breaking news
YSR
-
‘మాధవీ రెడ్డి.. మీ అవినీతి గురించే టీడీపీలో చర్చ నడుస్తోంది’
సాక్షి, వైఎస్సార్: టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డిపై మేయర్ సురేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో ఒక్క పనైనా చేశారా?.. అభివృద్ధి గురించి వారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలే వారిని చూసి అసహ్యించుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.కడపలో మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి అవినీతి భాగవతం గురించి టీడీపీ వారే చర్చించుకుంటున్నారు. బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో తెలుసు. 30లక్షల పనికి మూడు కోట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవమా కాదా?. మీ కార్యకర్తలే నీ అవినీతి బాగోతం గురించి చర్చించుకుంటున్నారు అయినా సిగ్గు లేదా!. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవీ రెడ్డి కడపకు ఎంత మేర నిధులు తెచ్చారో చెప్పే దమ్ము, దైర్యం ఉందా?. మా నిధులతో టెంకాయలు కొట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా?. వేల కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్సీపీది. అవినీతి చేసే మీరా మమ్మల్ని విమర్శించేది. కాలర్ ఎగరేసుకొని ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తాం.ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ ఇచ్చి గౌరవిస్తే ఆమె నియంతలా వ్యవహరించారు. సర్వసభ్య సమావేశంలోనే సాటి మహిళను ఆమె అవమానించారు. కుర్చీ కోసమే ప్రాకులాడుతున్నానని మాట్లాడటానికి సిగ్గు పడాలి. కుర్చీ కోసం ప్రాకులాడేది ఎవరో ప్రజలకు తెలుసు. అభివృద్ధి కోసం కాదు కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆరాటం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన అజెండాను చించి వేశారు మాధవీ రెడ్డి. ప్రజా సమస్యలపై తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అభివృద్ధి నిరోధకులు కాదా?. 15వ ఫైనాన్స్ నిధులు కూడా రాకుండా చేసింది మీరు కాదా?. అవినీతి జరిగింది అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అలా నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అని ప్రశ్నించారు. -
జగన్మాతా.. నమోస్తుతే!
దేవీ శరన్నవరాత్రుల వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీప కాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణలు కళకళలాడుతున్నాయి. బుధవారం ప్రొద్దుటూరులోని అమ్మవారిశాల ఆలయంలో జగన్మాత శారదాదేవిగా దర్శనమిచ్చారు. జిల్లాలోని మిగతా ఆలయాల్లోనూ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులను కరుణించారు. – ప్రొద్దుటూరుకల్చరల్ -
కూటమి ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపేనా !
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రీవెన్స్ సెల్ ‘స్పందన’ పేరు తొలగించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)గా మార్పు చేసింది. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ అర్జీల పరిష్కారంపై మాత్రం కనిపించడం లేదు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 88 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 37,829 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3996 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఫిర్యాదుల్లో అత్యధికభాగం రెవెన్యూ, పోలీసు, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, పాఠశాల విద్య, ఎస్పీడీసీఎల్, హౌసింగ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రూరల్ డెవలప్మెంట్, పౌరసరఫరాలు, ఆర్అండ్బీ వంటి శాఖల నుంచి వస్తున్నాయి.రెవెన్యూలో అత్యధికంపీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో రెవెన్యూశాఖ నుంచే అత్యధికంగా ఉన్నాయని, అందులో ఆర్వో ఆర్కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదుల పరిష్కారంలో ఆడిట్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ దాని ఫలితాలు ఎక్కడా కనిపించలేదు. రెవెన్యూశాఖను పీపుల్స్ ఫ్రెండ్లీగా మారుస్తామని ప్రకటనలు గుప్పించడం మినహా ఆచరణలో చేస్తున్నది మాత్రం శూన్యం. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కారమే ఇందుకు నిదర్శనం. రెవెన్యూశాఖలో ఇప్పటివరకు మొత్తం 14,289 అర్జీలు వచ్చాయి. ఇందులో 2,196 పరిష్కారానికి నోచుకోలేదు. అలాగే సర్వే సెటిల్మెంట్ అండ్ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 7170 అర్జీలు వచ్చాయి. పోలీసుశాఖకు సంబంధించి 7718 ఫిర్యాదులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 2210 అర్జీలు వచ్చాయి. ఇలా ఆయా శాఖల్లో పలు అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రీ ఓపెన్ అవుతున్నవి కూడా అధికమే. కూటమి ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.కడప అగ్రికల్చర్ : కూటమి ప్రభుత్వానికి రైతులంటే గిట్టదని.. వ్యవసాయమంటే చిన్నచూపని మరోసారి రుజువైంది. ఇప్పటికే పంటకు మద్దతు ధర దక్కక.. సాగుకు యూరిక దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అవన్నీ దిగమింగుకుని రబీకి సిద్ధమవుతున్న రైతన్నకు ..ప్రభుత్వం నుంచి మద్దతు కరువైంది. సాగు వివరాలు.. ఎరువుల కేటాయింపు వంటి ప్రణాళిక సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మరో ఆరు రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభంకానుంది. వ్యవసాయశాఖ ఇంత వరకు రబీ సీజన్కు సంబంధించిన సాగు ప్లానింగ్ సిద్ధం చేయలేదు. విత్తనాలను కేటాయించినా వాటి సబ్సిడీ, విత్తనాల ధరలను ఇంతవరకు పేర్కొనలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో కురుస్తున్న వర్షాలు...జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే రబీ సీజన్కు సంబంధించి కొంతమంది రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆరుతడి పంటలసాగుకు ముందు చాలా మంది రైతులు సత్తువ పంట వేస్తారు. కానీ జిల్లాలో ఎరువులు సరిగా దొరకడం లేదని రైతన్నలు వాపోతున్నారు. ముఖ్యంగా రబీలో అధిక విస్తీర్ణంలో జిల్లాలో శనగపంట సాగవుతుంది. దీంతోపాటు వేరుశనగ, మినుము, పెసర, నువ్వు వంటి పంటలను కూడా అధిక విస్తీర్ణంలోనే సాగు చేస్తారు. ముఖ్యంగా రబీ సీజన్ ప్రారంభంలో జిల్లా రైతులు శనగ సాగు చేస్తారు. ప్రభుత్వం ఇంతవరకు శనగ విత్తనాలకు సంబంధించిన ధరలను కానీ, ఎంత శాతం మేర సబ్సిడీ అనే విషయాలను కేటాయించలేదు. మరి విత్తనాల కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అధికారులు విత్తనాలను ఎప్పుడు రైతు సేవా కేంద్రాలకు పంపిస్తారని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా విత్తనాల పంపిణీ చేపడితే ఆ విత్తనాలు ఎలాగుంటాయోనని రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది చాలా మేర శనగ విత్తనాలు సరిగా లేవని రైతులు పెదవి విరిచారు.212.3 మి.మీ వర్షపాతం...రబీ సాగుకు అక్టోబర్ కీలకం. రబీ మూడు నెలలకాలంలో 212.3 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అందులో అక్టోబర్ నెలలో అత్యధికంగా 132.1 మిల్లీమీటర్లు కురవాలి. ఇక నవంబర్ నెలలో 61.6 మి.మీ, డిసెంబర్ నెలలో 18.6 మి.మీ కురవాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగపంట సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అక్టోబర్ తొలి వారంలోనే ముందస్తుగా శనగపంటను విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ సారి ఖరీఫ్సాగు చేయలేని రైతులు రబీలో శనగ సాగు చేయనున్నారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అక్టోబర్లోనే అధి క విస్తీర్ణంలో పంటలు సాగయ్యేవి. ఆ నెల తొలి వారంలోనే 40 శాతం సబ్సిడీతో శనగవిత్తనాలు అందే విష యాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. విత్తనాల పంపిణీని త్వరితగతిన ప్రారంభించేందుకు సన్నాహాలు చేయా లని రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.రోడ్డున పడ్డాం ఆదుకోండి శనగ విత్తనాలను ఎప్పుడిస్తారో... ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ పదునుకు మేమంతా ఎరువులను విత్తుకుంటాం. అక్టోబర్ 2 లేదా మూడవ వారం నుంచి శనగ పంటను సాగుచేస్తాం. నేను కూడా 12 ఎకరాల్లో శనగపంటను సాగు చేయనున్నా. ప్రభుత్వం ఇంతవరకు సబ్సిడీ, విత్తనాలను గురించే మా ట్లాడటం లేదు. మరి సబ్సిడీ శనగ విత్తనాలను ఎప్పుడి నుంచి ఇస్తారో. – శెట్టిపల్లి పవన్కుమార్రెడ్డి, పెద్దపసుపుల, పెద్దముడియం మండలం.నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే విత్తనాలను నాణ్యతతో కూడిన వి ఇవ్వాలి. గతేడాది రైతులకు ఇచ్చిన శనగ విత్తనాల్లో అక్కడక్కడ నాణ్యత సరిగా లేదు. దీంతో చాలా మంది రైతులు బయట నుంచి కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఈ ఏడాది అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – ఇరగంరెడ్డి చిన్న గంగిరెడ్డి, సోమపురం, రాజుపాలెం మండలంరైతులకు ఆందోళన అవసరం లేదుజిల్లాకు సబ్సిడీకి సంబంధించి శనగ, వేరుశనగ, ను వ్వులు, మినుములు, పెస ల విత్తనాలైతే వచ్చాయి. కానీ వాటి ధరలుకానీ, ఎంత సబ్సిడీ అనే విషయాలపై స్పష్టత లేదు. దీంతోపాటు రబీ సాగు ప్లానింగ్, ఎరువులు కూడా రాలేదు. త్వరలో అవికూడా వస్తాయి. రైతులు ఎవరు ఆందోళన చెందనవరం లేదు.– చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారిగత ప్రభుత్వంలో విశేష ‘స్పందన’కూటమి ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది తప్ప క్షేత్ర స్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. పారదర్శకంగా విచారణ జరిపి సంతృప్తకర స్థాయిలో పరిష్కారాలు లభించలేదు. దీంతో వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తూ అర్జీలు సమర్పించుకోవాల్సి వస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పందన పేరుతో అర్జీల స్వీకరణ, పరిష్కారం కూడా జరిగేది. ఈ కార్యక్రమానికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు సమర్పించే అర్జీలు మరింత నాణ్యంగా, వేగంగా పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించిందంటే అర్జీల పరిష్కారానికి గత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో అర్థమవుతుంది. -
రైతన్న గోడును పట్టించుకోని ప్రభుత్వం
పులివెందుల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతన్నల గోడు పట్టించుకునే పరిస్థితిలో లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోరని ధ్వజమెత్తారు. ఆయన ఆలోచనంతా ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు పెద్ద పీట వేయడం గురించే ఉంటుందని ఆరోపించారు. తన అనుచరుల కు దోచిపెట్టేందుకే ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆ తీర్మాణానికి ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని లక్ష కోట్ల మెడికల్ కళాశాలల ఆస్తిని చంద్రబాబు ప్రైవేట్పరం చేయడానికి పూనుకున్నాడన్నాని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అంటూ డబ్బా కొట్టుకుని అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. మరోవైపు రైతన్నల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. మరోవైపు రైతులకు పండించుకోవడానికి ఎరువులు, యూరియాను సైతం ఈ ప్రభుత్వం అందజేయడంలేదన్నారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఎల్లో మీడియా ద్వారా ఏదో సాధించినట్లుగా దుష్ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. -
రేషన్కార్డుదారులకు జీఎస్టీని మినహాయించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ కొన్ని వస్తువులకే అమలవుతోందని అందువల్ల రేషన్కార్డు ఉన్నపేదలకు జీఎస్టీని మినహాయించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. బుధవారం ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి పథకం వల్ల మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తుండటంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్ఠపోతున్నారన్నారు. వారిని ఆదుకోవడానికి ఆటో డ్రైవర్లకు రోజుకు 5 లీటర్ల ఇంధనాన్ని 50 శాతం సబ్సిడీతో అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రభుత్వం చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానియల్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శులు బాల లక్షుమయ్యమాదిగ, కర్ణమాదిగ, డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు శివమణి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తులు అటాచ్మెంట్ చేసినందుకే వేణుగోపాల్రెడ్డి హత్య
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఐదు రోజుల క్రితం జరిగిన ఫైనాన్షియర్ వేణుగోపాల్రెడ్డి హత్య కేసులో నింతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు తమ ఆస్తులను కోర్టులో అటాచ్మెంట్ చేశాడనే కోపంతో ఈ హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన ఇరువురితో పాటు తెలంగాణా రాష్ట్రానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఎస్డీపీఓ కార్యాలయంలో డీఎస్పీ భావనతో కలసి జిల్లా ఎస్పీ అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న కొండా వేణుగోపాల్రెడ్డి ఈ నెల 19న రాత్రి కిడ్నాప్నకు గురయ్యాడనే సమాచారం రావడంతో రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ అరుణ్రెడ్డి వేగంగా స్పందించారు. కిడ్నాప్ అయిన వ్యక్తిని ప్రాణాలతో కాపాడాలనే ఉద్దేశంతో డీఎస్పీ భావన ఆధ్వర్యంలో ఎస్ఐలు అరుణ్రెడ్డి, కేసీ రాజు, రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణలతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ కేసులోని అనుమానితులను గుర్తించి వారి ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టెక్ అవుట్స్ ద్వారా నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న చాపాడు సమీపంలోని కుందూ వంతెన వద్ద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు తెలంగాణా రాష్ట్రానికి చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్తుల అటాచ్మెంట్ ఆర్డర్ పొందడంతోనే.. మృతుడు వేణుగోపాల్రెడ్డి 30 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేసేవాడు. ప్రొద్దుటూరులో చాలా మందికి వడ్డీకి అప్పులిచ్చాడు. సకాలంలో చెల్లించని వారిపై కోర్టులో సివిల్ దావాలు వేసి వసూలు చేసుకునేవాడు. డబ్బులు కట్టలేని వారి ఆస్తులు అటాచ్మెంట్ కోరేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన వెన్నెపూస లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డిలు కూడా వేణుగోపాల్రెడ్డి వద్ద పెద్ద మొత్తంలో వడ్డీకి తీసుకున్నారు. డబ్బు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో అతను వారిద్దరి ఇళ్లపై అటాచ్మెంట్ ఆర్డర్ను కోర్టు ద్వారా పొందాడు. దీంతో కోపంతో రగిలిపోయిన వాళ్లిద్దరూ వేణుగోపాల్రెడ్డిపై కక్ష పెంచుకొని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా 2016లో బాకీ డబ్బు విషయమై జరిగిన గొడవలో కొండా వేణుగోపాల్రెడ్డిపై లక్ష్మిరెడ్డి కట్టెతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో లక్ష్మిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. హైదరాబాద్లో హత్యకు వ్యూహ రచన.. వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మిరెడ్డిలు రియల్ ఎస్టేట్ చేస్తూ హైదరాబాద్లోని పఠాన్ చెరువు ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. వారి వద్ద అసిస్టెంట్గా పని చేస్తున్న బోయిని నగేష్తో వేణుగోపాల్రెడ్డి హత్య గురించి చర్చించారు. అతను హత్య చేయడానికి అంగీకరించడంతో ఖర్చుల కోసం అతనికి పలు దఫాలుగా రూ. 70 వేలు ఇవ్వడంతో పాటు జీవనోపాధికోసం ఏదైనా వ్యాపారం పెట్టిస్తామని చెప్పారు. దీంతో నగేష్ తన మిత్రుల ద్వారా ఫైనాన్షియర్ను హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను హైదరాబాద్ నుంచి లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు నాలుగు సార్లు ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి వేణుగోపాల్రెడ్డిని చంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ఈ నెల 19న వేణుగోపాల్రెడ్డిని చంపేసి మృతదేహాన్ని కామనూరు బ్రిడ్జిపై నుంచి కుందు నదిలో పడేశారు. దర్యాప్తులో భాగంగా కేసులోని నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన వెన్నపూస లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డి, తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన బోయిని నాగేష్ అలియాస్ హర్ష, లైని అజయ్కుమార్, హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన చింతలచెరువు ప్రణయ్ కుమార్, మియాపూర్కు చెందిన కొత్త శివప్రసాద్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారుతి వేగనార్ కారు, హోండా యాక్టివా స్కూటీ, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని నిందితుడు బోయిని నగేష్పై 2022లో మెదక్ జిల్లా అల్లదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదైంది. రూరల్ పోలీస్ బృందానికి ఎస్పీ ప్రశంస వేణుగోపాల్రెడ్డి హత్య కేసును త్వరిత గతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు డీఎస్పీ, ప్రొద్దుటూరు రూరల్ పోలీసు బృందాన్ని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. బృందంలోని రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐలు అరుణ్రెడ్డి, కేసీ రాజు, రాజుపాళెం ఎస్ఐ కె వెంకటరమణ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎవరైనా అధిక వడ్డీలకు డబ్బులిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫైనాన్షియర్ హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి సహా.. నలుగురు తెలంగాణా రాష్ట్రానికి చెందిన కిరాయి హంతకులు అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి కృతజ్ఞతలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, కార్మికులకు రూ.18,600 వేతనం చెల్లించే విషయంలో స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పోరుమామిళ్ల, జమ్మలమడుగు, బద్వేలు, కడప, జీజీహెచ్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కొత్త అగ్రిమెంట్ ప్రకారం రూ.18600 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 11 వేల నుంచి రూ. 12వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీకి విన్నవించామన్నారు. ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కాంట్రాక్టర్లో చలనం వచ్చిందన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు పవన్, సీఐటీయూ నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జరిమానా విధిస్తారా? మాఫీ చేస్తారా!
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండానే భారీగా కొండను తవ్వి గ్రావెల్ను తరలించారు. ఈ విషయం సాక్షి దినపత్రికలో రావడంతో మైనింగ్శాఖ అధికారుల్లో కాస్త చలనం వచ్చింది. ఈనెల 10 వతేదీ జమ్మలమడుగు–ముద్దనూరు రహదారి అంబవరం పంచాయతీ పరిధిలో అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్ను ఎత్తుకు వెళ్లిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు. అనంతరం అక్రమంగా ఎంత మైనింగ్ చేశారో కొలతలు తీసుకున్నారు. వచ్చిన అధికారులు అక్రమ మైనింగ్పై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆ తర్వాత వారు చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలు విధిస్తారని చెప్పి వెళ్లిపోయారు. 22 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం.. నంద్యాల–జమ్మలమడుగు 167వ జాతీయ రహదారి నిర్మాణం కోసం టెండర్ 80 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. అందులో జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో 22 కిలోమీటర్ల మేర పనులు చేయడంతోపాటు, పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పనులను దక్కించుకున్న ఎస్ఆర్సీ కంపెనీ గత మూడు నెలలుగా పనులు ప్రారంభించింది. రోడ్డు పనుల కోసం కావలసిన గ్రావెల్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇప్పటికే దాదాపు సగానికి పైగా పనులు పూర్తి చేశారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. రహదారి నిర్మాణం కోసం కావలసిన గ్రావెల్ను కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తం కొండను తవ్వి రహదారి నిర్మాణం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజుకు రెండు వందల టిప్పర్ల వంతున అక్రమంగా గ్రావెల్ను తీసుకు వెళ్లారు. ఇదంతా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకు తెలిసినా అటువైపు తొంగి చూడని పరిస్థితి ఉంది. అధికారులు దాడులు చేసి అక్రమంగా తవ్విన గ్రావెల్ కొలతలు తీసుకుపోయిన మరుసటిరోజు నుంచే తిరిగి యథావిధిగా అక్రమ మైనింగ్ చేసి టిప్పర్లలో గ్రావెల్ను తరలిస్తున్నారు. చర్యలు తీసుకుంటారా.. ఉసూరు మంటారా! ఎస్ఆర్సీ కంపెనీ అక్రమంగా గ్రావెల్ తవ్విన ప్రాంతాల్లో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆపై ఎంత మైనింగ్ ద్వారా గ్రావెల్ తరలించారో కొలతలు తీసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు ఎవ్వరూ సహకరించకపోయినా వారే కొలతలు వేసుకుని పోయారు. ప్రస్తుతం 15 రోజులకు పైగా అవుతున్న ఎస్ఆర్సీ కంపెనీపై ఎలాంటి చర్యలకు సిఫారసుగాని, అక్రమ మైనింగ్ చేసి గ్రావెల్ను తరలించినందుకు జరిమానాలు కానీ విధించలేదు. భారీ స్థాయిలో అక్రమంగా గ్రావెల్ను తరలించినా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించకపోవడం కేవలం వచ్చాము.. పోయాము అన్న చందంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎస్ఆర్సీ అక్రమ తవ్వకాలపై మీనమేషాలు లెక్కిస్తున్న మైనింగ్శాఖ -
ఎయిడెడ్ పోస్టుల అక్రమాల సూత్రధారి ఆర్జేడీ శామ్యూల్
కడప సెవెన్రోడ్స్ : ఆర్సీఎం ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల్లో జరిగిన భారీ అక్రమాలకు ప్రధాన సూత్రధారి ఆర్జేడీ శామ్యూల్ను ప్రభుత్వం వెంటనే సరెండర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన ప్రజా సంఘాల జేఏసీ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. జేఏసీ చైర్మన్ ఆర్ఎన్ రాజ, వైస్ చైర్మన్ అంకన్న తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు. మూసివేసిన పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయ పోస్టులు సృష్టించారని ఆరోపించారు. డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి తన రాజకీయ బలంతో విధులకు హాజరు కాకుండా ఆర్సీఎం యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్నారు. జాయినింగ్ ఆర్డర్స్ తారుమారు చేసిన జాన్సన్ చెట్టురిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలన్నారు. అనంతరం జేసీ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జయవర్దన్, సుబ్బరాయుడు, శివకుమార్, డీఎం ఓబులేశు యాదవ్, కత్తి ఓబులేశు, సగిలి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రతకు ’విజిబుల్ పోలీసింగ్’
కడప అర్బన్ : జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ’విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ● అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ● ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ● రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. ● సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ● విజిబుల్ పోలీసింగ్ ద్వారా పోలీసులు ప్రజల మధ్య ఉంటూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. -
కారు ఢీ కొని బాలిక మృతి
చాపాడు : మండల పరిధిలోని చిన్నగురువళూరు గ్రామంలోని దళితవాడ వద్ద రోడ్డుపైకి ఆడుకునేందుకు వచ్చిన బాలిక గొల్లపల్లె దర్శిని(6)ని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లెకు చెందిన రాజు తన భార్య, కూతురుతో కలసి మండలంలోని చిన్నగురువళూరులోని తన బంధువుల ఇంట్లో బుధవారం జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బాలిక దర్శిని రోడ్డుపైన ఆడుకుంటుండగా దీనిని గమనించని డ్రైవర్ కారును రివర్స్ చేసుకుంటుండగా ప్రమాదశాత్తు బాలికను ఢీ కొంది. ఆరేళ్ల చిన్నారి కారు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ ఆత్మహత్య కడప అర్బన్ : కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిపేటలో నివాసముంటున్న పఠాన్ నసీం ఖాన్ (42) మానసిక ఆవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతురాలికి గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఒక కుమార్తెకు వివాహం కూడా చేసింది. గత 8 సంవత్సరాల క్రితం ఆరిఫుల్లా ఖాన్ తో రెండవ వివాహం జరిగింది. అప్పటినుంచి ఆరిఫుల్లాఖాన్ కువైట్కు వెళ్లి వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మృతురాలికి డబ్బులు పంపకపోవడం, అనుమానంగా ప్రవర్తించడంతో మానసిక వేదనకు గురైంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
మైదుకూరు : నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్ హెచ్చరించారు. బుధవారం ఆయన మైదుకూరులోని సిండికేట్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ఎరువులను కొనుగోలు చేశాక తప్పనిసరిగా వారికి బిల్లులు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ బాల గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండలంలోని శివపురం, డయాంఖాన్ పల్లె గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి బాల గంగాధర్ రెడ్డి రైతులు సాగు చేసిన ప్రతి పంటను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏఓ సూచించారు. ఈనెల 30వ తేదీ లోపు పంట నమోదు చేసుకోవచ్చన్నారు.జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్ -
బోధనలో కృత్రిమ మేధను ఉపయోగించాలి
కడప ఎడ్యుకేషన్ : కృత్తిమ మేధను బోధన, పరిశోధనలో వినియోగిస్తే విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు సృషి్ాట్స్తరని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి ఉషా విభాగం ఆధ్వర్యంలో ‘క్రియాశీల బోధన కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాలు, సాంకేతిక పద్ధతులు‘ అనే అంశంపై జాతీయ స్థాయి ఒకరోజు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి మాట్లాడుతూ సాంకేతిక విధానాలు విద్యార్థులు, అధ్యాపకులకు జ్ఞానం పెంపొందించడానికి సహాయపడతాయన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పుత్తా పద్మ మాట్లాడుతూ కోవిడ్–19 మహమ్మారి కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు అలవాటు అయ్యాయన్నారు. వైవీయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జి.వి. రమేశ్ బాబు, పీఎం ఉష ప్రాజెక్ట్ సమన్వయకర్త డాక్టర్ టి. చంద్రశేఖర్ మాట్లాడారు. డాక్టర్ ఎస్. సునీత, డాక్టర్ కె. లలిత, డాక్టర్ పి. సరిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించినప్పటికి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పేర్కొన్నారు. అలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం నగరంలోని ఆర్జేడీ కార్యాలయం ఏఓ విజయ్కుమార్కు డీవైఎఫ్ఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల టీచర్లు దసరా సెలవుల్లో స్కూలుకు రాకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపుపై సమీక్షకడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని సూచనల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు ఆవరణంలో బుధవారం న్యాయసేవా సదన్లో ‘హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ అడిషనల్ ఎస్పీ, కడప డీఎస్పీ, కడప, రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు. కమ్యూనిటీ సైన్సు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కడప అగ్రికల్చర్ : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ‘కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్‘ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే కో ఆర్డినేటర్ అంకయ్యకుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి తెలిపారు. ఠీఠీఠీ. ్చుఽజట్చఠ. ్చఛి. జీుఽ వెబ్సైట్లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 30 వరకు గడువు ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహనం కోల్పోయి మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. మంత్రి లోకేష్ తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ విషయంలోనూ బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ చేసిన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కె. శివ యాదవ్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎస్. బాదుల్లా, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి నరసయ్య, వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి క్రిష్ణ, సుబ్బరాయుడు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామ్ -
మృత్యువులా దూసుకొచ్చిన లారీ
