్ రెడ్డి ఆదివారం హెచ్చరించారు. -
ఒంటె వాహనంపై సంజీవరాయుడు
రాజుపాళెం: మండలంలోని వెల్లాల పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఒంటె వాహనంపై సంజీవరాయస్వామి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో స్వాములను పల్లకీలో ఆశీనులను చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తుల గోవిందా నామస్మరణలతో ఆ ఆ ప్రాంతం మారుమోగింది. ఉభయదాతలైన పగిడాల వైఎస్సార్సీపీ నాయకులు కానాల బలరామిరెడ్డి, వెల్లాల ఆలయ మాజీ చైర్మన్ కానాల విజయలక్ష్మి, పగిడాల మాజీ సర్పంచ్ కానాల రాధా, దామోదర్రెడ్డి, రామచంద్రారెడ్డి.. స్వాములకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. కార్యక్రమంలో ఈఓ వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ రామమోహన్, భక్తులు పాల్గొన్నారు. రాయచోటి టౌన్: గృహనిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, ఫౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి ఆర్అండ్బీ అతిథి గృహంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గృహనిర్మాణ పనులపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి అందుతోందా..ఆర్థిక చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అని అధికారులను అడిగ తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో మొత్తం 66,360 ఇళ్లకు 42,326 ఇళ్లు పూర్తయ్యాయని, దీంతో 64 శాతం పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే డివిజన్ వారిగా కూడా రాయచోటిలో 54శాతం, మదనపల్లెలో 67 శాతం,పీలేరులో 67శాతం అభివృద్ధి సాధించినట్లు వివరించారు. మిగిలిన పనులు సెప్టెంబర్ 26లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాయ చోటి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా హౌసింగ్ పీడీ రమేష్రెడ్డి , ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్కు ప్రతి శని,ఆదివారాల్లో అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం వరకు ఐదు ట్రిప్పులు తిరుగుతాయన్నారు. మిగిలిన రోజులు యాధావిఽధిగా బస్సు సర్వీసు నడుస్తుందన్నారు. ఈ బస్సు సర్వీసు మల్లికార్జునసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా హార్సిలీహిల్స్కు వెళుతుందన్నారు. కడప ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి ఆర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ–2026) ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు ఉదయం 11 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్టీఏకి సంబంధించిన అధికారులు విద్యార్థులను పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. కడపలో 8, ప్రొద్దుటూరులో 2 కేంద్రాల్లో లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 2952 మంది అభ్యర్థులు పరీక్షల రాశారు. -
కళాకారులు కారణ జన్ములు
రాజంపేట టౌన్ : కళాకారులు కారణ జన్ములని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. సాంస్కృతికశాఖ సహకారంతో కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి రాజంపేట పట్టణంలోని గాంధిమెమోరియల్ కళామందిర్ (జిఎంసీ)లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రముఖ రంగస్థల కళాకారులను సత్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్ఫోన్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు వినోదానికి కొదవలేకుండా పోయిందని, అందువల్ల కళారంగంపై ప్రజలకు ఆసక్తి కూడా సన్నగిల్లుతుందన్నారు. ఇలాంటి తరుణంలో కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి రంగస్థల కళారంగాన్ని జవసత్వాలు పోస్తున్నారన్నారు. జిల్లాలో రాజంపేటలోనే నాటక ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడంలో కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. సమాజంలో ప్రజలను చైతన్యవంతులు చేసే శక్తి కళాకారులకు ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఊటుకూరు ఎంపీటీసీ నాగా శేఖర్రెడ్డి, వివిధ సంస్థలకు చెందిన కళాకారులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, మందరం వెంకట సుబ్బారెడ్డి, చిన్నపోలు జయరామిరెడ్డి, తుమ్మలపెంట వేణుగోపాల్, ఏవీ.సుబ్బరాజు, పసుపులేటి గోపినాధ్, సంగీత సుబ్బరాయుడు, వేలూరు కృష్ణయ్య, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
● భౌతిక దాడులు బాధాకరం
