YSR
-
దగా డీఎస్సీపై ధ్వజం
● డీఎస్సీ అక్రమాలపై నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసిన యువత ● డీఎస్సీని రద్దు చేసి మరోసారి నిర్వహించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ ● వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగంఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కడప కార్పొరేషన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో మెగా కాదు...దగా డీఎస్సీపేరుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంద్రనాథ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని, డీఎస్సీ రాసి న అభ్యర్థులతోపాటు అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం వీసమెత్తు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది పూర్తిగా తప్పుడు విధానమన్నారు. డీఎస్సీపై 33వేల మంది ఫిర్యాదులు చేశారని, వారి గ్రీవెన్స్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ చేసి నిజా నిజాలు నిగ్గుతేల్చాలని, తద్వారా అర్హులైన వారికి న్యా యం చేయాలన్నారు. డీఎస్సీని రద్దు చేసి మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ‘ఒక్క పరీక్ష–వేల సందేహాలు’, పేపర్లు లీక్, డేటా డెలీట్, మెరిట్ లిస్టు మాయం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతి రేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం వారు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు, వైఎస్సార్సీపీ యువజన విభాగం కడప నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్ షఫీవుల్లా, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ఎం.గురుప్రసాద్ మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1.73లక్షల సచివాలయ ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒక్క నోటిఫికేషన్...16వేల ఉద్యోగాలే అయినా అనేక అక్రమాలు జరిగాయన్నారు. యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు మెగా డీఎస్సీ పేరుతో వారి జీవితాల ను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గురునాథరెడ్డి (ప్రొద్దుటూరు), చంద్ర ఓబుల్రెడ్డి(మైదుకూరు), ఈశ్వర్రెడ్డి(కమలాపురం), నరసింహారెడ్డి(బద్వేల్), హరీష్రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ఉపాధ్యక్షులు సందీప్, పఠాన్ ఖాన్, పార్టీ నాయకులు రహీమ్, అఖిల్, వంశీ, నాగేంద్ర ప్రసాద్, కంచుపాటి బాబు, చల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య తదితరులుకలెక్టరేట్లో అధికారికి వినతిపత్రమిస్తున్న పార్టీ నేతలు -
క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన బుకీ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా పీఎస్ సీఐ పి.నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ మహమ్మద్రఫీ తమ సిబ్బందితో కలిసి ప్రధాన క్రికెట్ బుకీ ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని ఆదివారం రాత్రి అక్కాయపల్లి శాస్త్రి నగర్లో అరెస్ట్ చేశారు. సోమవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రినగర్లో ప్రధాన నిందితుడు ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డి ఇంటిలో కడప తాలూకా సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుడు తన ల్యాప్టాప్, మొ బైల్ ఫోన్లు, వై–ఫై రూటర్ ద్వారా తన సబ్ బుకీలైన వారికి యూజర్ ఐడీలు, యూఆర్ఎల్ లింకులు పంపించి, వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బును స్వీకరిస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని 12 విలువైన మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ వుంచినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి రూ.7,00,550 నగదు, ల్యాప్టాప్, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక వైఫై రూటర్, నగదు కౌంటింగ్ మిషన్, 12 ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డిని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు, మోడమీదపల్లెకు చెందిన అంబవరం మాధవరెడ్డి అలియాస్ మోడమీదపల్లె మాధవరెడ్డి, పులివెందులకు చెందిన నరేష్, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గోల్డ్ శేఖర్, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్ అలియాస్ శ్రీహరి, ఆమంచి కళ్యాణ్ చక్రవర్తి, షేక్ ఇంతియాజ్, జయప్రకాష్ అలియాస్ చంటితోపాటు ఇంకా కొంతమంది ఉన్నట్లు వెల్లడైందని డీఎ స్పీ తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
మెరిసిన మనోళ్లు
● ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులు ● ఓపెన్ కేటగిరిలో 23, 28, 51 ర్యాంకులు ● కడపకు గర్వకారణంగా నిలిచిన వైనంకడప ఎడ్యుకేషన్ : ప్రతిష్టాత్మక ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్(2026) ఫలితాల్లో మనోళ్లు మెరిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వారు తమ ఆశయాలతోపాటు తల్లిదండ్రుల కల నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చెందిన విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో 23, 28, 51, 243 ర్యాంకులు సాధించి భళా అనిపించారు. బద్వేలుకు చెందిన ఎ.హేమంత్కుమార్రెడ్డి, జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్, సిద్దవటం మండలం వంతాటిపల్లెకు చెందిన ముక్కర సాకేత్రెడ్డి, వల్లూరు మండలంలో కొప్పోలుకు చెందిన మోపూరి వేదచరణ్రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చరిత్ర లిఖించారు. రాయలసీమ జిల్లాలకు 100లోపు ర్యాంకు అసాధ్యమని విద్యావేత్తలు భావించేవారు. అలాంటి వారి అంచనాలు తలకిందులు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎ.హేమంత్కుమార్రెడ్డి, ముక్కర సాకేత్రెడ్డి, మోపూరి వేదచరణ్రెడ్డి జాతీయ స్థాయిలో 100లోపు ర్యాంకులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫౌండేషన్ వేసిన ‘సంకల్ప్’ ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్, నీట్ ఇలాంటి పోటీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరిలో 100లోపు ర్యాంకులు సాధిస్తూ సంకల్ప్ విద్యార్థులు చరిత్ర సృష్టిస్తున్నారు. సంకల్ప్ కడపలో చదివి, కడపలో ఫౌండేషన్ తీసుకొని ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరిలో 51వ ర్యాంకు వేదచరణ్రెడ్డి సాధించారు. గతంలో ఐఐటీ మెయిన్స్ ఓపెన్ క్యాటగిరిలో ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించిన శశాంక్ అనిరుద్రెడ్డి, నీట్లో ఆల్ ఇండియా 100లోపు ర్యాంక్ సాధించిన వినయసింహరెడ్డి, ప్రణతిరెడ్డి కడప సంకల్ప్లో ఫౌండేషన్ కోర్స్ ద్వారా జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం విశేషం. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే సంకల్పంతో చేపట్టిన సంకల్ప్ ఫౌండేషన్ నుంచి గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో సంతృప్తిగా ఉందని సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకులు వంశీ, రేణుక వెల్లడించారు. ● కడప నగరానికి చెందిన మోపూరి వేణుగోపాల్రెడ్డి, లక్ష్మీశిరీషల కుమారుడు మోపూరి వేద చరణ్రెడ్డి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కడప నాగార్జున మోడల్ స్కూల్లో చదువుకుంటూ సంకల్ప్ కోచింగ్ సెంటర్లో ఫౌండేషన్ కోర్సు శిక్షణ తీసుకున్నాడు. 10వ తరగతిలో 600 మార్కులకు 578 మార్కులు సాధించాడు. ఆ తరువాత విజయవాడ నారాయణ కళాశాలలో ఎంపీీసీ(సీపీఎస్ఈ)లో 500 మార్కులకు 470 మార్కులు పొందారు. కడప ఎడ్యుకేషన్: నగరానికి చెందిన వి.మల్లేశ్వరరెడ్డి, రాజేశ్వరి కుమారుడు వెంగరెడ్డి రెడ్డి ప్రసా ద్రెడ్డి 243వ ర్యాంకు సాధించాడు. ఈ అబ్బా యి కడపలోని నాగార్జున మోడల్ స్కూల్లో చదివి 10వ తరగతిలో 585 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ను విజయవాడలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివి ఎంపీసీ(సీబీఎస్సీ)లో 461 మార్కులు పొందాడు. జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్ 26వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. పట్టణంలోని పెద్దపసుపల రహదారిలోని టీచర్స్ కాలనీకి చెందిన హరిత 395వ ర్యాంక్ సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి, అపర్ణ తెలిపారు. పట్టణానికి చెందిన గొంగటి వెంకట వంశీధర్రెడ్డి 581వ ర్యాంక్ సాధించాడు. బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన ఎ.హేమంత్కుమార్రెడ్డి 23వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి ఎ.విజయభాస్కర్రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా డు. హేమంత్కుమార్రెడ్డిని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రులు అభినందించారు. సిద్దవటం : సిద్దవటం పట్టణానికి చెందిన ముక్కర సాకేత్ 28వ ర్యాంకు సాధించాడు. ఆ విద్యార్థి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను సిద్దవటంలోని శ్రీ భారతి హైస్కూల్లో అభ్యసించాడు. వంతాటిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ముక్కర వెంకటసుబ్బారెడ్డి, ముక్కర నిర్మలాదేవి తన విజయానికి ప్రధాన ప్రేరణగా నిలిచారని సాకేత్ తెలిపారు. -
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖామంత్రి లోకేష్ రాజీ నామా చేయాలి. ఉద్యోగం కోసం లక్షలాది మంది అభ్యర్థు లు అనేక మాసాలుగా రేయింబవళ్లు చదివి ఉంటారు. వారి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. వారి కలల్ని ఈ ప్రభుత్వం ఛిద్రం చేసింది. కేవలం 40 రోజులు సమయమిచ్చి డీఎస్సీ నిర్వహించడంలోనే మతలబుదాగుంది. – దేవిరెడ్డి ఆదిత్య, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు -
అధికారం అండ... బెట్టింగ్ దందా !
● ఐపీఎల్ క్రికెట్ ఆధారంగా కోట్లు గడించిన తెలుగుతమ్ముళ్లు ● బెట్టింగ్ వ్యవహారాలల్లో టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు హల్చల్ ● కడప పోలీసులకు పట్టుబడిన వాసు, పుత్తా వర్గీయులు ● ఎమ్మెల్యే వరద అండతో పరారీలో ప్రధాన బుకీ ఇలియాస్ కడప (సాక్షి ప్రతినిధి): జిల్లాలో టీడీపీ అండదండలతో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల ఆశీస్సులే ఏకై క పెట్టుబడిగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కోట్లాది రూపాయలు ఆర్జించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి బానిసగా మారినవారిని రోడ్డున పడేశారు. పుత్తా, వాసు వర్గీయులు బుక్! తాజాగా కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ.. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జోనల్ అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి (వాసు) ప్రధాన అనుచరులు కడప పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై కడప నగరంలోని అక్కాయపల్లె ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇందిరెడ్డి జనార్ధన్రెడ్డి, మోడమీదపల్లెకు చెందిన మాధవరెడ్డి, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్, జయప్రకాష్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉంటూ.. ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డికి వెన్నంటే నడిచే యూత్ వింగ్ నేతలు. వీరిలో మాధవరెడ్డిని ఇటీవలే టీడీపీ జోనల్ అధ్యక్షుడు వాసు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం. ప్రొద్దుటూరులోనే ప్రధాన మూలాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మట్కా, గుట్కా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండ వల్లే ఈ దందాలు సాగాయని, తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రూపుమాపుతామని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఊరువాడా ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోగా, మరింత ఘోరంగా తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్, జూద నిర్వహణను అడ్డుకోవడంలో విఫలమైన అధికార పార్టీ నేతలు.. ఒకడుగు ముందుకు వేసి ప్రధాన బుకీలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి ‘లైసెన్స్’ ఇచ్చారు. ఎక్కడ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ పట్టుబడినా, దాని మూలాలు ప్రొద్దుటూరు బుకీల వద్దకే చేరుతుండటం గమనార్హంలేపాక్షి కేసులో వెలుగుచూసిన లింకులు ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి పరిధిలో పోలీసులు ఒక క్రికెట్ బుకీని పట్టుకుని విచారించగా ఈ భారీ నెట్వర్క్ గుట్టురట్టయింది. సదరు నిందితుడు తాను ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె ప్రాంతానికి చెందిన బుకీ ద్వారా పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, తాము వసూలు చేసిన క్రికెట్ పట్టీలను ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీ ఇలియాస్కు అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఎమ్మెల్యే అండతో ప్రధాన బుకీ పరారీ.. C…™èl ò³§ýlª G™èl$¢¯]l B«§éÆ>Ë$ ÌSÀ…-_-¯]l-ç³µ-sìæMîS, {糫§é¯]l º$MîS CÍ-Ķæ*‹Ü Cç³µ-sìæMîS ç³Æ>-È-ÌZ¯ól E¯é²yýl$. Ý린MýS GÐðl$ÃÌôæÅ Ð]lÆý‡-§ýl-Æ>-kÌS Æð‡yìlz Æ>f-MîSĶæ$ A…yýl-§ýl…-yýlË$ E…yýlr… Ð]lÌôæÏ CÍ-Ķæ*‹Ü ´ùÎ-çÜ$-ÌSMýS$ _MýSP-MýS$…yé ™èlí³µ…^èl$-MýS$¯é²-yýl¯ól BÆø-ç³-׿Ë$ ºÌS…V> Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. MîSÌSMýS çÜ*{™èl-«§é-Æý‡$OÌñæ¯]l Mö…§ýlÆý‡$ º$MîSË$ A«¨-M>Æý‡ sîæyîlï³ VýS*sìæMìS ^ólÇ-´ùÐ]l-yýl…™ø, ÐéÇOò³ MýS¯ðl²†¢ ^èl*õÜ ÝëçßæçÜ… MýS*yé Ý린MýS ´ùÎ-çÜ$Ë$ ^ólĶæ$-Ìôæ-MýS-´ù-™èl$-¯é²-Æý‡¯ól BÆø-ç³-׿Ë$ ºÌS…V> Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. hÌêÏ ÐéÅç³¢…V> GMýSP-yðl-MýSPyýl »ñæsìæt…VŠæ MóS…{§éË$ E¯é²Æ‡$$, GÐ]l-Æð‡-Ð]lÆý‡$ °Æý‡Ó-íßæ-çÜ$¢¯é²Æý‡$ A¯ól ÑçÙĶæ*-ÌSOò³ °çœ* Ð]lÆ>YÌSMýS$, ´ùÎçÜ$ Ð]lÅÐ]l-çܦMýS$ ç³NÇ¢ çÜÐ]l*-^éÆý‡… E¯]l²-ç³µ-sìæMîS.. ÐéÆý‡$ °Ð]l$ÃMýS$ ±Æð‡-†¢-¯]lr$Ï Ð]lÅÐ]l-çßæ-Ç-çÜ$¢-¯é²-Æý‡¯ól BÆø-ç³×æË$-¯é²Æ‡$$. A«¨-M>Æý‡ 糄ýS… ¯]l$…_ Ð]lçÜ$¢¯]l² ¡{Ð]lOÐðl$¯]l Æ>f-MîSĶæ$ J†¢yìl M>Æý‡-׿…-V>¯ól ´ùÎ-çÜ$Ë$ ^èlsêt°² çÜ{MýS-Ð]l$…V> लाAÐ]l$Ë$ ^ólĶæ$Ìôæ MýS$¯é²Æý‡° {ç³fË$ B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢¯é²Æý‡$. ఎన్నికల కోసమే బెట్టింగ్ దందా? పోలీసులకు చిక్కిన వారంతా టీడీపీకి చెందిన కేవలం సాధారణ కార్యకర్తలు కారని, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తృతీయ శ్రేణి నాయకులని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకే, ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా ఈజీ మనీ వైపు మొగ్గు చూపి కోట్లాది రూపాయలు ఆర్జించారని పరిశీలకులు భావిస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు పరిధిలోనే కాకుండా పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా ఇలాంటి టీడీపీ నేతల అక్రమ దందాలు సాగుతున్నాయని సమాచారం. -
మహిళ అదృశ్యం
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన ఎద్దుల జయమ్మ(63) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు నాగరాజు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. పోట్లదుర్తి గ్రామంలో నివాసం ఉండే ఎద్దుల నాగన్న, జయమ్మకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గేదెలను కట్టేసే విషయంలో కోడలితో గొడవ పడింది. ఈ క్రమంలో జయమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తర్వాత తిరిగి రాలేదు. బంధువులు ఇళ్లు, చుట్టు పక్కల వారిని విచారణ చేసినా ఫలితం లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలతో విశ్వసనీయతకడప సెవెన్రోడ్స్ : జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, కచ్చితత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడం ద్వారా మీడియా పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ విలేకరులకు నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. అన్నమయ్య జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టు కొర్రా విజయ్కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనార్దన్, కర్నూలుకు చెందిన డెస్క్ సీనియర్ జర్నలిస్టు నవీన్కుమార్ చౌదరి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి, సమాచార పౌరసంబంధాల ఏడీ పద్మజ, పెద్ద సంఖ్యలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
డీఎస్సీ స్కామ్ బయటపడగానే డైవర్షన్ పాలిటిక్స్
పులివెందుల: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్తోపాటు వారి అనుచరులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. ఆదివారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులకు మోసం చేసి డీఎస్సీ ఉద్యోగాలను పెద్ద ఎత్తున అమ్ముకున్నారని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు కాల్లెటర్లు పంపి సర్టిఫికెట్లు కూడా పరిశీలించిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడటం జరిగిందన్నారు. చంద్రబాబుకు తన తప్పులు బయటపడగానే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన చేస్తున్న అనైతిక కార్యక్రమాలు బయటపడగానే వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు, ఎల్లో మీడియా ద్వారా విషపు రాతలు మొదలుపెట్టి డైవర్షన్ చేస్తారన్నారు. ఇప్పుడు కూడా అలాగే డీఎస్సీ స్కామ్ బయట పడగానే అక్రమ మద్యం కేసుల పేరుతో టాపిక్ డైవర్షన్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన తప్పు కప్పి పుచ్చుకోనడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే బాధ్యతగా అందుకు సమాధానాలు చెప్పకుండా చంద్రబాబునాయుడుతోపాటు ఆయన అనుచరులు ఏమాత్రం సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి పచ్చి అపద్ధాలతో ఎదరుదాడి చేస్తున్నారన్నారు. చేసిన తప్పులకు సమాధానం చేప్పే ధైర్యం లేక ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. గడిచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకులు ఆయనను కలిశారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ జయప్రదం చేయండి చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలను వివరించాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగాదోచుకుంటున్న కూటమి నేతలు ప్రశ్నిస్తే సమాధానంచెప్పకుండా ఎదురుదాడి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
జమ్మలమడుగు : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ముద్దనూరు రోడ్డులోని నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాల్లో రజక సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు లోగిడి జయన్న, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల లక్షుమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాలు బాగు పడాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదువుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలకు తగిన ప్రతిఫలం సాధించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోలన్నారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అవసరాన్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టి ఉచితంగా పుస్తకాలు, స్కూల్ యూనిఫాం, షూ, బ్యాగులు అందించారన్నారు. ఇలాంటి ప్రతిభా పురస్కారాలు నిరుపేద పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 36 మందికి రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేల చొప్పున నగదుతో పాటు ప్రతిభాపురస్కారాలను అందించారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, జిల్లా అఽధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, పోచిరెడ్డి, జానీ, ఫయాజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు గుర్విరెడ్డి, రమణారెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, రఘునాథ్రెడ్డి, తలమంచిపట్నం వినయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
కడప కార్పొరేషన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదాసిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, అయితే ఈ డీఎస్సీలో పేపరు లీకేజీ వల్ల మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీపీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంకు వచ్చిందని, అతని వల్లే పేపరు లీక్ అయిందన్నారు. అతను ఎంతమంది ఆ పేపరును లీకేజ్ చేశారో తెలియదన్నారు. అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఒకసారి, ఉద్యోగం అవసరం లేదని చెప్పాడని మరోసారి, ఒక ఉద్యోగం చేస్తున్నందున మరో ఉద్యోగం ఇవ్వలేదని ఇంకోసారి ఇలా రకరకాలుగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అలాగే డీఎస్సీపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తి అవాస్తవమన్నారు. 33,300 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని అధికారులు పరిష్కరించలేదన్నారు. ● దొంగే దొంగ దొంగ అన్నట్లు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబితే మీ హయాంలో తప్పులు జరిగాయి...జగన్ మేనమామ పోస్టులు అమ్ముకున్నారని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లక్షా 73 వేల సచివాలయ ఉద్యోగాలను ఎలాంటి సిఫార్సు లేకుండా పూర్తి మెరిట్ ప్రకారం భర్తీ చేశారన్నారు. దీనిపై వారు విచారణ కూడా చేసుకోవచ్చన్నారు. ఈ ప్రభుత్వం 16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తుంటే, 96 ఆరోపణలు వచ్చాయన్నారు. జెడ్పీ నియామకాల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలి: జెడ్పీలో నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా..విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. విజయనగరంలో ఓ అభ్యర్థి డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకు పూర్తి అర్హుడైనప్పటికీ అతనికి ఆ కోటాలో ఉద్యోగం రాలేదన్నారు. డీఎస్సీ, టెట్ పాసైన వారికి కాకుండా డైరెక్టుగా శాప్ ద్వారా పోస్టులు భర్తీ చేసి మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డీఎస్సీ–1998 వారికి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, అవన్నీ పూర్తి పారదర్శకంగా జరిగాయన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల తరుపున తాము పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని, రెండేళ్లవుతున్నా ఒక్క పీఆర్సీ కనిపించలేదని, నాలుగు డీఏలు, ఐఆర్ పెండింగ్లోఉన్నాయన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ. 30 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ పాకా సురేష్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి వైఎస్సార్ సీపీ హయాంలో తప్పులు జరిగాయని చెప్పడం దారుణమన్నారు. అప్పుడు అక్రమాలు జరిగి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే రామగోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈసమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పులి సునీల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వీరారెడ్డి, శ్రీ రంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దొంగే దొంగ..దొంగ అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
పేదరికం చిన్నబోయింది.. వైద్య విద్య వరించింది
● తండ్రి లారీ డ్రైవర్ ● ఇద్దరు కుమారులు వైద్యులు ● నెరవేరిన వారి కలవారు పేదింటి పిల్లలు.. పల్లె ప్రాంతానికి చెందిన వారు.. తమ చదువుకు ఇవేవీ ఆటంకం కాదని నిరూపించారు. ఇద్దరు అన్నదమ్ములు నీట్లో సీటు సాధించి వైద్య విద్య అభ్యసించారు. తమ తల్లిదండ్రుల కల నెరవేర్చారు. పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. వేంపల్లె : రోజంతా లారీ నడుపుతూ కుటుంబ భవిష్యత్తు కోసం కష్టపడిన ఓ తండ్రి కన్నీటి కల నెరవేరింది. వేంపల్లెలోని మేదర వీధిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహబూబ్ బాషా వృత్తి రీత్యా లారీ డ్రైవర్, ఆయన భార్య కౌసర్ గృహిణి, వీరికి ఇద్దరు కుమారులు. వారిని బాగా చదివించాలనే ఉద్దేశంతో.. సంపాదన తక్కువైనా మహబూబ్ బాషా ఎన్నో కష్టాలు భరించారు. మండే ఎండలు, వర్షాలు, రాత్రింబవళ్లు లారీ నడిపి పిల్లల చదువుల కోసం జీవితమంతా రోడ్లపైనే గడిపారు. తన పిల్లలు మాత్రం మంచి స్థాయికి చేరాలని ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన కుమారులు చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు. ముందుగా మహబూబ్ బాషా పెద్ద కుమారుడైన ఉమర్ బాషా రెండు సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ పూర్తి చేయగా రెండవ కుమారుడు సమీర్ బాషా కూడా ఎంబీబీఎస్ను ఫస్ట్ క్లాస్తో పూర్తి చేసి కుటుంబానికి అపారమైన ఆనందాన్ని అందించారు. మొదటి కుమారుడు డాక్టర్ ఉమర్ కడప రిమ్స్లో, రెండవ కుమారుడు డాక్టర్ సమీర్ బాషా కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ను పూర్తి చేశారు. తండ్రి మహబూబ్ బాషా, తల్లి కౌసర్, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు అన్న డాక్టర్ ఉమర్ బాషా ప్రోత్సాహంతో సమీర్ బాషా తన వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. తండ్రి కష్టం, తల్లి ఆశీర్వాదం, కుటుంబ నమ్మకం కలిసొచ్చి ఒక లారీ డ్రైవర్ కుమారులు డాక్టర్ స్థాయికి ఎదిగారు. ఒక లారీ డ్రైవర్ కుమారులు వైద్యులు కావడం ఇప్పుడు ఎంతో మంది పేద కుటుంబాల పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఇద్దరు కుమారులు మాట్లాడుతూ మా తండ్రి స్టీరింగ్ పట్టి మా భవిష్యత్తును నడిపించారని తెలిపారు. నేడు స్టెతస్కోప్ పట్టడం మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండే గర్వకారణం అని లారీ డ్రైవర్ మహబూబ్ బాషా తెలిపారు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో వేంపల్లి గ్రామ ప్రజలు, బంధుమిత్రులు సమీర్ బాషా, ఉమర్ బాషాకు అభినందనలు తెలియజేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశాం మా తల్లిదండ్రుల కష్టాలను మేము కళ్లారా చూశాం. భవిష్యత్తులో వారి కష్టాలను తొలగించి సుఖ జీవనం సాగాలని కోరుకున్నాం. ఒక లక్ష్యంతో కష్టపడి చదివాం. అలాగే 10 మందికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కష్టపడ్డాం. తండ్రికి వచ్చిన చిన్న ఆదాయంతోనే మేము మంచిగా చదివి ఉచితంగా సీట్లు సాధించి ఉన్నత స్థాయి చదువులు అభ్యసించాం. మా తల్లిదండ్రుల కలను మేము సహకారం చేశాం. – డాక్టర్ సమీర్ బాషా, ఎంబీబీఎస్, మేదర వీధి, వేంపల్లె -
110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవర
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండల పరిధిలోని బిదినంచెర్లలో 110 ఏళ్ల తర్వాత పెద్దమ్మ దేవరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ 110 ఏళ్ల తర్వాత దేవర జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉంటాయన్నారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, కేశవరెడ్డి పెద్దిరెడ్డి ఇళ్లకు వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు ఉన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలోకి రాగానే మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ, పూలమాలలతో డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. 110 ఏళ్ల తర్వాత జరుగుతున్న దేవర కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ డాక్టర్ నాయక్, తొండూరు ఎస్ఐ మద్దిలేటి, లింగాల ఎస్ఐ జగదీశ్వర్రెడ్డి చర్యలు తీసుకోవడంతో దేవర ప్రశాంతంగా ముగిసింది.అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఆ బుకీలకు అధికార పార్టీ నేతల అండ
సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రొద్దుటూరులో మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండ వల్లే ఇలా జరుగుతోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గత ఎన్నికల సందర్భంగా వాడవాడలా ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని రూపుమాపుతామని ఉపన్యాసాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. వీటిలో వేటినీ నియంత్రించకపోగా కొత్తగా క్యాషినో జూదం తోడైంది. గంజాయి ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనలే కారణం. టీడీపీలో చేరిన కొందరు బుకీలు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన క్రికెట్ బుకీలు రూ.కోట్లకు పడగ ఎత్తారు. డబ్బు ప్రభావంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాప్రతినిధులను సైతం ప్రభావితం చేస్తున్నారు. ఈ కారణంగానే వారిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ప్రధాన బుకీ ఇలియాస్కు సంబంధించిన ఆధారాలు ఇటీవల పోలీసులకు లభ్యమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి వద్ద పోలీసులు ఓ క్రికెట్ బుకీని పట్టుకోగా ఆయన ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె ప్రాంతానికి చెందిన బుకీ పేరు చెప్పారు. ఆయనను పోలీసులు విచారణ చేసి క్రికెట్ పట్టీలను ఎవరికి ఇస్తున్నావని ప్రశ్నించగా.. ఇలియాస్కు ఇస్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికంగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం వద్దకు వెళ్లి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు కార్ల వ్యాపారానికి సంబంధించినదని చెప్పి విడిపించుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఇంత వరకు ఇలియాస్ పోలీసులకు దొరకలేదు. ఆయనకు అధికార పార్టీ నేతల అండ ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే మట్టి మసీదు వీధిలో, జిన్నా రోడ్డులో క్రికెట్ బుకీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మట్టి మసీదు వీధికి చెందిన బుకీ కుటుంబ సభ్యులు, జిన్నా రోడ్డుకు చెందిన బుకీ.. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇలాంటి కారణాల వల్లే పోలీసులు బుకీలను కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.● పట్టుబడని ప్రధాన బుకీలు ● పోలీసుల తీరుపై విమర్శలు -
పరేషన్కు ఏడాది
జిల్లాలో రేషన్షాపులు, కార్డుల వివరాలు రేషన్ ఏఏవై తెల్ల మొత్తం షాపులు కార్డులు కార్డులు కార్డులు 1239 36,031 5,42,746 5,78,777 కడప సెవెన్రోడ్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ ఆగిపోవడంతో కారు్ాడ్దరులకు కష్టాలు ప్రారంభమై సోమవారానికి ఏడాది పూర్తి అవుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీపీఎల్ కార్డుదారుల పాలిట శాపంగా మారింది. పేదలు పనులు వదులుకొని రేషన్షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 366 ఎండీయూ వాహనాలు ఆగిపోవడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న యువత ఉపాధి కోల్పొయి రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పటిష్టం చేయకపోగా తమను కష్టాలపాలు చేసిందని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. ఒకప్పుడు వృద్ధులు, దివ్యాంగులు, రోజు కూలీలు తమ ఇళ్లకు అవసరమైన సరుకులు తెచ్చుకునేందుకు ఎఫ్పీ షాపుల వద్ద భారీ క్యూలలో గంటలకొద్ది పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికి రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 366 మొబైల్ డిస్పెసింగ్ యూనిట్లు (రేషన్ సరుకులు సరఫరా చేసే వాహనాలు) ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనం ద్వారా కనీసం ఇద్దరు ఉపాధి పొందేవారు. ఈ వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేవి. ఫలానా రోజు బియ్యం బండి వస్తుందనే సమాచారం వలంటీర్ల ద్వారా ప్రజలకు సమాచారం అందేది. దీంతో ప్రజలు ఆ సమయంలో ఇళ్ల వద్దనే ఉండి తమకు అందాల్సిన బియ్యం, చక్కెర, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకునేవారు. కరోనా వైరస్ వ్యాపించినపుడు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో బియ్యం బండ్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రజల్లో చెరిపేయడం కోసం ఆయన ముద్ర ఉన్న పలు పథకాలను రద్దు చేశారు. అందులో ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం ఒకటి. 2027 వరకు ఎండీయూ వాహనాలు కొనసాగేందుకు ఒప్పందం ఉన్నప్పటికీ వాటిని రద్దుచేసి యువతను కూటమి ప్రభుత్వం రోడ్లపాలు చేసింది. దీంతో ఎండీయూ నిర్వాహకులు మరో ఉపాధి కానరాక, కుటుంబాల పోషణ భారంగా పరిణమించింది. వైఎస్ జగన్ హయాంలో ఉచిత బియ్యంతోపాటు కార్డుదారులకు చక్కెర, కందిబేడలు, గోధుమపిండి, జొన్నలు, రాగులు వంటివి కూడా పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం బియ్యం, చక్కెరతోనే సరిపెడుతోంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా తక్కువ ధరతో కందిబేడలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఎఫ్పీ షాపుల ద్వారా కందిబేడలు సరఫరా చేయకపోవడంతో ప్రజలు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 170–180తో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ కోసం తప్పని తిప్పలు గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. ఈ విధానం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన త తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలను రద్దు చేసి మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరించారు. ఇందువల్ల రేషన్కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. – వడ్ల భాగ్యలక్ష్మి, కడప ఆ విధానమే బాగుండేది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన బియ్యం బండ్ల విధానమే బాగుండేది. ఇంటి ముంగిటికే సరుకులు వచ్చేవి. కరోనా కష్టకాలంలో ఇది ఎంతో ఉపయోగపడింది. చంద్రబాబు వచ్చిన తర్వాత బియ్యం బండ్లను రద్దు చేయడంతో పనిపాట చేసుకుని బతికే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – టి.వెంకట సుబ్బమ్మ, రామరాజుపల్లె, కడప 366 ఎండీయూ వాహనాల నిలిపివేత ఉపాధి కోల్పోయిన యువత ఎఫ్పీ షాపుల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు -
నేడు డయల్ యువర్ కలెక్టర్