● ఒకరి మృతి, మరొకరికి గాయాలు ● గువ్వలచెరువు ఘాట్లో దుర్ఘటనచింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ జాతీయ రహదారిపై రాయచోటి వైపు నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవహనాన్ని ఢీకొనడంతో కొప్పల లక్షుమయ్య (60) మృతి చెందాడు. కొప్పల. ఈశ్వరయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి ఎలక్ట్రికల్ పరికరాలతో కూడిన గూడ్స్ లారీ వేగంగా రావడంతో నాలుగో మలుపు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద లారీని డ్రైవర్ అదుపుచేయలేక లారీ డ్రైవర్ కిందికి దూకేశాడు. ఆ సమయంలో రోడ్డుకు అవతలవైపున ఎదురుగా గువ్వలచెరువు వెపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఈశ్వరయ్య గమనించి ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న కొప్పల లక్షుమయ్యను లోయవైపు ఈడ్చుకుపోగా కుడి కాలు, కుడి చేయి తెగి పడి, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్రవాహనంలోని మరో వ్యక్తి కొప్పల ఈశ్వరయ్యకు గాయలయ్యాయి. లారీ డ్రైవర్ లారీ లోయ వైపు దూసుకెళ్లే క్రమంలో లారీ నుండి ముందే దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడినవారిని పోలీసులు 108 వాహనాల ద్వారా కడప రిమ్స్కు తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన లక్షమయ్య, గాయపడిన ఈశ్వరయ్య సమీప బంధువులే. వీరిది లక్కిరెడ్డిపల్లె మండలంలోని దప్పేపల్లె రామాపురం గ్రామం. కడపలో ఉన్న తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. మృతుని బంధువులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని తీవ్రంగా విలపించారు. సంఘటన స్థలాన్ని చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, సిబ్బంది పరిశీలించారు. -
తిరస్కరించిన వారినే.. తీసుకొచ్చారు
● టీడీపీ కడప నగర నూతన కమిటీ నియామకం ● పార్టీకి పనిచేసేన వారిని పక్కన పడేశారని అసంతృప్తి ● తమ్ముళ్ల తిరుగుబాటు వేళ నిర్ణయంపై ఆగ్రహం కడప రూరల్ : కడప నగరం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పాతకడప కృష్ణారెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కమలాపురానికి వెళ్లి తమకు న్యాయం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని శరణు కోరడంతో పెద్ద దుమారమే రేగింది. అనంతరం పార్టీని ఫిరాయించిన కార్పొరేటర్లు కూడా పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉన్నా.. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కడప నగర నూతన కమిటీని నియమించారు. నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్, ఉపాధ్యక్షుడిగా పసుపులేటి గౌతమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముక్కా సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బోనం వెంకటేశ్, గండ్లూరి బాబా ఫకృద్దీన్, ఇప్పిరాల పూర్ణచంద్రరావు, కార్యదర్శులుగా కోనేటి వెంకటేశ్ ఆచారి, గోగుల శ్రీనివాసులు, జి.నరేష్, కోశాధికారిగా మలిరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలను నియమించారు. దీంతో తమ్ముళ్ల వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైౖంది. ఇదివరకే నగర కమిటీ వ్యవహారంపై పార్టీ అఽధిష్ఠానం కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. చాలా మంది అభ్యర్ధుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కమిటీని అధిష్టానం ‘రిజక్ట్’ చేసిందనే ప్రచారం జరిగింది. తీరా చూస్తే వారినే కొత్త కమిటీలో చేర్చడంతో తమ్ముళ్ల అసంతృప్తి సెగలు ఎగసిపడ్డాయి. పార్టీ ఫిరాయించిన వారితోపాటు టీడీపీలో గుర్తింపు లేని వారికి చోటు కల్పించడం దారుణమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాము తిరస్కరించినా, తమ పంతం, ఆధిపత్యం కోసం కమిటీ నియమించారని తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన కార్యకర్తలను పక్కన పడేశారని ఆరోపిస్తున్నారు. తప్పు చేయొద్దంటే...తిరుగుబాటు చేస్తావా – పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడిన కార్పొరేటర్లు పాత కడప కృష్ణారెడ్డి చేయని అక్రమాలంటూ లేవు.. టీడీపీలో ఉంటూ ఆయన ఒక్కడే లబ్ధి పొందాడు.. ఇపుడు తప్పు చేయవద్దంటే తిరుగుబాటు చేస్తున్నాడు అని పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు సూర్యనారాయణ, సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మంగళవారం వారు మాట్లాడుతూ కృష్ణారెడ్డి సొసైటీ డైరెక్టర్గా పదవి అనుభవిస్తూ పార్టీపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కాజేసిన నైజం కృష్ణారెడ్డిదని దుయ్యబట్టారు. డీలర్లను కూడా వదలిపెట్టలేదన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించి తాము టీడీపీలో చేరామని, ఇపుడు అభివృద్ధిచూసి ఓర్వలేక కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం తగదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వద్ద ఉంటూ పెద్ద ఎత్తున లబ్ధి పొందారని వారు ఆరోపించారు. కడపలో ఏదో జరుగుతోందని కృష్ణారెడ్డి తన అనుచరులను వెంటేసుకుని పెద్దాయన పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లారన్నారు. ఆయనకు కడపలో జరుగుతున్న అంశాలపై పెద్దగా తెలియదన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యం అక్రమాలకు పాల్పడే నువ్వు మమ్మల్నే బెదిరిస్తావా....రా చూసుకుందాం అంటూ కృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో జఫ్రుల్లా, చల్లా రాజశేఖర్, బాలకృష్ణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
పండితుల పదోన్నతులపై ఆరేళ్లుగా ఊరించి.. ఇపుడు అట్టకెక్కించారు. భాషోపాధ్యాయులకు ఇష్టం లేకపోయినా ఏడాదికోమారు భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడిపడితే అక్కడికి బదిలీలు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరానికి జిల్లాలు మార్చి బదిల
● పదోన్నతుల కోసం పదేళ్లుగా పండితుల పాట్లు ● ఏడాదికోమారు మారుమూల ప్రాంతాలకు బదిలీ ● సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం.. పండితులకు శాపం బద్వేల్ : రాష్ట్ర వ్యాప్తంగా 2019లో భాషోపాధ్యాయుల(తెలుగు,హిందీ,ఉర్దూ,సంస్కతం,కన్నడ) పదోన్నతులు జరిగాయి. 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది మిగిలి పోగా వైఎస్సార్ కడప జిల్లాలో 114 మంది డీఈఓ పూల్లో ఉన్నారు. వీరిలో తెలుగు పండితులు 68, హిందీలో 33, ఉర్దూలో 13 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరిది విద్యా శాఖలో ఏ విభాగమో అర్థంకాకుండా పోయింది. ఫలితంగా ఏడాదికో మారు జిల్లా నుంచి జిల్లాకు, కనీస వసతులు లేని మారుమూల గ్రామాలకు బదిలీ చేసి బలితీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుకానివైనం ఆరేళ్లుగా ఏడాదికోమారు బదిలీలతో విసిగి వేసారిన భాషాపండితులు ఏదో చోట ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది బాషోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వారి బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి మన్మధరావు వెంటనే పదోన్నతులు కల్పించాలని, సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 20 డిసెంబర్, 2024లో తీర్పు ఇచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీచేసి తొమ్మిది నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. పదోన్నతుల అమలులో తాత్సారం చేయడంతో భాషోపాధ్యాయులు నష్టపోతగున్నారు. తమకు పదోన్నతులు కావాలని సెకండ్గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం భాషా పండితులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 2న స్టేటస్ కో ఎత్తివేసింది. ఉసూరుమనిపించిన ప్రభుత్వం: హైకోర్టు ధర్మాసనం స్టేటస్కో ఎత్తివేసిన వెంటనే భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించి సెప్టెంబర్ 4న (ఈ నెల) అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందనే ఆశతో బాషోపాధ్యాయులంతా డీఈవో కార్యాలయాల్లో డిక్లరేషన్ రాసిచ్చారు. తమకు పదోన్నతి ఉత్తర్వులు వస్తాయని ఆశపడే సమయంలో కూటమి ప్రభుత్వం మరల మెలికపెట్టి ఆ ప్రక్రియను ఆపేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసు ఉన్న వారికి పదవీ విరమణ చేసేలోగా రెండు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. బాషా పండితుల విషయంలో దశాబ్ద కాలంగా ఇది అమలు చేయడంలేదు. ఇరవై ఏళ్ల కిందట చేరినవారు కూడా పదోన్నతి లేకుండానే పదవీవిరమణ పొందారు. -
ఫైనాన్సియర్ను చంపితే బిజినెస్ పెట్టిస్తా
● కిరాయి హంతకులకు ఆఫర్ ఇచ్చిన సూత్రధారులు ● వారితోనే వేణుగోపాల్రెడ్డిని హత్య చేయించిన దుండగులు ప్రొద్దుటూరు క్రైం : సుపారీ కల్చర్ ప్రొద్దుటూరుకు ప్రాకింది. తెలంగాణా రాష్ట్రం నుంచి కిరాయి హంతకులను పిలిపించి ఫైనాన్షియర్ను హత్య చేయించారు. ఇటీవల జరిగిన ఫైనాన్స్ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి హత్య పట్టణంలో సంచలనం కలిగించింది. హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకులు ఈ హత్య చేశారని తెలియడంతో ప్రొద్దుటూరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముంబై, డిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాలకు పరిమితమన సుపారీ కల్చర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రాకడంతో పసిడిపురిలో అలజడి మొదలైంది. ఈ నెల 19న రాత్రి వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి హత్య జరిగిన తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే హత్యకు ప్రణాళిక.. వేణుగోపాల్రెడ్డి హతమార్చిన ఘటనలో ఇరువురు బాకీ దారులే ప్రధాన సూత్రదారులు. ఇరువురు వడ్డీ వ్యాపారిని హత్య చేయడానికి మూడు నెలల క్రితమే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక వ్యక్తి గతంలో పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో చిల్లర దుకాణం నిర్వహించాడు. దుకాణాన్ని ఎత్తేసిన అతను కొన్ని నెలల నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్కు వెళ్లినప్పుడు ఆ ప్లాట్లోనే ఉండేవాడు. హైదరాబాద్లో ఉన్న మరో యువకుడిని అతడు సహాయకుడిగా పెట్టుకున్నాడు. ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కు వెళ్లిన ప్రతిసారీ సహాయకుడే పికప్ చేసుకొని ప్లాట్కు తీసుకెళ్లేవాడు. సహాయకుడికి డబ్బు అవసరం ఉండటంతో రూ.80 వేల వరకూ ఇచ్చాడు. నెల రోజుల క్రితం తనకు ఒక పని చేసి పెట్టాలని బాకీ దారు తన సహాయకుడిని అడిగాడు. శ్రీఒక వ్యక్తిని చంపాలి.. ఈ పని చేసి పెడితే నీ లైఫ్ సెటిల్ చేస్తా.. లేదంటే బిజినెస్ పెట్టిస్తాశ్రీ అన్నాడు. అతని ఆఫర్కు హైదరాబాదీ అంగీకరించాడు. తొలిసారి వినాయకచవితి పండగ సమయంలో హైదరాబాద్ నుంచి తన సహాయకుడ్ని తీసుకొని ప్రొద్దుటూరుకు వచ్చాడు. జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం ప్లాట్ వద్దకు వెళ్లి ఫైనాన్షియర్ ఇల్లు చూపించాడు. స్కూటీలో ఇంటికి వచ్చి పోయే సమయంలో పలుమార్లు వేణుగోపాల్రెడ్డిని చూపించి గుర్తు పెట్టుకోమని చెప్పాడు. దీంతో అతడి సహాయకుడు హైదరాబాద్కు వెళ్లి తనకు తెలిసిన మరో ముగ్గురిని వెంట పెట్టుకొని ఈ నెల 19న కారులో ప్రొద్దుటూరుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సూత్రదారులు ఇద్దరు కిరాయి హంతకులకు ఖర్చుల కోసం రూ. 23 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే రోజు రాత్రి వేణుగోపాల్రెడ్డి స్కూటీలో ఇంటికి వెళ్లే సమయంలో అడ్డగించి, కళ్లలో కారం చల్లి హైదరాబాద్కు చెందిన హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేయడానికి కిరాయి హంతకులు పెద్ద మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్గా లేదా ఏక మొత్తంలో డబ్బు తీసుకొని పనిముగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం సూత్రధారులు హైదరాబాదీ కిరాయి హంతకులకు బిజినెస్ పెట్టిస్తాననే ఆశ చూపి వేణుగోపాల్రెడ్డిని చంపించారు. ఇద్దరు బాకీదారులు ఫైనాన్షియార్ను హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇతర బాకీదారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 23పిడిటిఆర్53– -
సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వకుండా వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. డీఈఓ షంషుద్దీన్ను మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచింగ్ స్కిల్, వర్క్షాప్, డెవలప్మెంట్ పేరుతో నారాయణ, చైతన్య, జీఎంఆర్ విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవుల్లో స్కూల్కు రావాలని, లేకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. చాలీ చాలని జీతాలిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ్, పెద్దన్న పాల్గొన్నారు. -
ఐకార్ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
పులివెందుల : జాతీయ స్థాయిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్) నిర్వహించిన పీజీ (ఏఐఈఈఏ) పరీక్షలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవ తెలిపారు. పట్టణంలోని డీన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఐకార్ ఫలితాల్లో కళాశాలకు చెందిన ప్రియాంక దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో సాయిదీప్తి 22, షర్మిల 42, ఎస్సీ కేటగిరీలో షకీనా 43, హర్షవర్ధన్ 81, ఎస్టీ కేటగిరీలో నితిన్ 24వ ర్యాంకులు సాధించారన్నారు. రాబోయే సంవత్సరంలో ఈ పోటీ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ ఏడాది నుంచి పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఈనెల 30వతేదీలోగా ఇవ్వాలన్నారు. -
అటవీ శాఖ గార్డు.. టీచర్ అయ్యాడు
కడప సిటీ : అటవీ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తూనే.. కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కఠోర సాధన చేసి డీఎస్సీలో 11వ ర్యాకు సాధించి భళా అనిపించాడు. పెండ్లిమర్రి మండలం యల్లటూరు గ్రామానికి చెందిన గుర్రంపాటి రాజశేఖర్రెడ్డి కడప రాజేశ్వరీ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. నిరుద్యోగం వెంటాడుతుందనే భయంతో అటవీ శాఖలో గార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఎంపికయ్యాడు. 17 ఏళ్లుగా వేంపల్లె అటవీ రేంజ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అనంతరం గార్డు ఉద్యోగం చేస్తూనే 2014, 2019లో డీఎస్సీ రాశాడు. 2019లో 14వ ర్యాంకు వచ్చినా ఆరు పోస్టులు ఉండడంతో ఎంపికకాలేదు. అనంతరం తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో గార్డు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్ష రాశాడు. 11వ ర్యాంకు సాధించడంతో ఓసీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా ఎంపికయ్యాడు. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధించానని రాజశేఖర్రెడ్డి సాక్షికి తెలిపారు. 2019 డీఎస్సీకి ముందు 42 ఏళ్ల వయోపరిమితిని 2019లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 44 ఏళ్లకు పెంచిందని, దీంతో వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడిందని అతడు తెలిపారు. 11వ ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం -
విద్యుత్ సరఫరాలో నష్టాలను తగ్గించాలి
కడప కార్పొరేషన్ : విద్యుత్ సరఫరాలో నష్టాలను పూర్తిగా తగ్గించాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్(టెక్నికల్) కె.గురవయ్య సూచించారు. కడప డివిజన్ కార్యాలయంలో కడప, వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయి కేవలం 59.53% మాత్రమే ఉండడం ఆందోళనకరమన్నారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పొందే అవకాశాన్ని ఆయన వివరించారు. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయని, రూ.98,000 వరకు సబ్సిడీ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లో వోల్టేజ్ సమస్యల నివారణకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయాలని, విద్యుత్ అంతరాయాలను అరికట్టి, నిరంతర సేవలు అందించాలన్నారు. అనంతరం బాలాజీనగర్ సబ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఎస్ఈ యస్.రమణ, హరిసేవ్యానాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు. -
అసభ్యకర పోస్టులు పెడితే కేసులు
కడప అర్బన్ : సామాజిక మాధ్యమాలు వేదికగా ఇతరులను రెచ్చగొట్టేలా, అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెడితే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికలు, అధికారులపై పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టినా, కులాలు, వర్గాలు, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా ఉంచి పర్యవేక్షిస్తామన్నారు. యువత సామాజిక మాధ్యమాలకు మంచికోసమే వినియోగించాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా బాధితులు ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన kadapasocialmedia@gmail. com, లేదా సెల్ నెంబర్ 9121100686కు నేరుగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. యవచ్చనీ ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, ఎస్బీ డీఎస్పీ ఎన్.సుధాకర్, దారెడ్డి భాస్కర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
నేడు రౌండ్టేబుల్ సమావేశం
కడప రూరల్: ప్రజా సంఘాలు, మేధావుల ఆధ్వర్యంలో బుధవారం కడప వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పంతుల సంపత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలో ప్రజా సంఘాల నేతలు, వైద్యులు, ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కమలాపురం: కమలాపురం పెద్దదర్గాగా వెలుగొందుతున్న దర్గా–ఏ–గఫారియాలో బుధవారం రాత్రి దస్తగిరి షా ఖాద్రి బర్సీ నిర్వహిస్తున్నట్లు దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారికి పూల చాదర్లు సమర్పించి, అనంతరం గంధం ఎక్కిస్తారని ఆయన అందులో పేర్కొన్నారు. రాత్రి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులు విరివిగా హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ అన్నారు. మంగళవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, వ్యవసాయ, డ్వామా అధికారులకు నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆమె మాట్లాడారు. పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.ఓ లక్ష్యాల సాధనకు అందరూ నడుం బిగించాలన్నారు. ఇందుకు సంబంధించిన ఇండికేటర్స్లో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ద్యం విషయంలో ఇప్పటికీ అత్యధికంగా వెనుకబడి ఉండడం బాధాకరమని వివరించారు. ఇప్పటికై నా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డీపీఓ రాజ్యలక్ష్మి, డీడీఓ మైథిలి తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీఓఎస్ఎస్ )లో ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్లకు అపరాధ రుసుముతో గడువు పొడగించినట్లు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ చెప్పలి రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే సంవత్సరంలో రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకోవచ్చన్నారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపు లకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కోర్సులో చేరదలచిన విద్యార్థులు రిమ్స్ రోడ్డులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశా లను సందర్మించి అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ కోర్సులలో చేరేవారికి 16 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని, పదవ తరగతి మార్కు ల జాబితా, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు బు క్కు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటో తీసుకొని నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. వివరాలకు 91820 99672 సంప్రదించాలని కో ఆర్డినేటర్ రాజారావు తెలిపారు. -
యూసీఐఎల్ సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: యూసీఐఎల్లో సమస్యలను పరిష్కరించి, పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ, ఇతర సమస్యలు తలెత్తకుండా పరిష్కరించాలని పులివెందుల ఆర్డీఓను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాసం కోరుతున్న కే కే కొట్టాల గ్రామాల ప్రజలు, రైతులతో మాట్లాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. గతంలో ప్రాజెక్టు కోసం మంజూరైన భూములను త్వరతిగతిన వారికి అప్పజెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండా చూడాలన్నారు. యురేనియం ప్రాజెక్టు (టైలింగ్) వ్యర్థపదార్థాల నిల్వలు, స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ నవీన్ రెడ్డి , పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య , ఆర్ అండ్ బి డీఈ మాధవి, రెవెన్యూ అధికారులు, పర్యావరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్లను సిద్ధం చేయాలి పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్లను మండలాల్లో కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ జేసీ అదితిసింగ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా, తాజాగా విద్యార్థులకు అందించే దిశగా ప్రతి మండలంలో ఒక ప్రధాన పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ షెడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి, అన్ని పరికరాలను ఏర్పాటు చేసి ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 2 నాటికి పూర్తి చేసి కిచెన్ షెడ్లను నిర్వహణలోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు రూమ్ హాలులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు, ఇఫ్కో(ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) ప్రతినిధులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద వేముల, వేంపల్లి, ఒంటిమిట్ట మండలాలలో ఇప్పటికే అరటిపంటల్లో ఆధునిక, సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1000 ఎకరాల్లో దాదాపు 500 మంది రైతులు ఈ విధానాన్ని పాటిస్తూ మంచి క్వాలిటీ పంటను ఉత్పత్తి చేసి తమ ఉత్పత్తులను ఆ గ్రామంలోనే విక్రయించేలాగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాబోవు కాలంలో వీటిని జిల్లా అంతటా విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, ఏపీ ఎంఐపీ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వైభవం.. దసరా ఉత్సవం
జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. విశేష అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. ప్రత్యేక సెట్టింగులతో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం నుంచి ఆలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాత్రి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలలో తీర్చిదిద్దుతున్నారు. – సాక్షి నెట్వర్క్, కడప ప్రొద్దుటూరు కల్చరల్ : రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో భవాని దేవి దేవుని కడపలో శేష వాహనంపై కడప రాయుడు -
వంతెన.. ప్రమాదం అంచున
రాజంపేట: గుత్తి–రేణిగుంట డబ్లింగ్లో ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం మృకుందాశ్రమం వద్ద ఉన్న రైల్వేవంతెన ప్రమాదకరంగా మారింది. ముంబయి–చైన్నె ప్రధాన రైలుమార్గం.. ఉమ్మడి కడప జిల్లా మీదుగా వెళుతోంది. ఈ మార్గంలో ఒంటిమిట్ట–భాకరాపేట రైల్వేస్టేషన్ల మధ్య మృకుందాశ్రమానికి వెళ్లే రహదారిలో బ్రిడ్జి డేంజర్గా మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ బ్రిడ్జి కడప ఇంజినీరింగ్ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. నిత్యం రైళ్ల రద్దీ భారం ఈ బ్రిడ్జిపై నిత్యం రైళ్ల రద్దీభారం పడుతోంది. ఉమ్మడి కడప జిల్లా మీదుగా నిత్యం 30 రైళ్లకుపైగా రాకపోకలు సాగిస్తుంటాయి. గూడ్స్రైళ్లు 40కి పైగా వెళ్తుంటాయి. మృకుందాశ్రమం సమీపంలో ఉన్న బ్రిడ్జి స్థితిగతిని పరిశీలిస్తే.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. వంతెన పైన, ట్రాక్ కింది భాగంలో నెర్రెలు ఏర్పడ్డాయి. వంతెన పొడవు ఇదే స్థితి కనిపిస్తోంది. అక్కడ మొక్కలు సైతం మొలవడంతో మరింత దెబ్బతింటోంది. అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం ఈ వంతెనను పునర్నిర్మాణం చేపట్టకపోతే.. పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాల సీజన్లో నీటి ఊట ఏర్పడి బ్రిడ్జిని మరింతగా దెబ్బతీస్తోంది. ఫలితంగా బ్రిడ్జి స్లాబ్, గోడలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా ఉంది. ఇప్పటికై నా రైల్వే ఇంజినీరింగ్ శాఖ ఈ బ్రిడ్జిని బాగు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను..!
ప్రొద్దుటూరు క్రైం(కడప జిల్లా): వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి(Venugopal Reddy) కిరాయి హంతకుల చేతిలో హతమయ్యాడు. వేణుగోపాల్రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల ద్వారా అతన్ని చంపించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్రెడ్డి శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చాపాడు వద్దనున్న కుందు వంతెన వద్ద గుర్తించారు. అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంతో కలిసి రూరల్ పోలీసులు అతికష్టం మీద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికి తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్రెడ్డి బంధువు, మరో వ్యక్తి కలసి వేణుగోపాల్రెడ్డిని హతమార్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులను శుక్రవారం ప్రొద్దుటూరుకు పిలిపించారు. వారు తమ కారును వేణుగోపాల్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు. అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలో ఉన్న ఆర్చీ దాటగానే కారులో ఉన్న కిరాయి హంతకులు అతన్ని ఆపినట్లు తెలిసింది. ఎవరు మీరు అని అడిగే లోపే వారు వేణుగోపాల్రెడ్డిని కొట్టడంతో కింద పడిపోయాడని, ఈ క్రమంలోనే దుండగులు కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని బతిమాలుకున్నా దుండగులు కనికరించలేదని తెలిసింది. వేణుగోపాల్రెడ్డి స్కూటీలో అక్కడికి రావడం, వారు హత్య చేయడం ఇదంతా రెండు, మూడు నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ వ్యాపారి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న దుండగులు మృతదేహాన్ని అదే కారులో వేసుకొని దువ్వూరు దారిలోని కామనూరు బ్రిడ్జి వద్ద కుందు నదిలో పడేసి అదే రాత్రికి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. తర్వాత నిందితులు హైదరాబాద్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కుందు నదిలో ఉన్న వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు.నిందితుల్లో వేణుగోపాల్రెడ్డి భార్య తరపు బంధువు కూడా..వేణుగోపాల్రెడ్డిని హతమార్చిన వారిలో అతని భార్య సమీప బంధువు ఒకరు ఉన్నట్లు తెలిసింది. కాగా 2016లో నిందితుల్లోని ఒక వ్యక్తితో గొడవ జరిగింది. వేణుగోపాల్రెడ్డి డబ్బు అడగటానికి వెళ్లగా అతను దాడి చేశాడు. దీంతో వేణుగోపాల్రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండేళ్ల క్రితం వీరి మధ్య రాజీ కుదిరింది. కాగా నిందితుల్లోని ఇద్దరు వ్యక్తులకు వేణుగోపాల్రెడ్డి రూ. లక్షల్లో బాకీ ఇచ్చాడు. ఈ డబ్బు గడువు ముగిసినా వారు ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. అంతేగాక కొంత కాలం తర్వాత వారి ఆస్తులు అటాచ్ కోరుతూ ఫైనాన్షియర్ మరో మారు కోర్టును ఆశ్రయించాడు. ఇది ఇరువురు బాకీ దారులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు వేణుగోపాల్రెడ్డికి నచ్చచెప్పినట్లు తెలిసింది. అయినా కూడా అతను ఆస్తుల అటాచ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ కారణంతోనే ఇద్దరు కలిసి హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హతమార్చినట్లు సమాచారం. కాగా కేసులోని ప్రధాన నిందితులు, కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
హామీ ఇచ్చారు.. అమలు మరిచారు
● ఫీజు రియింబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ● 16 నెలలుగా కరుణ చూపని కూటమి ప్రభుత్వంకూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. సకాలంలో ఫీజులు చెల్లించకుండా ఏడిపిస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయిబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.అమలు మరిచారని డిగ్రీ చదివే విద్యార్థులు ఫీజుల కోసం రోడ్డెక్కి ఆందోళన బాటపడ్డారు. కడప రూరల్/ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా 76 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. ఇప్పటికే చివరి సంవత్సరం విద్యార్థులు వేలాది మంది టీసీలు తీసుకుని బయటికి వెళ్లారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా వీరికి కేవలం ఒక టర్మ్మాత్రమే అంటే రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు మాత్రమే చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మిగతా సొమ్మును ఇంతవరకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం పడుతోంది. ప్రధానంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు టీసీలు తీసుకునే సమయంలో ఫీజులు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోలేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఫీజుల కోసం ఆందోళన డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు సకాలంలో చెల్లించాలని ఇదివరకే ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఫీజులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాకపోవడంతో సోమవారం విద్యార్థి సంఘాలతోపాటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం ర్యాలీలు, ఆందోళనకు దిగాయి. -
గోవిందా.. కాపాడు..!