రాయచోటి: ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై అధికార పార్టీ నేతలు భౌతిక దాడులకు పాల్పడటం బాధాకరమని.దారుణమని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం పచ్చమూకల దాడిలో గాయపడిన దశరథరామిరెడ్డిని వైఎస్సార్సీపీనాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వర్కర్లు పరామర్శించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, రామాపురం మాజీ ఎంపీపీ జనార్దన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఖా న్, పట్టణ మైనార్టీ నేత రియాజుర్ అహ్మద్లు గాయపడిన వారిని పరామర్శించారు. -
బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ
రాజంపేట టౌన్: ఈనెల ఏడో తేదీ నిర్వహించనున్న బలిజపల్లె గంగమ్మ జాతరకు ఆదివారం రాత్రి నిర్వాహకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అనేక మంది అంకురార్పణ వేడుకను చూసేందుకు గ్రామంలోని మిద్దెలపైకి ఎక్కారు. ఇదిలావుంటే పెద్దఎత్తున తప్పెట్ల వాయిద్యాలు, కొమ్ము ఊదడం, ఆసాదుల ఆశీర్వాదం, గంగమ్మ ఆవహించిన భక్తులు ఊగిపోవడం వంటి కార్యక్రమాల మధ్య జాతర అంకురార్పణ వేడుకను నిర్వాహకులు చేపట్టారు. పోతు మెడలో దండ పడగానే భక్తులు ఒక్కసారిగా గట్టిగా ఈలలు, కేకలు వేయడంతో బలిజపల్లె గ్రామం దద్దరిల్లింది. అంకురార్పణ వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు ● ఇటీవల కాలంలో గంగమ్మ జాతర అంకురార్పణ సందర్భంగా కొంత మంది నిర్వాహకుల మధ్య వివాదాలు తలెత్తాయి అయితే ఈ ఏడాది చిన్నపాటి వివాదాలకు తావులేకుండా అంకురార్పణతో పాటు జాతర ముగిసే వరకు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏఎస్పీ రామ్నాఽథ్హెగ్డే ముందస్తు ప్రణాళికలను రూపొందించారు. అందులో భాగంగా పోలీసులు జాతర నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫలితంగా జాతర నిర్వహణకు తొలిఘట్టమైన అంకురార్పణ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.గంగమ్మ జాతరకు అంకురార్పణ చేస్తున్న నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు -
తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
ఎర్రగుంట్లకు చెందిన శ్రీనివాసులుకు కుమారుడు సునీల్బాబు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమారుడి వయస్సు 9 ఏళ్లు. తన కుమారుడికి కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు నాలుగేళ్ల క్రితం తెలిసింది. అప్పటి నుంచి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. నయం కాని వ్యాధి అయినా కుమారుడిపై మమకారంతో అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం సునీల్బాబు మంచానికే పరిమితయ్యాడు. తన శక్తి మేరకు కుమారుడి వైద్యం కోసం ఖర్చు చేశాడు. పనికి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి వారిది. సునీల్బాబును ఇక ఎక్కడికీ తీసుకెళ్ల లేక వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంచుకొని మందులు వాడుతున్నాడు. -
● ప్రాణం తీసిన ఈత సరదా
అట్లూరు : సరదా కోసం ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన అట్లూరులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. అట్లూరు మండలం తంబళ్లగొంది గ్రామానికి చెందిన చిల్లు కొండమ్మ, నరసింహులు కుమారుడు పవన్ కుమార్ (16) ఆదివారం తోటి స్నేహితులతో కలిసి అట్లూరు గ్రామ పొలాల్లో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు పవన్కుమార్ నీట మునిగిపోవడంతో తోటి పిల్లలు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ నాగకీర్తన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో బద్వేలు నుంచి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షల్లో 450 మార్కులు సాధించినట్లు విద్యార్థి బంధువులు తెలిపారు.సింహాద్రిపురం : ఈత సరదా ఒకరి ప్రాణం తీసింది. ఆదివారం జరిగిన సంఘటన సంబంధించిన వివరాలు.. దిద్దికుంట గ్రామంలో ఆదివారం దేవర కార్యక్రమం తలబెట్టారు గ్రామంలో బంధువులు ఇంటికి శనివారం తాడిపత్రికి చెందిన వల్లెపు హరి(19) వచ్చాడు. ఇతను డిప్లమో చేస్తున్నాడు. ఆదివారం సరదాగా తోటి స్నేహితులతో సంపు వద్దకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సంపులో జారి పడటంతో స్నేహితులు రక్షించలేని పరిస్థితుల్లో కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయాడు. అయితే జరిగిన విషయం గ్రామంలో తెలపడంతో పైర్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలుపలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేయాల్సి ఉంది. -
నాలుగేళ్ల తర్వాత తెలిసింది