కడప సెవెన్రోడ్స్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డీఆర్వో పేర్కొన్నారు. రాజంపేట టౌన్: రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ మేజర్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దుగ్గినేని శ్రావణి ఏపీపీజిసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. శ్రావణి 100కు 99 మార్కులు సాధించారు. ఇదే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ మేజర్గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయేషా కౌసర్ రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీ.పురుషోత్తం తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించగలరని ఆయన పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజినీర్ దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా వినియోగదారులు అన్నమయ్య: 9440817449, కడప: 08562242457 నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. కడప సెవెన్రోడ్స్: సోమవారం కలెక్టరేట్లో జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వైబ్సెట్లో తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ● సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పీజీఆర్ఎస్) కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాఅధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు సమస్యలకుసంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నందలూరు : నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పైనుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి(యాచకుడు) మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకొని జీవనం సాగించే ఈ వ్యక్తి అండర్ బ్రిడ్జి గోడపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి గురించి ఎటువంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆచూకీ గుర్తిస్తే తమను సంప్రదించాలని చెప్పారు. ఆర్యుబీ గోడపైన క్లోజ్ చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. శివాలయంలో కొండ చిలువ కలకలంముద్దనూరు : మండల పరిధి చింతకుంట గ్రామంలోని కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులే కొండచిలువను కొండలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గ్రామ శివారు, కొండ ప్రాంతం కావడంతో సర్పాలు, విష పురుగుల సంచారం అధికంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. -
● ఓట్లు–సీట్లు ఇచ్చినా అదే దుస్థితి
సాక్షి ప్రతినిధి, కడప: నోటితో చెప్పడం నొసలుతో వెక్కిరించడం దేని పని దానిదే. అచ్చం అలాగే వైఎస్సార్ కడప జిల్లా పట్ల సీఎం చంద్రబాబు వైఖరి స్పష్టమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం మహానాడు వేదికగా కడప కేంద్రంగా జిల్లా అభివృద్ధికి హామీల వర్షం కురిపించారు. జీఎన్ఎస్ఎస్ ఫేజ్–1 పనులను పూర్తి చేసేందుకు రూ.1000కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తికి రూ.170కోట్లు, గండికోటలో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహాం ఏర్పాటుకు రూ.32.5కోట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కడపకు రూ.68.45కోట్లు, బుగ్గవంక ఆధునికీకరణకు రూ.100 కోట్లు, చెన్నూరు సమీపంలో హజ్హౌస్ పూర్తి కోసం రూ.10కోట్లు, దాదాపుగా రూ.1381కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు 2025 మే29న ప్రకటించారు. ఏడాది పూర్తయినా అభివృద్ధి పనుల్లో ఇసుమంతైనా పురోగతి లేదు. ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. కడప అంటే సీఎం చంద్రబాబుకు వివక్షే నేను రాయలసీమలోనే పుట్టాను, సీమ బిడ్డనంటూ చెప్పుకునే సీఎం చంద్రబాబు రాయలసీమకు ప్రత్యేకించి వైఎస్సార్ కడప జిల్లాకు అభివృద్ధికి చేసింది శూన్యం. పైగా జిల్లా పారిశ్రామిక ప్రగతికి అవరోధంగా నిలుస్తూ అనేక మార్లు కడప అంటే కడపు మంట అని చాటుకున్నారు. నాటి బ్రహ్మణీ స్టీల్స్ నుంచి నేటి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకూ ఎన్నో ఆటంకాలు సృష్టించారు. తుదకు సాగు, తాగునీరు సరఫరాకు యోగ్యకరంగా నిలుస్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు కూడా అడ్డుతగిలారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తుదకు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా సాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ప్రక్రియను కూడా అడ్డుతగిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలంకారప్రాయంగా పులివెందుల మెడికల్ కళాశాల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధిని కూడా కొనసాగించలేని దుస్థితిలో కూటమి సర్కార్ ఉండిపోయింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల నిలుస్తోంది. రూ.530 కోట్లతో నిర్మించిన ఈ మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతులు కూడా దక్కాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 50ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే పెండింగ్ పనులు ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ కోరింది. ఆ లేఖను ఇస్తే 2024–25కు 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యేవి. 5శాతం పెండింగ్ పనులు కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ మనుసు అంగీకరించలేదు. వెరశి ఎన్ఎంసీకి సీట్లు అవసరం లేదంటూ ఏకంగా ఎన్ఎంసీ లెటర్ రాశారు. 2024–25లో 50 సీట్లు దక్కి ఉంటే ఈ ఏడాది 2025–26, 2026–27లల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున లభించేవి. జిల్లాలో పట్ల సీఎం చంద్రబాబు కడపు మంటకు మెడికల్ కళాశాల ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జిఎన్ఎస్ఎస్ ఫేజ్–1 పనులు వేగంగా చేసేందుకు రూ.1000 కోట్లు, వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేసేందుకు రూ.170కోట్లు మంజూరు చేయనున్నట్లు ఏడాది క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే వీరపునాయునిపల్లె, వేంపల్లే, వేముల, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు, కమలాపురం, కడప మండలాల్లో భూసేకరణ, పెండింగ్ పనులు నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. చిత్త శుద్ధి లేని హామీలు ఇవ్వడం.. ఆపై మిన్నకుండిపోవడం మినహా, నిర్దిష్టమైన అభివృద్ధి చేయాలనే తలంపు కూటమి సర్కార్కు లేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అదే స్థాయిలో సీఎం హామీలు అమలు చేయించి ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తట్టలేదని పరిశీలకులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అభివృద్ధి కోసం కొంతైనా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. కడప వేదికగా రూ.1380కోట్ల నిధుల మంజూరుకు సీఎం హామీ ఏడాది పూర్తయినా అభివృద్ధిలో పురోగతి లేదు...నిధుల ఊసు అసలే లేదు నాడు ఓట్లు–సీట్లు ఇవ్వలేదన్న చంద్రన్న...సీట్లు ఇచ్చినా అదే వివక్ష 2014లో అధికారం దక్కించుకున్న తర్వాత జిల్లా పర్యటనకు సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఓ బహిరంగ సభలోనే మీరు నాకు ఓటేశారా..మీకు అభివృద్ధి చేయడానికి..? అంటూ ప్రశ్నించారు. 2024లో ఓట్లు సీట్లు ఇచ్చినా ఈ ప్రాంతం పట్ల అక్కసు, అసూయ తగ్గడం లేదని పలువురు మండిపడుతున్నారు. నాడు ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పద్మావతి మెడికల్ కళాశాలల్లో సీట్లు రాయలసీమ విద్యార్థులతోనే భర్తీ చేయాలనే నిబంధనలను నాటి చంద్రబాబు సర్కార్ తోసి పుచ్చుతూ జిఓ 130 తీసుకొచ్చి రాయలసీమకు అన్యాయం చేసింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పులివెందుల మెడికల్ కళాశాలకు 50సీట్లు ఎన్ఎంసీ కేటాయిస్తే చంద్రబాబు సర్కార్ మోకాలొడ్డుతోంది. స్వతహాగా సీఎం చంద్రబాబుకు రాయలసీమ, అందులో కడప, పులివెందుల అంటే ఎక్కడ లేని కోపం, ఆక్రోశం వెళ్లగక్కుతాడడని పలువురు ఆరోపిస్తున్నారు. మభ్యపెట్టే మాటలు చెప్పడం మినహా నిర్దిష్టమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేసిన చరిత్రే లేదని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. అలంకారప్రాయంగా ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు అలంకారప్రాయంగా ఉండిపోయారు. సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా, జిల్లా పర్యటనకు వ చ్చిన ప్రతిసారి హామీలు ఇవ్వడం,ప్రజల్ని మభ్యపెట్టడం మినహా జిల్లాలో అభివృద్ధి లేదు.ప్రజాప్రతినిధులకు నిలదీసే దమ్ము లేదు. – గాలి చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐసీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎం చంద్ర బాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఏడాది గడిచినా ని ధులు విడుదల చేయలేదు.త్వర లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబు తారు.స్థానిక సంస్థలఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. –చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : చిన్నదండ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్త గోపులాపురంలో గోసుల శ్రీరాములు (23) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కలమల్ల ఎస్ఐ సునీల్ కుమార్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోపులాపురానికి చెందిన గోసుల చౌడప్ప కుమారుడు గోసుల శ్రీరాములు పదేళ్ల కిందట అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేట నుంచి వచ్చి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా గ్రామంలోని ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవారు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు ఇటీవల ఆమెను మందలించి గ్రామం నుంచి తీసుకెళ్లారు. గత నెల ఆమె తిరిగి గ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి శ్రీరాములు ఇంట్లో ఇద్దరూ నిద్రపోయారు. ఆదివారం ఉదయం శ్రీరాములు సోదరి పార్వతి ఇంటి వద్దకు వచ్చి చూడగా.. శ్రీరాములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. జమ్మలమడుగుడు డీఎస్పీ వెంకటేశ్వరరావు, యర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి గొంతుపై కమిలిన గుర్తులు ఉన్నట్లు తెలిపారు. శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న బొలెరో
ఎర్రగుంట్ల : మండల పరిధి పెద్దనపాడు గ్రామ సమీపంలోని చాకిరేవుకు వెళ్లే మలుపు వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పెద్దమాచుపల్లె ఆంజనేయులు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. సీఐ విశ్వనాథరెడ్డి తెలిపిన వివరాల మేరకు... ఎర్రగుంట్ల పట్టణంలోని పుష్పగిరి మాన్యంలో నివాసం ఉండే గుమ్మయ్య కుమారుడు ఆంజనేయులు ఆటోను బాడుగులకు నడుపుతూ, రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఆయనకు భార్య లక్ష్మీనరసమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఆదివారం లక్ష్మీనరసమ్మ బట్టలు ఉతకడానికి పెద్దనపాడు గ్రామ పరిధి వంకలోని చాకిరేవుకు వెళ్లింది. ఆంజనేయులు ఆటో నడుపుకొంటూ అక్కడికి బయలుదేరాడు. చాకిరేవుకు వెళ్లే మలుపు వద్ద బొలెరో వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే సమీపంలో ఉన్న లక్ష్మీనరసమ్మ వెంటనే స్థానికుల సాయంతో ఆంజనేయులును ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరగైన వైద్య కోసం కడప రిమ్స్కు తరలించే ప్రయత్నం చేసే లోపే ఆంజనేయులు మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బద్వేలులో దొంగల హల్చల్బద్వేలు అర్బన్ : పట్టణంలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దొంగలు హల్చల్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక శ్రీకృష్ణదేవరాయనగర్ 5వ లైన్లో ఓ ఇంటిలోకి ప్రవేశించి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదు, కొంత వెండి సామగ్రి చోరీ చేశారు. అనంతరం స్థానిక మైదుకూరురోడ్డులోని ఎంసీ ఫర్నిచర్షాపులో శనివారం అర్ధరాత్రి గడ్డపారతో షట్టర్ లాక్లు తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు క్యాష్టేబుల్ డ్రాయర్లు, బీరువా తాళాలు పగులకొట్టి నగదు కోసం గాలించారు. అయితే ఎటువంటి నగదు లభించకపోవడంతో షాపునకు సంబంధించిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. అలాగే నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల సియట్ షోరూమ్లోకి ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్లోని రూ.60 వేల నగదుతోపాటు షోరూమ్లోని రూ.1.20 లక్షలు విలువ చేసే 8 స్టార్ హెడ్లైట్లు దొంగిలించారు. ఉదయం దుకాణాలు తెరిచేందుకు వెళ్లిన ఆయా షాపుల యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి అర్బన్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో చోరీ ఘటనలు చోటు చేసుకోవడంతో సీరియస్గా పరిగణించిన అర్బన్ పోలీసులు దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంచిన్నమండెం : కొత్తపల్లి గ్రామం మల్లూరు క్రాస్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయనగరం రమణమ్మ(35) దుర్మరణం చెందింది. మండల పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ సతీమణి రమణమ్మ సొంత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లేందుకు మల్లూరు క్రాస్ వద్దకు వెళ్తుండగా.. కొండారెడ్డి మామిడి తోట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
ఇరు వర్గాల ఘర్షణ.. ఆరుగురికి గాయాలు
మైదుకూరు : మండలంలోని ముసల్నాయనిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు రాళ్లు, చాకులతో దాడి చేసుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి 41 రోజులైన సందర్భంగా గ్రామస్తులు తమ బంధువులను పిలుచుకొని వేడుక చేసుకున్నారు. బంధువుల ఇళ్లకు వచ్చిన వారిలో ఓ వర్గం వారు భార్యాభర్తల గొడవను ప్రస్తావించి పరస్పరం రెచ్చగొట్టుకోవడం ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన బండి తిరుమలయ్య అనే యువకునికి మున్సిపాలిటీలోని వేపరాలపల్లెకు చెందిన కశెట్టి ఓబయ్య కుమార్తె ప్రసన్నతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్నాళ్లుగా వారు విడిగా ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకకు వచ్చిన వారు భార్యాభర్తల విషయం ప్రస్తావించి.. వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. సంఘటనలో నానుబాల ఇంద్రసేన, నానుబాల శివ, నానుబాల చిన్న ఈశ్వరయ్య, బండి తిరుమలయ్య, బండి సురేష్, బండి సుబ్బరాయుడు అనే వారు గాయడ్డారు. ఓ వర్గాన్ని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి, మరో వర్గానికి చెందిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరస్పర ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీల అమలేదీ?
● నమ్మించి మోసం చేయడంలో ‘కూటమి’సూపర్ సక్సెస్ ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయలేదని, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, బీజేపీ పార్టీలు ఇష్టారాజ్యంగా అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. హామీల అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై వ్యక్తిగతంగా దూషణలు , దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతి అమలు ఎప్పడో.. రెండేళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం 3.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఏమైనా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందా అంటే అదీలేదన్నారు. ఆడ బిడ్డనిధి, నిరుద్యోగ భృతిని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై ఇంత వరకు స్పష్టతలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి సైతం అమలు చేసిన చరిత్ర ఆయనకు దక్కితే.. హామీల అమలును విస్మరించిన చరిత్ర కూటమి నేతలకు దక్కుతుందన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారన్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి నియోజకవర్గంలో ఏమి చేసినా తమకు కప్పం కట్టాలంటూ ఎమ్మెల్యేలు వ్యాపారులను శాసించడం జరుగుతోందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నదుల్లో ఉన్న ఇసుకను కోట్లాది రూపాయలకు వీళ్ల జాగీర్లు అయినట్లు అమ్మేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన మహానాడులో ప్రజా సమస్యలపై , సంక్షేమ పథకాల అమలుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు.కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నామస్మరణతో సరిపెట్టారన్నారు. పైగా జగన్ పార్టీని గొడ్డలిపార్టీ అంటూ అసత్య ప్రచారం చేయడంతోపాటు ఇంకా జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ సిగ్గులేకుండా అసత్యాలు పలికాన్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రెండేళ్లలో ప్రజలకు వారు చేసింది ఎమిలేదన్నారు. టీడీపీ నాయకులు జగన్మోహన్రెడ్డిని విమర్శించే పని కాకుండా ప్రజలను మెప్పించే ప్రయత్నం చేయాలని హితవుపలికారు. ఈనెల 4వ తేదీన మండల కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలను కాల్చి నిరసన కార్యక్రమాన్ని, 12న నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జెడ్పీటీసీ బాలయ్య, ఎర్రగుంట్ల నాయకులు జయరామిరెడ్డి, శివారెడ్డి, రైతు విభాగం నాయకులు విశ్వనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ
కడప సెవెన్రోడ్స్ : కడపకు చెందిన వసంత్ మౌని విహంత్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్లో ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో ఆయన అఖిల భారతస్థాయిలో 26వ ర్యాంకును సాధించారు. న్యూరో సర్జరీ విభాగంలో ఓపెన్ కేటగిరి కింద ఎయిమ్స్, నిమ్హాన్స్, జిప్మర్, పీజీ ఐ చండీఘర్లలో 31 సీట్లు మాత్రమే ఉండ గా, అందులో ఒకటి ఆయన కై వసం చేసుకున్నా రు. కడపలోని సింగారెడ్డి ఎన్క్లేవ్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కుమారుడైన విహంత్రెడ్డి పూణెలోని ఆర్మ్డ్ ఫోర్స్డ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీని పూణెలోని భారతి విద్యాపీ ఠ్ కళాశాలలో పూర్తి చేసి ఇప్పుడు న్యూరో సర్జరీ విభాగంలో సీటు పొందారు. జమ్మలమడుగు: జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, భాగ్యనగర్ కాలనీల్లో గురువారం రాత్రి కురిసిన భారీ గాలివానకు చేనేత కార్మికులు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డారని, ప్రభుత్వం వారిని తక్షణమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మోరగుడి తదితర ప్రాంతాల్లో పర్యటించి, నష్టపోయిన కుటుంబాల వివరాలను సేకరించారు. ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించి, ఉచితంగా ముడిసరుకులు పంపిణీ చేయాలని ఆయన కోరారు. -
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కడప వాసులకు స్థానం
కడప ఎడ్యుకేషన్: కడప నాగారాజుపేటకు చెందిన దివంగత వేపరాల వీర భాస్కర్ రావు (రిటైడ్ హెడ్ మాస్టర్ సీఎస్ఐ స్కూల్) మనవరాలు పెట్లు కావ్య, కుమారుడు వేపరాల గోయల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు. విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్తిక దండంగి ఆధ్వరంలో 2026 ఫిబ్రవరి 2న పలు దేశాలకు చెందిన 777 మంది ‘ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎంసెంబల్’ చేశారు. దీంతో 777 మంది గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొన్నారు. వీరిలో కడప నాగరాజు పేటకు చెందిన పెట్లు కావ్య, వేపరాల గోయల్ ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ గౌచ్చిబౌలి విక్టరీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ అగసిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. పాస్టర్ ఆగస్తిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకుంటున్న కావ్య, గోయల్ -
ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు !
రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. అక్టోబరు 2, 1966లో ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది . కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్ర కారం, జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్గా ఏర్పాటైన దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిపాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్తో ఉన్న జోన్ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్ రైల్వే జోన్ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కొత్త జోన్ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్’ భవనంలో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. జూన్ 1న ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగానే ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జోన్లోనూ కడపకు అన్యాయమేనా..? విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. దశాబ్దాల కల అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ, కంభం–ప్రొద్దుటూరు, భాకరాపేట–గిద్దలూరు రైలుమార్గాలు కేవలం సర్వేలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామన్న హామీ మూలనపడింది. ఒకప్పుడు అత్యంత కీలక కేంద్రమైన నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. కనీసం అన్ని రైళ్లకు ఇక్కడ వాటరింగ్ సదుపాయం కల్పించే ప్రతిపాదన కూడా పెండింగ్లో పడింది. కొత్త జోన్ కేంద్రమైన విశాఖపట్నానికి వెళ్లేందుకు జిల్లా వాసులకు కనీసం ఒక్క ప్రత్యక్ష రైలు కూడా అందుబాటులో లేదు. కొత్త జోన్కు వెళ్లే ఏకై క రైలు తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే కావడం, అది ఎప్పుడూ రద్దీగా ఉండటంతో జిల్లా ప్రజలు, రైల్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జిల్లా మీదుగా ఇప్పటివరకు కనీసం ఒక్క వందేభారత్ రైలు కూడా నడపలేదు. ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్కోస్ట్ పరిధిలోని అత్యంత కీలకమైన ’కెకె లైన్’ (కోరాపుట్–కిరండూల్ లైన్) తిరిగి ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలోనే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్కు రూ. 25 వేల కోట్ల ఆదాయం ఉండాల్సి ఉండగా, ఈ మార్పుల వల్ల రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరోవైపు, జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్ రైల్వే జోన్లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్ డివిజన్, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. రేపటి నుంచే దక్షిణకోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు సికింద్రాబాద్ వీడి.. విశాఖ ‘డెక్’భవనం గూటికి కడప రైల్వే ఆదాయం కోల్పోవడంపై విమర్శలు సీమ రైల్వేలకు న్యాయం చేయాలని ఎంపీల డిమాండ్ కృష్ణపట్నం–ఓబులవారిపల్లె ప్యాసింజర్ లైన్, కడప–బెంగళూరు ప్రాజెక్టులపై జిల్లా వాసుల ఆశలు దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపోయి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీమ రైల్వే ధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సార్ యాజమాన్యం ఆలోచన చేయాలి. అలాగే తిరుపతి డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడుకొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్కు రావలసిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్కోస్ట్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్ చేయాలన్న డిమాండ్ను నెరవేర్చకుండానే జోన్ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. – పీవీ మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ -
గాయపడిన వ్యక్తి మృతి
వేంపల్లె : మండల పరిధి నాగూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన గ్రీన్ అంబాసిడర్ వేమా నాగన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వేమా నాగన్న విధుల్లో భాగంగా ఈ నెల 27న మూడు చక్రాల రిక్షాపై నాగూరుకు బయలు దేరారు. మార్గం మధ్యలో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వివరించారు. ఆయనకు భార్య మేరీ సువర్ణ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బద్వేలులో చోరీ బద్వేలు అర్బన్ : పట్టణంలోని సిద్దవటం రోడ్డులో గల శివరామకృష్ణనగర్ 5వ వీధిలోని ఓ ఇంటిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు..శివరామకృష్ణనగర్ 5వ లైన్లో నివసిస్తున్న బోవిళ్ళనరసింహారెడ్డి కన్స్ట్రక్షన్ బిల్డర్గా పనిచేస్తుండేవాడు. ఈయన భార్య బ్యాంకు పని నిమిత్తం అట్లూరుకు వెళ్లగా నరసింహారెడ్డి సొంత పని నిమిత్తం బయటికి వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగులకొట్టి అందులోని 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదుతో పాటు పూజగదిలోని వెండి సామగ్రిని దోచుకెళ్లారు. సాయంత్రం సమయంలో నరసింహారెడ్డి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి పరిశీలించారు. ప్రొద్దుటూరులో.. ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనిఽధి మిల్లులోని ఆఫీసు బీరువాను పగులకొట్టి అందులోని రూ. 12 లక్షలకు పైగా నగదును దొంగలు దోచుకెళ్లారు. దొంగలను పసిగట్టకుండా ఉండేందుకు ఆఫీసులోని సీసీ కెమెరాల వైర్ను దుండగులు కట్ చేశారు. అలాగే ఘటనా స్థలంలో కారం పొడి చల్లారు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పిడుగుపాటుకు బొగ్గుల బట్టీ దగ్ధం సింహాద్రిపురం : మండలంలోని కోవరంగుంటపల్లెలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు బొగ్గుల బట్టీ దగ్ధమైంది. బట్టీ నిర్వాహకుడు మాబు అలియాస్ పండుకు చెందిన రూ.15 లక్షలు విలువైన ముడి సరుకు, బొగ్గు సంచులు కాలిపోయాయి. బాధితుడి వివరాల మేరకు.. బట్టీ ఏర్పాటు చేసేందుకు శనివారం 20 ట్రాక్టర్ల కట్టెలు సిద్ధం చేసి ఈదురు గాలులు, ఉరుములు అధికమవడంతో ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే పిడుగుపాటుకు కట్టెలతో పాటు గతంలో కాల్చిన 400 బొగ్గుల సంచులు అగ్నికి ఆహుతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. పిడుగుపాటుతో మహిళ మృతి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయం సమీపంలో ఉంటున్న కొట్టు అంజనమ్మ(36) పిడుగుపాటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి గాలివాన భీభత్సం సృష్టించింది. చిలంకూరు గ్రామం సమీపంలో పిడుగు శబ్దంతోపాటు మెరుపు రావడంతో అంజనమ్మ ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి కుప్పకూలి పోయింది. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు మహేష్ కూడా ఈ పిడుగు శబ్దానికి కింద పడ్డాడు.అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్కు తరలించారు. మహేష్ మాసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు దువ్వూరు : బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. శనివారం మైదుకూరు రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను వల్లూరు మండలం కొట్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు ఈశ్వర్ (19) ఆరు నెలల క్రితం ఇన్స్ట్రాగామ్లో బాలికకు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో గత సోమవారం ఆ బాలిక దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఉన్న చర్చికి వచ్చింది. ఆ బాలికను ఈశ్వర్ బైక్పై ఎక్కించుకుని ఖాజీపేట బైపాస్లో ఉన్న ఓ లాడ్జీలోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను గుడిపాడు దగ్గర వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత అధిక రక్తస్రావం అవుతుండటంతో తల్లికి జరిగిన విషయం తెలిపిందని చెప్పారు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని ప్రొద్దుటూరు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినటు తెలిపారు. -
విచారణకు ఆదేశం
కడప అగ్రికల్చర్: వైఎస్సార్జిల్లా వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె ప్రైమరీ అగ్రికల్చర్ కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామిరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. ఈ మేరకు ఆయనపై విచారణ చేయాలని కమిటీని ఆదేశించినట్లు జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ ఎం. వెంకటసుబ్బయ్య తెలిపారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ మూల విరాట్లను టీటీడీ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి మూలవిరాట్లను గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలి కలెక్టర్కడప సెవెన్రోడ్స్: దేశాభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అధ్యక్షతన జిల్లా గ్రామీణ విలేకరుల రెండురోజుల పునశ్చరణ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. వార్తలు కేవలం ప్రభుత్వ పరిపాలనకే కాకుండా, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా కనీసం 70 శాతం ఉపయోగకరంగా ఉండాలన్నారు. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి వాచ్డాగ్స్గా నిలవాలన్నారు. వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిష్పాక్షిక సమాచారంతో మీడియా విశ్వసనీయతను కాపాడుకోవాలన్నారు. సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మీడియా వ్యవస్థకు గ్రామీణ జర్నలిస్టులే మూలస్తంభాలన్నారు.మరో సీనియర్ పాత్రికేయుడు రాఘవశర్మ మాట్లాడుతూ.. తెలుగు వ్యాకరణంపై అవగాహన పెంచుకుని, మాండలిక పదాలతో, సరళమైన పదజాలంతో వార్తా రచన చేయాలని సూచించారు. కడప సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు. -
ప్రజలకు చంద్రబాబుపై అపనమ్మకం
రాజంపేట: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అపనమ్మకం ఏర్పడిన పరిస్ధితులు నేడున్నాయని, గత ఎన్నికల్లో ఓటువేశామని బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విమర్శించారు. శనివారం మేడాభవన్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారన్నారు. టీడీపీ రెండేళ్లపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండేళ్ల పాలన మోసపూరితమని, ప్రజలకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మండల, నియోజకవర్గ స్ధాయిలో నిరసనలు జయప్రదం చేయాలన్నారు. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. స్ధానికసంస్ధలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నందలూరు మండలాధ్యక్షుడు మేడా విజయభాస్కర్రెడ్డి, నందలూరు వైఎస్సార్సీపీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కలీం,మోదుగల చంద్రశేఖర్, రాజశేఖర్రెడ్డి, గంగినాయుడు, మోహన్రెడ్డి, నాగసుబ్బయ్య, సోమిశెట్టి ప్రభాకర్,ఆల్విన్ విజయుడు, మహిళనాయకురాలు పల్లెమాధవి,మైనార్టీ ప్రతినిధులు షాజహాన్, జుల్ఫీకర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మేడారఘునాథరెడ్డి -
● రైతుకు అపార నష్టం
మైలవరం: మైలవరం మండలలో గురువారం రాత్రి గాలివాన గడగడలాడించింది. మండలంలోని తొర్రివేములు, నార్జాంపల్లి గ్రామాల్లో బొప్పాయి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. గ్రామాల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్ల రేకులు గాలికి ఎగిరిపోయాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రూ. 15 లక్షల వరకు పంట జరిగినట్లు రైతులు వాపోతున్నారు.పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఉద్యాన వన శాఖ అధికారి జయ భరత్రెడ్డి తెలిపారు.అరటి మూడు హెక్టార్లలో, బొప్పాయి 5.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. -
అన్నదాత.. గుండెకోత
● అకాలవర్షాలు, ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలు ● 10 మండలాల్లో అరటి, బొప్పాయి, మునగ పంటలకు నష్టం ● రాజుపాలెంలో 88.6 మి.మీ.వర్షం కడప అగ్రికల్చర్: అకాల వర్షాలు, ఈదురు గాలులతో అన్నదాతలకు దెబ్బమీద దెబ్బపడుతూనే ఉంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఆరటి, బొప్పాయి, మునగ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 56.99 లక్షల మేర నష్టం జరిగి రైతులకు కొలుకోలేని దెబ్బతగిలింది. 168.85 హెక్టార్లలో పంటలకు నష్టం... జిల్లావ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 201 మంది రైతులకు సంబంధించి 168.55 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ. 56.99 లక్షల్లో పంట నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఇందులో ఒంటిమిట్ట మండలం పరిధిలో ముగ్గురు రైతులకు చెందిన 1.60 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిని రూ. 56 వేలు నష్టం జరిగింది. మైదుకూరు మండలంలో 94 మంది రైతులకు సంబంధించి 68 హెక్టార్లలో ఆరటి, 14 హెక్టార్లలో బొప్పాయి పంటలు దెబ్బతిని రూ. 27.30 లక్షలు, మైలవరం మండల పరిధిలో 12 మంది రైతులకు చెందిన మూడు హెక్టార్లలో ఆరటి, 5.85 హెక్టార్లలో బొప్పాయి, 40 సెంట్లలో మునగ పంటల దెబ్బతిని రూ. 2.61 లక్షలు, పొద్దుటూరు మండలం పరిధిలో 12 మంది రైతులకు సంబంధించి 80 సెంట్లలో మునగపంట దెబ్బతిని రూ. 20 వేలు, లింగాల మండల పరిధిలో 5 మంది రైతులకు చెందిన 4 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 1.40 లక్షలు, ఎర్రగుంట్ల మండల పరిధిలో 15 మంది రైతులకు సంబంధించి 14 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 4.96 లక్షలు, సింహాద్రిపురం మండల పరిధిలో 35 మంది రైతులకు చెందిన 30 హెక్టార్లలో ఆరటి పంట దెబ్బతిని రూ. 10.50 లక్షలు, తొండూరు మండల పరిధిలో నలుగురు రైతులకు సంబంధించి 3 హెక్టార్లో అరటి దె బ్బతిని రూ. 1.05 లక్షలు, కొండాపురం మండల పరిధిలో ఒక రైతుకు సంబంధించి 1.20 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 42 వేలు, ముద్దనూరు మండల పరిధిలో 30 మంది రైతులకు సంబంధించి 23 హెక్టార్లలో ఆరటి దెబ్బతిని రూ. 8.05 లక్షల మేర నష్టం జరిగింది. రాజుపాలెం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు జిల్లాలోని రాజుపాలెం మండలంలో అత్యధికంగా 88.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలమడుగులో 47.4, మైలవరం మండలంలో 45.6, మైదుకూరు మండలంలో 36.4, పొద్దుటూరు మండలంలో 36, గోపవరం మండలంలో 26.8, ముద్దనూరు మండలంలో 25.2, చాపాడు మండలంలో 19.6, సిద్దవటం, ఎర్రగుంట్ల మండలాల్లో 18.2, కొండాపురం మండలంలో 14.2, బద్వేల్ మండలంలో 12.8, కడపలో 8.4, సీకేదిన్నె మండలంలో 5.4 , చెన్నూరు మండలంలో 2.6, ఖాజీపేట మండలంలో 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో గురువారం రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. -
ప్రతి బీఎల్ఏ సైనికుడే !
