YSR
-
No Headline
సాక్షి ప్రతినిధి, కడప: ‘అధికారులు అవినీతికి పాల్పడోద్దు. నిజాయితీగా విధులు నిర్వర్తించండి. అధికారులపై అవినీతి ఆరోపణలు అధికంగా వస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, హెల్త్, హౌసింగ్, విద్యుత్, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బి, రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ శాఖల పరిధిలో అవినీతి ఆరోపణలు నాదృష్టికి వచ్చాయి. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇకపై నాదృష్టికి వస్తే అదే ప్రజలచే ఏసీబీకి పట్టిస్తా...’ ఇటీవల ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ నోటి నుంచి జాలువారిన మాటలివి. ● కూటమి ప్రభుత్వంలో అవినీతి తారా స్థాయికి చేరిందని ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ మాటలు చెప్ప కనే చెబుతున్నాయి. దాదాపు అన్ని శాఖలల్లో అవి నీతి అధికారులు తిష్టవేసి ఉన్నట్లు స్వయంగా ధ్రువీకరించారు. అధికారులు సరే.. మరి ‘తెలుగు తమ్ముళ్లు’ చేస్తున్న అవినీతి కనిపించలేదా.. వారు చేస్తున్న ఆక్రమణల గురించి చెప్పరా అంటూ కూటమిలోని బీజేపీ నేతలు, ప్రజలు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్యాదవ్ ప్రజావసరాలకు అనుగుణంగా మెలగడం సమాజానికి శ్రేయష్కరమే. మరి పేదలకు అందించే రేషన్ బియ్యంతో మొద లు పెడితే అనేక విషయాల్లో తన అను చరులు తల దూరుస్తున్నారు. సామాన్యుల నోటికాడి కూడు లాగేస్తున్నారు. యథేచ్ఛగా దోపిడీ చర్యలను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడంలో కూడా ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి కదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతిలో మునిగి తేలుతున్న తమ్ముళ్లను కాదని... అధికారులపైనే ఆరోపణలు చేయడం.. వారిని భయపెట్టించడమేనని తూర్పార బడుతున్నారు. ‘పుట్టా వారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అధికారుల్లో అవినీతి పేట్రేగిపోతోందని పుట్టా వ్యాఖ్య దందాలతో మునిగితేలుతున్న పచ్చ నేతలనుకట్టడి చేయని వైనం ‘తమ్ముళ్ల’ ఆక్రమణలపైఎమ్మెల్యే దృష్టి సారించాలంటున్న మైదుకూరు వాసులు -
అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!
●నిబంధనలకు విరుద్ధంగా.. ‘ హలో సార్... మీ పాప రమ్య పదవ తరగతి చదువుతున్నది కదా..! ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలానా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఎంసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్ను విజిట్ చేసి చూడండి ’ . ‘సార్ గుడ్ ఈవినింగ్, సురేష్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా. బీటెక్ కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్సు, ఏఐఎంల్, డేటా సైన్సు, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే చెప్పండి... రాయితీలు ఇప్పిస్తాం’... మదనపల్లె సిటీ: టెన్త్, ఇంటర్ చదవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి , ఇంటర్మీ డియట్ కు సంబంధించి వేలాది మంఇ రాస్తున్నారు. కనీసం వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాకముందే కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేటతో పాటు మండల కేంద్రాల్లో సైతం బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి... తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లు కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజినీరింగ్ కాలేజీలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షలో ఫీజులు బాదేస్తున్నారు. మరో వైపు పీఆర్ఓలు... తిరుపతి, విజయవాడ కేంద్రాల కార్పొరేట్ కాలేజీల తరపున వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆయా విద్యా సంస్థల పీఆర్ఓలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కాలేజీల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీ పడుతున్నారు. పరీక్షల కంటే ముందే అడ్మిషన్ల కోసం తంటాలు ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సుల పేరిటముందస్తు దోపిడీ తల్లిదండ్రులకు పెరిగిన ఫోన్ల తాకిడి సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈ సారి గత ఏడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కాలేజీలు సిద్ధమయ్యాయి. -
హంస వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథుని కాంప్లెక్స్లో ప్రాచీన దేవాలయమైన శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బుధవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పగలు శ్రీర ంగనాథస్వామికి ఆలయ ప్రదాన అర్చకులు కృష్ణరాజేష్శర్మ విజేష పూజలు జరిపించారు. చక్రస్నానం చేయించారు. శ్రీరంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. స్వామి వారికి భక్తులు కాయ కర్పూరాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పులివెందుల వాల్మీకి నాట్యమండలి వారిచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటక ప్రదర్శన నిర్వహించారు. పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధీకర్రెడ్డి, ఈఓ కెవి రమణలు, సభ్యులు పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు -
‘స్టాఫ్ నర్స్’ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
కడప రూరల్: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ జాబితాను సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోపు తమ అభ్యర్థనలను తెలపాలని సూచించారు. 28వ తేదీన ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వివరించారు. 23న హాకీ సీనియర్ పురుషుల జిల్లా జట్టు ఎంపిక పులివెందుల టౌన్: పట్టణంలోని స్థానిక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టర్బ్ హాకీ గ్రౌండ్లో ఈనెల 23న ఆదివారం ఉదయం హాకీ సీనియర్ పురుషుల జిల్లా జట్టు ఎంపికలు జరగనున్నాయని హాకీ జిల్లా సెక్రటరీ ఎం.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న హాకీ క్రీడాకారులు మార్చి 6 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పురుషుల హాకీ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఎంపికలకు పాల్గొనే క్రీడాకారులు 01–01–1991 తర్వాత 31–12– 2005 ముందు జన్మించి ఉండాలని వివరించారు. క్రీడాకారులు ఒరిజనల్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. రేపు జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: పోరుమామిళ్ల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఈనెల 21వ తేదిన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ నిర్వహించే ఈ జాబ్మేళాలలో నవత ట్రాన్స్పోర్టు కంపెనీలో క్లర్క్, డ్రైవర్, క్లీనర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అలాగే డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలాకాలింగ్ ఆఫీర్, ఎల్ఐసీలో బీమా సాక్షి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.. ఎంపికైన వారికి రూ.7 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనం హోదాను బట్టి లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఫర్నీచర్ సరఫరాకు కొటేషన్లు ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: కడప స్పెషల్ పొక్సో కోర్టు కోసం కొత్త ఫర్నీచర్ వస్తువుల సరఫరా కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి జి. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని టాక్స్లతో కలుపుకొని 7 ఐరన్ అల్మారాలు, 1ఐరన్ ర్యాక్, 8 ఆఫీసు టేబుల్స్, 3 కుషన్ ఛైర్స్, 30 ‘ఎస్’ౖ టెప్ మార్క్ ఛైర్స్, ఒక క్రోన్ చైర్, 5 ఐరన్ స్టూల్స్, 2 కోట్ హాంగర్స్, 3 ఉడెన్ బెంచులు, ఒక సోఫా సెట్, 5 టీ పాయి, ఒక డ్రైనింగ్ టేబుల్, ఒక ప్లాస్టిక్ చైర్ మొత్తం 13 రకాల ఫర్నిచర్ వస్తువుల కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామన్నారు.టెండరుదారు సమర్పించే కొటేషన్ కవరు పైన ‘కొటేషన్ ఫర్ సప్లయ్ అండ్ ఇన్స్ట్రాలేషన్ ఫర్ ఫర్నీచర్ ఐటమ్స్’అని రాయాలన్నారు. నమోదు చేసిన సంబంధిత షీల్డు కొటేషన్లను ఈనెల 21వతేది సాయంత్రం 5 గంటల లోపు. ప్రిన్సిపల్ డీస్ట్రిక్ట్ కోర్టు, కడపలో సమర్పించాలన్నారు. వివరాల కోసం వెబ్ సైట్ కడప.డికోర్ట్సు,జీఓవీ.ఇన్లో చూడవచ్చని, అలాగే 08562–254963 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లాకు యూరియా రాక కడప అగ్రికల్చర్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు బుధవారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందులో వైఎస్సార్జిల్లాకు 1300 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 1000 మెట్రిక్ టన్నల యూరియాను మార్క్ఫెడ్కు అలాట్ చేసినట్లు వివరించారు. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మార్క్ఫెడ్కు 300 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించామని పేర్కొన్నారు. రైతులు యూరి యా కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరావు తెలిపారు. -
● ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు...
చాపాడు మండలంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటీవల బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు ఎల్సీ గోపాల్రెడ్డి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు అందించాల్సిన రేషన్ బియ్యం పంపిణీ, తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రధానంగా రేషన్షాపు డీలర్లు టీడీపీ నేతలే ఉన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా సైతం మైదుకూరు నియోజకవర్గంలో తిష్ట వేసి ఉంది. అందులో దువ్వూరు మండలంలోని టీడీపీ వర్గీయుడు గిరియాదవ్ పోలీసులకు సైతం పట్టుబట్టారు. చిన్నసింగనపల్లెకు చెందిన మరో టీడీపీ వర్గీయుడు ఏకంగా డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారిపై బెదిరింపులకు దిగారు. ● అంతేనా టీడీపీ నేతలు భూ ఆక్రమణలకూ తెరతీశారు. ఏకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ చెరువులను చెరబట్టారు. వంకలను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ, పరంబోకు భూములు స్వాహా అవుతోన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుతమ్ముళ్లు నేతృత్వంలో తెరపైకి వస్తున్నాయి. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అవే విషయాలు పత్రికల్లో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధిగా పుట్టా సుధాకర్యాదవ్ స్పందించాలి కదా... కట్టడి చేయాలి కదా... అంటూ విపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించి నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రీ సర్వేపై అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డితో కలిసి సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లో భూముల రీ సర్వే పై ప్రత్యేక శ్రద్ధ వహించి పకడ్బందీగా నిర్వహించాలని, నివేదికలు పంపాలన్నారు. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. భూముల రిసర్వే ప్రక్రియ రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమని అన్నారు. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కడప కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజలకు పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్క రూ నిబద్ధతతో పనిచేయాలన్నా రు. రెవెన్యూ శాఖలో ఎక్కడా కూడా పెండింగ్ అంశాలు లేకుండా చూడాలన్నారు. భూ రికార్డు లను సంతృప్తి కరంగా ఏలాంటి లోటుపాట్లను లేకుండా అప్డేట్ చేయాలన్నారు. ఇందుకు ఆయా తహసీల్దార్, వీఆర్ఓలు బాధ్యత వహించాలని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చిత సమాధానం ఇవ్వాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, సర్వే ల్యాండ్ అధికారి, రెవెన్యూ అధికారులు, పాల్గొన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలి కాశినాయన:రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేసీ అదితిసింగ్ పేర్కొన్నారు. బుధవారం తహసీల్దారు కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు నరసింహులు, ఆర్ఐ అమర్నాఽథ్ రెడ్డి పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
చికెన్, గుడ్లను నిర్భయంగా తినొచ్చు
● జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ కడప అగ్రికల్చర్: జిల్లాలో బర్డ్ప్లూ లేదని మాంస ప్రియులు చికెన్, గుడ్లను బాగా ఉడికించుకుని నిర్భయంగా తినొచ్చని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ సూచించారు. బుధవారం నగరంలోని రాజీమార్ మార్గ్లో కలెక్టర్ ఆదేశానుసారం బర్డ్ప్లూపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బర్డ్ప్లూపై వస్తున్న వదంతాలను ఎవరు నమ్మొద్దన్నారు. జిల్లాలో ఎక్కడ బర్డ్ప్లూ లేదన్నారు. ఈ విషయమై జిల్లాలో రాపిడ్ రిస్కు టీమ్స్ను ఏర్పాటు చేసి ప్రతి మండలంలో ప్రజలకు సూచనలు, సలహాలను ఇస్తున్నామని వివరించారు. అనంతరం చికెన్ లాలిపాప్స్ను తెప్పించి పశువైద్యాధికారులు తినడంతోపాటు అక్కడకు హాజరైన జనాలకు తినిపించారు. జిల్లాలోకి చనిపోయిన కోళ్లు సరఫరా కాకుండా ఉండటానికి మార్కెటింగ్, ట్రాన్స్పోర్టు, మైనింగ్, పోలీసు చెక్ పోస్ట్ వారికి గట్టి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అఽధికారి అయితా నాగేశ్వరావు, పీవీపీ ఏడీలు రంగస్వామి, సుబ్బరాయుడు, పశువైద్యాధికారి డాక్టర్ అనుపమ, జేవీఓ రాజశేకర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పటిష్టంగా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఆశోక్ కుమార్ పేర్కొన్నారు. పొలతల క్షేత్రంలోని పర్యాటక భవనంలో బుధవారం సాయంత్రం ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాన్ని పెంచి వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. అలాగే ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయించాలన్నారు. ముఖ్యంగా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఈఓ కృష్ణానాయక్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని రాజ్యలక్ష్మి, తహశీల్దార్ అనురాధ, ఎంపీడీఓ జగన్మోహన్రెడ్డి,ఆర్టీసీ, అటవీ అధికారులు పాల్గొన్నారు. -
● గ్రామాల్లో బెల్ట్ట్షాపులు..
మైదుకూరు నియోజకవర్గంలో మద్యం యధేచ్ఛగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు తిష్టవేశాయి. చివరికి బ్రహ్మంగారిమఠం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా బెల్ట్షాపులు వెలిశాయి. ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని స్వయంగా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికై నా బెల్డ్ షాపు బ్రహ్మంగారిమఠంలో కట్టడి చేశారా? అంటే లేదు. కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే స్థాయికి అది ఎంత పని? వాస్తవంగా ఎకై ్సజ్, పోలీసులు అధికారులు తనిఖీలకు వెళితే ఎమ్మెల్యే సహాయకుడు నుంచి వెంటనే అధికారులకు ఫోన్ వస్తున్నట్లు పలువురు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారులు వాపోతున్నారు. అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయాలని భావించి చర్యలు చేపడితే ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు నుంచి ఫోన్లు వస్తున్నట్లు వాపోతున్నారు. నిజంగా మైదుకూరులో అవినీతి అధికారులు తిష్టవేసి ఉన్నారా...అధికారులను బెదిరించి దారికి తెచ్చుకోవాలనే తపనతో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారా...అన్న విషయం సందిగ్ధంగా ఉందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అవినీతి అధికారులు తిష్టవేసి ఉంటే అలాంటి వారికి పోస్టింగ్ ఇప్పించిన నాయకులెవ్వరు? విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. అధికారుల విధులకు పాలకపక్షం ఆటంకం కల్గించకుంటే అదే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు వివరిస్తున్నారు. -
విద్యార్థుల వినూత్న నిరసన
ప్రొద్దుటూరు రూరల్: మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలలో విద్యార్థులు బుధవారం స్టైఫండ్ ఇంగ్లీషు అక్షరాల ఆకారంలో నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పశువైద్య కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ స్టైఫండ్ పెంచాలని 17 రోజుల నుంచి నిరసన చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. స్టైఫండ్ పెంచాలి.. ప్రభుత్వం స్పందించాలి.. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి అని వారు నినాదాలు చేశారు. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు తమ సమస్యను వివరిస్తామన్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థులకు సమానంగా తమకు స్టైఫండ్ పెంచి ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. -
అవమానించిందని మహిళ హత్య
వేముల : మండలంలోని కె.కె.కొట్టాల సమీపంలో ఈ నెల 2న జరిగిన సింగంశెట్టి పద్మావతి హత్య కేసును పోలీసులు చేధించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఉలసయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కె.కె.కొట్టాల గ్రామానికి చెందిన సింగంశెట్టి పద్మావతి గ్రామ సమీపంలో ఎనుములు మేపుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వెళ్లారన్నారు. పద్మావతిని చంపి ఆమె శరీరంపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారన్నారు. మృతురాలి కుమార్తె గోగుల దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం గాలించామని తెలిపారు. మృతురాలు సింగంశెట్టి పద్మావతి తనను అవమానకరంగా మాట్లాడుతుండడంతో చంపాలని సింగంశెట్టి రమేష్ నిర్ణయించుకున్నాడన్నారు. ఈ నెల 2న ఎనుములు మేపుకొనేందుకు పద్మావతి వెళ్లగా.. అక్కడికి వెళ్లిన రమేష్ చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు ధరించి తలపై దాడిచేసి చంపాడన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాల కోసం చంపారనుకునేలా మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించాడన్నారు. బుధవారం ముద్దాయి సింగంశెట్టి రమేష్ను అరెస్టు చేసి అతని వద్ద బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు -
అరటి తోటకు నిప్పు.. రూ.3 లక్షల నష్టం
వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె సమీపంలో కొందరు ఆకతాయిలు తన అరటి తోటకు నిప్పుపెట్టినట్లు ఎరబ్రోయిన రవి తెలిపారు. బాధితుడి వివరాల మేరకు.. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రబోయినరవి వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ పొలాల్లో మూడు ఎకరాల్లో అరటితోట సాగు చేస్తున్నారు. ఈ తోటకు సమీపంలో కొందరు ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండెకరాల్లో అరటి చెట్లు, ప్లాస్టిక్ పైపులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. కాలిపోయిన అరటి పంటను హార్టికల్చర్ సిబ్బంది శివ పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందించాలని కౌలు రైతు కోరారు. అగ్నికి ఆహుతైన అరటి పులివెందుల రూరల్ : గుర్తు తెలియని వ్యక్తులు బీడు భూమికి నిప్పంటించడంతో మంటలు వ్యాపించి అరటి తోటలో 46 చెట్లు దగ్ధమయ్యాయి. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడు ఎరబ్రండ కొత్తపల్లిలో ఆరు ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. తోట పక్కన బీడు భూమి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పంటించారు. మంటలు వ్యాపించి రైతుకు చెందిన అరటిచెట్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.60 వేల పంట నష్టం జరిగిందని రైతు చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బంగారం రికవరీ పేరిట మాకు వేధింపులా?