నా పేరు గిరిధర్రావు. ప్రొద్దుటూరు గౌరవమ్మకట్ట వీధిలో నివాసం ఉంటున్నాను. బట్టలషాపులో గుమస్తాగా పని చేస్తాను. మా కుమారుడు శ్రీనివాసరావుకు ప్రస్తుతం 11 ఏళ్లు. బాబు పుట్టగానే రెండున్నరేళ్లకు నడిచాడు. 4 ఏళ్ల వయసులో స్కూల్కు పంపించాం. స్కూల్లో నడస్తూనే కింద పడిపోయాడు. మాకు అర్థం కాక స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్తే డాక్టర్ జయచంద్రారెడ్డి గుర్తించి బాబుకు డీఎండీ (డుచ్చెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ) వ్యాధి అని చెప్పారు. తర్వాత బెంగళూరు, కేరళ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఇప్పటికీ రూ. 10 లక్షల వరకు ఖర్చు అయింది. ప్రస్తుతం బాబు నడవలేడు కూర్చోలేడు మంచానికే పరిమితమయ్యాడు. పిజియోథెరపి, మందులకు గాను నెలకు రూ. 40 వేల వరకు ఖర్చు అవుతోంది. రెండేళ్ల క్రితం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు మంజూరు కాలేదు. హాస్పిటల్కు, ఎక్కడికై నా బయటికి వెళ్లాల్సి వస్తే బాబును నా వీపున పెట్టుకొని మోసుకెళ్తాను. నేను, నా భార్య శిల్ప ఎక్కడికి వెళ్లకుండా బాబును చూసుకుంటున్నాం. -
రెడ్డెమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 2వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (30)ని వైద్యం కోసం తీసుకుని వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదుమైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలుకు చెందిన బుచ్చిగారి నందిని అనే 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఆదివారం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిని తల్లి కువైట్కు వెళ్లింది. తండ్రి పుల్లయ్య ఉన్నాడు. యువతి తన మేనత్త సుభాషిణి సంరక్షణలో కొత్తకొట్టాలు ప్రాంతంలో ఉంటోంది. ఇటీవల కడపలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. శనివారం రాత్రి నుంచి తన మేనకోడలు కనిపించడం లేదని సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పాపం పసివాళ్లు..
ప్రొద్దుటూరు క్రైం : మస్క్యులర్ డిస్ట్రోఫీ.. ఇది ప్రాణాంతక వ్యాధి.. వ్యాధి సోకిన పిల్లలు నాలుగు అడుగులు కూడా వేయలేరు, సరిగా కూర్చోలేరు, మెట్లెక్కలేరు.చచ్చు బడుతున్న శరీరంతో నరకయాతన అనుభవిస్తుంటారు ఈ వ్యాధిగ్రస్తులు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యం కాకున్నా వస్తుంటుంది. ప్రతి 3 వేల మంది మగపిల్లల్లో ఈ వ్యాధి ఒకరికి సోకుతుంది. వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా అయితే నాలుగేళ్ల వయసులో మొదలై ఊహించినంత శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు గురవుతారు. నడవలేక పోవడం, కూర్చోలేక మంచానికే పరిమితమవుతారు. వయసు పెరిగేకొద్దీ శ్వాసకోశ వ్యాధులు కూడా చిన్నారులను వేధిస్తాయి. కడప జిల్లాలో ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు 30 మందికి పైగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో ఈ వ్యాధికి మందు లేదు. అయితే ఇటీవల ఈ కండరాల క్షీణత వ్యాధికి అమెరికాలో ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్లు కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ. 25 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. అంత పెద్ద మొత్తం వెచ్చించి ఇంజెక్షన్ వేయించడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధిన పడిన చిన్నారుల కుటుంబాలను ఆదుకొని వారికి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లాలో 30కి పైగా డీఎండీ బాధితులు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో 10 మందికి పైగా డీఎండీ బారిన పడిన చిన్నారులు ఉన్నారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, పోట్లదుర్తి, అల్లాడుపల్లెతో పాటు జిల్లా వ్యాప్తంగా 30 మంది చిన్నారులు డీఎండీ వ్యాధి బారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు. పలువురు డీఎండీ బాధిత చిన్నారులు జిల్లా ఆస్పత్రి, కడప రిమ్స్లో కేంద్రంలో వైద్యసేవలు, పిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఇది అందరికి తెలిసిన వ్యాధి కాదని, దీనిపై అవగాహన అవసరమని వైద్యులు చెబుతున్నారు. నడవడంలో ఇబ్బంది పడటం, తరచూ పడిపోవడం, కాళ్లు, చేతుల్లో కండరాల బలహీనత, 10 ఏళ్లకే నడక కోల్పోవడం, శ్వాసతీసుకోవడంలో, గుండె పనితీరులో సమస్యలు తదితర ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా భావించాలన్నారు. కండరాల క్షీణత వ్యాధికి ప్రస్తుతం ఖచ్చితమైన నివారణ లేనప్పటికీ చికత్సతో వ్యాధి పురోగతిని తగ్గించవచ్చన్నారు. ఫిజియోథెరపీ, గుండె, శ్వాసకోశ చికిత్సలు కండరాల పనితీరును కాపాడటానికి సహాయపడతాయని తెలిపారు. చిన్నారుల ప్రాణాలను హరిస్తున్న మస్క్యులర్ డిస్ట్రోఫీ ప్రొద్దుటూరులో ఒకే ఇంట్లో ఇద్దరికి కండరాల క్షీణత వ్యాధి జిల్లాలో 30 మందికి పైగా వ్యాధి గ్రస్తులుపిల్లలు పుట్టగానే వారి బోసినోటి నవ్వులు, బుడిబుడి నడకలను చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ది ఉన్నతవంతులుగా చూడాలని పరితపిస్తుంటారు. అయితే వారి ఆశలను డీఎండీ వ్యాధి చిదిమేస్తోంది. ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన ఈ చిన్నారులు ఇక ఎప్పటికీ అడుగులు వేయలేరని తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె తట్టుకోగలదా.. డుచ్చెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి చిన్నారుల ప్రాణాలను హరిస్తోంది. -