● ఓటర్ల జాబితా వైఎస్సార్సీపీ గెలుపునకు తొలిఅడుగు ● వైఎస్ జగన్ను సీఎంగా చేసుకోవాలన్నదే ధ్యేయం ● ఎమ్మెల్సీ టీ. కల్పలతారెడ్డి రాజంపేట: స్ధానికసంస్థల ఎన్నికల్లో ప్రతి బూల్ లెవెల్ ఏజెంట్(బీఎల్ఏ) సైనికుడని, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏదేనని శాసనమండలి సభ్యురాలు,అన్నమయ్య జిల్లా బీఎల్ఏ పరిశీలకురాలు టీ.కల్పలతారెడ్డి అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్లో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బీఎల్ఏ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాయే వైఎస్సార్సీపీ గెలుపునకు తొలి అడుగు అని అన్నారు. బీఎల్ఏలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాపై పట్టు సాధించాలన్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లను రకరకాలుగా తొలిగించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. దానిని బీఎల్ఏలు అడ్డుకోవాలన్నారు. మళ్లీ 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ధ్యేయంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్క బీఎల్ఏ సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు మేడా విజయభాస్కర్రెడ్డి, గాలివీటి రాజేంద్రరెడ్డి, కేంద్రకార్యాలయ పరిశీలకులు నరసింహారెడ్డి. ఎస్ఈసీ సభ్యుడు చొప్పాఎల్లారెడ్డి, రాయలసీమ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి, జిల్లా బూత్కమిటి నేత నడివీధి సుధాకర్, మండలకన్వీనర్లు టక్కోలు శివారెడ్డి, దొడ్డిపల్లెభాస్కర్రాజు, జె. కృష్ణరావుయాదవ్, నీలకంఠేశ్వరరెడ్డి, సిద్ధవరం గోపిరెడ్డి,బెహరన్ వైఎస్సార్సీపీ కన్వీనరు ఓర్సు నాగరాజు, నాయకులు గొబ్బిళ్ల త్రినాధ్,పాపినేని విశ్వనాధరెడ్డి, దండుగోపి,వడ్డెరమణ, మహిళనేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, రక్కాసి శ్రీవాణి, పల్లె మాధవి పాల్గొన్నారు. సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి.ఓట్లు తొలగింపునకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలదే. స్థానికసంస్ధలలో వైఎస్సార్సీపీ సత్తా చాటుకునేందుకు సమష్టిగా కృషిచేయాలి. బూత్ స్ధాయిలో వైఎస్సార్సీపీ ఓట్లకు గండిపడకుండా చూసుకోవాలి. – సురేష్బాబు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు ఒక ఓటు కూడా పొగొట్టుకోకూడదు. ఆ దిశగా బీఎల్ఏలు పనిచేయాలి. సర్లో బీఎల్ఏలదే కీలకపాత్ర.అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలో ఉన్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలలో ఓట్ల తొలగింపుతో నేతలు ఓటమి పాలయ్యారు. అందువల్ల ఓట్ల తొలిగింపునకు అడ్డుకట్టవేసే విధంగా బీఎల్ఏలు పనిచేయాలి. – ఆకేపాటి అమరనాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట స్థ్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురాలి.సమష్టిగా గెలుపునకు కృషిచేయాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు గ్రహించారు.రెండేళ్లలో హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రె డ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలంటే బీఎల్ఏలు కీలకపాత్ర పోషించాలి. ఓట్ల తొలిగింపుకు కుట్రలు తెరలేస్తాయి. వాటిని అడ్డుకొని మన ఓట్లను కాపాడుకోవాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు -
మత్తు మందు చల్లి.. బంగారు గొలుసు అపహరణ
లింగాల : లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో పట్టపగలే మహిళ మెడలోని రూ.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు..చిల్లర దుకాణం నిర్వహిస్తున్న కేతిరెడ్డి సరళ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ముఖాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు సరకులు కొనేందుకు వచ్చారు. ఆమె సరకులు ఇస్తుండగా ముఖంపై మత్తు మందు చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. నిందితులు పులివెందుల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగదీశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ట్రావెల్ బస్సు బోల్తా – ముగ్గురికి గాయాలు గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్, అనంతపురం జిల్లా తలుపులకు చెందిన పవన్కుమార్, అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకు ని బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ముద్దనూరు: మండలంలోని చెర్లోపల్లెకు చెందిన కుంచపు భారతి (37) కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. భారతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవారన్నారు. గురువారం నొప్పి భరించలేక విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆరోగ్య భారతి
కమలాపురం : సమాజ సంక్షేమానికి భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) పెద్దపీట వేస్తోంది. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతమైన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతి సిమెంట్స్, అపోలో టెలీమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్సైట్ వైద్య సంరక్షణను టెలీమెడిసిన్ ఆధారిత స్పెషాలిటీ కన్సల్టేషన్లతో కలిసి గ్రామీణులకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిజిటల్ క్లినిక్ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ను అపోలో టెలిమెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషన్ అమలు చేస్తూ, కార్యచరణ రూపొందించింది. నిరంతర సేవలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రముఖ అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షణలో 2015లో ఫ్యాక్టరీ ఎదుటే రూ. 50 లక్షల వ్యయంతో టెలీక్లినిక్ను ఏర్పాటు చేశారు. అపోలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రోజుకు దాదాపు 40 నుంచి 50 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలతో పాటు కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో క్లినిక్కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. చికిత్స చేయడంతో పాటు మందుల పంపిణీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వైద్య సేవలు అందించారు. అపోలో పర్యవేక్షణలో డిజిటల్ క్లినిక్ నిర్వహణ -
● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఎర్రగుంట్ల : మండల వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు గాలివాన బీభత్సం సృస్టించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) కాలనీలోని ఈ టైపు క్వార్టర్స్లో ఉంచిన కారుపై భారీ చెట్టు పడింది. కారు భూమికిలోకి కూరుకుపోయింది. ఎర్రగుంట్ల, వై కోడూరు, కలమల్ల, మాలెపాడు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.విద్యుత్ శాఖ ఏడీఈ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో గ్రామాల్లో రాత్రంతా అంధకారం నెలకొంది. ● చెట్టు కూలి దూడ మృతి ముద్దనూరు : ముద్దనూరు మండలంలో గురువారం రాత్రి ప్రకృతి బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక పాతబస్టాండు ఆవరణలోని బస్షెల్టర్ వద్ద ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. రాత్రి కావడం, జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెన్నారెడ్డిపల్లెలో దూడపై చెట్టు పడటంతో దూడ మృతి చెందింది. ఇదే గ్రామంలో గేదైపె చెట్టు పడటంతో తీవ్రంగా గాయపడింది. చెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. పెనుగాలులకు సుమారు 50 చెట్లు నేలకూలాయి. మండల వ్యాప్తంగా సుమారు 70 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగినట్లు విద్యుత్తు శాఖ ఏఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మండల వ్యాప్తంగా అంధకారం నెలకొంది. -
బూత్లెవల్ ఏజెంట్ కీలకంగా వ్యవహరించాలి
రైల్వేకోడూరు అర్బన్: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ చెందిన ప్రతి 252 బూత్ లెవల్ ఏజంట్లు సర్ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదికారప్రతినిధి, మాజీఎమ్మెల్యే, ఇన్చార్జి కొరముట్ల శ్రీనివాసులు శక్రవారం తెలిపారు. స్థానిక రాజ్కళ్యాణ మండపంలో జరిగిన సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్బాబు, కొండూరుఅజయ్రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్ల తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏ దృష్ఠి పెట్టాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్రెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, జెట్పీటీసీరత్నమ్మ, రాయలసీమ బూత్కన్వీనర్ తల్లెంభరత్కుమార్రెడ్డి, క్రిష్ణారెడ్డి, , వెంకటరెడ్డి, సీహెచ్రమేష్, నందాబాల, విజయ్కుమార్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా బర్సీ మహోత్సవం
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా స్వర్గీయ పీఠాధిపతి హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి బర్సీ మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి పీఠాధిపతి, సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో బర్సీ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ పీఠాధిపతి నివాసం నుంచి జహీరియా దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మజార్లపై గంధం ఎక్కించి, పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. రాత్రి నాత్ చదివారు. అనంతరం బయాన్ చేశారు. పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా, గౌస్పాక్, జియా మాలిక్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కర్షకుడికి కాయ కష్టం!
కడప అగ్రికల్చర్: జిల్లాలో వరుణుడు కరుణించాడు. వర్షాలు ఆశాజనకంగా ప్రారంభం కావడంతో రైతన్నలు కాడీ మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఖరీఫ్–2026 సీజన్ కూడా అధికారికంగా ప్రారంభం కానుంది. కోటి ఆశలతో రైతులు దుక్కులు దున్నుతున్న వేళ.. వేరుశనగ విత్తనకాయల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిబంధనల కోతలు రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సేకరణ ఆరంభించని అధికారులు సీజన్ ముంచుకొస్తున్నా జిల్లాలో ఇంతవరకు వేరుశనగ విత్తనకాయల ప్రొక్యూర్మెంట్ (సేకరణ) ప్రక్రియే ప్రారంభం కాలేదు. అధికారులు వీటిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు? రైతులకు ఎప్పుడు సరఫరా చేస్తారనే విషయాలపై తీవ్ర మల్లగుల్లాలు నడుస్తున్నాయి. జిల్లాలో ’వేముల’ మండలం మినహా మరెక్కడా విత్తనాల కోసం రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలుకాలేదు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జూన్ రెండో వారం దాటితే కానీ విత్తనకాయలు చేతికి వచ్చేలా లేవు. ప్రభుత్వ పంపిణీలో నిబంధనల గోడలు! ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సకాలంలో వచ్చేలా లేకపోవడంతో బహిరంగ మార్కెట్ను ఆశ్రయిద్దామన్నా రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓపెన్ మార్కెట్లో వేరుశనగ క్వింటాల్ ధర రూ.10,000 పైగా పలుకుతుండటంతో అంత పెట్టుబడి పెట్టలేక చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించి 4,788 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీకి (కే–6, టీఎస్జీఎస్–1694, నారాయణి రకాలు) వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, ఇందులో పెట్టిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఇరిగేటెడ్ రైతులకు మొండిచేయి నాన్–ఇరిగేటెడ్ (వర్షాధార) మండలాలకు తప్ప, ఇరిగేటెడ్ (ఆయకట్టు) పరిధిలోని మండలాలకు విత్తనకాయలను కేటాయించకుండా అధికారులు చేతులెత్తేశారు. అర ఎకరా లోపు ఉంటే ఒక మూట (30 కిలోలు), ఎకరా లోపు ఉంటే రెండు బస్తాలు, ఎకరా దాటి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా కేవలం మూడు బస్తాలు (90 కిలోలు) మాత్రమే ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ‘ఐదెకరాలున్న రైతుకు మూడే బస్తాలిస్తే.. మిగతా పొలానికి ఓపెన్ మార్కెట్లో వేలాది రూపాయలు పోసి కొనుగోలు చేయాలా?‘ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తొలకరి పలకరించినా.. తలుపు తెరవని విత్తన కేంద్రాలు ఖరీఫ్ ముంగిట వేరుశనగరైతన్నల ఆందోళన కూటమి పాలనలో విత్తనానికికోత, సాగుకు ఘాత దుక్కులు దున్నినాదిక్కుతోచని స్థితిలో రైతన్న ప్రభుత్వ ఉదాసీనత, విత్తన కోతల ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జిల్లాలో 5,976 హెక్టార్లలో వేరుశనగ సాగు కాగా, ఈ ఏడాది దానిని 4,446 హెక్టార్లకే పరిమితం చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,530 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పడిపోనుంది. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు నాటికే పూర్తిస్థాయిలో విత్తనాలు జిల్లాకు చేరేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేసి, మండలాలకు కేటాయించి, డి–కృషి యాప్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.‘ అని స్థానిక రైతులు వాపోతున్నారు. -
మరోసారి పిలిస్తే ‘చీరే’స్తాం!
బద్వేలు అర్బన్: ‘ఏరుదాటే దాకా ఓడమల్లన్న ... దాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గల 12 క్లస్టర్లలో మహానాడు నిర్వహణ బాధ్యతను డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి చేతికి అధిష్టానం అప్పగించింది. దీంతో ఎలాగైనా కార్యక్రమానికి జనాన్ని రప్పించి విజయవంతం చేయాలని అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన మూడు క్లస్టర్లలో మహిళలను రప్పించేందుకు మెప్మా ఆర్పీల ద్వారా వాయిస్ మెసేజ్లు పంపించారు. ప్రతి గ్రూపు నుంచి కచ్చితంగా ఐదుగురు మహిళలు హాజరు కావాలని, హాజరైన వారికి భోజన వసతితో పాటు చివరి రోజున చీరలు పంపిణీ చేస్తారని సదరు సందేశంలో చెప్పారు. దీంతో ఆశపడిన పట్టణంలోని పలు పేద కాలనీలకు చెందిన మహిళలు సభకు హాజరయ్యారు. రెండు రోజులు కార్యక్రమాన్ని ముగించుకున్న టీడీపీ నాయకులు కొద్ది మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. చీరలు దక్కని చాలా మంది మహిళలు టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. తమను ఆశపెట్టి కార్యక్రమం ముగిసిన తర్వాత చీరలు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు మోసపూరిత మాటలతో పిలిస్తే ‘చీరే’స్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● బద్వేలు మహానాడులో పచ్చ నేతల‘బోడిమల్లన్న’ రాజకీయం ● ఆశ చూపి పిలిచారు.. అవసరం తీరాక మొండిచేయి చూపారు -
మహానాడులో కార్పొరేషన్ ఉద్యోగి
కడప కార్పొరేషన్: కడపలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న రాజశేఖర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ మీటింగ్లో పాల్గొని, టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
డీఎస్సీలో భారీ అక్రమాలు
కడప సెవెన్రోడ్స్: డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విభాగ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలక్ష్మణ్రెడ్డి, సంయుక్త కార్యదర్శి సందీప్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ను తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. డేటా కూడా డెలీట్ చేయడం, మెరిట్ లిస్టు మాయం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఒక్కో పోస్టుకు రూ. 15 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకపోగా, అవినీతికి గేట్లు తెరిచారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు జరిగిన ఈ అన్యాయం క్షమించరానిదన్నారు. నిరుద్యోగులకు తాము అండగా నిలుస్తామని, డీఎస్సీ అక్రమాలు సరిదిద్దే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మళ సాయికుమార్రెడ్డి, నాయకులు బాలకృష్ణ, డేవిడ్, శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేష్రెడ్డి, రుద్రసేనారెడ్డి, శ్యాం, రాయుడులతోపాటు నగర కమిటీ సభ్యులు, కాలేజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ గంగయ్యకు వినతిపత్రమిచ్చారు. ఫోటోనెం. 29కెడిపి601, 602, 603– కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, పార్టీ నేతలు కెడిపి604 – కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి విభాగం నాయకులు మంత్రి లోకేష్ను బర్తరఫ్ చేయాలి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీవిద్యార్థి విభాగం ధర్నా -
● కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి: మాజీ మేయర్ పాకా సురేష్
కడప అర్బన్: కడప నగరంలోని గుర్రాలగడ్డ సమీపంలో శుక్రవారం నీటి గుంతలో పడి సయ్యద్ యూనస్ (4) అనే బాలుడు మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువుల సమాచారం మేరకు... కడప నగరంలోని గుర్రాలగడ్డ వీధి సమీపంలో నివాసముంటున్న సయ్యద్ మున్నా, సాజిదాభానులకు సయ్యద్ యూనస్ (4), జహీర్ (7), సాజిద్ (9) ముగ్గురు సంతానం. వీరిలో సయ్యద్ యూనస్, జహీర్ శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఆడుకుంటూ సమీపంలోని వంతెన నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. ఇటీవల పడిన వర్షాలకు ‘పిల్లర్ల’ మధ్యలోని గుంతలు నీటితో నిండి ఉన్నాయి. ఈ క్రమంలో ఆడుకుంటూ యూనస్ నీటిలోకి దిగి మునిగిపోయాడు. భయపడిన అన్న జహీర్ కేకలు వేసుకుంటూ ఇంటికొచ్చాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అంతలోపే యూనస్ నిండా మునిగిపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను చేపట్టారు. సుమారు అరగంట తర్వాత బాలుడిని వెలికి తీసి ప్రథమచికిత్స చర్యలను చేపట్టి కడప రిమ్స్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. అంతవరకు ఊపిరిబిగపట్టి చూస్తున్న తండ్రి మున్నా ఒక్కసారిగా బోరున విలపించారు. యూనస్ మృతదేహాన్ని పట్టుకుని ‘మేరే బేటే!ఉఠో ఘర్కు చలింగే!!’ అంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. బాలుడి మృతికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం కడప నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్రాలగడ్డ నుంచి రవీంద్రనగర్లోకి బుగ్గవంక వీదు గా రోడ్డు వేసేందుకు పిల్లర్లను నిర్మించారు. పిల్లర్ల చుట్టూ ఏర్పడిన గుంతలు దాదాపు 10 అడుగులకుపైగా లోతులో వున్నాయి. ఇటీవల పడిన వర్షాలకు గుంతనిండా నీళ్లు చేరాయి. ఈ గుంతల చుట్టూ కంచెను ఏర్పాటు చేయలేదు. పిల్లర్ల నిర్మాణ సమయంలో బుగ్గవంక ప్రహరీని పగులగొట్టిన కాంట్రాక్టర్ ప్రహరీనిగానీ పూర్తి చేయకుండా వదిలేశాడు. దీంతో అవి ప్రమాదాలకు నెలవుగా మారాయి. రెండు రోజుల క్రితం ఓ చిన్నారి నీటి దగ్గరికి వెళ్లి ఆడుకుంటుండగా మునిగిపోతుండగా స్థానికులు గమనించి రక్షించారు. ఆ సంఘటన తరువాత కాంట్రాక్టర్కు, అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా నిర్లక్ష్యం వీడలేదు. బుగ్గవంకపై బ్రిడ్జిల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. ప్రమాదాలు పొంచి ఉన్నాయని సాక్షి ముందే హెచ్చరించింది. కాంట్రాక్టర్ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. ముందే మేల్కొని ఉంటే ఈ విషాద ఘటన జరిగేది కాదు. ఆ చిన్నారి కంటికి పూసిన సుర్మా అలాగే ఉంది.. ఒంటికి రాసిన అత్తరు గుబాళి స్తూనే ఉంది.. ఈద్ రోజు చిట్టి చేతులతో చేసిన దువా అతని తల్లిదండ్రుల కళ్లముందు కదలాడుతూనే ఉంది.. ఇల్లంతా తిరుగుతూ చేసిన అడుగుల సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది.. పండగ క్షణాలు ఇంకా చెరిగిపోకముందే.. ఆ ఇంట విషాదం అలుముకుంది.. తియ్యని ఈద్ జ్ఞాపకాలు తుడిచిపోకముందే.. కఠిన చేదు వార్త వారి గుండెల్ని తాకింది.. సరిగ్గా ఐదేళ్లు నిండని చిరు వయసులోనే మృత్యుకౌగిట్లోకి ‘జారి’పోయిన పిల్లాడిని చూసి తల్లిదండ్రుల కంట కన్నీరొలికింది. నీటి గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతిచెందిన విషాద ఘటన కడపలో చోటుచేసుకుంది. త్యువాత నాయకుల నిర్లక్ష్యానికి బలైంది. కడప వైఎస్ఆర్ సర్కిల్: బుగ్గవంకపై షామీరియా బ్రిడ్జి నిర్మాణపు నీళ్ల గుంతలో పడి గుర్రాలగడ్డ వీధికి చెందిన 5 ఏళ్ల బాలుడు సయ్యద్ యూసఫ్ మృతి చెందిన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు. శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటన పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం, నిర్మాణ పనుల పర్యవేక్షణలో వైఫల్యం వల్లే జరిగిందని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి షామీరియా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించినా.. నిరంతరాయంగా పూర్తి చేసే బాధ్యతలో విఫలమయ్యారని విమర్శించారు. ఘటన జరిగాక మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ‘ప్రవేశం లేదు‘ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారని.. అదే ప్రమాదం జరగకముందే ఈ చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గవంక గుంతలో పడి బాలుడు మృతి కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులనిర్లక్ష్యమే కారణం నీటి గుంతలో పడి మృతిచెందిన యూనస్ మృతదేహాన్ని రిమ్స్ క్యాజువాలిటీలో మాజీమేయర్ పాకా సురేష్కుమార్, మాజీ కార్పొరేటర్లు బాలస్వామిరెడ్డి, అజ్మతుల్లాలు, ఇతర వైఎస్ఆర్ సీపీ నేతలు పరిశీలించారు. బాలుడి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుగ్గవంకలో వంతెన నిర్మాణపనులలో పిల్లర్ల వరకే పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా వంతెన నిర్మాణ పనులు చేయలేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ తనకు బిల్లులు మంజూరు కాలేదంటూ నిర్లక్ష్యంగా ఎక్కడిపనులను అక్కడ వదిలేయడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్టర్పైనా, పర్యవేక్షణ అధికారులపైన చర్యలను తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వైఎస్ఆర్సీపీ న్యాయపోరాటం చేసి అండగా నిలుస్తుందన్నారు. -
ఏపీ పీజీ సెట్లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్: ఏపీ పీజీ సెట్–2026 ప్రవేశ పరీక్షల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రతిభ చాటారు. జిల్లావ్యాప్తంగా 859 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 658 మంది క్వాలిఫై అయి 89.16 శాతం ఉత్తీర్ణతను సాధించారు. రాజంపేట: శేషాచల అటవీప్రాంతం రోళ్లమడుగులో శుక్రవారం ఓ తమిళ సినిమా షూటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద నుంచి ఈ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు సెట్టింగ్స్ వేస్తున్నారు. ఎర్రచందనం స్లగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తునట్టుగా తెలుస్తోంది. రోళ్లమడుగు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండటం వల్ల షూటింగ్ ఇక్కడ చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కడప కార్పొరేషన్: వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ స్టేట్ చైర్మన్ ఎం. సురేష్ బాబు అన్నారు. శుక్రవారం కడప శివారులో వున్న పాస్ట్రల్ సెంటర్ పరిధిలో యువతీ యువకులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసి ఉత్పత్తులను వినియోగించే వారికి కొన్ని మౌళిక హక్కులు ఉంటాయన్నారు. కొన్న వస్తువుకు సరైన బిల్లులు తీసుకోవడం, చలామణి తేదీలు పరిశీలించడం, నకిలీ వస్తువులను గుర్తించడం, తప్పిదాలపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయాలన్నారు. కన్స్యూమర్ ఫోరమ్లో నష్ట పరిహారం కోసం ఎలా దాఖలు చేయాలి అన్న అంశం పై కూడా అవగాహన కల్పించారు. రూ.50వేల వరకూ నష్టపోతే జిల్లా కోర్టులో, రూ.2కోట్ల వరకూ నష్టపోతే రాష్ట్ర వినియోగదారుల కోర్టులో, ఆపైన జాతీయ వినియోగదారుల ఫోరంలో పరిహారం పొందవచ్చన్నారు. సెంటర్ డైరెక్టర్ పాస్టర్ వరప్రసాద్, కమిషన్ జిల్లా ఛైర్మెన్ కిశోర్, పాస్టర్లు ప్రసాద్, శరత్, సిస్టర్లు సౌరీలు, సీహెచ్ మేరీ, ప్రశాంతి, లిల్లీ పుష్ఫ, కస్పర్, లెక్చరర్ ప్రసన్న ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదాములను కడప కార్పొరేషన్/సెవెన్రోడ్స్: రైతులకు ఉపయోగపడేలా ఎంపీఎఫ్సీ గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాల గోదాముల ఏర్పాటుకు సంబంధించి జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కడప అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – ఎస్ఐఆర్ 2026 ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్ 2026 పై జేసీ డి. నిధి మీనా, డిఆర్వో మల్లికార్జునుడులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల సమగ్రత అత్యంత కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమని, అందుకే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా వెలుపల ఉండకూడదనే దానితో పాటు, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూడడమేనని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గత ప్రత్యేక సమగ్ర సవరణలో నమోదైన వివరాలకు ప్రామాణికత కల్పించబడుతుందని చెప్పారు. ఎవరైనా పేరు తొలగించే ముందు తప్పనిసరిగా వినతులు స్వీకరించి విచారణ జరిపి మాత్రమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు నియమించే బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఏ) కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. -
చిన్నారికి పునర్జన్మను ప్రసాదించండి
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ భవాని నగర్కు చెందిన జంబుబోయిన కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మల కుమారుడు వర్షిత్ నాథ్కు అరుదైన జబ్బు సోకింది. వీరికి ముగ్గురు కుమార్తెలతోపాటు నాలుగో సంతానంగా వర్షిత్ నాథ్ జన్మించాడు. వీరిది మేనరికం వివాహం. తల్లిదండ్రులు హోటల్ను నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వర్షిత్ నాథ్ పుట్టిన తొలి ఆరు నెలలు అందరిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండేవాడు. క్రమేణా నరాల జబ్బు కారణంగా నిల్చోలేని పరిస్థితి వచ్చింది. బాబు పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో హోటల్నూ మూసివేశారు. ఈ నెల 14న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి బాలుడిని తీసుకెళ్లగా.. అక్కడ బాలుడికి జనటిక్ పరీక్షలు చేయించారు. ‘మీ బాబుకు మోటార్ ఆక్జోనల్ న్యూరోపతి జబ్బు వచ్చిందని’ అక్కడి డాక్టర్ గీత చందా చెప్పినట్లు వారు తెలిపారు. బాబు వయసు ప్రస్తుతం 14 నెలలు.. రెండేళ్లలోపు బాబుకు వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు సూచించారు. అంత వరకు తాత్కాలికంగా మందులు ఇచ్చారు. పునర్విక తరహాలోనే రూ.16 కోట్ల విలువైన టీకా వేయాల్సిందే పునర్విక తరహాలోనే తమ బాబుకు రూ.16కోట్ల విలువైన ఇంజక్షన్ వేయించాలని వైద్యులు సూచించినట్లు తల్లిదండ్రులు కాశీవిశ్వనాథ్, బాలలింగమ్మ తెలిపారు. మానవతా హృదయంతో స్పందించి తమ బాబుకు పునర్జన్మను ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు. 7095148237 నంబర్కు దాతలు ఫోన్ పే చేయాలని తల్లిదండ్రులు కోరారు. 14 నెలల బాబుకు నరాల జబ్బు పునర్విక తరహాలోనే ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు -
అదిరిందయ్యా.. సూర్యం!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావించే ’మహానాడు’ జిల్లా వ్యాప్తంగా అట్టర్ఫ్లాప్ అయ్యింది. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాల కంటే, సభలో జనాన్ని నిలబెట్టుకోవడమే స్థానిక నేతలకు పెద్ద సవాల్గా మారింది. అంతర్గత గ్రూపు రాజకీయాలు, సమన్వయ లోపం కారణంగా పసుపు పండుగ కాస్తా ‘మహా.. ఫ్లాప్’షోగా మిగిలిపోయింది. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న విభేదాలు ఈ వేదికపై బహిర్గతం కావడంతో పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. విజయమ్మ, రితేష్ రెడ్డి వర్గం గైర్హాజరు బద్వేల్ నియోజకవర్గంలో డిజిటల్ మహానాడు నిర్వహణ బాధ్యతలను స్థానిక డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డికి అధిష్టానం అప్పగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమను కాదని వేరే నేతకు ప్రాధాన్యత ఇవ్వడంపై నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అసంతృప్తితో ’కినుక’ వహించారు. వీరిద్దరితో పాటు వారి అనుచర వర్గం, ప్రధాన క్యాడర్ మొత్తం మహానాడు కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉండిపోయింది. డ్వాక్రా మహిళల సమీకరణ విఫలం ఎలాగైనా మహానాడును విజయవంతం చేసి అధిష్టానం దృష్టిలో పడాలని డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. ఇందుకోసం డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించేందుకు స్కెచ్ వేశారు. ఆర్పీల ద్వారా మహిళల మొబైల్స్కు మెసేజ్లు పంపిస్తూ.. సభకు కచ్చితంగా హాజరు కావాలని ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ మహిళలు, స్థానిక జనం ఆశించిన స్థాయిలో సభకు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ● ముందే అరకొరగా హాజరైన కొద్దిపాటి జనాన్ని సభలో కూర్చోబెట్టాలనే ఆత్రుత నిర్వాహకుల్లో అధికంగా కనిపించింది. వచ్చిన జనం కూడా బోర్ కొట్టి జారిపోతుండటంతో డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి ఒక ’సరికొత్త’ మార్గాన్ని వెతికారు. ఒకవైపు డిజిటల్ స్క్రీన్పై టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అగ్రనేతలు మహానాడు వేదికపై గంభీర ప్రసంగాలు చేస్తుండగా, అదే వేదికపై భారీ స్క్రీన్ ముందే అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. ఈ వింత పరిణామంతో తొలిరోజు నెట్టుకొచ్చిన ఆయన రెండవ రోజు స్వంత మండలాన్ని నుంచి కాస్త జనాన్ని పోగుచేసుకోవడం విశేషం. సోషల్ మీడియాలో ట్రోల్స్ బద్వేల్ మహానాడు ఇప్పుడు రాజకీయ చర్చ కంటే.. ఈ రికార్డింగ్ డ్యాన్సుల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సభకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు. ‘అదిరిందయ్యా సూర్యం’ అంటూ మీమ్స్, ట్రోల్స్తో పసుపు తమ్ముళ్ల పరువును బజారున పడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పులివెందుల, కడప, మైదుకూరు, కమలాపురం, రాజంపేట, జమ్మలమడుగులల్లో సైతం కన్పించింది. మహానాడు విక్షీంచిన సీఐ చల్లనిదొర మహానాడులో రాజభక్తి ప్రదర్శించేందుకు అధికా రులు ఉత్సాహం చూపారు. రాజకీయ వేదికలో అధికారులు పాల్గొని ప్రసంగాలు వీక్షించారు. ఈ వింత పరిణామం జిల్లా వ్యాప్తంగా చాటుమాటుగా సాగించగా, కొంతమంది బాహాటంగానే ఉండిపోయారు. అలాంటి పరిస్థితి పెండ్లిమర్రి కేంద్రంగా తెరపైకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో పాటు సీఐ చల్లనిదొర డిజిటల్ మహానాడులో పాల్గొన్నారు. అగ్రనేతల ప్రసంగాలను వీక్షించారు. జిల్లాలో కొంతమంది అధికారులు తెరచాటుగా ఉండిపోగా, సీఐ బహిరంగంగా ప్రత్యక్షమవడం విశేషం. క్లస్టర్లు ఎక్కువ.. జనాలు తక్కువ డీసీసీబీ చైర్మన్ ‘సూర్యం’ సరికొత్త ఐడియా పసుపు పండుగ వేదికపై రికార్డింగ్ డ్యాన్సులు బద్వేల్లో రచ్చకెక్కిన తమ్ముళ్ల విభేదాలు డ్వాక్రా మహిళల కోసం ఆర్పీలతో మెసేజ్లు పంపినా ముఖం చాటేసిన జనం కార్యక్రమాన్ని మమ అన్పించిన తెలుగుతమ్ముళ్లు -
లోతుగా దుక్కు.. లాభాలు దక్కు!