కడప కల్చరల్ : చోరీ జరిగిన బంగారాన్ని రికవరీ చేయడం పేరిట బంగారు దుకాణ యజమానులను వేధించడం సమంజసం కాదని కడప జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జరుగు రాజశేఖర్రెడ్డి అన్నారు. వైవీ స్ట్రీట్లో కడప జ్యువెలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ గత కొద్దికాలంగా పోలీసు యంత్రాంగం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, కడపలోని ఏ నగల దుకాణ వ్యాపారి దొంగ బంగారాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బంగారు కొనుగోలు విషయంలో ఇలాంటి అనర్థాలు వస్తాయనే విషయం తమకు తెలుసని, అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. దొంగ బంగారం కొనుగోలు చేసినట్లు పెద్ద మొత్తంలో రికవరీ చేస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఎవరికై నా ఇలాంటి సమస్యలు వస్తే అసోసియేషన్లో సంప్రదించాలని, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలర్స్ అసోసియేషన్ నాయకులు, బంగారు దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం జ్యువెలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జరుగు రాజశేఖర్రెడ్డి, గౌరవాధ్యక్షులుగా సయ్యద్ సలావుద్దీన్, ఆకుల రాజమోహన్, కార్యదర్శిగా సయ్యద్ చాంద్బాష, కోశాధికారిగా ఆకుల రాజశేఖర్లను ఎన్నుకున్నారు. వీరితోపాటు ఐదుగురు జాయింట్ సెక్రటరీలు, మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జ్యువెలర్స్ దుకాణదారుల ఆవేదన -
ఆధ్యాత్మిక అంశాలకు నెలవు రామాయణం
కడప కల్చరల్ : ÝëÐ]l*-hMýS, B«§éÃ-†-ÃMýS, OÐðlgêq-°MýS A…Ô>-ÌSMýS$ Æ>Ð]l*-Ķæ$×æ… ¯ðlÌSÐ]l° ç³…^èl çÜçßæ-{Ýë-Ð]l«§é° yéMýStÆŠ‡ Ðól$yýl-Ýë-°-Ððl*-çß毌S A¯é²Æý‡$. OÐðlÒ-ĶæÊÌZ° {»o¯ŒS ¿êÚë ç³Ç-ÔZ«§ýl¯]l MóS…{§ýl…ÌZ “™ðlË$VýS$ÌZ Æ>Ð]l*-Ķæ$-×ê-Ë$&-Ýë-Ð]l*-hMýS §ýl–MýSµ-£ýl…’ A…Ôèæ…Oò³ fÆý‡$VýS$-™èl$¯]l² Æð‡…yýl$ ÆøkÌS A…™èlÆ>j-¡Ä¶æ$ çܧýl-çÜ$ÞÌZ ¿êVýS…V> º$«§ýl-ÐéÆý‡… ÝëĶæ$…{™èl… Ð]l¬W…ç³# çÜÐ]l*-Ðól-Ô>°² °Æý‡Ó-íßæ…-^éÆý‡$. Ð]l¬QÅ A†¤V> Ñ^óla-íܯ]l yéMýStÆŠ‡ Ðól$yýlÝë° Ððl*çß毌S Ð]l*sêÏ-yýl$™èl* ÐéÎ-ÃMìS Ð]l$çßæÇÛ _{†…-_¯]l Æ>Ð]l¬yýl$ VýS$Æý‡$-Ð]l#-ÌSMýS$ VýS$Æý‡$-Ð]l-°, B^èl-Æý‡-×æ-Ö-Ë$yýl° A¯é²Æý‡$. Æ>Ð]l*-Ķæ$×æ MýSÌSµ-Ð]l–-„ýS…ÌZ ÕÐ]l-«§ýl-¯]l$Æý‡Â…VýS… çÜ…§ýl-Æ>°² ÑÔèæÓ¯é£ýl E§é-™èl¢…V> _{†…-^éÆý‡-¯é²Æý‡$. B^éÆý‡Å Ð]l*yýl-¿¶æ*íÙ çÜ…ç³™Œæ MýS$Ð]l*ÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* Æ>Ð]l¬° Ð]lÌSÏ Æý‡çœ¬Ð]l…Ôèæ… MîSÇ¢…-º-yìl…§ýl° {ç³gêMýSÑ ÐólÐ]l$¯]l A¯é²-Æý‡-¯é²Æý‡$. {í³°Þ-ç³ÌŒæ B^éÆý‡Å G‹Ü.-Æý‡-眬¯é£ýl Æð‡yìlz Ð]l*sêÏ-yýl$™èl* Æ>Ð]l*-Ķæ$-×æ…ÌZ Æ>Ð]l¬yýl$ A¯ólMýS MýSÚëtË$ G§ýl$ÆöP-¯é²-yýl-°, M>± ¯ólsìæ Ķæ¬Ð]l™èl _¯]l² _¯]l² çÜÐ]l$-çÜÅ-ÌSMóS yîlÌê-ç³yýl$-™èl$¯é²-Æý‡-¯é²Æý‡$. gê¯]l-Ð]l$-¨ª ÑfĶæ$ ¿êçÜPÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* VýS™èl…ÌZ MýSyýl-ç³hÌêÏ Æý‡^èlƇ$$-™èlÌS çÜ…çœ$… B«§ýlÓ-Æý‡Å…ÌZ Vöç³µV> Ð]l$à-çÜ-¿ýæË$ °Æý‡Ó-íßæ…-^é-Æý‡-°, D Æð‡…yýl$ ÆøkÌS çܧýlçÜ$Þ ¯ésìæ çÜ¿ýæ-ÌS¯]l$ ™èlÌSí³…-ç³gôæ-Ô>Ķæ$-¯é²Æý‡$. D çܧýl-çÜ$ÞÌZÏ 80 Ð]l$…¨ §ólÔèæ, ѧól-Ô>ÌS {糆-°«§ýl$Ë$, ç³{™èl çÜÐ]l$Æý‡µ-MýS$Ë$ ÑÑ«§ýl A…Ô>-ÌSOò³ {ç³çÜ…-W…-^éÆý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ B^éÆý‡Å h.´ë-Æý‡Ó-†, yéMýStÆŠ‡ ¯]lÆ>ÌS Æ>Ð]l*-Æð‡yìlz, B^éÆý‡Å õ³r }°-ÐéçÜ$-ÌS-Æð‡yìlz, B^éÆý‡Å çÜ…VýS-¯]l-¿ýæ-rÏ ¯]lÆý‡çÜĶæ$Å, B^éÆý‡Å h.»ê-ÌS-çÜ$-{º-çßæÃ-×æÅ…, B^éÆý‡Å G¯ŒS.-D-ÔèæÓ-Æý‡-Æð‡yìlz, yé॥ MðS.Æý‡Ñ-»êº$, yé॥ sìæ.G-‹Ü.-Ððl…MýSsôæÔŒæ, yé॥ G‹Ü.-Ð]l$-Ð]l$™èl, yéMýStÆŠ‡ í³.ÌZ-MóSÔèæÓÇ, yé॥ ¿¶æ*™èlç³#Ç Vø´ë-ÌS-MýS–çÙ~ Ô>[íÜ¢, yéMýStÆŠ‡ _…™èl-MýS$…-rÕ-Ðé-Æð‡yìlz, B^éÆý‡Å yìl.Ñ-f-Ķæ$ÌS-„ìS-Ã, B^éÆý‡Å sìæ.Æ>-Ð]l$-{ç³-Ýë§ýl Æð‡yìlz, B^éÆý‡Å h.§é-Ððl*-§ýlÆý‡ ¯éĶæ¬yýl$, B^éÆý‡Å G…G… ѯø¨-°, fíÜt‹Ü ç³çÜ$-ç³#-Ìôæsìæ Ôèæ…MýSÆŠæ, ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
అంగన్వాడీ టీచర్ మెడలో గొలుసు చోరీ
చక్రాయపేట : మండలంలోని గొట్లమిట్ట అంగన్వాడీ టీచర్ లింగారెడ్డి నిర్మల మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు చక్రాయపేట ఎస్సై కృష్ణయ్య తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. గొట్లమిట్ట నుంచి వచ్చి వేంపల్లె గాలివీడు ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ వద్ద నిర్మల వేచియున్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై రావడంతో ఆమె వారిని లిఫ్ట్ అడిగిందన్నారు. వారు ఆమెను ఎక్కించుకొని బాట్లోపల్లె సమీపంలోకి రాగానే బండిలో పెట్రోల్ అయిపోయిందని కిందకు దిగమన్నారు. బండి దిగగానే మెడలో ఉన్న ఒకటిన్నర తులం బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఆమె ఫిర్యాదు చమేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అధికార పార్టీ అండతో ఇంటి స్థలం ఆక్రమణ
కడప సెవెన్రోడ్స్ : అధికార తెలుగు దేశం పార్టీ నాయకుల అండ చూసుకుని తమ గ్రామానికి చెందిన పెరుగు నాగమ్మ, ఇతరులు తన ఇంటి స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామానికి చెందిన చిన్న పాలయ్య బుధవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఫిర్యాదు చేశారు. నంద్యాలంపేట గ్రామ పొలం సర్వే నెంబరు 290/ఎలో ఎనిమిదిన్నర సెంట్ల ఇంటి స్థలం ఉందన్నారు. దీనిపై మైదుకూరు సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ఒకవైపు విచారణ ముగిసి న్యాయస్థానం తీర్పు వెలువడకముందే టీడీపీ నాయకులు దౌర్జన్యంగా స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పగా దౌర్జన్యానికి దిగుతున్నారని, పోలీసుస్టేషన్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కోర్టు తుది ర్పు వచ్చే వరకు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని, ఎవరికీ ప్రవేశం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
ఏపీజీబీ కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలి
కడప కార్పొరేషన్ : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి.అంజద్ బాషా కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఆయన లేఖ రాశారు. రైతులు, కర్షకులు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఆ బ్యాంకు, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారిందన్నారు. రాయలసీమ గ్రామీణ బ్యాంకు, అనంత గ్రామీణ బ్యాంకు, పినాకినీ గ్రామీణ బ్యాంకులు ఐదు జిల్లాలకు సంబంధించి ఉండేవని, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కడప కేంద్రంగా ఉండేదన్నారు. ఈ బ్యాంకు ఎక్కువ టర్నోవర్ సాధించడంతో కడపలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారన్నారు. ఇప్పుడు 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా కుదించడంతో కడపలోని ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ ఆలోచనలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలన్నారు. దేశంలోని 43 ప్రాంతీయ బ్యాంకుల కన్నా ఏపీజీబీ 552 శాఖలతో, రూ.50 వేల కోట్ల టర్నోవర్తో, రూ.802 కోట్ల లాభాలతో, రూ.4591కోట్ల రిజర్వ్తో వ్యాపారాభివృద్ధిలో మిగతా బ్యాంకుల కన్నా అగ్ర భాగాన ఉందన్నారు. ఈ బ్యాంకులో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలోని హైకోర్టు, లా యూనివర్సిటీ, ఎంఎస్ఎంఈ కేంద్రం, గతంలో అనంతపురానికి రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తరలించి అన్యాయం చేశారన్నారు. వ్యాపారం, టెక్నాలజీ, ఆర్బీఐ అనుమతించిన ప్రత్యేకమైన కరెన్సీ, చెస్ట్ సౌకర్యం, సొంత భవనాలు ఏపీజీబీకే మిగతా వాటికంటే మిన్నగా ఉన్నాయన్నారు. 2006లో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కడపలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయానికి 0.50 సెంట్ల స్థలానికి కేటాయించగా, మరియాపురం వద్ద రూ.15 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారన్నారు. రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి లేఖ రాసిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా -
రాజకీయ ఒత్తిళ్లతో చెక్ పవర్ రద్దు చేసే యత్నం
కడప సెవెన్రోడ్స్ : అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తన చెక్ పవర్ రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని వీఎన్.పల్లె మండలం బుసిరెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్ లింగారెడ్డి అనూరాధ ఆరోపించారు. ఆమె భర్త, రాష్ట్ర మైనింగ్ మాజీ డైరెక్టర్ ఎల్.వీరప్రతాప్రెడ్డితో కలిసి డీపీఓ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ మాట్లాడుతూ బుసిరెడ్డిపల్లె నుంచి గంగనపల్లె వరకు లక్షా 14 వేల రూపాయలతో గ్రావెల్ రోడ్డు నిర్మించామని, ఏఈ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. బిల్లు ఇంతవరకూ తీసుకోలేదన్నారు. రోడ్డు పనుల్లో తాము అవినీతికి పాల్పడ్డామని అధికార పార్టీకి చెందిన లైన్మెన్ ప్రసాద్రెడ్డి, నల్లబల్లె రమణారెడ్డి డీపీఓకు ఫిర్యాదు చేశారన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన డీపీఓ రాజ్యలక్ష్మి విచారణ బాధ్యతను పులివెందుల డివిజనల్ పంచాయతీ అధికారికి అప్పగించారన్నారు. తమది ఫ్యాక్షన్ గ్రామమని, డీపీఓ వైఖరి కారణంగా కక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే తాను, తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు : డీపీఓ పులివెందుల డీఎల్పీఓను విచారణకు నియమించామని, నివేదిక పరిశీలించిన తర్వాత చర్యలు చేపడతామని డీపీఓ రాజ్యలక్ష్మి వివరణ ఇచ్చారు. అభియోగాలు రావడం సహజమని, ఆడిట్ జరిగిందా? లేదా? అనే దానితో సంబంధం లేదని తెలిపారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు లేవని, చట్ట వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమన్నారు. తప్పు జరిగిఉంటే ఏఈ బాధ్యులవుతారని తెలిపారు. డీపీఓ కార్యాలయం ఎదుట సర్పంచ్ నిరసన -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంపొందించి ఔత్సాహిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రకృతి వ్యవసాయం అమలు తీరు, విస్తరణపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయ సాగు పద్ధతులను అమలు చేసేందుకు.. గ్రామాలను యూనిట్లుగా తీసుకుని వీవోలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో... న్యూట్రీగార్డెన్స్ ఏర్పాటుకు మ్యాపింగ్ చేయాలన్నారు. ఎస్.వి.ప్రవీణ్ కుమార్, ఆనంద్నాయక్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు.డీఏఓ అయితా నాగేశ్వరరావు -
మాజీ సీఎం జగన్ రక్షణ.. కూటమి ప్రభుత్వానికి పట్టదా?
ఖాజీపేట : మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీస రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు రైతుల సమస్య తెలుసుకునేందుకు వెళ్లిన జగన్కు కనీసం ఒక్క పోలీసును కూడా రక్షణకు నియమించక పోవడం, కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల ఆంక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కనీసం రూ.20వేలు రైతు భరోసాను అందించలేక పోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. -
చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణం, లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. మహిళలకు సంబంధించిన కేసులను త్వరగా పరిశీలించి న్యాయం చేయాలని, రికార్డులు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్స్ బోర్డులు ఏర్పాటుచేయాలని తెలిపారు. మట్కా, క్రికెట్, బెట్టింగ్ తదితర నేరాల పట్ల కఠినంగా వ్యవహరించవలసిందిగా ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. -
అశ్వ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 8వరోజు మంగళవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి అశ్వవాహనంపై భక్తులను కరుణించారు. స్వామివారు వేట మార్గమున వెలుతున్న తీరును కళ్లకు కట్టినట్లుగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామోత్సవంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తిరుణాల ప్రాంగణంలో రాత్రి పులివెందుల శ్రీశివజ్యోతి నాటక కళానికేతన్ వారిచే నవరత్నాలు స్టేజీ నాటక ప్రదర్శన నిర్వహించారు. రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు బుధవారం శ్రీరంగనాథుడు సతీసమేతుడై హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
వైవీయూ వీసీగా ప్రకాష్బాబు నియామకం
కడప ఎడ్యుకేషన్: కడప యోగివేమన విశ్వ విద్యాలయ నూతన వైస్ చాన్సులర్గా ఫణితి ప్రకాష్బాబు నియమితులయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వు మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫణితి ప్రకాష్బాబు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ లైప్ సైన్సెస్ లో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కాగా ఆయన నేడో, రేపో బాధ్యతలను చేపట్టను న్నట్లు సమాచారం. గండికోటను సందర్శించిన పర్యాటక శాఖ ఎండీ జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను రాష్ట్ర పర్యాటకశాఖ ఏండీ అజయ్ జైన్ సందర్శించారు. మంగళవారం కలెక్టర్ శ్రీధర్ చెరకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్చార్జి భూపేష్రెడ్డిలతోకలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పెన్నాలోయ అందాలతోపాటు,మాధవరాయ స్వామి ఆలయం, జుమ్మామసీదు, రంగనాథస్వామి దేవాలయంతోపాటు ధాన్యాగారాన్ని సందర్శించారు. అనంతరం గండికోటలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆదితో చర్చించారు. ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలి అట్లూరు: ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలని జిల్లా వైధ్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు కె.నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓసీ సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లంకమల్లేశ్వర క్షేత్రంలో మెడికిల్ క్యాంపు నిర్వహించాలని సూచించారు. అనంతరం మాడపూరు పంచాయతీ పరిదిలోని చిన్నరాజుపల్లిలో జరుగుతున్న బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగు పరీక్షల సర్వేను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రమేష్, స్థానిక వైద్యాధికారి డాక్టరు హమీదాబేగం, సీహెచ్ఓ మురళీకృష్ణ, పీహెచ్ఎన్ లక్ష్మిదేవి, సూపర్వైజరు సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
● పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి
కడప ఎడ్యుకేషన్/కడప కోటిరెడ్డి సర్కిల్: విద్యాశాఖ బలోపేతానికి పూర్వ ప్రాథమిక విద్య ప్రఽథమ ప్రాధాన్యత వహిస్తుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు అన్నారు. కడప నగరంలోని జయనగర్ నగర్ కాలనీలోగల జెడ్పీ బాలికల పాఠశాలలో ‘పోషణ్ భీ, పడాయి భీ’ పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్న ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్ష, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ..అంగన్వాడీ రెండు అనుసంధానంగా పని చేయాలన్నారు. కడప మండల విద్యాశాఖ అధికారి దుద్దికుంట గంగిరెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే అభివృద్ధికి మైలురాళ్లు ఏర్పడాలని తెలిపారు. న్యూ క్లస్టర్ విధానంలో బేసిక్ ప్రైమరీ స్కూల్లకు అంగన్వాడీలను అనుసంధానం చేస్తూ పూర్వ ప్రాథమిక విద్య ..ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. జిల్లా జ్ఞానజ్యోతి డిస్ట్రిక్ కో– ఆర్డినేటర్ కిరణ్ రథం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2383 మంది అంగన్వాడీ వర్కర్స్కు శిక్షణ ఇవ్వనట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్, విద్యాశాఖ సమగ్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పూర్వ ప్రాథమిక విద్య బలపడుతుందని పేర్కొ న్నారు. అనంతరం కి రిసోర్స్ పర్సన్ (ఏసిడిపిఓ)శోభారాణి, సూపర్వైజర్ ప్రశాంతి వర్కర్లకు పలు సూచనలు చేశారు. కడప నగరంలోని ఆరు సెక్టా ర్ల సూపర్వైజర్లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
భారతీయ సంస్కృతికి ప్రతీక రామాయణం
కడప కల్చరల్ : రామాయణ మహాకావ్యం భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య కె.కృష్ణారెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘తెలుగులో రామాయణాలు– సామాజిక దృక్పథం’ అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా మంగళవారం ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రధానార్చకులు వీణా రాఘవాచార్యులు అతిథులతో కలిసి రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రామాలయం లేని గ్రామం లేదని, అందులోని ప్రతి పాత్ర సందేశమిస్తుందన్నారు. సభాధ్యక్షుడు, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ రామాయణాన్ని ఆధ్యాత్మిక గ్రంథంగా కాకుండా ఆధునిక సమాజానికి పనికొచ్చే గ్రంథంగా చూడాలన్నారు. ఈగ్రంథం మానవాళికి చేసే మేలు గురించి తెలియజెప్పేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని వివరించారు. సదస్సు సమన్వయకర్త, బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ రామాయణాన్ని వివిధ కవులు రచించారని, వారి రచనా దృక్పథంతో వెలువడిన వివిధ సామాజిక అంశాలను పత్రాల ద్వారా వెలుగులోకి తీసుకురావడం ఈ సదస్సు ఉద్దేశమన్నారు. కీలకోపన్యాసకులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కె.మలయవాసిని మాట్లాడారు. విశిష్ట అతిథి, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ , గౌరవ అతిథి స్వామి అనుపమానంద, ఆత్మీయ అతిథి, చిన్మయా మిషన్ సంచాలకులు స్వామి తురియానంద తదితరులు ప్రసంగించారు. ● అనంతరం జరిగిన సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు నేరుగాను, అంతర్జాలంలోనూ పత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’ నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి సభను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైవీయూ తెలుగుశాఖ అధ్యక్షురాలు ఆచార్య ఎంఎం వినోదిని, అధ్యాపకులు ఆచార్య టి.రామప్రసాద రెడ్డి, ఆచార్య పి.రమాదేవి, ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పటిష్టంగా ఇరవై సూత్రాల అమలు
కడప సెవెన్రోడ్స్: ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని చైర్మన్ లంకా దినకర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసిన వివరాలు అందజేయాలన్నారు. అలా గే మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం ద్వారా కల్పించిన ఆస్తుల నాణ్యత, నిబంధనలకు విరుద్ధంగా చేసిన వ్యయంపై విచారణ చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద పూర్తయినట్లు చూపుతున్న పనుల్లో నాణ్యతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 1922 గ్రామాల్లో 2.91 లక్షల గృహాలకుగాను 2.77 లక్షల గృహాలకు నీటి కొళాయిలు బిగించినట్లు లెక్కలు ఉన్నప్పటికీ కుళాయిల్లో నీరు రావడం లేదన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి జిల్లాలోని ఐదు దీర్ఘకాలిక నీటి వనరుల ద్వారా రక్షిత తాగునీరు ఇచ్చే లక్ష్యంతో సవరించిన డీపీఆర్తో జల్జీవన్ మిషన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామ న్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్లపై సబ్సిడీ ఇస్తోందన్నారు. జిల్లాలో 5600 టిడ్కో గృహాల్లో 3296 పూర్తయినట్లు, 80 శాతం మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ ఆ గృహాల్లో నివాసం ఉంటున్న వారు సున్నా కావడం బాధాకరమన్నారు. కడప కార్పొరేషన్లో అమృత్ 1.0 కింద చేపట్టిన పనులు ఏడేళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. ఇప్పుడు అమృత్ 2.ఓ కింద 663 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మాట్లాడుతూ పంటలకు విపరీతమైన పురుగు మందులు వాడకం వల్ల ఆహారం విషపూరితం కాకుండా ఇరవై సూత్రాల్లో కొత్త విధానాలను తీసుకు రావాలన్నారు. అధ్వాన్నంగా తయారైన కాంక్రీట్ రోడ్లకు మరమ్మత్తులు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో పరిశ్రమలు, పర్యాటకం ప్రధాన భూమిక పోషించనున్నాయన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ లంకా దినకర్ -
తలనీలాల వేలం పాట రూ.5.51 లక్షలు
సిద్దవటం: నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల వేలం పాటను బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వంగపాటి మహేంద్ర రూ. 5. 51లక్షలకు దక్కించుకున్నారని ఆలయ ఈఓ మోహన్రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యపూజ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి సమర్పించుకునే తలనీలాల ప్రోగు కోసం ఈ వేలం పాటను నిర్వహించామన్నారు. -
కుంభమేళా.. రైలెక్కేదెలా!