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుపై ఆ పార్టీ తమ్ముళ్లు విసిగిపోయారు. న్యాయం కోసం తిరుగుబావుటా ఎగురవేశారు. పాతకడప కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు బహిరంగంగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ మేరకు సోమవారం స్థానిక దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పాదాల చెంత తమను కాపాడాలంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగడాలను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా శ్రీనివాసులురెడ్డి, మాధవీరెడ్డిల రాజ్యాంగం నడుస్తోందన్నారు. నాడు ఎమ్మెల్యేగా మాధవీరెడ్డికి టిక్కెట్ ఇచ్చినపుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వద్దనుంచే ప్రచారం చేశామని, ఆమె గెలుపుకోసం కృషి చేశామన్నారు. నేడు ఈ పుణ్యస్థలం నుంచే ఆమె ఆగడాలు భరించలేక తిరుగుబాటు చేస్తున్నామని తెలిపారు. గెలుపుకోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలను బయటపడేశారని అన్నారు. పార్టీలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలన్నారు. చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డి, మాధవీరెడ్డి ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచిన తర్వాత తమ స్వరూపాన్ని బయటపెట్టారన్నారు. వారి దౌర్జన్యాల నుంచి పార్టీ కార్యకర్తలను కాపాడాలన్నారు. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుబ్బలక్షుమ్మ, చిప్పగిరి మీనాక్షి మాట్లాడుతూ పార్టీలో తమకు ఏనాడూ న్యాయం జరగలేదని వాపోయారు. అనంతరం వారు మాకు పెద్ద దిక్కుగా పుత్తా నరసింహారెడ్డి వ్యవహరించాలని కోరుతూ 20కి పైగా వాహనాల్లో కమలాపురం వెళ్లారు.సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతా – పుత్తా నరసింహారెడ్డితమను కలవడానికి వచ్చిన కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయనను కలిసిన కార్యకర్తలు కడప నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ఏకరువు పెట్టారు. తమకు పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపించాలని అభ్యర్థించారు. మాకు మీ వల్ల తప్పితే మరెవరి వల్ల న్యాయం జరగదని కోరారు. ఈ సందర్బంగా పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ వేరొకరి నియోజకవర్గంలో జోక్యం చేసుకోలేనని, అయితే పార్టీ కార్యకర్తగా కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో వీరయ్య, శివరాం, కొండా సుబ్బయ్య, స్వర్ణమ్మ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాశినాయనవాసికి అరుదైన గుర్తింపు
కాశినాయన : అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ప్రతిభావంతులైన టాప్ 2025 శాస్త్రవేత్తల జాబితాలో వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన కడియాల చంద్రబాబునాయుడు వరుసగా 6 సారి చోటు దక్కించుకున్నారు. వ్యవసాయకుటుంబంలో పుట్టిన ఈయన బెంగళూరు గీతండీమ్డ్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పలు పరిశోధనరంగాల్లో వివిధ శాస్త్రవేత్తలు ప్రచురించిన పరిశోధనా పత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగి వారి పరిశోధన పత్రాలను అనుసరిస్తూ సూచికలు వాడటం వల్ల ఈ గుర్తింపును పొందారు. -
పొలం యజమానిపై హత్యాయత్నం
మైదుకూరు : గొర్రెలు మేపుకునే విషయంలో తగాదా ఏర్పడి మండలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్య పై అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ హత్యాయత్నం చేసినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. జీవి సత్రంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్యకు చెందిన బెండ తోటలో శనివారం ఆదినారాయణకు చెందిన గొర్రెలు మేస్తుండగా అడ్డుకోవడంతో వారి మధ్య గొడవ ఏర్పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదినారాయణ మచ్చు కత్తితో గురవయ్య పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆదినారాయణపై సోమవారం హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. వాహనదారులకు నాణ్యమైన సేవలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని వాహన యజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్దారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని జిల్లా ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్ ఎం వీర్రాజు తెలిపారు. సోమవారం జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి సంబంధించి వాహన్ పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేస్తామన్నారు. ఈకైవెసీ కోసం చేసుకున్న దరఖాస్తులు 375 పెండింగ్లో ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వాహన యాజమానులు తమ పనులకు సంబంధించి వాహన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పనులు పూర్తి కావట్లేదని భావించిన వారు బుధ, గురు వారాలలో ఉదయం 10 నుండి 1 గంట వరకు తనను నేరుగా కలవచ్చని తెలిపారు. విద్యుత్షాక్తో లైన్మెన్కు తీవ్ర గాయాలుబద్వేలు అర్బన్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల మోర్ సూపర్ మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు సోమవారం మరమ్మత్తులు చేస్తూ ఓ లైన్మెన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నివసిస్తున్న కె.నాగసుబ్బారెడ్డి 17 ఏళ్లుగా విద్యుత్శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. మోర్ సూపర్మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్పార్మర్ మరమ్మత్తులకు గురైందన్న ఫిర్యాదు అందుకున్న ఆయన పరిశీలించేందుకు వెళ్లాడు. ఎల్సీ తీసుకుని మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆయనతో పాటు ఉన్న జూనియర్ లైన్మెన్లు హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలికడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలను ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజంపేట రీజినల్ మేనేర్ సుశాంత్ కుమార్ స్వరూప్, కడప ఆర్ఎం శ్రీనివాస ప్రసాద్, ఎల్డీఎం జనార్ధనం తెలిపారు. సోమవారం కడపలోని జాన్డీర్లో నర్సిరెడ్డి, శివకుమార్లకు నూర్పిడి యంత్రాలను అందజేశారు. డీఆర్డీఏ డీపీఎం రఘునాథరెడ్డి, బ్రాంచ్ మేనేజర్లు సురేష్కుమార్, ఎం.కళ్యాణి, రాజంపేట ప్రాంతీయ కార్యాలయ సీపీసీ మనోజ్కుమార్, వెంకటసాయి ఎంటర్ప్రైజస్ సంస్థ ఎండీ వెంకట్, జాన్డీర్ సేల్స్ మేనేజర్ దుర్గా మునికుమార్ పాల్గొన్నారు. -
ఆది వర్సెస్ సీఎం రమేష్
● రిత్విక్ కంపెనీ మేనేజర్పై ఆదివర్గం దాడి ● కార్యాలయం ధ్వంసం ● ఆదిపత్యపోరుతో గండికోట అభివృద్ధికి ఆటంకంసాక్షి టాస్క్ఫోర్స్ : ఇది నా అడ్డా. ఇక్కడ నేను తప్ప ఎవరూ పనులు చేయకూడదు. కాదని చేస్తే దాడులు తప్పవనే సంకేతాలను ఆది వర్గం సీఎం రమేష్ నాయుడుకు పంపుతోంది. ఇప్పటికే టి.కోడూరు వద్ద అదాని గ్రూప్ కంపెనీకి చెందిన పవర్ప్లాంట్ పనులు సబ్ కాంట్రాక్టర్ కింద సీఎం రమేష్ నాయుడు కంపెనీ చేజిక్కించుకోగా ఎమ్మెల్యే ఆది వర్గం కంపెనీకి చెందిన ప్రతినిధులు, అధికారులపై దాడులు చేసి భయంభ్రాతులకు గురి చేశారు. గండికోట టూరిజం అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లను రూ.78 కోట్లతో రిత్విక్ కంపెనీ చేజిక్కించుకుంది. దీంతో ఆదినారాయణరెడ్డి, ఆయన వర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను శాసన సభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో మరొకరు వచ్చి కోట్లాది రూపాయలు పను లు చేయడం ఏమిటని మదన పడుతున్నారు. ఎలాగైనా రిత్విక్ కంపెనీ ప్రతినిధులను తమ అదుపులోకి తెచ్చుకునే విధంగా గత కొంత కాలంగా గండికోటలో జరుగుతున్న పనులకు స్థానిక నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. దీంతో గండికోట గ్రా మంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ఆరు వాహనాల్లో వచ్చారు.. దాడి చేశారు ఆది వర్గానికి చెందిన వారు ఆరు వాహనాల్లో గండికోటకు వెళ్లి రిత్విక్ కంపెనీపై దాడులు చేశారు. సోమ వారం మధ్యాహ్నం ఆదినారాయణరెడ్డి వర్గీయులు పోలీసుల సమక్షంలోనే దాడులు చేసినట్లు సమాచారం.పోలీసులు ముందుకు రాకండి, ఫొటోలు, వీడియోలు కూడా తీయవద్దు. అంటూ రిత్విక్ కంపెనీపై రాళ్లదాడి చేసి మేనేజర్ను సైతం కొట్టారు. మరో ప్రాంతంలో ఉన్న జేసీబీని పగుల గొట్టారు. స్థానికంగా ఉన్న పోలీసులు మేము ఏమి చేయగలం, తమ ప్రాణాలు చిన్నవి అంటూ సెలవిస్తున్నారు. దాడి అనంతరం అర్బన్ సీఐ నరేష్బాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. -
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం ఏపీఎస్సీ జేఏసీ, టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్ల మధ్య తోపులాట జరిగింది. కొంచెం సేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీస్, విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువురు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ నిరసనలు, రిలే దీక్షలు చేసి సోమవారం ఫౌంటెయిన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరసనలు చేపట్టి సోమవారం రిలే దీక్షలు ప్రారంభించి గేటు బయట ఽఆందోళన చేసింది. జేఏసీ ర్యాలీ అనంతరం ఉద్యోగ, కార్మికులు విధులకు వెళ్తుండుగా, గేటు బయట టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు విధులకు పోకుండా అడ్డుకుంది. దీంతో ఒక్కసారిగా జేఏసీ, ఆ రెండు యూనియన్ల మధ్య తొపులాట జరిగింది. ఈ తోపులాటలో జేఏసీకి చెందిన ఓ ఉద్యోగి చొక్కా చినిగింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పారు. అయినా జేఏసీ నేతలందరూ సంయమనం పాటించి ఎవరు చేసినా ఉద్యోగ కార్మిక సమక్షం కోసమే..ఎవరూ వ్యక్తిగత వాదనలకు పోకూడదని మైకులో చెప్పారు. అనంతరం జేఏసీ నాయకులు ఆర్టీపీపీ సీఈ ని కలిసి వినతి పత్రం అందించారు. గ్యాస్ బిల్లుల స్కాంపై విచారణ జరిపించాలి రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో జరిగే గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఏ అధ్యక్షుడు కిరణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్స్రాజేంద్రన్కు ఏఐఎస్ఏ నాయకులు వినతిపత్రం సమర్పించారు. -
బాధితులకు న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. 119 ఫిర్యాదులు వచ్చాయి.వీటిని నిర్ణీణ గడువులోపు పరిష్కరించాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పీజీఆర్ఎస్కు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీసీజీ డీఎస్పీ అబ్దుల్ కరీం, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : వివిధ కారణాలతో చనిపోతున్న న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజు ఉదయం కోర్టు పనిగంటల్లో సంతాపాన్ని తెలిపే సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయ డాన్ని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులుఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్కుట్టి, సీనియర్ సివిల్ జడ్జి ప్రసూన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుయోధనతో కలిసి విధు లు బహిష్కరించడానికి గల కారణాలను తెలియజేసిన అనంతరం కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రెడ్డిబాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో చనిపోయిన న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజున ఉదయం. 10.30 గంటలకు సంతాపాన్ని తెలియజేసే సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిందని అన్నారు. దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాల ని భారత న్యాయవాదుల సంఘం అన్నమయ్య, కడప జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, సహాయ కార్యదర్శి ఖాదర్బాషా డిమాండ్ చేశారు. రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
దసరా సంబరం.. ఆరంభం
● వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు ● ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హర్యాణా అఘోరాల భంభంభోలే, భోపాల్ శివశక్తి డ్రమ్స్ ప్రొద్దుటూరు కల్చరల్ : పుత్తడిపురం ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాలతో గ్రామో త్సవం నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు అగస్త్యేశ్వర స్వామి ఆలయం నుంచి కలశాలలో నింపిన నవగంగ తీర్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపుగా బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీకన్యకాపరమేశ్వరిదేవి పురాణాన్ని తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో హర్యాణా కళాకారుల అఘోరాల భంభంభోలే, భోపాల్ శివశక్తి డ్రమ్స్, శ్రీ కోదండరామ కోలాటబృందం వారి కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా బందోబస్తు నిర్వహించారు. ● శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి ఆలయ దసరా ఉత్సవ కమిటీ వారు ఊరేగింపుగా పాత బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేసి కలశాన్ని తీసుకెళ్లారు. కోలాట నృత్యం, బ్యాండుమేళం ఆకట్టుకుంది. ● స్థానిక శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రాజీవ్ సర్కిల్లోని శివాలయంలో పూజలు చేశారు. ● రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి 250 మందిపైగా సుహాసినులు అగస్త్యేశ్వరాలయానికి చేరుకుని గంగాజలంతో నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. ● శాసీ్త్రనగర్లోని రాజరాజేశ్వరిదేవి ఆలయం, చౌడేశ్వరీదేవి, పెద్దమ్మతల్లి ఆలయం, ముక్తిరామలింగేశ్వరాలయం తదితర ఆలయాల నిర్వాహకులు కలశపూజను వైభవంగా నిర్వహించారు. కళాకారుల ప్రదర్శనలు, డప్పువాయిద్యాల ప్రదర్శనలు అలరించాయి. ● కడప అమ్మవారిశాలతో పాటు విజయదుర్గా ఆలయంలోనూ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.కడప విజయదుర్గాలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు కడప అమ్మవారిశాలలో దీక్షాబంధన దేవీ అలంకారం -
దసరాకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డి సర్కిల్ : దసరా పండుగను పురస్కరించుకుని వంద ప్రత్యేక బస్సులను నడపనున్నామని కడప ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీ, వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ నుంచి 30బస్సులు, బెంగుళూరు నుంచి 30 బస్సులు, చైన్నె నగరం నుంచి 10 బస్సులు, 27, 28వ తేదీల్లో విజయవాడ నుంచి 30బస్సులను నడపనున్నామని తెలిపారు. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలకు కడప రీజియన్ నుంచి 40ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఆర్ఎం తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ లావణ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 25న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు – డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ –2025కు ఎంపికై న వారికి ఈనెల 25వ తేదీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందచేయనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ నెల 19వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైఎస్సార్జిల్లాలో నియాయక పరీక్ష రాసిన అభ్యర్థులు తమకు అందజేసి ఐడెంటిటీ కార్డులతో ఈనెల 24వ తేదీ ఉదయం 6 గంటలకు కడప ఆర్ట్స్ కళాశాలలో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. మరిన్ని సూచనలు డీఎస్సీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపులో పంపిస్తామని డీఈఓ వివరించారు. -
అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. వారాలు.. నెలలు కాదు.. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు.. అన్యాయం జరిగిందని అర్జీలు పెట్టినా అధికారుల మనస్సు కరగడం లేదు. కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని నలు చెరుగుల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు ఆమె ఎదుట మొరపెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వినతులు సమర్పించినా మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో మచ్చుకు కొన్ని... విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు తగలబడి సర్వం కోల్పోయాం. బేల్దారి పనికి వెళుతూ భార్యా పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. అసలే అరకొర ఆర్థిక పరిస్థితులతో అల్లాడుతున్న మాకు విద్యుత్ షార్ట్ సర్యూట్ మరింత అగాథంలోకి నెట్టింది. ఇంటి సామాగ్రితోపాటు సర్టిఫి కెట్లు, రూ. 50 వేల నగదు కూడాఅగ్నికి ఆహుతయ్యాయి. రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లింది. రోడ్డున పడిన మా కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నా. – భార్గవరెడ్డి, సీకేదిన్నె మండలం మా గ్రామ పొలంలో సర్వే నెంబరు 178లో 1.83 ఎకరాల విస్తీర్ణంలో స్మశాన స్థలం ఉంది. కొంతమంది స్మశానికి వినియోగిస్తున్న స్థలంలో మామిడి చెట్లు నాటారు. ఈ విషయంపై మేము తహసీల్దార్, ఇతర అఽధికారులకు ఫిర్యాదు చేశాం. అధికారులు విచారణ చేసి అది స్మశాన స్థలంగా తేల్చారు. అందులో బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదు. స్మశాన స్థలాన్ని సంరక్షించాలి. – జ్యోతి రామసుబ్బారెడ్డి, పొన్నోలు కొత్తపల్లె, సిద్దవటం మండలం నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా అందరికీ పెళ్లిళ్లు చేశాను. మూడు సెంట్ల స్థలంలో నాకున్న ఇంటిని మాయమాటలు చెప్పి రాయించుకున్నారు. నేను వృద్ధుడిని. కాలు, చేయి సరిగా పనిచేయడం లేదు. కేవలం పింఛన్తో జీవిస్తున్నాను. అల్లుళ్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. మోసంతో కాజేసిన ఇంటిని తిరిగి నాకు ఇప్పిస్తే ఈ మలి వయస్సులో ఎవరైనా యోగక్షేమాలు చూస్తారు. – రామాంజనేయులు, బొజ్జావారిపల్లె, ప్రొద్దుటూరు మేము ప్రొద్దుటూరులో ఔట్సోర్సింగ్ కింద గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేసేవాళ్లం. అక్కడి ఏఈ బల్క్గా ఇసుకను కాంట్రాక్టర్కు ఇచ్చి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇది కాంట్రాక్టర్, ఏఈకి మాత్రమే సంబంధించిన విషయం. ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఉన్నతాధికారులు ఏఈని రక్షించుకోవడం కోసం మమ్మల్ని అన్యాయంగా గత సెప్టెంబరు 29న తొలగించారు. ఎలాంటి విచారణ లేకుండా తొలగించడం అన్యాయమంటూ గ్రీవెన్స్సెల్లో పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. – దూదేకుల పెద్ద గుర్రప్ప, ఎస్.కుమారి, ప్రొద్దుటూరు -
మైలవరం కరకట్టకు మరమ్మతులు
జమ్మలమడుగు : మైలవరం జలాశయం ఆనకట్టకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సోమవారం ‘ప్రమాదంలో మైలవరం జలాశయం’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం కరకట్ట వద్ద డీఈ మూర్తి ఆధ్వర్యంలో లష్కర్లు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ కరకట్ట వద్ద రాళ్లు కుంగిపోవడంతో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన ట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టుకు క్షమాపణ చెప్పిన పులివెందుల ఆర్డీఓ కడప సెవెన్రోడ్స్ : సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామానికి చెందిన యు.హరిత చౌక దుకాణ డీలర్షిప్ను ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా రద్దు చేసిన పులివెందుల ఆర్డీఓ పి.చిన్నయ్య రాష్ట్ర హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. సరైన కారణం చూపకుండా, చట్ట నిబంధనలు గాలికి వదిలి ఆమైపె చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై ఎఫ్పీ షాపు డీలర్ హరిత హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆర్డీఓను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు సంధించిన ప్రశ్నలకు ఆర్డీఓ సరైన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆయన కోర్టుకు క్షమాపణ చెప్పారు. రిపబ్లిక్ డే ప్రి పరేడ్ శిబిరాల ఎంపికలు కడప ఎడ్యుకేషన్ : వెస్ట్ జోన్ ప్రీ–రిపబ్లిక్ డే క్యాంపులో పాల్గొనేందుకు వైవీయూ–ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వలంటీర్ల ఎంపిక నిర్వహించారు. ఈ జోన్ నుంచి విజయవంతమైన అభ్యర్థులు న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ప్రాతినిధ్యం వహి స్తారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఎంపికలకు అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లా నుంచి వంద మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు హాజరయ్యారు. వారికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిలో ముగ్గురిని ప్రీ రిపబ్లిక్ డే క్యాంపునకు ఎంపిక చేశారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయ యువజన అధికారి డాక్టర్ సయ్యద్, వైవీయూఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ కే శ్రీనివాసరావు, డాక్టర్ కె. లలిత, డా. ఎస్పీ వెంకటరమణ మార్గదర్శకత్వం వహించారు. జిల్లాకు చేరిన యూరియా కడప అగ్రికల్చర్ : ఉమ్మడికడపజిల్లాకు 1335 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. ఇందులో 1011 మెట్రిక్ టన్నులు వైఎస్సార్జిల్లాకు కేటాయించగా ఇందులో 534 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్కు కేటాయించగా మరో 176 మెట్రిక్ టన్నులు మనగ్రోమోర్ సెంటర్లకు మిగిలిన 301 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లుకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 324 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు. -
మరోసారి బయటపడ్డ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్జిల్లా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(Adinarayana Reddy) దౌర్జన్యం మరోసారి బయటపడింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్(CM Ramesh)కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీసుపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వివాదం కారణంగా గండికోట(Gandikota) అభివృద్ధి ఆగిపోతుంది. గండికోటలో ఎంపీ సీఎం రమేష్కు వచ్చిన రూ.77 కోట్ల పనులను గతంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. గతంలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లో సీఎం రమేష్ చేస్తున్న పనులనూ ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అప్పట్లో అదానీ కార్యాలయంపై కూడా దాడి చేశారు.గత ఏప్రిల్ నెలలో చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను ఆదినారాయణరెడ్డి వర్గం నాలుగైదు రోజులు అడ్డుకోవడంతో ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ల మధ్య పొసగడం లేదన్న సంగతి పలుసార్లు బహిర్గతమైంది. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ సీఎం రమేష్.. గతంలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు.ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు -
టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యేకు సీనియర్ల బిగ్ షాక్!
సాక్షి, వైఎస్సార్: కడప టీడీపీలో అసమ్మతి సెగలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. దీంతో, టీడీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.వివరాల ప్రకారం.. కడపలో టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం వారంతా దేవునికడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు చేశారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు. ఆది నుంచి ఇప్పటి వరకు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, ఇటీవల టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను మాధవీ రెడ్డి తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారమై.. వారంతా కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలవనున్నట్టు తెలిపారు. టీడీపీ కోసం పనిచేసిన తమని గుర్తించి.. ఆదుకోవాలని పచ్చ పార్టీ నాయకులు కోరుతున్నారు. దీంతో, టీడీపీలో అసమ్మతి వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామాలు బట్టబయలు.. -
పనుల్లో నాణ్యత డొల్ల
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోంది. నంద్యాల–జమ్మలమడుగు 167 నెంబర్ జాతీయ రహదారి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అప్పడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చే అధికారులు నామామాత్రంగా తనిఖీలు చేసి పోతున్నారనే విమర్శలున్నాయి. కీలకంగా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ఇంజినీర్లు పనులు చేస్తున్నారేగానీ నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. కనీసం 16 ఎంఎం కడ్డీలను ఉపయోగించితేనే పిల్లర్లు పటిష్టంగా ఉంటాయి. కానీ కంపెనీ 10 ఎంఎం, 8 ఎంఎం, 6 ఎంఎం కడ్డీలు రెండు, మూడు కడ్డీలు 16ఎంఎం ఉపయోగించడం జరుగుతోంది. దీంతో ఈ పిల్లర్లు ఎంత వరకు నిలబడుతాయోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజైన్ ప్రకారమే పిల్లర్ల నిర్మాణం పెన్నానదిపై హై లెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది. డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్ ఒక్కో రకంగా ఉంటాయి. – సురేందర్రెడ్డి, ఏఈ, జమ్మలమడుగు -
వ్యక్తి అదృశ్యం
ఎర్రగుంట్ల : పట్టణంలోని ప్రకాశ్ నగర్లో నివాసముంటున్న నాగన్న కుమారుడు వలస గాళ్ల నాగరాజు(40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ప్రకాశనగర్ కాలనీకి చెందిన నాగరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు, ఇతడికి భార్య పెద్దక్క, కుమారుడు ఉన్నారు. నాగరాజుకు అప్పులు అధికంగా ఉండడంతో వాటిని తీర్చలేదని భావించి ఈ నెల 18న బయటకు పోయాడు. ఇప్పటివరకూ రాకపోవడంతో అతని భార్య పెద్దక్క పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఇంటి సామగ్రి దగ్ధంచింతకొమ్మదిన్నె : మండలంలోని టి.క్రిష్ణాపురం గ్రామంలో ఉంటున్న నాగూరు భార్గవరెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, బీరువాలు, అందులోని సర్టిఫికెట్లు, బట్టలు, డబ్బులు కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల విలువ మేర నష్టం జరిగినట్లు బాధితుడు భార్గవరెడ్డి తెలియజేశారు. పోక్సో కేసులో యువకుడి అరెస్టు కడప కోటిరెడ్డి సర్కిల్ : బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లిన యువకుడిపై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ రెడ్డప్ప తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నూరు మండలానికి చెందిన దావూద్ ఓ బాలికను ప్రేమ పేరుతో ఈ నెల 29న తీసుకు వెళ్లినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దావూద్ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. -
ఆసుపత్రిలో పాము కలకలం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము ఆదివారం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశం ఉండడం, ఇటీవల వర్షాలు పడడంతో గర్భిణులు ఉండే వార్డులోకి పాము ప్రవేశించింది. గమనించిన రోగులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ వచ్చి కర్రతో కొట్టి చంపివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. పల్లెల్లో జోరుగా పేకాటసాక్షి టాస్క్పోర్స్ : కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నుల్లో పేకాట జోరుగా సాగుతోంది. యర్రగుడి పునరావాస కేంద్రం సమీపంలోని సపోట తోట, దొబ్బుడుపల్లె పమీపంలోని కంపచెట్ల వద్ద, కె.సుగుమంచిపల్లె పునరావాస కాలనీలోని చెట్ల వద్ద, కొండాపురం ఈసర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ చీనీ తోటలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అసాంఘిక కార్యకలపాలపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఫైనాన్షియర్ దారుణ హత్య
ప్రొద్దుటూరు క్రైం : అవసరానికి అప్పులివ్వడమే ఆయన చేసిన నేరమా. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించమని అడిగిన పాపానికి రుణదాతనే దుండగులు హతమార్చారు. ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ కొండా వేణుగోపాల్ రెడ్డి (54) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు దారుణంగా హతమార్చి చాపాడు సమీపంలోని కుందూ నదిలో పడేశారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు ఊహించినట్టే ప్రముఖ వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి బాకీ దారుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. పోరుమామిళ్ల మండలం రెడ్డికోట గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చి స్ధిరపడ్డారు. కొన్నేళ్ల వరకూ వైఎంఆర్ కాలనీలో నివాసం ఉండే వారు. జమ్మలమడుగు రోడ్డులోని మున్సిపల్ ప్లాట్లలో విశాలమైన భవంతి నిర్మించుకొని నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. వేణుగోపాల్రెడ్డికి భార్య ప్రమీలాదేవి, కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి, కుమార్తె స్వప్న ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. కుమార్తె బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. వేణుగోపాల్రెడ్డి తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ గడువు ముగిసిన తర్వాత తిరిగి తీసుకునేవాడు. ఇలా పట్టణంలో పెద్ద మొత్తంలో అప్పులిచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి సమీపంలోనే కాపు కాచి.. వేణుగోపాల్రెడ్డి ఇల్లు జమ్మలమడుగు రోడ్డు పక్కన బొల్లవరం ప్లాట్లో ఉంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఆయన ఇల్లుంది. శుక్రవారం సాయంత్రం 6.30 సమయంలో ఇంటి నుంచి స్కూటీలో అతను బయటికి వెళ్లాడు. రోజూ రాత్రి 8–15, 8–30 గంటల్లోగా ఇంటికి వచ్చేవాడు. అయితే శుక్రవారం రాత్రి 8.50 దాటినా వేణుగోపాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న ఫోన్ చేసింది. అతని ఫోన్ నంబర్లు పని చేయలేదు. రోడ్డుపై ఉన్నాడేమో చూసి రమ్మని వాచ్మెన్ను పంపించారు. అతను బయటికి వెళ్లగానే ఇంటి సమీపంలో వేణుగోపాల్రెడ్డి స్కూటీ పడిపోయి ఉంది. పక్కనే అతని చెప్పులతోపాటు కారం పొడి ఉండడంతో ఫైనాన్షియర్ కిడ్నాప్నకు గురయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటల తర్వాత వేణుగోపాల్రెడ్డి ఇంటికి వస్తాడని భావించిన దుండగులు ప్రధాన రహదారిలోని ఆర్చీ వద్ద కాపు కాసినట్లు తెలుస్తోంది. స్కూటీలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్చీ దాటగానే దుండగులు అడ్డగించి, కళ్లలో కారం పొడి చల్లి ఘటనా స్థలంలోనే హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నాప్ చేసి అతన్ని ఎత్తుకెళ్లాలని ముందుగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వేణుగోపాల్రెడ్డి ఘటనా స్థలంలోనే మృత్యువాతపడడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కుందూలో పడేసినట్లు సమాచారం. కుటుంబసభ్యుల అనుమానమే నిజమైంది.. బాకీ తీసుకున్న వారు గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో కొందరిపై వేణుగోపాల్రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కేసు తుది విచారణకు వచ్చినట్లు వేణుగోపాల్రెడ్డి భార్య ప్రమీలాదేవి మీడియాతో వెల్లడించారు. కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన బాకీ దారులు తన భర్తను కిడ్నాప్ చేసి హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ప్రమీలాదేవి అనుమానమే నిజమైంది. బాకీ దారుల్లో కొందరు ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో వేణుగోపాల్రెడ్డి బంధువు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుందూలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి కిడ్నాప్నకు గురయ్యాడని తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణ, రూరల్ ఎస్ఐ రాజుతో కలిసి నాలుగు టీంలుగా ఏర్పడి రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో ఫైనాన్షియర్ను తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. ఇలా కారు వెళ్లిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో చాపాడు సమీపంలోని కుందు బ్రిడ్జి వద్ద నదిలో ఆదివారం వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక రెస్క్యూ టీంతో కలిసి అరుణ్రెడ్డి నదిలోని మృతదేహాన్ని వెలికి తీశారు. కుందూ నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మృతదేహాన్ని వెలికి తీయడం అతి కష్టంగా మారింది. ఎట్టకేలకు శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. అతని మృతదేహాన్ని చూపి భార్య ప్రమీలాదేవి, కుమార్తె స్వప్న బోరునా విలపించసాగారు. కేసులో అనుమానం ఉన్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలను తమదైన పద్దతిలో వారి నుంచి రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో నాయబ్ రసూల్ మృతి
పోరుమామిళ్ల : స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం రాత్రి మోటార్ బైక్ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో షేక్ నాయబ్రసూల్(45) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్నగర్కుకు చెందిన రసూల్ కుమార్తె కోసం వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. రసూల్ తీవ్రంగా గాయపడి కింద పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రసూల్కు భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు. రసూల్ భార్య రెహానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటిమిట్ట రామయ్యకు పూజలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు రెండు చోట్ల ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా రామయ్య మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సౌమ్య నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమ, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామం శోచరీపురం పొలం పరిధిలో 20మంది రైతుల తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం కేబుల్ వైర్లు అపహరించారు. రైతులు మాట్లాడుతూ పంట పండక, గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తోటల వద్ద బోర్ల కేబుల్ను అపహరించడంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతికడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో దిగువ రైలు పట్టాల వద్ద మృతిచెందిన వ్యక్తి 40–45 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో బోల్తా కమలాపురం : కమలాపురం పట్టణం క్రాస్ రోడ్డు ఆర్చి వద్ద గుంతల్లో పడి ఆటో బోల్తా పడింది. కడప నుంచి కమలాపురం పట్టణంలోనికి ఆటో వస్తోంది. ఆర్చి వద్ద పెద్ద గుంత ఉంది. అందులో వర్షపునీరు నిలవడంతో గుర్తించలేక అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే స్థలంలో ఇది వరకూ ఓ వాహనంతోపాటు, మోటార్ బైక్ బోల్తా పడ్డాయని స్థానికులు తెలిపారు. ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని ఉమ్మారెడ్డిపల్లె సమీపంలో లారీ–మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. పిడుగురాళ్ల నుంచి అనంతపురానికి పెయింట్స్ లోడ్తో ఓ లారీ ప్రయాణిస్తోంది. ఎదురెదురుగా ఉమ్మారెడ్డిపల్లి సమీపంలో రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోనే ఇరుక్కపోయి డ్రైవర్ రాజేష్ను స్థానికులు బయటకు తీసారు. -
రైతన్నా.. జర జాగ్రత్తన్నా..!
● పురుగుమందు పిచికారీలో అప్రమత్తత అవసరం ● అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ముప్పువర్షాలు విస్తారంగా కురవడంతో వరి, ఆరుతడి పంటలకు తెగుళ్లు విజృంభించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పురుగుమందు పిచికారీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన మందుల వాడకం తగ్గించాలని, పిచికారీ చేసేటపుడు కనీస జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా వరి 18 వేల హెక్టార్లు, జొన్న, సజ్జ, మినుము, వేరుశనగ, పత్తి తదితర పంటలు మరో 5వేల హెక్టార్లలోనూ రైతులు సాగు చేశారు. ఇపుడు వర్షాలు కురవడంతో మరింతమంది రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాలతోపాటు ప్రాజెక్టులు, కేసీ కెనాల్, బోర్ల కింద వరి సాగు విస్తారంగా సాగుతోంది. ముందస్తుగా సాగు చేసిన పంటలకు ప్రస్తుతం తెగుళ్లు సోకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పంటలను ఆశించే చీడపీడల నివారణ కోసం విస్తృతంగా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. అప్రతమత్తంగా ఉండాల్సిందే రైతులు పురుగు మందులు వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన ఎరువుల దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మందు డబ్బాలపై వజ్రాకారంలో పురుగు మందుల స్థాయిని తెలిపే రంగులను గుర్తించాలి. అత్యంత విషపూరితమైతే నీలం, తక్కువ విషపూరితమైతే ఆకుపచ్చ రంగలు ఉంటాయి. పురుగు మందులు అవసరానికి మించి కొనుగోలు చేయరాదు. పురుగు మందులు ముందుగా కొని ఇల్లు, పొలాల వద్ద నిల్వ చేయరాదు. పిచికారీలో జాగ్రత్త.. రైతులు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. పిచికారీ చేసే సమయంలో శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో భోజనం చేయడం, నీరు తాగడం, సిగిరెట్, బీడీ కాల్చడం వంటి పనులు చేయరాదు. మందులు కలిపేటప్పుడు కర్రలతో కలపడం శ్రేయస్కరం. ఇళ్లలో పిల్లలకు అందకుండా మందు డబ్బాలు జాగ్రత్తగా ఉంచాలి. మందు డబ్బాలపై కరపత్రాన్ని చదవాలి. రంగులు గుర్తించి ద్రావణం జాగ్రత్తగా పిచికారీ చేయాలి. నాజిల్స్ను నోటితో గాలి ఊది శుభ్రం చేయడం అత్యంత ప్రమాదకరం. ఖాళీ డబ్బాలను గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. పిచికారీ అయిన వెంటనే స్నానం చేసి దుస్తులను శుభ్రపరచుకోవాలి. మందు ప్రభావానికి గురైతే వైద్యులను సంప్రదించాలి. పై జాగ్రత్తలు పాటించకపోతే గుండె జబ్జు, కళ్లు తిరగడం, వాంతులు, క్యాన్సర్, నరాల బలహీనత వంటి సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం మేలు ప్రకృతి వ్యవసాయ సాగు విధానాన్ని అనుసరిస్తే రైతులతోపాటు నేల ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ ెపెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యకర పంట ఉత్పత్తులు పొందడమేగాక, పెట్టుబడి వ్యయం సగానికిపైగా తగ్గుతుంది. పశువుల పేడ, వేపాకు కషాయం, పచ్చిరొట్ట ఎరువులు, వర్మికంపోస్టు వినియోగిస్తే భూసారం పెరుగుతుంది, విచక్షణా రహి తంగా పురుగు మందులు వినియోగిస్తే పంటకు నష్టం వాటిల్లుతుంది. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలి పంట పొలాల్లో చీడ, పీడల నివారణకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోవాలి. నాణ్యమైన పురుగు మందులను మాత్రమే వాడుకోవాలి. మందు పిచికారీ చేసేటప్పుడు రక్షణ దుస్తులు, గ్లౌజులు ధరించాలి. జాగ్రత్తగా పురుగుమందులను పిచికారీ చేసుకోవాలి. – చంద్రా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
ఆర్టీసీ బస్సు బోల్తా
మైదుకూరు : విజయవాడ నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరదాయపల్లె సమీపంలో శనివారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్తో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ నుంచి వస్తున్న బస్సులో జీవీసత్రం ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు బయలుదేరారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నెల్లూరు–బళ్లారి జాతీయ రహదారిపై వరదాయపల్లెకు సమీపంలో ఆపాలని కండక్టర్ను విద్యార్థులు కోరారు. ఆ మేరకు డ్రైవర్ కొన్ని మీటర్ల మేరకు బైపాస్పై ఉన్న బస్సును రివర్స్ చేసేందుకు యత్నించాడు. దాంతో బస్సు అదుపుతప్పి బోలాం్త పడింది. డ్రైవర్తోపాటు బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కడప డిపో అధికారుల సమాచారంతో గ్యారేజీ కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును యథాస్థితికి తెచ్చారు. -
పితృదేవతలకు సామూహిక పిండ ప్రదానం
వల్లూరు : పుష్పగిరి కొండపై వెలసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలో రుద్రపాదం వద్ద ఆదివారం పితృదేవతలకు సామూహిక పిండ ప్రదాన కార్యక్రమం భక్తి శద్ధలతో నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినవారు తమ పితృ దేవతలు, బంధువులకు పిండ ప్రదానం చేశారు. రుద్రపాదం వద్ద పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడంతో వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో పేర్కొనబడిందని వివరించారు. దేవస్థానం అధికారులు భక్తులకు పిండ ప్రదాన సామగ్రి ఉచితంగా అందజేశారు. అనంతరం నదిలో స్నానాలు చేసిన భక్తులు రుద్రపాదానికి పూజలు జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఈవో శ్రీనివాసులు, అఖిల్, సుమంత్ పాల్గొన్నారు. -
ముస్లిం యువకులపై అక్రమ కేసులు దారుణం
కడప కార్పొరేషన్: ఉత్తర ప్రదేశ్లో ముస్లిం యువకులపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని ముస్లిం మత పెద్దలు ఆక్షేపించారు. కడప నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో వారు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐ లవ్ మహమ్మద్ బ్యానర్తో నిర్వహించిన ఈ నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలాద్–ఉన్–నబీ వేడుకల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఐ లవ్ మహమ్మద్ బ్యానర్లను ప్రదర్శించడంతో యోగి ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రవక్త పేరు ప్రదర్శించినందుకే కేసులు నమోదు చేస్తే 40 కోట్ల మంది ముస్లింలు ఒప్పుకోరన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్బాబు, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో మైలవరం జలాశయం!
జమ్మలమడుగు: మైలవరం జలాశయం ప్రమాదంలో పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు మైలవరం జలాశయం చుట్టూ ఉన్న కరకట్టకు పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మైలవరం జలాశయానికి గండికోట ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం ఐదు టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి నీటి విడుదల అధికారులు నిలిపివేశారు. పూర్తి స్థాయిలో నీరు నీల్వ ఉండటంతో ఇప్పటికే భూమిలో నుంచి నెమ్ము ద్వారా నీరు బయటికి వస్తోంది.మైలవరం కరకట్టకు ఏకంగా ఐదు చోట్ల రంధ్రాలు పడటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. భద్రత ఏదీ! ప్రస్తుతం మైలవరం జలాశయంలో నీరు పూర్తి స్థాయిలో ఉండటంతో పర్యాటకుల తాకిడిపెరిగింది. జలాశయం చూటానికి వెల్లే రహదారికి ఇరువైపు ప్రహరీ పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండ గేట్ల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో మైలవరం జలాశయం పైన పర్యాటకులకు భద్రత కరువైపోయింది. గతంలో కోట్ల రూపా యలు ఖర్చుపెట్టి మరమ్మతు పనులు చేసిన అవి నిష్ఫలంగానే మారిపోతున్నాయి. గుంతలు పడ్డాయి... మైలవరం జలాశయం కరకట్ట మీద గుంతలు పడిన మాట వాస్తవమే . అధికారులు సైతం వచ్చి పరిశీలించారు. దీనిపైన తగు చర్యలు తీసుకుంటాం. –సుబ్బారావు, ఇరిగేషన్ ఏఈ మైలవరం -
బాబు బినామీల కోసమే ప్రైవేటీకరణ
● ఐక్య పోరాటాలతో ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుందాం ● రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష,ప్రజా సంఘాల నేతలు కడప రూరల్: వైద్య విద్యను పరిరక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారారని నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బినామీల కోసమే వైద్య విద్యను కార్పొరేట్ సంస్ధలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికోసం’ అనే అంశంపై మేధావులు, అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక విధా నాలను అవలంబిస్తూ ప్రజల్లో అలజడి సృష్టించా రని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవే ట్ పరం చేస్తూ నిర్ణయించడం దారుణమని పేర్కొ న్నారు. బాబు తన బినామీలకోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓజీ సినిమాపై ఉన్న శ్రద్ధ ప్రజా ఆరోగ్యంపై లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానం వలన ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శివ యా దవ్ , న్యాయవాది సంపత్కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక నిర్ణయమని తెలిపారు. సీఐటీయూ నాయకులు కామనూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన సీట్లను కూటమి ప్రభుత్వం తిరస్కరించిన రోజే పెద్ద ఎత్తున వ్యతిరేకించి, ఉద్యమాలు చేపట్టిఉంటే, నేడు ప్రైవేటీకరణ ఉండేది కాదన్నారు. న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఏ రంగన్నైనా సరే ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదన్నారు. జన చైతన్య సమగ్రాభి సంస్ధ అధ్యక్షులు గోపాల్, పౌర హక్కుల సంఘం నేత వెంకటేష్ , బీసీ, ఎస్సీ సంఘాల నేతలు అవ్వారు మల్లిఖార్జున, జేవీ రమణ, సంగటి మనోహర్ మాట్లాడుతూ ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. డాక్టర్ శ్రీనివాసులు, శ్రీక్రిష్ణ, భాస్కర్ పాల్గొన్నారు. -
కడప గడపలో టీఢీపీ!