ఇద్దరు కుమారులకు డీఎండీ వ్యాధి
ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వరయ్య హమాలీ పని చేస్తుంటాడు. ఆయనకు వీరేంద్ర, రవీంద్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వీరేంద్ర 6 ఏళ్ల వయసులో సరిగా నడవలేక పోవడంతో పాటు కింద పడుతుంటంతో హాస్పిటల్లో చూపిస్తే డీఎండీ వ్యాధి సోకిందని చెప్పారు. తిరుపతి, ఏలూరు తదితర హాస్పిటళ్లలో చూపించారు. చివరగా ఏలూరు హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి నయం కాదని చెప్పడంతో తండ్రి ఈశ్వరయ్యకు ప్రాణం పోయేంత పని అయింది. ఇక చేసేదేమి లేక ఇంటికి వచ్చి వీరేంద్రను స్థానికంగా, కడప రిమ్స్లో వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది జూలైలో 15 ఏళ్ల వయసులో వీరేంద్ర మృతి చెందాడు. పెద్ద కుమారుడి మృతి నుంచి తేరుకొనక ముందే గుండె పగిలే వార్తను ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. రెండో కుమారుడు రవీంద్రకు కూడా డీఎండీ వ్యాధి ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. పెద్ద పిల్లాడి మాదిరిగానే కింద పడటం, కూర్చోలేకపోవడం తదితర లక్షణాలు కనిపించడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు డీఎండీ వ్యాధి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రవీంద్ర వయసు 6 ఏళ్లు. లేవలేడు.. అడుగులు వేయలేడు. స్థానిక ఆస్పత్రుల్లోనే బాలుడికి వైద్యం చేయిస్తున్నారు. -
బైక్ను ఢీ కొట్టిన కారు:ఒకరికి తీవ్రగాయాలు
రాజంపేట : పట్టణంలోని జీకేఎస్సార్ కల్యాణమండపం(తిరుపతి బైపాస్రోడ్డు)లో ఆదివారం గుర్తుతెలియని కారు, బైక్ను ఢీ కొట్టింది. బైక్పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఢీ కొట్టిన కారు వెళ్లిపోయింది. పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణపాయం లేదని పోలీసులు తెలిపారు. పడవ కాల్చివేతలింగాల : లింగాల మండలం పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పడవను కాల్చివేశారు. డ్యామ్లో ఎవరు చేపలు పట్టకుండా.. గస్తీ తిరిగేందుకు కాంట్రాక్టర్ పడవను ఏర్పాటు చేశారు. మత్సకార సంఘానికి సంబంధించిన చిన్నకోట్ల, పెద్దకోట్ల, పార్నపల్లి గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకు చేపల కాంట్రాక్టర్ అయిన తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన యాదగిరి ఒక గస్తీ పడవను మత్స్యకార సంఘానికి ఇచ్చారు. శనివారం రాత్రి బోటును డ్యామ్ వద్ద ఉంచి మత్స్యకారులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు పాత ఆటో టైర్లను పడవలో వేసి నిప్పు పెట్టినట్లు మత్స్యకారులు తెలిపారు. ఆదివారం ఉదయం వద్దకు వెళ్లగా పడవ కాలిపోయిందని చెప్పారు.మత్స్యకార సంఘం సర్పంచ్ సూర్యనారాయణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బోటు విలువ సుమారు రూ. 4,70,000 ఉంటుందని ఆయన అన్నారు. లింగాల ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి సీబీఆర్ వద్దకు వెళ్లి పడవను పరిశీలించారు. సీబీఆర్పై ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గుండెపోటుతో హైదరాబాద్ వాసి మృతి కలికిరి : గుండెపోటుకు గురై హైదరాబాద్ వాసి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నగరం ప్రగతి నగర్కు చెందిన కనుకుంట్ల రాజేందర్(60) కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన ఆర్.శ్రీనివాసులు రెడ్డికి స్నేహితుడు. రాజేందర్ హైదరాబాద్లో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ... బెంగళూరు, చింతామణి, మదనపలె ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం హైదరాబాదు నుంచి బెంగళూరు, చింతామణికి వచ్చి కలికిరికి వచ్చాడు. రెండురోజుల తర్వాత శ్రీనివాసులు రెడ్డి సొంత పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లాడు. రాజేందర్ మిత్రుడి రూములో ఉన్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేసి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. దీంతో అతని సూచన మేరకు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. స్టేట్బ్యాంక్ సమీపంలో టిఫిన్ చేసి రోడ్డుపైకి వచ్చి గుండె పోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు మృతుని సెల్ఫోన్ ఆధారంగా శ్రీనివాసులురెడ్డికి సమాచారమిచ్చారు. స్నేహితుని ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడు కనుకుంట్ల రాజేందర్ ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్కు స్వయాన సోదరుడు. మృతుని భార్య వసంత కూడా తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని కడప తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ ఎం.