● జిల్లాలో ప్రారంభమైన ముందస్తు వర్షాలు ● ముమ్మరమైన వ్యవసాయ పనులు ● ఖరీఫ్లో 79,773 హెక్టార్ల పంటల సాగు లక్ష్యం ● కలుపు, చీడపీడల నివారణకు తొలి వర్షాలే సరైన సమయంకడప అగ్రికల్చర్ : ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల దిగుబడిని దెబ్బతీసే ప్రధాన సమస్య ‘కలుపు’ మరియు ‘చీడపీడలు’. ఈ యాజమాన్య ప్రక్రియను తొలి వర్షాలు కురిసినప్పటి నుంచే ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం 79,773 హెక్టార్లలో పంటల సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించగా, జూన్ 1 నుంచి సీజన్ అధికారికంగా ప్రారంభం కానుంది. వాలుకు అడ్డంగా దున్నాలి! ప్రస్తుతం కురుస్తున్న వానలను రైతులు సద్వినియోగం చేసుకుని తమ పరిధిలోని మాగాణి, మెట్ట, బీడు భూములను వెంటనే దున్నుకోవాలి. ముఖ్యంగా దుక్కులను లోతుగా దున్నడంతో పాటు వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా పొలాల్లోనే ఆగుతుంది. ఇది నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకేందుకు అనుకూల పరిస్థితిని కల్పిస్తుంది. ఫలితంగా భూమి ఎక్కువ తేమను గ్రహించి, ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. చెత్తాచెదారం కాల్చవద్దు.. ఎరువుగా మార్చండి చాలా మంది రైతులు పంటల నూర్పిడి పూర్తయిన తర్వాత, భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల పొలంలో మొండి కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి నేలను నిస్సారంగా మారుస్తాయి. అంతేకాకుండా పంట చేతికి రాగానే పొలంలో మిగిలిపోయే ఎండు ఆకులు, కోయకాడలను తగలబెడుతుంటారు. అలా కాల్చకుండా వదిలేసిన చెత్తను, ఇప్పుడు కురుస్తున్న వర్షం పదునులో లోతు దుక్కులు చేయడం ద్వారా సులభంగా మట్టిలో కలిసిపోయేలా చేయవచ్చు. ఇవి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోయి, భూమికి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా మారి భూసారాన్ని పెంచుతాయి. పక్షుల వేట.. చీడపీడల కోట బద్దలు! వేసవిలో పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు పంటలను ఆశించే పురుగుల కోశస్థ దశలు, గుడ్లు, లార్వాలు మరియు తెగుళ్లు కలుగజేసే శిలీంధ్రాలు నేల అడుగున నిద్రావస్థలో దాగుంటాయి. ఇప్పుడు లోతు దుక్కులు చేయడం వల్ల నేల పొరలు తలకిందులై, ఇవన్నీ పైకి వస్తాయి. పొలం దున్నుతున్న సమయంలో నాగలి వెంట వచ్చే కొంగలు, కాకులు ఈ పురుగులను ఏరి తిని నాశనం చేస్తాయి. మిగిలినవి ఎండ తీవ్రతకు చనిపోతాయి. వర్షం పడగానే మొలకెత్తే కలుపు విత్తనాలు కూడా పంటల సాగుకు ముందే రెండు సార్లు దుక్కులు చేయడం వల్ల నశిస్తాయి. రసాయనాలతో దెబ్బతింటున్న నేలరైతులు శ్రమ తగ్గించుకోవడానికి విచ్చలవిడిగా రసాయన కలుపు మందులను పిచికారీ చేయడం వల్ల భూమిలోని సహజ సిద్ధమైన సారవంతం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, రైతులు ముందస్తు సేద్యం, లోతు దుక్కులు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని అధికారులు కోరుతున్నారు. కాగా, ఈ ఖరీఫ్లో జిల్లాలో ప్రధానంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్ఫ్లవర్, సోయాబీన్ తదితర ఆరుతడి పంటలు సాగు కానున్నాయి.రైతులు లోతు దక్కులు చేపట్టాలి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దుక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది. – మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి, వైఎస్సార్జిల్లా -
జూన్ 17 నుంచి కడపలో ఏపీఎల్ పోరు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ వచ్చేనెల 9వ తేదీ నుంచి జరగనుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోనే మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నం తో పాటు కడప మంగళగిరి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కడప వేదికగా తొమ్మిది మ్యాచ్లు .... జూన్ 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు మొత్తం ఇక్కడ 9 మ్యాచ్లు నిర్వహిస్తారు. వైయస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్లకు వేదిక కానుంది. స్టేడియంలో సుమారు మూడు సంవత్సరాల క్రితం దాదాపు 8 కోట్లతో ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఒక మ్యాచ్ కూడా నిర్వహించలేదు. త్వరలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను నిర్వహించేలా జిల్లా క్రికెట్ సంఘం చేసిన కృషి ఫలించింది. స్టేడియంలో ఉన్న మ్యాచ్ల షెడ్యూల్ ఇలా... ● జూన్ 17– విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్. ● 18న మధ్యాహ్నం కాకినాడ కింగ్స్వర్సెస్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సాయంత్రం: క్యాపిటల్ అమరావతి రాయల్స్వర్సెస్ సింహాద్రి వైజాగ్ లయన్స్. ● 19న మధ్యాహ్నం భీమవరం బుల్స్ వర్సెస్ విజయవాడ షైనర్స్, సాయంత్రం సింహాద్రి వైజాగ్ లయన్స్ వర్సెస్ రాయల్ ఆఫ్ రాయలసీమ. ● 20న మధ్యాహ్నం తుంగభద్ర వారియర్స్ వర్సెస్ భీమవరం బుల్స్, సాయంత్రం క్యాపిటల్ అమరావతి రాయల్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్. ● 21న మధ్యాహ్నం రాయల్స్ ఆఫ్ రాయలసీమ వర్సెస్ తుంగభద్ర వారియర్స్, సాయంత్రం కాకినాడ కింగ్స్ వర్సెస్ విజయవాడ సన్షైనర్స్. మూడు వేదికల్లో ఐదో సీజన్ నిర్వహణ మంగళగిరిలో ఫైనల్స్ -
పశువుల అక్రమ తరలింపు రెండు వాహనాలు సీజ్
పీలేరురూరల్ : పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్ చేసి పది పశువులను గోశాలకు తరలించినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో పీలేరు మండలం తలపుల నుంచి పది పశువులతో రెండు వాహనాలు పుంగనూరుకు వెళుతుండగా స్థానిక క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు ఆపి పరిశీలించారు. అయితే వాహనదారులు పశువుల తరలింపుకు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడం, తగిన పత్రాలు చూపించకపోకపోవడంతో వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పశువులను చిన్నగొట్టిగల్లు గోశాలకు తరలించారు. పుంగనూరుకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.అనారోగ్యంతో ఆత్మహత్యపుంగనూరు : మండలంలోని బండ్లపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు(43) శ్రీనివాసులు కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీనివాసులను కాపాడేందుకు ప్రయత్నించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. రైలు కింద పడి వ్యక్తి మృతిములకలచెరువు : రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఇందిరా కాలనీకి చెందిన అబ్దుల్(30) బుధవారం రాత్రి నాగర్కోయల్ రైలు కింద పడి మృతిచెందాడు. గమనించిన రైల్వే సిబ్బంది కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ములకలచెరువువాసిగా నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. -
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : కర్ణాటక రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నిమ్మనపల్లి మండల యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. నిమ్మనపల్లి మండలం, వెంగంవారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి కుమారుడు వెర్రి హరీష్ (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శని, ఆదివారం గంగ జాతర ఉందని తల్లిదండ్రులు హరీష్ను ఇంటికి రమ్మని కోరారు. దీంతో హరీష్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మార్గమధ్యంలోని హెచ్ క్రాస్– కై వారం మధ్యలో టీవీఎస్ ఎక్సెల్లో వస్తున్న వృద్ధుడు హఠాత్తుగా రోడ్డుకు అడ్డు రావడంతో, బుల్లెట్ ఢీకొని హరీష్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న చింతామణి రూరల్ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం చింతామణి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.నిమ్మనపల్లి యువకుడు మృతి -
470లో 420 పనులు!
● టి.రామాపురం దగ్గరప్రభుత్వ భూమి ఆక్రమణ ● తెలుగుగంగ ముంపువాసులకుకేటాయించిన 32 ఎకరాలు కబ్జా ● పట్టించుకోని అధికారులు బ్రహ్మంగారిమఠం: మండలంలోని రేకలకుంట పంచాయతీ టి.రామాపురం పరిధిలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములతో పాటు గ్రామాలకు జీవనాధారమైన చెరువులు భూబకాసురుల పాలవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● బద్వేల్–మైదుకూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 470లోని 32 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో చిక్కింది. గత 1987లో అప్పటి ప్రభుత్వం తెలుగుగంగ ప్రాజెక్టు ముంపు బాధితుల ఇళ్ల స్థలాల (ఆర్ అండ్ ఆర్ సెంటర్) కోసం ఈ భూమిని కేటాయించింది. అప్పట్లో కొందరు లబ్ధిదారులకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే, ముంపు బాధితులు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడటంతో ఈ స్థలాలను వారు ఉపయోగించుకోలేదు.దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్థానికులు కడప, బద్వేల్, మైదుకూరు పట్టణాలకు చెందిన ప్రైవేట్ వ్యక్తులను ఇక్కడికి తీసుకువచ్చి ఆక్రమణలను ప్రోత్సహించారు. దీనిపై గ్రామస్తులు తిరగబడి ఆర్ అండ్ ఆర్ సెంటర్ను రద్దు చేయించినప్పటికీ ఆక్రమణల పర్వం ఆగలేదు. కోటి నిధులు వృథా! ‘వాంపల్లె చెరువు’ సైతం ఆక్రమణదారుల చేతుల్లో చిక్కింది.72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు, ప్ర స్తుతం డి.అగ్రహారం, టి.రామాపురం, వాంపల్లె గ్రామాలకు చెందిన కొందరి కబ్జాల కారణంగా 10 ఎకరాలకే పరిమితమైంది. గత ప్రభుత్వ హయాంలో ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం రూ. కోటి నిధులు ఖర్చు చేశారు. అయితే, ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. వర్షాలు పడినప్పుడు చె రువులోకి నీరు చేరితే.. తాము ఆక్రమించుకున్న పొ లాలు మునిగిపోతాయనే స్వార్థంతో, అక్రమార్కులు చెరువు తూములను పైకి ఎత్తారు. దీనివల్ల వర్షపు నీరు వృథాగాపోతున్నా మైనర్ ఇరిగేషన్ అధికారులు పట్టి ంచుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్జాతీయ పోటీలకు రామాపురం క్రీడాకారిణి
రామాపురం : మండలంలోని గోపగుడిపల్లి గ్రామం గొల్లపల్లికి చెందిన యనపడ్డ గోవిందు కుమార్తె యనపడ్డ సంజన అంతర్జాతీయ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు ఎంపిక కావడం మండలానికి గర్వకారణమైంది. అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణి , కోచ్ ప్రసన్న జయశంకర్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం అనంతరం ఏపీ స్టేట్ జూనియర్ బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో సంజన అద్భుత ప్రతిభ ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. పుదుచ్చేరిలో మే 22 నుంచి 28 వరకు నిర్వహించిన నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో సంజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపింది. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బాలిక అదృశ్యం
కడప అర్బన్ : వేంపల్లి టౌన్, గాజులపేట కాలనీకి చెందిన పాలా నాగార్జున, రమాదేవిల కుమార్తె పాలా వైష్ణవి (16) చెన్నూరు మండలం, రుద్రభారతిపేటలోని తన బంధువుల ఇంటికి 20 రోజుల క్రితం వచ్చింది.ఈనెల 25 వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల నుండి తన కుమార్తె కనిపించకుండా పోయిందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.వేధింపుల కేసు నమోదుముద్దనూరు : అదనపు కట్నం కోసం భార్యను వేధించిన రామ్మోహన్ అనే వ్యక్తితో పాటు మరొకరిపై గురువారం కేసు నమోదు చేశామని ఎస్ఐ మధుసూధన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ముద్దనూరుకు చెందిన స్వప్నకు గతేడాది ఫిబ్రవరిలో చెన్నారెడ్డిపల్లెకు చెందిన రామ్మోహన్తో వివాహమైంది. కొంత కాలంగా అదనపు కట్నం కోసం రామ్మోహన్ తన భార్యను వేధించేవాడు. వీటిని భరించలేక గురువారం స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మోహన్తో పాటు మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీని ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలు కేవీపల్లె, మే 28 : మండలంలోని గ్యారంపల్లె సమీపంలో గురువారం తెల్లవారిజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన లావణ్య, సుజన, డ్రైవర్ సంపత్తో కలిసి కారులో అరుణాచలం పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో గ్యారంపల్లె వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు జూదరులు అరెస్టు తొండూరు : మండలంలోని ఇనగలూరు సమీపంలోని ముళ్లపొదల్లో జూదమాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఘనమద్దిలేటి తెలిపారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. -
పంటల బీమా అన్నదాతల హక్కు
పులివెందుల/వేముల : ప్రకృతి ప్రకోపానికి గురై, అకాల గాలివానల వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే మానవత్వంతో స్పందించి ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. వేముల మండలంలోని మీదిపెంట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిలతో కలిసి గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నేలకొరిగిన తోటలను చూసి చలించిపోయిన ఎంపీ, బాధితులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. బలవంతంగా ప్రీమియం కటింగ్.. తీరా చూస్తే సాంకేతిక సాకులు! ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా అనేది రైతుల హక్కు అని, బీమా సంస్థ బాధ్యత తీసుకుని నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులకు ఇష్టం లేకపోయినా.. 2025లో పంట రుణాలు పొందిన ప్రతి రైతు వద్ద ఎకరాకు రూ. 3,000ల చొప్పున, హెక్టారుకు రూ. 7,560ల చొప్పున బ్యాంకులు బలవంతంగా ప్రీమియం సొమ్మును కట్ చేసి రుణాలు రెన్యువల్ చేశారన్నారు. వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు ఈ విధంగా ప్రీమియం చెల్లించారని, దీని కవరేజీ 2025 జూలై నుంచి 2026 మే వరకు వర్తిస్తుందని గుర్తుచేశారు. కళ్లముందే ఇన్సూరెన్స్ గడువు ఉన్నప్పటికీ, సాంకేతిక సాకులు చూపడం అత్యంత దారుణమన్నారు. వెదర్ స్టేషన్లు పనిచేయనప్పుడు నోటిఫికేషన్ ఎందుకిచ్చారు? వాతావరణ బీమా అంటేనే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా వర్షపాతం, గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకుని బీమా అందించాల్సి ఉంటుందని ఎంపీ వివరించారు. కానీ జిల్లాలో వెదర్ స్టేషన్లు చాలా చోట్ల సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ‘మరి పంటల బీమాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి రైతుల వద్ద ప్రీమియం వసూలు చేశారు?‘ అని అధికారులను నిలదీశారు. ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహించొద్దని, మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత వహించి తప్పనిసరిగా ప్రతి రైతుకూ బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. లింగాల మండల అనుభవాన్ని గుర్తుచేసిన ఎంపీ గత మార్చి (2025)లో కూడా దాదాపు 1,200 ఎకరాలలో లింగాల మండలంలో గాలివానతో అరటి పంట దెబ్బతిని భారీ నష్టం సంభవించిందని ఎంపీ గుర్తుచేశారు. ఆ సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా తోటల వద్దకు వెళ్లి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారన్నారు. ఆ రోజు కూడా కేవలం రెండు వెదర్ స్టేషన్లలో మాత్రమే గాలి వేగం నమోదైందని, మిగతా చోట్ల ఎక్కడ నష్టం వాటిల్లిందో అక్కడ వెదర్ స్టేషన్లు పనిచేయలేదని గుర్తుచేస్తూ వ్యవస్థల లోపాలను ఎండగట్టారు. మార్కెట్లో ధరలున్నా.. ప్రకృతి దెబ్బతో చేతికొచ్చిన పంట నేలపాలు! ప్రస్తుత మార్కెట్ ధరల వ్యత్యాసాన్ని వివరిస్తూ.. ‘గత ఏడాది ఇదే మార్చి మాసంలో కేజీ అరటి కాయలు రూ. 2 నుంచి రూ. 3 మించి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం మార్కెట్ ధరలు సంతృప్తికరంగా ఉన్నాయి. బెంగుళూరు మార్కెట్కు పోతే అక్కడ ఏ సూపర్ మార్కెట్లో చూసినా కేజీ రూ. 30ల నుంచి రూ. 40లకు కొనాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో ధరలు బాగున్నా, ప్రకృతి ప్రకోపానికి చేతికి అందివచ్చిన పంట నేలపాలై రైతులు నష్టపోయారు‘ అని ఆవేదన వ్యక్తం చేశారు. అటి రైతుల పట్ల ప్రభుత్వం ఇప్పటికై నా మానవత్వంతో ముందుకొచ్చి ఇన్పుట్ సబ్సిడీని పెంచడంతో పాటు, పంటల బీమా త్వరితగతిన అందేలా చూసి అన్నదాతలను ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెదర్ స్టేషన్లు పనిచేయకపోయినా రూ. వేలల్లో ప్రీమియం వసూలు చేయడం అన్యాయం రైతుల వద్ద బలవంతంగా ఎకరాకు రూ. 3 వేలు, హెక్టారుకు రూ. 7,560ల చొప్పున కట్ చేశారు బీమా సంస్థే పూర్తి బాధ్యత వహించాలి మీదిపెంట్లలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
● మహా‘ఖర్చు’ గురూ!
ఖర్చులు తగ్గించాలని టీడీపీ వర్చువల్ మహానాడు నిర్వహించింది. ఇప్పుడా ఖర్చు అత్యధికంగా కేడర్పై పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక ప్రాంతాలల్లో ఆయా కేడరే ఖర్చులను భరించాల్సి వచ్చింది. తొలిరోజు మహానాడు విఫలం కావడంతో రెండోరోజు జనాన్ని సమీకరించుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక కేడర్పై పడింది. స్థానికంగా జనసమీకరణకు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలు కేడర్పైనే భారం వేయడంతో ఖర్చులు మరింతగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 78క్లస్టర్లల్లో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్క్రీన్స్ ఏర్పాటు, ఫ్లెక్సీల హంగామా, ఫంక్షన్ హాల్ బాడుగు, జనసమీకరణ, భోజనం ఇలా సరాసరిగా ఒక్కొక్క క్లస్టర్లో రూ.2లక్షలు ఖర్చు లభించింది. దాదాపు రూ.1.5కోట్లు కేడర్ భరించాల్సి వచ్చింది. డిజిటల్ వేదిక పేరుకే ఖర్చులు తగ్గించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పుకున్నారని పలువురు వాపోతున్నారు. -
ఎన్టీఆర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్
కడప సెవెన్రోడ్స్: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం వంటి నిర్ణయాలు సామాజిక మార్పునకు దోహదపడ్డాయని తెలిపారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఎన్టీఆర్ జీవితం క్రమశిక్షణ, పట్టుదల, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిందని, నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.అనంతరం డీఆర్వో మల్లికార్జునుడు, స్టెప్ సీఈఓ జోయల్ విజయ్ కుమార్ ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మృతదేహంతో పోలీస్స్టేషన్ వద్ద ధర్నా
పుంగనూరు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు కలసి పోలీస్స్టేషన్ వద్ద ధర్నా , రాస్తారోకో నిర్వహించిన సంఘటన సోమల పోలీస్స్టేషన్ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపల్లెకి చెందిన రామ్చరణ్(21) అనే యువకుడు ఈనెల 19న రాత్రి నంజంపేట నుంచి రాంపల్లెలోని తన ఇంటికి వెళ్తుండగా అతివేగంగా ఎదురుగా వస్తున్న టాటాఏసి వాహనం రామ్చరణ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామ్చరణ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గ్రామస్తులు , కుటుంబ సభ్యులు కలసి ఆ యువకుడికి వైద్యచికిత్సలు అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ మృతదేహాన్ని అంబులెన్స్లో తిరుపతి నుంచి సోమలకు తరలించారు. మార్గ మధ్యంలోని సోమల పోలీస్స్టేషన్ వద్ద అంబులెన్స్లో మృతదేహాన్ని పెట్టి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి హుటాహుటిన సోమలకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. -
వైఎస్సార్ కడపలో హాల్టింగ్స్
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ సరికొత్త తీపి కబురు అందించింది. కడప మీదుగా బీహార్కు నేరుగా ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న తిరుపతి–రక్సల్ ఎక్స్ప్రెస్ను క్రమబద్ధీకరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిని 17433/17434 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రకటించారు. జూన్ 1న తిరుపతిలో ఈ రైలు అధికారికంగా ప్రారంభం కానుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 4న రక్సల్లో ఈ రైలు (17434) బయలుదేరుతుంది. అంతర్జాతీయ సరిహద్దు.. నేపాల్కు మార్గం సుగమం ఈ రైలు చివరి స్టాపేజ్ అయిన రక్సల్ జంక్షన్ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో, ఇండో–నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న ఒక కీలకమైన రైల్వే కేంద్రం. ఇది భారతదేశానికి, పొరుగున ఉన్న నేపాల్లోని ప్రముఖ పారిశ్రామిక నగరమైన ’బిరగంజ్’కు మధ్య వాణిజ్యం, ప్రయాణానికి ప్రధాన రవాణా కేంద్రంగా కొనసాగుతోంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల నేపాల్ వెళ్లే పర్యాటకులకు, భక్తులకు మార్గం ఎంతో సుగమం కానుంది. జ్యోతిర్లింగ దర్శనం.. ఉత్తర భారత పట్టణాలకు అనుసంధానం: ఈ రైలు ప్రయాణం ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన ’బాబా బైద్యనాథ్ ధామ్’ (దేవ్ఘర్) సందర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు సువర్ణావకాశం లభిస్తుంది. ఈ రైలు మార్గంలో జార్ఖండ్ రాజధాని రాంచీ, ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్తో పాటు దుర్గ్, గోండియా, బిలాస్పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, బొకారో స్టీల్ సిటీ, ధన్బాద్, ఝాఝా, జాసిదిహ్, చిత్తరంజన్, బరౌని, దర్భంగా, సమస్తీపూర్, సీతామర్హి వంటి ఉత్తరభారత దేశంలోని ప్రధాన పారిశ్రామిక, పట్టణాలకు నేరుగా ప్రయాణసౌకర్యం లభించనుంది. తెలంగాణాలో హాల్టింగ్స్ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణాతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానమయ్యేలా ఈ రైలు నడవనున్నది. కృష్ణా జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, మంచిర్యాల, సిర్పూర్ కాగజనగర్ స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. వలస కార్మికులు, ఉద్యోగులకు వరం ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో బీహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు స్థిరపడ్డారు. అలాగే గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని విభాగాలలో బీహార్తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లాలంటే ఇప్పటివరకు గూడూరు జంక్షన్కు లేదా విజయవాడకు వెళ్లి, అక్కడ వేరే రైళ్లు మారాల్సి వచ్చేది. తాజా తిరుపతి–రక్సల్ ఎక్స్ప్రెస్తో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్ పడినట్లయింది. 17433/34 రక్సల్–తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మొత్తం 24 బోగీలు ఉంటాయి. ఇందులో సెకండ్ ఏసీ – 3 కోచ్లు, థర్డ్ ఏసీ – 5 కోచ్లు, స్లీపర్ కోచ్లు – 10, జనరల్ కోచ్లు – 4, ఎస్ఎల్ఆర్ – 2 కోచ్లు 1 నుంచి ‘తిరుపతి–రక్సల్’వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం కడప, ఎర్రగుంట్ల మీదుగా బీహార్కు నేరుగా రైలు సరికొత్త రైలును ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ఒకే రైలు.. ఎన్నో ప్రయోజనాలు కడప మీదుగా జ్యోతిర్లింగ దర్శనం నేపాల్కు మార్గం సుగమం ఉత్తర భారత కార్మికులు,ఉద్యోగుల కష్టాలకు చెక్ వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో ప్రస్తుతానికి కడప, ఎర్రగుంట్ల స్టేషన్లలో మాత్రమే తిరుపతి–రక్సల్ రైలు ఆగనున్నది. అయితే రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట, మరియు ఎంతోమంది రైల్వే ఉద్యోగులు, కార్మికులకు నిలయమైన ప్రముఖ రైల్వేకేంద్రం నందలూరు స్టేషన్లలో కూడా ఈ రైలుకు హాల్టింగ్ ఇస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రయాణికులు కోరుతున్నారు. ఆ దిశగా రైల్వేశాఖ యోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
త్యాగం చేసే అవకాశం భక్తునికి వరం
కడప సెవెన్రోడ్స్ : ప్రపంచ ముస్లిం లోకం అత్యంత పవిత్రంగా భావించే ఈద్ ఉల్ జుహా పండుగ (బక్రీద్) ను గురువారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు 12 గంటల వరకు కొనసాగాయి. పలువురు భక్తులు తమ సమీపంలోని మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొనగా, అధికశాతం మంది ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిల్టప్ ఈద్గాలో కడపలోని బిల్టప్ వద్దగల ఈద్గాలో నగర వాసులతోపాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా మత గురువు ముఫ్తీ మహమ్మద్ న్యామతుల్లా పండుగ సందేశమిస్తూ దేవుడు మానవుని త్యాగగుణాన్ని పరిశీలించడమే పండుగ పరమార్థం అన్నారు. దైవం భక్తులకు కఠినమైన పరీక్షలు పెడతారని, అందులో నెగ్గిన వారికి మంచి జీవితం ప్రసాదిస్తారని తెలిపారు. భక్తులు అల్లాహ్ మార్గాన్ని అనుసరించి ఆయన ఇచ్చిన ఈ ప్రాణాన్ని ఆయన మార్గంలో సమర్పించేందుకు ఏమాత్రం వెనుకాడకూడదని, అలాగే మనిషిలోని చెడు గుణాలను కూడా వదిలి వేయాలని చెప్పారు. త్యాగానికి ప్రతీకగా ప్రవక్త హజరత్ ఇబ్రహీం అల్లాహ్ ఆదేశాన్ని పాటించిన సంఘటన గురించి వివరించారు. అలాగే మనుషుల్లో త్యాగ గుణం పెరగాలని, దైవం పేరిట త్యాగం చేయడంతోపాటు సాటి మనుషులతో పరస్పరం సహకరించుకుంటూ ఉన్నప్పుడే ప్రశాంత జీవనం, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్ భక్తులచే సామూహిక ప్రార్థనలు చేయించారు. భక్తులు ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్ ముబారక్ హో’అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దదర్గా ప్రతినిధులు, నగర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.ప్రార్థనలకు వచ్చిన ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.భక్తిశ్రద్ధలతో బక్రీద్ సామూహిక ప్రార్థనలు -
బరితెగించిన టీడీపీ నేతలు.. గుడి, బడి, ప్రభుత్వాఫీసుల్లో మహానాడు