పార్టీ జెండా మోసినోళ్లకే అండ దొరకడం లేదా..! పార్టీ గెలుపు కోసం పని చేస్తే .. అట్నుంచి కనీస పిలుపు కూడా దక్కడం లేదా! ... అంటే అవుననే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. పశ్చా‘త్తాపం’తో రగిలిపోతున్న పచ్చ నేతలు అసమ్మతి స్వరం పెంచారు. కడప ఎమ్మెల్యే తీరుపై తిరుగుబావుటా ఎగురువేశారు. ఏకంగా పశ్చాత్తాప యాత్రకు సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాల రగులుతోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీనియర్లను విస్మరించి వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీని యర్లలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవుని కడపలో సీనియర్ నేతలు పశ్చాత్తాప యాత్ర చేపట్టనున్నారు. టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే నాయకున్ని చూపాలంటూ స్వామికి విన్నవించనున్నారు. ● కడప నియోజకవర్గంలో టీడీపీ విజయబావుటా కోసం పార్టీ నేతలు అనేక మంది శక్తికి మించి కృషి చేశారు. ఎన్నికల తర్వాత వారంతా పల్లకి మోసే బోయీలుగా మిగిలారు. మాధవిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేపట్టకముందు ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, ఎస్ గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, అమీర్బాబు టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచారు. ఏ క్షణం మాధవిరెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారో.. అప్పటి నుంచి క్రమేపీ సీనియర్లు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాంప్రసాద్రెడ్డిలు కడపలో మాధవి రెడ్డి పరిచయ కార్యక్రమం, బలపర్చడం వెనుక కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో మాధవిరెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ క్రియాశీలక నేతల ప్రాధాన్యత, పరపతి పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాదు టీడీపీలో చేరిన 8మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయంలో వలస నేతలే కీలకమయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయంలోనే ప్రత్యక్షంగా పరస్పర దాడులకు తెగబడ్డారు. నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, అమీర్బాబు లాంటి వారంతా తెరమరుగు కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా దేవుని కడపలో పశ్చాత్తాప యాత్ర చేపట్టే స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఏకపక్ష చర్యలపై పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దేవునికడప, పాతకడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలతో సోమవారం పశ్చాత్తాప యాత్ర చేపట్టనున్నారు. కడప ఎమ్మెల్యేగా మాధవి రెడ్డి విజయం కోసం కృషి చేసినందుకు పశ్చాత్తాపం పడుతున్నాం.. అంటూ యాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆపై నగరంలో టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే నాయకుడి కోసం శ్రీవేంకటేశ్వరస్వామిని అభ్యర్థించనున్నారు. అనంతరం మూకుమ్మడిగా వెళ్లి కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని కలవనున్నట్లు సమాచారం. అండగా రక్షణగా నిలవాలంటూనే టీడీపీ సీనియర్లను కాపాడుకునేందుకు కడపపై దృష్టి పెట్టాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే నగర టీడీపీ కమిటీ నియామకంపై అనేక మంది గరంగరంగా ఉన్నప్పటికీ బాహాటంగా వ్యాఖ్యనించడం లేదు. కొండా సుబ్బయ్య లాంటి వారు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కమారుగా సెగలు కక్కుతూ తెరపైకి రావడం విశేషం. ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నేతల తిరుగుబాటు ఎమ్మెల్యే మాధవి ఎంపికపై నేడు నేతల పశ్చాత్తాప యాత్ర పాత కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో నిర్వహణ కలిసి అడుగులు వేస్తున్నటీడీపీ సీనియర్ కార్యకర్తలు -
● ఆలయ చరిత్ర
ఎందరో మహనీయుల సమిష్టి కృషికి ఈ ఆలయం చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడి సమీపంలోని పర్లపాడు గ్రామానికి చెందిన కామిశెట్టి చిన్న కొండయ్య అనే వ్యాపారికి కలలో కనిపించిన శ్రీ కన్యకా పరమేశ్వరి ‘‘పెనుగొండ వాసినైన నేను కడప జిల్లా పినాకిని నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రొద్దుటూరు పట్టణంలో కొలువు తీరనున్నాను’అని చెప్పడం జరిగింది. తనకు ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మింప చేయాలని చెప్పడంతో 128 సంవత్సరాల క్రితం వ్యాపారి కామిశెట్టి చిన్న కొండయ్య ఆలయ నిర్మాణానికి నడుం బిగించాడు. ఎందరో మహానుభావులు, జాతీయ, రాష్ట్ర రాజకీయ నాయకులు, పదవిలో ఉన్నవారు ఆలయాన్ని దర్శించుకున్నారు. 1929లో జాతిపిత మహాత్మ గాంధీ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి ఆలయంలో 40 రోజుల పాటు బస చేసి యజ్ఞయాగాదులు నిర్వహించారు. అమ్మవారి శాల గర్భగుడి లోపల గ్రానైట్ రాతితో, మార్బుల్ రాళ్లతో మనోహరంగా తీర్చిదిద్దారు. గర్భగుడికి వెండి తొడుగులను అమర్చారు. ఆలయంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వర దేవి జన్మ వృత్తాంతం తెలిపే చిత్రపటాలు దర్శనమిస్తాయి. ప్రొద్దుటూరులోని అమ్మవారిశాల ఆలయ గోపురం -
పరిశుభ్రతే ప్రగతికి సోపానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మొక్క నాటారు. అనంతరం తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. మొక్కలతో ఆహ్లాద వాతావరణం ఉంటే ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని తెలిపారు. సమాజ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(ఏఆర్) బి.రమణయ్య, డీఎస్పీ ఎన్.సుధాకర్, ఎ.శివరాముడు, శ్రీశైలరెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనియన్ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుంది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు స్వల్పంగా గాయలయ్యాయి. యూనియన్ నాయకులు కలమల్ల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పాల్సి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం 23 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిడి ఈ నెల 15వ తేదీ నుంచి నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో భాగమైన టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల కోసం వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు ప్రారంభం కాగా, అదే సమయంలో గేటు బయట టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు నిరసన చేపట్టాయి. విధులకు వెళ్తున్న ఉద్యోగ, కార్మికులను రెండు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని తోపులాట జరిగింది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో యూనియన్ నేతలు కలమల్ల పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి చర్చించుకుని సర్దుబాటు అయ్యారు. జేఏసీ నేతలు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
వదలనంటోన్న వాన
● జిల్లాలో నాలుగు రోజుల నుంచి వర్షాలు ● జోరుగా ప్రవహిస్తున్న పెన్నా, కుందూనదులు ● 942 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు ● నీటి నిల్వలు, దోమలతో అల్లాడుతున్న జనంకడప అగ్రికల్చర్/వేముల/పెనగలూరు : కడప జిల్లా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వద్దన్నా వర్షం కురుస్తూ రైతులను బెంబేలెత్తిస్తోంది. చాలా ప్రాంతాల్లో కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేంపల్లిలో అత్యధికంగా శుక్రవారం రాత్రి 96.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎర్రగుంట్లలో 84, పెద్దముడియంలో 85, జమ్మలమడుగులో 80.4, వీఎన్పల్లిలో 73.4, వేములలో 72.4, చక్రాయపేటలో 67.2, ప్రొద్దుటూరులో 57.8చ, పులివెందులలో 36, ముద్దనూరులో 35.4, తొండూరులో 32.2, ఒంటిమిట్టలో 29, మైలవరంలో 28.6, సికెదిన్నెలో 22.3, కడపలో 17.2, లింగాలలో 15.2, వల్లూరులో 14.4, సింహాద్రిపురంలో 13.2, రాజుపాలెంలో 12.2, పెండ్లిమర్రిలో 9.2, కమలాపురంలో 8.8, చాపాడులో 8.4, కొండాపురంలో 8.2, ఖాజీపేటలో 7.4, సిద్దవటంలో 7.2, చెన్నూరులో 2.2, దువ్వూరులో 2.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ● ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వలసపల్లి, చిలంకూరు, మాలపాడు వంకలు శుక్రవారం ఉద్ధృతంగా ప్రవహించాయి, కోడూరు వంకకు వరద నీరు చేరడంతో వేంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రగుంట్లలోని 33 కేవీ, 320 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లతోపాటు డీఈఈ కార్యాలయంలోకి నీరు చేరింది. ● రాజుపాలెం మండలం పర్లపాడు ఎస్సీ కాలనీలో జలమయమైయింది. రాజుపాలెం, వెంగలాయపల్లి గ్రామాల మధ్య మడవంకకి వర్షపునీరు భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ● గత నాలుగేళ్లుగా నీరు లేక వెలవెలబోయిన చెరువు ఒంటిమిట్ట చెరువుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ● పెన్నా, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నీరు అధికంగా చేరడంతో సిద్దవటం వద్ద లో లెవల్ బ్రిడ్జిపై నీరు పొంగి ప్రవహించింది. తోటలలో కుళ్లిపోతున్న ఉల్లిగడ్డలు జిల్లాలోని పెద్దముడియం, ప్రొద్దుటూరు, కమలాపురం, వల్లూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి మండలాలలోని 32 గ్రామాల పరిధిలో 1101 మంది రైతులకు సంబంధించిన 942.38 హెక్టార్లలో వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్, మినుము, పత్తి పంటలకు ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా తయారు చేశారు. ఇందులో భాగంగా 662.2 హెక్టార్లలో వరి, 10 హెక్లార్లలో జొన్న, 10 హెక్టార్లలో మొక్కజొన్న, 137.68 హెక్టార్లలో వేరుశనగ, 11.6 హెక్టార్లలో సోయాబీన్, 28.2 హెక్టార్లలో మినుము, 4.5 హెక్టార్లలో పత్తిపంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ఉల్లి, పూలు పంటలు దెబ్బతిన్నట్లు పలువుర ఉద్యాన రైతులు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో 3660 ఎకరాలలో ఉల్లి పంట సాగైంది. ఈ ఏడాది జూన్ మొదటివారంలో పంటలు వేయడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు భావించారు. వ్యాపారులు కొనుగోలుకు మొగ్గు చూపకపోగా, ప్రభుత్వం మొండిచేయి చూపింది. రైతులు వేచి చూశారు. ఇంతలోనే వర్షాలు కురవడంతో తోటల్లోనే ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. 1500 ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బతిందని ఉద్యాన అధికారులు తేల్చారు. పెద్దజూటూరులో చెన్నకేశవరెడ్డి 3.50ఎకరాలలో సాగు చేసిన అరటి పంట వర్షాలకు నేల రాలింది. సోమశిల జలాలతో మునిగిన పొలాలు పెనగలూరు: సోమశిల వెనుక జలాలు పెరగడంతో సిరివరి గ్రామానికి చెందిన వందల ఎకరాల పంట నీట మునిగింది. మామిడి తోటల్లోకి నీరు చేరడంతో చెట్లు చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 72 టీఎంసీలు నిల్వచేశారు. దీంతో సిరివరం, ఎన్ఆర్.పురం గ్రామంలోని చాలా పొలాలకు నీరు చేరింది. వారం పది రోజులలో కోసేందుకు వరి ప ంట సిద్ధంగా ఉండగా. నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎర్రగుంట్ల 33 కేవీ సబ్స్టేషన్కు చేరిన వర్షం నీరుఎర్రగుంట్లలో వర్షపు నీటికి దెబ్బతిన్న పత్తి పంటఉల్లి గడ్డలు కుళ్లిపోతున్నాయి నేను రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. రూ.1.50 లక్షల మేర పెట్టుబడి పెట్టాను. పంటకాలం పూర్తికావడంతో ఉల్లిగడ్డలు పీకివేశా. వర్షాలకు తడిచి ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాను. – చలమారెడ్డి, ఉల్లి రైతు, చింతలజూటూరుధర లేక అమ్మలేదు ఉల్లి సాగు చేసి పంట కాలం పూర్తయింది. నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. రూ.3 లక్షలకు పైనే పెట్టుబడులు పెట్టాను. ధరల కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలోనే వర్షాలు కురవడంతో గడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇలాగే వర్షాలు కురిస్తే పంట వదులుకోవాల్సిందే. – ద్వారకనాథ్రెడ్డి, ఉల్లిరైతు, వేల్పుల ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి తుపాన్ వర్షాలతో ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి. తోటలలో పీకి వేసిన ఉల్లి గడ్డలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పీకి వేయని ఉల్లిగడ్డలు కూడా భూమిలో కుళ్లిపోతున్నాయి. వర్షాలతో ఉల్లి రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. 1500ఎకరాలలో పంట దెబ్బతింది. – రాఘవేంద్రారెడ్డి, ఉద్యాన శాఖాధికారి, పులివెందుల -
ముగ్గురిపై చీటింగ్ కేసు
కడప అర్బన్ : కడప నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయభాస్కర్రెడ్డితోపాటు కుమార్తె రూప తన్మయి, సుజిత్కుమార్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రామకృష్ణ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. అరవింద్నగర్కు చెందిన నిత్య పద్మావతి 2019లో ఐదు ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత విజయభాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన నిత్య పద్మావతి దగ్గర సంతకాలు చేసిన చెక్కు, లెటర్ ప్యాడ్లను నమ్మకంగా ఇప్పించుకున్నాడు. కుట్రపన్ని దాదాపు రూ.90 లక్షల మేర తాను, తమ ఇద్దరు పిల్లల ద్వారా డబ్బు డ్రా చేసుకుని అవసరాలకు ఖర్చు చేసుకున్నారు. చివరకు ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించిన ఈఎంఐలను తన చేతనే కట్టించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్ల అరెస్టువేంపల్లె : స్థానిక పిల్లస్వామి గుట్ట సమీపంలోని జగనన్న కాలనీలో జరిగిన చోరీ కేసులో బంగారు రికవరీ చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన జగనన్న కాలనీలో వాణి తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే కాలనీకి చెందిన ఖాదర్వలి, మరో ఇద్దరు మైనర్లు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు, వెండి చోరీ చేశారు. విచారించి కడప–పులివెందుల బైపాస్ రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఎస్ఐ తిరుపాల్నాయక్, సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 66.90 0గ్రాముల బంగారు అభరణాలు, 118 గ్రాముల వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. పులివెందుల లయోలా కళాశాల అధ్యాపకుడి ప్రతిభపులివెందుల టౌన్ : అంతర్జాతీయ సదస్సులో పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఉదయ్కుమార్ ప్రతిభ చూపారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రేవా యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో 9 దేశాల శాస్త్రవేత్తలు పాల్గొని 200 ప్రదర్శన పత్రాలు సమర్పించారు. లయోలా కళాశాల అసిస్టెంట్ అధ్యాపకుడు ఉదయ్ కుమార్ లైఫ్ సైన్స్ విభాగంలో సమర్పించిన ఉపాధ్యాయ కేటగిరీ పత్రం ద్వితీయ బహుమతికి ఎంపికై ంది. అతిథుల నుంచి ఆయన బహుమతి అందుకున్నారు. ప్రిన్సిపల్ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వనచిన్నప్ప ఉదయ్ను అభినందించారు. -
ప్రొద్దుటూరులో లేఖ కలకలం
సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ జేబులు నింపుకొంటున్నారని పట్టణ ప్రముఖులపై ఏకే.రామాంజనేయులు రాసిన లేఖ శనివారం కలకలం సృష్టించింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బీజేపీ నాయకుడు గొర్రె శ్రీనివాసులు బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కిందట అగస్త్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణ వివాదంలోనూ, మిట్టా పాపయ్య సత్రం, నందినీ క్లాత్ మార్కెట్ విషయంలోనూ వివాదాలను ఆసరాగా తీసుకుని గోసంగి వెంకటసుబ్బారెడ్డి, గొర్రె శ్రీనివాసులు బ్లాక్ మెయిల్కు పాల్పడగా వారికి బుశెట్టి రాంమోహన్రావు సహకరించారని ఆరోపించారు. ధారా అపార్ట్మెంట్ నిర్మాణంపై లెక్కలేనని పిటీషన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించారని ఆరోపించారు. డీఏడబ్ల్యూ కళాశాల వివాదంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపైనా డీఎల్.రవీంద్రారెడ్డితో ఫిర్యాదు చేయించి రూ.50 లక్షల వరకూ వసూలు చేశారన్నారు. గోపీ రైస్మిల్లుపై వందల కొద్దీ పిటీషన్లు, ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టి రూ.8కోట్లు అక్రమంగా సంపాదించారని, బొల్లవరంలో పల్లేటి సుహాసినిని మఽభ్యపెట్టి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఇందులో టీడీపీ నాయకుడు ఉక్కు ప్రవీణ్ అనుచరుడు వాటర్ప్లాంట్ రాము, నీలకంఠారెడ్డి ఉన్నారన్నారు. చౌటపల్లె నికల్సన్ దొరకు చెందినదిగా చెప్పబడుతున్న మూడు ఎకరాల స్థలాన్ని దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేయాలని యత్నించినట్లు పేర్కొన్నారు. నిమ్మకాయల సుధాకర్రెడ్డి, మరికొందరు వేసిన వెంచర్లపై ఆర్టీఐ యాక్ట్ పెట్టి బెదిరించారన్నారు. 2023లో రాజా ఫౌండేషన్పై వారి కళ్లు పడ్డాయని, చిన్నజీయర్స్వామిని పరిచయం చేసుకుని కమిటీలో తమ పేర్లను ఎక్కించుకున్నారని, తమకు రూ.75 కోట్ల విలువైన భూములను అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుడు గొర్రె శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేని పక్షంలో ఆరోపణలు చేసిన వ్యక్తులు రాజకీయాలకు ముగింపు పలకాలని కోరారు. శివాలయం సెంటర్ వద్ద బహిరంగ చర్చా వేదికకు తాము సిద్ధమన్నారు. కౌన్సిలర్ మురళీధర్రెడ్డి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేయించారని, దందాలు ఎవరు చేశారో ప్రజలకు తెలుసునన్నారు. గోసంగి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16న హెడ్ పోస్టాపీసులో లేఖ పోస్టు చేశారని, ఎక్కడి నుంచి లేఖ వచ్చింది అడ్రెస్ లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేశారన్నారు. అనంతరం త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి తమపై ఆరోపణలు చేసిన వారిఫై విచారించాలని కోరారు.బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలుచేస్తున్నారని ఆరోపణ -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
మైదుకూరు : తనను బెదిరించి తన మోటార్ బైక్ను అగంతుకుడు ఎత్తుకెళ్లాడని ఓ భవన నిర్మాణ కార్మికుడు చేసిన ఫిర్యాదు ఓ అంతర్ రాష్ట్ర దొంగను పట్టించింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ వాసి బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్ను బ్రహ్మంగారిమఠం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల విలువచేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వివేకానంద కాలనీకి చెందిన షేక్ హుస్సేన్షా బేల్దారిగా పనిచేస్తున్నారు. బ్రహ్మంగారిమఠం ఈశ్వరీదేవి గుహ వద్ద ఈ నెల 16న పనులకు వెళ్లి కొద్ది దూరంలో బైక్ పార్కింగ్ చేశాడు. సాయంత్రం వచ్చి చూడగా.. నిందితుడు రాజశ్రీ గణేష్ తన బైక్ను స్టార్ట్ చేస్తుండడడంతో హుస్సేన్షా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావని ప్రశ్నించాడు. పక్కకు తప్పుకోకుంటటే చంపేస్తానంటూ చాకుతో బెదిరించి బైక్లో పరారయ్యాడు. బాధితుడు బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు రాజశ్రీ గణేష్ను పోలీసులు అనుమానించి విచారించారు. విచారణలో హుస్సేన్షా మోటార్ బైక్ అని తేలడంతో మరింత విచారణ చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణలోని పలు స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ బైక్లు చోరీ చేసినట్లు తెలిసింది. ఓ పాడుబడిన షెడ్లో నిందితుడు దాచిన పది మోటార్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కడప, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న సబ్బందిని డీఎస్పీ అభినందించారు. కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రలకు రివార్డులను అందజేశారు.10 మోటార్ బైక్లు స్వాధీనం -
టీడీపీ, జనసేన దళిత వ్యతిరేక పార్టీలు
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, సమావేశానికి హాజరైన నాయకులు , పార్టీ శ్రేణులుకడప కార్పొరేషన్: సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని.. టీడీపీ, జనసేన సిద్ధాంతం, భావజాలంతో దళితులకు నష్టమని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. విజయవాడలోని 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట లక్ష మంది దళితులతో ప్రదర్శన చేయనున్నామని ఆయన వెల్లడించారు. శనివారం పాతరిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్లో జరిగిన వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 మంది సభ్యులతో జిల్లా కమిటీతో పాటు ఏడు నియోజకవర్గాల్లో, మున్సిపాలిటీల్లో, 36 మండలాల్లో, పంచాయతీల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా...అని తన మనసులో దళితులపై ఉన్న వివక్షను చంద్రబాబు బయటపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా పవన్ మాట్లాడకుండా దళితులపై వ్యతిరేకతను చాటుకున్నారన్నారు. వైఎస్సార్సీపీతోనే దళితులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల రాజకీయంగా దళితులకు నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 38 సంక్షేమ పథకాల ద్వారా దళితులకు కోట్లాది రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. చంద్రబాబు దళిత ద్రోహి వైఎస్ కుటుంబానికి దళితులంతా బంధువులని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముద్దుబిడ్డలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయన టక్కుటమారాలను దళితులు గమనించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా అన్నారు. దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయరు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ● కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు ఆత్మ గౌరవంతో బతకడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు అన్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లతోపాటు 15 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లను చేసిన ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. ● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ, భద్రత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. కూటమి పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని, దళితులపై దాడులు ఎక్కవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ● దళితులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు గౌరవం లభించిందని, కూటమి ప్రభుత్వంలో ఆ గౌరవం కరువైందన్నారు. ● 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపాలవడంతో దళితుల బతుకులు దుర్భరమయ్యాయని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా పరిశీలకులు కె. చెంగయ్య అన్నారు. దళితుల జీవితాలు బాగుపడాలంటే ఓటు అనే ఆయుధంతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితుల సత్తా చూపాలని పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమం వైఎస్సార్, జగన్ హయాంలోనే... దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిల పాలనలోనే దళితుల సంక్షేమం, అభివృద్ధి జరిగిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు వంటి పథకాల వల్ల దళితులకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు. ● వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, దళిత నాయకులు సీహెచ్ వినోద్ కుమార్, ఎం.సుబ్బరాయుడు, కె. శరత్బాబు, డేనియల్ ప్రదీప్, బి. మరియలు, కె. బాబు, బండి ప్రసాద్, త్యాగరాజు, ఆర్. చెన్నయ్య తదితరులు మాట్లాడారు. అంతకుముందు వారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఎస్. యానాదయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, గల్ఫ్కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బి. వేణుగోపాల్ నాయక్, మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, పుల్లయ్య(బద్వేల్), చిట్టిబాబు(జమ్మలమడుగు), భాస్కర్(పులివెందుల) తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ భావజాలానికి అనుగుణంగా జగన్ పాలన దళితులంతా సంఘటితంగా ఉండి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో అఽధికారంలోకి వచ్చిందని, వైఎస్సార్సీపీపై బురదజల్లడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు. విద్య ఒక్కటే మన జీవితాల్లో మార్పు తెస్తుందని అంబేడ్కర్ చెప్పారని, వైఎస్ జగన్ కూడా విద్య, వైద్యాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి పునాది రాళ్లుగా ఉపయోగించారన్నారు. కూటమి రాకతో ఆ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా నష్టం వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు -
దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
ప్రొద్దుటూరు కల్చరల్: శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో 136వ దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామని..ఈ ఏడాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నామని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్ రావు తెలిపారు. ఆలయంలో శనివారం ఉత్సవ వివరాలను కమిటీ సలహాసభ్యులు బుశెట్టి రాజశేఖర్, ఎన్వీ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా రోజూ అమ్మవారి అలంకారాలు నిత్యనూతనంగా భక్తులకు కనువిందు చేస్తాయన్నారు. సోమవారం దసరా ప్రారంభం సందర్భంగా ఉదయం వాసవీకన్యకా పురాణాన్ని తెచ్చే వేడుకలో హర్యాణా భంభంభోలే అఘోరాలు, భోపాల్ శివశక్తి డ్రమ్స్, కోదండరామ కోలాటం ఉంటుందన్నారు. 29న బిందె సేవ రోజున చిక్మంగుళూరుకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, అక్టోబరు 2న విజయ దశమి సందర్భంగా శమీదర్శనం, తొట్టి మెరవణి వేడుకలో పాలకొల్లు బ్యాండ్, కోలాటం, డూప్స్, హర్యాణా కళాకారుల వేషధారణలు, కేరళ సింగారిమేళం, కాంతార కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు అలరిస్తాయన్నా రు. అలాగే లోకకళ్యాణార్థం రోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజాకార్యక్రమాలు, వేద పఠనం, జపహోమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది దసరా 11 రోజులు రావడంతో 9వ రోజున అమ్మవారిని బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తున్నామన్నారు. 4 రోజులు సినీ డైరెక్టర్ గోపి అమ్మవారికి ప్రత్యేక సెట్టింగ్లు వేస్తున్నారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు దేవీ శరన్నవ రాత్రి వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, మల్లెంకొండు ప్రతాప్, కోశాధికారి జాలాధి పరమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ లైన్మెన్ సస్పెన్షన్
కడప కార్పొరేషన్: కడప డివిజన్ పరిధిలోని వెస్ట్ సెక్షన్ రామరాజుపల్లె 33/11 కేవీ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న బి. నూతన్ ప్రసాద్ బాబును సస్పెండ్ చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని గవర్నమెంట్, మున్సిపల్, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవును ప్రకటిస్తున్నట్లు డీఈఓ షంషుద్దీన్ తెలిపా రు. సెలవు రోజుల్లో ఎటువంటి ప్రైవేటు క్లాసులుకానీ, తరగతులుగానీ నిర్వహించ కూడదని తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు ఉల్లంఘించిన యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. కడప ఎడ్యుకేషన్: ప్రొద్దుటూరులోని వైవీయూ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫస్ట్, సెకండ్, థర్డ్ బీటెక్ కోర్సులకు సంబంధించి సెమిస్టర్ ఫలితాలను శనివారం వైవీయూలో వీసీ అల్లం శ్రీనివాసరావు తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ ఏడాది మే నెలలో బి.టెక్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వైబ్సెట్ https:www.yvuexams.in /results.aspx సందర్శించి తెలుసుకోవచ్చన్నారు.పరీక్షల విభాగాన్ని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ ప్రశంసించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ పి.పద్మ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్. వైవీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. జయరామి రెడ్డి, ఇంజినీరింగ్ ఫ్యా కల్టీ. డీన్, ప్రొఫెసర్ జి. జయ చంద్ర రెడ్డి , వైవియు పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య జిల్లా అందరి బాధ్యత
కడప సెవెన్రోడ్స్: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ‘స్వచ్ఛ దివస్‘ కార్యక్రమాన్ని పురస్కరించుకునిఅధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని బ్లాకుల వద్ద ఆయా శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛ దివస్ నిర్వహించారు. డీఆర్వో , ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రైతుల కన్నా ఓజీ మీదే శ్రద్ధ ఎక్కువైంది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. కూటమి ప్రభుత్వం వాళ్ల సమస్యలను గాలికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా పవన్ సినిమా టికెట్ రేట్లను పెంచడంలోనే బిజీగా ఉందంటూ మండిపడ్డారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎరువులు, యూరియా అందకుండా రైతులు నష్టపోతున్నారు. అయినా వాళ్ల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎ్ససార్సీపీ పోరాటం చేస్తుంది. పవన్ ఓజీ సినిమా టికెట్ పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై పెడితే బాగుండు. .. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాగైనా అడ్డుకుని తీరతాం. ఎంతటి పోరాంట చేయడానికైనా సిద్ధం అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: పవన్ ఓజీ.. జగనే కరెక్ట్! -
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
కడప రూరల్ : వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ..లాభ–నష్టాలు అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలందించడం ద్వారా వైద్య రంగంలో మెలకువలు తెలుసుకునేందుకు పేద విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే పీపీపీ విదానాన్ని ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వ్యతిరేకించారని తెలిపారు. రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలుండగా, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం తగదన్నారు. 66 ఏళ్లకు కోట్ల రూపాయల ఆస్తులను రూ.5వేలకు లీజుకు ఇవ్వడం శోచనీయమని తెలిపారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటుపరం చేయడం ద్వారా సీట్లను అమ్ముకుని వైద్య విద్యను వ్యాపారం చేయడమేనని తెలిపారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో వ్యతిరేకిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సామేల్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం ద్వారా అవినీతి ముసుగు ఉంది. వైద్యులతోపాటు కీలకమైన పారా మెడికల్ స్టాఫ్ను పెంచాలి. కడపలో కేన్సర్ ఆస్పత్రి ఉంటే ప్రభుత్వం ఇంతవరకు అక్కడ సిబ్బంది, సౌకర్యాలను కల్పించకపోవడం శోచనీయం. – డాక్టర్ రాంగోపాల్వర్మ, కడప ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. వైద్య విద్య కాలేజీల ప్రైవేటుపరం చేయడంతో సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు ఉండవు. అలాగే అక్కడికి వచ్చే రోగుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బాలిరెడ్డి, కడప రోగులకు సేవలందించే కీలకమైన వైద్య విధానంలో రాజకీయాలు తగవు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటపుడు వైద్యులు, ఇతర విద్యార్థులు, తదితర సంస్థలకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ రామచంద్రయ్య, కడప పులివెందులలో అన్ని హంగులతో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం. ప్రైవేటీకరణతో విద్యాబోధన సక్రమంగా ఉండదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. – డాక్టర్ ఎస్.గౌస్పీర్, కడప -
విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన అవసరం
కడప ఎడ్యుకేషన్ : ప్రతి విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు. వైవీయూలోని న్యూ అడ్మినిస్ట్రేషన్ భవనంలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో 75 సంవత్సరాల భారత రాజ్యాంగంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం బాధాకరమన్నారు. సాంకేతిక పదజాలాన్ని సమకూర్చి సదస్సుల ద్వారా చైతన్యం చేస్తున్న కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ(సి.ఎస్ టి.టీ) సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రొఫెసర్ నవేద్ జమాల్ విద్యార్థుల ముంగిటకు విస్తృతంగా భారత రాజ్యాంగాన్ని తీసుకు వెళ్లాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. సిఎస్టీటీ ఏడీలు జెఎస్.రావత్, షాజాద్ అహ్మద్అన్సారీ మాట్లాడుతూ అంశాలు సమాచారయుతంగా, ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ డి.రవీంద్రసతీష్బాబు, ప్రొఫెసర్ ఏజీ దాము, ప్రొఫెసర్ వై.సుబ్బరాయుడు, డాక్టర్ కె.సీతామాలక్ష్మి, డాక్టర్ వీఎం.రాజశేఖర్ వివిధ అంశాలపై ఉపన్యాసం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు వీసీ ఆచార్య శ్రీనివాసరావు, అతిథులు సర్టిఫికెట్లను అందజేశారు. వైవీయూ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు -
దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తాం
– జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు క్రైం : దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. డీఎస్పీ భావనతో కలిసి సబ్డివిజన్లోని సీఐలు, ఎస్ఐలతో సమావేశమై స్టేషన్ల వారీగా పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కాలను రూపుమాపుతామని, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణకు అ న్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ తర్వాత ప్రొద్దుటూరులో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారని, లక్షలాది భక్తులు వస్తున్నందున భద్రతాపరమైన చర్యల గురించి డీఎస్పీ, సీఐలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆలయకమిటీ నిర్వాహకులు, రెవెన్యూ, ఫైర్, విద్యుత్ తదితర శాఖలను సమన్వయం చేసుకొని ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దసరా ఉత్సవకమిటీ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్రావు దసరా ఉత్సవాల తీరును ఎస్పీకి వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ భావన, సీఐలు తిమ్మారెడ్డి, సదాశివయ్య, వేణుగోపాల్, నాగభూషణం, రాజగోపాల్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలను నిరోధించాలి బద్వేలు అర్బన్ : దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాలో జరిగే అక్రమాలను నిరోధించాలని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు నిర్వహిస్తున్న ఓట్ చోర్ – గద్దీ చోడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఎన్డీ.విజయజ్యోతి కోరారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా లక్ష సంతకాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలంతా చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ సమావేశంలో అచ్యుతరాజు, చిన్నరామిరెడ్డి, నరసింహ, సుధాకర్రెడ్డి, పుల్లూరు బాషా, ఖాజావలి, సాంబయ్య, గురప్ప, బాలసుబ్బయ్య, శేఖర్రెడ్డి, నాయబ్రసూల్ తదితరులు పాల్గొన్నారు. వైవీయూ పీజీ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ రెండో సెమిస్టర్, లేటరల్ ఎంట్రీ థర్డ్ సెమిస్టర్, ఫైన్ ఆర్ట్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డిప్లమా కోర్సుల పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంఏ, ఎంఎస్సీ కోర్సుల్లో ఎక్కువ బ్రాంచ్ లు వంద శాతం ఫలితాలు సొంతం చేసుకున్నాయన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఉల్లి మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి – కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ జేసీ అదితి సింగ్తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత రైతుల పరిస్థితి దృష్ట్యా ఉల్లి కొనుగోలుపై వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించ రాదని జిల్లాలోని ఉల్లి ట్రెడర్లకు సూచించారు. రైతులు, వ్యాపారస్తులు.. ప్రభుత్వంతో సమన్వయంగా మార్కెటింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఉల్లి నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో రైతులు పండించిన ఉల్లి పంటను మార్కెటింగ్ చేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఎలాంటి చర్యలను అవలంబిస్తే అనుకూలంగా ఉంటుంది? అనే అంశంపై చర్చించడం జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇంకా ఉల్లి పంట కోతకు సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట దిగుబడిని ఎలా సంరక్షించుకోవాలి? ఒక్కసారిగా అధిక పంట యార్డులకు చేరితే దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి? అనే అంశాలను రైతులు, ట్రేడర్లతో చర్చించి.. ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, నాణ్యతను పరిగణనలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యక్రమాలకు కొండారెడ్డి ఎలా హాజరవుతారు?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజులరెడ్డి ఉన్నారా.. లేక ఆయన కుమారుడు కొండారెడ్డి అనధికారిక ఎమ్మెల్యేగా ఉన్నారా అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు. తన స్వగృహంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొండారెడ్డిని ప్రజలు ఓట్లేసి ప్రజలు గెలిపించారా అని ప్రశ్నించారు. అధికార పూర్వకంగా వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా ఉండాల్సి ఉండగా, రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ వరద కుమారుడు కొండారెడ్డి కార్యక్రమాలు నిర్వహించడం చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లడం, రిబ్బన్ కట్ చేయడం, రికార్డులను పరిశీలించడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తాను హైదరాబాద్కు వెళ్లి వ్యాపారం చేసుకుంటానని చెప్పిన కొండారెడ్డి ఇపుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొండారెడ్డిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన వరదరాజులరెడ్డి దూరంగా ఉన్నారని, ఆయన కుమారుడు కొండారెడ్డి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆరోపించారు. ప్రజా సామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులను గుర్తుపెట్టుకునేందుకు తాను బ్యాడ్ మెమోరీస్ రాస్తున్నానని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులను వదిలిబెట్టబోనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రూపాందన్ ఆహ్వానం మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి హాజరైన కొండారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారన్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు జాయింట్ సెక్రటరీ కిరణ్గోపాల్ వాస్కోకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్ సందర్శించడం... కమిషనర్తోపాటు అధికారులంతా వెళ్లడం చూస్తే ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధి కానీ కొండారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎలా పంపిణీ చేశారన్నారు. పోలీసు అధికారులు సైతం కొండారెడ్డికి సెల్యూట్ చేసి పుష్పగుచ్ఛాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేసిన ఉక్క ప్రవీణ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని రాచమల్లు ప్రశ్నించారు. వరదరాజులరెడ్డితోపాటు కొండారెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, భార్గవరెడ్డి దోచుకో.. దాచుకో అన్నట్లుగా తయారయ్యారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, మార్తల ఓబుళరెడ్డి, జంగమయ్య, రాగుల శాంతి, లావణ్య, సత్యం, అనిల్, భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, ఆంజనేయులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
బద్వేలు అర్బన్ : ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్ అన్నారు. యూటీఎఫ్ రణభేరి రాష్ట్రవ్యాప్త ప్రచార జాత శుక్రవారం బద్వేల్కు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక భాకరాపేట నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా జెడ్పీ హైస్కూల్ వరకు సీఐటీయూ, డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. విలీనం పేరుతో వేలాది పాఠశాలలను మూసివేసి, ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చివేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తామని హామీలు గుప్పించి 15 నెలల కాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ, భారీ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదనవిజయకుమార్, పాలెంమహేష్బాబు, శ్రీనివాసులు, చిన్ని, నాగార్జునరెడ్డి, సుజాతరాణి, సివి.రమణ, శివప్రసాద్, ఎజాస్అహ్మద్, రవీంద్రుడు, మురళీకృష్ణ, సుబ్బారావు పాల్గొన్నారు. -
కస్తూర్బాగాంధీ విద్యాలయం తనిఖీ
వల్లూరు : వల్లూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానందరాజు శుక్రవారం తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థనా సమయానికి విద్యాలయానికి చేరుకున్న ఆయన ప్రార్థన అనంతరం మెనూ పరిశీలించారు. సరకుల నిల్వలు, స్టాకు నమోదు, రోజువారీ వినియోగం అంశాలను పరిశీలించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న హాస్టల్ నిర్వహణపై ప్రిన్సిపల్, అకౌంటెంట్కు సూచనలు చేశారు. రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జీసీడీవో రూత ఆరోగ్యమేరీ అన్నారు. అనంతరం హాస్టల్ మానిటర్ యాప్ టీమ్ సభ్యులు శివనాగేంద్రప్రసాద్ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నసీమున్నీసా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
కడప కోటిరెడ్డి సర్కిల్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, టాటా ట్రస్ట్ డాక్టర్ వీరభద్రుడు, అమరావతి, వరలక్ష్మి తెలిపారు. కడప నగరంలోని మానస ఇన్ హోటల్లో జిల్లా స్థాయి సీడీపీఓ, సూపర్వైజర్లకు కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్మాల్ న్యూట్రీషియన్పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. వారు మాట్లాడుతూ 0–5 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి ఆరోగ్య చికిత్స అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎత్తు, బరువు తీసి తీవ్ర లోప పోషణ, అతి తీవ్ర లోప పోషణ పిల్లలను గుర్తించాలన్నారు. వారికి అదనంగా బాలామృతం 2.5 కేజీలు ఇవ్వాలన్నారు. తల్లులకు బిడ్డ స్థితి గురించి తెలియజేసి పర్యవేక్షించాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు, చాపాడు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, ముద్దనూరు ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లు హాజరయ్యారు. -
జగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే..
సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరగని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు. – శ్రీకాంత్, వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు -
కలెక్టర్ను కలిసిన ఎస్పీ
కడప అర్బన్: జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ను నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సారిగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక జార్జ్కారొనేషన్ క్లబ్లో శుక్రవారం అండర్ –14, 17 జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ఐ రైఫిల్ షూటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 60 మంది క్రీడాకారులు పాల్గొని, తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఓపన్ సైట్, పీప్ సైట్, పిస్టల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలను ఎస్జీఎఫ్ఐ సెక్రటరీలు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, జార్జ్కారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, వైస్ప్రెసిడెంట్ బాలగంగిరెడ్డి, కో ఆర్డినేటర్లు ప్రవీణ్ కిరణ్, రాఘవేంద్ర, వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పర్యవేక్షించారు. ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో శుక్రవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎంసెట్ ద్వారా వెటర్నరీ విశ్వవిద్యాలయం నిర్వహించిన మొదటి కౌన్సెలింగ్లో ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి, కళాశాల అడ్మిషన్ బృందం వారిని అడ్మిట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్ మాట్లాడుతూ 19, 20, 21 తేదీలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 22 మంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందిర, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శ్రావణి ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సభకు కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సురేష్ వెళ్లి పాల్గొన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 59వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ మీటింగ్, ఎక్స్పోలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అకడమిక్ డెలిగేట్గా కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు బి.సురేష్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎ) ఏపీ విజయవాడ బ్రాంచ్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఐఈసీ– 2025 జనరల్ మీటింగ్కు వెళ్లి పాల్గొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగంలో సాధించిన సాంకేతిక అభివృద్ధి ముఖ్యంగా భారత్ ఈ రంగాల్లో సాధించిన ప్రగతిపై చర్చించేందుకు బీఐఎస్ సంస్థ ఈ అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసింది. -
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వరుసగా నాలుగు రోజులుగా పడిన ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ఒక రకంగా ముప్పే. ముఖ్యంగా ఉల్లి, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలు, పూల తోటలపై ప్రభావం చూపిస్తాయి. ఇంతటితో తగ్గుముఖం పడితే అంతగా నష్టం కలగదని రైతులు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పూల తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యాన పంటలైన మామిడి, సపోట, జామ, నిమ్మ, పెద్దనిమ్మ తదితరాలకు ఒక రకంగా మేలు జరగనుంది. మిగతా వ్యవసాయ, ఉద్యాన పంటలకు మాత్రం కొంతమేర ముప్పే. మూడో రోజూ కురిసిన వాన అత్యధికంగా వేములలో 40 మి.మీ -
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని, అవన్ని ప్రభుత్వం నిర్వహించేటప్పుడు వీటిని ఎందుకు నిర్వహించలేమన్నారు. – సాయిదత్త, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
సీమపై వివక్ష.. ఉద్యమమే రక్ష
కడప సెవెన్రోడ్స్: రాయలసీమపై కూటమి ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోంది. తమ హక్కులు సాధించుకునేందుకు ఈ ప్రాంత వాసులకు పోరాటమే శరణ్యమని ఉద్యమ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు శనివారం ఉదయం 10.00 గంటలకు కోవెలకుంట్లలోని పేరా ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. కుందూ పోరాట సమితి నాయకులు కామని వేణుగోపాల్రెడ్డి ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా కుందూ పరిరక్షణ సమితి, కుందూ పోరాట సమితి, కోవెలకుంట్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక సంయుక్తాధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యమ నేత కరీంబాషా తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ శాశ్వత కరువు నివారణకు ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టులను విస్మరిస్తోంది. వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించకపోవడంతో భవిష్యత్తు అంధకారంగా మారింది. ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా, గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించి శ్రీశైలంలో.. ఆ మేరకు ఆదా అయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోవెలకుంట్ల సమీపంలోని జొలదరాశి, పెద్దముడియం మండలంలోని రాజోలు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. 17 ఏళ్లు గడిచినా ఇంతవరకు నిర్మాణం ఊసే లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో భూ సేకరణ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం సేకరించింది గానీ ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. దీంతో భూములను అమ్ముకోవడానికి కూడా తమకు హక్కు లేకుండా పోయిందని కుందూ పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ దిశగా ఎత్తిపోతల పథక నిర్మాణ పనులు కూడా జరిగాయి. చంద్రబాబు అండ్కో కుతంత్రాలతో ఆ పథకం అర్ధాంతరంగా ఆగింది. గాలేరు–నగరి వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంపు చేసే పనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని పెట్నికోట వద్ద 20 టీఎంసీలు, కడప జిల్లా ముద్దనూరు మండలం దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందువల్ల కృష్ణానది వరద సమయాల్లో వీలైన మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దేనేపల్లె రిజర్వాయర్ నుంచి చక్రాయపేట మండలంలోని కాలేటివాగుకు నీరు తీసుకు రావాలని భావించారు. కాలేటివాగు నిర్మాణ పనులు కూడా దాదాపు 80 శాతం వైఎస్సార్సీపీ సర్కారు హయాంలోనే జరిగాయి. అక్కడి నుంచి కృష్ణా జలాలు వెలిగల్లు రిజర్వాయర్కు తరలించి హంద్రీ–నీవాతో అనుసంధానం చేసి మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనేది ఆ పథక ఉద్దేశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నిర్వీర్యంగా మార్చారు. బనకచర్ల నుంచి గాలేరు–నగరి వరద నీటి కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. వైఎస్ఆర్ హయాంలో పూర్తయిన వామికొండ, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్ ఆయకట్టు కింద సాగునీటిని అందించేందుకు డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానల్స్ పనులు కూడా.. చేపట్టకపోవడంతో ప్రాజెక్టుల భవిష్యత్తు అయోమయంగా మారింది. విద్య, వైద్య సౌకర్యాలు దూరం ఇకపోతే కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల పులివెందుల మెడికల్ కళాశాల 50 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇలా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందువల్ల ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత విద్యార్థులతోపాటు ప్రజలు విద్య, వైద్య సౌకర్యాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్లో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తరలించడం ద్వారా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలను ఇటీవల మంత్రి లోకేష్ ప్రారంభించి.. అవి తానే ఏర్పాటు చేయించుకున్నట్లుగా చెప్పుకోవడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ద్వారా ఒత్తిడి తెస్తే తప్ప రాయలసీమకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు శనివారం కోవెలకుంట్లలో నిర్వహిస్తున్న సమావేశానికి పాత, కొత్త తరానికి చెందిన ఉద్యమ నాయకులు తరలి రావాలని కరీంబాషా కోరారు. రాయలసీమపై కూటమి శీతకన్ను సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పరిశ్రమలు, వైద్య రంగంపై నిర్లక్ష్యం ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం నేడు కోవెలకుంట్లలో నేతల సమావేశం -
ఎర్రగుంట్లలో అత్యధికంగా..
అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలలో ఎర్రగుంట్లలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే ప్రొద్దుటూరులో 120.2, సికెదిన్నెలో 110.4 , పెండ్లిమర్రిలో 89.4 , రాజుపాలెంలో 83.2 , పెద్దముడియంలో 80.8 , వల్లూరులో 76.8, చెన్నూరులో 78.6 , పులివెందుల్లో 77 , కమలాపురంలో 76.2 , వేంపల్లిలో 68.2 , ఖాజీపేట 66 , వీఎన్పల్లిలో 60.2 కడపలో 54.8 , చక్రాయపేటలో 53.2 , సిద్దవటంలో 48.2 , ముద్దనూరులో 43.2 , దువ్వూరు 34.6 , ఒంటిమిట్టలో 32.2 , జమ్మలమడుగులో 30.2 , లింగాల 25.2 , అట్లూరు 26.2 , సింహాద్రిపురం 19.6 , మైదుకూరు 16.2 , వేముల 15 , తొండూరు 12.4 , బద్వేల్ 12.2 , చాపాలు 8.6 , మైలవరం 7.4 , పోరుమామిళ్ల 6.2 , బిమఠం 5.8 , బి కోడూరు 3.8 , కాశినాయన 2 , గోపవరం 1.6 మి.మీ వర్షం కురిసింది. -
తోటల వద్దే కొనుగోలు చేయాలి
తోటల వద్దే ఉల్లి దిగుబడులు కొనుగోలు చేయాలి. మార్క్ఫెడ్ అధికారులు రైతులను దిగుబడులు అక్కడికి తీసుకురమ్మంటున్నారు. తీసుకెళ్లిన తర్వాత గ్రేడింగ్ చేసి ఖచ్చితమైన ధర రావచ్చు.. రాకపోవచ్చు అంటూ చెబుతున్నారు. దీంతో మార్కెట్కు రావాలంటే భయం వేస్తోంది. కర్నూల్ మార్కెట్లో రైతుకు క్వింటా రూ.500 నుంచి రూ.350 వరకు ధర ఇవ్వడంతో ఉల్లిగడ్డలను రోడ్డుపై పారబోశారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద కొనుగోలు చేయాలి. – మల్లికార్జునరెడ్డి, ఉల్లి రైతు, అహోబిలం -
మధ్దతు ధర ప్రకటించాలి...
ఎర్రగుంట్ల మండలం దండుపల్లిలో ఆరెకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. త్వరలో పంట దిగుబడి వస్తుంది. ధర చూస్తే రూ.1000 ఉంది. గత నెలలో క్వింటా ఉల్లి గడ్డలు రూ.1500 నుండి రూ.1800ల వరకు పలికాయి. ప్రస్తుతం క్వింటా ఉల్లి ధర రూ.500లు పలికితే పూర్తిగా నష్టపోతారు. ఈ ధర ఏమాత్రం గిట్టుకోదు. ప్రభుత్వం ఉల్లికి రూ.3 వేల మద్ధతు ధర ప్రకటించాలి. పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దళారీల ప్రమేయం ఎక్కువగా ఉండడంతో రైతు నష్టపోవాల్సి వస్తోంది. – గంగా సురేష్, ఉల్లి రైతు, దండుపల్లి, యర్రగుంట్ల మండలం -
ప్రతి రైతుకు యూరియా అందిస్తాం
దువ్వూరు: మండలంలోని ప్రతి రైతుకు యూరియా అందిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని చింతకుంట గ్రామంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. దువ్వూరు మండలానికి 13,560 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు కాగా, ఇంత వరకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని కలెక్టర్ అడిగిన ఓ ప్రశ్నకు జేడీఏ చంద్రానాయక్ సమాధానమిచ్చారు. ఇంత స్థాయిలో యూరియా వచ్చినా రైతులకు యూరియా అందలేన్న సమస్య ఎందుకు వస్తోందని కలెక్టర్ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. అనంతరం సచివాలయంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. కొంత మంది రైతులకే యూరియా అందుతోందని, యూరియా కోసం క్యూలో ఉన్నా అందడం లేదని పలువురు వాపోయారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, పూర్తి స్థాయిలో యూరియా అందిస్తామని తెలిపారు. ఉల్లి రైతులకు న్యాయం చేస్తాంఖాజీపేట: ఉల్లి పంటకు సరైన పరిహారం అందించి.. రైతులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ శ్రీధర్ భరోసా ఇచ్చారు. ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె లో ఉల్లి రైతులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. పొలంలోని పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర దక్కడం లేదని పలువురు రైతులు కలెక్టర్ ఎదుట వాపోయారు. తహసీల్దార్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
వ్యక్తి అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన రసూల్(50) అదృశ్యమైనట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 16న ఇంట్లో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈనెల 17న తెల్లవారుజామున నుంచి అతను కనిపించకుండా పోవడంతో భార్య రషీద కుటుంబ సభ్యులతో కలిసి పలు చోట్ల గాలించింది. అతని ఆచూకీ లభించకపోవడంతో గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో ఉన్న ఆణాబంకు వీధిలోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఇంద్రకంటి విజయలక్ష్మి (53) అదృశ్యమయ్యారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగిరాలేదు. ఆమె పట్టణంలో పలు చోట్ల అప్పులు చేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోటకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తమ్మిశెట్టి రామాంజ నేయులుకు కడప కోర్టు జడ్జి డాక్టర్ సి.యామిని పదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధించినట్లు వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. వివరాలలోకి వెళితే.. వేంపల్లె గ్రామంలోని పుల్లయ్యతోట వీధికి చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులు వృత్తి రీత్యా పెయిటింగ్ పనిచేస్తున్నాడు. 2019 ఆగస్టు, 26న అదే వీధికి చెందిన మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విచారించిన జడ్జి నిందితుడికి పదేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు. జూదరుల అరెస్టు ఖాజీపేట : జూదమాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు. నాగసానిపల్లె పొలాల్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామని, వారి నుంచి రూ.78,470 నగదు, ఏడు సెల్ఫోన్లు, ఏడు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కడప సెవెన్రోడ్స్ : లాటరీ ద్వారా జిల్లాలో ఏడు బార్లను గురువారం కేటాయించారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అర్హత సాధించిన దరఖాస్తుదారులకు బార్లను కేటాయించారు. కడపలో నాలుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేల్లలో ఒకటి చొప్పున బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవికుమార్, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలో చోరీ
వేంపల్లె : స్థానిక గండి రోడ్డులోని జగనన్న కాలనీలో చోరీ జరిగింది. బాధితురాలు వాణి వివరాల మేరకు.. స్థానిక జగనన్న కాలనీలో నివాసముంటున్న వాణి లిటిల్ ప్లవర్ పాఠశాలలోనూ, ఆమె భర్త నాగేంద్ర యూసీఐఎల్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ఇంటికి తాళాలు వేసి ఇరువురు విధులకు వెళ్లగా.. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు చెప్పారు. బీరువాలో రూ.50 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు అభరణాలను దొంగలించినట్లు తెలిపారు. ఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ మోటార్ల దొంగ అరెస్టు బద్వేలు అర్బన్ : పగలు పాత సామాన్లు కొంటామని వచ్చి రాత్రి పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగను బద్వేలు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో విలేకరులకు మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎల్.ఆర్.పల్లిలోని ముస్లీం వీధికి చెందిన పాశంరాజేష్ వివిధ ప్రాంతాల్లో పాత సామాన్లు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పగలు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిపూట విద్యుత్తు మోటార్లను చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గోపవరం మండలం సండ్రపల్లెలో, ఈ నెల 10న బద్వేల్ మండలం వనంపులలోని పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసినట్లు రైతులు ఫిర్యాదు చేయడంతో విచారించిన పోలీసులు నిందితుడిని గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మూడు విద్యుత్ మోటార్లతో పాటు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ సీఐ ఎన్.క్రిష్ణయ్య, ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహణపై విచారణ కడప అర్బన్ : కడప నగరంలోని కేంద్ర కారాగారంలో 2023 నవంబర్, 28న మెడికల్ క్యాంపు నిర్వహణపై కర్నూలు ఎస్పీ విక్రాంత్పాటిల్, కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు, విజయవాడ కారాగారం సూపరింటెండెంట్ ఇర్ఫాన్, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ గురువారం విచారించారు. కమిటీ అధికారుల ఎదుట క్యాంపు నిర్వహించిన డాక్టర్లు, అప్పటి కారాగార అధికారులు హాజరయ్యారు. విచారణలో వీరి స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారు. పోలీసుల అదుపులో ఎర్రచందనం కూలీలు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె వద్ద గురువారం రాత్రి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు ఎర్రచందనం కూలీలను కడప ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 15 మంది కూలీలు రెండు వాహనాల్లో వెళ్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్దశెట్టిపల్లె వద్ద కాపుకాచారు. ఈ క్రమంలో వారు అక్కడికి రాగానే పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టి ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని కడపకు తరలించారు. ప్రధాన స్మగ్లర్ కోసం పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు. కూలీల వెనుక ఉన్నది జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్లా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా అనేది తెలియాల్సి ఉంది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయిచినట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. వైఎస్సార్ స్మారక ప్రెస్క్లబ్లో అఖిలపక్ష యువజన సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మంజూరు చేయించి, అందులో 8 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు సొంతజిల్లా అయిన చిత్తూరులోని మదనపల్లెలో 98 ఎకరాల్లో రూ.700 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కాలేజీ నిర్మిస్తే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే వద్దని లేఖ ఇచ్చిన దద్దమ్మ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను రద్దు చేసేవరకూ పోరాటం ఆపేది లేదని, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతోపాటు, ఛలో అసెంబ్లీకి కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు రవి, చంద్ర, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఏఐవైఎఫ్ నాయకులు ప్రభాకర్, ఏఐఎస్బి నాయకులు రాజేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
22 నుంచి దసరా ఉత్సవాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక పాత మార్కెట్లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. దేవీ శరన్నవ రాత్రులకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా వేడుకలలో భాగంగా రోజూ అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. లోకకల్యాణార్థం లక్ష్మీగణపతిహోమం, సుదర్శన, పవమాన, అరుణ, సరస్వతి, రుద్ర, దుర్గా, చండీ హోమాలు, వేదపారాయణం యంత్ర ఆరాధన, జప పారాయణం నిర్వహిస్తామన్నారు. రతనాల వేంకటేశ్వరస్వామికి, స్వామివారి చెల్లెలు లలితాదేవి మూలవిరాట్లను పూలు, గాజులు, నగదు, కూరగాయలు, ముత్యాలకవచం, వత్తిపత్తితో అలంకరిస్తున్నామన్నారు. అసౌకర్యం కలుగకుండా బారీకేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రణభేరి ప్రచార జాత గురువారం సాయంత్రం కడపకు చేరుకుంది. యూటీఎఫ్ నాయకులు సాదర స్వాగతం పలుకుతూ కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహావీర్ సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా బాలాజీ నగర్ యూటీఎఫ్ భవన్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరొకలా పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఆరు నెలలలోగా ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మిరాజా, జయచంద్రారెడ్డి, నాయకులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్, ఎస్.జాబీర్, సమీర్బాషా, నరసింహారావు, వై.రవికుమార్ డి.సుజాతరాణి, సివి.రమణ, ఎస్.ఎజాస్ అహమ్మద్, డి.క్రిష్ణారెడ్డి, సి.సుదర్శన్, ఎద్దు రాహుల్, వీరపోగురవి, తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి డిగ్రీ విద్యాసంస్థల బంద్ కడప ఎడ్యుకేషన్ : డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ ఈ నెల 22వ తేదీ నుంచి డిగ్రీ విద్యా సంస్థల నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేటు మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటశీను తెలిపారు. యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మనురాయన గురువారం కలిసి బంద్ నోటీసులు అందజేశారు. వెంకట శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6400 కోట్ల బకాయిలు ఉన్నాయని, అనేకమార్లు అధికారులకు వినతిపత్రం అందించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, ఫీజులు వసూలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నుంచి హుకుం జారీ చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు నిర్వహించలేక బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. సంజీవరెడ్డి, రవిశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట
– రూ.8లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం బద్వేలు అర్బన్ : జల్సాలకు అలవాటుపడి సులువుగా చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.8 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని మరాఠి వీధికి చెందిన నారాయణ దిలీప్కుమార్, భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్నాయబ్రసూల్ స్నేహితులు. కడప నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం అలవాటు చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట సొంత అన్న ఇంట్లోనే ఇరువురు కలిసి చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 10న బద్వేల్కు వచ్చిన ఇరువురు వెంకటయ్యనగర్లో శ్రీనివాసులు ఇంటికి తలుపులు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు విచారించిన పోలీసులు బద్వేల్–మైదుకూరు రహదారిలో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 118.04 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల నాలుగు వెండి బిళ్లలు లభించాయన్నారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐలు సత్యనారాయణ, జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్భాటం.. హంగామా.. అంతలో వెనక్కు
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరినీ విజయవాడకు పిలిపించి ఏదో హంగామా చేయాలని భావించారు.. వారికి ఆర్భాటంగా నియామక పత్రాలను అందిస్తామని చెప్పడంతో అభ్యర్థులు ఆఘమేఘాలపై పరుగున వచ్చారు. దీరా అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినందున నిలిపివేశామనడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. కడప జిల్లా డీఎస్సీ అభ్యర్థులు, వారికి తోడుగా వచ్చే బందువులను విజయవాడకు తరలించేందుకు కడప డీఈఓ కార్యాలయం వద్ద బస్సులను(జిల్లా నుంచి 40 బస్సులు) సిద్ధం చేశారు. నలుమూలల నుంచి చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు వేకువగానే కడప డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టిఫిన్ చేసి బయలు దేరేందుకు బస్సులు కూడా ఎక్కారు. ఇంతలోనే కార్యాక్రమం రద్దు చేశారని మేసేజ్ వచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు నిరుత్సాహ పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ వెనక్కు వెళ్లారు. డీఈఓ షేక్ షంషుద్దీన్తో మాట్లాడగా అధిక వర్షంతో విజయవాడలో కార్యక్రమం రద్దు అయిందని తమకు సమాచారం వచ్చిందన్నారు. త్వరలో మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులకు తెలియచేస్తామని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నిరుత్సాహం -
కుళ్లుతున్న ఉల్లి.. కన్నీళ్లే మళ్లీ
● ప్రకటనలే పరిమితమైన ఉల్లి కొనుగోలు కేంద్రాలు ● స్వయంగా జేసీ ప్రకటన చేసినా స్పందన కరవు ● కొనుగోలు కేంద్రాలు తెరవని మార్కెటింగ్ అధికారులు ● రెండు రోజుల వర్షంతో రైతుకు కొలుకోలేని దెబ్బ జిల్లాలోని మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డులలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మార్కెఫెడ్ ద్వారా క్వింటాల్ రూ.1200కు కొనుగోలు చేస్తామని ఈ నెల 4న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అనంతరం 15 రోజులు గడచినా అతీగతీ లేకపోవడంతోపాటు జేసీ ప్రకటన పేపర్కే పరిమితమైందా అంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) మీన్పల్లి 4089.63 మైదుకూరు 1778.60 వేముల 1004.89 పెండ్లిమర్రి 825.22 దువ్వూరు 904,78 తొండూరు 693.95 వేంపల్లి 391.52 ఎర్రగుంట్ల 311.83 ముద్దనూరు 314.88 కాశినాయన 156.97 కడప అగ్రికల్చర్/సింహాద్రిపురం: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 11347.67 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. 92,300 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చే అవకాశముందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లి కోత దశలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసాయి. దీంతో భూమిలోనే ఉల్లి కుళ్లిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సింహాద్రిపురం మండలం అహోబిలం రైతు అంకాల్ రెడ్డి ఎకరాకు రూ.70 వేలు వెచ్చించి మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. దిగుబడులకు గిట్టుబాటు లేకుండాపోయింది. కొనుగోలు చేస్తామన్న అధికారులు చేతులెత్తేయడం, వ్యాపారి ముందుకు రాకపోవడంతో రైతు ఉల్లి దిగుబడులను ఉచితంగా గ్రామ ప్రజలను తీసుకెళ్లమని చెప్పాల్సి వచ్చింది. ఈయనే కాదు.. మా ఘోష వినేవాళ్లే లేరా అని కన్నీళ్లు దిగమింగుతున్న రైతులు ఎందరో ఉన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు ఉల్లి పంటకు మద్ధతు ధర క్వింటా రూ.1200లకు కనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాయింట్ కలెక్టర్ కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పినా అనంతరం స్పందన లేకపోయింది. దీంతో ఒక పక్క మద్దతు ధర లేక.. మరోపక్క ప్రభుత్వం కొనుగోలు చేయక అల్లాడిపోతున్న ఉల్లి రైతుకు గోరుచుట్టుపై రొకటిపోటు అన్నట్లు ఆల్పపీడనంతో కురిసిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయి. కనీసం సాగు ఖర్చులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. క్వింటా రూ.500లు పలికితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని, చేసిన అప్పులు తీరవని రైతులు వాపోయారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడితే కనీసం కూలి డబ్బు రాని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతన్నలు మేలు జరుగుతుందని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు తమ దిగుబడులను ఆయా మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో విక్రయించుకోవచ్చు. వారు దిగుబడులు తీసుకువచ్చి అక్కడే ఎవరికై నా విక్రయించవచ్చు. రైతులు ఏ విధమైన గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదు. నేరుగా మార్కెట్ యార్డులు, రైతు బజార్లకు వెళ్లి కిలో రూ.12 ప్రకారం విక్రయించుకునే అవకాశం కల్పించాం. ఉల్లి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కలెక్టర్, వైఎస్సార్ కడప జిల్లా -
వాన వెల్లువాయె!