నాగూర్ బాబు పేర్కొన్నారు. స్థానిక శ్రీకృష్ణగీతాశ్రమంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో ఫస్ట్ కడప డిస్ట్రిక్ట్ ఇన్విటేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతోపాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. తైక్వాండోలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉందని, దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు నెలలకోసారి ఈ ఇన్విటేషన్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రతి మండలంలో నిర్వహించాలని సూచించారు. నిమిషానికి 177 కిక్స్ చేసిన ఎస్వీడీసీ విద్యార్థిని అభినందించారు. వచ్చే ఏడాది నిర్వహించే కిక్ ఛాంపియన్ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.10వేల నగదు బహుమతి అందిస్తామన్నారు. వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరినారాయణ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడుతాయన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలలకు చెందిన 250 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణానికి చెందిన ఎస్వీ తైక్వాండో అకాడమీ వారు ప్రథమ స్థానం, కమలాపురం సుమన్ తైక్వాండో అకాడమీ వారు ద్వితీయ స్థాం, కడప విజయలక్ష్మి తైక్వాండో అసోసియేషన్ వారు తృతీయ స్థానంలో నిలిచారు. గెలుపొందిన వారికి ట్రోఫీలను, మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో ఎస్వీ తైక్వాండో అకాడమీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శ్రీనివాసులు, ఎస్వీడీసీ కోఆర్డినేటర్ గౌరీశంకర్, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దునూరు, బద్వేలు, మైదుకూరు ప్రాంతాలకు చెందిన తైక్వాండో మాస్టర్లు, క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్: ఒకరి మృతి
ఎర్రగుంట్ల : ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చిత్తకంట వెంకటసుబ్బయ్య (55) మృతి చెందాడు. శనివారం అర్థరాత్రి చోటు చేసునన్న ఘటనకు సంబంధించి ఎర్రగుంట్ల ఎస్ఐ నాగమురళి కథనం మేరకు వివరాలు..కలమల్ల గ్రామానికి చెందిన చిత్తకుంట వెంకటసుబ్బయ్య ఆర్టీపీపీలో పనిచేస్తున్నాడు, ఇతనికి భార్య నారాయణమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిలంకూరులో జరుగుతున్న పెళ్లికి హజరు కావడానికి బైక్లో శనివారం రాత్రి బయలు దేరాడు. చిలంకూరు గ్రామంలోని ఐసీఎల్ వద్ద రాత్రి రోడ్డుకు అడ్డంగా ఎలాంటి సిగ్నిల్ లైటింగ్ వేయకుండా లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నిలబెట్టి ఉన్నారు.చీకట్లో లారీని వెంకటసుబ్బయ్య గమనించకుండా ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళుతుండగా వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు దేశానికి మంచిది కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల గూర్చి పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఈ 23 నెలల కాలంలో రైతులకు ఇవ్వాల్సిన పంటల బీమాగానీ, పెట్టుబడి రాయితీగానీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పంటల బీమా మంజూరైందని పత్రికా ప్రకటనలు తప్ప రైతులకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రెండు రోజుల క్రితం ఆకాల వర్షం, విపరీత గాలుల వల్ల అరటి, బొప్పాయి, వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. కనీసం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. రైతుల గోడును వినేవారు కరువయ్యారన్నారు. ఒకట్రెండు పంటలకు 95 శాతం పంటకోత జరిగి పంట అమ్మిన తర్వాత దళారీల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ధరల స్థీరికరణ నిధికి కేటాయించిన రూ.5వేల కోట్లు ఏమయ్యాయో తెలీని పరిస్థితి ఉందన్నారు. దాదాపు 90 శాతం పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు జీఎన్ భాస్కర్రెడ్డి, ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్ యాదవ్, రాజశేఖర్రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి -
తిరుమల ప్రయాణం తికమక!