బుచ్చెయ్యపేట/పెద్దపంజాణి/శ్రీరంగరాజపురం/కంచరపాలెం(విశాఖ)/సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే బరితెగింపుతో పవిత్రమైన ఆలయాలు.. ప్రభుత్వ భవనా లని చూడకుండా ఎక్కడపడితే అక్కడ మహానాడు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఏకాదశి రోజున భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టేశారు. భక్తులు మండపం నుంచి గుడిలోకి వెళ్లకుండా అడ్డంగా కుర్చీలు వేసి, ఏకంగా ఆలయం తలుపులు మూసివేశారు. స్వామి విగ్రహానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉంచి, భారీ స్క్రీన్ ఏర్పాటుచేసి సమావేశాన్ని నిర్వహించారు. కొందరు టీడీపీ నేతలు మద్యం సేవించి హాజరైనట్లు సమాచారం. అలాగే, ఇదే జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ యోగా భవనంలోనూ మహానాడు నిర్వహించారు. ఇక ప్రైవేట్ హాల్స్లో అయితే డబ్బులు కట్టాలన్న కక్కుర్తితో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ ఎంపీడీఓ కార్యాలయంలో కానిచ్చేశారు. ఎంపీడీఓ బాలాజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయకట్టు ఆరుమాకులపల్లి గ్రామంలోని శ్రీ ఆరుమానిగంగమ్మ ఆలయ ప్రాంగణంలోనూ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నిండా జెండాలు, భారీ బ్యానర్లు, కటౌట్లు, ఏర్పాటుచేశారు. ఇది దేవాలయమా? లేక టీడీపీ కార్యాలయమా?’’ అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇదే జిల్లా గుడిపాలలో టీటీడీ కల్యాణమండపంలో, తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు ప్రభుత్వ పాఠశాలలోనూ నిర్వహించారు.సచివాలయంలో మహానాడు.. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతల అరెస్టువిశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు కస్తూరినగర్లోని సచివాలయంలో కూడా మహానాడు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కటుమూరి సతీష్, కో–ఆప్షన్ సభ్యుడు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి కంచరపాలెం పోలీస్స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.బద్వేలు మహానాడులో రికార్డు డ్యాన్స్ బద్వేలులో రికార్డింగ్ డ్యాన్సులు..మరోవైపు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు బోర్కొట్టి జారిపోతుండటంతో డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటుచేశారు. ఇది చూసి పార్టీ సీనియర్ నాయకులు ముక్కున వేలేసుకున్నారు. పొదుపు పేరుతో మరింత దుబారామహానాడుకు తడిసిమోపెడు ఖర్చు చేయించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడుకు చంద్రబాబు అనుసరించిన తీరు మాటల్లో పొదుపు.. చేతల్లో తీవ్ర దుబారా కనిపించింది. ఇంత ఖర్చుచేసినా ఈ కార్యక్రమం పూర్తిగా అట్టర్ఫ్లాప్ అయినట్లు పార్టీ నేతలు వాపోతున్నారు. వర్చువల్ సమావేశమే అయినా దీనికి సాధారణంగా అయ్యే ఖర్చుకంటే నాలుగు రెట్లు ఎక్కువ అవడంతో పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కార్యకర్తలు అక్కడకు రావడానికి ఉత్సాహం చూపించలేదు. ఈ మహానాడులో పొదుపు కంటే దుబారా ఎక్కువైంది. ఖర్చు తగ్గించడానికే ఆన్లైన్లో పెట్టామని చెబుతున్న చంద్రబాబు మాటలకు.. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్లు, ఇతర హంగులకు ఎక్కడా పొంతన కనిపించలేదు. వాస్తవానికి.. ఒకే వేదికపై మహానాడు నిర్వహిస్తే ఒక భారీ వేదిక, జర్మన్ హ్యాంగర్ టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, భారీ భోజనాలు ఉండేవి. అక్కడ ఖర్చంతా ఇద్దరు, ముగ్గురు బడా నేతలపైనే పడేది. ప్రస్తుత వర్చువల్ మహానాడులో మంగళగిరి పార్టీ కార్యాలయంలో వేసిన ఒక స్టూడియో ఖర్చు మాత్రమే అధిష్టానానిది. మిగిలిన అసలు ఖర్చంతా జిల్లాల్లోని 1,875 క్లస్టర్లలోని నేతల మీదకు నెట్టేశారు. అసలు కంటే కొసరు ఖర్చు ఎక్కువైంది.. క్లస్టర్లు అంటే నియోజకవర్గానికి కనీసం 7–10 వరకూ ఉంటాయి. ఉదా.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 8 క్లస్టర్లలోనూ విడివిడిగా టెంట్లు, కురీ్చలు, సౌండ్ బాక్సులు, ప్రతీచోటా ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్, దానికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్థానికంగా తరలివచ్చే జనం కోసం విడివిడిగా భోజనాలన్నీ కలిపి తడిసిమోపెడైంది. ఒక్కో క్లస్టర్లో కనీసం రూ.10 లక్షల ఖర్చు.. మామూలుగా అయితే మహానాడు ఖర్చు మొత్తాన్ని పార్టీ నిధుల నుండి లేకపోతే పార్టీలోని బడా నేతలు భరించేవారు. కానీ, చంద్రబాబు డిజిటల్ డ్రామావల్ల యాప్ లింక్, ఆఫీస్ లైటింగ్, వేదిక ఖర్చు తప్ప ఆయనకు పెద్దగా ఖర్చు కాలేదు. 1,875 క్లస్టర్లలో మాత్రం విపరీతంగా ఖర్చయింది. సాధారణ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుండి జనాలను బస్సులు, వాహనాలు, రైళ్లలో తరలించడంవల్ల రవాణా ఖర్చు పెరిగేదని.. దీన్ని తగ్గించేశామని చంద్రబాబు సెలవిచ్చారు. అయితే, ఈ క్లస్టర్ కేంద్రాలకు జనాలను తరలించడానికి స్థానిక నేతలు వందలాది ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేట్ వాహనాలు వినియోగించారు. కనీసంగా ఒక్కో క్లస్టర్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే, నేతలపైనే పడింది. వారు తమ నియోజకవర్గంలోని పలు కార్యాలయాలు, వ్యాపారులపై పడి వసూలుచేసినట్లు తెలుస్తోంది. రవాణా, టెంట్లు, జనాల తరలింపు మామూలే.. ఇక రవాణా, టెంట్లు, జనాల తరలింపు వంటివన్నీ తగ్గించి ఖర్చును నివారించడం వర్చువల్ సమావేశాల ఉద్దేశం. కార్యకర్తలు, నేతలు ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని మొబైల్స్లోనో, లాప్టాప్లలోనో చూసుకోవాలి. అలా కాకుండా మళ్లీ గ్రామాల్లో, మండలాల్లో టెంట్లు వేసి, మైకులు పెట్టి, వందల మందిని సమీకరించి, పెద్ద స్క్రీన్ల ముందు కూర్చోబెట్టడాన్ని ఏమనాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటే తప్ప పొదుపు ఏమాత్రం కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. బాబు సెల్ఫ్ డబ్బా కోసమే డిజిటల్ డ్రామా.. చంద్రబాబు తాను ఐటీ విజినరీనని చెప్పుకోవడానికి వర్చువల్ అనే పదం వాడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేదంతా పాత విధానమే. జనాన్ని తరలించడం, అదే టెంట్లు, అదే బిర్యానీ ప్యాకెట్లు అదే హడావుడి. కార్యకర్తలను తీసుకెళ్లి థియేటర్లో సినిమా చూపించినట్లు ఎల్ఈడీ స్క్రీన్ల ముందు కూర్చోబెట్టారు. అయినా వారు వెళ్లిపోవడంతో ఆపడానికి నానాపాట్లు పడ్డారు. చివరికి బద్వేలు నియోజకవర్గంలో అయితే ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి పరువు తీసుకున్నారు. -
అరటి పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిస్తాం
వేముల: ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న అరటి పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మీదిపెంట్ల గ్రామంలో గాలివానతో నేలవాలిన అరటి తోటలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి బీభత్సానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గ్రామ స్థాయి యూనిట్గా ఇన్సూరెన్స్ వర్తించేలా వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గాలివానతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే మండలంలోని గొందిపల్లె గ్రామంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి ఎన్యుమరేషన్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏయే పంటలు సాగు చేశారనే విషయాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మల్లికార్జునుడు, ఆర్డీఓ చిన్నయ్య, డీహెచ్ఓ సతీష్కుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ఏడు కొండలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
తృటిలో తప్పిన ప్రమాదం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెనుక వైపు ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం కారు ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన కొంత మంది పుల్లంపేట సమీపంలోని ఓ గ్రామంలో నిశ్చయతాంబూల కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఒంటిమిట్ట రామాలయంలో స్వామి వారిని దర్శించుకుని తిరిగి ఆళ్లగడ్డ కు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో రామాలయం వెనుక వైపు కడప–చైన్నె జాతీయ రహదారిని దాటుతుండగా కడప వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ఒక మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసుల అదుపులో అదృశ్యం అయిన వ్యక్తి కడప అర్బన్ : తెలంగాణ రాష్ట్రం మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ పీ.ఎస్ పరిధిలో 24 గంటల క్రితం అదృశ్యమైన నంగునూరు వెంకటేశం (52) అనే వ్యక్తిని కడప ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్యకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో సీఐ చిన్నపెద్దయ్య, చిన్నచౌకు సీఐ రామకృష్ణారెడ్డికి సమాచారమిచ్చారు. మిస్సింగ్ వ్యక్తిని సురక్షితం చేసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తెలంగాణా రాష్ట్రం కాప్రా మండలం అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన నంగునూరు వెంకటేశం (52) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు. విధుల నిమిత్తం ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఫోన్ స్విచాఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు జవహర్ నగర్ పీ.ఎస్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు మిస్సింగ్ వ్యక్తి కడప ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు కడప పోలీసులకు సమాచారమివ్వడంతో ఆయనను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. రైలు కిందపడి వ్యక్తి మృతి కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప – కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి అన్న మయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన షేక్ హుసేన్ బాష మృతి చెందాడని రైల్వేపోలీసులు తెలిపారు. షేక్ హుస్సే న్ ఆత్మహత్యకు పాల్పడగా, తల మొండెం వేరువేరైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దళిత మహిళపై దాడి మదనపల్లె టౌన్ : దళిత మహిళపై దాడి చేసిన ఘటన బుధవారం కురబలకోట మండలం ముదివేడులో వెలుగు చూసింది. ముదివేడుకు చెందిన బి. రాజమ్మ (50) తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకూడదని అదే వీధిలో నివసించే ఆఫ్సల్, హసీనా, షాహిన తదితరులు ఆమెను అడ్డుకున్నారు. పూర్వీకుల నుంచి వాడుకలో ఉన్న దారిలో పోకుండా మరే దారిలో వెళ్లాలని రాజమ్మ ప్రశ్నించడంతో ఆగ్రహించిన పలు వురు ఆమైపె మూకుమ్మడిగా దాడి చే శారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
డ్రైవర్లపై వల్లూరు ఎస్ఐ దాడి
● తీవ్ర గాయాలతో రిమ్స్ లో చికిత్స పొందుతున్న జేసీబీ డ్రైవర్ ● కూటమి పెద్దలలో ఒక వర్గం ద్వారా రాజీ యత్నాలుకడప అర్బన్ : జిల్లా లోని వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోటూరులో ఈనెల 26వ తేదీన మల్లికార్జున అనే రైతు తన పొలం సమీపంలో మట్టిని జేసీబీ సాయంతో తవ్వి ట్రాక్టర్ లో వేసుకొని నారవ గుంతలు పూడ్చుకుంటుండగా వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. తమ కానిస్టేబుల్ తో పాటు మోటార్ సైకిల్ లో వెళ్లి ట్రాక్టర్ ను వెంటబడి డ్రైవర్ వెంకటేష్పై దాడి చేశాడు. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ ను కసితీరా కొట్టడం, జేసీబీ డ్రైవర్ ఓబులేసు ను బుధవారం స్టేషన్కు పిలిపించి మరీ చితక బాదడం, ఎస్ఐ ఆగ్రహానికి పరాకాష్టగా మారింది. ఈ సంఘటనను కూటమి పెద్దలే ఓర్వలేకపోయారు. కూటమి పెద్దలలో ఒక వర్గం వారు ఎస్ఐ ఓవరాక్షన్ ను తప్పు పట్టారు. మరో వర్గం వారు ఎస్ఐ చర్యలను వ్యతిరేకించకపోయినా బాధితుల వల్ల పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని తమవంతుగా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు ఎస్ఐగా పనిచేస్తున్న శివనాగిరెడ్డి, తమ కానిస్టేబుల్ నాగరాజు తో కలిసి ఈనెల 26న తమ మండల పరిధిలో ఉన్న వండర్ లా లో టీడీపీ నేతలు మహానాడు సభను ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వాటిని పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో వండర్ లా కు కాస్త దూరంలో వంక వద్ద నుంచి జేసీబీ తో మట్టిని ట్రాక్టర్ లో వేయించుకొని రైతు మల్లికార్జున తమ పొలానికి తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో ఆ సంఘటనను చూసిన వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి, తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్ నాగరాజు తో పాటు సంఘటనా స్థలానికి వేగంగా చేరుకున్నారు. ఆ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డారు. ఎస్ఐ కి స్వల్ప గాయాలు కాగా, కానిస్టేబుల్ నాగరాజు గాయపడ్డాడు. కాస్తంత ఉపశమనం కూడా పొందకుండా ఎస్ఐ శివనాగిరెడ్డి కోపంతో ఊగిపోయారు. ట్రాక్టర్ ను పట్టుకునేందుకు వెళ్లగా భయంతో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ ముందుకెళ్లాడు. అతన్ని వెంబడించిన ఎస్ఐ పట్టుకొని అక్కడికక్కడే డ్రైవర్ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా వాహనాలను స్టేషన్కు తీసుకొచ్చారు. జేసీబీ డ్రైవర్ ఓబులేసు కడప నుంచి విధులకు వెళ్లాడు. అతన్ని బుధవారం స్టేషన్ కు పిలిపించి చితకబాదాడు. కాళ్లకు చేతులకు, నడుముకు వాతలు పడి ఓబులేసు గాయాల పాలయ్యాడు. తర్వాత అతన్ని వదిలిపెట్టడంతో వెంటనే రిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. మరోవైపు వెంకటేశు ను రిమ్స్ కు పంపకుండా కూటమి పెద్దలలో ఓ వర్గం అతన్ని రాజీ చేసుకున్నారని సమాచారం. రైతు మల్లికార్జున తన పొలానికి సమీపంలో ఉన్న వంక నారవ నుంచి మట్టిని తీసుకుని వెళ్లి తన పొలానికి మట్టి వేసుకోవడం ఎందుకు తప్పవుతుందని ఒక వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనలో వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి ఆగ్రహంతో ఓబులేసు పై దాడి చేయడం సమంజసంగా లేదని బాధితుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుకుంటున్నాడు. చట్ట పరిధిలో తమకు న్యాయం జరగకపోతే మరింత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
విద్యాకానుకకు కూటమి గ్రహణం!
ఎర్రగుంట్ల: జిల్లాలో వచ్చే జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడులు తెరుచుకోవడానికి కేవలం 16 రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ, విద్యార్థులకు అందించాల్సిన విద్యా కానుక కిట్లు ఇంతవరకు ఆయా మండల కేంద్రాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు కిట్లు సకాలంలో అందుతాయో లేదోననే ఆందోళన జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్రంగా వ్యక్తమవుతోంది. నాడు జగనన్న హయాంలో ముందే అందిన కిట్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. ’జగనన్న విద్యా కానుక’ పథకం కింద ఐదేళ్లపాటు ప్రతి ఏటా పాఠశాలలు తెరిచే మొదటి రోజే విద్యార్థుల చేతికి కిట్లు అందేలా అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముందస్తు ప్రణాళిక జగనన్న హయాంలో విద్యాసంవత్సరం ముగియక ముందే (మార్చి, ఏప్రిల్ నెలల్లోనే) ఇండెంట్లు సేకరించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేవారు. బడులకు వేసవి సెలవులు ఉన్నప్పుడే, మే నెలాఖరు నాటికి వంద శాతం నాణ్యమైన స్కూల్ బ్యాగులు, మూడు జతల యూనిఫాం వస్త్రాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, నోట్బుక్స్, నెక్సస్ బూట్లు, సాక్స్, బెల్టులను అన్ని మండల కేంద్రాల స్టాక్ పాయింట్లకు చేరవేసేవారు. మొదటి రోజే పండుగలా పంపిణీ జూన్ 1వ తేదీ నాటికే ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తరగతుల వారీగా కిట్లను సిద్ధం చేసేవారు. జూన్ 12న బడి తెరిచిన తొలిరోజే సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో విద్యార్థులందరికీ ఒకేసారి కిట్లను అందజేసేవారు. ఎక్కడా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఐదేళ్లపాటు ఈ విద్యా యజ్ఞం దిగ్విజయంగా సాగింది. నేడు వందశాతం నోటు పుస్తకాలే.. మిగిలినవి ఎప్పుడు? ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ముందస్తు ప్రణాళిక కరువైందనే విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా.. ప్రస్తుతం విద్యాకిట్లలో నోటు పుస్తకాలు వందశాతం రాగా, పాఠ్య పుస్తకాలు 75 శాతం వరకు వచ్చాయని తెలిపారు. అలాగే యూనిఫాంలు కూడా 100 శాతం మండల కేంద్రాలకు చేరుకున్నాయని వివరించారు. మిగిలిన వస్తువులు (షూస్, సాక్స్, బెల్టులు, బ్యాగులు) ఇంకా రావాల్సి ఉందని, దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ● ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు పంపించే ప్రక్రియను ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. నాడు జగనన్న హయాంలో లాగే ఈ ఏడాది కూడా పాఠశాలలు తెరిచే నాటికి మిగిలిన వస్తువులన్నీ అందించి, ఒకే కిట్గా పంపిణీ చేయాలని, ప్రభుత్వం ఇప్పటికై నా నిద్ర మత్తు వీడి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బడి తెరిచేందుకు మిగిలింది 16 రోజులే మండల కేంద్రాల్లో అసంపూర్తిగా నిల్వలు నేటికీ అందని షూస్, సాక్స్,బెల్టులు, బ్యాగులు నాడు మే నెలలోనేవంద శాతం కిట్లు సిద్ధం చేసినజగనన్న ప్రభుత్వం నేడు ముందస్తు ప్రణాళికకరువైందని విద్యార్థులు,తల్లిదండ్రుల ఆందోళన జిల్లాలో వేల సంఖ్యలో విద్యాకానుక కిట్లు అవసరమవుతాయి. ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు పంపిన నివేదికల మేరకు ప్రభుత్వం వీటిని సరఫరా చేయాల్సి ఉంది. విద్యా కిట్లలో స్కూల్బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్ట్, డిక్షనరీ, వర్క్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఉండాలి. కానీ, ఇంతవరకు ఏ ఒక్క మండలానికి కూడా వంద శాతం పూర్తి స్థాయి వస్తువులతో కూడిన కిట్లు సరఫరా కాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తువులు విడివిడిగా వస్తుండటం, కొన్ని ముఖ్యమైన వస్తువులు అసలు రాకపోవడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. -
సీపీఎల్–2 ఫైనల్లో పాయ్ వైస్రాయ్ జట్టు
వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో జరుగుతున్న సీపీఎల్ సీజన్ 2లో పాయ్ వైస్రాయ్ జట్టు ఫైనల్కు చేరింది.బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆదిత్య బిఆర్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాయ్ వైస్రాయ్ జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ జట్టులో జహీర్ అబ్బాస్ 28 బంతుల్లో 54 పరుగు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దిత్య బిఆర్ జట్లు 147 పరుగులకే ఆలౌలైంది. జహీర్ అబ్బాస్కు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ సతీష్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు. -
తహసీల్దార్, ఆర్ఐ రాలేదని దళితుల ధర్నా
కలెక్టర్ చర్యలు తీసుకోకుంటే అర్ధనగ్నప్రదర్శన పుంగనూరు: ప్రతినెల జరిగే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి తహసీల్దార్, ఆర్ఐతో పాటు 27 శాఖల అధికారులు రాకపోవడంతో దళిత నేతలు ధర్నా చేసి , నిరసన తెలిపారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్,మానిటరింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. అధికారులు, తహసీల్దార , ఆర్ఐ కూడా రాకుండా దళితులను అవమానపరుస్తున్నారని దళిత సంఘాల ప్రతినిధులు అశోక్, నరసింహులు, శంకరప్ప, చెన్నరాయుడు లు మండిపడ్డారు. నామమాత్రపు సమావేశాలు ఎందుకంటూ బహిష్కరించి అన్నమయ్య జిల్లా పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి, నినాదాలు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని , లేకపోతే అర్ధనగ్నప్రదర్శనలతో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు పెంచుపల్లి కృష్ణ, రమణ, రాజ, శంకర, రామకృష్ణ, తోటనరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఘాట్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
● బోల్తాపడిన ట్యాంకర్ నుంచి క్షేమంగా గ్యాస్ బదిలీ ● ఎట్టకేలకు క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను నిలిపిన వైనంచింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని అయిదవ మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్యాస్ ట్యాంకర్ నుంచి బుధవారం ఎట్టకేలకు ఫైర్, ఐఓసీఎల్, పోలీసు అధికారులు కలసి మరో మూడు గ్యాస్ ట్యాంకర్లు తెప్పించి అందులోకి గ్యాస్ మార్పించారు. బుధవారం క్రేన్ల సహాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన ట్యాంకర్ను రోడ్డుపై నిలుపగలిగారు. మధ్యాహ్నం సమయానికి వాహనాలను యథావిధిగా గువ్వలచెరువు ఘాట్ రోడ్డు గుండా అనుమతించి ట్రాఫిక్ సరి చేశారు. -
ఇద్దరు దొంగలు అరెస్టు
మైదుకూరు : మైదుకూరు పోలీసులు రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.20లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, 7 బైక్లను చోరీ చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో ఆ వివరాలను వెల్లడించారు. ఆ మేరకు.. ఈనెల 9వ తేదీన ప్రొద్దుటూరుకు చెందిన కంసల సుభాన్బీ అనే మహిళ తన బంధువు వివాహానికి శెట్టివారిపల్లెకు వచ్చి తిరిగి ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు మైదుకూరులో బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్లో ఉంచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలోని శాంతినగర్కు చెందిన బత్తుల సరోజ అనే మహిళా దొంగను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లాంగ్ చైన్, నల్లపూసల దండ, హారం, కమ్మలు తదితర రూ.15లక్షలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సరోజతోపాటు చోరీలో పాల్గొన్న చీరాలకు చెందిన తరుణ్ అనిల్ అలియాస్ డిమ్ము, మదన్ దొరకాల్సి ఉంది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట స్థానిక వనిపెంట రోడ్డులో ఓ మోటార్ బైక్ చోరీకి గురికాగా కేసు నమోదు చేసిన పోలీసులు మైదుకూరులోని సీపీఎం కాలనీకి చెందిన షేక్ నన్నేబాయ్ అనే యువకుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5లక్షలు విలువైన 7 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు సంఘటనల్లో దొంగలను పట్టుకునేందుకు, చోరీకి గురైన బంగారు ఆభరణాలు, బైక్లను రికవరీ చేసేందుకు కృషి చేసిన అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐలు కె.చిరంజీవి, కె.వెంకటరమణ, సిబ్బందిని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించి వారికి రివార్డులను అందజేశారు.రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 7 బైక్లు స్వాధీనం -
బక్రీద్ శుభాకాంక్షలు
కడప అర్బన్: మత సామరస్యానికి ప్రతీక అయిన వైఎస్సార్ కడప జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆకాంక్షించారు. సమైక్యతను, సమానత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు కానీ, ఏ చిన్న సమస్య ఉన్నా డయల్ 112 కి గాని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు. కడప ఎడ్యుకేషన్: బహిరంగ మార్కెట్లో పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలలో తక్షణం ఒక డీఏను ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.షరీఫ్ ఒక ప్రకటనలో కోరారు. జులై 2024 నుంచి 4 డీఏలు పెండింగ్ లో పెట్టి, కనీసం పీఆర్శీ కమిషన్ను కూడా నియమించక పోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం వల్ల ప్రభుత్వం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద(కాంట్రాక్టు) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ఏపీసీ బి. అనుఽరాధలు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026–27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టనున్నట్లు తెలిపారు. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు తదితరల వివరాలు http:IIkgbvrecruitment.apcfss.in వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 7075039990, 79933299115 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో వేసవి సెలవుల సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం జూన్ నెల 1 నుంచి 3వ తేదీ వరకు పద్యపఠన, వక్త్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. ఈ పోటీలు ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 1వ తేదీన 3, 4, 5 తరగతి విద్యార్థులకు పద్యపఠన పోటీ (ఏవైనా 3 వేమన పద్యాలు, ఏవైనా 3 సుమతీ పద్యాలు), 2వ తేదీన 6, 7, 8 తరగతి విద్యార్థులకు ‘తెలుగు భాష మాధుర్యం’ అనే అంశంపై వక్తృత్వ పోటీ, 3వ తేదీన 9,10 తరగతి విద్యార్థులకు ‘నాకు నచ్చిన పుస్తకం’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: జాతీయ పంచాయతీ అవార్డుల–2025 ప్రధాన కార్యక్రమం జూన్ 3వ తేది ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలన, జీవనోపాదుల పెంపు కింద ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె గ్రామ పంచాయతీ ఎంపికై ంది. దీని తరుపున అవార్డు స్వీకరించేందుకు వెళుతున్న అధికార ప్రతినిధి బృందంలో జెడ్పీ సీఈఓ సి.సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకట సుబ్బయ్య, కడప డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి.మైథిలి, డివిజనల్ పంచాయతీ అధికారి జి.విజయభాస్కర్, ఖాజీ పేట ఎంపీడీఓ ఎస్.దివిజ, చెమ్ముళ్లపల్లె పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.శివకుమార్లు ఉన్నారు. ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ రీ సర్వే, జనగణనపై ఇన్చార్జి అధికారులైన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజుతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రికార్డులను పరిశీలించారు. -
● మే నెలలోనే మూడు సార్లు...
ఒక్క మే నెలలోనే జిల్లాలో మూడు సార్లు ఈదురుగాలులతోపాటు కురిసిన అకాల వర్షాలకు వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మే 1వ తేదీ వచ్చిన ఈదురుగాలులతోపాటు అకాల వర్షాలకు జిల్లాలోని లింగాల, పులివెందుల, చక్రాయపేట, దువ్వూరు, రాజంపేట మండలాల్లో 490 మంది రైతులకు చెందిన 484 హెక్టార్లలో అరటి, 9 హెక్టార్లలో బొప్పాయి, 12 హెక్టార్లలో మామిడి, 10 హెక్టార్లలో నారింజ పంటలు దెబ్బతిని 179.35 లక్షల మేర రైతులకు నష్టం వాటిల్లింది. ● ఈ నెల 22న కురిసిన వర్షాలతో పాటు ఈదురు గాలులకు లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లి, ఎర్రగుంట్ల మండలాల పరిధిలో 705 మంది రైతులకు చెందిన 665.60 హెక్టార్లలో ఆరటి, నిమ్మ, తదితర పంటలు దెబ్బతిని రూ. 2.31 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తాజాగా 26వ తేదీ రాత్రి కురి సిన అకాల వర్లం, ఈదురు గాలులకు పెద్దముడియం, ఖాజీపేట, దువ్వూరు, లింగాల, పులివెందుల, వేముల మండలాల పరిధిలోని 271 మంది రైతులకు సంబంధించి 255.40 హెక్టార్లలో అరటి, బొప్పాయి, నిమ్మ, మునగ పంటలు దెబ్బతిని రూ. 89.27 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథ మిక నష్టపరిహార అంచనాలను పంపారు. -
కొత్తిమీర మూట దించుతూ తెగిపోయిన చెవి
రామసముద్రం : కొత్తిమీర మూట దించుతూ ప్రమాదవశాత్తు చెవి కమ్మకు తగలడంతో చెవి తెగిన సంఘటన బుధవారం రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణికు చెందిన మంజుల(40) రామసముద్రం మండలం నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోసేందుకు కూలీలతో పాటు వచ్చింది. అయితే కోసిన కొత్తిమీర మూటలను వాహనానికి లోడు చేస్తుండగా ప్రమాదవశాత్తు మూట చెవి కమ్మపై జారడంతో కమ్మతో సహా చెవి తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. గమనించిన కూలీలు ఆమెను హుటాహుటిన చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారి నాగరాజు ఆధ్వర్యంలో స్టాఫ్ నర్స్ శిల్ప కుట్లు వేసి చికిత్స చేశారు. సిబ్బంది రమణ, నాగేంద్ర పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయం
పీలేరు రూరల్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ధ్యేయమని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు శవన్నగారి బాలాజి అన్నారు. బుధవారం స్థానిక కోటపల్లె శ్రీనివాస కల్యాణమండపంలో జిల్లా అభ్యాసవర్గ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించడానికి తమ సంఘం కృషి చేస్తోందన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తిరిగి పునరుద్దరించే వరకు తమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ, ఎంఈవో రెడ్డిబాషా, ఆపస్ జిల్లా అధ్యక్షులు మంద నరసింహులు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సహఅధ్యక్షులు పచార్చర్ల సుధాకర్, సంఘ కార్యకర్త కొండారెడ్డి, ఆర్థిక కార్యదర్శి శివశంకర్, నాయకులు వేణుగోపాల్, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. పిడుగు పాటుకు ఉపాధి కూలీకి గాయాలు సంబేపల్లె : మండల పరిధిలోని అడవికమ్మపల్లె గ్రామం బండకాడ హరిజనవాడకు చెందిన ఆంజనేయులు పిడుగుపాటుకు గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఆంజనేయులు గ్రామ సమీపంలోని పొలాల్లో జరుగుతున్న ఉపాధి పనికి వెళ్లాడు . ఈ క్రమంలోనే బుధవారం ఉరుములతో కూడిన వర్షం పడటంతో ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో పిడుగు పడి పెద్దశబ్దం వచ్చినట్లు తోటి కూలీలు తెలిపారు. అప్పటికే ఆంజనేయులకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరామర్శించిన ఉపాధి అధికారులు : పిడుగుపాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులను ఉపాధి ఏపీడీ మధుబాబు, ఎంపీడీఓ సురేష్, ఏపీఓ రెడ్డిజవహర్లు పరామర్శించారు. -
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు
కడప అర్బన్ : జిల్లాలోని చెన్నూరు మండలంలో మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడు గొడ్లవీటి ఈశ్వరయ్య(36)కు జైలు శిక్ష విధించారు. కడప పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమ శేఖర్ కేసు విచారించి నిందితుడు గొడ్లవీటి ఈశ్వరయ్యకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 3,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. చెన్నూరు పీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ చాంద్ బాషా ఈ కేసు వివరాలను, కోర్టు వెలువరించిన తీర్పును మీడియాకు వెల్లడించారు. చెన్నూరు మండలానికి చెందిన మైనర్ బాలిక(8) పై 2022 డిసెంబర్ 12న లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీస్ స్టేషన్న్లో చెన్నూరు మండలం కొక్కరాయపల్లి గ్రామానికి చెందిన గొడ్లవీటి ఈశ్వరయ్య పై కేసు నమోదు చేశారు. కేసును సమగ్రంగా విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ సమర్థవంతంగా కేసును వాదించారు. నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బంది ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
చాపాడు : మండల పరిధిలోని గుంతచీపాడు గ్రామంలో గుద్దేటి రవిశంకర్రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీనివల్ల రూ.2లక్షల విలువ చేసే ఇంటిలోని సామాగ్రి, వరి ధాన్యం, యూరియా బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో పాటు పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో గుంతచీపాడులోని రవిశంకర్రెడ్డి ఇంటిలో తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు లేచాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలోని వాషింగ్ మిషన్, 15 బస్తాల యూరియా, 10 బస్తాల వరి ధాన్యం, రెండు పవర్ స్పైయర్ మిషన్లు, నాలుగు పెద్ద టార్పాలిన్ పట్టలు, రెండు స్టార్టర్లు, రెండు ప్యాన్లు, ఒక వ్యవసాయ విద్యుత్ మోటార్, విద్యుత్ వైర్లు, ఇంటిలోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ.2లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జరిగిన సంఘటన, నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించినట్లు బాధితుడు తెలిపారు. -
త్యాగమయ జీవితం.. బక్రీద్ సందేశం
● నేడు ఈద్–ఉల్–జుహా (బక్రీద్) ● జిల్లాలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులుకడప సెవెన్రోడ్స్/ రాజంపేట టౌన్ : ముస్లిం లోకం అల్లాహ్కు మించిన ప్రపంచం లేదని గాఢంగా విశ్వసిస్తుంది. ఆయన మాటలను, దూతల ఆదేశాలను శాసనంగా భావించి కచ్చితంగా పాటించేందుకు సిద్ధమవుతుంది. వారి పండుగల్లో బక్రీద్ ఒకటి. త్యాగమయ జీవితమే మానవ జన్మకు సార్థకమన్న అల్లాహ్ ఆదేశాలు పాటించేందుకు ఎంతటి త్యాగానికై నా సిద్ధం కావడమే ఈ పండుగ ఉద్దేశ్యం. కడప నగరంలో.. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం కడప నగరంలో మసీదులు, ఈద్గాలలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర శివార్లలోని బిల్టప్, దండుతోపాటు ఇతర ఈద్గాలు, జిల్లాలోని వేలాది మసీదుల్లో గురువారం ప్రార్థనల నిర్వహణకు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా కడప నగరంలోని బిల్టప్ ఈద్గా వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు చేసుకునేందుకు ఈద్గా ప్రాంగణమంతా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు ముందు వజూ చేసుకునేందుకు మంచినీరు అందుబాటులో ఉంచారు. ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు. విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని వివిధ మసీదుల్లో భక్తుల సౌకర్యార్థం ప్రార్థన సమయాలను నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ సందేశం ఇవ్వనున్నారు. త్యాగనిరతికి ప్రతీక బక్రీద్త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను గురువారం ఘనంగా జరుపుకునేందుకు ముస్లీంలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హిజ మాసంలోని (చంద్రోదయం ఆధారంగా) పదవ తేదీ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈసదంర్భంగా ముస్లీంలు మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రంజాన్ సందర్భంగా దానాలు చేసే ముస్లీంలు బక్రీద్ రోజున ఖుర్బానీ ఇస్తారు. ఇది బక్రీద్ నేపథ్యం... ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో తన కుమారుడిని త్యాగం చేస్తున్నట్లు కల వస్తుంది. ఇలా మూడుమార్లు కల రావడంతో ఇదే విషయాన్ని తన కుమారుడు ఇస్మాయిల్కు చెబుతాడు. హజ్రత్ దైవ విశ్వాసి కావడంతో ఇస్మాయిల్ నిస్సంకోచంగా అందుకు అంగీరించి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాడు. దైవానుగ్రహం కోసం కుమారుడిని సైతం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని, దైవంపై ఉన్న అచంచల విశ్వాసానికి అల్లా ప్రసన్నమవుతారు. కుమారుడిని ఖుర్బానీ ఇచ్చే సమయంలో స్వర్గం నుంచి ఓ గొర్రెను తెచ్చి ఆ ప్రదేశంలో ఉంచుతారు. దీంతో అల్లా ఆదేశం ప్రకారం ఖుర్బానీ సంపూర్ణమవుతుంది. ఈ చారిత్రక ఘటన నేపథ్యంలో మహా ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ నిర్దేశం మేరకు ముస్లీంలు ప్రతి ఏటా బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఖుర్బానీ.. బక్రీద్ సందర్భంగా ముస్లీంలు ఖుర్బానీ ఇవ్వడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఖుర్బానీ ఇచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని పేదలకు, రెండవ భాగాన్ని బంధు, మిత్రులకు, మూడవ భాగాన్ని తమకోసం ఉంచుకుంటారు. ఇందులో ఏమాత్రం వ్యత్యాసం రాకూడదు. హజ్యాత్ర.. ఇస్లాం ప్రాథమిక ఐదు సూత్రాలలో మొదటిది దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, మహమ్మద్ ప్రవక్తను దైవప్రవక్తగా విశ్వసించడం. రెండవది ప్రతి ముస్లీం ఐదుపూటల నమాజ్ను విధిగా ఆచరించడం. మూడవది రంజాన్ మాసంలో ముప్పై రోజులు ఉపవాసం ఉండటం. నాల్గవది ధనవంతులు తమ సంపదలో రెండున్నర శాతం రంజాన్ మాసంలో పేదలకు, అనాధలకు, వితంతువులకు జకాత్ ఇవ్వడం. ఐదవది మక్కా యాత్ర చేయడం. ముస్లీంలు ఈ మాసంలోనే హజ్ యాత్ర చేస్తారు. ఈ మాసంలో పవిత్ర స్థలం మక్కాను సందర్శించడాన్ని ముస్లీంలు పుణ్యంగా భావిస్తారు. సౌది అరేబియాలోని మక్కాకు వెళ్ళి మస్జీద్ అల్ హరమ్లోని కాబా చుట్టూ ఏడుమార్లు ప్రదక్షిణ చేస్తారు. బక్రీద్ నేపథ్యంలో పటిష్ట భద్రత కడప అర్బన్ : కడప నగరంలోని వన్ టౌన్, టూ టౌన్, తాలూకా, సైబర్ క్రైమ్, సి.కె దిన్నె పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల కు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన పిటిషనర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత సీఐ లను ఆదేశించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా స్టేషన్లలో సిబ్బంది వివరాలు, పనితీరు అడిగి తెలుసుకున్నారు. బక్రీద్ నేపథ్యంలో సోషల్ మీడియా పై నిఘా ఉంచాలని సైబర్ క్రైమ్ సీఐ మధుమల్లేశ్వర రెడ్డి ని ఆదేశించారు. తనిఖీల సమయంలో కడప వన్ టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య, కడప టూ టౌన్ సీఐ శ్రీహరి ఉన్నారు. -
మద్యం మత్తులో వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు
బి.కోడూరు : మద్యంమత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం బద్వేలు ద్వితీయశ్రేణి మేజిస్ట్రేట్ 30 రోజుల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. బి.కోడూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన పోతల గురుస్వామి, కాశినాయన మండలం వంకమర్రి గ్రామానికి చెందిన కాకా వెంకటరాముడు అలియాస్ వెంకటరమణ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ వాహనాల తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వీరికి 30 రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ బద్వేలు ద్వితీయశ్రేణి మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. మాజీ సీఎం ఇంటిపై ఈడీ అక్రమ దాడులు ఆపాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేరళ మాజీ సీఎం పీనరయి విజయన్ ఇంటిపై ఈడీ అక్రమ దాడులను ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పాత రిమ్స్ వద్దనున్న ఇందిరాగాంధీ సర్కిల్లో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడి దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన జేబు సంస్థగా ఈడీని మార్చుకొని రాజకీయ ప్రత్యర్థులపై, నిష్కారణంగా దాడులు చేపించి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు తగవన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపులిచెర్ల (కల్లూరు) : కల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కల్లూరు –పీలేరు జాతీయ రహదారిలో పెట్రోల్ బంకువద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపేట పంచాయతీ శాంతి నగర్కు చెందిన లక్మ్యయ్య (50)స్వగ్రామం నుంచి పీలేరుకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా పీలేరు నుంచి ఎదురుగా వస్తున్న ఈచర్ లారీ వాహనం ఢీకొనడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకొన్న కల్లూరు పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రతిభ ఫ్లైట్ ఎక్కించింది
సాక్షి, మదనపల్లె: పదవ తరగతి పరీక్షల్లో హైస్కూల్ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరిని విమానంలో ప్రయాణం చేయిస్తానని చెప్పిన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె హైస్కూల్ హెచ్ఎం శాంతకుమారి చెప్పినట్టుగానే ఇద్దరు విద్యార్థులకు విమానంలో ప్రయాణం చేయించారు. పదవ తరగతి పరీక్షల్లో గుడిసెవారిపల్లెకు చెందిన విద్యార్థి వరుణ్సందేశ్రెడ్డి, చందనలు 600 మార్కులకు 555 మార్కులు సాధించారు. హైస్కూల్ ఫలితాల్లో ఈన ఇద్దరే ప్రథమం కావడంతో బుధవారం హెచ్ఎం శాంతకుమారి విద్యార్థులతో కలిసి తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తొలిసారి విమానం ఎక్కి ప్రయాణించి విద్యార్థులు ఈ అనుభూతిని మరచిపోలేమని, హెచ్ఎం ప్రోత్సాహంతోనే ఈ అవకాశం దక్కిందని అన్నారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలన్న తపనతోనే విమాన ప్రయాణం కల్పించినట్టు శాంతకుమారి చెప్పారు. దీనిపై ఎంఈవో రెడ్డిశేఖర్ హెచ్ఎంను, విద్యార్థులను అభినందించారు. -
టీడీపీ మహానాడులో రికార్డింగ్ డాన్సులు
సాక్షి, వైఎస్సార్: టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావించే మహానాడు ఈసారి భిన్నమైన చర్చకు దారి తీసింది. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాల కంటే… సభకు జనాన్ని నిలబెట్టుకోవడమే స్థానిక నేతలకు పెద్ద సవాలుగా మారిన పరిస్థితి కనిపించింది. చివరకు కార్యకర్తలు, స్థానికులను ఆకట్టుకునేందుకు రికార్డింగ్ డాన్సుల వరకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.మహానాడును విజయవంతం చేయాలనే ఉద్దేశంతో బద్వేల్ టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆర్పీల ద్వారా మహిళలకు ప్రత్యేక ఆడియో మెసేజ్లు పంపిస్తూ సభకు హాజరుకావాలని కోరినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనసమ్మర్థం కనిపించకపోవడంతో నిర్వాహకులు కొత్త మార్గాలను వెతికినట్లు చెబుతున్నారు.ఈ క్రమంలోనే కార్యక్రమ ప్రాంగణంలో రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకవైపు రాజధానిలో పార్టీ అగ్రనేతలు మహానాడు వేదికపై ప్రసంగాలు చేస్తుండగా, మరోవైపు బద్వేల్లో భారీ స్క్రీన్ ముందు డాన్సులు కొనసాగడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సభకు వచ్చిన వారు మధ్యలో వెళ్లిపోకుండా ఉంచేందుకే ఈ ఏర్పాట్లు చేశారన్న చర్చ సాగుతోంది.ఇది చూసిన కొందరు స్థానికులు, పార్టీ సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహానాడు వంటి రాజకీయ కార్యక్రమంలో ఈ తరహా వినోద కార్యక్రమాలు అవసరమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే… బద్వేల్లో మహానాడు రాజకీయ సభ కంటే వినోద కార్యక్రమాల కారణంగానే ఎక్కువ చర్చకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ‘‘అదిరిందయ్యా చంద్రం’’ అనే కామెంట్ బలంగా వినిపిస్తోంది. -
ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలి
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప కోటిరెడ్డిసర్కిల్: ఖాతాదారులకు విశిష్టమైన, మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని రాజీవ్ మార్గ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‘ ఎర్రముక్కపల్లె బ్రాంచ్ కార్యాలయాన్ని వైవీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్, యూబీఐ రీజినల్ మేనేజర్ లక్ష్మితులసిలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా ప్రజలకు లావాదేవీలు మాత్రమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను లబ్ధిదారులకు అందజేయడంలో పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఎర్రముక్కపల్లె బ్రాంచ్ మేనేజర్ భాను తేజ, ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ రవీంద్రా రెడ్డి, వివిధ శాఖల బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ‘సర్’ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి కడప సెవెన్రోడ్స్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (సర్) నిర్వహణకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి సర్ నిర్వహణ, సన్నాహక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్తో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, డీఆర్వో, ఆర్డీవోలు, ఈఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ అమలు, చేపట్టాల్సిన సన్నాహక కార్యక్రమాలపై వారు అన్ని జిల్లాల కాలెక్టర్లతో సమగ్రంగా సమీక్షించారు. -
శిరోభారం!
మినీ మహానాడుకు కాదేదీ అనర్హం! సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘వర్చువల్ మహానాడు’ జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్కు పెద్ద శిరోభారంగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్లైన్ విధానంలో సాగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధిష్టానం నుంచి హుకుం జారీ కావడంతో స్థానిక నేతలు మల్లాగుల్లాలు పడుతున్నారు. 78 క్లస్టర్లు.. భారీ ఖర్చులు ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా 40 మండలాలు, 9 మున్సిపాలిటీలను కలిపి మొత్తం 78 క్లస్టర్లుగా విభజించారు. జిల్లా కేంద్రమైన కడపలోనే ఏకంగా 14 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్లో కార్యకర్తలు వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భోజన వసతులు కల్పించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే, ఈ భారీ వ్యయాన్ని భరించలేక, అటు ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జ్లను డబ్బులు అడగలేక.. స్థానిక కేడర్ తీవ్ర అసహనం, అనాసక్తి వ్యక్తం చేస్తోంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డిల మధ్య ఉన్న తీవ్రస్థాయి విభేదాల వల్ల కార్యక్రమ నిర్వహణపై పరిశీలకులు మల్లాగుల్లాలు పడుతున్నారు. పరిశీలకుల పర్యవేక్షణ... సగానికి పైగా మండలాలు వెనుకడుగు వర్చువల్ మహానాడు నిర్వహణకు నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని అధిష్టానం నియమించింది. క్షేత్రస్థాయి ఏర్పాట్లపై పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం దృష్టికి వెళ్తోంది. అయితే, ఇప్పటికి సగానికి పైగా మండలాలు కనీసం స్క్రీన్లు కూడా బుక్ చేసుకోలేదు. 78 క్లస్టర్ల పరిధిలో డిజిటల్ మహానాడు నిర్వహణ అత్యంత కష్టతరంగా మారినట్లు పరిశీలకులు గుర్తించారు. అన్ని ప్రాంతాల్లో ఇది విజయవంతం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పరిశీలకులు ఇన్ఛార్జీలతో అత్యవసర సమాలోచనలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన ‘మినీ మహానాడు’ సమావేశాల వేది కల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని మద్రాసు రోడ్డులో ఉన్న పవిత్ర ధార్మిక సంస్థ టీటీడీ కళ్యాణమండపాన్ని, మినీ బైపాస్లోని గురుకుల్ విద్యాపీఠ్ పాఠశాలను ఈ రాజకీయ వేడుకల కోసం ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించాల్సిన ధార్మిక వేదిక ల్లో, చిన్న పిల్లలు చదువుకునే విద్యాసంస్థల్లో పచ్చ జెండాలు కట్టి హంగామా చేస్తుండటంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. –కడప కార్పొరేషన్మరోవైపు బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి వీరారెడ్డి రాజకీయ వారసుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రితేష్రెడ్డిని పార్టీ ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ కింద పక్కన పెట్టేసిందనే చర్చ సాగుతోంది. రితేష్రెడ్డితో ఎలాంటి నిమిత్తం లేకుండానే, డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డికి వర్చువల్ మహానాడు నిర్వహణ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఈ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సీరియస్గా పరిగణించినట్లు సమాచారం. మాజీ మంత్రి వీరారెడ్డి అనుచరులంతా మహానాడుకు గైర్హాజరు కావాలనే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అట్లూరు నుంచి భారీగా సమీకరణ చేపట్టి మహానాడు సక్సెస్ చేయాలనే దిశగా డీసీసీబీ చైర్మన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రితేష్రెడ్డి పట్ల అసమ్మతి నేతలందర్నీ వేదికపైకి తీసుకువచ్చే దిశగా మంతనాలు ఆరంభించినట్లు సమాచారం. వర్చువల్ మహానాడుకు వ్యయం తడిసిమోపెడు ఖర్చులకు వెనుకంజ వేస్తున్న తమ్ముళ్లు! 78 క్లస్టర్లలో నిర్వహణ కష్టతరం బద్వేల్లో రితేష్రెడ్డిపై ‘యూజ్ అండ్ త్రో’ పాలిటిక్స్! -
ప్రేమ పేరుతో కామాంధుడి ఘాతుకం
● మైనర్ బాలికపై అత్యాచారం ● అధిక రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి.. ● పోలీసులకు ఫిర్యాదు ఖాజీపేట : ప్రేమ పేరుతో ఒక కామాంధుడు మైనర్ బాలికకు వల వేశాడు. మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకుని వెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖాజీపేటలో పెద్ద సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఖాజీపేట మండలం అగ్రహారానికి చెందిన కీర్తన అనే మైనర్ బాలిక హత్య సంఘటన మరువక ముందే.. తిరిగి మరొక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం కలకలం రేపుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు మండలం కోట్లూరు గ్రామానికి చెందిన ఈశ్వర్(19) ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. గడిచిన 6 నెలల కిందట దువ్వూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక(15)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ ఆ బాలికతో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సోమవారం ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బాలిక గుడుపాడు గ్రామానికి వెళ్లింది. కోట్లూరు గ్రామానికి చెందిన ఈశ్వర్ బైక్పై గుడిపాడు గ్రామానికి చేరుకున్నాడు. ఆ బాలికను అక్కడి నుంచి ఖాజీపేటలోని ఒక లాడ్జికి తీసుకుని వెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రుతుస్రావం జరిగినట్లుగా ఇద్దరూ భావించారు. తిరిగి బాలికను బైక్పై దువ్వూరు మండలంలోని ఒక గ్రామం వద్దకు తీసుకువచ్చి వదిలేసి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక రక్తస్రావం అధికంగా వస్తుండటంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు ఆ బాలిక తీసుకెళ్లింది. వెంటనే దువ్వూరులోని ఒక ఆర్ఎంపీ దగ్గరికి వారు తీసుకు వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రొద్దుటూరుకు తీసుకు వెళ్లాలని ఆర్ఎంపీ సూచించాడు. వారు ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు వారు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కడప రిమ్స్కు తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కడప రిమ్స్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కోలుకుంటోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కడప రిమ్స్లోని పోలీస్ ఔట్పోస్ట్లో ఫిర్యాదు చేశారు. అయితే తమ కూతురుపై జరిగిన సంఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా లాడ్జిలు ఖాజీపేటలో బైపాస్ రోడ్డు వద్ద ఉన్న లాడ్జిలు చాలా కాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. లాడ్జిల్లో డబ్బులు ఇస్తే పేకాటతోపాటు అనేక కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. అందుకు నిదర్శనం గతంలో కూడా పేకాట ఆడుతూ పట్టుపడ్డ సంఘటలు ఉన్నాయి. బయటి నుంచి వస్తున్న వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండానే గదులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అలా వచ్చిన వారు కేవలం గంట లేక రెండు గంటలు మాత్రమే లాడ్జిలో ఉంటూ తమ అవసరాలు తీరిన తరువాత ఖాళీ చేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. లాడ్జిల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులో నిందితుడు జరిగిన సంఘటనపై పోలీసులు వేగంగా స్పదించా రు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తప్పును ఒప్పుకొన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి, విచారణ బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని వివరించారు. -
ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ
సిద్దవటం : కడప–చైన్నె జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం కడప– చైన్నె జాతీయ రహదారి కనుమలోపల్లి గ్రామ సమీపంలోని శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం వద్ద శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముంబై నుంచి చైన్నెకి వెళ్తున్న పార్సిల్ లారీ ఢీకొన్నాయి. ఈ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా హైవే రోడ్డుపై శబ్దం రావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వీరిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ప్రయాణికులకు బలమైన గాయాలు తగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ నాగార్జున, కడప తాలూకా సీఐ నరసింహరాజు, టీటీఆర్పీ సీఐ మహమ్మద్బాబీ, ఎస్ఐలు హారిక, శ్రీనివాసులు, తులసినాగప్రసాద్, హైవే పెట్రోలింగ్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. మండల ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నారు. పలువురికి గాయాలు -
రోడ్డు ప్రమాదంలో హిజ్రా దుర్మరణం
పెండ్లిమర్రి : మండల పరిధి కడప – పులివెందుల ప్రధాన రహదారిలోని ఇందిరానగర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ హాజివల్లి (40) అనే హిజ్రా దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... పులివెందుల నుంచి కడప వైపు వెళుతున్న కారు ఇందిరానగర్ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే అదుపు తప్పి అక్కడే నిలిచి ఉన్న షేక్ హజీవల్లిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తులసి నాగప్రసాద్ తెలిపారు. యువకుడి ఆత్మహత్య కడప అర్బన్ : కడప నగర తాలూకా పీఎస్ పరిధిలో తీవ్ర అనారోగ్యంగా వుండే కారణంగా తలకు పూసుకునే రంగు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రఫీ తెలిపారు. నంద్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ నాయక్ (19) కడపలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. మరో యువకుడితో కలిసి ఉంటున్నాడు. వైద్యంకు కూడా తగ్గని జబ్బు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగారు హారం చోరీ ముద్దనూరు : ఆర్టీసీ బస్సులో వెళ్తున్న సోంపల్లెకు చెందిన సువర్ణ అనే మహిళ బంగారు హారం మంగళవారం రాత్రి చోరీకి గురైంది. బాధితుల వివరాల మేరకు.. సువర్ణ సోంపల్లెలోని తన పుట్టింటి నుంచి తొండూరు మండలం బూచుపల్లెకు బయలుదేరారు. ముద్దనూరు బస్టాండులో తన ఇద్దరు పిల్లలతో కలిసి బస్సు ఎక్కారు. ముద్దనూరు పాతబస్టాండులో బస్సు ఎక్కిన ఆమె టికెట్ ఇవ్వడానికి పర్సులోని ఆధార్కార్డు కోసం బ్యాగులో చూడగా పర్సు కనిపించలేదు. దీంతో పర్సు చోరీకి గురైనట్లు గుర్తించారు. పర్సులో ఆధార్కార్డుతోపాటు సుమారు 2 తులాల బంగారు హారం ఉంచినట్లు బాధితురాలు తెలిపారు. బస్సు ఎక్కిన వెంటనే గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగులోని పర్సు దొంగలించినట్లు ఆమె పేర్కొన్నారు. ఐరన్ మాయం ఘటనలో ఏఈపై కేసు ప్రొద్దుటూరు క్రైం : హౌసింగ్ శాఖలోని ఐరన్ చోరీ అయిన ఘటనకు సంబంధించి రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు.. హౌసింగ్కు సంబంధించిన ఐరన్ను మార్కెట్ యార్డు గోడౌన్లో భద్రపరిచారు. దీన్ని రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గోడౌన్లో ఉన్న 268.571 టన్నుల ఐరన్ కనిపించలేదు. ఈ విషయమై హౌసింగ్ జిల్లా పీడీ రాజారత్నం ఫిర్యాదు మేరకు మంగళవారం ఏఈ సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు త్రీ టౌన్ సీఐ తెలిపారు. కోడి పందెం ఆడుతున్న ఆరుగురి అరెస్ట్ రాయచోటి : రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న కోడిపందెం (కాక్ ఫైట్) స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన దాడిలో ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నాలుగు బైకులు, ఐదు సెల్ఫోన్లు, ఒక కోడి, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
విద్యుత్ శాఖ తీరు.. రైతుకు కన్నీరు
● ఈదురుగాలులకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ● వారం రోజులుగా సరఫరాలో అంతరాయం ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో అధికారులు పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ కొత్తపల్లె గ్రామంలో వ్యవసాయానికి సంబంధించి వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వానకు తోటల వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలతోపాటు ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిని పడిపోయాయి. ఈ నేపథ్యంలో సంబంధిత రైతులు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయిన వాటి వివరాలను సేకరించి వెళ్లిపోయారు. మల్లికార్జునపురం గ్రామంలో సుమారు 200 ఎకరాలలో మిరప, 100 ఎకరాలలో అరటి పంటలను సాగు చేశారు. ఈ పంటలను కాపాడుకోవాలంటే నీటితడులు అందించాల్సి ఉంది. కానీ వారం రోజులుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించకపోతే పంట ఎదుగుదల రాదని వారు వాపోతున్నారు. జనరేటర్ల ద్వారా నీటి తడులు అందించాల్సి వస్తోందని తెలిపారు. వారం రోజులవుతునన్నా సంబంధిత అధికారులు ఇప్పటికీ నేలకూలిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పనులను వేగవంతంగా చేయడం లేదని వాపోతున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సుమారు 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి మల్లికార్జునపురం గ్రామ పొలాల్లో పడిపోయిన విద్యుత్ స్తంభాలను బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బక్రీద్కు ఘనంగా ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా వ్యాప్తంగా ముస్లింలు పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టింది. ఈద్గాల వద్ద ప్రత్యేక వసతులు: కడప నగరంలోని బిల్టప్ సమీపంలో గల ప్రధాన ఈద్గా వద్ద మైనార్టీ సంక్షేమ, పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎండ తీవ్రత తగలకుండా భారీ చలువ పందిళ్లను నిర్మించారు. ప్రార్థనలకు వచ్చే వారి కోసం తాగునీటి సదుపాయంతో పాటు, వజూ (శుభ్రత) చేసుకోవడానికి అవసరమైన నీటి వసతిని కల్పించారు. నగర శివార్లలోని ఈద్గాలు. మసీదులు కూడా ప్రార్థనల కోసం సిద్ధమవుతున్నాయి. పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రార్థనలు బక్రీద్ పండుగ రోజున పెద్దదర్గా మసీదులో తొలుత పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ప్రత్యేక ప్రార్థనలు జరపనున్నారు. అనంతరం బిల్టప్ ఈద్గాలో ముఖ్య ప్రార్థనలు జరుగుతాయి. మరోవైపు, దండు ఈద్గాలో మురాదియా పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొనుగోళ్లతో సందడిగా మార్కెట్లు ç³…yýl$VýS çÜÒ$-í³…-^èl-yýl…™ø ¯]lVýS-Æý‡…ÌZ° {ç³Ð]l¬Q Ðé×ìæ-fÅ Ò«§ýl$-OÌñæ¯]l OÐðlÒ [ïÜtsŒæ, ½MóS-G… [ïÜtsŒæ-ÌS™ø ´ër$ BÈtシー ºÝët…yŠæ ç³Ç-çÜ-Æ>ÌZϰ Úëí³…VŠæ Ð]l*â¶æ$Ï Ñ°-Äñæ*-VýS-§é-Æý‡$ÌS™ø ´ùsñæ-™é¢Æ‡$$. Æð‡yîl-Ðól$yŠæ §ýl$çÜ$¢Ë$, Ð]l$íßæ-âýæÌS AÌS…MýS-Æý‡×æ ÝëÐ]l$-{W, Ððl$çßæ…© Mø¯]l$Ï, ´ë§ýl-Æý‡-„ýSË$, Æý‡MýS-Æý‡-M>ÌS yìlOgñæ¯]lÏ V>kÌS Mö¯]l$Vøâ¶æ$Ï gZÆý‡$V> ÝëV>Ƈ$$. Æ>{† ´÷§ýl$ª´ùÄôæ$ Ð]lÆý‡MýS$ ÐéÅ´ëÆ>Ë$ ÝëVýS-yýl…™ø §ýl$M>-׿-§é-Æý‡$Ë$ çßæÆý‡Û… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. పటిష్ట నిఘా – కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఈ నెల 28వ తేదీన జరగనున్న పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా, సోషల్ మీడియాలో వచ్చే నకిలీ పోస్టులపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు లేదా సమాచారాన్నైనా అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్: 08562 246344కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చని కలెక్టర్ వివరించారు. ప్రార్థనలకు సిద్ధమైన కడప ఈద్గాలు పీఠాధిపతుల ఆధ్వర్యంలోబక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు పండుగకు ముమ్మర ఏర్పాట్లు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న మార్కెట్లు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు పటిష్ట నిఘా పెట్టిన పోలీసులు -
ప్రొద్దుటూరులో పోలీసుల బందోబస్తు
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి వర్గీయులు మంగళవారం సాయంత్రం పరస్ప రం రాళ్లు దాడులు చేసుకోవడంతో ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు, ప్రజలు టెన్షన్గా ఉన్నారు. ఇందులో భాగంగానే కడప నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ప్రవీణ్ కుమార్రెడ్డి ఇల్లు, ఆయన ఫిర్యాదు చేసిన ఎస్ఎస్ మాల్ సమీపంలోనే ఉన్నాయి. సాయంత్రం ఇరువర్గాల వారు అటు ఎస్ఎస్ మాల్ వద్ద, ఇటు ప్రవీణ్కుమార్రెడ్డి ఇంట్టి వద్ద కాపు కాసి కూర్చున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానాడు కార్యక్రమంలో జరుగుతున్న వేళ ప్రొద్దుటూరులోని టీడీపీ వర్గాల మధ్య ఈ పరిస్థితి చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు, ఇప్పుడు వారే బాగు పడ్డారు ఈ సందర్భంగా జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ వర్గీయులపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు దాడి చేసిన సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారే ఎమ్మెల్యే వరద వెంట లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లిన వారిని వదిలేసి రెండు ప్రభుత్వాల్లో లబ్ధి పొందుతున్న వారి విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానన్నారు. -
పులివెందులలో దొంగల బీభత్సం
● పందుల చోరీకి యత్నం ● అడ్డుకున్న వారిపై బీరు సీసాలు, రాళ్లతో దాడి ● ఒకరికి గాయాలు, పలు వాహనాలు ధ్వంసం పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున ఏడుగురు పందుల దొంగలు హల్చల్ సృష్టించారు. వెంబడిస్తున్న వాహనాలపై రాళ్లు, బీరు సీసాలు విసురుతూ, అడ్డు వచ్చిన వాహనాలను ఢీకొడుతూ పోలీసులు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడులలో మూడు వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుడు అంజనప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల పట్టణంలోని చందమామ డాబా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కొంత మంది వ్యక్తులు బొలెరో వాహనంలో పందులు పడుతుండడంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు మీరు అని ప్రశ్నించారు. దీంతో దుండగులు ఆయనపై బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి పందుల యజమాని అంజనప్పకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అంజనప్ప పోలీసులకు సమాచారమందించారు. అనంతరం తన కుమారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన దుండగులు వారిపై రాళ్లు, బీరు సీసాలు విసురుకుంటూ వెళుతూ గట్టిగా కేకలు వేస్తూ అధిక వేగంతో వాహనంలో పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసుల సహాయంతో అంజనప్ప వారిని వెంబడించారు. ముదిగుబ్బ వైపు వెళ్తున్నారని సమాచారం రావడంతో.. దొంగల వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు నల్లగొండువారిపల్లెలో ఒక వ్యక్తికి తెలియజేశారు. ఆ వ్యక్తి వారిని నిలిపేందుకు వెళ్లడంతో దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టి పరారయ్యారు. అనంతరం పోలీసులు అంబకపల్లె ప్రజలకు సమాచారమందించారు. అక్కడ ఉన్న ప్రజలు రోడ్డుకు అడ్డంగా పెద్ద, పెద్ద రాళ్లను అడ్డుపెట్టారు. అయినా వాటిని కూడా ఢీకొట్టి వాహనంలో పరారయ్యారు. మరో గ్రామం వద్ద ట్రాక్టర్ ట్రాలీని అడ్డు పెట్టడంతో ట్రాలీని ఢీకొట్టి ముదిగుబ్బ వైపు వెళ్లారు. దొంగల వాహనం వెంటే వారిని పట్టుకునేందుకు పోలీసు వాహనం, మరో వాహనంలో వెంబడించారు. పోలీసులను చూసి కూడా భయపడకుండా రాళ్లు, సీసాలు విసురుతూ బీభత్సం సృష్టించారు. పోలీసులు వెంబడించినా.. దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఐ శ్రీరామ్ వారిని వెంబడిస్తూ వెళ్లారు. పోలీసు వాహనానికి, పందుల యజమాని వాహనానికి దొరక్కుండా దొంగలు వారి వాహనాలపై రాళ్లు, సీసాలు విసురుకుంటూ వెళ్లారు. బత్తలపల్లి సమీపంలో అంజనప్ప వాహనాన్ని వారు ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనతో దొంగల వాహనం కూడా పూర్తిగా ధ్వంసమై రోడ్డు పక్కన ఆగిపోయింది. పందుల దొంగలు ఇక రండిరా మా బార్డర్లోకి వచ్చారు... మీ కథ చూస్తామంటూ వారిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. పందుల యజమానులు వాటిని లెక్కచేయకుండా వారిపైకి వెళ్లడంతో కొంత మంది పరుగులు తీయగా... వారిని పోలీసులు వెంబడించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని మిగతా వారిని పట్టుకునేందుకు సీఐ శ్రీరామ్ అనంతపురం చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పులివెందులలో రెండు మూడు జరిగినట్లు సమాచారం. -
మద్దతు ధరలు ఆచరణలో అమలు చేయాలి
‘ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు దళారులకే అందుతున్నాయి తప్ప సామాన్య రైతులకు చేరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు కొంత వరకు ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ఆచరణలో అమలు జరగాలి.‘ – మోహన్రెడ్డి, రైతు, సుంకేసుల, ఖాజీపేట మండలం ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావు ‘ఏటా సాగు ఖర్చులు భారీగా పెరుగుతున్నా, మద్దతు ధరలు మాత్రం అంతంతే పెరుగుతున్నాయి. దీంతో మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి ఖర్చును, రైతు కుటుంబ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరలను ప్రకటించాలి.‘ – దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఖర్చులకు అనుగుణంగా ధరలు లేవు ‘రైతుల వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వలన అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వరికి క్వింటాల్కు కేవలం రూ. 72 మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, రాగులు ఇలా అన్నింటికి మద్దతు ధరను రూ. 5 వందల లోపు పెంచడం రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు.‘ – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు -
నాయుళ్లే.. నిర్దేశకులు!