● 26తో ముగియనున్న కుంభమేళా ● గుత్తి–రేణిగుంట మార్గంలో ఒక్క రైలు కూడా లేని వైనం ● ప్రయాగ్రాజ్ ప్రయాణానికి ఇక్కట్లు ● రహదారి మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు రాజంపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశేషాలపై చర్చ సా గుతోంది. ఈనెల 26న మహాశివరాత్రి రోజు మహా కుంభమేళా వేడుకలు ముగియనున్నాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించడం మంచిదని భక్తుల అచంచల విశ్వాసం. అందుకే ప్రయాగ్రాజ్కు నడిపిస్తున్న రైళ్లు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. ఎంతగా అంటే తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో రిజర్వు కావడం డిమాండ్ను తెలియజేస్తోంది. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వల్ల ఒరిగిందేమీలేదు: భారతీయ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా కనిపించడంలేదని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. రైల్వేబోర్డుకు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా తాను సిఫార్సు చేసి ఉంటే కుంభమేళాకు రైలు నడిపేవారు. అయినా ఆయన జిల్లా మీదుగా కుంభమేళాకు రైలు వేయించుకోలేకపోయారని భక్తులు పెదవి విరుస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్ధితి.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లేందుకు రైలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు భక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేకంగా బస్సులు మాట్లాడుకొని వెళుతున్నారు. ఇలా వెళ్లే వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రయాగ్రాజ్ దారులు రద్దీగా మారుతున్నాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కొందరు బెంగళూరు, చైన్నె నుంచి విమానాల ద్వారా కుంభమేళాకు వెళుతున్నారు. గుత్తి–రేణిగుంట లైనులో ఒక్క రైలేదీ.. గుత్తి–రేణిగుంట లైనులో కుంభమేళాకు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా నడిపించలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్ల గురించి తెలుసుకొని వ్యయ ప్రయాసాలతో గూడూరుకు వెళ్లి, అక్కడి నుంచి రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి కూడా ఇప్పుడు కుంభమేళాకు రైలు నడవడంలేదని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్కు వెళ్లే రైళ్లు సదరన్ రైల్వే నుంచి వస్తే వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంటర్సిటీనే కుంభమేళా రైలుగా నడిపించాలి ఈ మార్గంలో నడిచే పేదోళ్ల రైలు ఇంటర్సిటీ(హుబ్లీ–తిరుపతి) రద్దు చేసి, ఆ రైలును కుంభమేళాకు వినియోగించారు. అదే రైలును ఈ మార్గంలో నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైలును తిరుపతి నుంచి ప్రయాగ్రాజ్కు రోజూ నడిపిస్తే రాయలసీమ ప్రాంత భక్తులకు ఉపయోగపడేది. ఆ దిశగా రైల్వేశాఖ ఆలోచించకపోవడం విచారకరమని హిందూ సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు. సురక్షితం.. సౌకర్యం.. ప్రయాగ్రాజ్కు వెళ్లే వారికి రైళ్లు సురక్షితం. తక్కువ ఖర్చుతో గమ్యానికి చేరుకోవచ్చు. దీంతోపాటు రైల్వేస్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తక్కువ ఖర్చుతో సకాలంలో చేరుకొనే వీలుంటుంది. వాహనాలు లభ్యంకాని భక్తులు నేరుగా నడకమార్గం ద్వారా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రైల్వేశాఖకు రూ.కోట్ల ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లా వాసులు రైలులో వెళ్లలేని పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లలేని పరిస్థితి. రైలు సౌకర్యం ఉంటే వేలాదిమంది వెళ్లేవారు. రైలులో గూడూరు నుంచే వెళ్లాలి. టిక్కెట్లు దొరకవు. జనరల్ బోగీలలో వెళితే సీట్లు ఉండవు. నానా కష్టాలు పడాలి. జిల్లా రైలు మార్గంలో రైలు నడిపించకపోవడం దారుణం. మన ప్రాంతంపై రైల్వే వివక్ష చూపుతోంది. –భూమన శంకర్రెడ్డి, మాజీ సర్పంచ్, నాగిరెడ్డిపల్లెకుంభమేళాకు రైలు వేయాలని జీఎంను కోరా జిల్లా మీదుగా కుంభమేళాకు ఒక రైలు నడపాలని ఇటీవల తిరుపతిలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఏకే జైన్ను కలిసి విన్నవించాను. కుంభమేళా ముగిసే లోపు ఒక్కసారి అయినా రైలు నడిపిస్తే భక్తులు సద్వినియోగం చేసుకుంటారు. రద్దయిన ఇంటర్సిటీనే కుంభమేళాకు ఏర్పాటు చేయాలి. –తల్లెం భరత్రెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు, గుంతకల్ -
● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం
● పోషణ్ భీ, పడాయి భీకార్యక్రమం అమలు ● ఆరు రోజులపాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ● అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా అభివృద్ధి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పిల్లలకు ఆరేళ్ల వయస్సులోనే 85 శాతం మెదడు అభివృద్ధిని సాధిస్తుంది. ఆ సమయంలో సరైన పోషణ, విద్యను అందించడం ఎంతో అవసరం. ఇందుకోసం కేంద్రం ‘పోషణ్–భీ, పడాయి భీ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పిల్లల శారీరక, అభివృద్ధి, సామాజిక, భావోద్వేగ, నైతిక అభివృద్ధి, సాంస్కృతిక, కళాత్మక అభివృద్ధి, కమ్యూనికేషన్, మాతృభాష, అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
పులివెందుల రూరల్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని ఆయన నివాసంలో ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీ పథకాలలో ఒకటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు వందలాది హామీలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి చంద్రబాబు ప్రజా దర్బార్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి -
తూతూ మంత్రం.. రాయితీరుణం
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 300 మందికి మాత్రమే రాయితీపై రుణాలు మంజూరుచేయడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు లక్షల జనాభా గల నియోజకవర్గంలో 300 యూనిట్ల సబ్సిడీ రుణాలు మంజూరుకాగా, 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 300 మందిని ఎంపిక చేస్తే మిగిలిన 2,700 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 60 వేల ఓటర్లు గల చేనేతలకు 40, 20 వేల ఓటర్లు గల యాదవులకు 15, ఆర్య వైశ్యులకు 2, బ్రాహ్మణులకు 1 చొప్పున రుణాలు మంజూరుచేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సిఫారసు చేసిన వారికే రుణాలు వస్తాయని, ఒక్కో రుణానికి ఆయా వార్డుల శ్రేణులు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అర్హతే ప్రామాణికంగా దళారీ వ్యవస్థ లేకుండా రూ.2.72 లక్షల కోట్లు మంజూరుచేశారన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలతోపాటు ఏ నాయకుల పాత్ర ఎంపికలో లేదన్నారు. జగన్న బటన్ నొక్కితే అర్హత ఉన్న వారి ఖాతాకు డబ్బు వచ్చేదన్నారు. సచివాలయాల ఉద్యోగుల నియామకానికి, మంత్రుల పలుకుబడి కూడా పనిచేయలేదని, నిజాయితీగా ఉద్యోగులను ఎంపిక చేశారన్నారు. పాలిచ్చే ఆవును వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్న చందాన ప్రజల పరిస్థితి ఉందన్నారు. 300 మందికి అన్న క్యాంటీన్లో భోజనం పెట్టి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గుంతలు పూడ్చి హైవే రోడ్లను నిర్మించినట్లు చెబుతున్నారన్నారు. ప్రభుత్వ పాలన చూస్తే 11 సీట్లు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, పాతకోట వంశీధర్రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, గుర్రం లావణ్య, చౌడం రవీంద్ర, దేస్ రామ్మోహన్రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
ఇద్దరు ట్రాన్స్ఫార్మర్ దొంగల అరెస్టు
– 180 కిలోల కాపర్ తీగలు, పల్సర్ బైక్ స్వాధీనం చక్రాయపేట : ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. గాలివీడు క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి నిందితులు పారి పోయేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు పట్టుకుని విచారించినట్లు తెలిపారు. వైస్సార్ జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోని 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు దొంగిలించినట్లు వారు అంగీకరించారని చెప్పారు. వారి అరెస్టు అనంతరం కడప విమానాశ్రయం వద్ద కంపచెట్లలో దాచిన 180 కిలోల కాపర్ వైరు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. నిందితులు చెన్నూరు మండలం శాటిలైట్ సిటీ సమీపాన ఉన్న రుద్రభారత్పేటకు చెందిన ఈభూది మల్లికార్జున, శంకల శంకర్ అని చెప్పారు. దొంగలను పట్టుకున్న సీఐ ఉలసయ్య, ఎస్సై కృష్ణయ్య, సిబ్బందిని డీఎస్పీ మురళి అభినందించారు. -
ఇమామ్, మౌజన్లకు అన్యాయం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలోని మౌజన్లు, ఇమామ్లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీనా దస్తగిరి అన్నారు. స్థానిక మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇమామ్లు, మౌజన్లకు నెలకు రూ.15వేల చొప్పున ఇచ్చేవారని, 2024లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా వారికి గౌరవవేతనం ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ వారికి రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.45కోట్లు ఇవ్వడానికి జీవో విడుదల చేయడం అన్యాయమన్నారు. రానున్న రంజాన్ మాసంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని, ప్రభుత్వం ఆ మిగిలిన రూ.45 కోట్లు విడుదల చేయాలన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండీ.షఫీ మాట్లాడుతూ గతంలో హజ్కు పోయే వారికి విజయవాడ నుంచి అధిక టికెట్లు ఉంటే అప్పటి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో వైఎస్సార్సీపీ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. హజ్ కమిటీ మాజీ ఛైర్మెన్ గౌస్లాజం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముస్లిం, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదన్నారు. 3529 మందిని ఒకేసారి హజ్కు పంపిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.23వేల కోట్లు జమ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్బాషా, అతావుల్లా, మియ్యా, అహమ్మద్ పాల్గొన్నారు. -
దొరసానిపల్లెలో చోరీకి విఫలయత్నం
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని దొరసానిపల్లెలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. దొరసానిపల్లె సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉంటున్న భూమా రాజా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను బెంగళూరు నుంచి అప్పుడప్పుడూ దొరసానిపల్లెలోని ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు రాజా ఇంటి తాళాలు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకర్లు తెరవడానికి ప్రయత్నించగా అవి తెరుచుకోలేదు. దుండగులు చేసేదేమిలేక వెనక్కి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి రాజాకు సమాచారం తెలియజేశారు. ఈ మేరకు రూరల్ సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ వెంకటసురేష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటి ఊళ్లకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. పోలీసులకు తెలిపితే ఎల్హెచ్ఎంస్తో పనిచేసే నిఘా కెమెరాలను వారి ఇంట్లో ఏర్పాటు చేయిస్తామన్నారు. చోరీల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఐ కోరారు. రేపు వామపక్షాల సదస్సు కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజా వ్యతిరేక పొలిటికల్ బడ్జెట్ను నిరసిస్తూ ఈ నెల 20 వామపక్షాల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. నగరంలోని రామకృష్ణ నగర్లో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొలిటికల్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. 70 శాతం అణగారిన ప్రజలను విస్మరించారని, మధ్య తరగతి ప్రజలను భ్రమలకు గురిచేసే విధంగా ఉందని తెలిపారు. గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారన్నారు. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలకు ముందు భ్రమలకు గురి చేసే బడ్జెట్ ప్రవేశపెట్టారని, కార్పొరేట్ల పెరుగుదలకు 42 శాతం ప్రజాధనాన్ని దోచిపెట్టే విధంగా అంకెల గారడి ఉందన్నారు. ప్రాజెక్టులు, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు, దీర్ఘకాలిక అభివృద్ధికి నిధులు విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో అన్వేష్, రామ్మోహన్, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. చిరుత సంచార ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పులివెందుల రూరల్ : చిరుత, వాటి పిల్లలు సంచరించే ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల చిరుత సంచారం గురించి వివిధ గ్రామాల ప్రజలు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆయన కడప జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్కు ఫోన్ చేసి చిరుత సంచరిస్తున్న గ్రామాలలో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. స్పందించిన అధికారులు మంగళవారం నల్లపురెడ్డిపల్లె, సింహాద్రిపురం, లింగాల మండలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా చిరుత సంచారం, అడుగుజాడలు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని అటవీ అధికారులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ మానవత్వం ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వెదుర్ల బజారుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి (71) గతంలో కూరగాయల మార్కెట్లో పనిచేశారు. మంగళవారం వెంకట సుబ్బారెడ్డికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన భార్య రామసుబ్బమ్మ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేర్చే లోపే ఆయన చనిపోవడంతో ఇంటికెలా తీసుకెళ్లాలో తెలియక రోదిస్తూ ఉండిపోయింది. పోలీస్ ఔట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్బాషా విషయం తెలుసుకుని ఓ ప్రైవేట్ అంబులెన్స్ను పిలిపించి మృతదేహాన్ని ఇంటికి పంపించడంతోపాటు, అవసరమైతే హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిపిస్తానని ఆమె తెలిపారు. షబ్బీర్బాషా మానవత్వాన్ని పలువురు అభినందించారు. వెంకటసుబ్బారెడ్డికి ఇద్దరు కుమారులుండగా ఒకరి మానసికస్థితి బాగాలేదు. మరో కుమారుడు ప్రైవేట్ బస్సులో క్లీనర్గా పనిచేస్తున్నాడు. ట్రాలీ కింద పడి మహిళ మృతి రాజుపాళెం : మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన దారాల ఆరోగ్యమ్మ (52) ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మంగళవారం మృతి చెందినట్లు రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో శనగ పంట కోతకు వెళ్లిన ఆరోగ్యమ్మ పొలం వద్దనే ఉన్న ట్రాక్టర్ ట్రాలీ వద్ద సేద తీరుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ తోలడంతో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ట్రాలీ కింద పడిన ఆరోగ్యమ్మకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. మృతురాలి కుమారుడు దారాల చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. శవాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
వంక స్థలం ఆక్రమణ
కడప టాస్క్ఫోర్స్ : ప్రభుత్వ స్థలాలు అప్పనంగా కాజేస్తున్నా.. ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దవటం మండలం దిగువపేట నందు బద్వేల్ రోడ్డు ప్రక్కనే ఉన్న రూ.50 లక్షల విలువైన స్థలం ఆక్రమణకు గురైంది. దిగువపేట పెద్ద కుమ్మరి గుంతకు ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు స్థానిక మండల నేతల అండదండలతో దౌర్జన్యంగా చదును చేసి ముళ్ల కంచె వేశారు. సుమారు 0.43 సెంట్ల స్థలాన్ని దిగువపేట గాంధీ నగర్ హరిజనవాడ ప్రజలు కర్మ కాండలకు వినియోగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ ఇక్కడే చేసుకుంటారు, భర్త చనిపోయిన మహిళలకు ఇక్కడే వితంతువుగా మారుస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది కొంత ప్రభుత్వ భూమిగా, మరి కొంత వంకపొరంబోకుగా ఉంది. ఈ వంకపై ప్రభుత్వం ఒక మోరీ గతంలో నిర్మించింది. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఈ వంకను నామరూపాలు లేకుండా చేశారు. బద్వేల్ మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న విలువైన స్థలాన్ని చదును చేసి ఆక్రమిస్తుంటే కూతవేటు దూరంలో ఉన్న రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం ఏమిటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు వారు గుసగుసలాడుతున్నారు. కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని టీడీపీ కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఆక్రమించింది టీడీపీ నేత కావడమే కారణం -
22న ఉర్దూ సాహిత్యంపై జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈ నెల 22న ఉర్దూ కవిత, సాహిత్యం్ఙపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగం ఆచార్యులు రియాజున్నీసా తెలిపారు. సదస్సులో ఉర్దూ సాహిత్యం, దాని ప్రాముఖ్యత, ఉర్దూ స్థితి, కడపలో ఉర్దూ సాహిత్యంతిపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రవచన కర్తలు తమ వ్యాసాలను ప్రదర్శిస్తారని చెప్పారు. సాహిత్య వర్గాలు, అధ్యాపకులు, విద్యార్థులంతా సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదనపు సమాచారం కోసం 9885348482లో సంప్రదించాలన్నారు. హాస్టల్ను తనిఖీ చేసిన న్యాయమూర్తి కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ మరియాపురం, శంకరాపురం, ప్రకాశ్నగర్లలోని హాస్టళ్లను మంగళవారం తనిఖీ చేశారు. వంటశాల, వసతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూము పరిసరాలతోపాటు టాయిలెట్లను పరిశీలించారు. తగు సూచనలు, సలహాలిచ్చారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మినారాయణ, వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణకు ఆదేశాలు జారీ చేయాలి కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్ధానిక స్టేట్ గెస్ట్ హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్యాక్లాగ్్ ఉద్యోగాలకు, డీఎస్సీ నియామకాలు ఏబీసీడీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా మార్చిలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 20న విజయవాడలోని గాంధీ నగర్ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీ.ఆంజనేయులు, ఓబులేసు, రమణ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కేటాయింపులో సీమను విస్మరిస్తే ఉద్యమం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నీటి పారుదల శాఖ రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం చేపడతామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కడపలో జరిగే ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు కార్యాచరణ వేదిక కానుందన్నారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి – భనకచర్ల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ల కడుపు నింపి ఎన్నికల నిధి పోగు చేసుకోవడానికి ఉపయోగపడుతోందని ఆరోపించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా శ్రీశైలంలో క్యారీ ఓవర్ నీళ్లను రాయలసీమ ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతూ వచ్చారని, నేడు కొత్త ప్రతిపాదనల పేరుతో రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. పోలవరం పూర్తిచేస్తే పట్టిసీమకు ప్రాధాన్యం ఉండదని తెలిసినా రూ.1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. సీమ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు కేటాయిస్తే ప్రాధాన్యత క్రమంలో పంట కాల్వల నిర్మాణం పూర్తయి పది లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందుతుందని ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాలతో ఎగువ భద్ర ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం జాతీయ హెూదా కల్పించిందన్నారు. శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు రాకముందే నీటిని తోడేస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఉత్సవాలకు వేళాయె.. సందడి లేదాయె ?