రాజంపేట: విశాఖ–కడప మధ్య నడిచే తిరుమల (18521/18522)ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం తికమకగా మారింది. తిరుమల ఎక్స్ప్రెస్గా గుంతకల్ జంక్షన్ వరకు పొడిగిస్తూ సౌత్సెంట్రల్ రైల్వే ఇటీవల ఉత్తర్వులు విడుదలచేసింది. ప్రస్తుతం కడప వరకు నడుస్తున్న ఈ రైలును కడప నుంచి గుంతకల్ వరకు ప్యాసింజర్గా నడిపించారు. కొంతకాలం కడప వరకు నడిపించి నీటి కోసం కొండాపురం వరకు ఖాళీగా తిప్పారు. మళ్లీ కడప నుంచి గుంతకల్ ప్యాసింజర్ గా తిప్పారు. ఇలా తిరుమల రైలుపై అనేక ప్రయోగాలు చేశారు. దీంతో ప్రయాణికులు సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు. మే 13 నుంచి.. ఎక్స్ప్రెస్గా గుంతకల్ జంక్షన్కు నడిపించే విధంగా మే 13 నుంచి పొడిగించేశారు. ఎర్రగుంట్ల, నంద్యాల,గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంకు దగ్గరి మార్గం కడప నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా మారనుంది. బెర్త్లు దొరకాలంటే.. తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో జిల్లా వాసులకు ప్రయాణం కష్టతరంగా మారింది. కడప నుంచి ఉన్నప్పుడే బెర్త్లు లభ్యంకావాలన్నా.జనరల్బోగీలో ప్రయాణం చేయాలన్నా ఇబ్బందుల పడాల్సి వచ్చేదని ప్రయాణికులు చెబతున్నారు. ఇప్పుడు గుంతకల్ జంక్షన్ నుంచి బెర్త్లు దొరకడం గురించి చెప్పనక్కర్లేదు. రెండు నెలల ముందు నుంచి రిజర్వేషన్ చేసుకుంటే వెయిటింగ్లిస్ట్ చాంతడంతా ఉంటుంది. తిరుమలలో ప్రయాణం భారమనే భావనలు జిల్లా వాసుల్లో నెలకొన్నాయి. కడప–గుంతకల్ ప్యాసింజర్కు మంగళం ఎక్స్ప్రెస్గా మళ్లీ గుంతకల్కు పొడింపు -
అశ్వ వాహనంపై ఊరేగిన అగస్త్యేశ్వరస్వామి
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, రాజరాజేశ్వరికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. దీక్షా మంటప పూజలు, గణపతి, నవగ్రహ, రుద్రహోమం, దీక్షాహోమాలను వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు త్రిశూల స్నానం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం గంగాగౌరి సమేత అగస్త్యేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
కడప ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉగ్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద వైఎస్సాఆర్ టీచర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను శనివారం వైఎస్సార్టీఏ నాయకులలతో కలిసి కడపలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. పీఆర్సీ కమిషన్ను ఏర్పాటులో ఆలసత్వం చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు తోపాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్టీఏ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు 6వ తేదీ నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ అసోసియేట్ కార్యదర్శి ఎస్వీ రమణారెడ్డి, జిల్లా సలహాదారు రమేష్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ మోహిద్దీన్, అన్నమయ్య జిల్ల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వేంపల్లె అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి ఇబ్రహీం, చక్రాయపేట అధ్యక్షుడు పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి