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకోవడంలో దిట్ట. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పచ్చ చొక్కాల పిఫార్సులకు, పైసల సంచులకే పెద్ద పీట వేస్తున్నారు. కడప రిమ్స్ హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్ల నియామకాల్లో కూటమి నేతలు చేసిన పంపకాల బాగోతం, కాంట్రాక్టర్ల వసూళ్ల పర్వం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నిబంధనల ముసుగులో పాతవారిపై వేటు! రిమ్స్ హాస్పిటల్ శానిటేషన్ కాంట్రాక్టును తిరుపతికి చెందిన ’పద్మావతి హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్’ సంస్థ అధినేత భాస్కర్ నాయుడు దక్కించుకున్నారు. ఆయన ఏడు విభాగాల్లో కాంట్రాక్టును కొనసాగిస్తూ.. పాత శానిటేషన్ సూపర్వైజర్లను తొలగించేందుకు పక్కా స్కెచ్ వేశారు. డిగ్రీ అర్హత ఉండాలని, 50 ఏళ్ల లోపు వారికే ఛాన్స్ అంటూ కొత్త షరతులు పెట్టి, అప్పటికే పనిచేస్తున్న దాదాపు 40 మందిని రోడ్డున పడేశారు. తీరా ఆ ఖాళీలను ’ఎల్లో బ్యాచ్’ సిఫార్సులతో భర్తీ చేయడం గమనార్హం. మంత్రిని మించిన ’సూపర్ బాస్లు’.. ఎమ్మెల్యేలకే సింహభాగం! ఈ నియామకాల్లో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కంటే చిత్తూరు జిల్లాలోని ఇద్దరు ’నాయుడు’లే తాము సూపర్బాస్లమని నిరూపించుకున్నారు. సదరు నాయుడు ద్వయం సిఫార్సు చేస్తే వారికి ఒక్కొక్కరికి 3 పోస్టుల చొప్పున కేటాయించిన కాంట్రాక్టర్.. స్వయంగా శాఖా మంత్రి సత్యకుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డిల సిఫార్సులకు మాత్రం రెండేసి పోస్టులు ఇచ్చి సరిపెట్టారు. ఇక కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిఫార్సు చేసిన 11 మందిలో 8 మందిని, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డి సిఫార్సు చేసిన 7 మందిని నియమించి ఎమ్మెల్యేలకే అగ్రస్థానం కల్పించారు. ఎమ్మెల్సీకి ఒకటే.. అధికారులకూ వాటాలు! కూటమిలో ఉన్న మిగిలిన నేతలను, అధికారులను సృప్తి పరిచేందుకు కూడా ఈ పోస్టులను నైపుణ్యంగా పంచారు. ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి సిఫార్సుకు కేవలం ఒకే ఒక్క పోస్టు దక్కగా, రిమ్స్ ప్రిన్సిపల్, హెల్త్ ఇన్స్పెక్టర్ల సిఫార్సులకు ఒక్కొక్క పోస్టు ఇచ్చారు. నిబంధనల ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ను కాదని.. సీఎస్, ఆర్ఎంఓ సిఫార్సులకు ఏకంగా 3 పోస్టులు కేటాయించడం హాస్పిటల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిఫార్సుల పర్వం ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు ఈ శానిటేషన్ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రతినిధులు కాసుల కనకవర్షంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హతలు, సిఫార్సులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ప్రతినిధుల జేబులు నింపితేనే పోస్టింగ్ ఆర్డర్లు చేతికిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబుగారి మార్క్ ’పారదర్శకత’ రిమ్స్ ఉద్యోగాల పంపకాల్లో ఇలా బట్టబయలైందని బాధితులు మండిపడుతున్నారు. కడప రిమ్స్ ఉద్యోగాల్లో పచ్చ నేతల‘పంపకాల’ జాతర! శానిటేషన్ సూపర్ వైజర్ పోస్టులపంపకాల్లో కూటమి నేతల జులుం! ఆరోగ్యశాఖ మంత్రి కంటే‘నాయుడు ద్వయం’ సిఫార్సులకేకాంట్రాక్టర్ పెద్దపీట! నిబంధనల ముసుగులో పాతవారికిఉద్వాసన.. తమ్ముళ్లకు అగ్రతాంబూలం! విద్యార్హతల సాకుతో పాతవారికి ఉద్వాసన.. ’ఎల్లో బ్యాచ్’కు అగ్రతాంబూలం! -
పడిపోయిన ట్యాంకర్ తొలగింపునకు అష్టకష్టాలు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు ఐదో మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్ను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం అగ్నిమాపక, ఐఓసీఎల్, పోలీసు అధికారులు గ్యాస్ ట్యాంకర్ను రెండు క్రేన్ల సాయంతో రోడ్డుపై నిలిపే ప్రయత్నంలో.. క్రేన్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. దీంతో గ్యాస్ ట్యాంకర్ కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఒక క్రేన్ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. పడిపోయిన ట్యాంకర్లో 18 టన్నుల గ్యాస్ నిల్వ ఉంది. ఐఓసీఎల్ అధికారులు రెండు ఖాళీ ట్యాంకర్లు తెప్పించి ఆ ట్యాంకర్ నుంచి గ్యాస్ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ అవుతుందేమోనని అగ్నిమాపక యంత్రాలతోపాటు అవసరమైన పరికరాలను సంఘటనా స్థలంలో సిద్ధంగా ఉంచారు. రెండు ట్యాంకర్లలో 4 టన్నుల చొప్పున 8 టన్నుల గ్యాస్ను పడిపోయిన ట్యాంకర్ నుంచి మార్పు చేశారు. ఇంకా కొద్ది సేపు మార్పు చేసే ప్రయత్నం చేసి, మరో పెద్ద క్రేన్ ద్వారా తదుపరి పడిపోయిన గ్యాస్ ట్యాంకర్ను పైకి లేపే ప్రయత్నాలు చేయనున్నారు. ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు నిలిపేసి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులకు రాకపోకలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో రక్షణ చర్యలు, ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షస్తున్నారు. గువ్వలచెరువు ఘాట్లో ట్రాఫిక్ మళ్లింపు -
న్యాయ సేవలపై అవగాహన
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని సూచనల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ పారా లీగల్ వాలంటరీలకు, ఎన్జిఓలకు కడపలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్, పోక్సో చట్టం–2012, అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటరీల పాత్ర, డ్రెస్ కోడ్, ప్రవర్తన, నీతి ప్రమాణాలు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ 14, 15, 16, 19, 21, 22, ప్రాథమిక విధులు, కుటుంబ చట్టాలు, పిఎన్డిటి చట్టం, డివిసి చట్టంపై తెలియజేశారు. జువైనల్ జస్టిస్ చట్టం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పాత్ర జూనియర్ జస్టిస్ బోర్డు పాత్ర చట్టంతో పిల్లల సంఘర్షణ, మహిళలపై నేరాలు, పారా లీగల్ వలంటరీల విధులు, లీగల్ ఎయిడ్ క్లినిక్ విధులు, నల్సా పథకాలు, ఉచిత న్యాయ సహాయం మొదలైన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, ఎన్జిఓలు, ప్రజలు పాల్గొన్నారు. జూదరుల అరెస్ట్కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో జూదమాడుతున్న 10 మందిని అరెస్ట్ చేసినట్లు చిన్నచౌక్ సీఐ రామకష్ణారెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఎం.జెకుంట, సికేదిన్నె, పెండ్లిమర్రి, చెన్నూరు ప్రాంతాలకు చెందిన వారు జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో కడప ఇన్చార్జి డిఎస్పి బాలస్వామిరెడ్డి ఆదేశాల మేరకు సీఐ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పది మందిని అరెస్ట్ చేశారు. -
టెండర్ల ఆహ్వానం
కడప అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు సంక్షేమ ఫార్మసీకి అవసరమైన ఔషధాల సరఫరా కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏజెన్సీలు తమ సీల్డ్ టెండర్ పత్రా లను ఈనెల 27న ఉదయం 10 నుంచి ఈనెల 30న సాయంత్రం 5:00 గంటల వరకు పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో సమర్పించాలని ఎస్పీ సూచించారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలల్లో మంగళవారం నిర్వహించిన సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలలో 266 మంది విద్యార్థులకుగాను 110 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ పది పరీక్షలకు సంబంధించి 332 మందికిగాను 292 మంది హాజరయ్యారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. కడప అగ్రికల్చర్: రోహిణి కార్తి ఆరంభంలో రెండవరోజు మంగళవారం జిల్లాలో ఎండలు అదరగొట్టాయి. జిల్లాలోని ప్రొద్దుటూరులో 44.3 డిగ్రీల, కలసపాడులో 44.2, జమ్మలమడుగులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైయింది. అలాగే పోరుమామిళ్లలో 43.4, రాజంపేటలో 42.6 , బి.కొడూరు, దువ్వూరులో 42.5, చెన్నూరు, సిద్దవటం, ఎర్రగుంట్లలో 42.4, మైదుకూరులలో 42.3, ఖాజీపేటలో 42, వీఎన్పల్లిలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప అగ్రికల్చర్: కడప నగరంలో మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి వర్షం దంచి కొట్టింది. దాదాపు అరగంట సేపు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మంగళవారం పమగలంతా ఎండతో అల్లాడిపోయిన జనానికి ఈ వర్షం కాసింత ఉపశమనాన్ని కలిగించింది. జమ్మలమడుగు: మున్సిపల్ కమిషనర్ కర్నాటి వెంకట్రామిరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. పట్టణంలోని గంగమ్మ దేవాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న రెండు సెంట్ల భూమి వివాదంలో ఉంది. బాధితులు హైకోర్టును ఆశ్రయించి 2022లో స్టేటస్కో ను తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని కోర్టు సూచించింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ ఆ స్టేటస్కోను బ్రేక్ చేస్తూ పనులు ప్రారంభించారని ఫిర్యాదుదారు గంజికుంట నాగరాజు 2025 అక్టోబర్ 10వ తేదీన ఫిర్యాదు చేయడంతో కోర్టు నోటీసు జారీ చేసింది. బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం దేవస్థానంలోని 50 మంది సిబ్బందికి మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి మంగళవారం యూనిఫాంలు పంపిణీ చేశారు. సాధారణ సిబ్బందికి తెల్ల పంచె–షర్టు, పారిశుధ్య కార్మికులకు కాకీ డ్రస్ కేటాయించారు. సిబ్బంది అందరూ తప్పనిసరిగా డ్రస్కోడ్, ఐడీ కార్డులు ధరించి, భక్తులకు సహకరించాలని మఠాధిపతి ఆదేశించారు. కడప అర్బన్: కడప రిమ్స్ ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2025 సంవత్స రానికి ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. డ్యూటీ అటెండర్, జూనియర్ అసిస్టెంట్,ప్లంబర్ తదితర పోస్టులను భర్తీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జమున పత్రాలు అందజేశారు. -
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే, నేత మధ్య రాళ్లదాడులు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎస్ మాల్ అంశం టీడీపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఎస్ఎస్ షాపింగ్ మాల్లో వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఈ మాల్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రవీణ్ రెడ్డి కలెక్టర్, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదుతో ఎస్ఎస్ షాపింగ్ మాల్లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు వెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రవీణ్ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై రాళ్లదాడి చేశారు.ప్రతిగా ఎమ్మెల్యే వర్గీయులు కూడా రాళ్లు విసిరారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు. -
హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లపై విచారణ
సాక్షి, మదనపల్లె : హంద్రీ–నీవా ప్రాజెక్టు మదనపల్లె సర్కిల్–3లో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాలు, అక్రమ పదోన్నతుల వ్యవహరాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టు ఏడున హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వానికి ఫి ర్యాదులు వెళ్లడం, చర్యలు తీసుకోవాల్సిన సర్కిల్ అధికారులు జాప్యం చేయడంతో ప్రభుత్వ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయ్యాక అక్రమ పదోన్నతులపై ఎస్ఈ నుంచి ఈఎన్సీకి నివేదికలు వెళ్లాయి. అప్పటినుంచి ఈ వ్యవహరంపై విచారణ, చర్యలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి వాస్తవ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం రాయలసీమ రీజియన్ క్వాలిటీకంట్రోల్ చీఫ్ ఇంజనీర్ను విచారణాధికారిగా నియమించింది. దాంతో ఆయన విచారణ మొదలుపెట్టారు. కడపలో విచారణ మదనపల్లె సర్కిల్ పరిధిలో అక్రమ ప్రమోషన్లు పొందిన వారికి విచారణ అధికారి నోటీసులను జారీ చేశారు. ఈనెల 14న జారీచేసిన నోటిసుల్లో ఈనెల 21న కడప సీఈ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని పేర్కొన్నారు. ఆ మేరకు విచారణ నిర్వహించారు. అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు పొందిన వారినుంచి ఉద్యోగ నియామకానికి సంబంధించిన రికార్డులు, నియామకం, పదోన్నతికి సంబందిత ఉత్తర్వులు, విద్యార్హత ధృవీకరణ పత్రాలను పరిశీలించడంతోపాటు వీరికి పదోన్నతులు కల్పించిన ఎస్ఈ ఏవరు, దీనికి సంబంధించి అనుకూలమైన నివేదికలు ఎవరిచ్చారు, ప్రభుత్వ స్థాయిలో అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా పదోన్నతులు కల్పించారు అన్న అంశాలపై విచారణ జరిపినట్టు తెలిసింది. ఇదీ జరిగింది మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో డిప్లొమా (ఈసీఈ)విద్యతో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగికి 2013 మార్చిన ఏడున టెక్నికల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పదోన్నతి ఇవ్వడమేకాక 2022 జూలై ఒకటిన టెక్నికల్ ఆఫీసర్గా మరోసారి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ పొందేందుకు కావాల్సిన విద్యార్హతకు దూర విద్య ద్వారా అభ్యసించేందుకు అనుమతి కోరడంతో ఈ అక్రమ పదోన్నతులు వెలుగుచూశాయి. అలాగే సర్కిల్లోని కుప్పం డివిజన్లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కే.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్లో పని చేస్తున్న పి.ఖాదర్బాషాల విద్యార్ఘతలను పట్టించుకోకుండా పదొన్నతులు కల్పించారు. ప్రయోషన్ పొందాలంటే..నిబంధనల ప్రకారం ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్’ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో అర్హత సాధించాలి. దీన్ని పక్కనపెట్టి ముగ్గురికి టెక్నికల్ అిిసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. వీటిని గుర్తించిన ఈఎన్సీ మదనపల్లె ఎస్ఈకి మెమో జారీ చేశారు. మదనపల్లె సర్కిల్లో ఎస్ఈగా అదనపు బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఎస్ఈ హయాంలో మరికొన్ని అక్రమ ప్రమోషన్లు జరిగినట్టు వెలుగులోకి వస్తున్నాయి. ఐదేళ్లక్రితం పనిచేసిన ఓ ఎస్ఈకి కొన్ని ప్రమోషన్లకు ఆమోదం ఇవ్వాలని ఓ ఉద్యోగి నివేదికలను సిద్దంచేసి ఒత్తిడి చేశారు. నివేదికను పరిశీలించిన ఆ ఎస్ఈ ఇందులో తిరకాసు ఉందని గుర్తించి ఆయన ఈ ఫైల్ను అక్కడితో నిలిపివేశారు. ఒత్తిడి పెరగడంతో అసలు ప్రమోషన్లు ఇవ్వొచ్చో లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆ ఎస్ఈ ప్రభుత్వ అభిప్రాయం కోరడంతో ఈ వ్యవహరం అంతటితో ఆగిపోయింది. అయితే ఆయన బదిలీ కావడంతో ఆ ఉద్యోగి తిరిగి చక్రం తిప్పారు. ఎస్ఈగా అదనపు బాధ్యతలను చేపట్టిన కొత్త ఎస్ఈ సంబంధిత ఉద్యోగి ప్రతిపాదించిన అక్రమ ప్రమోషన్లకు వెనకాముందు ఆలోచించకుండా ఆమోదం తెలిపిన విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది. దీంతో వెలుగులోకి రాని ఈ అక్రమ ప్రమోషన్లపైనా విచారణ జరుగుతోందా లేదా అనేది తెలియరాలేదు. -
గువ్వలచెరువు ఘాట్రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రక్షక్ వాహన సిబ్బంది నరసింహులు బాధితుడిని వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక అధికారులు, ఐఓసిఎల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీకేదిన్నె మండల సీఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించి రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఘటనా స్థలంలోనే ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని ఉంచి మంగళవారం గ్యాస్ ట్యాంకర్ను యథాస్థితికి తీసుకొస్తామని తెలిపారు. కడప కేంద్ర కారాగారంలో ఖైదీ బెదిరింపులుకడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడకు పీడీయాక్ట్ (నిర్భంద) ఖైదీగా వచ్చిన రవి తాను ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను, సిబ్బందిని సోమవారం బెదిరించాడు. వివరాలిలా వున్నాయి. కడప కేంద్ర కారాగారంలో దాదాపు 60 మందికి పైగా నిర్భంద ఖైదీలు (పీడీయాక్ట్) ఉన్నారు. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన వారే 40 మంది ఉన్నారు. ఈక్రమంలో కడప కేంద్ర కారాగారం లోపల మరింత నిఘా పెంచాలని ఈనెల 24వ తేదీన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సాయంత్రం కేంద్ర కారాగారం సిబ్బందిలో ఒకరు పని వద్ద అడ్డు వస్తున్నాడని రవి అనే నిర్భంద ఖైదీని పక్కకు తోయడంతో కింద పడ్డాడు. సోమవారం అందరూ లాకప్ నుంచి బయటకు రాగానే సదరు నిర్భంద ఖైదీ బయటకు వచ్చాడు. కడప కేంద్ర కారాగారం లోపలి ఆవరణలో వున్న చెట్టు పైకి ఎక్కి తాను సిబ్బందిచేత వేధింపులకు గురయ్యానని, దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడే విధులను నిర్వహిస్తున్న సిబ్బంది అతనిని బతిమలాడి కిందకు దించారు.అధికారులు విషయం తెలుసుకుని ప్రధానగేటు వద్ద ఉన్న తమ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ వ్యవహారంపై కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావును వివరణ కోరగా సంఘటన జరగడం వాస్తమమేనన్నారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామన్నారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి సదుం : సదుం మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..సోమల మండలం గురికానివారిపల్లెకి చెందిన రాజశేఖర్ (31) సదుం మండలంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలు దేరాడు. నడిగడ్డ సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి.. రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూధన్ సోమవారం తెలిపారు. గురువారం రాత్రి చైన్నై–అనంతపురం జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనంపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని తెలిపారు. తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు ఎస్ఐ వివరించారు.● చెట్టు పైకెక్కి ఆత్మహత్యకు యత్నం ● కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులుమృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి రాజశేఖర్ మృతదేహం -
దోపిడీని ప్రశ్నిస్తే ఎదురుదాడా?
పులివెందుల :టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీని ప్ర శ్నిస్తే ఎదురుదాడి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో కట్టే బిల్డింగ్ల అద్దాలకు రూ.41వేల కోట్లు అవుతోందని, అదే ఖర్చుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రూ.4వేల కోట్లతో పూర్తవుతాయని తెలిపారు. సోమవారం పులివెందుల పట్టనంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు పులివెందుల మున్సిపల్ ఇన్చార్జిలు వైఎస్ మనోహర్రెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డి, తొండూరు మండల ఇన్ఛార్జి వైఎస్ మధురెడ్డి, పార్లమెంటరీ ఇన్చార్జి అజయ్రెడ్డి, కోఆర్డినేటర్ చల్లా మధుసూదన్రెడ్డి, స్టేట్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి, జోనల్ ప్రెసిడెంట్ భరత్ కుమార్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కల్లూరు నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో స్కేర్ ఫీట్కు రూ.20,400లు ఖర్చు పెడుతున్నారని, అవినీతి, అన్యాయమంటే జవాబు చెప్పరన్నారు. ఆరోగ్యశ్రీ అమలు లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లల సర్టిఫికెట్ల కోసం డబ్బులు కట్టించుకుని మళ్లీ దోచుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే సమాధానం చెప్పరన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు పన్నులను తగ్గిస్తాం.. తద్వారా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం ప్రశ్నించాం, నిరసనలు కూడా తెలియజేశాం. అయినా ముఖ్యమంత్రి కానీ, నాయకులు కానీ సమాధానం చెప్పరన్నారు. ఇక సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు..బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ, 50ఏళ్లు దాటితే ఫించన్, 18ఏళ్ల నుంచి 50ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామన్నారు, ఏ ఒక్క హామీ అమలు కావడంలేదన్నారు. వీటి గురించి ప్రశ్నిస్తే వారు ఎదురుదాడి చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు.మీరు ఇచ్చిన హామిలు అమలు చేయండి, మీరు చేస్తోంది తప్పు అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే వారు దివంగత రాజారెడ్డి గురించి, దివంగత రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడుతారన్నారు. లేకపోతే గొడ్డలి పార్టీ అని అంటారు. అసలు బుద్ధుందా చంద్రబాబూ.. నిజంగా వివేకానందరెడ్డి కేసులో తానే గొడ్డలి తీసుకుని నరికానని దస్తగిరి అనే వ్యక్తి అనేక చానెళ్లలో మీడియా ముందుకు వచ్చి చెప్పారని, అతన్ని నెత్తిమీద పెట్టుకొని మోస్తోంది మీ ప్రభుత్వం, మీ పార్టీ వాళ్లు కాదా అని ఎంపీ ప్రశ్నించారు. ఏ రకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. మీది గొడ్డలి పార్టీ అవుతుందన్నారు.వెన్నుపోటు పార్టీ మీది, మామను వెన్నుపోటు పొడిచి పార్టీని చేజేక్కించుకున్నారని, నైతికంగా మన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దమ్ములేక చేతిలో ప్రభుత్వం, పోలీసులున్నారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసి రగిల్చిందని, జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నానని ఎంపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎల్ఏలు, నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, పరిశీలకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. అమరావతిలో కట్టే బిల్డింగ్ల అద్దాలకు అయ్యే ఖర్చుతో మెడికల్ కళాశాలలు పూర్తి చేయవచ్చు తప్పులను సరిచేసుకోండంటే వాళ్లు రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరే.. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
అధికారుల కనుసన్నల్లో చెయ్యేరు లూటీ
నందలూరు : మైన్స్ అధికారుల కనుసన్నల్లో టీడీపీ పచ్చనేతలు కొందరు చెయ్యేరును లూటీ చేస్తున్నారు. మండలంలోని కుందా నెల్లూరు గ్రామ పంచాయతీ కుమారునిపల్లి ఇసుక క్వారీ చెయ్యేరులో అనుమతులకు విరుద్ధంగా హిటాచీ యంత్రాలతో ఇసుకను టిప్పర్లకు అధిక లోడు చేసి పగలు, రాత్రి తేడా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మామూళ్ల మత్తులో మైన్స్, రెవెన్యూ అధికారులు జేబులు నింపుకొంటున్నారని సోమవారం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇసుక అక్రమరవాణాను అరికట్టాలను స్థానిక పోలీసులకు, తహసీల్దార్ శివలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని గతంలో అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లు, మైన్స్ అధికారులు, సబ్ కలెక్టర్, తహసీల్దార్కు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెయ్యేరులో అనుమతులకు విరుద్ధంగా యంత్రాలతో 15 అడుగుల లోతు వరకు ఇసుకను తోడి టిప్పర్లకు లోడు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా బ్రేక్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సిద్దవరం గోపిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గొబ్బిళ్ల త్రినాథ్, అరిగెల సౌమిత్రి, గుండు మల్లికార్జునరెడ్డి, బయనబోయిన భాస్కర్యాదవ్, ఆకేపాటి జగదీశ్వర్రెడ్డి, అనుదీప్, గీతాల నరసింహారెడ్డి, దండు గోపి, విశ్వనాధరెడ్డి, కళ్యాణ్రెడ్డి, పెనుబాల నాగసుబ్బయ్య, కాకి చంద్ర, అక్కిరెడ్డి మోహన్రెడ్డి, షేక్ షావల్లి, అజీజ్, దాదిరెడ్డి నరసారెడ్డి, మహబూబ్బాషా, ఎముక దుర్గయ్య, బూసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, మంచా మురహరి, విజయుడు, వెంకటయ్య, నాగరాజు పాల్గొన్నారు. -
రామయ్య సన్నిధిలో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో ఆయనకు అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయన వెంట ఒంటిమిట్ట తహసీల్దార్ దామోదర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. విద్యుదాఘాతంతో మామిడితోట దగ్ధంరూ.5 లక్షల ఆస్తి నష్టం బి.కోడూరు : మండల పరిధిలోని అంకనగొడుగునూరు సమీపంలో ఊదు అనితకు చెందిన 5 ఎకరాల మామిడి తోట సోమవారం సాయంత్రం విద్యుదాఘాతంతో నిప్పంటుకుని దగ్ధమైంది. దీంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయారు. విద్యుదాఘాతం కారణంగా తోటలో ఎండు గడ్డికి నిప్పంటుకుని మంటలు వ్యాప్తి చెందాయని కాపాలాదారు తెలిపారు. తోట చుట్టూ మంటలు వ్యాపించడంతో 5 ఎకరాల్లోని మామిడి తోట పూర్తిగా కాలిపోయిందని వాపోయారు. ఉద్యానవన అధికారులు స్పందించి పంటను పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. -
కొత్తజోన్తోనైనా.. డబుల్డెక్కర్ వచ్చేనా?
● తిరుపతి–విశాఖ మధ్య పరుగులు ● దారి మళ్లింపుతో జిల్లావాసులకు తప్పని ప్రయాసరాజంపేట : ముంబై–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపించాలని రైల్వేశాఖ యోచించడం లేదు. కొన్నేళ్ల క్రితం జిల్లా మీదుగా నడిచిన డబుల్ డెక్కర్ కనుమరుగైంది. దారి మళ్లింపు నిర్ణయంతో ఈ పరిస్థితి తలెత్తింది. త్వరలో కొత్తజోన్ కేంద్రంగా విశాఖపట్నం ఏర్పడుతుండటంతో తిరుపతి–విశాఖ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ను కడప వరకు పొడిగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వారానికి మూడురోజులు కాకుండా నిత్యం ఈ రైలును నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కేంద్రంతో జిల్లా రైల్వే ఉద్యోగులు, కార్మికులు అవసరం లేకపోవడంతో ఇప్పుడు డబుల్ డెక్కర్ రైలు పొడిగిస్తే రాకపోకలకు మెరుగైన అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో కాచిగూడ–తిరుపతి మధ్య నడిచిన డబుల్ డెక్కర్ను ఆదాయం రావడం లేదని జిల్లాకు ఈ రైలును దూరం చేశారు. హాల్టింగ్స్ ఇవ్వడంలో సడలింపు లేకపోవడంతోనే డబుల్ డెక్కర్ను ఈ మార్గంలో నడిపించలేకపోయారనే విమర్శలున్నాయి. విశాఖ–తిరుపతి మధ్య నిత్యం రద్దీ ఇప్పటికే విశాఖ – తిరుపతి మధ్య ఉన్న రైళ్లు చాలకపోవడంతో నెల రోజుల ముందే వెయింటింగ్ లిస్ట్ సిద్ధమవుతోంది. దీంతో ఈ మార్గంలో మరిన్ని రైళ్లు నడపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డబుల్డెక్కర్ రైలును ఈ రద్దీ మార్గంలో నడపాలనే దిశగా అడుగులు వేయడానికి కారణమైంది. కడప వరకు పొడిగిస్తే ప్రయాణికులకు ఊరట వారంలో మూడురోజులు తిరుపతి–విశాఖపట్నం(22708) మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు రాత్రి 10 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. రాత్రి తిరుపతిలో 9.40 గంటలకు విశాఖకు బయలుదేరుతుంది. ఈ ఖాళీ సమయంలో కడప వరకు డబుల్ డెక్కర్ను తీసుకొస్తే జిల్లా ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. తిరుపతిలో రాత్రి వరకు.. తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలు రాత్రి వరకు లూప్లైనులో ఖాళీగా ఉంటోంది. దీనిని కడప వరకు పొడిగిస్తే విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని జిల్లా వాసులు కోరుతున్నారు. కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరులో హాల్టింగ్ కల్పిస్తే రాజధానికి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి సోమవారం, గురువారం, శనివారం రోజుల్లో. తిరుపతి నుంచి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో నడుస్తుంది. జూన్ 1 నుంచి ఎసీవోఆర్లో జిల్లా రైలు మార్గంలో విలీనం కావడం వల్ల ఈ రైలు అటు రైల్వే ఉద్యోగులు, కార్మికులతో పాటు విశాఖ, విజయవాడకు వెళ్లేందుకు దోహదపడుతుందనే డిమాండ్ తెరపైకి వచ్చింది.విజయవాడ వెళ్లేందుకు అనుకూలం డబుల్ డెక్కర్ రైలును కడప వరకు పొడిగిస్తే రాజధాని, కొత్త రైల్వేజోన్ కేంద్రానికి వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు జిల్లా మీదుగా పరుగులు తీసిన ఈ రైలును ప్రతి రోజూ నడిపిస్తే విజయవాడ వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వేశాఖ కడపకు పొడిగింపు ప్రతిపాదన చేయాలి. – షమీవుల్లాఖాన్, మాజీ ఏజీపీ, నందలూరురైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి జిల్లా మీదుగా వందేభారత్ రైలు ఇప్పట్లో నడిచే అవకాశాలు కనిపించడం లేదు. తిరుపతి–విశాఖ మధ్య నడిచే డబుల్డక్కర్ను కడప వరకు నడిపించేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి. జిల్లా మీదుగా రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు సరైన రీతిలో రైళ్లు అందుబాటులేవు. ఉన్న తిరుమల గుంతకల్ వరకు పొడిగించడంతో ఆ రైలులో ప్రయాణం కష్టతరం. – డా.బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎంఏ, రాజంపేట -
నిర్ణీత గడువులోగా ఫిర్యాదులకు పరిష్కారం
కడప అర్బన్ : వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 156 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీంతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ● ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 158 కేసులు నమోదు చేసి, రూ. 43,060 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.బక్రీద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి రానున్న బక్రీద్ పండుగ ను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూ సంఘాల ప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామని, సీఐ టి.రెడ్డెప్పను నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఏదైనా సమాచారముంటే 9121100689 నంబర్కు తెలియచేయాలని సూచించారు. బక్రీద్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖకు తమ వంతు సహకారమందిస్తామని సమావేశానికి హాజరైన హిందూ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప ఇన్చార్జి డీఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ విండో ప్రెసిడెంట్పై కేసు
పోరుమామిళ్ల (అట్లూరు) : రిపోర్టర్ను దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడిన పోరుమామిళ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్ కల్లూరి వెంకటకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోరుమామిళ్లకు చెందిన దియ్యాల శ్రీనివాసులు ఓ టీవీ రిపోర్టర్గా (సాక్షి కాదు) పనిచేస్తున్నారు. కల్లూరి వెంకటకృష్ణారెడ్డి ఐదు నెలల కిందట శ్రీనివాసులుకు క్యాలెండర్ ప్రకటన ఇచ్చారు. అందుకు సంబంధించిన డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. శ్రీనివాసులు ఈ నెల 23న కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన దుర్భాషలాడుతూ శ్రీనివాసులుపై కర్రతో దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఏపీ మీడియా ఫెడరేషన్ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షుడు ఆవుల కిశోర్, ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రఘురాములు, నరసింహ, సురేష్బాబు, అన్నిక కిశోర్, కమల్, భాస్కర్రెడ్డి, శ్రీకాంత్, ప్రసాద్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం పోరుమామిళ్ల ఎస్ఐ పి.హనుమంత్ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నువ్వెంత.. నీ బతుకెంత !