ప్రముఖ శైవ క్షేత్రంగా కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. అంత వైభవం కలిగిన త్రేతేశ్వరుడి వేడుకల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మహాశివరాత్రి మహోత్సవాల సందడి కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దేవస్థానంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి. రాజంపేట రూరల్ : ఉమ్మడి జిల్లాలలో ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాలకులు ఎవరైనా ఈ ఆలయానికి ప్రత్యేకత చూపడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది బహుదా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. అగస్తేశ్వర మహర్షి ప్రతిష్ఠించిన త్రేతేశ్వరస్వామి, గదాధర స్వామిని దర్శించుకోవడం వరంలా భావిస్తారు. దీంతోపాటు అత్తిరాలలోనూ ఏటా శివరాత్రి ముందు రోజు, తరువాత రోజు, శివరాత్రి పర్వదినం రోజున పలు కార్యక్రమాలు చేపడతారు. పాలక మండలి ఏర్పాటు ఎప్పుడో?. త్రేతేశ్వర దేవస్థానంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు ముందే పాలక మండలి ఏర్పాటుచేయడం ఆనవాయితీ. అలా వీలుకాని పక్షంలో తాత్కాలిక చైర్మెన్ను నియమించి శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవస్థానం చైర్మన్ పదవి, పాలక మండలిపై మందరం, అత్తిరాల, అప్పయ్యరాజుపేట, పోలీ, సీతారామపురం కూటమి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై ప్రజలలో అయోమయం నెలకొంది. 22 నుంచి ఉత్సవాలు జరిగేనా? శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభించి మార్చి 02వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారా? లేక వేడుకలకు మంగళం పాడతారా? అని భక్తులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినానికి నెల రోజుల నుంచి హడావిడి ఆరంభమయ్యేది. అన్ని శాఖల అధికారులతో డివిజనల్ స్థాయి( ఆర్డీఓ లేక సబ్ కలెక్టర్) అధికారి సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారు. అత్తిరాలను ఉన్నతాధికారులు సందర్శించి దేవాదయశాఖతో సమన్వయం చేసుకని ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది ఈ వాతావరణం కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. సౌకర్యాల ఊసే లేదు శివరాత్రి మహోత్సవాలకు దాదాపు 7 నుంచి 15 రోజుల ముందు వాహనాల గేటుకు ఎంపీడీఓ ఆద్వర్యంలో వేలంపాట నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకూ వేలం వేయక పోవడం వెనుక అంతర్యమేమిటో అర్థంకాక భక్తులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు రాజంపేట–నెల్లూరు ప్రధాన రహదారిలోని అత్తిరాల ముఖ ద్వారం వద్ద నుంచి త్రేతేశ్వర దేవస్థానం వరకు రోడ్డు సమస్య పీడించేది. కమ్మపల్లిలో మాత్రం కొంత దూరం సిమెంటు రహదారి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సిమెంటు రోడ్డు ప్రారంభించాలని తలపెట్టినా అర్ధంతరంగా కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో రహదారికి ఇరువైపులా గుంతలు, మట్టి దిబ్బలు అలాగే ఉన్నాయి. అత్తిరాలకు విచ్చేసే భక్తులకు పార్కింగ్ సమస్యలు తప్పవు. రహదారి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. లబోదిబోమంటున్న వ్యాపారులు శివరాత్రి మహోత్సవాలలో చిరు అంగళ్లు ఏర్పాటు చేసుకొని జీవించాలనుకొనే వ్యాపారులు లబోదిబో మంటున్నారు. త్రేతేశ్వరుని దేవస్థానం సమీపంలో రహదారి నిర్మాణం అలాగే ఉండడంతో వ్యాపారులు అంగళ్లను ఏర్పరుచుకోనే వీలులేదు. ఇప్పటి నుంచే అంగళ్లు ఏర్పరుచుకోకుంటే అప్పటికప్పడు కష్టంగా ఉంటుంది. వాహనాలలో సమాగ్రీనీ తీసుకెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఎంతో నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రేత్రేశ్వరస్వామి ఆలయంలో కానరాని ఏర్పాట్లు శివరాత్రి మహోత్సవాలపై అయోమయం 9 రోజుల వేడుకలకు మంగళమేనా? అత్తిరాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం -
విద్యార్థిని ఆత్మహత్య
– పాఠశాలకు వెళ్లి చదువుకోలేక...! కడప అర్బన్ : పాఠశాలకు వెళ్లడం లేదని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప నగర శివారులోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కడప చిన్నచౌక్ పోలీసుల ప్రాథమిక విచారణ, మృతురాలి బంధువుల వివరాలిలా వున్నాయి. దేవకుమార్, ప్రభావతిల కుమారుడు మస్తానయ్య, సన్నీ కుమార్తె సుచిత్ర ఉన్నారు. మస్తానయ్య తన తండ్రితో పాటు బేల్దారిపనికి వెళుతున్నాడు. తల్లి ప్రభావతి ఇంటింటా పనులు చేసి జీవనం సాగించేది. సుచిత్ర మున్సిపల్ మెయిన్ హైస్కూల్లో పదోతరగతి చదువుతోంది. సుచిత్ర తన అనారోగ్యం కారణాలతో నెలకు 15 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. హాజరు సరిగా లేక ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. దీంతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థిని సుచరిత తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు వెళ్లిపోయిన తరువాత ఇంటిలోపల గడియ వేసుకుని ఫ్యాన్కు చీరతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుప్రక్కల వాళ్లు గమనించి తల్లిదండ్రులకు, పోసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చిన్నచౌక్ సీఐ ఓబులేసు ఆదేశా మేరకు ఎస్ఐ పి.రవికుమార్, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రాథమికంగావిచారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి కుక్కల దాడిలో మేకల మృతి వేంపల్లె : పట్టణంలోని కడప రోడ్డులో నివాసముంటున్న సుధాకర్కు చెందిన మేకలపై మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేశాయి. నాలుగు మేకలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. కుటుంబ పోషణకు మేక పిల్లలను పెంచుకుంటున్నానని, కుక్కల దాడితో రూ.50 వేల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని కోరారు. బొలెరో వాహనం ఢీకొని పొట్టేళ్లు దుర్మరణంకొండాపురం : కడప–తాడిపత్రి నాలుగు వరసల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో పొట్టేళ్లు మృతి చెందాయి. బాధితుడి వివరాల మేరకు.. చౌటిపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి చెందిన పొట్టేళ్లు కడప–తాడిపత్రి రహదారి దాటుతున్నాయి. మండలంలోని గండ్లూరు సమీపంలో బొలెరో వాహనం వేగంగా ఢీకొనడంతో 12 పొట్టేళ్లు మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. విద్యుత్తు తీగలు తగిలి.. కాలిన టిప్పర్ ఎర్రగుంట్ల : మండలంలోని చిన్నదండ్లూరు సమీపంలో విద్యుత్తు తీగలు తగలి టిప్పర్ కాలిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నదండ్లూరు గ్రామానికి గ్రావెల్ రోడ్డు వేస్తున్నారు. ఈ తరుణంలో టిప్పర్లోని మట్టిని రోడ్డుపై వేసేందుకు ట్రాలీ పైకెత్తగా..పైన విద్యుత్తు తీగలను తాకింది. దీంతో ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. కొలవలి గ్రామానికి చెందిన డ్రైవర్ నాగార్జునకు గాయాలయ్యాయి. కలమల్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ● సీకే దిన్నె మండలం ఊటుకూరు గ్రామ పొలం సర్వే నెంబరు 182/3ఏ1, 182/3ఏ2, 182/3ఏ3, 182/3ఏ5లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలుగా ఇవ్వాలని దళిత భూ సాధన పోరాట సమితి అధ్యక్షులు ఓబులపతి, నాయకులు ఆర్ఎన్ రాజు, వెదురూరు బాబు తదితరులు కోరారు. ● విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా పనిచేస్తున్న నరసింహులు అనే వ్యక్తి 4 ఎకరాల 55 సెంట్ల తన పట్టా భూమిని ఆక్రమించాడని, ఆయనపై చర్యలు తీసుకుని తన భూమి తనకు అప్పగించాలని సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన చిన్న గంగన్నగారి నారామ్మ అనే వృద్ధురాలు కలెక్టర్ను వేడుకున్నారు. ● అంగన్వాడీ సెంటర్ల అవసరాల కోసం ప్రభు త్వం ఒక్కో సెంటర్కు రూ. 3000 చొప్పున ఇచ్చిందని, ఆ మొత్తాన్ని వినియోగించడంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు చేపట్టాల ని సీఐటీయూ నాయకులు మనోహర్, చంద్రారెడ్డి తదితరులు విన్నవించారు. ● కడప దౌలతాపురానికి చెందిన నాగరాజు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, మెప్మా పీడీ, ఎస్డీసి వెంకటపతి పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలను అరికడదాంవిద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు వీడియో, ఆడియో, వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబుల్ నెట్వ ర్క్, టీవీలు, ప్రొజెక్టర్ల ద్వారా విద్యుత్ భద్రత నియమాలు గురించి ప్రదర్శనలు నిర్వహిస్తే ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి విధిగా ఎర్తింగ్, ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలను వాడాలన్నారు. అలాగే వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు విధిగా పాటించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
●వైఎస్సార్సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కువైట్ ఎంబసీ మిసాల్ ముసాపా ఆల్–షామితి..ఆయనను తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కలిశారు. కువైట్ నుంచి విమానాలు తిరుపతి రన్వేపైకి తీసుకురావాలని కోరారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో రెండు లక్షలకుపైగా కువైట్లో జీవనోపాధి కోసం వెళుతుంటారు..వస్తుంటారు..వీరిని దృష్టిలో వుంచుకొని ఎడారి విమానం తిప్పాలని విన్నవించారు. రాజంపేట : ఉభయ వైఎస్సార్ జిల్లా నుంచి ఎడారి దేశాల విమానాలకు రెక్కలొచ్చేదెప్పుడోనని గల్ఫ్వాసుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం నుంచి కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రామ్మోహన్నాయుడుపై తిరుపతి ఎయిర్పోర్టులో ఎడారిదేశాలకు విమానయాన సౌకర్యం కల్పించే బాధ్యత పడింది. ఇవి తిరుపతి రన్వేపై ఎగిరితే తమ పయనానికి ఇక ఇక్కట్లు ఉండవని వేయికళ్లతో వలసజీవులు ఎదురుచూస్తున్నారు.అయితే పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రయానం నుంచి విమానాల దాకా.. గల్ఫ్దేశాలకు వెళ్లేవారు నాలుగు దశాబ్దాల కిందట సముద్రయానం ద్వారా చేరుకునేవారు. వారాల కొద్దీ పయనించి ఎడారిదేశాలకు చేరుకునేవారు. అప్పట్లో గల్ఫ్ జీవనోపాధికి డిమాండ్ లేని రోజుల్లో మాట ఇది. రానురాను అక్కడ పనిచేసే ఉన్నతంగా జీవనం సాగించవచ్చని, తమ కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం కావచ్చనే భావనతో ఎడారి పయనాలు అధికమయ్యాయి. ముఖ్యంగా రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతో పాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మంది ఎడారిదేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు కరోనా సమయంలో గల్ఫ్లో కరోనా సోకిన వారిని విమానాల ద్వారా తిరుపతి ఎయిర్పోర్టుకు చేర్చారు. అప్పట్లో ఏపీఎన్ఆర్టీ ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కేంద్రప్రభుత్వం గల్ఫ్లో కరోనా బాధితులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎయిర్పోర్టుకు నేరుగా విమానాల్లో తీసుకొచ్చి, వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా నివారణ శిబిరాల్లో ఉంచి, తర్వాత ఇళ్లకు క్షేమంగా చేర్చిన సంగతి విధితమే. కాగా అంతర్జాతీయసర్వీసులు తీసుకొచ్చేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎడీసీఎల్) ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయస్ధాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న కలలు ఇంకా కలలాగే మిగిలిపోతున్నాయి. వ్యయప్రయాసలతో . చైన్నె, కర్ణాటక, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వ్యయప్రయాసలతో వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా అనేక మంది భాష రాక ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూరప్రయాణంతో అనేక అవాంతరాలు, ప్రమాదాలబారిన పడుతున్నారు.విమానటికెట్తో పాటు ఎయిర్పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించలేకపోతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయహోదా కల్పించారు. కానీ ఆ స్ధాయిలో విమాన సర్వీసులను తీసుకురాలేదన్న అపవాదును కేంద్రప్రభుత్వం మూటకట్టుకుంది. ఉభయ జిల్లాల నుంచి.. రాయలసీమలో ప్రధానంగా ఉభయ వైఎస్సార్ జిల్లాల నుంచి ఎడారిదేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధికోసం కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా,బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలకు వెళతారు. ఉద్యోగరీత్యా, విద్య కోసం అమెరికా, కెనడా, సౌతాఫ్రికా,శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో స్ధిరపడిన వారు ఉన్నారు. వీరు కూడా విదేశీయానం చేయాల్సివస్తే కష్టతరంగానే ఉంది. భాష రాని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించాలంటే గగనమవుతోంది. గల్ఫ్దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారు చాలామంది ఉభయ జిల్లాలో ఉన్నారు. గల్ఫ్ విమాన సర్వీసులు తీసుకురావాలి తిరుపతి ఎయిర్పోర్టులో విదేశీ విమాన సర్వీసులను తీసుకొచ్చేందుకు వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఇప్పటి వరకు కరుణించలేదు. గల్ఫ్వాసులకు విమానయాన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేశాయి. – పీవీ మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట కేంద్రం తక్షణమే స్పందించాలి రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్పోర్టు నుంచి విదేశీ విమాన స ర్వీసులను ప్రవేశపెట్టాలి.దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. చైన్నె, బెంగళూరు తదితర రాష్ట్రాలకు చెందిన విమానశ్రయాల ద్వారా వెళ్లాలంటే కష్టతరంగా ఉంది. కువైట్ ఎంబీసీకి తిరుపతి ఎంపీతో కలిసి ఈ విషయం తెలియజేశాం. కనీసం కడపోళ్ల కోసం కువైట్ నుంచి విమానం నడిపించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు తిరుపతి రన్వేపైకి.. ఎడారి విమానాలెప్పుడో! ఎదురుచూపుల్లో ఉభయ జిల్లాల గల్ఫ్వాసులు ఇప్పటికై నా కేంద్రం కరుణించేనా ! తిరుపతి, రాజంపేట లోక్సభ సభ్యులు తమ వంతుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రన్వే మీదకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కనికరించలేదు. ఫలితంగా రాయలసీమవాసులకు విదేశీయానం గగనతరంగా మారింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తిలు కువైట్ ఎంబసీని కలిసి గల్ఫ్ విమానాలు తిరుపతి విమానశ్రయం నుంచి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేడు, రేపు అంతర్జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మంగళ,బుధవారాల్లో ‘తెలుగులో రామాయణాలు – సామాజిక దృక్పథం’అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వీసీ కె. కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారని తెలిపారు. సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు 60 మంది పరిశోధనా పత్రాలు సమర్పణ చేస్తారన్నారని తెలిపారు. విదేశాల ప్రతినిధులు, పత్ర సమర్పకులు అంతర్జాలం ద్వారా కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5–30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారన్నారని ఆమె వివరించారు. కందుల కొనుగోళ్లు ప్రారంభించండి – జేసీ అదితి సింగ్ కమలాపురం : కందుల కొనుగోళ్లు ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. కమలాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కోనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. దిగుబడులు కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు, సంచులు తదితర సామగ్రి ఉందా? అని సిబ్బందితో ఆరా తీశారు. ఏ మేరకు దిగుబడులు రావచ్చని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏపీ మార్క్ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి, ఏడీఏ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : కడపజిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు తెలిపారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ (ఐఈ కో–ఆర్డినేటర్), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఏఎస్ఓ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కడప ఎన్జీఓ కాలనీలోని సమగ్రశిక్ష కార్యాలయంలోని అందచేయాలని తెలిపారు. పూర్తి సమాచారం, వివరాల కోసం కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్ష కార్యాలయ ఏపీసీని సంప్రదించాలని తెలిపారు. రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ రాజంపేట : రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ బి. నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కార్యాలయానికే పరిమితి కావడం, ఇతర కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారు. భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ రాయచోటి టౌన్ : రాయచోటి భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి మూలవిరాట్కు స్వామివారికి అర్చకులు పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు.పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధులు, ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్ : పోషణ్ బీ, పడాయి బీ కార్యక్రమం అమల్లో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు మంగళవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నామని ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 13 ప్రాజెక్టులలో 2389 అంగన్వాడీ కేంద్రాలలో శిక్షణ ఉంటుందని వివరించారు. -
రంగ రంగ.. వైభవంగా !
పులివెందుల : పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణలతో రథాన్ని కదిలించారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డితోపాటు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ చిన్నప్ప, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, కౌన్సిలర్లు కోడి రమణ, పార్నపల్లె కిశోర్, మాజీ బలిజ సంఘం అధ్యక్షుడు సోపాల వీరా, వివిధ శాఖల అధికారులతో స్వామి వారికి పూజలు జరిపించారు. ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ సుధీకర్రెడ్డి, ఈఓ వెంకటరమణ వారికి శాలువతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. రథోత్సవం స్థానిక పూలంగళ్ల సర్కిల్ నుంచి కొనసాగి శ్రీనివాస హాలు రోడ్డు, ముత్యాల వారి వీధి, గుంత బజార్, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూల అంగళ్ల సర్కిల్కు చేరుకుంది. రథోత్సవ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. కదిలింది బ్రహ్మరథం దారిపొడవునా గోవిందా నామస్మరణలు, భజనలు -
వక్ఫ్బోర్డు స్థలంపై కన్నేశారు
ప్రొద్దుటూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్బోర్డు స్థలాన్ని లీజు రూపంలో తక్కువ ధరకు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నేతలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. వక్ఫ్బోర్డుకు సంబంధించి ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లె మసీదు పరిధిలో సుమారు 27 ఎకరాల పొలాలు, స్థలాలు ఉన్నాయి. ఇందులో కోట్ల రూపాయల విలువైన స్థలాలు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్ ఏరియాలో.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికంగా వక్ఫ్బోర్డుకు సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాదిలో 9 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వక్ఫ్బోర్డుకు సంబంధించి సర్వే నంబర్ 293/2లో 39 సెంట్ల స్థలం ఉంది. మొత్తం 40 సెంట్ల స్థలంలో సెంటు స్థలం బైపాస్ రోడ్డు నిర్మాణానికి పోగా మిగిలిన 39 సెంట్లు అలాగే ఉంది. గతంలో వక్ఫ్బోర్డు అధికారులు తమ స్థలమని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి ఎదురుగా ప్రముఖ థియేటర్ ఉంది. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం కమర్షియల్ హబ్గా మారింది. కోట్ల రూపాయల విలువైన స్థలం కావడంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి పరిధిని పెంచారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వక్ఫ్బోర్డు అధికారులు ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వరాదని నిర్ణయించారు. లోపాయికారి ఒప్పందం.. తాజాగా ఈ స్థలాన్ని వెలవలి హుస్సేన్ పీరా అనే వ్యాపారి తక్కువ ధరతో లీజుకు తీసుకునేందుకు దరఖాస్తు చేశారు. లోపాయికారిగా టీడీపీ నేతలతో ఒక ఒప్పందం జరిగినట్లు సమాచారం. మోడంపల్లె మసీదు మేనిజింగ్ కమిటీ ద్వారా ఈ దరఖాస్తును విజయవాడలోని వక్ఫ్బోర్డు కార్యాలయానికి పంపారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో మైనారిటీ సంస్థల ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించారు. బయటికి తెలియకుండా ఒకే దరఖాస్తును తీసుకుని ఎలా పంపారని ప్రశ్నించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజే మోడంపల్లె మసీదులో ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయమై నోటీసు బోర్డులో పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ థియేటర్ యజమాని స్థలాన్ని తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మోడంపల్లె మసీదు మేనేజింగ్ కమిటీ కార్యదర్శి షకిల్ అహ్మద్ను ‘సాక్షి’ వివరణ కోరగా గతంలో వెలవలి హుస్సేన్ పీరా నుంచి వచ్చిన దరఖాస్తును వక్ఫ్బోర్డు కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. నెలకు రూ.40వేలు చొప్పున లీజుకు ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేశారన్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు ఈ స్థలం కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయంపై తుది నిర్ణయం వక్ఫ్బోర్డు పరిధిలో మాత్రమే ఉంటుందని, తమకు సంబంధం లేదన్నారు. రూ.కోట్లు విలువైన స్థలాన్ని చౌకగా కొట్టేసే యత్నం.. టీడీపీ నేతల క్రియాశీలక పాత్ర -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె. ప్రకాష్ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్ డి.ఎస్పీ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు సిబ్బందికి రెండు వారాల పాటు నిర్వహించే మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోం గార్డ్ విధుల్లో చేరేముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. మొబిలైజేషన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్, పర్సనాలిటీ డెవలప్ మెంట్, ఫిజికల్ ఫిట్ నెస్, మాబ్ కంట్రోల్, బందోబస్తు విధులు, డ్రిల్ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తామని ఎస్పీ తెలిపారు. మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ లు శ్రీశైల రెడ్డి, ఆనంద్, వీరేష్, ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు, హోమ్ గార్డులు పాల్గొన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌస్నగర్లో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ సమీపంలో గంజికుంట కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ అల్తాఫ్ను రెండు దొంగతనాల కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐలు ఎస్.కె.ఎం.హుసేన్, సిద్దయ్యలతో కలిసి సోమవారం సంఘటన స్థలంలో తనిఖీలు చేశారు. అతనితో పాటు రూ. 80,000 విలువైన 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 105.5 గ్రాముల బరువున్న రూ.10,000 విలువైన వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మరో సంఘటనలో నిందితుడి వద్ద నుంచి రూ.26.400 విలువైన 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ నాగార్జున, ఎస్ఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్కుమార్ అభినందించారు. సిబ్బంది సహకారంతోనే యూ డైస్ విజయవంతం కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఎంఈఓలు, సమగ్రశిక్ష, ఎంఆర్సీ సిబ్బంది సహకారంతోనే యూ డైస్ విజయవంతం అయిందని డీఈఓ డాక్టర్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలోని ఎస్పీజీ చర్చి సమావేశ మందిరంలో మండల విద్యాశాఖధికారులు, మండల ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, సీఆర్పీ (సీఆర్ఎంటీ )లకు యూ –డైస్ నమోదులో జరిగిన తప్పులను సరిచేసేందుకు, సమగ్ర శిక్ష వార్షిక ప్రణాళిక, బడ్జెట్ 2025–26 లకు సంబంధించి ఒక్క రోజు వర్కుషాప్ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూ డైస్ లో జరిగిన తప్పులను ఎట్టి పరిస్థితుల్లో సరి చేయాలన్నారు. సమగ్రశిక్ష ఎంఐఎస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ లక్ష్మినరసింహరాజు మాట్లాడుతూ సమగ్రశిక్ష వార్షిక ప్రణాళిక, బడ్జెట్కు సంబంధించిన సమాచారం మండలాల నుంచి అప్డేట్ సమాచారాన్ని జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి అందించాలన్నారు. డీఈఓ కార్యాలయం ఏఎస్ఓ బ్రహ్మానందరెడ్డి, ఏపీఓ జాలాపతిలు పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు వీరేంద్ర, దశరథరామిరెడ్డి, రమణమూర్తి పాల్గొన్నారు.12 గ్యాస్ సిలిండర్లు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం -
గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లె పంచాయతీలో జరుగుతున్న బెంగళూరు– అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు పనులను సోమవారం భూ నిర్వాసితులు మల్లేపల్లె దగ్గర అడ్డుకున్నారు. అధికార పార్టీ మల్లేపల్లె సర్పంచ్ చిలమల లక్ష్మిదేవి భర్త నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వాసితులతో రోడ్డు పనులను అడ్డుకున్నారు. రోడ్డు కోసం భూములు కోల్పోయిన తమకు తక్షణం నష్టపరిహారం జిల్లాలో ఇతర మండలాల్లో ఇచ్చిన విధంగా ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ మండల నాయకుడు పెదుల్లపల్లె ప్రభాకర్ కార్యకర్తలతో కలసి మద్దతు పలికారు. తహసీల్దార్ దామోదర్రెడ్డి అక్కడికి చేరుకొని భూ నిర్వాసితులతో మాట్లాడారు. నష్టపరిహారం అధికంగా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల ను విస్మరించడం దారుణంకడప కార్పొరేషన్ : విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, రాయలసీమను రతనాల సీమగా మార్చిన శ్రీకృష్ణదేవరాయలకు కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి దండ వేయకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటక్రిష్ణ అన్నారు. సోమవారం స్థానిక మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయ నగర చక్రవర్తిగా ఆయన సుపరిపాలన అందించారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతిని ప్రజలంతా ఘనంగా నిర్వహించారని, కడప ఎమ్మెల్యే మాత్రం ఆయనకు దండ వేయకపోవడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కిరణ్, గుంటి నాగేంద్ర, రెడ్డి ప్రసాద్, ఉమామహేశ్వరి, సుదర్శన్, రామక్రిష్ణ పాల్గొన్నారు. -
భారతదేశ సంస్కృతి అంటే చాలా ఇష్టం
పులివెందుల టౌన్ : భారతదేశ సంస్కృతి, అలవాట్లు చూడటంతో భారతదేశం పట్ల నాకు చాలా ఇష్టం ఏర్పడిందని రష్యా దేశం రుక్వేనియా ప్రాంతానికి చెందిన రాందాస్ పేర్కొన్నారు. సోమవారం పులివెందుల పట్టణంలోని అంబకపల్లె రోడ్డులో ఉన్న నగరవనం పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసుకున్నారు. రాందాస్ వేసుకున్న చొక్కా కూడా జై శ్రీరామ్ నామాలతో నిండి ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శాంతి నిలయాన్ని సందర్శించి అక్కడి పద్ధతుల గురించి తెలుసుకున్నానని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గండికోట, అహోబిలం ప్రాంతాలను చూడనున్నట్లు తెలిపారు. -
రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన
బద్వేలు అర్బన్ : పట్టణ పరిధిలోని భాకరాపేట సమీపంలో సీపీఐ ఆధ్వర్యంలో వేసిన గుడిసెలలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనకు రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు. సోమవారం భాకరాపేట గుడిసెలలో మృతదేహాన్ని పూడ్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్మశానాలు, గ్రామాల అభివృద్ధికి సీపీఐ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే ఆదివారం చోటు చేసుకున్న ఘటన బాధాకరమని అన్నారు. కేవలం కొందరు భూకబ్జాదారులు మృతురాలి బంధువులను రెచ్చగొట్టి ఘర్షణ జరిగేలా చేశారని, తాము గ్రామస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు. గత నెల రోజులుగా భాకరాపేట గుడిసెలను తొలగించాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగంపై కొందరు ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని అన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలోనే జనావాసాల మధ్య మృతదేహాన్ని పూడ్చివేసిన ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే రెవెన్యూ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పట్టణంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కంచెలు వేసిన వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బాదుల్లా, ఏరియా సహాయ కార్యదర్శి మస్తాన్, ఏరియా కార్యవర్గ సభ్యులు బాలు, పి.వెంకటరమణ, పి.వి.రమణ, ఇమ్మానియేల్, పెంచలయ్య, విజయమ్మ, నాయకులు నాగరాజు, వెంకటేష్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర -
ఒక్క హామీనైనా అమలు చేశారా?
కమలాపురం : కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతున్నా ఒక్క హామీనైనా అమలు చేసిందా? అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్తో పాటు 143 వాగ్ధానాలు చేశారని, అయితే వాటిలో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. సామాజిక భద్రత పింఛన్ల పై సర్వేలు నిర్వహించి 1.80 లక్షల పింఛన్లు తొలగించి రూ.1000 పెంచడం ఏంటని నిలదీశారు. మరో 7–8 లక్షల పింఛన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బు ఏమి చేశారని ప్రశ్నిస్తే చెప్పే నాథుడే కరువయ్యాడన్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం ఉనికే లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడైతే లంచాలు, కమీషన్లు వస్తాయో అక్కడ ఆ నిధులను ఉపయోగించి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారన్నారు. వైఎస్ జగన్ 12–13 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు అబద్ధాలు చెప్పి రాధ్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు రూ.56వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు అధికారం చేపట్టి దిగిపోయే నాటికి రూ.3.78 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. అనంతరం జగనన్న అధికారంలోకి వచ్చి దిగిపోయే నాటికి రూ. 6లక్షల కోట్లు అప్పు ఉంటే జగనన్న ఎంత అప్పు చేశారో ప్రజలందరికి తెలుసన్నారు. అయితే ఆ అప్పుతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం అన్ని అమ్ముకుంటున్నారని, లోకల్ ట్యాక్స్లు విధించి సొంత ఖజానాలు నింపుకుంటున్నారని మండిపడ్డారు. మూడు సార్లు సీఎం, అపార అనుభవం అంటున్న చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి తన బినామీలకు సంపద సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా చక్కెర పరిశ్రమలు, కోఆపరేటివ్ తదితర వాటిని ప్రైవేట్ పరం చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జగనన్న హయాం వరకు కేవలం 11 మెడికల్ కళాశాలు ఉండేవని, జగనన్న 17 కళాశాలలను తీసుకువచ్చి వాటి సంఖ్య 28కు పెంచగా వాటిలో అడ్మిషన్లు వద్దని చెప్పిన అనుభవజ్ఞుడు చంద్రబాబు అని విమర్శించారు. రిజిస్ట్రేషన్, కరెంట్ చార్జీలు పెంచడం సంపద సృష్టించడమా అని అడిగారు. మెనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనన్నారు. తాము పోరాటాలు చేసైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్రెడ్డి, గంగాధర్ రెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కొండారెడ్డి, ఆర్వీఎన్ఆర్, సునీల్రెడ్డి, ఇస్మాయిల్, ఆంజనేయరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామలక్ష్మీరెడ్డి, రాజారెడ్డి, మోనార్క్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ గాలికి వదిలేశారు.. పింఛన్లో కోతలు పెట్టి రూ.1000 పెంచారు ప్రతి నెలా సంక్షేమ పథకాల అమలు జగనన్న ఘనతే మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి -
విషద్రావణం తాగిన వ్యక్తి మృతి
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన నీలం సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆదివారం రాత్రి విషద్రావణం తాగాడు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. మృతుడు అతని మొదటి భార్య, కుమార్తె కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లింగాల : పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, గోపాలకృష్ణ రైతులకు సూచించారు. సోమవారం మండల కేంద్రమైన లింగాలలో రైతు వాసుదేవరెడ్డి పొలంలోని పులి అడుగు జాడలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చిరుత పులి అడుగు జాడలపై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నాగముని (45) అనే మహిళ సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ప్రసాద్కు కళ్లు సరిగా కనపడవు. టిఫెన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగించేవారు. మృతురాలి కుమారుడు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన తల్లి చిన్నచిన్న సమస్యలకు కూడా మానసికంగా బాధపడేదని, క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినూత్న రీతిలో పశువైద్య విద్యార్థుల నిరసన ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం గ్రామం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో సోమవారం కళాశాల విద్యార్థులు తమకు స్టైఫండ్ పెంచాలని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కళాశాలలోని పశువైద్య శాలకు వచ్చిన పాడి గేదెకు వారు వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులతోపాటు సమానంగా తమకు కూడా స్టైఫండ్ పెంచే వరకు సమ్మెను విరమించమని విద్యార్థులు పేర్కొన్నారు. -
విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : పార్వతీపురం మన్యం జిల్లా మకువా మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడి చేసిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు వేణుగోపాల్ నాయుడును తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దాడిని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు పాల్పడుతున్న అవకతవకలు, అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి అల్లరిమూకలను టీడీపీ నాయకులు బహిష్కరించాలని కోరారు. దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన సందర్భాల్లో ఏ సెక్షన్లు వర్తిస్తాయో పాత్రికేయులపై దాడి చేసిన వారిపై కూడా అవే సెక్షన్లను వర్తింపజేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవాధ్యక్షుడు భూమిరెడ్డి శ్రీఽనాథ్రెడ్డి, ఏపీడబ్ల్యు జేఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్రాజు, ప్రధాన కార్యదర్శి నూర్బాషా, జర్నలిస్టు సంఘాల నాయకులు కాటిబోయిన నారాయణ, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని గొళ్లపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవుని కడపకు చెందిన కంబాల సుబ్బయ్య (45) మృతి చెందారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవుని కడపకు చెందిన సుబ్బయ్య తాడిపత్రిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున తన బైక్పై తాడిపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో కమలాపురం మండలం గొళ్లపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని వెళ్లి పోయింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. కాగా మృతునికి భార్య శిరీష, చిన్న వయస్సు గల ఇద్దరు కుమార్తెలు, ఒక ఒక కుమారుడు ఉన్నారు. రెండో మారు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభంప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రెండో మారు ప్రారంభించారు. నాఫెడ్ ద్వారా ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కందుల కనీస మద్దతు ధర క్వింటాలకు రూ.7550 చొప్పున ప్రకటించారు. ఈనెల 11వ తేదీన బీజేపీ నాయకుడు, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇదే కొనుగోలు కేంద్రాన్ని ఇదే స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఒకే కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ, టీడీపీ పార్టీ నేతలు వేర్వేరుగా ప్రారంభించడం గమనార్హం. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా మార్కెట్ యార్డులో కందుల కొనుగోలుకు సంబంధించిన ఏజెన్సీ వ్యక్తిని మార్చడంతోనే ఎమ్మెల్యే ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని తెలిపారు. -
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
కలసపాడు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తెల్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కడప రమణారెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. అనంతరం తెల్లపాడు, దూలంవారిపల్లె గ్రామాల్లో వైఎస్సార్ సమసమాజ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలైనప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఉద్యానశాఖ రాష్ట్ర సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు కె.రమణారెడ్డి, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు అంకన గురివిరెడ్డి, సూదా రామకృష్ణారెడ్డి, సుదర్శన్, పురుషోత్తంరెడ్డి, బి.నారాయణ యాదవ్, చిత్తా రాజశేఖర్రెడ్డి, మాజీ సర్పంచ్లు పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, జి.నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాదక్షుడు
● మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్బాషా ● ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు కడప కార్పొరేషన్: శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాదక్షుడని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కొనియాడారు. ఆదివారం శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటక్రిష్ణ ఆద్వర్యంలో స్థానిక స్థానిక క్రిష్ణా సర్కిల్లోని ఆయన విగ్రహానికి మేయర్ సురేష్ బాబుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ చరిత్రలో మధ్యయుగ రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు మహా కీర్తిశాలి అని తెలిపారు. ఆయన పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చారన్నారు. మనమందరం శ్రీకృష్ణదేవరాయల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు టి.శివశంకర్, అమరప్ప, రాము,యానాదయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,పి. జయచంద్రారెడ్డి, ఐస్క్రీం రవి, షఫీ,కిరణ్, బసవరాజు, శ్రీరంజన్ రెడ్డి, రామచంద్రయ్య, రామ్ లక్ష్మణ్ రెడ్డి,లక్ష్మయ్య, జిలాన్, అరీఫుల్లా, దేవిరెడ్డి ఆదిత్య, సుదర్శన్ రాయల్,రామ్మోహన్ రెడ్డి, సింధు, టి పి సుబ్బమ్మ పత్తి రాజేశ్వరి, మరియలు పాల్గొన్నారు. -
అరుదైన ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి.. ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినుతికెక్కారు. ఆధ్యాత్మిక, దార్శనిక, తాత్విక వేత్త. ఆయన ఫిలాసఫీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ, రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించారు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టిన వాడిగా ఆయనలా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారు లేరు. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్గా ఎదిగారు. 60 ఏళ్లకు పైగా పలు దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించారు. ప్రధానంగా సత్యాన్ని తెలుసుకోవడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలవన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్ర ఆలోచన కలిగించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి. టీచర్ విద్యార్థిలోని సృజనాత్మకతను తట్టి మేల్కొలిపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమను నింపుకున్న వారు మంచి తప్ప చెడు చేయలేరు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్గురువును చేయాలని ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనే అంతర్జాతీయ సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. 1895 మేలో జన్మించిన ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. నేడు వర్ధంతి -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం సరోజినీ నగర్కు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు సరోజినీ నగర్లో నివాసం ఉంటున్న షేక్ షబ్బీర్(35) టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా తాగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య షకీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విష ద్రావణం తాగి వృద్ధురాలు.. కడప నగరం సరోజిని నగర్కు చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. గురజాల చంద్రమ్మ(78) గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది. ఈమెకు కొడుకు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ చర్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
●బకాయిలకే గత బడ్జెట్
బి.కొత్తకోట: హంద్రీ–నీవా ప్రాజెక్టులోని ప్రధాన కాలువ, ఉపకాలువలు, రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పారాలంటే 2025–26 బడ్జెట్లో కోరినంత నిధులు ఇవ్వాలి. కరువు రైతుల కల్పతరువైన సాగు, తాగునీటి ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తుందా లేక మొక్కుబడి నిధులతో మొండిచెయ్యి చూపుతుందా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులనే కేటాయింపులు చేసి చేతులు దులుపు కుంటుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు కృష్ణా జలాలు అందిస్తారన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంత నిధులను బడ్జెట్లో కేటాయించలేదు. దీంతో పనులు ముందుకు సాగడంలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పథకాలను కూటమి ప్రభుత్వం కక్షకట్టి రద్దు చేసేసింది. వారికి అనుకూలమైన పనులు చేపట్టి నిధులను ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటుతో చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు ఆశించినంత ఇస్తారా లేదా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.3,500 కోట్లు ఇవ్వండి హంద్రీ–నీవా ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ ఉమ్మడిజిల్లాల్లో సాగుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న, చేపట్టబోయే పనులకు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు పంపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కాలువ వెడల్పు చేయడం, కొన్ని కాంక్రీటు, మట్టి పనులు రూ.1,240 కోట్లతో చేపట్టారు. ఇదికాక ప్రధాన కాలువకు సంబంధించి మరో రూ.503 కోట్లతో పనులు సిద్దం చేశారు. ఈ మొత్తం పనులకే రూ.1,700 కోట్లు కావాలని నివేదించారు. ఇవికాక కర్నూలు జిల్లాకు రూ.450 కోట్లు పోను, మిగిలిన రూ.1,350 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనులను ఈ నిధులతో చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి చిత్తూరుకు రూ.2 వేల కోట్లు కావాలి విభజిత అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఇంచుమించు రూ.2 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇందులో ప్రాజెక్టులో అసంపూర్తి పనులు చేపట్టి పూర్తి చేసేందుకు రూ.729 కోట్లు అవసరం ఉందని అధికారిక నివేదిక చెబుతోంది. ప్రాజెక్టులో భాగమైన ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కాలువలు, స్ట్రక్చర్స్లో పెండింగ్లోని పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిధుల్లో రూ.250 కోట్లతో ప్రధానకాలువపై చిన్నమండెం మండలం పడమటికోన, కలకడ వద్ద కాలువ తవ్వకం, 12 చోట్ల కాంక్రీటు నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే కానీ అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వెళ్లవు. ఈ రూ.250 కోట్ల నిధులకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ●లైనింగ్కే రూ.684 కోట్లు ●వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిధులే ఇస్తారా? హంద్రీ–నీవా ప్రాజెక్టు మొత్తానికి రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన ప్రాజెక్టు పెండింగ్ పనులకు రూ.729 కోట్లు అవసరం 2024–25 బడ్జెట్ బకాయిలకేసరిపెట్టిన ప్రభుత్వం కృష్ణాజలాలు పారాలంటేపుష్కలంగా నిధులు ఇవ్వాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిధులే కేటాయించే అవకాశం పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కాలువకు లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం నుంచి చిత్తూరుజిల్లాలోని పెద్దపంజాణి మండలం వరకు పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులను రూ.480 కోట్లతో, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు కుప్పం ఉపకాలువకు రూ.204 కోట్లతో లైనింగ్ పనులను చేపట్టారు. ఇదికాక కుప్పం కాలువకు సంబంధించి ఇంకా రూ.59 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆరునెలల్లో ఈ లైనింగ్ పనులు పూర్తి జరగాలంటే బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి. ఇప్పటికే కృష్ణా జలాల తరలింపుని నిలివేసిన ప్రభుత్వం లైనింగ్ పనులకు నిధులు ఇవ్వకుంటే రైతులు నష్టపొవాల్సి వస్తుంది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి కుప్పానికి రూ.535 కోట్లతో యామిగానిపల్లె వద్ద 0.7 టీఎంసీలు, మాదనపల్లె వద్ద 0.3 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని బడ్జెట్లో అనుమతి ఇస్తారో లేదో చూడాలి. 2014–15 బడ్జెట్లో ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.611 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పనులు జరగడం కంటే బకాయిల చెల్లింపుకే సరిపోయింది. ఇప్పటిదాకా రూ.400 కోట్లు చెల్లించగా మిగిలిన నిధులతో మరోనెలలో జరిగే అభివృద్ధి పనులు పెద్దగా ఉండకపోవచ్చు. పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే.. మదనపల్లి సర్కిల్లోనూ ఉన్నాయి. ఇవికాక ఎత్తిపోతల పథకాల కోసం వినియోగించిన విద్యుత్కు రూ.4 వేల కోట్ల మేరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో రూ.450 కోట్ల మేర చెల్లించగా వచ్చే బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలో కోరారు. 2015–26 బడ్జెట్ కేటాయింపు విషయంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసి, వినియోగించుకోని నిధులను మిగులుగా చూపిస్తోంది. ఇవే నిధులను కొత్త బడ్జెట్లో కేటాయించే అవకాశం లేకపోలేదు. పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) విస్తరణ పనులకు 2020లో సీఎం వైఎస్.జగన్ నిధులు మంజూరు చేయగా రూ.1,217 కోట్లతో కాంట్రాక్టర్కు పని అప్పగించి ఒప్పందం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కాలువకు రూ.480 కోట్లతో లైనింగ్ పని చేపట్టింది. దీనికి సంబంధించి జారీ చేసిన జీవోలో రూ.1,217 కోట్ల పనిలో మిగులు నిధులు ఉన్నాయని, వాటిలో రూ.480 కోట్లతో లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టంగా పేర్కొంది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో ఇంకా రూ.1,177 కోట్లు మిగులు నిధులు అందుబాటులో ఉన్నట్టు లెక్క.కుప్పం రిజర్వాయర్ల కోసం మంజూరు చేసిన మరో రూ.535 కోట్లు వినియోగించుకోలేదు కాబట్టి ఈ నిధులను మిగులుగా చూపవచ్చు. కాబట్టి ఎలా చూసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులే వచ్చే బడ్జెట్లో కేటాయింపు ఉండొచ్చన్నది స్పష్టం అవుతోంది. -
కమనీయం.. రంగనాథుని కల్యాణం
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వైభోగం కన్నుల పండువగా సాగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులచే కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై పట్టణ పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరాలను సమర్పించారు. నేడు బ్రహ్మరథోత్సవం: బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సోమవారం ఉదయం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం (తేరు)నిర్వహించనున్నారు. బ్రహ్మరథం ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ చైర్మెన్ సుధీకర్రెడ్డి, ఈఓ రమణ పర్యవేక్షిస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ సభాభవన్లో నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా ఉంటుందని వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా అందజేయొచ్చని సూచించారు. 9.30 నుంచి డయల్ యువర్ కలెక్టర్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్ఎ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం జిల్లా జట్టుకు ఎంపికలు నిర్వహించారు. సీమ స్థాయి బాల్ బాడ్మింటన్ టోర్నీ విజేత శ్రీకాళహస్తి రాజుపాళెం: రాయలసీమ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకాళహస్తి టీం విజేతగా నిలిచింది. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజుపాళెం కిరణ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శని, ఆది వారాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా విజేత జట్టుకు రూ.15,016లను వీరశంకర్ అందజేశారు. అలాగే రన్నరప్గా నిలిచిన నంద్యాల జట్టుకు రూ.12,016 సుభద్రమ్మ్డ అందించగా, మూడవ బహుమతిగా పీలేరు జట్టుకు రూ.10,016 జయరామిరెడ్డి, నాల్గవ బహుమతిగా కోవెలకుంట్ల జట్టుకు 8,016 బాబుసాహెబ్, ఐదవ బహమతిగా రాజుపాళెం జట్టుకు రూ.5016లతో పాటు మెమెంటోలను లెక్చరర్ జయరాముడు అందించారు. భారతామృతాన్ని పంచిన ప్రజ్ఞానిధి ‘భూతపురి’ కడప కల్చరల్ : మహాభారతమనే అమృతాన్ని అందరికీ పంచి పెట్టిన మహాకవి భూతపురి సుబ్రహ్మణ్యశర్మ ప్రజ్ఞానిధి అని వక్తలు కొనియాడారు. డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ స్మారక ట్రస్టు, అల్లసాని పెద్దన సాహిత్య పీఠంతో కలిసి ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంఽథాలయంలో భూతపురి 88వ జయంతి సందర్భంగా 23వ సాహిత్య పురస్కారాన్ని రిటైర్డ్ ఇంజనీర్ పుత్తా పుల్లారెడ్డికి ప్రదానం చేశారు. తొలుత డాక్టర్ భూతపురి చిత్రపటానికి పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య శలాక రఘునాథ శర్మ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. భూతపురి సుబ్రహ్మణ్యశర్మ సాహిత్యంలో అనితర సాధ్యమైన కృషి చేసిన మహా రుషియని అభివర్ణించారు. అలాంటి మహాకవి పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని పుత్తా పుల్లారెడ్డి లాంటి సాహితీ వేత్తకు ఇవ్వడం సమంజసంగా ఉందన్నారు. సత్కార గ్రహీత పుత్తా పుల్లారెడ్డి మహాభారతాన్ని ఔపోసన పట్టిన వాంగ్మయ తపస్వి అని అభివర్ణించారు. డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూని వర్సిటీ కులపతి ఆచార్య విశ్వనాథ కుమార్, వైవీయూ ఉపకులపతి కృష్ణారెడ్డి , ఆకాశవాణి పూర్వ డైరెక్టర్ ఆకుల మల్లేశ్వరరావు, డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ , వైవీయూ పాలకమండలి సభ్యులు మూల మల్లికార్జునరెడ్డి , బ్రౌన్ కేంద్రం సంచాలకులు ఆచార్య పార్వతి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భూతపురి కుటుంబం సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
రైతుకు గుర్తింపు
కడప అగ్రికల్చర్: దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్కార్డుతో గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతి రైతులకు కూడా 11 అంకెలు కలిగిన యూనిక్ ఐడీ నెంబర్తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను రైతులకు అందించేందుకు కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పత్రం జారీ పక్రియ జిల్లాలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జిల్లాలో రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. జిల్లా మొత్తం 3,31,665 మంది రైతులు ఉండగా వీరిలో పీఎం కిసాన్కు సంబంధించి 1,93,253 మంది ఉన్నారు. వీరిలో 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది వ్యవసాయ డివిజన్లకు సంబంధించి 61,368 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియలో పులివెందుల డివిజన్ జిల్లాలో ప్రథమస్థానంలో నిలువగా కడప రెండవస్థానంలో నిలిచింది. రైతులకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పథకాలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. నమోదుకు అవసరమైన ధ్రువ పత్రాలు... రైతు ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, వన్బీ, ఆధార్కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్తారు. రైతు మొబైల్ ఫోన్కు మూడు ఓటీపీలు వస్తాయి, ఆ ఓటీపీలను వ్యవసాయ సిబ్బందికి తెలియచేస్తే రైతు యూనిక్ ఐడీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. రైతుకు ఒనగూరే ప్రయోజనాలు... ఆధార్ మాదిరిగా యూనిక్ కోడ్తో జారీ చేసే ఈ కార్డులతో రైతులకు ఐడీ కార్డుగా ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలను రైతుల యూనిక్ కోడ్తో అనుసంధానం చేస్తారు. రానున్న రోజుల్లో ఈ యూనిక్ నెంబర్ ఉన్న రైతులకు వ్యవసాయ పథకాలు, ఎరువులు, పంటల బీమా అందుతాయని అధికారులు అంటున్నారు. అలాగే ఈ యూనిక్ నెంబర్ను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు లింక్తో కూడిన సేవలు పొందవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాలు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయి. వీటితోపాటు ఇతర సేవలైన నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటీ సేవలు కూడా పొందేందుకు వీలవుతుంది. ఆధార్ తరహాలో 11 అంకెల నెంబర్ ఐడీ సొంత భూమి ఉన్న వారే అర్హులు భవిష్యత్తులో పథకాల అమలుకు అదే ప్రామాణికం జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో ముమ్మరంగా నమోదు ప్రక్రియ డివిజన్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ప్రతి రైతు నమోదు చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ యూనిక్ ఐడీని ప్రతి రైతు పొందాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలు ఈ ఐడీ కార్డు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలాగే ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయిల్ కంపెనీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ద్వారా, క్లీన్ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ పరిరక్షణ అనే నినాదం కోసం కడప నగరంలోని మహావీర్ సర్కిల్వద్ద హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలింగ్ కార్పొరేషన్ ఆయిల్ ఇండస్ట్రీ సంస్థలకు చెందిన ప్రతినిధులు, సంబంఽధిత ఉద్యోగులు వాక్ థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం ముడిసరుకు దిగుమతులపై ఆధారపడడం, తగ్గించడంలో మనందరం భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించడంతోపాటు మహావీర్సర్కిల్ నుంచి రిమ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ పెట్రోలియం కడప ఆర్ఎం మన్మథరావు, చీఫ్ డిపో మేనేజర్ హెచ్పీసీఎల్ సతీష్కుమార్, వీడీపీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓబయ్య, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ గంగన్న, హెచ్పీసీఎల్, డీపీసీఎల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శవం పూడ్చే విషయంలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పూడ్చే విషయంలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ నాయకులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు బద్వేలు – కడప రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరకు పోలీసు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఎట్టకేలకు గ్రామస్తులు శవాన్ని పూడ్చివేశారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని భాకరాపేట సమీపంలోని చెన్నంపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 1580లో గల చెరువు పోరంబోకు స్థలంలో ఆరు నెలల క్రితం సీపీఐ నాయకులు గుడిసెలు వేయించారు. సదరు స్థలాన్ని భాకరాపేట, విద్యానగర్, బయనపల్లె గ్రామాలకు చెందిన వివిధ కులాల వారు శ్మశానంగా వినియోగిస్తున్నారు. అయితే ఆదివారం భాకరాపేట గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సీపీఐ నాయకులు వేసిన గుడిసెల వద్దకు తీసుకెళ్లారు. ఇక్కడ శవాన్ని పూడ్చవద్దంటూ సీపీఐ నాయకులు, గుడిసెవాసులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకోవడంతో భాకరాపేట గ్రామానికి చెందిన సుబ్బరామయ్య, శివ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు బద్వేలు – కడప రహదారిలోని విద్యానగర్ సమీపంలో రోడ్డుపై ముళ్లకంచె వేసి బైఠాయించి ఆందోళన చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్, రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గ్రామస్తులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. తిరిగి శవాన్ని పూడ్చే క్రమంలో చెరువు పోరంబోకు స్థలం వద్దకు వెళ్లగా తిరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే స్థలాన్ని శ్మశానంగా ఉపయోగించుకుంటున్నామని, ఇప్పుడు శవాన్ని పూడ్చవద్దంటే ఎలా అని గ్రామస్తులు సీపీఐ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సీపీఐ కాలనీకి చెందిన శ్రీను అనే యువకుడు శవాన్ని ఇక్కడ పూడ్చితే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోలు మీద పోసుకుని హల్చల్ చేశాడు. ఇంతలో పోలీసులు అప్రమత్తమై సదరు యువకుడిని స్టేషన్కు తరలించారు. పోలీసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఇది చెరువు పోరంబోకు స్థలమని తేల్చారు. ఇదే సమయంలో గ్రామస్తులంతా ఏకమై సదరు చెరువు పోరంబోకు స్థలంలోనే శవాన్ని పూడ్చిపెట్టారు. తిరిగి ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీఐ నాయకులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం -
వెంటాడుతున్న చిరుత భయం
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో ఆదివారం చిరుత పిల్ల కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతలు సంచరిస్తున్నాయని వారు భయాందోళన చెందుతున్నారు. గత 30 రోజులుగా చిరుత, వాటి పిల్లలు లింగాల, పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లోని గ్రామాల్లో సంచరిస్తున్న విషయం విదితమే. లింగాల, పులివెందుల మండలాల్లో ప్రతి రోజు ఏదో ఒక గ్రామంలో చిరుత అడుగులు, చిరుత పిల్లలు కనిపిస్తూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్పా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రాణాలు పోయే వరకు స్పందించరా.. సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలు పోయేంత వరకు అధికారులు మీరు స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో నూగు పంటలో చిరుత పిల్ల కనిపించిందని గ్రామానికి చెందిన గంగిరెడ్డి తెలిపారు అలాగే లింగాల మండల కేంద్ర సమీపంలో చిరుత అడుగు జాడలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు ఇంకా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జంతువుల ప్రాణాలకే కాదు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా అటవీ అధికారుల దాటవేత వైఖరికి కారణమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికై నా వారు స్పందిస్తారా.. ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే. లింగాలలో పులి అడుగుజాడలులింగాల : మండల కేంద్రమైన లింగాలలో చిరుత పులుల అడుగుజాడలు కనిపించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని చౌడమ్మ పొలాల్లో ఆదివారం ఒక చిరుత పులి, రెండు చిరుత పులి పిల్లల అడుగుజాడలు కనిపించాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన వాసుదేవ రెడ్డి అనే రైతు పొలంలోని అరటి తోటలో కూడా అడుగుజాడలు కనిపించాయన్నారు. పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా పరిశీలించారు. రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పులివెందుల రూరల్ : పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ సీఐ రమణ తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాద్రిపురం మండలం రామాపురం, బలపనూరు గ్రామాల శివారు ప్రాంతాలలో 10 రోజుల కిత్రం విద్యుత్ తీగలు తగులుకుని మగ చిరుత మృతి చెందింది. దీంతో ఆడ చిరుతతో పాటు రెండు పిల్లలు సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని పలు గ్రామాలలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తోటల వద్దకు వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుతలు సంచరించే గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తుమ్మలపల్లె సమీపంలో చిరుత పిల్ల సంచారం పట్టించుకోని అటవీ అధికారులు భయాందోళనలో గ్రామస్తులు -
న్యాయవాదిపై దాడి
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని దొరసానిపల్లెకు చెందిన న్యాయవాది నల్లగారి పద్మనాభరెడ్డి, ఆయన కుమారుడు తమ్మిరెడ్డిలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జింకా మూర్తి, జింకా సాగర్తో పాటు కొందరు వ్యక్తులు జీఎస్టీ స్కాం చేస్తున్నారని పద్మనాభరెడ్డి జీఎస్టీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోపం పెంచుకున్న జింకా మూర్తి, జింకా సాగర్, నాగరాజు, శివప్రసాద్ అనే వ్యక్తులు ఆదివారం సాయంత్రం దొరసానిపల్లెలోని పద్మనాభరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. 12 మంది జూదరుల అరెస్టుజమ్మలమడుగు రూరల్ : మండల పరిధిలోని దేవగుడి, సలివెందుల గ్రామ శివార్లలో జూదమాడుతున్న 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,12,800 స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ ఎస్. లింగప్ప తెలిపారు. ఆదివారం సాయంత్రం పోలీస్ సిబ్బందితో కలసి దాడి చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో చల్లా రమేష్ నాయుడుతో పాటు 11 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. -
అధ్వానంగా రహదారి
కడప కార్పొరేషన్ : కడప నగర శివార్లలో పాలెంపల్లె నుంచి రాచనాయపల్లె వరకు ఉన్న తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కడప రింగు రోడ్డు నుంచి రాచనాయపల్లె నుంచి సుమారు 3 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు పూర్తిగా తారు లేచిపోయి గుంతలు ఏర్పడి రాళ్లు తేలి ఉంది. రామనపల్లె, మూలపల్లె, గుర్రంపాడు, ఓబులంపల్లె తదితర గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగానే కడపకు రావాల్సి ఉంటుంది. రామనపల్లె నుంచి రాచనాయపల్లె వరకూ రోడ్డు బాగానే ఉందిగానీ...రాచనాయపల్లెలోనూ సగం రోడ్డు మాత్రమే సిమెంటు రోడ్డు వేసి, మిగిలిన సగం కంకర వేసి అసంపూర్తిగా ఆపేశారు. దీంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాచనాయపల్లె నుంచి కడప రింగురోడ్డు వరకూ ఉన్న రోడ్డులో వెళితే ప్రత్యక్ష నరకం కనబడుతుంది. అడుగుకో గుంతతో ఎగుడుదిగుడు ప్రయాణం వల్ల ఒళ్లు హూనం కాక తప్పదు. రోడ్డంతా రాళ్లు తేలి ఉండటం వల్ల టైర్లు తగులుకుని ఆ రాళ్లు ఎగిరిపడుతున్నాయి. వర్షాకాలంలో అయితే ఒక్కో గుంత చిన్నసైజు చెరువులను తలపిస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం రోడ్లపై గుంతలను పూడ్చాలని నిర్ణయించినప్పుడు ఈ గుంతల్లో కంకర వేశారేగానీ పూర్తిగా మరమ్మతులు చేయలేదు. పంచాయతీరాజ్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగుచేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు. తారు లేచిపోయి రాళ్లు తేలి.. అడుగుకో గుంతతో గ్రామస్తుల ఇబ్బందులు గుంతల రహితమన్నారు.. గుంతలమయం చేశారు -
దేవదాయశాఖ అధికారులను అడ్డుకున్న పద్మశాలీలు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో 32 సంవత్సరాల క్రితం గ్రామస్తులు భద్రావతి భావనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ ఆలయం ఇప్పుడు దేవదాయశాఖ ఆధీనంలో ఉందంటూ బోర్డు నాటే ప్రయత్నం చేసిన ఎండోమెంట్ అధికారులను ఆదివారం గ్రామంలోని పద్మశాలీలు అడ్డుకున్నారు. దీనిపై ఆలయ ధర్మకర్త కేసీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పెద్దలకుగానీ, కమిటీ సభ్యులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవదాయశాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ జనార్దన్లు ఉన్నట్లుండి ఆదివారం అనధికారికంగా వచ్చి ఆలయం దేవదాయశాఖ ఆధీనంలో ఉందంటూ బోర్డునాటే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని పద్మశాలీలు అడ్డుకున్నారు. కమిటీ సభ్యులు ఎస్.వి.కృష్ణయ్య, పన్నెల చంద్రశేఖర్, బోగా శంకరయ్య, పోలిచెర్ల శ్రీనివాసులు, పద్మశాలీల ప్రెసిడెంటు బోడిగల అనంతరామయ్య పాల్గొన్నారు. -
ఆటోను ఢీ కొన్న ట్రాక్టర్
కమలాపురం : పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జీవంపేటకు చెందిన షేక్ పీరా వలి తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీరావలి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కమలాపురం పట్టణం నుంచి క్రాస్ రోడ్డుకు పీరా వలి తన ఆటో నడుపుతూ వస్తున్న క్రమంలో హెచ్పీ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మార్కెట్ యార్డులో నుంచి వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో పీరావలి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటో కూడా దెబ్బతిన్నది. 108 వాహనం ద్వారా క్షతగాత్రుడిని కడపలోని ఆసుపత్రికి తరలించారు. సోషియాలజీలో అరుణ కుమారికి డాక్టరేట్ కడప ఎడ్యుకేషన్ : శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని సోషియాలజీ విభాగం పరిశోధక విద్యార్థిని ఐ. అరుణకుమారికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి మూడే దామ్లానాయక్ తెలిపారు. యూనివర్సిటీలోని సోషియాలజీ విభాగానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో ‘హెల్త్కేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్.. ఎ కేస్ స్టడీ ఆఫ్ ఆరోగ్య శ్రీ ప్రోగ్రాం ఇన్ వైఎస్సార్ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై పరిశోధన గ్రంధాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఇందుకు ఎస్వీ యూనివర్సిటీ అరుణకుమారికి పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసింది. కాపర్ వైరు చోరీ చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్ ఖాజీపేట : కంచే చేను మేసిందన్న సామెత చందాన దొంగ సొత్తుకు కాపలా కాయాల్సిన రక్షక భటుడే దాన్ని చోరీ చేశాడు. చివరకు ఉన్నతాధికారులు గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఖాజీపేట పోలీస్ స్టేషన్లో కాపర్ వైర్ చోరీ చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖాజీపేట మండలంలో 2024లో రెండు ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగలు చోరీ చేశారు. ఈ సంఘటనపై ఖాజీపేట స్టేషన్లో రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాజీపేట సీఐ మోహన్ దొంగలను పట్టుకుని వారి నుంచి కాపర్ వైర్ రికవరీ చేశారు. 14 కేజీల కాపర్ వైర్ను పోలీస్ స్టేషన్ లాకప్లో ఉంచారు. లాకప్లోని కాపర్ వైర్ను తిరిగి కేసులో చూపించాలని ప్రయత్నించిన పోలీసులకు కాపర్ వైర్ కనిపించలేదు. ఈ విషయమై విచారణ జరిపిన సీఐ సీసీ పుటేజ్లను పరిశీలించారు. ఈ పరిశీలనలో కానిస్టేబుల్ చిన్నయ్య చోరీ చేసినట్లు గుర్తించారు. అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సీఐ నివేదిక పంపారు. ఈమేరకు జిల్లా ఎస్పీ అంతర్గత విచారణ జరిపి కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. బైరెటీస్ మిల్లులను ఆదుకోండిఓబులవారిపల్లె : మంగంపేట గనుల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న బైరెటీస్ మిల్లులను ఆదుకోవాలని, అందులో పనిచేస్తున్న కార్మికులను కాపాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్, పోరాట కమిటీ కన్వీనర్ పి.జాన్ ప్రసాద్ కోరారు. -
గడ్డివాములు, బైక్ దగ్ధం
వేంపల్లె : గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గడ్డివాములు, 2 మోటార్ బైకులు దగ్ధం అయినట్లు బాధితుడు తెలిపారు. ఆదివారం రాయచోటి–పులివెందుల బైపాస్ రోడ్డులో ఒక ప్రైవేట్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడి కథనం మేరకు.. గత నాలుగేళ్లుగా బైపాస్రోడ్డులో వరి గడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టడంతో పెద్దగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్ వారి సహకారంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే గడ్డివాము పూర్తిగా కాలి పోయింది. అలాగే పక్కనే ఉన్న 2 మోటార్ బైకులు కూడా కాలి పోయాయని బాధితుడు తెలిపారు. -
ఆపద వేళ అండగా పోస్టల్ బీమా
● తపాలాశాఖ ఖాతాదారులకు ప్రత్యేకం ● రూ.10 లక్షలు, రూ. 15 లక్షలు బీమా పథకాలు ● 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్కులు మాత్రమే అర్హులుకడప వైఎస్ఆర్ సర్కిల్ : పేద, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీని ప్రవేశ పెట్టింది తపాలా శాఖ. రూ.599 ప్రీమియంతో రూ. 10 లక్షలు , రూ.799 ప్రీమియంతో రూ. 15 లక్షలు బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారుడికి ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు కవరేజ్ వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వయస్కుల వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. 2022 ఏప్రిల్లో తొలిసారిగా తపాలాశాఖ ఈ పథకాలను ప్రవేశ పెట్టింది. ఇప్పటికే కడప డివిజన్లో అధిక సంఖ్యలో పాలసీలను తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాలసీ పొందాలంటే.. ఈ పాలసీలు పొందాలంటే ముందుగా పోస్టల్ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఖాతా లేనివారు రూ. 200తో నూతనంగా తెరవాలి. బీమా పాలసీకి రూ.599 గానీ, రూ.799 గానీ చెల్లించాలి. ప్రమాదం సంభవిస్తే మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. దీర్ఘకాలిక పక్షవాతం ఉన్నవారికి వర్తించదు. పాలసీ కోసం నగదు చెల్లించిన రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి బీమా రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు. పాలసీదారులకు ఒక బాండ్ కూడా ఇస్తామన్నారు. ప్రయోజనాలీవీ.. ● రూ.799 రూ.599 చెల్లిస్తే స్టార్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా బీమా ● ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.15 లక్షలు, రూ.10 లక్షలు ● శాశ్వత, పాక్షిక వైకల్యం అయితే రూ.15 లక్షలు, రూ.10 లక్షలు ● పిల్లల విద్యా ప్రయోజనం కోసం రూ. 50 వేలు, గృహ స్వస్థత రూ. 7వేలు, రూ. 5వేలు ● ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులకు రూ. లక్ష, రూ. 75 వేలు ● హాస్పిటల్ నగదు ప్రయోజనం రోజుకు రూ. వెయ్యి (రూ. 6 వేల వరకు) ● దిగుమతి చేసుకున్న మందులు రవాణా ఖర్చులకు రూ. 14 వేలు, రూ.12 వేలు ● అంబులెన్స్, పార్థివదేహాన్ని తరలించేందుకు రవాణా ఖర్చులు రూ. 11 వేలు, రూ. 9 వేలు ● ఒక బంధువు ప్రయాణ ఖర్చు రూ. 11 వేలు, రూ. 9 వేలు ● అంత్యక్రియల ఖర్చులు రూ. 9 వేలు, రూ. 7 వేలు అన్లిమిటెడ్ టెలికన్సల్టెన్సీ ● ప్రమాదం ఏ విధంగా జరిగినా పాలసీ కచ్చితంగా వర్తించేలా నిబంధనలు రూపొందించారు. -
బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు
రాయచోటి టౌన్: శ్రీ వీభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ఫైర్ స్టేషన్ అధికారులు, ఫైర్ ఇంజిన్తో ఆలయ ప్రధాన గోపురాలను శుభ్రం చేశారు. ఆలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. 18న రామాయణంపై సదస్సు కడప కల్చరల్: తెలుగులో వచ్చిన రామాయణాలపై కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నామని యోగి వేమన విశ్వవిద్యాలయం, సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఆచార్య జి.పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం సహకారంతో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. తెలుగులో రామాయణాలు–సామాజిక దృక్పథం అనే అంశంపై ఈ సదస్సు ఉంటుందని తెలిపారు. వైవీయూ వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. బ్రౌన్ కేంద్రం డైరెక్టర్ ఆచార్య జి.పార్వతి సమన్వయకర్తగా, ప్రాచీన విశిష్ఠ అధ్యయన కేంద్రం డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్కుమార్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో రామాయణంపై దాదాపు 100 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొంటారన్నారు. అలాగే పలువురు విదేశీ పరిశోధకులు పత్ర సమర్పణలు చేస్తారని వివరించారు. -
విద్యుత్షాక్తో రైతు మృతి
మైలవరం : మండల పరిధిలోని తొర్రివేముల గ్రామంలో రైతు విద్యుత్షాక్కు గురై మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మప్ప (36)అనే వ్యక్తికి ఏడు ఎకరాల పొలం ఉండగా తొర్రి వేముల గ్రామ సమీపంలో ఉన్న నొస్సం బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న పంట పొలంలో మిరప పంటను సాగు చేసుకుంటున్నాడు. చాలా మంది రైతులు బ్రాంచ్ కెనాల్లో నుంచి నీటిని మళ్లింపుకోసం ప్రత్యేక మోటర్లను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు తిమ్మప్పకు కూడా మోటారు ఉండటంతో ఉదయం పంటకు నీరు అందించాలని పొలానికి వెళ్లాడు. అయితే స్టాటర్ల జాయింట్ అయి ఉండటం వల్ల మోటారు వేయబోతు విద్యుత్షాక్కు గురై మృతి చెందాడని ఎస్ఐ శ్యాం సుందర్రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలతోపాటు భార్య ఉన్నారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు ఆవుల వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోన్లో మృతుని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి ప్రకటించారు. నాలుగు బైక్లు స్వాధీనం పోరుమామిళ్ల : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన నాలుగు బైకులను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం సాయంత్రం పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలో బైకు చోరీకి గురైందని స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రం సీతారామపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన బైకును గుర్తించామన్నారు. దొంగిలించిన బైక్పై వెళుతున్న లూజరయ్య, రవీంద్రలను విచారించగా చోరీలను ఒప్పుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని కడప రిమ్స్, కడప టౌన్, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ళ పట్టణంలో దొంగిలించిన నాలుగు బైక్లను బొప్పాపురం గ్రామానికి సమీపంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్ఐ కొండారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల వద్ద ఉన్న శ్రీరంగనాథస్వామి కాంప్లెక్స్లో జరుగుతున్న శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మండపంలో స్వామివారికి అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, ఈఓ రమణ పర్యవేక్షించారు. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీరంగనాథస్వామి పట్టణ పురవీధులలో ప్రత్యేక వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. పట్టణంలోని మెయిన్ బజార్, ముత్యాలవారివీధి, గాడిచర్లవీధి, అమ్మవారిశాల వీధుల మీదుగా ఊరేగారు. శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీరంగనాథస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
సిద్దవటం: మహా శివరాత్రి ఉత్సవాల్లో శ్రీ నిత్యపూజ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కడప ఆర్డీఓ జాన్ఇర్విన్ పేర్కొన్నారు.సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీంలో వెలసిన నిత్యపూజ స్వామి మహాశివరాత్రి ఉత్సవాలపై శనివారం పంచలింగాల వద్ద అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచలింగాల వద్ద, కాలినడక మార్గంలో, ఆలయం వద్ద మొత్తం మూడు వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. శానిటేషన్పై దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నలిపేలా చూడాలని తెలిపారు. భక్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని దేవదాయశాఖ అధికారులకు సూచించామన్నారు. 108, 104 వాహనాలను పంచలింగాల వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు మాట్లాడుతూ 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పంచలింగాల వద్ద, ఆలయం ఆవరణలో రెండు వైర్లెస్ సెట్లను అమరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, ఆర్డీ ఏఓ శంకర్రావు, రేంజర్ కళావతి, వీఆర్వో ప్రభాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంధ్య, సర్పంచ్ ప్రతినిధి లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ -
రెవెన్యూ అధికారుల పనితీరు మెరుగుపడాలి
కడప సెవెన్రోడ్స్: రెవెన్యూ అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకుని అర్జీలను బాధ్యతాయుతంగా, జవాబుదారి తనంతో పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో జమ్మలమడుగు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలు, మండల సర్వేయర్లతో నిర్వహించిన ఒక రోజు వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలని చెప్పారు. గ్రీవెన్స్సెల్ అర్జీలను ఆయా గ్రామాల వారీగా క్రోడీకరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్ష నిర్వహిస్తోందని తెలిపారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. భూముల అంశంలో పారదర్శక విచారణ జరిపి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ విచారణలు నిర్వహించే సందర్భంలో సర్వేయర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి ప్రతి మండల స్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. అసైన్డ్ భూములు, ఆర్ఓఆర్, పట్టాదారు పాసుపుస్తకాలు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నయ్య, సాయిశ్రీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
గండి కొడతారా.. కోట కడతారా!