మేఘం గర్జించింది.. చిమ్మ చీకటి వేళ.. కమ్ముకొచ్చి కుండపోతగా కురిసింది..అంతే తెల్లారేకల్లా వాగు ఉప్పొంగింది. నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది.. ఇల్లంతా నీరు... ఊరంతా ఏరయింది. ఇక పంటంతా నీటిలో మునిగింది.. రైతు కంట కన్నీరొలికింది. గురువారం తెల్లారుజామున కురిసిన వర్షం.. పలు మండలాల్లో బీభత్సమే సృష్టించింది. వల్లూరు: కోట్లూరు పొలాల్లో నేలకొరిగిన వరిప్రొద్దుటూరులో రోడ్డుపై వర్షపు నీరుకడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున కుండపోత వాన కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో కంది, మినుము, ఉల్లి, జొన్నలతోపాటు పలు ఆరుతడి పంటల్లో వర్షపు నీరంతా నిలి చింది. పంట పొలాల్లో నిలిచిన వర్షపునీరు వంకలను తలపించాయి. జిల్లాలో ఎర్రగంట్ల మండలంలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురవడంతో పొట్లదుర్తిలోని ఎన్టీఆర్కాలనీ, ఎర్రగుంట్లలోని సుందరయ్యకాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎర్రగుంట్ల్ల ప్రొద్దుటూరు మద్య ప్రధా న రహదారిలోని కుంది నదీ ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. తిప్పులూరులో మసీదు ప్రహారీ కూలిపోయింది. పాగేరు వంక ఉధృతంగా ప్రహించడంతో కమలాపురం– ఖాజీపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే పెద్దముడియం మండలం పాలూరులోని నోస్సం వంక ఉధృతంగా ప్రవహించింది. కన్నెలూరులోని నివా సం ఉన్న ఓ కుటుంబం బైక్లో నొస్సం వంక దాటుతుండగా అదుపుతప్పి కొట్టుకపోతుండటంతో పాలూరుకు చెందిన కొంతమంది యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. అలాగే ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో రాజుపాలెం వెంగలాయపల్లి గ్రామాల మధ్యలో మడువంకపై వర్షపు నీరు ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు ఆగిపోయాయి. పెద్దముడియంలో పంటపొ లాల్లో నీరు నిలిచి చెరువులను తరలించాయి. ఈ వర్షంతో విత్తిన మినుమంతా భూమిలోనే కుల్లిపోతుందని రైతులు వాపోయారు. ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కడప నగరంలోని ఫాతిమా కాలేజ్ వద్ద.. పలు కాలనీలు జలమయం పలుచోట్ల రాకపోకలు బంద్ ఉద్యానపంటలతోపాటువ్యవసాయ పంటలకు నష్టం -
20న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం
కడప కార్పొరేషన్: కడప నగరంలోని పాతరిమ్స్ ఆవరణలో ఉన్న బీసీ భవన్లో ఈనెల 20వ తేది ఉదయం 9 గంటలకు వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం. సుబ్బరాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే సీఎం, డిప్యూటీ సీఎంలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటిపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు బండి ప్రసాద్, రవి, అజయ్, శ్యామ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ● రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాక ● జయప్రదం చేయాలని జిల్లాఅధ్యఽక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు పిలుపు -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం కడప నగరంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగానికిగానీ, పోలీస్ వ్యవస్థకుగానీ ఇసుమంతైనా చలనం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు తమను తాము పెద్ద రాజుల స్థాయిలో ఊహించుకుంటూ ఓ చేత్తో రెవెన్యూ, మరో చేత్తో పోలీసులను పెట్టుకొని ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇక శాంతిభద్రతలు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాం కదా...వాటిని నియంత్రించ లేనిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యులకు పాలనాపగ్గాలు అప్పగించామా...అని ప్రజలు చింతిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నాయకులు పి. జయచంద్రారెడ్డి, జమాల్వలీ, షఫీ, సుభాన్బాషా, త్యాగరాజు, షంషీర్, గౌస్, అక్బర్ పాల్గొన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కడప ఆలంఖాన్పల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మమేకం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ అన్నారు. జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందు రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ప్రజలు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ప్రార్థనల్లో ఎంపీ మిలాద్ ఉన్ నబీ మాసోత్సవం సందర్భంగా కడప లోని శ్రీక్రిష్ణ దేవరాయ సర్కిల్ సమీపంలో వైఎస్సార్సీపీ నేత ఎస్ఎండీ ఆజమ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అంజద్బాషా ప్రజా దర్బార్లో నాయకులతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ ఇంత జరుగుతున్నా జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగంలో చలనం లేదు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
సమ్మెకు.. నోటీసులు
కడప కార్పొరేషన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందే అక్టోబర్ 1 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమపై ప్రభుత్వం మోపుతున్న పనిభారం తగ్గించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి అధికారులకు సమ్మె నోటీసులు ఇప్పటికే అందజేశారు. ఈనెల 22వ తేదీ నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టి అక్టోబర్ ఒకటి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని 36 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో 889 గ్రామ, వార్డు సచివాలయాలు నడుస్తుండగా, వాటిలో సుమారు 7600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు. వలంటీర్ల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకే... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు, కార్యక్రమాలను వలంటీర్లు అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేల జీతమిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2024లో అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు జీతాలు పెంచకపోగా వలంటీర్ల వ్యవస్థనే ఎత్తేసింది. కూటమి పాలనలో వలంటీర్లు లేకపోవడంతో ఆ పనులన్నీ చేసే బాధ్యత సచివాలయ ఉద్యోగులపైన పడింది. దీంతో సహజంగానే సచివాలయ ఉద్యోగులపై అధిక భారం, పని ఒత్తిడి పెరిగింది. ప్రజలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్, బయోమెట్రిక్ వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల సేకరణలతో భారం అధికమైంది. ఆందోళనకు కార్యాచరణ ప్రణాళిక తమ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని సచివాలయ ఉద్యోగ జేఏసీ సంఘ ప్రతినిధులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు సమ్మె నోటీసులు అందజేశారు. సెప్టెంబర్ 30వ తేదిలోపు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. ● ప్రతిసారీ సర్వేల పేరుతో ఇంటింటికీ తిరిగి విధులు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతూ, ఆత్మ గౌరవం కోల్పోతున్నాం. వీటి నుంచి విముక్తి కల్పించాలి. ● విద్యార్హతల ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు అప్పగించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి. ● సమయపాలన లేని, ఒత్తిడితో కూడుకున్న విధుల నుంచి విముక్తి కల్పించాలి. ● సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయించడం ఆపాలి. ● ఆరేళ్లు ఒకే క్యాడర్లో సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషనరీ సమయంలో రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్టైమ్ నిర్ణయించాలి. ● పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు సచివాలయాల్లోని ఖాళీలకు 50 శాతం సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● సర్వేలను ఆయాశాఖల సంబంధిత ఉద్యోగులతో నిర్వహించి, సచివాలయ సిబ్బందిపై భారం తగ్గించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డు అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్టేషన్సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలి. అత్మగౌరవం దెబ్బతింటోంది సచివాలయ ఉద్యోగులు ఏ విధులు నిర్వహించాలో వాటినే ప్రభుత్వం అప్పగించాలి. అసలు ప్రజల ఇళ్ల వద్దకు సర్వేలు చేయడం, తమకు సంబంధం లేని ఎరువుల విక్రయాల వద్ద విధులను అప్పగించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. తమ విధులేమిటో ప్రభుత్వం నిర్ణయించి జాబ్చార్జ్ను ప్రకటించాలి. లేదంటే రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళతాం. – హీరామియ్యా, జిల్లా అధ్యక్షుడు. గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్వలంటీర్లు చేసే పనంతా మాపై పడింది ఇదివరకు 50 ఇళ్లకు ఒక వలంటీరు ఉండేవారు. ఒక సచివాలయంలో 25 క్లస్లర్టు ఉంటాయి. వలంటీర్లు చేసే పనంతా మాపైనే పడుతోంది. డ్యూయల్ బాసిజం మాపై ఎక్కువైంది. అన్ని రకాల పనులు మాతోనే చేయిస్తున్నారు. ఇది చాలా దారుణం. అలాగే పదోన్నతులు కల్పించడానికి తగిన విధి విధానాలు రూపొందించాలి. – పి. సిద్దేశ్వర్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘంచిన్నచూపు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీ ర్యం చేస్తున్నారు. ఒక్క సమస్యకు పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన మేము ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తక్షణమే జాబ్చార్జ్ను ప్రకటించాలి. – ఎం. మస్తాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 22 నుంచి సచివాలయ ఉద్యోగుల ఉద్యమబాట డిమాండ్లు తీర్చాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ జిల్లాలో 889 సచివాలయాలు, సుమారు 7600 మంది ఉద్యోగులు -
ఆర్భాటం.. హంగామా?
డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ: 19వ తేదీ ఉమ్మడి కడప జిల్లాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు: 628 మంది కడప ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామా తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ● ఉమ్మడి కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాలు రాని పలువురు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లటం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ● కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు జిల్లా స్థాయిలోనే జరిగేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో పలు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు. ● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 400 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. ప్రభుత్వం నిర్ణయంతో పలువురు మండిపడుతున్నారు. వైఎస్సార్జిల్లా నుంచి 1600 మంది 40 బస్సుల్లో వెళ్లనున్నారు. జిల్లాలోనే నియామకపత్రాలు అందచేయాలి డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులకు జిల్లాస్థాయిలోనే నియమాకపత్రాలు అందచేయాలి. విజయవాడకు రమ్మని చెప్పడం సరికాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా చేయడం అన్యాయం. అధికారులు పునరాలోచించాలి. – సజ్జల రమణారెడ్డి, వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా! మండిపడుతున్న అభ్యర్థులు -
ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్: విమాన ప్రయాణీకుల మన్ననలు పొందేలా సేవలు అందిస్తున్నామని కడప ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పొదార్ తెలిపారు. బుధవారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కడప ఎయిర్పోర్టులో యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. తొలుత వివిధ ప్రాంతాల నుంచి కడపకుచేరుకున్న యాత్రికులకు డైరెక్టర్తోపాటు ఇతర అధికారులు స్వాగతం పలికారు.అలాగే రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్చందంగాపాల్గొని రక్తదానం చేశారు. అనంతరం అతిథులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డితోపాటు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు, రామకృష్ణ మిషన్ సభ్యులు, ఎయిర్పోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
పులివెందుల: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగనన్న పేదల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని అందుకు తగిన కార్యాచరణతో నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే దాదాపు పూర్తయిన మెడికల్ కళాశాలలను పూర్తి కాలేదంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్పరం చేయడానికి సిద్ధమయ్యాడన్నారు.ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలవల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు, అలాగే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతుందన్నారు. పులివెందులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వచ్చి పరిశీలించి ఇక్కడ మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని భావించి 50మెడికల్ సీట్లను మంజూరు చేయడం కూడా జరిగిందన్నారు. అయితే పులివెందులపై ఉన్న వివక్షతతో మంజూరైన మెడికల్ సీట్లను కుంటి సాకులు చెప్పి వెనక్కి వెళ్లేలా చేసిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఎంపీ అన్నారు. రాష్ట్రంలోని 17మెడికల్ కళాశాలలకు సంబంధించిన లక్ష కోట్ల ఆస్తిని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం శోచనీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైఎస్సార్సీపీలోకి 12 కుటుంబాలు మండల కేంద్రమైన వేముల ఎస్సీ కాలనీలోని టీడీపీకి చెందిన 12 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిల ఆధ్వర్యంలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చాగలేటి ప్రతాప్, అలవలపాటి గంగాధర, దారతోటి గుంటెన్న, రాచూరు రాఘవ, కొండూరు శ్రీనివాసులు, ఉలిమెల్ల గంగాధర్, గొందిపల్లె గంగాధర్, గొందిపల్లె కరుణాకర్, చాగలేటి పుల్లయ్య, గొందిపల్లె సుమంత్, కొట్టం శ్రీరాములు, గొందిపల్లె రామాంజులతోపాటు మరికొంతమంది ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తుండటంతో విసుగు చెందామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చలపతి, నాగప్ప, గంగాధర తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన వేముల మండల టీడీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
విశ్వకర్మకు ఘన నివాళి
కడప సెవెన్రోడ్స్: శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు బుధవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత విశ్వకర్మ చిత్రపటానికి డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా డీఆర్వో మాట్లాడుతూ కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశ్వకర్మ భగవానుని జన్మదినాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘విశ్వకర్మ జయంతి’’ గా జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసా చారి, ఎస్డీసి వెంకటపతి, ఎస్సి కార్పోరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖఅధికారులు, పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు, పాల్గొన్నారు. -
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు అని అన్నారాయన. -
19న చలో పులివెందుల మెడికల్ కాలేజ్
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. .ఈ నెల 19న చేపట్టిన చలో పులివెందుల మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, వాలంటరీ విభాగాల అధ్యక్షులు, సభ్యులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని, పది మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి సుందరంగా తీర్చిదిద్దారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లుతూ ఎలాంటి సౌకర్యాలు లేవని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలను మెడికల్ కాలేజీ వద్దకు తీసుకుపోయి అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాలను, వాస్తవ పరిస్థితులను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్కుమార్, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయి దత్త, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు వివేక్, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నగర వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు వంశీ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి సునీత, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రుతిక్ కడప.కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కె.రుతిక్ నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన కె.రుతిక్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2019 నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా సేవలందిస్తున్నారు. రుతిక్ పోరాట పటిమను గుర్తించిన వైఎస్.జగన్మోహన్రెడ్డి అతడిని ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా రుతిక్ కలిసి మాట్లాడారు. పది నెలలుగా విధులకు డుమ్మా చింతకొమ్మదిన్నె : మండలంలోని విశ్వనాథపురం–1 అంగన్వాడీ టీచర్ వి.అరుణ పది నెలలకు పైగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు తెలిపారు. అంగన్వాడీ టీచర్ పది నెలలపాటు విధుల్లోకి రాకపోయినప్పటికీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ పీడీ రమాదేవి వివరణ కోరగా.. అంగన్వాడీ టీచర్ అరుణ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, స్థానిక మహిళా పోలీసు కలిసి విచారించినా ఆమె ఫోన్లో అందుబాటులో లేరన్నారు. బాడుగకు ఉంటున్న ఇంటికి మెమోలు అంటించామని, వేతనం ఆపివేశామని ఆమె తెలిపారు. త్వరలో ఆమెను టర్మినేట్ చేయనున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే పీఏ అండతోనే మెప్మాలో అక్రమాలు
ప్రొద్దుటూరు : అధికార పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యక్తిగత పీఏ స్వామి అండతో మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్లో విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడుతూ మెప్మా పరిధిలో 30వేల మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెప్మా మై స్టోర్ యాప్ ద్వారా టీఈ మహాలక్ష్మి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్కెట్లో లభించే అగరబత్తీలు, ఊరగాయలు, కారంపొడి, పేలాల ముద్దలు, టవాళ్లు తీసుకువచ్చి యాప్ ద్వారా విక్రయిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని సంస్థతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కువ ధరకు అంటగడుతున్నట్లు తెలిసిందన్నారు. 30 ్ఠ60 సైజు టవాల్ ధర రూ. 55కు తెచ్చి యాప్ ద్వారా రూ.110లకు, 250 గ్రాముల నిమ్మకాయ ఊరగాయ ప్యాకెట్ ధర రూ.60కి తెచ్చి రూ.110కి విక్రయిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 90 మంది ఆర్పీలు ఉండగా ప్రతి ఆర్పీకి వాటిని అమ్మాలంటూ టార్గెట్ విధించారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత పీఏ స్వామి అండతోనే ఇదంతా జరుగతోందన్నారు. మూడు పేలాల ముద్దల ప్యాకెట్ రూ.60కు తెచ్చి రూ..120కి అమ్ముతున్నారన్నారు. తమ కార్యాలయంలో కంప్యూటర్లు ఏర్పాటుచేయాలని మహాలక్ష్మి ఆర్పీల వద్ద రూ.1000 చొప్పున రూ.90వేలు వసూలు చేస్తున్నారన్నారు. తన మాట వినని ఆర్పీలను టీఈ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. మెప్మా కుంభకోణంలో టీఈ రూ.20 లక్షల వరకు అక్రమంగా సంపాదించినట్లు తెలిసిందన్నారు. గృహాలకు సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఆ కంపెనీతో లాలూచీపడి డ్వాక్రా మహిళలతో ఇంటింటా ప్రచారం చేయిస్తున్నారన్నారు. మెప్మాలో జరిగిన ఈ కుంభకోణంపై మెప్మా పీడీ, ఎండీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గరిశపాటి లక్ష్మీదేవి, పాతకోట మునివంశీధర్రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి -
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్సార్టీసీ కడప జోన్ పరిధిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ జోనల్ చైర్మన్ పూల నాగరాజు సూచించారు. కడప నగరం లోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాగునీరు, కుర్చీలు, ఫ్యాన్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, జోన్ వ్యాప్తంగా 1.82 కోట్ల మంది ప్రయాణించారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పైబడిన బస్సులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కడప జోన్కు 500–600 బస్సులు అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ పైడి చంద్రశేఖర్, ఆర్ఎం పొలిమేర గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రాగా ముగిసిన మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు బుధవారం డ్రాగా ముగిశాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ప్రారంభించాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దు చేశారు.వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో....వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లో 109 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 46 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విజయ్ రామిరెడ్డి 86, ఎస్ఎండి.ఆయూబ్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లిఖార్జున నాలుగు, షేక్ కమిల్ మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 5.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్ అధిక్యం సాధించింది. దీంతో మల్టీ డే మ్యాచ్లో నెల్లూరుకు–19, చిత్తూరుకు 11, కర్నూలుకు ఆరు, కడపకు ఐదు, అనంతపురానికి నాలుగు పాయింట్లు లభించాయి.ఎస్జీఎఫ్ క్రీడలకు 300 మంది హాజరుకడప వైఎస్ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలకు బుధవారం 300 మంది ఉమ్మడి జిల్లా క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో అండర్–14, 17 వయస్సు విభాగాలకు పుట్బాల్, బాక్సింగ్, రగ్బీ, మోడరన్ పెంటతలాన్ క్రీడలకు జిల్లా జట్టు ఎంపికలను చేపట్టారు. పోటీలలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి.అండర్–14 బాలురు : శ్రావణ్కుమార్రెడ్డి, ఇర్ఫాన్, నిషాంత్రాజు, గురుతేజేశ్వర్, వెంకట ప్రణీత్, లెనిన్, గోపీనాథ్, నాగచరణ్, కెవి.ప్రణీశ్వర్, ఆదిత్, శ్రీనివాస్, అఖిల్, భరత్, నాగ చైతన్య, భద్ర, విగ్నేష్ కార్తీయన్, అభిరామ్ సాయివర్మ, మహ్మద్ హుస్సేన్, ధనుష్ సాయికుమార్.అండర్–17 బాలురు : సాయిరాకేష్, మహేష్బాబు, మస్తాన్వల్లి, జీవన్కుమార్, హామీద్, చరణ్, కార్తిక్, మహ్మద్ సుభాన్, జితేంద్ర, రెడ్డిచౌదరి, హేమంత్ కుమార్, ధీరజ్, రేవన్, వెంకట మణిరాజ్, సమీర్, చవనీశ్వర్, కెవిన్ భగవత్, మణికంఠ. బాలికలు : లక్ష్మీదేవి, జ్యోత్న, హర్షిత, అఖిల, హిమవర్షిణి, నీనగ్న, లక్ష్మీ తులసి, హిమ ప్రియ, అనుష, స్వప్న, ప్రహర్షిత, స్రవంతి, ఐశ్వర్య, జాహ్నవి, అర్చన, అమృత వర్షిణి, గౌతమి. -
1050 మెట్రిక్ టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడప జిల్లాకు మంగళవారం 1050 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తెలిపారు. ఆయన కడప ఏవో సురేష్కుమార్రెడ్డితో కలిసి జిల్లాకు వచ్చిన యూరియాను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన మొత్తాన్ని జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 69653 మెట్రిక్ టన్నుల ఎరువులు అసవరం కాగా ఇప్పటి వరకు 36915.26 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 25170.97 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో యూరియా 2117.80 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3268, కాంప్లెక్స్లు 15727.59, యంఓపీ 1990.80 మెట్రిక్ టన్నులతోపాటు యస్యస్పీ 2066.79 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో సాగు చేసిన పంటలకు యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ● కలెక్టర్కు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వినతి కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని రైతుల అవసరాలకు తగినంత యూరియా, డీఏపీ అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్రెడ్డి కోరారు. మంగళవారం ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం పంపారు. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాల కారణంగా కేసీ కెనాల్తోపాటు ఇతర రిజర్వాయర్లకు నీరు వచ్చిందన్నారు. దీంతో రైతులు ప్రధానంగా వరి, పత్తి, గడ్డి కయ్యలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారన్నారు. పాస్పేట్, యూరియా కొంత మేర జిల్లాకు వచ్చినప్పటికీ రైతులకు అందడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికి జిల్లాలో చాలా చోట్ల రైతులు క్యూలైన్లలో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. యూరియా బస్తా రూ. 266తో విక్రయించాల్సి ఉండగా, బయటి మార్కెట్లో రూ 350లపైనే అమ్ముతున్నారని తెలిపారు. -
కొత్త సార్లొస్తున్నారు..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. గతంలో నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ల ప్రామాణికం అధారంగా 680 మంది అర్హుల జాబితా ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మరో 32 పోస్టులను భర్తీ చేయలేదు. కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇటీవల అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియను కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు గానూ, 680 మందిని ఎంపిక చేస్తూ తుది జాబితా విడుదల చేసింది. మరో 32 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ భర్తీ చేయకుండా మిగిల్చింది. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్నీ భర్తీ చేసేవారు. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తర్వాత అర్హత ఉన్న అభ్యర్థికి ఆ పోస్టు కేటాయించేవారు. కూటమి ప్రభుత్వం అలాకాకుండా సంబంధిత అభ్యర్థి లేకపోతే అ పోస్టును వదిలేసి తరువాత డీఎస్సీలో భర్తీ చేస్తామని చెబుతోంది. నిరుద్యోగిత పెరిగిన పరిస్థితుల్లో 32 పోస్టులు మిగిల్చడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలువుల్లో చేరే వారికి శిక్షణ... కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 680 మంది అభ్యర్థులకు ఈ నెల 19న అపాయింటెంట్ అ ర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎంపికైన స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్జీటీ లకు శిక్షణ అనంతరం వారికి స్థానాలు కేటాయించి పంపనున్నారు. కొత్త ఉపాధ్యాయులంతా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరే అవకాశం ఉంది. మోగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది ఎంపిక జాబితా rpr://apdre. apcfrr.in నందు అందుబాటులో ఉంచాం. ఈ జాబితాపై సందేహాల నివృత్తికి డీఈఓ కార్యాలయంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం, వివరాలకు 995973222209, 9948112966 నెంబర్లకు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎంపికైన జాబితా వివరాలు... సబ్జెక్టు నోటిఫైడ్ ఎంపిక పోస్టులు చేసినవిఎస్ఏ సంస్కృతం 01 01 ఎస్ఏ తెలుగు 26 25 ఎస్ ఉర్దూ 07 06 ఎస్ఏ హింది 18 18 ఎస్ఏ ఇంగ్లీష్ 81 78 ఎస్ మ్యాథ్స్ 44 44 ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ 01 01 ఎస్ఏ పీఎస్ 29 29 ఎస్ఏ పిఎస్ ఉర్దూ 03 01 ఎస్ బయాలజీ 52 50 ఎస్ఏ బయాలజీ ఉర్దూ 02 02 ఎస్ఏ సోసియల్ స్టడీస్ 60 58 ఎస్ఏ ఎస్ఎస్ ఉర్దూ 05 05 ఎస్ఏ పిఈ 82 80 ఎస్జిటి తెలుగు మీడియం 256 254 ఎస్జిటి ఉర్దూ మీడియం 45 28 మొత్తం 712 680 ఎంపిక తుది జాబితా విడుదల డీఈఓ ఆఫీసు, కలెక్టరేట్ల వద్ద జాబితా ప్రదర్శన జిల్లాలో 712 పోస్టులకు 680 మంది ఎంపిక 19న కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెల 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ? -
7 నుంచి భవ్య గుజరాత్ యాత్ర
కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భవ్య గుజరాత్ యాత్రను చేపట్టనున్నామని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. కడప రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాత్రకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అక్టోబర్ 7 నుంచి 10 రోజులపాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నది తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణి కి వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని వివరించారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతోపాటు ప్రతి యాత్రికుడికి ప్రయాణ బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.18,400.. 3 టైర్ ఏసీ టిక్కెట్ రూ.ఽ30,200.. 2 ఏసీ టిక్కెట్ ధర రూ.39,900 గా నిర్ణయించారని తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం బి.యేసయ్య (9281495853), కె.పవన్కుమార్ ( 8287932313)లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ ప్రతినిధులు భాస్కర్ బాబు, యేసయ్య, ఈరన్న, దుర్గాప్రసాద్, ఇన్చార్జి స్టేషన్ మేనేజర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు
కనిష్(5 వికెట్లు) నిఖిల్గౌడ్(153 పరుగులు) వికాస్(109 పరుగులు) మహేంద్రారెడ్డి(239) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లో రెండో రోజున చిత్తూరు, అనంతపురం జట్లు భారీ స్కోర్లు చేశాయి. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 375 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 103.3 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని నిఖిత్ గౌడ్ అద్భుతంగా బ్యాంటింగ్ చేసి 22 ఫోర్లతో 153, బాలాజీ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని కనిష్ చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు, సాయి సూర్యతేజరెడ్డి రెండు, అక్షిత్రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 68 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 46, ధనుష్ నాయుడు 46 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బ్రహ్మ సాయి తేజ్రెడ్డి మూడు వికెట్లు తీశాడు. కర్నూలు జట్టు ఇంకా 236 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో...... వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 364 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 150.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 537 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని మహేంద్రారెడ్డి 30 ఫోర్లుతో అద్భుతంగా చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 239, వికాస్ 109 పరుగులు చేశాడు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ మూడు, నరసింహ రెండు, చెన్నారెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 29 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయరామిరెడ్డి 59 పరుగులు, భరత్రెడ్డి 40 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వండి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీ విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వాలని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ నిత్యానందరాజు అన్నారు. కడప ఎన్జీవో కాలనీలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో కేజీబీవీల ప్రిన్సిపళ్లతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో విద్యాపథానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముద్దమందారం పుస్తకాలు పిల్లలందరికీ చేరవేయాలని, వెనుకబడిన పిల్లలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. కాలనిర్ణయ పట్టికను ఖచ్చితంగా అమలుచేయాలని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డూటీల పట్టిక కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్ అవసరం వరకే వినియోగించాలన్నారు. ప్రతి కేజీబీవీలో జీసీడీఓ ఫోన్ నెంబర్ పిల్లలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రూత్ ఆరోగ్య మేరీ, వీరేంద్ర, శ్రీనివాసులురెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
ప్రొద్దుటూరు : గత ఏడాది ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 14లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ కూటమి ప్రభుత్వం అమలుచేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓ వైపు సీఎం చంద్రబాబునాయుడు, మరో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ లెక్కలేనన్ని హామీలిచ్చి ఉద్యోగులను మోసం చేశారన్నారు. గడిచిన 16 నెలల్లో 16 పైసలు కూడా ఇవ్వలేదని, వారికి మొత్తం రూ.32వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. డీఏ, అరియర్స్, జీఎల్ఐ, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలను నేటికీ పరిష్కరించలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చారన్నారు. ఆరు నెలలకోమారు డీఏ చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకూ నాలుగు డీఏ బకాయిలు ఇవ్వలేదన్నారు. వచ్చే జనవరి నాటికి ఐదో డీఏ ఇవ్వాల్సి ఉందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని అడిగినందుకు 38 మంది ఉద్యోగులను కూటమి నేతలు జైలులో పెట్టించారని తెలిపారు. పీఆర్సీ, ఐఆర్ చెల్లించలేదని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదన్నారు. ఉద్యోగుల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, డిమాండ్ చేశారు. వీడియో, టెలీ కాన్ఫరెన్స్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వహించకుండా వారి స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించడానికి ప్రయత్నిస్తే కనీసం వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానం అమలు చేయడం సబబుగా లేదన్నారు. ఈ సమావేశంలో మార్తల ఓబుళరెడ్డి, బాణాకొండారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, రాగుల శాంతి, లావణ్య, బలిమిడి వెంకటలక్ష్మి, భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, సత్యం, వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దుల రాయపురెడ్డి, జయంగమయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
మెప్మా ఆర్పీ చేతివాటం
● నకిలీ సంతకాలతో సీసీఎల్ రుణాలు స్వాహా ● పోలీసులను ఆశ్రయించిన మహిళలు బద్వేలు అర్బన్ : మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో ఓ ఆర్పీ చేతివాటం ప్రదర్శించింది. తన పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు సీసీఎల్ రుణాలు మంజూరు చేయించి అందులో వారికి తెలియకుండా కొంత మొత్తాన్ని స్వాహా చేసింది. మొత్తంగా 8 గ్రూపులకు సంబంధించి దాదాపు రూ.12 లక్షల మేర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా తెలుసుకున్న సంబంధిత స్వయం సహాయక సంఘాల గ్రూపు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. సీసీఎల్ రుణాలు స్వాహా మున్సిపాలిటీ పరిధిలోని శివానగర్ ఏరియాకు సంబంధించి మెప్మా ఆర్పీగా పనిచేస్తున్న భారతి తన పరిధిలోని పలు సంఘాలకు వివిధ బ్యాంకుల నుంచి సీసీఎల్ రుణాలు మంజూరు చేయించింది. సదరు రుణాలను మూడేళ్ల పాటు చెల్లించాల్సి ఉండగా ఏడాదిన్నర పాటు సంఘంలోని సభ్యులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే చెల్లించిన అప్పు మొత్తం నుంచి తిరిగి రుణం పొందే అవకాశం ఉండటంతో ఆర్పీ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. గ్రూపు సభ్యులకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి పలు సంఘాలకు మళ్లీ రుణం మంజూరు చేయించింది. అయితే సదరు రుణం గ్రూపు సభ్యులకు అందించకుండా స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బ్యాంకులకు రుణాలకు సంబంధించిన నగదును చెల్లించేందుకు వెళ్లిన ఆయా గ్రూపుల సభ్యులకు విషయం తెలియడంతో ఆర్పీని నిలదీశారు. అప్పట్లో కొన్ని గ్రూపులకు డబ్బులు చెల్లించి విషయం బయటికి పొక్కకుండా సద్దుమణిగింపజేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల గౌరీశంకర్నగర్కు చెందిన శంకర్ స్వయం సహాయక సంఘం, సరస్వతి స్వయం సహాయక సంఘంలకు చెందిన మహిళలు తమ పేరుతో తీసుకున్న రుణాన్ని చెల్లించాలని ఆర్పీని నిలదీయడంతో కొంత సమయం ఇవ్వాలని కోరింది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఇంటి వద్ద లేకుండా వెళ్లిపోయినట్లు మహిళలు గుర్తించారు. దీంతో చేసేది లేక అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం రుణాల పేరుతో ఆర్పీ డబ్బు స్వాహా చేసిన విషయమై ఇన్చార్జి మెప్మా మేనేజర్ కల్యాణ్బాబును వివరణ కోరగా ... రెండు నెలల క్రితమే బద్వేలు మెప్మా ఇన్చార్జి మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నా శివానగర్ ఏరియాలోని పలు గ్రూపులకు చెందిన ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులు రుణాల మంజూరులో ఆర్పీ చేసిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. మెప్మా పీడీకి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
కూటమి పాలనలో రైతులకు తీరని అన్యాయం
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖాజీపేట : కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా తీరని నష్టం జరిగిందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. తుడుమలదిన్నె సమీపంలో వంక దాటే క్రమంలో కింద పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మద్దూరి ఆదిరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు. రైతు రెండు ఎద్దుల వంకలో పడి మృతి చెందిన విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ తరఫున రూ.72 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ యూరియా కోసం సచివాలయాల వద్ద రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎప్పుడూ రైతులకు సమస్య లేదన్నారు. పంట నష్ట పరిహారం ఎప్పటికప్పుడు రైతులకు అందించేదని, ఇన్సూరెన్స్ పూర్తి ఉచితంగా ఇవ్వడమేగాక, గిట్టుబాటు ధర కల్పించి తమ ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, రైతుల పంటలకు సరైన ధర లేక తీవ్ర నష్టాలను చవిచూశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పేదలకు న్యాయం జరగదని పేదలకు వై ద్యం అందే పరిస్థితి లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే వైద్యం మరింత ఖరీదవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబటూరు ప్రసాద్రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పీవీ.రాఘవరెడ్డి, మురళీమోహన్రెడ్డి, నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, పత్తూరు వెంకటయ్య, రమణ, వెంకటసుబ్బయ్య, దుంపలగట్టు రామకృష్ణారెడ్డి, పోలు ఓబుల్రెడ్డి, శెట్టిపల్లె సిద్దారెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కమలాపురం : విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వంద శాతం అమలుచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. కమలాపురం సబ్ జైలులో ఉన్న దువ్వూరు మండలం ఇడమడకకు చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ను రఘురామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ బడిలో పంతులు విద్యార్థులకు అక్షరాలు నేర్పించినట్లు రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నేర్పిస్తున్నారని మండిపడ్డారు. మైదుకూరు ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, డాబా పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీకాంత్ను మర్డర్ కేసులో ఇరికించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కానుగూడూరుకు చెందిన ఓ వ్యక్తి, శ్రీకాంత్తో చాగలమర్రి పీఎస్ పరిధిలో వాగ్వివాదం చేసాడని, దీంతో దువ్వూరు పీఎస్లో శ్రీకాంత్పై 307 సెక్షన్తో కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి ఘటనలు, చిన్న ఘర్షణ కూడా జరగకపోయినా కేసులు నమోదు చేయడం అన్యాయం అన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరి కాదన్నారు. మీరు రెడ్ బుక్ రాసుకుంటే మేము బ్లూ బుక్లో రాసుకుంటున్నామని, వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. కూటమి నేతలు ప్రజల విశ్వాసం కోల్పోయారని, చంద్రబాబు, లోకేష్ తెలుసుకోక పోతే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సంబటూరు ప్రసాద్రెడ్డి ఆయన వెంట ఉన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
కడప రూరల్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.అచ్చయ్య తెలిపారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురుకులాల్లో పనిచేసిన సుమారు 550 మందికి, జిల్లాకు సంబంధించి 50 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉందన్నారు. 2018లో రిటైర్డ్మెంట్ అయిన వారి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదన్నారు. 50మంది బెనిఫిట్స్ అందుకోకుండానే వివిధ కారణాలతో మృతిచెందడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఉద్యోగ జీవితంలో 30–35 సంవత్సరాలపాటు పనిచేస్తేనే ప్రభుత్వం ఉద్యోగ విరమణ సమయంలో బెనిఫిట్స్ అందిస్తోందన్నారు. విజయవాడలోని తమ శాఖ ఉన్నతాధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిదులకు వినతిపత్రాలను సమర్పించామన్నారు. అంతేగాక మెడికల్ రీఎంబర్స్మెంట్ నిధులు అందకపోవడంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. ఉచిత పథకాలకు డబ్బులిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తైక్వాండో జిల్లా జట్టుకు ఎంపిక
అండర్–14 బాలుర విభాగంలో ఎంపికై న బాలలు రాష్ట్రస్థాయికి ఎంపికై న బాలికలు ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో మంగళవారం ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 బాల బాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జార్జికారొనేషన్ క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, ఈసీ మెంబర్ రామసుబ్బారెడ్డి, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటమురళీమోహన్, శివారెడ్డి, శివకృష్ణ, అల్లాబకాష్, రాఘవ తదితరులు పర్యవేక్షించారు. -
కురులు.. సిరులు
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో సంతాన దేవతగా ప్రసిద్ధి పొందిన శ్రీ రెడ్డెమ్మ తల్లి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి చైనాతోపాటు ఇతర దేశాలకు తలానీలాలు ఎగుమతి చేస్తుంటారు. నాణ్యమైన తలనీలాలు ఇక్కడ లభించడమే బయట దేశాల్లో డిమాండ్కు కారణం. ఈ నేపథ్యంలో పాటాదారులు పోటాపోటీగా వేలంలో అధిక ధర పెట్టి తలనీలాలు దక్కించుకుంటున్నారు. రెడ్డెమ్మకొండకు వచ్చే భక్తులంతా ఎక్కువగా సంతాన కోసం వచ్చేవారే. అందరూ 22 నుంచి 45 ఏళ్ల వయసులోపు మహిళలే కావడం విశేషం. ఇక్కడి ఆలయ పరిసరాల్లో పంపిణీ చేసే ఆకు పసరును సేవించి.. అమ్మవారి ఎదుట వర పడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన మహిళలతోపాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి భక్తితో తలనీలాలు సమర్పిస్తుంటారు. అందరూ యుక్త వయసులో ఉన్న వారు కావడంతో.. వారి తలనీలాలు ఎంతో నాణ్యమైనవిగా ఉంటాయనేది వ్యాపారుల నమ్మకం. అందువల్ల రెడ్డెమ్మకొండలోని తలనీలాలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. దీంతో ఇక్కడి ఆలయంలోని తలనీలాలకు భారీ డిమాండ్ ఉంది. అమ్మవారి ఆలయంలో లభించే తలనీలాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉండటంతో.. వేలం పాటలు రికార్డు స్థాయిలో పలుకుతుండటం గమనార్హం. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వేలం పాటలో పోటీ బాగా పెరిగింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు తరలివస్తారు. గతంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే వేలం పాట పాడేవారు. ఈ ఏడాది రూ.18.76 లక్షలకు వేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. భక్తుల కురులు సిరులు కురిపిస్తున్నాయి. రెడ్డెమ్మ తల్లి ఆలయ తలనీలాలు ఎక్కువ ధర పలుకుతున్నాయి. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. వేలంపాటలో పాటాదారులు పోటాపోటీగా పాల్గొంటున్నారు. అధిక రేటు హెచ్చించి కై వసం చేసుకుంటున్నారు. దేవస్థానానికి ఏటా భారీ ఆదాయం సమకూరుతుండటం విశేషం. మంచి డిమాండ్ ఉంది అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సారి వేలం పాటల్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొనడం ఇందుకు నిదర్శనం. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రెడ్డెమ్మకొండ తలనీలాలకు డిమాండ్ పెరిగింది. – మంజుల, ఈఓ, రెడ్డెమ్మకొండ రెడ్డెమ్మకొండ తలనీలాలకుభారీ డిమాండ్ చైనాకు ఎగుమతి రికార్డు స్థాయిలో వేలం -
ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !
కడప సిటీ : ఆ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు పైబడి అయ్యింది. రాకపోకలకు గ్రామసమీపాన ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో సమస్యలు తీవ్రతరంగా ఉండేవి. ఈ వంక పెద్ద ఎత్తున ప్రవహిస్తే మూడు రోజుల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయేవి. ఈ సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను వంకలో ప్రవహించే నీటిలోనే వదిలేసే దుస్థితి. ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వంక ప్రవాహం పెద్ద ఆటంకంగా మారి చదువులు కుంటుపడేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు... వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెకు అతి దగ్గరలో ఉన్న ఓబుల్రెడ్డిపల్లె. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఓబుల్రెడ్డిపల్లె గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు ఆ గ్రామ సమీపంలోని మొగమూరు వంక ప్రభావంతో వర్షాకాలంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండేవి. అప్పటి నుంచి 2022 వరకు ఆ గ్రామ సమస్యను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గ్రామమైనప్పటికీ ఏ నాయకులు వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు. పద్మవ్యూహంలాంటిది ఈ వంక వస్తే ఓబుల్రెడ్డిపల్లె వాసులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉండేది. అటు పాలగిరికి వెళ్లి మెయిన్రోడ్డుకు వచ్చేందుకు యేరు అడ్డు పడేది. నాగూరు మీదుగా వెళ్లి వేంపల్లెకు వెళ్లాలంటే పాములూరు వంక అడ్డుగా ఉండేది. ఈ వంక ప్రవాహం వస్తే ఎటువంటి రాకపోకలకు అవకాశమే లేదు. వంక ప్రవాహం తగ్గినంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. గొర్రెల కాపరులకు తప్పిన ప్రమాదం 2022 నవంబరులో ఓబుల్రెడ్డిపల్లె సమీపాన ఉన్న వంక ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. ఆ సమయంలో తండ్రీ కొడుకులు ఆవుల ఎర్రన్న యాదవ్, బాల మునీంద్రయాదవ్లు వంకకు పైన తమకు చెందిన గొర్రెలు ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు వంకను దాటాలని ప్రయత్నించారు. కాకపోతే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుని పోతుండగా, ఒక కంపచెట్టును ఆశ్రయించి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్పటి ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి దృష్టికి ప్రమాద ఘటన గురించి తెలియజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బోట్ల సాయంతో తండ్రీకొడుకులను ప్రాణాలతో రక్షించారు. వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం ఓబుల్రెడ్డిపల్లెకు గ్రామ పరిసరాల్లో ఉన్న మొగమూరు వంక వర్షాకాలంలో అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వంక భారీ స్థాయిలో వర్షాలు కురిసినపుడు మూడు, నాలుగు రోజుల వరకు ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వంకను దాటేందుకు వీలుగాక వంకనీళ్లలోనే మృతదేహాలను వదిలి అంత్యక్రియలను పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనేది. గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే చదువుకునే వీలుంది. 6వ తరగతి నుంచి పై తరగతులకు చదువుకునేందుకు వెళ్లేందుకు వేంపల్లె, వీరపునాయునిపల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. వంక ప్రవాహం వల్ల చదువులకు తప్పని తిప్పలు కొనసాగేవి. చదువులు కుంటుపడేవి. కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్ ఊరి మేలు కోసం వంతెన నిర్మాణం చేపట్టిన వీరయ్య యాదవ్ ఎన్నిమార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వం బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ చివరకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మాటలతోనే సరిపెట్టారు. ఈ నేపధ్యంలో వీరయ్య యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఎక్కడ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో బిల్లులకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనపెట్టి గ్రామ సమస్యను తీర్చేందుకు చేపట్టిన వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 2023 నవంబరులో ఎట్టకేలకు ఆ గ్రామస్తుల ఇబ్బందులు తొలగేందుకు వంకకు అడ్డంగా వంతెన నిర్మా ణం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ పట్టుదలతో వంతెన నిర్మాణానికి సీఎండీఎ ఫ్, జీజీఎంపీ కింద రూ. 57 లక్షలు మంజూరైంది. ఇది లా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఒక్క పైసా కూడా వీరయ్య యాదవ్కు అందలేదు. కానీ ఊరి మేలు కోసం ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో ఆ గ్రామానికి 200 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం వంక నీళ్లలోనే మృతదేహాలను వదిలేసే దుస్థితి చదువులకూ తప్పని తిప్పలు వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం తొలగిన అన్ని ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బిల్లులు మంజూరు కాకపోవడంతో కోర్టు మెట్లెక్కిన వైనం -
అన్ని ఇబ్బందులు తీరాయి
ప్రధానంగా ఈ వంక ప్రవాహం వల్ల వర్షాకాలంలో మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లాలన్నా దిక్కుతోచని పరిస్థితి. వంక ప్రవాహం తగ్గినంత వరకు ఎక్కడికి వెళ్లేందుకు వీలుండేది కాదు. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తి కావడంతో అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి. – నీలం శివగంగరాజు, ఓబుల్రెడ్డిపల్లె వంతెన నిర్మాణం చేపట్టకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారం. రాకపోకలకు తీవ్ర సమస్యగా ఉండేది. ముఖ్యంగా విద్యార్థులకు వీఎన్ పల్లె, వేంపల్లె పాఠశాలల్లో చదువుకునే వారికి ఆటంకం కలిగేది. ఈ వంతెన నిర్మాణం వల్ల మృతదేహాలకు అంత్యక్రియలు, విద్యార్థుల చదువులకు, రాకపోకలకు ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి. – కొండెబోయిన గంగన్న, ఓబుల్రెడ్డిపల్లె వందల సంవత్సరాలుగా ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో ఎంతో ఇబ్బందులు పడేవారం. నేను ఇబ్బంది పడినప్పటికీ మా గ్రామానికి స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించేందుకు వంతెన నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి రూ. 57 లక్షలు మంజూరు కాగా, వంతెన నిర్మాణం కూడా పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బిల్లుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు సవాలక్ష కారణాలు చెబుతూ కాలాయాపన చేస్తూ రావడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. – బత్తల వీరయ్య యాదవ్, మాజీ ఎంపీపీ, ఓబుల్రెడ్డిపల్లె -
డీఎస్సీలో మూడో ర్యాంక్ సాధించిన హేమలత
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరానికి చెందిన హేమలత 43 ఏళ్ల వయసులో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు విభాగంలో మూడో ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 2004లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానన్నారు. వివాహం అయ్యాక తన భర్త పల్లేటి శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్స్కూల్ టీచర్గా పనిచేశానన్నారు. 2012 డీఎస్సీలో సైన్స్ సబ్జెక్టు దరఖాస్తు చేసినప్పుడు డిగ్రీలో తన సబ్జెక్టులు బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కావడం, బోటని లేదా జువాలజీ ఉండాలన్న నియమంతో తన దరఖాస్తు రిజెక్ట్ అయిందన్నారు. తర్వాత ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసి 2018 డీఎస్సీలో 20వ ర్యాంకు సాధించాను. కానీ కేవలం రెండే పోస్టులు ఉండటంతో తనకు జాబ్ రాలేదన్నారు. అనంతరం ఇంటర్ కాలజీ ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తూ 2025 డీఎస్సీకి ప్రయత్నించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషులో 3వ ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించానన్నారు. ఎంఈడీ కూడా పూర్తి చేశానన్నారు. తన పెద్దకుమారుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, రెండో కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడన్నారు. వ్యవసాయం చేస్తూ తనకు సహాయ సహకారాలు అందించిన తన భర్త ప్రోత్సాహాన్ని, తన తల్లి సహకారాన్ని మరువలేనన్నారు. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తాం
కడప అర్బన్ : జిల్లాలో పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత నమ్మకం పెంపొందించేలా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలతో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ(ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు దారెడ్డి భాస్కర్ రెడ్డి, శివ శంకర్ నాయక్ పాల్గొన్నారు. విధుల్లో అలసత్వం తగదు జిల్లాలో ప్రజా సమస్యలపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం ఉండరాదని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇతర ప్రత్యేక విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ జిల్లాలో పర్యటించి శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ● పోలీసుల అధికారుల సంఘం నాయకులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, వైస్ ప్రెసిడెంట్ శంకర్,స్టేట్ కో– ఆప్షన్ నెంబర్ ఎస్ఎం. డి. షఫీవుల్లా, ఆర్ ఎస్ ఐ రామస్వామి రాజు, ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ ఏప్రిన్, మాధవి లత పాల్గొన్నారు. ● జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు ప్రజాసమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో డీఆర్వో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అర్జీల విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, ఎస్డీసీ వెంకటపతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఇవీ వినతులు ● లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన తోట వెంకటకృష్ణ అనే వ్యక్తి మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఊర్లో ఉన్న తమకు చెందిన భూమిని ఆక్రమించుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని, సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ● పొద్దుటూరు మండలం నడింపల్లి కి చెందిన షేక్ షాహిన అనే మహిళ భర్తను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నానని, నాకు ప్రభుత్వం మంజూరు చేసే వితంతు పింఛను మంజూరు చేయించాలని అర్జీని సమర్పించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు -
మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం
పులివెందుల : పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే.. వద్దని వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వమిదని కూటమిపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో పూర్తయిన నిర్మాణాలు, ఆసుపత్రి భవనాలు, నర్సింగ్ కళాశాలను పరిశీలిస్తూ.. పూర్తయిన భవనాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం వారు మెడికల్ కళాశాల ఎదురుగా.. కళ్లు ఉండి చూడలేని సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, పులి సునీల్కుమార్, వేముల సాంబశివారెడ్డి, సర్వోత్తమరెడ్డి, రసూల్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, పులివెందుల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి కాకపోతే.. సీట్లు ఎలా కేటాయిస్తారు? పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయిస్తే.. కూటమి వద్దని వెనక్కి పంపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థ వచ్చి చూసి 50 సీట్లు కేటాయించిందంటే.. మెడికల్ కళాశాల పూర్తయినట్లా, పూర్తి కానట్లా? మెడికల్ కళాశాల పూర్తి కాకపోతే ఈ కళాశాలకు 50 సీట్లు ఎందుకు కేటాయిస్తారు. కోట్లు వెచ్చించి నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన విద్య, వైద్యం అందిచ్చాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం ఏమిటి? – రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు విష ప్రచారం 2024 మార్చిలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభించారు. కాలేజీ, హాస్పిటళ్లకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వైఎస్సార్సీపీ పాలనలోనే వచ్చేసింది. రోజుకు ఓపీ 500 నుంచి 1000 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. టీడీపీ ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్సీని పంపించి పులిందుల మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని విష ప్రచారం చేయిస్తోంది. ప్రజలను మభ్యపెట్టాలని చూడటం తగదు. – ఎస్బీ అంజద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎంజగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే.. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు. – రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మైదుకూరు పులివెందుల మెడికల్ కళాశాల 90 శాతం పూర్తి కేవలం రూ.120 కోట్ల మేర పనులు పెండింగ్ ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి అలుపెరగని పోరాటాలతో అడ్డుకుంటాం వైఎస్సార్సీపీ నాయకులు -
యూసీఐఎల్ అధికారుల తీరుపై ఆందోళన
పులివెందుల టౌన్ : తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం కె.కె.కొట్టాల గ్రామస్తులు యూసీఐఎల్ అధికారులపై మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చిన్నయ్య నేతృత్వంలో యూసీఐఎల్ అధికారులు జీఎం సుమన్ సర్కార్, డీజీఎం విజయకుమార్, భూసేకరణాధికారి నవీన్ కుమార్రెడ్డితో గ్రామస్తులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ టైలింగ్ పాండ్, ఇతర కారణాల వల్ల తమ గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎస్ఆర్ నిధుల కింద ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తమ గ్రామంలో అవసరమైన తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. తాజాగా టైలింగ్ పాండ్ నిర్మాణం ఎత్తు పెంచుకుంటూ పోతున్నారని, దానివల్ల తమ గ్రామస్తులకు జరిగే అన్యాయం, కష్టం, నష్టం గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, పునరావాసం కింద తమకు తగిన వసతులు కల్పించి, గ్రామం మొత్తాన్ని యూసీఐఎల్ పరిధిలోకి తీసుకుని తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యూసీఐఎల్ జీఎం సమాధానమిస్తూ గ్రామస్తుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చిన్నయ్య, డీజీఎం విజయకుమార్, భూసేకరణ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, ఆలూరు రాజేష్ బాబు, సర్పంచ్ రంగనాథం, మోహన్ బాబు, రాజేష్, శివ పాల్గొన్నారు.సమస్యలు పరిష్కరించాలని కె.కె.కొట్టాల వాసుల డిమాండ్ -
ముంపు.. ముప్పు
● ముంచుకొస్తున్న సోమశిల వెనుక జలాలు ● ఆగిన వాహన రాకపోకలు ● 28 గ్రామాల ప్రజలకు అవస్థలుఅట్లూరు : వేగంగా వస్తున్న ముంపు జలాలతో.. ముప్పు పొంచి ఉంది. సోమశిల జలాశయంలో రోజురోజుకు నీరు పెరుగుతోంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువలో ఉంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా జలాలు వస్తున్నాయి. వేములూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్ వంతెన పైకి సోమశిల వెనుక(ముంపు) జలాలు ముంచుకొస్తున్నాయి. లోలెవల్ వంతెన నీట మునగడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 28 గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 69 టీఎంసీలు దాటితే సగిలేరు నది వంతెనపైకి చేరుతాయి. ప్రస్తుతం సోమశిలలో 74.5 టీఎంసీలు ఉన్నాయి. దీంతో సోమవారం నాటికి వంతెనపైకి మూడు అడుగుల మేర నీరు చేరింది. చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి మండల నడిబొడ్డున సగిలేరు ఉంది. ఈ నదికి తూర్పు భాగాన కమలకూరు, మణ్యంవారిపల్లి, మాడపూరు, కామసముద్రం, వేమలూరు, ముత్తుకూరు గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 28 గ్రామాలు ఉన్నాయి. అలాగే పడమర భాగాన 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల కార్యాలయాలతోపాటు పోలీస్స్టేన్ సహా సగిలేరు నదికి పడమర ఉన్న మండల కేంద్రమైన అట్లూరులో ఉన్నా యి. సాధారణంగా ఆ గ్రామాల వారు మండల కేంద్రమైన అట్లూరుకు ఆరు కిలో మీటర్ల దూరం ప్రయాణించే వెళ్లే వారు. కానీ వంతెన నీట మునగడంతో.. బద్వేలు మీదుగా వెళ్లాల్సి రావడంతో 40 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తోంది. రైతులకు తప్పని తిప్పలు సగిలేరు నదికి ఇరువైపులా కొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వంతెనపై నీరు చేరవడంతో.. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. నడములలోతు వరకు నీరు వచ్చింది. ప్రమాదం అని తెలిసినా కొంత మంది అదే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికై నా సగిలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు. -
ఆర్టీపీపీ నుంచి గుట్టుగా స్క్రాప్ తరలింపు
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిశ్రమ నుంచి గుట్టు చప్పుడు కాకుండా పాత ఇనుము (స్క్రాప్)ను కొందరు బయటికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు కొన్నేళ్ల కిందట పూర్తి అయ్యాయి. అందులో భాగంగా స్క్రాప్ (పాత ఇనుప ముక్కలు) నిలువ పేరుకుని పోయింది. అయితే ఇలా పక్కన పడి ఉన్న స్క్రాప్ను పరిశ్రమ యజమాన్యం టెండర్ల ద్వారా అమ్మకం వీలు ఉన్నప్పటికీ.. ఏ కారణం చేతనో చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు స్క్రాప్పై కన్నేశారు. సంబంధిత అధికారులకు రాజకీయ వత్తిళ్లు కూడా లేకపోలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్క్రాప్ బయటకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కార్మిక వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆర్టీపీపీ నుంచి బయటికి వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని పట్టుకోవడం, వదిలి పెట్టడటం కూడా జరిగిందని తెలుస్తోంది. సంబంధిత అధికారులపై రాజకీయ వత్తిళ్లు రావడంతో ఆ వాహనాన్ని వదిలేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పట్టుకున్న వాహనం సచివాలయ వద్ద ఉంచి మంతనాలు చేసిన తర్వాత.. వదిలి వేసినట్లు సమాచారం. కూటమి నేతలు ఆర్టీపీపీని ఆదాయ వనరుగా మర్చుకున్న విషయం బహిరంగ రహస్యం. ఆర్టీపీపీలో పని చేస్తున్న కొందరి సహాయ సహాకారాలు ఉండటం వల్ల స్క్రాప్ సులువుగా బయటకు పోతుంది. ఆర్టీపీపీ ప్రధాన గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని, ఏ విధంగా బయటికి పోతుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయినా ఏ కారణం చేతనో సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు విధినిర్వహణలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావును వివరణ కోరాగా.. ఆరా తీస్తామన్నారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేస్తామని, సంబంధిత వారిపై చర్యలు ఉంటాయన్నారు. అనంతరం కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా ఆర్టీపీపీలోని అన్ని విభాగాల అధికారులతో సంప్రదించి విచారణ చేస్తామన్నారు. ఆర్టీపీపీ అధికారులు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై పచ్చ మూకల దాడి
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని చక్రాయపేట మండలంలో పచ్చ మూకలు బీభత్సం సృష్టించారు. చిలేకాంపల్లె నారపురెడ్డి వారి పల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆదినారాయణ రెడ్డిపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన పలువురు అల్లరి మూకలతో కలిసి కాపుకాచి ఆదినారాయణరెడ్డిపై దాడి చేశారు. ఆదినారాయణ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు పాలైన ఆదినారాయణ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై టీడీపీకి చెందిన పలువురు అడ్డగించి మరీ దాడి చేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ నేతలు ఇవాళ (సోమవారం) సందర్శించారు. మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 90 శాతం మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రూ.532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో కేవలం దాదాపు రూ.120 కోట్ల రూపాయలు పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని.. ఆ పనులు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలను సందర్శించి ఫేస్ 3,4 నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని ఆవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్వయంగా పరిశీలించి 50 సీట్లకు పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చిందని.. అధికారంలో ఉన్న చేతకాని ప్రభుత్వం మెడికల్ సీట్లను వెనక్కి పంపిందన్నారు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి నీచ పనులు చేసిందని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ భాష, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాపై పోలీసులు దాడి చేశారు
కడప అర్బన్ : హోటల్లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో పోలీసుల ఆకస్మిక తనిఖీలుకడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్, అప్సర సర్కిళ్లలో ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలు, ఆర్టీసీ బస్టాండ్లో సోదాలు జరిపారు. ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా వాహనాలను నడిపేటపుడు నిబంధనలను పాటించాలన్నారు. లాడ్జీలలో గదులను అద్దెకు ఇచ్చేటపుడు గుర్తింపుకార్డును తీసుకోవాలని సూచించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం
కడప అర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కడప నగర శివారులో 2006లో 230 ఎకరాల్లో రిమ్స్ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలతో 452 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 40.81 కోట్ల వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 107 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల కేన్సర్ హాస్పిటల్కు 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబుతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియా బృందంతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలలకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆ పార్టీ నేతలు సులి సునీల్కుమార్, షేక్ షఫీ, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డితోపాటు పలువురు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తే ఊరుకోం కార్పొరేట్ వ్యక్తులకు కూటమి దోచిపెట్టే యత్నం సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకువైఎస్ఆర్ పేరు తొలగింపుపై ఆగ్రహం రిమ్స్ను పరిశీలించినవైఎస్ఆర్సీపీ నేతలు -
108 సిబ్బంది లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేది..