కడప కల్చరల్: కూటమి ప్రభుత్వం జిల్లా పర్యాటకాభివృద్ధికి పథకాల ఊరింపుతోనే సరిపెడుతోంది. ప్రణాళికల పేరిట గడువు పెడుతూ కాలయాపన చేస్తోంది. జిల్లా పర్యాటకంపై ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తూ.. అమల్లోకి వచ్చేసరికి రిక్తహస్తం చూపిస్తోంది. తాజాగా గురువారం సంబంధిత మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లా పర్యాటకానికి కూడా పలు వరాలు కురిపించారు. ప్రధానంగా గండికోటపై దృష్టి సారించారు. దేశంలోనే ఇలాంటి ప్రాంతం లేదని, ఈ అద్భుతమైన ప్రాంతం వన, జల, గిరిదుర్గంగా ప్రాధాన్యత సంతరించుకుందని ప్రశంసించారు. గండికోటను బ్రాండింగ్ చేయాలని, టెంట్ సిటీగా ప్రకటించాలని కూడా సూచించారు. సాస్ కీ పథకంలో భాగంగా గండికోటను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇప్పటికే గండికోటను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. జిల్లాలోని పెద్దదర్గా, గండికోట, ఒంటిమిట్ట, సోమశిల ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్లో చోటు కల్పించారు. ఇంకా జిల్లాకు సంబంధించి పర్యాటకంగా పలు పథకాలు సూచించారు. పథకాల ఊరింపు బాగానే ఉంది.. వీటి అమలు ఎప్పుడని పర్యాటకాభిమానులు ప్రశ్నిస్తున్నారు. కోటలు దాటే మీ మాటల్ని కట్టిపెట్టి... ఈసారైనా వాటిని అమలు చేయండి బాబూ.. అంటూ విన్నవిస్తున్నారు. అభివృద్ధి ఎలా? పర్యాటకరంగంలో ఆతిథ్యరంగం విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉందని, వీటిని పర్యాటకులకు స్వర్గధామంగా మలిచి ఈ సంవత్సరం 20 శాతం అభివృద్ధి రేటు సాధించాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. కానీ ఆయన హయాంలో ఇంతవరకు జిల్లాలో ఒక్క పర్యాటక హోటల్ నిర్మించిన దాఖలాలు లేవు. మహానేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో జిల్లాలో ‘హరిత’పేరిట ఏడు పర్యాటక హోటళ్లను నిర్మించి పర్యాటకం అన్న పదానికి ఎనలేని గ్లామర్, ప్రాధాన్యత కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కడప నగరంలోని ప్రధాన హరిత హోటల్ను మరమ్మతుల పేరుతో ఆర్నెళ్లుగా పలు గదులను వసతికి దూరం చేయడం గమనార్హం. ప్రతి పథకానికి ప్రణాళిక దశలోనే కనీసం మూడు మాసాలు గడువు పెడుతుండడం ఆర్థికంగా ఎలాంటి విడుదల లేకపోవడంతోనే ఇంత కాలయాపన జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. టెంట్ సిటీగా...? గండికోటకు వస్తున్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఉన్న పర్యాటకశాఖ హోటల్ గదులు చాలక అన్ సీజన్లో 600–700 టెంట్లు వేస్తున్నారు. సీజన్లో వెయ్యికి పైగా డిమాండ్ ఉంది. కానీ ఆ మేరకు ఆదాయం మాత్రం కనిపించడం లేదు. పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణం. గండికోట ఉత్సవాలేవీ? ఇంతకుముందు వరుసగా గండికోట వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంతో దానికి ఎనలేని ప్రచారం లభించింది. దీని ప్రత్యేకతలు తెలుసుకున్న వారంతా దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా కొనియాడుతూ యునెస్కో గుర్తింపుకోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకపోవడం వారి చిత్తశుద్ధి లోపానికి నిదర్శమని ఈ ప్రాంత పర్యాటకాభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ● గత పథకాల మాటేమిటి? పర్యాటక అభివృద్ధికి సీఎం నోట ‘గండికోటకు బ్రాండింగ్ స్టేటస్’ గతంలో చెప్పిన వాటికే మోక్షం లేదని పర్యాటకాభిమానుల నిట్టూర్పు ప్రణాళికల పేరుతో కాలయాపన చేయొద్దని విన్నపంముఖ్యమంత్రి చంద్రబాబు మాటలపై జిల్లా పర్యాటకాభిమానుల్లో నమ్మకం సన్నగిల్లింది. ఇంతకుముందు అధికారం (2014–19)లో ఉన్నప్పుడు గండికోటను అభివృద్ధి చేస్తామని ఇలాంటి వాగ్దానాలే చేశారు. రోప్వే ఏర్పాటు చేస్తామని చెప్పడంతోపాటు కొద్దిగా సామాగ్రిని కూడా తెప్పించి హడావుడి చేశారు. ఆ తర్వాత ఆయనగానీ, సంబంధిత అధికారులుగానీ దాని గురించి పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు చూస్తాం...చేస్తాం అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారేగానీ చేసిన వాగ్దానం మాత్రం కార్యరూపంలోకి రాలేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ట్రెక్కింగ్ అభివృద్ధి ఎంపిక చేసినట్లు చెబుతున్నా గండికోటలో అంతకుముందే నిర్మించిన అడ్వెంచరస్ అకాడమి అభివృద్ధిపై కూడా ఏమాత్రం దృష్టి సారించలేదు. దీంతో ఇన్స్టిట్యూట్ కార్యాచరణ లేక వెలవెలబోతోంది. -
సజ్జల రామక్రిష్ణారెడ్డిని కలిసిన జిల్లా నేతలు
కడప కార్పొరేషన్ : ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిని వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన్ను మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తదితరులు కలిసి జిల్లా రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, మల్లికార్జున, వైఎస్సార్సీపీ నాయకులు ఐస్క్రీం రవి, కిరణ్, దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఖాజీపేట : ఖాజీపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సాక్షి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను సర్కులేషన్ ఇన్చార్జీ శ్రీనివాసులు పంపిణీ చేశారు. మండలంలో బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా, రంగాపురం ఉన్నత పాఠశాల, కొత్తపేట ఉన్నత పాఠశాల, మాడల్ స్కూల్లోని 10వ తరగతి చదువుతున్న 352 మంది విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ను పాఠశాలల హెచ్ఎంల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్టు పోరుమామిళ్ల : గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే తమ సిబ్బందితో కలిసి చితానందనగర్లోని కనుములపూటి రమణయ్య వద్ద నుండి 1081 గ్రాముల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నామన్నారు. -
భాషా సంస్కృతికి వన్నెతెచ్చిన భూతపురి
కడప కల్చరల్ : జిల్లాకు వన్నె తెచ్చిన మహా కవులలో డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ ప్ర ముఖంగా నిలుస్తారు. అవధానిగా భాషాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల నిపుణునిగా, సంస్కృతాంధ్రంలో మ హాకవిగా పేరుగాంచారు. ఆయన 88వ జయం తి సందర్భంగా ఆదివారం సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఆయన పేరిట ఏర్పాటు చేస్తున్న స్మారక సాహిత్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. తెలుగు సాహితీ లోకంలో విశిష్ట స్థానం మన జిల్లాకు కవుల గడపగా పేరుంది. ప్రముఖులైన కవులెందరో జిల్లా పేరును ఇనుమడింపజేశారు. వారిలో నిన్నటితరం కవి సంస్కృతాంధ్ర సాహితీవేత్త, మహావధాని డాక్టర్ భూ తపురి సుబ్రమణ్యశర్మ ముందు వరుసలో ఉంటారు. ఆయన రాసిన శ్రీకృష్ణభారతం తెలుగు సాహితీ లోకంలో విశిష్ట స్థానం కల్పించింది. ఆయన అనంతరం వారి కుమారులు ఆయన పేరిట స్మారక ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఓ పండితునికి సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. అల్లసాని పెద్దన సాహితీ పీఠంతో కలిసి యేటా క్రమం తప్పకుండా ఈ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన పేరిట 88వ జయంతి సందర్భంగా 23వ స్మారక అవార్డును స్థానిక ప్రముఖ సాహితీవేత్త పుత్తా పుల్లారెడ్డికి అందజేయనున్నారు. బాల్యం నుంచే... జిల్లాలోని తప్పెట్ల కొత్తపల్లె గ్రామంలో ఓ పండితుడు పురాణ ప్రవచనం చేస్తున్నారు. ఓ రోజు ఆయన అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యారు. కానీ పక్కనే ఉన్న 13 సంవత్సరాల ఆయన కుమారుడు తండ్రి స్థానంలో పురాణ ప్రవచనం మొదలు పెట్టాడు. మిగతా 13 రో జులపాటు ఆ బాలుడే పురాణ ప్రవచనం చేశా డు. ఆ బాలుడు భూతపురి సుబ్రమణ్యశర్మ. కవి డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ 1938 ఫిబ్రవరి 14న వల్లూరు సమీపంలోని త ప్పెట్ల కొత్తపల్లె గ్రామంలో జన్మించారు. తండ్రి సుబ్బయ్యశర్మ మహాపండితులు ఆయన నుంచి కుమారుడు సుబ్రమణ్యశర్మకు సాహిత్య వారసత్వం లభించింది. తండ్రి వద్దే సంస్కృతాంధ్రలను అవపోసాన పట్టారు. ప్రొద్దుటూ రు మున్సిపల్ హైస్కూలులో చదివారు. ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 4వ యేటనే ఛందోబద్దంగా కవిత్వం చెప్పడం మొదలు పెట్టారు. తండ్రి సుబ్బయ్యతోనే కవితా రచనలు పోటీపడి ఒప్పించేవారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వద్ద ఆశువుగా పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి ఆశీస్సులు, ప్రశంసలు పొందారు. స్వామి జయేంద్ర సరస్వతి కూడా భూతపురి సాహిత్య పఠిమకు ముగ్దుడై ఆశీర్వదించి తన సభల్లో ప్రసంగానికి అవకాశం ఇచ్చారు. బహుముఖ ప్రజ్ఞ : డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, అవధానిగా, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రజ్ఞులుగా రాష్ట్రేయేతర ప్రాంతాలలో కూడా పేరు పొందారు. 49 సంవత్సరాలపాటు కవితా సరస్వతిని ఆరాధించారు. ఆయన శ్రీరామభక్తుడు. తన రచనలన్నీ శ్రీరామునికే అంకితమిచ్చారు. 1989లో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల సమక్షంలో సువర్ణ గండపేండేర సత్కారం జరిగింది. 1997లో కడప నగరంలో ఆయన గజారోహణం చేశారు. స్వర్ణ హస్త కంకణ సత్కారం స్వీకరించారు. ఉభయ కవి సార్వభౌమ బిరుదు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, పలు సాహితీ సంస్థల నుంచి ఎన్నో బిరుదులు పొందారు. ఆయన పేరిట కుమారుడు డాక్టర్ శివరామ సురేంద్రశర్మ, డాక్టర్ గోపాలకృష్ణశాస్త్రిలు స్మారక సంస్థను ఏర్పాటు చేసి యేటా ఆయన జయంతి నాడు సాహితీవేత్తకు పురస్కారం ప్రదానం చేస్తున్నారు. నేడు 88వ జయంతి బ్రౌన్లో 23వ సాహిత్య పురస్కార ప్రదానం -
స్టెమి ప్రాజెక్టుతో గుండెకు భరోసా
ప్రొద్దుటూరు క్రైం : హార్ట్ ఎటాక్ కేసుల్లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకం. ఏ మాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ ప్రాణాలకే ప్రమాదమని కార్డియాలజిస్టు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ వచ్చిన వారిలో 50 శాతం హాస్పిటల్కు చేరకముందే చనిపోతున్నారు. తీవ్రమైన కేసుల్లో హాస్పిటల్కు వచ్చాక కూడా 90 శాతం మంది మరణించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఛాతిలో నొప్పి వచ్చాక గంటలోగా హాస్పిటల్కు చేరితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. ఆలస్యమైతే గుండె కండరాలకు శాశ్వత నష్టం ఏర్పడుతుంది. గతంలో గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటుకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ప్రాథమిక చికిత్స దొరికేది కాదు. జిల్లా కేంద్రాల్లోని బోధనా ఆస్పత్రులు, సూపర్స్పెషాలిటి కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఒక వేళ స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే పరీక్షలు, మందుల ఖర్చులు పక్కన పెడితే ఒక్క ఇంజెక్షన్కే రూ. 45–50 వేలు వెచ్చించాల్సి వచ్చేది. ఈ మొత్తాన్ని భరించడం పేదలు, మధ్య తరగతి వారికి మిక్కిలి భారంగా మారేది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె జబ్బులకు అత్యవసర ప్రాథమిక వైద్యం లేక, ఖర్చుల భయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక గుండె జబ్బు వచ్చిన పేదలు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో గుండెకు భరోసా ఏపీలో గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023లో శ్రీస్టెమి ప్రాజెక్ట్శ్రీకు శ్రీకారం చుట్టింది. గుండె పోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను నిలబెట్టే కార్యక్రమమే ఈ స్టెమీ ప్రాజెక్ట్. గుండె పోటు వచ్చిన తొలి గంటలోపే అంటే గోల్డెన్ అవర్లోపే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను నిలబెట్టేందుకు అవకాశం ఉంది. గుండె పోటుకు గురై మరణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజి, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని భావించిన అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, పీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రుల్లో హృద్రోగ చికిత్స అందుబాటులోకి తెచ్చింది. గుండె పోటు వచ్చిన 40 నిమిషాల సమయంలో రోగికి అవసరమైన చికిత్సను అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే ‘స్టెమీ ప్రాజెక్ట్’ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. అంతేగాక గోల్డెన్ అవర్లో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన గుండె జబ్బు బాఽధితుడికి రూ. 45 వేల ఇంజెక్షన్ను ఉచితంగా ఇవ్వడంతో పాటు సమీపంలోని హబ్ సెంటర్లకు తరలించి గుండెపోటుకు చికిత్స అందించేలా నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుండె పోటు వచ్చిన వారికి సకాలంలో అత్యవసర ప్రాథమిక వైద్యం అందడంతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. జిల్లా ఆస్పత్రిలో 36 మందికి టెనెక్ట్ప్లస్ ఇంజెక్షన్లు స్టెమి ప్రాజెక్ట్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో 36 మందికి రూ. 45 వేలు విలువ చేసే టెనెక్ట్ప్లస్ ఇంజెక్షన్లను ఉచితంగా వేశారు. ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాలకు చెందిన వీరంతా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారే. వీరిలో ఇద్దరు మృతి చెందారని, మిగిలిన 34 మంది ప్రాణాపాయం నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఎప్పటికీ 6 ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయని, ఏ సమయంలో ఆస్పత్రికి వచ్చినా అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తామని తెలిపారు. టెనెక్ట్ప్లస్ ఇంజెక్షన్లు పూర్తిగా ఉచితమన్నారు. అత్యవసర విభాగంలో వైద్యుడితో పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇదే ఇంజెక్షన్ ప్రైవేట్ ఆస్పత్రిలో వేస్తే రూ. 45 వేలు తీసుకుంటారని తెలిపారు. ఛాతిలో నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పవడం తదితర గుండె పోటు లక్షణాలని పేర్కొన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 108 అంబులెన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా గంటలోపు జిల్లా ఆస్పత్రికి రావాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఈసీజీ తీస్తారు. రిపోర్టులో గుండె పోటు అని నిర్ధారణ అయితే వెంటనే టెనెక్ట్ప్లస్ ఇంజెక్షన్ వేస్తారు. తర్వాత 4–5 గంటల్లోగా బాధితుడిని కడపకు తీసుకెళ్తే అక్కడి రిమ్స్ లేదా నెట్వర్క్ ఆస్పత్రుల్లో గుండె పోటుకు సంబంధించి ఉచితంగా చికిత్స అందిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్టెమి ప్రాజెక్ట్ పథకం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతో మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. గుండె జబ్బు మరణాలను తగ్గించడమే లక్ష్యం 2023లో ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యవసర ప్రాథమిక చికిత్సతో తగ్గిన గుండె పోటు మరణాలు మొదటి గంటలోపు ఆస్పత్రికి రావాలి గుండె పోటు వస్తే జిల్లా ఆస్పత్రికి వెంటనే రావాలి. ఆలస్యం చేయకుండా మొదటి గంటలోపు ఆస్పత్రికి చేరుకోవాలి. జిల్లా ఆస్పత్రిలో గుండె పోటుకు అత్యవసర ప్రాథమిక చికిత్స ఇస్తారనే విషయం చాలా మందికి తెలియదు. గుండె పోటు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఖరీదైన రూ.45 వేలు విలువ చేసే టెనెక్ట్ప్లస్ ఉచితంగా అందిస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ ఆనంద్బాబు, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు -
డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలి
ప్రమాద రహిత డ్రైవర్లకు ఘన సన్మానం కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏకాగ్రతతో విధులు నిర్వర్తించి ప్రమాద రహిత ఆర్టీసీ డ్రైవర్లుగా నిలవాలని పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్, జడ్జి స్వర్ణప్రసాద్ పిలుపునిచ్చారు. 36వ రోడ్డు భద్రతామాసోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక ఆర్ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో ప్రమారరహిత డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి స్వర్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉంటుందన్నారు. విధి నిర్వహణలో ఏకాగ్రత కోల్పొతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. గ్యారేజీలో నుంచి బస్సును తీసుకునేటపుడు కండీషన్లో ఉందో, లేదో సరిచూసుకోవాలన్నారు. ఆర్టీసీ ఈడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రశాంతమైన మనస్సుతో బస్సును నడపాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతినిత్యం జాగరూకతతో వ్యవహారించాలన్నారు. రవాణా శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాలు చేయని డ్రైవర్లు ఉండడం స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థకు రోడ్డు ప్రమాద రహిత సంస్థగా పేరొందని, ఆ పేరును నిలబెట్టేందుకు ప్రతి డ్రైవరు కృషి చేయాలన్నారు. డ్రైవర్ల కారణంగా సంస్థకు మంచి పేరు వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం: కడప జోన్ పరిధిలో ప్రమాద రహిత డ్రైవర్లుగా నిలిచిన వి.ప్రసాద్ (ప్రొద్దుటూరు డిపో), ఎం.ప్రసాద్ (తాడిపత్రి), ఈ.నాగరాజు (శ్రీ సత్యసాయి), జీకే మోహిద్దీన్ (అనంతపురం), ఎస్ఏ షరీఫ్ (కడప), ఎంసీఓ రెడ్డి (ప్రొద్దుటూరు), బీజీ స్వామి (పులివెందుల), బి.వెంకటయ్య, బీజే నాయక్, వీఎస్ రాయుడు (కడప), ఎస్ఎం బాష, ఎల్ఏఎన్ రెడ్డి, జీఆర్ఎస్ రెడ్డి (పులివెందుల), బీవీబీ రెడ్డి, ఎస్జే బాష, ఎస్కే బాష (బద్వేలు), ఎం.మనోహర్, ఎంఆర్ శంకర్, ఎంజే ఐజయ్య (జమ్మలమడుగు), ఎల్ఎస్రెడ్డి, ఆర్ఏ సత్తార్, డి.హుసేన్ (మైదుకూరు), ఎంఎస్కుమార్, ఏఎస్ రాయుడు, ఎం.అయ్యవారప్ప(ప్రొద్దుటూరు)లను సత్కరించారు. కార్యక్రమంలో కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు, పీఓ ధనలక్ష్మి, సూపరింటెండెంట్ రవి, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీలత, మంజుల, కన్యాకుమారిలతో పాటు యూనియన్ నాయకులు ఏఆర్ మూర్తి, పురుషోత్తం, సగినాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.