108 సిబ్బంది లేకుంటే, నా భార్య, బిడ్డ నాకు దక్కని పరిస్థితి. సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. పురిటినొప్పులతో భార్య తల్లడిల్లిపోతోంది. ఇక్కడే డెలివరీ చేయండని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది, రేపు సాయంత్రం వరకు కాన్పు జరిగే అవకాశం లేదు. తిరుపతికి వెళ్లండని పంపేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులో ఉండి, అందులో వెళ్లాం కాబట్టి సరిపోయింది. అదే వైద్యుల మాట విని బస్సులో వెళ్లి ఉండి ఉంటే, మా పరిస్థితి ఏమయ్యేది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏమాత్రం బాగోలేవు. – సాగర్, గర్భిణి భర్త -
వంకలోపడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి
కొండాపురం : అప్పటి వరకు కళ్ల ముందు నవ్వుతూ ఆటలాడుతున్న కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మండలంలోని దత్తాపురం పునరావాస కేంద్రంలోని వంకలో పడి ఎనిమిదేళ్ల బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దత్తాపురం గ్రామానికి చెందిన పాపన్నగారి గుణదీపక్(8) మూడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి సరదగా వినాయకుని విగ్రహం తయారు చేసుకోవడానికి బంకమట్టికోసం వంక దగ్గర తీసే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో పడి పోయాడు. కుటుంబీకులు గుర్తించేలోగానే బాలుడు మృతిచెందినట్లు స్థానికులు తెలిపా రు. తల్లిదండ్రులు గంగాధర్, గీతలు గుండెలవిసేలా ఏడ్చారు. బాలుడు మృతితో గ్రా మంలో విషాదచాయలు అలుముకున్నాయి.ఉత్సాహంగా క్రీడా ఎంపికలుప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జి కారొనేషన్ క్లబ్లో ఉమ్మడి కడప జిల్లా ఎస్జీఎఫ్ఐ అండర్–19 బాలబాలికల రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు తమ నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈనెల 23 నుంచి 26 వరకు కాకినాడ, రాజమండ్రిలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఫెన్సింగ్ పోటీలకు 28 మంది క్రీడాకారులు పాల్గొనగా 14 మంది, రైఫిల్ షూటింగ్లో 16 మంది పాల్గొనగా 9 మంది, టేబుల్ టెన్నిస్లో 17 మందికి గాను 10 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలను జార్జికారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ అండర్–19 జిల్లా సెక్రటరీ చంద్రమోహన్ రాజు, కోచ్ రాఘవ, అల్లాబకాష్, శివారెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
చాలీ చాలని జీతాలతో చాకిరి
కడప ఎడ్యుకేషన్ : సమగ్రశిక్ష, విద్యా శాఖలో అత్యంత కీలకంగా పనిచేసే చిరుద్యోగులైన సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో చాకిరీ చేస్తూ కుటుంబాలను భారంగా మోస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరకులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఏ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ చాలీచాలని జీతాలతో జీవితాలను ఏ విధంగా సాగించాలని మదిలో మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించకుండా, ఉద్యోగుల మధ్య వేతన అసమానతలను పెంచే విధంగా ఈ జీవో నంబర్–2ను అమలు చేస్తోంది. ఈ జీఓ కేవలం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీయడమేగాక, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖలో.. జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రంలో 156 మంది సీఆర్ఎంటీలు, 19 మంది మండల లెవల్ అకౌంటెంట్స్, 34 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 ఉండేది. ఆ తర్వాత వీరికి 2020లో గత వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 23,500కు వేతనం పెంచింది. ఆ తరువాత అధికారంలోకి కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని, 2025 జనవరి, 6వతేదీన జీవో నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగ కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని, కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీఓ ఉద్దేశమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని వారు తెలిపారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సరిపోవడంలేదని వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పుచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను విరివిగా పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులు, ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యులకు వద్ధాప్యం పింఛన్ తొలగించారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచింది. కానీ ఈ సౌకర్యం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వర్తింప యకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. అనేక సంవత్సరాలుగా తక్కువ జీతంతో పనిచేస్తూ, ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా, రిటైర్ అయ్యేసరికి కుటుంబానికి భారం అవుతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆందోళన చెందుతున్నారు. వీరికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లానే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు, గ్రాట్యూటీ, పెన్షన్ పథకం లేదా ఉద్యోగ భద్రతకు దారిచూపే ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కనికరించని ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం మరిచిన ప్రభుత్వం ఆరేళ్లుగా వేతనం పెంపుకోసం ఎదురుచూపు -
కడప టు బీహార్!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుడ్న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు డైరెక్ట్ కనెకివిటీ రైలు ఉమ్మడి కడపజిల్లా రైలుమార్గంలో నడవలేదు. బీహార్లోని రక్సౌల్ నుంచి చర్లపల్ల్లి (తెలంగాణ) వరకు ఆరేళ్లుగా రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ను జిల్లా రైలుమార్గంలో తిరుపతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి కడప జిల్లా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు నేరుగా బీహార్ నుంచి చర్లపల్లి మీదుగా జిల్లా రైలుమార్గం గుండా తిరుపతికి చేరనుంది. ఇప్పటి వరకు గూడూరు జంక్షన్ నుంచి ఉమ్మడి కడప జిల్లా వాసులు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టాలు పడేవారు. రేణిగుంట–విజయవాడ మార్గంలోని గూడూరు జంక్షన్కు వెళ్లి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ జంక్షన్ ఉమ్మడి కడప జిల్లా వాసులకు చాలా దూరం. కడప నుంచి గూడూరుకు 141 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడుగంటలకు పైగా సమయం పడుతుంది. ఏ రైలుకు వెళ్లాలన్న గూడూరు జంక్షన్కు 4 గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్ల ప్రయాణం తప్పడం లేదు. ● 07052/51 నంబరుతో నడిచే రైలును రక్సౌల్(బీహార్) నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రక్సౌల్కు పొడిగించారు. గుంతకల్, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నారు. ● ఝార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగమైన బైద్యనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు వీలు కలుగుతుంది. ● బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని ధన్బాద్, రాంచీ, జాసిద్, ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్ పట్టణాలకు మార్గం సుగమమం కానుంది. ● ఉత్తర తెలంగాణతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానంగా ఈ రైలును నడవనుంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట, తర్పూర్కాగజ్ నగర్లకు చేరుకోవచ్చు. డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్క్లియర్ ఉమ్మడి కడప జిల్లా లైన్లో రక్సౌల్–చర్లపల్లె వీక్లీ 20 నుంచి తిరుపతి వరకు పొడిగింపు -
ప్రభుత్వ రంగాలను కూటమి అమ్మేందుకు తెరలేపింది
సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు. అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాకుండా బిల్డింగ్లు నిర్మించి, వాడుకలోకి తీసురావాలని భావించారు. నిజాన్ని అబద్ధం చేయాలనుకోవడం సరికాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెబుతారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్
మదనపల్లె సిటీ : విద్యార్థుల్లో దాగిన ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్వో, బార్క్, డీఆర్డీవో, ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, ఉపకారవేతనం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది. ’కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్తంగా పరీక్ష నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్సైట్లో రూ.200 రుసుం చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. వివిధ స్థాయిల్లో పరీక్ష వివిధ స్థాయిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సత్యేంద్రనాథ్, బోస్ జీవిత చరిత్ర, లాజికల్ థింకింగ్, రీజనింగ్ తదితర సబ్జెక్టుల్లో బహుళైచ్చిక విధానంలో ప్రశ్నలుంటాయి. వీవీఎం పరీక్ష సంబంధించి విద్యార్థులు మొదట పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా పరీక్ష రాయవచ్చు. విద్యార్థి ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో, సెల్ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ల ద్వారా పాల్గొనవచ్చు. ఆంగ్లం, హిందీతో పాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. ప్రతిభ చూపిన విద్యార్జులకు స్థాయిని బట్టి ద్రువపత్రాలు,నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ప్రధానోపాధ్యాయుల కృషి అవసరం విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – భాస్కరన్, డివిజన్ సైన్సు అధికారి, మదనపల్లెవిద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు -
వైద్యులు చేతులెత్తేస్తే..108 సిబ్బంది పురుడు పోశారు
మదనపల్లె రూరల్ : జిల్లా ఆస్పత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు.. తాము కాన్పు చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. గర్భిణిని తిరుపతికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్ వద్ద 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కనపరిస్తే.. 108 సిబ్బంది పురుడుపోశారని మహిళ కుటుంబీకులు చేతులెత్తి దండం పెట్టారు. వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె పంచాయతీ కత్తిరివారిపల్లెకు చెందిన సాగర్ భార్య భాగ్యమ్మ(20) రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు మదనపల్లె మండలం బసినికొండలో ఉంటోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు పురిటినొప్పులు మొదలవడంతో 108 వాహనం బసినికొండకు చేరుకుని భాగ్యమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చారు. వార్డులోకి తీసుకెళ్లేందుకు వీల్ఛైర్ లేకపోవడంతో కుటుంబసభ్యులు నొప్పులు పడుతున్న మహిళను నడిపించుకునే తీసుకెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సింగ్ సిబ్బంది నామమాత్రపు పరీక్షలు చేసి తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్టీ రెడ్డి జశ్వంత్, పైలట్ సద్దాం గర్భిణి ప్రసవవేదనను గమనించి, ఈ స్థితిలో తిరుపతికి తరలిస్తే మార్గమధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్పత్రిలోనే కాన్పు చేయండంటూ అభ్యర్థించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చికిత్స గురించి మీరు చెప్పేదేంటి. ఆమెకు రక్తం ఆరు పాయింట్లు ఉంది. మేం రెఫర్ చేస్తే తీసుకెళ్లడం మీ బాధ్యత. తీసుకువెళ్లండంటూ గదమాయించారు. చేసేదేమీలేక 108 సిబ్బంది భాగ్యమ్మను తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో భాకరపేట ఘాట్ సమీపంలో 108 వాహనంలోనే 3.5 కిలోల బరువున్న మగపిల్లవాడికి జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రసవానంతర చికిత్సలు అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు. -
పేదలకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను నిర్మింపచేసి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లారు. కానీ చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ల విభాగం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
ఫేక్ సర్టిఫికెట్లతోనే రిజిస్ట్రేషన్
ప్రొద్దుటూరు : వంశపారంపర్యంగా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులను తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి అమ్ముకోవడం ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారింది. ఒకరి ఆస్తి మరొకరికి మారాలంటే ఎన్నో రకాల నిబంధనలున్నాయి. అయితే అన్నింటినీ సులువుగా తయారు చేసి నకిలీ ముఠా కోట్ల రూపాయల ఆస్తులకు కన్నం వేస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన గంజికుంట సుబ్బరాయుడు ఆస్తే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ట్ అయిన ఆయనకు 1986లో మైదుకూరు రోడ్డులోని ఎన్జీఓ ప్లాట్లలో ప్లాట్ నంబర్ 300ను కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయన తన ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నారు. తరచూ తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసుకోవడం జరుగుతోంది. చుట్టుపక్కల వారు చెప్పడంతోనే ప్రస్తుతం తన ఆస్తిని మరొకరికి దొంగగా రిజిస్ట్రార్ చేయించారని బయటపడింది. ఫేక్ సర్టిఫికెట్ల ముఠా ఉందా.. గంజికుంట సుబ్బరాయుడతోపాటు ఆయన సతీమణి లక్ష్మీదేవి మరణించినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించడం హైదరాబాద్కు చెందిన వ్యక్తికి సుమా రు రూ.2 కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సజీవంగా ఉన్న సుబ్బరాయుడుతోపాటు ఆయన సతీమణి రిజిస్ట్రేషన్లో డెత్ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఈ డెత్ సర్టిఫికెట్లు మున్సిపాలిటీ నుంచి జారీ చేయలేదు. కేవలం సొంతంగా ఫేక్ డెత్ సర్టిఫికెట్లను తయారుచేసి అమ్మడం జరిగింది. ఈ సర్టిఫికెట్లలో సూచించిన 2015, 2017 సంవత్సరాలలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అప్పట్లో రఘునాథరెడ్డి లేరు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో రఘునాథరెడ్డి బదిలీపై వచ్చి వెళ్లారు. కాగా ప్రతి ఎన్జీఓ ప్లాట్కు సంబంధించి ప్రొద్దుటూరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ నుంచి లేఖను జారీ చేసిన తర్వాతే ప్లాట్ను అమ్ముతున్నారు. ఈ ప్లాట్ అమ్మకానికి సంబంధించి కూడా ఆగస్టు నెల 8న సంఘం కార్యదర్శి సాల్మన్ లేఖ ఇచ్చినట్లు పొందుపరిచారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఫేక్ సర్టిఫికెట్ల ముఠా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.కోట్ల రూపాయల ఆస్తులకు కన్నం -
వైఎస్ఆర్ పేరు తొలగింపు సరికాదు
ఉమ్మడి రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు కట్టించి, వైద్య సేవలు అంచిందిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. నాలుగు జిల్లాలకు నడిబొడ్డున రిమ్స్ను ఏర్పాటు చేశారు. అనంతరం రిమ్స్ను అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించారు. మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించి జగన్ జాతికి అంకితం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరు తీసేయడం సిగ్గు చేటు. దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి. –కె.సురేష్బాబు, నగర మేయర్, కడప -
టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకోండి.. కోర్టు సంచలన తీర్పు
సాక్షి, టాస్క్ఫోర్స్: తీసుకున్న అప్పును చెల్లించని కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో పాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించింది.వివరాల ప్రకారం.. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్కు చెందిన పృధ్వీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని సర్వే నంబర్ 670/ ఏ1సీ1, 2 ఎకరాల ఆస్తి (కామిశెట్టి కాలేజీ)ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు చెందిన పృధ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు తీర్పు ఇచ్చింది.ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 16న ఉదయం 10 గంటలలోపు సదరు ఆస్తిని పృధ్వీ కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. రాధా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు బద్వేలి శ్రీనివాసులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మీనా, ఓబుళమ్మ, ఇంద్ర, ఉమాదేవి, హరినాథరెడ్డి, సుదర్శన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, శివారెడ్డి, నైనితారెడ్డి, విజయశేఖర్రెడ్డి, రఘునాథరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. -
తప్పు మీద తప్పు!
సాక్షి ప్రతినిధి, కడప: సోమశిల బ్యాక్ వాటర్ ముంపు పరిహారం చెల్లింపులో అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. అవార్డు అయిన తర్వాత కూడా పరిహారం చెల్లించడం ఒక ఎత్తయితే, అక్రమంగా పొందిన పరిహారానికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించడం మరో ఎత్తు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సులతో తప్పులను సైతం అడ్డుకోలేక చేష్టలుడిగి జిల్లా స్థాయి అధికారులు ఉండిపోయారు. మరోవైపు అత్యున్నత స్థాయి అధికారి సిఫార్సులు తోడు అవడంతో రూ.1.75కోట్లు అక్రమంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సన్నహాలు పూర్తి అయ్యాయి. ● సోమశిల బ్యాక్ వాటర్ 14వ రీచ్లో అట్లూరు మండలం చెర్లోపల్లె గ్రామంలో 254 ఇళ్లుకు ముంపు పరిహారం లభించింది. 6700 చదరపు మీటర్లు ఇళ్లున్నాయని గుర్తించి రూ.1.17 కోట్లు చెల్లించారు. అవార్డు అయిన తర్వాత వ్యవసాయ పొలంలో అవసరాలకు నిర్మించుకున్న నాలుగు ఇళ్లుకు పరిహారం చెల్లించాలని విన్నపం తెరపైకి వచ్చింది. అప్పట్లో మాజీ మంత్రి వీరారెడ్డి సిఫార్సులతో ఆ నాలుగు ఇళ్లుకు రూ.84లక్షల పరిహారం చెల్లించారు. అంతటితో ఆగకుండా తర్వాత మరో కొత్త కథ తెరపైకి తెచ్చారు. హైకోర్టు రిట్ ఫిటిషన్ 282/2010 ప్రకారం ఇచ్చిన తీర్పు మేరకు తమకు వడ్డి చెల్లించాలంటూ తాజాగా తెరపైకి తెచ్చారు. అందుకు అధికార పార్టీకి చెందిన నోరున్న ఎమ్మెల్యే తోడయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిఫల్ సెక్రెటరీ సానుకూలత లభించింది. ఎవరి వాటా వారికి అప్పగించేందుకు ముందుకు రావడంతో వడ్డీ రూపేనా రూ.1.75కోట్లు సొమ్ము చేసుకునేందుకు సన్నహాలు దాదాపు పూర్తి అయ్యాయని సమాచారం. సోమశిల బ్యాక్ వాటర్ అవార్డు అయిన తర్వాత ముంపు పరిహారం ఆపై వడ్డీ చెల్లించాలని మరో విన్నపం ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో సిఫార్సులు రూ.1.75 కోట్లు అక్రమంగా కొట్టేసేందుకు వేగంగా అడుగులు అధికారపార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో చేష్టలుడిగిన అధికారులు చెర్లోపల్లిలో అక్రమంగా ప్రజాధనం కొట్టేసేందుకు పన్నాగం ఒంటిమిట్ట మండలం బందారుపల్లెలో అవార్డు అయిన తర్వాత డబ్బులు చెల్లించలేదు. దాంతో రద్దు కావడంతో తిరిగి అవార్డు చేశారు. రెండేళ్లు కాలం గడిచిపోవడంతో ఆ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లిస్తున్న పరిహారానికి వడ్డీ కూడా జమ కట్టాలని కోరారు. ఆమేరకు హైకోర్టులో రిట్ ఫిటిషన్ 282/2010 దాఖలయ్యింది. విచారించిన హైకోర్టు రెండేళ్లు ఆలస్యంగా డబ్బులు ఇచ్చిన కారణంగా వారికి వడ్డీ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ సాకు చూపెట్టి అట్లూరు మండలం చెర్లోపల్లెలో వడ్డీ పేరుతో ప్రజాధనం కొల్లగొట్టేందుకు సన్నహాలు చేశారు. అంతే కాకుండా కొత్త రేట్లు ప్రకారం పరిహారం ఇస్తే వడ్డీ చెల్లించరాదని ఉత్తర్వులు సైతం ఉన్నాయి. కొత్త రేట్లు ప్రకారం పరిహారం పొందినప్పటికీ తిరిగి వడ్డీ చెల్లించాలంటూ సిఫార్సులు ఆరంభించి దాదాపు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఒకమారు అవార్డు అయిన గ్రామంలో తిరిగి ఇళ్లు నిర్మించి పరిహారం కొత్త రేట్లుతో పొందారు. రూ.84లక్షలు 2014లో పరిహారం పొందిన నేపధ్యంలో 1996 నుంచి 2013 వరకూ వడ్డీ చెల్లించాలని సిఫార్సులు చేపట్టారు. అధికారులు తప్పు మీద తప్పుకు ఆస్కారం ఇస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సిఫార్సులు చేయడంతో ప్రజాధనం దుర్వినియోగం కానుంది. అక్రమార్కులు ముంపు పరిహారం పొందడంలో అడ్డదారులతో సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. -
జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో 14 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు స్థానచలనం, నియామకం చేస్తూ శనివారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ను నియమించారు. ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం ఇంటలిజెన్స్ విభాగంలో అధికారిగా విధులను నిర్వహిస్తున్నారు. నేడో, రేపో ఆయన జిల్లాకు విచ్చేసి ఎస్పీగా బాధ్యతలను చేపట్టనున్నారు. నియమితులైన ఏడు నెలలకే ఎస్పీ ఈ.జీ అశోక్కుమార్ బదిలీ.... వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా నియమితులైన ఈ.జీ అశోక్కుమార్ 2025 జనవరి 24న విధుల్లో చేరారు. గతంలో కడపలో డీఎస్పీగా పనిచేసిన ఈజీ అశోక్కుమార్ మరలా జిల్లా ఎస్పీగా నియమితులై విధుల్లో చేరినపుడు ఒకవైపు ప్రజలు, మరోవైపు అధికారులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లామీద పట్టువున్న అధికారిగా విధులను నిర్వహిస్తారని భావించారు. అనుకున్నట్లుగానే శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో విధులను నిర్వహించారు. కానీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ, ఇతర అంశాలు అభద్రతా భావాన్ని నెలకొల్పాయి. ఐపీఎస్ అధికారుల నియామకంలో బదిలీ అయిన అధికారుల జాబితాలో ఈయన పేరును ప్రస్తావించలేదు. కానీ ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది నియామకాల జాబితాలో ఈ.జీ అశోక్కుమార్ పేరు రావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎస్పీ అశోక్కుమార్ బదిలీ ఏడు నెలలకే జరగడం అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలి రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికంగా పనిచేస్తున్న ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. నియమితులైన ఏడు నెలలకే ఎస్పీ అశోక్కుమార్ బదిలీ -
నమో నారసింహా
గుర్రంకొండ: నమో నారసింహా అంటూ భక్తులు గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివారిని కొలిచారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో తరిగొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రాత్మాక గుర్రంకొండ కోటలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో వేకువజామేన అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప రూరల్: ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రాలలో 474 వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్, డాక్టర్ రవిబాబు, రమేష్, మనోరమ, భారతి, ఖాజా తదితరులు పాల్గొన్నారు. నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర మంత్రి రామ్దాసు అథవాలే అక్టోబర్ 4, 5 ,6 తేదీల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించ నున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు. శనివారం కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మూడవ సారి కొనసాగుతున్నదని తెలిపారు. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి, తిరుమల దేవస్థానాన్ని సందర్శించ నున్నారని, అక్కడ ఆయనకు ఘనంగా సన్మానం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళగిరిలోని సికే ఫంక్షన్ హాలులో మంత్రి అథవాలే చేతుల మీదుగా వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం
పులివెందుల : రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైఎస్సార్ వేషధారణలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అనంతపురం సభలో చంద్రబాబు పాడేరు మెడికల్ కళాశాల మినహా, ఎక్కడ వైద్య కళాశాల నిర్మాణం జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను నివృత్తి చేసేందుకే అందరికీ వైద్య కళాశాల చూపుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గతంలో ఉండేవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. గతంలో రోగులను అత్యవసర పరిస్థితిలో రాష్ట్రంలో సరైన వసతులు లేక హైదరాబాద్, చైన్నె. బెంగుళూరు ప్రాంతాలకు అంబులెన్స్లలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. సరిహద్దులలో అంబులెన్స్లు ఆపి రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలని చెప్పారన్నారు. దీంతోపాటు చాలామంది మెడికల్ కళాశాల బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. దీంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో ఐఆదు మెడికల్ కళాశాలలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, మరో నాలుగు మెడికల్ కళాశాలలు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది మెడికల్ కళాశాలల ప్రారంభాలను ఆపి ప్రస్తుతం వాటిని పీపీపీ విధానం పేరుతో ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి నాయకులు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా కృషిచేస్తామన్నారు. -
అండర్–19 తైక్వాండో పోటీలకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రైల్వే కోడురూలో నిర్వహించిన అండర్–19 తైక్వాండో పోటీలలో కడప విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి చంంద్రమోహన్రాజు పేర్కొన్నారు. తైక్వాండో 44 కిలోల విభాగంలో నాగమోక్షిత, 55 కిలోల విభాగంలో పీవీఎస్.రెడ్డెమ్మ, 59 కిలోల విభాగంలో కెఆర్.సరయురెడ్డి బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర 54 కిలోల విభాగంలో కెఆర్.సాత్విక్రెడ్డి, 85 కిలోల విభాగంలో మునిచైతన్య బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి విజయభాస్కర్ వెంకటేష్, శారద, కోచ్లు, తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలిపై వానరం దాడి రాజంపేట రూరల్ : 75 ఏళ్ల వృద్ధురాలు మన్నూరు చెంగమ్మపై వానరం దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని ఎగువ మందపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ దాడిలో చెంగమ్మకు కుడి మోచేయి వద్ద నరం కట్ అయినట్లు ఆమె బంధువులు తెలియజేశారు. చెంగమ్మ రాజంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వానరాల సంచారంపై ప్రజలు పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొలేదన్నారు. ఇప్పటికై నా వానరాలను పట్టి అడవిలో వదిలేయాని కోరారు. 14005 కేసులకు పరిష్కారం – రూ.9,94,86,943 కక్షిదారులకు చెల్లింపు కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్లో 14005 కేసులు పరిష్కరించి, కక్షిదారులకు రూ.9,94,86,943 చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కడపలో నాలుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలో మూడు చొప్పున, బద్వేల్లో రెండు, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు మరియు రైల్వే కోడూరులో ఒకటి చొప్పున బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్లో లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి కేసులను పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరి బాబా ఫకృద్దీన్లు కేసుల పరిష్కారానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం అనుమతించినా.. ఫలితం లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీిసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఏపీఎస్సార్టీిసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం సీఎం గత నెల 28న ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. సంబంధిత జీఓను టిఆర్–బి అధికారులు జీఏడీకి పంపినా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి మొండి వాదనలు చేస్తూ ఫైల్ కదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 6000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆరోపించారు. 11వ పీఆర్సీకి సంబంధించి 24 నెలల అరియర్స్, నాలుగు డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. సీ్త్రశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతంగా నడవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవలేదని అన్నారు. వెంటనే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పి.సుబ్రహ్మణ్యంరాజు, సి.నబీరసూల్, కె.మద్దిలేటి, కె.అర్జున, పి.ఏ.మజీద్, యన్.విజయకుమార్, సి.వి.మురళీధరన్, వి.వెంకటేశ్వర్లు, ఏ.మురగమ్మ, కె.బి.నాగార్జున రెడ్డి, యస్.ప్రసాద్ బాబు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రెజరర్ నాగేంద్రప్రసాద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు -
సెయిల్ కంపెనీలో చోరీ
కొండాపురం : సెయిల్ కంపెనీలో వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. టి.కోడూరు సమీపంలోని సెయిల్ కంపెనీలో శుక్రవారం రాత్రి సోలార్ కాపర్ ప్లేట్ల చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్ఐ రాయపాటిబాసు వివరాల మేరకు.. సెయిల్ కంపెనీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు, మరో వ్యక్తి కలిసి సోలార్ కాపర్ ప్లేట్లను చోరీ చేశారు. టి.కోడూరు గ్రామానికి వచ్చే రోడ్డు వద్ద తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందన్నారు. సంస్థ సెక్యూరిటీ ఇన్ఛార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. కరస్పాండెంట్పై పోక్సో కేసు మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్స్టేషన్కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కాలువలో పడ్డ స్కార్పియో పులివెందుల రూరల్ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్, శ్రీనివాసనాయక్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్నాయక్, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్ ఏస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న స్కూల్ బస్సుల వేగం జీవీ సత్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్జెండర్ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నగదు ఇవ్వమన్నందుకు దాడి మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్వలిలపై దాడి చేయించాడు. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందారు. ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : మండలంలోని ఓ మహిళఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతోంది. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
బీటెక్ విద్యార్థికి రూ.61 లక్షల పరిహారం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లను పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి వడ్ల సుమంత్కు రోడ్డు ప్రమాద పరిహార క్లెయిమ్ కింద రూ.61లక్షల చెక్ను మెగా లోక్ అదాలత్లో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి శనివారం అందజేశారు. వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన సుమంత్ బీటెక్ చదువుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 5న చిన్నాన్న సుధాకర్తో కలిసి బైక్లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. పని ముగించుకొని ప్రొద్దుటూరుకు బయలుదేరారు. సుధాకర్ బైక్ నడుపుతుండగా సుమంత్ వెనుక కూర్చున్నాడు. పోట్లదుర్తి వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వస్తున్న టిప్పర్ వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సుమంత్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. వెంటనే అతడిని కర్నూలుకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రెఫర్ చేశారు. వారికి సుమారు రూ.40 లక్షలకు పైగా ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాఽధితులు కోర్టులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ను దాఖలు చేశారు. మెగా లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, భాధితులకు రాజీ కుదరడంతో కోర్టు సూచన మేరకు చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం కింద బీటెక్ విద్యార్థి సుమంత్కు రూ.61 లక్షల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎస్కే రియాజుద్ధిన్, కంపెనీ న్యాయవాది రాజశేఖర్రెడ్డి, సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
కాయ్ రాజా కాయ్
క్రికెట్ బెట్టింగ్ అనగానే గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ బెట్టింగ్కు ఈ పట్టణం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. మ్యాచ్లు ప్రారంభమైతే చాలు పోలీసులు నిఘా పెట్టడం.. ప్రతి రోజూ బుకీల అరెస్ట్ చేయడం తరచూ జరుగుతోంది. తాజాగా కాయ్ రాజా కాయ్ అంటూ యాప్లపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో ఈసారైన అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ● ప్రొద్దుటూరు క్రికెట్ బుకీలకు కళ్లెం వేసేది ఎవరు? ● ఆసియా కప్ టీ20 టోర్నీతో జోరందుకున్న బెట్టింగ్ ● నేడు ఇండియా–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పట్టణంలో ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ అంటే టీవీ, మొబైల్ పోన్లు, రాసుకోవడానికి నోట్ బుక్కులు, లైన్బాక్స్ సెటప్ ఉండేది. వీటన్నింటినీ ఒక గదిలో ఏర్పాటుచేసుకొని లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ బెట్టింగ్ రాసేవాళ్లు. ఇందుకోసం గుమస్తా, డబ్బు వసూలు చేయడానికి బాయ్లను పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి నియమించుకునేవారు. ఐపీఎల్, వరల్డ్కప్ లాంటి వరుస క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలోనూ బుకీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకునేవారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న డబ్బునేగాక బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసేవారు. సొంతంగా యాప్ల నిర్వహణ కొన్నేళ్ల తర్వాత టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్ మొబైల్తో టెక్నాలజీని క్రికెట్ బుకీలు ఉపయోగించారు. కొన్నేళ్ల నుంచి ఈ పద్ధతి ఆన్లైన్లో జోరుగా సాగుతోంది. వారిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇటీవల బెట్టింగ్ యాప్లు పెరిగిన నేపథ్యంలో యువత సులభంగా డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. యాప్ల నుంచి ఆదాయం వస్తుండటంతో ప్రొద్దుటూరు బుకీల చూపు ఈ యాప్లపై మళ్లింది. లక్షల రూపాయలు వెచ్చించి కొందరు బుకీలు యాప్లను కొనుగోలు చేశారు. వాటి ఐడీలను తమ ముఖ్య అనుచరులకు ఇచ్చి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. యాప్ల ద్వారా బుకీలు రూ.కోట్లు ఆర్జించినట్లు టాక్ నడుస్తోంది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నాలుగైదేళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త చట్టంతో చెక్ పడుతుందా? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోండి.. రండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. మీ ఫోన్లో ఆడుతూ రూ.వేలు, లక్షలు జేబులో వేసుకోండి శ్రీ అంటూ సినిమా హీరోలు, ఇతర సెలబ్రెటీలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపించేవి. వీటికి ఆకర్షితులైన యువత బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. ఐపీఎల్ లాంటి వరుస మ్యాచ్లు జరిగినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరులో ఓ యువకుడు బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు నెలల క్రితం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 23 మందిని అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదు చేశారు. అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లను చెక్పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును గత నెల 20న లోక్సభ ఆమోదించింది. ఆన్లైన్ గేమ్లను నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. గేమింగ్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజీ టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్కు ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రూ.వందల కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో బుకీలు ఆన్లైన్లో పందేలు నిర్వహిస్తారా లేక ఆఫ్లైన్లో ఆడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రొద్దుటూరు బుకీల ఆగడాలను పోలీసులు నిలువరిస్తారో లేదో చూడాలి మరి. -
ఆటో మిత్ర పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆటోమిత్ర పథకం కింద ఆర్థిక సాయం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కోరారు. ఆటో రిక్షా/మోటార్ క్యాబ్ /మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ యజమానులకు 2025– 26వ సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.15000 సాయం అందించేందుకు మార్గ దర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. వాహన యజమాని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనమై ఫిట్నెస్ సర్టిఫికెట్, మోటార్ వాహన టాక్స్ కలిగి ఉండాలన్నారు. ప్యాసింజర్ ఆటో రిక్షా దారులు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, తెల్లరేషన్కార్డు కలిగి ఉండడంతోపాటు ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుడి కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కారాదని, ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండరాదని, 300 యూనిట్ల కరెంటు వినియోగించేవారై ఉండరాదని అన్నారు. శానిటరీ పని చేసేవారికి మినహాయింపు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తడి పొలం మూడు, డ్రైలాండ్ అయితే పదెకరాలు, మున్సిపాల్టీ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ మీటర్ల స్థలం ఉండే అభ్యర్థులు ఈ పథకానికి అనర్హులన్నారు. అర్హులు ఉంటే ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీలోపు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న జాబితా ప్రకటిస్తారని, అర్హులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు అందిస్తారని వివరించారు. డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్ కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి నాలుగు, సాబ్జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది. వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..... వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం దక్కించుకుంది. -
టీడీపీ వారికే డైరెక్టర్ పదవులా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే రిమ్స్లో డైరెక్టర్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారన్నారు. అయితే ఆ సంబంధాలు దెబ్బతినేలా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కడప పరిస్థితిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదని, ప్రస్తుతం బీజేపీ, జనసేనను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటికై నా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు, బీజేపీ నాయకులు శివనాయక్, రమణ చారి, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి -
ప్రమాదమా.. హత్యాయత్నమా..?
● జేఎన్టీయూ హాస్టల్ వార్డెన్కు తీవ్ర గాయాలు ● అందుబాటులోకి రాని 108 వాహనం పులివెందుల : పట్టణంలోని ఎర్రగుడిపల్లెకు చెందిన ఆనందరావు పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆనందరావు జేఎన్టీయూ సమీపంలో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన తన ద్విచక్ర వాహనంతో సహా గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నాలు చేశారు. పోలీసు సిబ్బందికి, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో పులివెందుల ట్రైనింగ్ ఎస్ఐ అనిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తే ఆనందరావు బైకు అదుపు తప్పి ప్రమాదం జరిగిందా లేకపోతే ఎవరైనా వ్యక్తులు దాడి చేశారా అనేది అనుమానాం కలుగుతోంది. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందుబాటులోకి రాని 108 వాహనం : జేఎన్టీయూ సమీపంలో తీవ్రంగా గాయపడిన ఆనందరావును స్థానికులు గుర్తించి 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే సంఘటన జరిగిన అర్ధ గంటసేపు అయినా కూడా 108 వాహనం చేరుకోలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అటువైపు వస్తున్న వాటర్ క్యాన్ ఆటోలో క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆనందరావు పూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆనందరావు కోలుకుంటే ప్రమాదమా.. హత్యాయత్నమా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సీతారామిరెడ్డి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.