● బీటెక్ రవిపై విరుచుకుపడ్డ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ● టీడీపీ దుష్ప్రచారంపై కట్టలు తెంచుకున్న ఆవేశం సాక్షి ప్రతినిధి, కడప: పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మూకలపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవిపై మండిపడ్డారు. ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని తీవ్రస్థాయిలో దునుమాడారు. అజాతశత్రువుగా, సౌమ్యుడిగా పేరుగాంచిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలో ఎన్నడూ లేనంతగా ఆవేశం కట్టలు తెంచుకుంది. సోమవారం పులివెందుల వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ విపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దగా సీఎం చంద్రబాబు జవాబు చెప్పకపోగా, గొడ్డలి పార్టీ అంటూ నిత్యం శ్రేణులకు స్క్రిప్ట్ పంపించి దుష్ప్రచారం చేయడంపై రగిలిపోయారు. అమరావతిలో అవినీతిపై ఆరోపణలు చేస్తే చిత్తశుద్ధితో నిరూపించుకోవాల్సింది పోయి.. వైఎస్ కుటుంబం టార్గెట్గా దుష్ప్రచారం చేయిస్తుండడంపై ఎంపీ ధ్వజమెత్తారు. బీటెక్ రవీ.. నోరు జాగ్రత్త! ‘బైరెటీస్, ఇసుక దోపిడీతో అక్రమార్జన చేస్తున్న నువ్వెంత, నీబతుకెంత...అలాంటి నువ్వు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్త’ అంటూ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, రూ.12కోట్లు ఇవ్వాలని పార్టీలో చేర్చుకోవాలంటూ రాయబేరం నడిపారని ధ్వజమెత్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బీటెక్ రవి సిద్ధహస్తుడని రూఢీ చేశారు. పులివెందుల మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేస్తే ఆప్రాంత ప్రతినిధిగా సీఎం దృష్టికి తీసుకెళ్లి మెడికల్ కళాశాల కొనసాగిస్తే ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంది. అలా కాకుండా రాజకీయ మనుగడ కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్గా చేసుకొని మాట్లాడడం ఏమేరకు సహేతుకమని ప్రశ్నించారు. చేయాల్సిన మంచి పనులు చేయకపోగా వైఎస్ కుటుంబం టార్గెట్గా టీడీపీ వ్యవహరిస్తోన్న తీరుకు ప్రజలు సైతం మండిపడుతున్నారు. శివారెడ్డి హత్య కేసు నిందితులు టీడీపీలోనే... మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి హత్య వైఎస్ కుటుంబమే కారణమని బీటెక్ రవి దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి దేవగుడి కుటుంబంతో ఉన్న ఫ్యాక్షన్ కారణంగా శివారెడ్డి హత్య చోటుచేసుకుంది. జిల్లాలో ఎవర్ని అడిగినా ఇట్టే సమాధానం చెబుతారు. కేసులో ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డితో సహా సోదరులు నిందితులుగా ఉన్నారు. వారంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యులే. పాతతరం నేతలకు జిల్లా వాసులకు ఇదంతా తెలిసిందే. దుష్ప్రచారం కోసం ఎల్లోబ్యాచ్ అండగా ఉన్న నేపఽథ్యంలోనే తెలుగుతమ్ముళ్లు తప్పుడు ప్రచారాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. గురివింద గింజ సామెతను గుర్తు చేస్తూ టీడీపీ నేతలు గుండ్లకుంట శివారెడ్డి, పరిటాల రవీంద్ర హత్యలు తెరపైకి తెస్తున్నారని పలువురు వివరిస్తున్నారు. ఇరువురి హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న దేవగుడి కుటుంబం, జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఉన్న విషయాన్ని గుర్తురెగకపోవడంపై విశ్లేషకులు సైతం నిలదీస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయసాగు విస్తరించాలి
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయసాగు విస్తరించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు సూచించారు. కడప నగరంలోని జిల్లా మహిళా సమైక్య భవనంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏల్నినో ప్రభావంతో ఉన్న పరిస్థితులు అనుగుణంగా రైతులకు తెలియజేసి వాటి తగిన పంటలు వేయించేలా రైతులకు సలహాలు ఇచ్చి ప్రకృతి వ్యవసాయంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సంవత్సరం మన లక్ష్యాన్ని ఽ దృష్టిలో పెట్టుకొని ప్రతి క్యాడర్ కూడా పనిచేయాలని చెప్పారు. ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్వి ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ప్రాజెక్టు మేనేజర్,వసంతకుమారి, ప్రకృతి వ్యవసాయ సిబంది పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు -
ఇంధన ధరల పెంపుతో సామాన్యుడిపై భారం
రాయచోటి అర్బన్: పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేస్తూ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నుల భారం ప్రజలపై మోపడం దారుణమన్నారు. ఇంధన ధఱల పెరుగుదల ప్రభావంతో రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నాయని, దీని వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచారనన్నారు. మే 15న పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.3 చొప్పున పెంచగా, మే 19వ తేదీన పెట్రోల్పై మరో రూ.0.95లు, డీజిల్పై రూ.0.97లు పెంచారని తెలిపారు. మే 23న పెట్రోల్పై రూ.0.97లు, డీజిల్పై రూ.99లు పెంచి, మే 25న పెట్రోల్పై రూ.2.87లు, డీజిల్పై రూ.2.85లు ెపెంచారని వివరించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.10లు వరకు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తూ ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు. వెంటనే ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ -
‘సర్’లో బీఎల్ఏలే కీలకం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డిజమ్మలమడుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్ కార్యక్రమంలో బూల్ లెవెల్ ఏజెంట్లే (బీఎల్ఏ) కీలకమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధ్యక్షతన సర్పై బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో సర్ ద్వారా తొలగించిన ఓట్లతోనే ముఖ్యమంత్రులైన మమతా బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ్మలమడుగు నియోజకర్గంలో దాదాపు 40వేల ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు లక్ష్యంగా కూటమి నాయకులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందువల్ల నిజమైన ఓట్ల కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని, ప్రజలు కూడా వైఎస్సార్సీపీని గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమినేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి: ఎమ్మెల్సీ పీఆర్ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, పరిశ్రమలపై దౌర్జన్యాలకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కూటమి నాయకులు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం జరిగిన బీఎల్ఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కమిటీలు, నాయకులు, బీఎల్ఏలందరూ కలిసి కట్టుగా పనిచేస్తే కచ్చితంగా విజయం వరిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలేదన్నారు. ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకత ఉందని, వారు ప్రజలల్లో ఇంటింటికి తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ, వార్డు స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను పోటీలో నిలబెట్టి తీరుతామన్నారు. అందుకు కార్యకర్తలు నాయకులు సైతం పోటీ చేయటానికి సిద్ధంగా ఉండాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు అజయ్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి, చల్లా మదుసూధన్రెడ్డి, వజ్ర భాస్కర్రెడ్డి, జోనల్ ఇన్చార్జి భరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కడప సెవెన్రోడ్స్ : పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ ఐజే విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవా రంగంలో అర్హులైన వారు హెచ్టీటీపీఎస్://అవార్ుడ్స.జీఓవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈనెల 31వ తేదీలోపు పోస్టుద్వారాగానీ, లేదా స్టెప్ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. వివరాలకు 98494 97011 నెంబరులో సంప్రదించాలని కోరారు. 28వ తేదీ పది పరీక్ష వాయిదా – డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష బక్రీద్ పండగ కారణంగా వాయిదా పడినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు పరీక్షను జూన్ 5వ తేదీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత విషయాన్ని విద్యార్థులు వారి తల్లితండ్రుల గమనించాలని ఆయన కోరారు. ప్రశాంతంగా ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 256 మంది గైర్హాజరయారు. అలాగే సెకండియర్కు సంబంధించి 193 మంది గైర్హాజరయారు. జిల్లాలో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ కేసును నమోదు కాలేదని అధికారులు తెలిపారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతం కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 22 పరీక్షా కేంద్రాలలో 1430 మంది విద్యార్థులకు 1159 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ పది పరీక్షలకు సంబంధించి 376 మందికి 338 మంది హాజరయ్యారు. దీంతోపాటు ఇంటర్కు సంబంధించి 560 మందికి 515 మంది హాజరుకాగా 45 మంది గైర్హాజరయారు.ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈవీఎం గోడౌన్ల పరిశీలన కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను సోమవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ల పరిస్థితిని తనిఖీ చేశామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్–సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్కు నామినేషన్లు కడప సెవెన్రోడ్స్ : దేశవ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన బాలలను ప్రోత్సహించేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–2027 కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారని పేర్కొన్నారు. ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు ఈ జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లు పూర్తయి 18 ఏళ్లు మించని భారతీయ బాలలు ఈ పురస్కారానికి అర్హులని వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను హెచ్టీటీపీఎస్://అవార్డు.జీఓవీ.ఇన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం అధికార వెబ్సైట్ లేదా ఐసీడీఎస్ అఽధికారులను సంప్రదించాలని సూచించారు. కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో ఎర్రగుంట్లలో అత్యధికంగా 42.4 మి.మీ వర్షం నమోదైయింది. అలాగే దువ్వూరులో 28.4, సిద్దవటంలో 26.8, ఖాజీపేటలో 12.2, పెండ్లిమర్రిలో 10.2, సీకేదిన్నెలో 8.6, చక్రాయపేటలో 6.6, వల్లూరులో 5.8, పులివెందుల్లో 5, ప్రొద్దుటూరులో 4.6, చాపాడులో 3.2, వేములలో 3, కమలాపురం, గోపవరంలలో 2.4, మైదుకూరులో 1.2, వీఎన్పల్లిలో 1, సింహాద్రిపురంలో 0.8 మి.మీ వర్షం నమోదైంది. ఎర్రగుంట్లలో కురిసిన కుండపోత వర్షానికి పలు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. -
వాస్తవ వివరాలతో వినతిపత్రాలివ్వండి
కడప సెవెన్రోడ్స్ : గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేస్తున్న తమకు వాస్తవాలతో కూడిన వినతులనే అందజేయాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ప్రజలు, కుల సంఘాలకు సూచించారు. సోమవారం కడప కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ఆయన ప్రజలు, వివిధ సంఘాలు, పార్టీల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.3 ద్వారా, సుప్రీం కోర్టు వివిధ తీర్పుల మేరకు ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు అమలు చేసేందుకు కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు రాజ్యాంగ బద్దంగా, శాసీ్త్రయంగా అధ్యయనం చేయడం కమిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి వాటి ప్రభావాన్ని అంచనా వేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు తాము సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ శ్రీధర్ మాట్లాడారు. బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ హజరతయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్.కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కులగణన నిర్వహించాకే రిజర్వేషన్లు పెంచాలి రాష్ట్రంలో కుల గణన నిర్వహించిన తర్వాతనే బీసీల జనాభా నిష్పత్తి ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు లేట్లపల్లి శివరాం కోరారు. సోమవారం బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రమిచ్చారు. బీసీలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 2011 జనాభా ఆధారంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం 2021 సంవత్సరం ఆధారంగా రాష్ట్రంలో జనగణన జరుగుతోందన్నారు. అందులో కుల గణన నిర్వహించాక స్పష్టమైన, శాసీ్త్రయ బద్దమైన బీసీల జనాభా శాతం తేలుతుందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించే విధంగా ప్రభుత్వానికి సమర్పించే నివేదికల్లో పొందుపరచాలన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు. ● బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి కులాల వారీగా వర్గీకరణ చేయాలని దూదేకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకేసుల బాదుల్లా, డీజీ అక్బర్ అలీలు కోరారు. ● రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున కోరారు. ● రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితా గ్రూప్–ఇలో ఉన్న ముస్లిం వర్గాలను కేంద్ర జాబితాలో చేర్చడం ద్వారా ఓబీసీలుగా ప్రకటించాలని ఏఐసీసీ కో ఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్ కోరారు. 2007 జులై 7న అప్పటి సీఎం వైఎస్సార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన 15 వర్గాలకు చెందిన ముస్లింలను బీసీ–ఈ గ్రూపుగా చేర్చారని పేర్కొన్నారు. కడప కార్పొరేషన్లో బీసీలకు నష్టం అధికారుల అత్యుత్సాహం కారణంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది సీట్లు బీసీలు నష్టపోవాల్సి వచ్చిందని మాజీ కార్పొరేటర్ హరినారాయణ, వైఎస్సార్ సీపీ 21వ డివిజన్ ఇన్ఛార్జి సుబ్బరాయుడు డెడికేషన్ కమిషన్కు వినతిపత్రాన్ని సమర్పించారు. కులగణనలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ జరిగేలా చూడాలని కోరారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా -
పేదలపై పెనుభారం
డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్టానుసారం పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తుండడంతోనే ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. తద్వారా నిత్యావసర వస్తువులు ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన ధరలు తగ్గించాలి. – భానుప్రకాష్రెడ్డి, ఎర్రగుంట్లపల్లె పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. రోజు రోజుకు ధరలు పెంచుతుండడంతో పలువురు డ్రైవర్లు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశంలో డీజిల్, పెట్రోల్పై పన్ను భారం మోపడం తీవ్ర అన్యాయం. – చక్రధర్, పీలేరు -
పది రోజులు..నాలుగు మార్లు..!
● వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజల్ ధరలు ● తాజాగా పెట్రోలుపై రూ. 2.84, డీజల్పై రూ2.86 చొప్పున పెంపు ● వరుస పెంపుదలపై వాహనదారుల ఆగ్రహం కడప వైఎస్ఆర్ సర్కిల్:: కూటమి సర్కార్ హయాంలో పెట్రోలు, డీజల్ మంట భయపెడుతోంది. ఎప్పు డూ లేని తరహాలో కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగుమార్లు ధరలు పెంచడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక రూపాయి...రెండు రూపాయలు కాదు..పెట్రోలు, డీజల్పై ఏకంగా రూ.8 వరకు పెంచుకుంటూ పోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెంచిన ఇంధన ఛార్జీలు తగ్గింపు కోరుతూ కూటమి పార్టీలు మినహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సంకల్పించాయి. ఇంధన ధరలు ౖపైపెకి... జిల్లాలో వాహనదారులపై ఇంధన ధరల పెంపు పెను ప్రభావం చూపనున్నాయి. జిల్లాలో కంటైనర్లు, లారీలు, బస్సులు, జీపులు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దాదాపు ఆరు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతినిత్యం వాహనాలు బయటికి కదలాలంటే పెట్రోలు, డీజల్ అవసరం. తాజాగా ధరల పెంపు కారణంగా పెట్రోలు రూ. 116.66, డీజల్ రూ. 104.38కు చేరుకుంది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండగా, మరోవైపు వాహనాల వినియోగానికి సంబంధించిన ఇంధన ధరలు ౖపైపెకి చేరుకుంటున్నాయి. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే ఇంత భారీగా పెంచుకుంటూ పోవడం వాహనదారులను కుదిపేస్తోంది. జిల్లాలో 242 పెట్రోల్ బంకులు జిల్లాలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్తోపాటు పలు కంపెనీల పరిధిలో 242 బంకులు పనిచేస్తున్నాయి. ఆయా బంకుల ద్వారా రోజుకు డీజిల్ 5.30 లక్షల లీటర్లు, పెట్రోలు 3.30 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇంధన కొనుగోలుపై వాహనదారులకు పెద్ద ఎత్తున వాత పడుతోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు ౖపైపెకే పోతుండడంతో ఆందోళన కలిగించే పరిణామం. కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు వివిధ పద్దుల్లో సుమారు రూ. 8 వరకు పెంచుకుంటూ పోయారు. లీటరుపై సరాసరిన రూ.8 అంటే....ఒక వ్యక్తి వాహనానికి 10 లీటర్ల పెట్రోలు పట్టిస్తే అదనంగా రూ.80 భరించాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో మోదీ మోసం సరే చంద్రబాబు హామీ ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించకపోగా వరుసగా పెంచుతున్నారు. దీంతో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించాలి. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి -
బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్ రెడ్డి హెచ్చరిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.పులివెందులలో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే జవాబు లేదు.మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.నోరు జాగ్రత్తగా పెట్టుకో..ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్ రవి.. వాడు వీడు అనే లెవల్లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్ అలాంటి పనులు చేయనని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం. -
వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది
పులివెందుల: టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వేముల మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ బయపురెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల భాకరాపురంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర కలిగిన పార్థసారధిరెడ్డి తనకు దారుణమైన అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతూ వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తాతను చంపిన వారిని తాను, తన తండ్రి పట్టించుకోలేదని ఇటీవల చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారని, వారిద్దరూ తలచుకుంటే నువ్వు పులివెందుల ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగేవాడివా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత రాయలసీమలో ఎక్కడా ఫ్యాక్షన్ ఉండకూడదని నిశ్చయించుకుని పూర్తిగా రూపుమాపారని చెప్పారు. కర్నూలు జిల్లాలో కాటసాని కుటుంబానికి, బిజ్జల పార్థసారథి కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా వైఎస్ రాజీ కుదిర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ ద్వారా పార్థసారథిరెడ్డి, టీడీపీ నాయకులు రూ.కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. గనుల కోసమే తమ పార్టీ నాయకుడు వేల్పుల రాముపై పార్థసారథిరెడ్డి హత్యాయత్నం చేశాడన్నారు. టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైఎస్ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ వివేకాను చంపాల్సిన అవసరం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయే ముందురోజు వరకు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ గెలుపు కోసం పనిచేశారన్నారు. అసలైన వెన్నుపోటు పార్టీ టీడీపీయేనన్నారు. ఇప్పటికైనా పార్థసారథిరెడ్డి నిరాధారణమైన ఆరోపణలు, ప్రేలాపనలు మానుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వేముల చెరువు నీరు లేకుండా కనపడిందా, ప్రస్తుతం ఆ చెరువు పరిస్థితి ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఎవరేమిటో ప్రజలు గమనిస్తున్నారని, తమతో పోటీ పడాలంటే అభివృద్ధిలో పోటీపడాలన్నారు. పార్థసారథిరెడ్డి ఇకపై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కార్యక్రమంలో వేముల మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి, ఎంపీపీ గంగాదేవి వెంకటనారాయణ, ఎంపీటీసీలు మల్రెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు మదర్సావలీ, రాధాకృష్ణయ్య, డీసీసీ మాజీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, కో–ఆప్షన్ సభ్యుడు మహబూబ్పీరా, వైఎస్సార్సీపీ నాయకులు చలమారెడ్డి, రాజారెడ్డి, చలపతి, నాగభూషణం, గంగాధర్, మల్లారెడ్డి, శ్రీనివాసులు, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
● ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా గోవా మద్యం
● వేకువజామునే తెరుస్తున్నమద్యం షాపులు ● అర్దరాత్రి వరకు నిర్వహించేబార్లు, వైన్ షాపులతోశాంతి భద్రతలకు విఘాతం ● 24 గంటల పాటు విచ్చలవిడిగావైన్ షాపుల్లో అమ్మకాలు ● అడ్డూ అదుపూ లేకుండాఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్న మద్యం ప్రొద్దుటూరు క్రైం: రాత్రి 10 దాటిందంటే చాలు... పాలు దొరకదు.. ఇక కాఫీ..టీ తాగాలంటే తెల్లవారే వరకు ఆగాల్సిందే. అదే ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం మాత్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.. పల్లె.. పట్టణం తేడా మద్యం షాపులు ‘బార్లా’ తెరిచి ఉంటాయి.. ఇదీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు తీరు. అడ్డూ అదుపూ లేకుండా దొరికే ఈ మందు మహమ్మారి అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. జిల్లాలో దాదాపుగా మద్యం షాపులు, బార్లు అధికార కూటమి నేతలవి, వారి బినామీలవి కావడంతో ఎకై ్సజ్, పోలీసు అధికారులు చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. పైగా కొందరు పోలీసు, ఎకై ్సజ్ అధికారులు నెలవారి మామూళ్లు తీసుకోవడంతో ఇక మద్యం వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ● జిల్లాలో 141 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. మద్యం షాపుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించుకునేలా కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే అర్దరాత్రి వరకు బార్లు తెరచి ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసు అధికారులు 11 గంటలకే మూయిస్తున్నారు. వేకువ జామునే మద్యం అమ్మకాలా.. వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ జరిగేది. దీని వల్ల ఖచ్చిత సమయపాలన పాటించేవారు. నాడు ఉదయం 11 గంటలకు వైన్ షాపులు తెరచి రాత్రి 9 గంటలకు మూసేవారు. 9 గంటల తర్వాత తిరిగి మరుసటి రోజు 11 గంటల వరకు బయట ఎక్కడా మద్యం దొరికేది కాదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మంచి నీళ్లైనా దొరుకుతాయో లేదో గానీ మందు మాత్రం ఎంత కావాలన్నా సులభంగా లభిస్తోంది. వేకువజామున 5.30 గంటల నుంచే ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో వైన్ షాపులు దర్శనం ఇస్తున్నాయి. బార్లు కూడా మద్యం షాపులకు పోటీగా ఉదయాన్నే తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం అనుమతిచ్చిన పర్మిట్ రూంలలో నిల్చొని మాత్రమే మద్యం తాగేందుకు వెసులుబాటు ఉంది. అయితే జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో బార్లను తలపించేలా తనివితీరా కూర్చొని తాగేందుకు వసతులు ఏర్పాటు చేశారు. కొన్ని వైన్ షాపుల్లో బార్లను మించిన లైటింగ్ డెకరేషన్, సిట్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. రాత్రి షాపులు మూసిన తర్వాత అక్కడి వాచ్మెన్, నైట్ డ్యూటీ సిబ్బంది ద్వారా ఎమ్మార్పీ కంటే రూ. 20కి అదనంగా మద్యం విక్రయిస్తున్నారు. ఇలా ఉదయం షాపులు తెరిచే వరకు రాత్రంతా మద్యం విక్రయాలు చేస్తున్నారు. గ్రామాల్లో వాడ వాడలా మద్యం అమ్మకాలు జిల్లాలోని అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. అధికార టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ అనధికార విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన మద్యం ధరలతో మందు బాబులు ఇబ్బంది పడుతుండగా వైన్షాపుల్లో కంటే అదనంగా రూ. 20లకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. గ్రామాల్లో అధిక శాతం పేద, బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారు. పగలంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులను రాత్రి అయ్యే సరికి మద్యానికి ధార పోస్తున్నారు. కూలి డబ్బులను ఇంటికి తీసుకుపోకుండా దారిలోనే బెల్ట్ షాపులకు వెళ్లి ఖర్చు చేస్తున్నారు. అఽధికార పార్టీ నాయకులు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను లెక్కచేయడం లేదు. పోలీసు అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే తమ ప్రభుత్వం ఉందంటూ వారిపైనే ఎదురు తిరగబడుతున్నారు. మద్యం మత్తులో గొడవలు జరగడం, చంపుకోవడం లాంటి ఘటనలు నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోటు చేసుకుంటున్నాయి. మద్యమే అన్ని అనర్ధాలకు కారణంగా నిలుస్తోంది. ఇటీవల ప్రొద్దుటూరులోని నెహ్రూరోడ్డులో మద్యం మత్తులో ఒక వ్యక్తి తన తల్లిని ధూషించడానే కారణంతో తన స్నేహితుడినే కత్తితో పొడిచి చంపేశాడు – ఒక వ్యక్తి కొత్తగా కూల్డ్రింక్ షాపు ప్రారంభించాడు. అయితే షాపు ప్రారంభిస్తున్న సందర్భంగా స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చాడు. పార్టీలో మద్యం తాగి ఫుల్ కై పులో ఉన్న స్నేహితులు డబ్బు బాకీ విషయమై గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రాడ్డుతో కొట్టడంతో సొంత స్నేహితుడి తలకు రక్తస్రావమై కింద పడిపోయాడు. రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్, ఈశ్వరెడ్డినగర్, పెన్నానగర్, కేహెచ్ఎం స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో మైనర్లు బ్యాచ్లుగా ఏర్పడి మద్యం తాగుతున్నారు. జిల్లాలోనే ప్రొద్దుటూరుకు వాణిజ్య కేంద్రంగా మంచి పేరుంది. దీంతో అన్ని వ్యాపారాలతో పాటు మద్యం వ్యాపారం కూడా ఇక్కడ జోరుగా జరుగుతుంది. 365 రోజులు బార్లు, మద్యం షాపులు కళకళ లాడుతుంటాయి. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల మద్యాన్ని విక్రయిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో అనేక మార్లు ఎకై ్సజ్ అధికారులు గోవా, హర్యాణా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కారుతో సహా 174 లీటర్ల గోవా మద్యాన్ని ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే అదే నెలలో హర్యాణా రాష్ట్రానికి చెందిన సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారుతో సహా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో శనివారం ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి ప్రొద్దుటూరులో పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్, నందిండ్ల బాషా అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రెండు కార్లు, 750 ఎంఎల్ సామర్థ్యం గల 480 గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
అనంత నిమ్మకు ప్రపంచ గుర్తింపు దిశగా అడుగులు
మదనపల్లె (కురబలకోట) : నోటికి పులుపుతో పాటు ప్రత్యేక రుచి శుచి నాణ్యతకు పేరొందిన అనంతపురం నిమ్మకాయకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చేందుకు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ బౌగోళిక (జీఐ) గుర్తింపు కోసం ధరఖాస్తు చేసినట్లు వీసీ యువరాజ్ ఆదివారం తెలిపారు. ఈ నిమ్మ ఇప్పటికే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఇది చిన్న పండే అయినా తాజాదనం, ఉత్సాహం చురుకుదనానికి ప్రతీకగా భావిస్తారన్నారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా దీనికి విశిష్ట లక్షణాలు ఏర్పడ్డాయన్నారు. అనంతపురంలోని అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మిట్స్ ఐపీఎఫ్సీ, ఆర్ అండ్డీ కీలక పాత్ర వహిస్తున్నాయన్నారు. జీఐ ట్యాగ్ లభిస్తే అనంత నిమ్మకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఆపై మరింత గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.జీఐ ట్యాగ్కు మిట్స్ ధరఖాస్తు -
యువతి అదృశ్యంపై కేసు
చాపాడు : మండల పరిధిలోని చియ్యపాడు దళిత వాడకు చెందిన గొల్లపల్లి నందిని (18) అనే యువతి కనిపించడం లేదని ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కడప సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న నందిని శనివారం నుంచి కనిపించడం లేదని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. వీరపునాయునిపల్లె : స్థానిక పోలీస్టేషన్లో ఆదివారం అదృశ్యం కేసు నమోదైనట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. వివరాలు.. మండలంలోని కొమ్మద్ది గ్రామానికి చెందిన నిమ్మకాయల నరేంద్రరెడ్డి(31) కుటుంబ సమస్యల కారణంగా 19వ తేదీన ప్రొద్దుటూరుకు వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. ఆ రోజు నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లబించకపోవడంతో అతని తండ్రి రమణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 9121100534కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికరాజంపేట : వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందిన బాలరాజు చంద్రశేఖర్రాజు కువైట్ తెలుగు కళాసమితి నూతన అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ విషయాన్ని టీకెఎస్ (కువైట్ తెలుగుసమితి) తెలియచేసింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికై న ఒకే ఒక్కడు చంద్రశేఖర్రాజు కావడం గమనార్హం. ఆయన ఇక్కడి విలేకర్లతో మాట్లాడుతూ తెలుగుభాష సంస్కృతుల వైభవాన్ని యువతరానికి చేరవేయడానికి కృషిచేస్తానన్నారు. గాయపడిన జింకజమ్మలమడుగు : పెద్దముడియం మండలం కల్వటాల గ్రామ సమీపంలో ఉన్న సోలార్ ప్యానల్స్లో దూరి జింకకు తీవ్ర గాయాలయ్యాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న సెక్యూరిటీ మాధవ మునిరెడ్డి తన సిబ్బందితో కలిసి దానిని రక్షించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఫారెస్టు అధికారులు గాయాలైన జింకకు పశుసంవర్థకశాఖ వైద్యులతో వైద్యం చేయించారు. అనంతరం అడవిలో వదిలేశారు. వడదెబ్బతో వ్యక్తి మృతిబద్వేలు (అట్లూరు) : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు చెన్నంపల్లె సమీపంలో ఉన్న జగనన్న కాలనీకి చెందిన జయచంద్ర రాజు (39) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. జయచంద్రరాజు పెయింట్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజు లాగానే ఆదివారం పెయింట్ పని చేసేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని వారు పేర్కొన్నారు. -
జీవాలను ఎత్తుకెళ్లిన దొంగలు
రాజుపాళెం : నూతనంగా నిర్మించుకున్న రేకుల షెడ్డులో కొంతమంది గుర్తు తెలియని దొంగలు జీవాలను ఎత్తుకెళ్లిన సంఘటన రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వెంగళాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కంపమల్ల దావీదు అలియాస్ రవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జీవాల పెంపకం తోడ్పాటు నిస్తుందని భావించి అప్పు చేసి కాలనీ సమీపంలో గాదెగూడూరు గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. అందులో జీవాలతో పాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో 15 పొట్టేళ్లు, ఒక గొర్రె, ఒక మేక, ఒక మేకపోతును శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు చుట్టు ఉన్న కంచెను కత్తిరించి షెడ్డుకు ఉన్న వాకిలి తీసి ఎత్తు కెళ్లారు. రాత్రి రవి అక్కడే నిద్రించాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జీవాలు లేవని రవి గుర్తించాడు. అప్పటి నుంచి ఈ సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు తెలిపారు. ఎస్ఐ ప్రణయ్కుమార్ రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన తీరును బాధితుడు రవిని అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి దొంగలను గుర్తించేందుకు ఎస్ఐ చర్యలు చేపట్టారు. దొంగలు ఎత్తుకెళ్లిన జీవాల విలువ దాదాపు రూ.2,90,000 ఉంటుందని, అలాగే రూ.9 వేలు విలువ చేసే సెల్ ఫోన్ కూడా దొంగలించినట్లు బాధితుడు రవి వాపోయాడు. -
ఆశలు.. అడియాసలు
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. బదిలీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీచర్ల ఆశలపై సర్కార్ నీళ్లు చల్లింది. మేము అధికారంలోకి వస్తే ఏటా బదిలీలు నిర్వహిస్తామంటూ గొప్పలు చెప్పిన మంత్రి ఈ సారికి సర్దుబాటుతో సరిపెట్టాలని నిర్ణయించున్నట్లు తెలిసింది. దీంతో దాదాపు నాలుగు వేల మంది అయ్యవార్ల అశలు అడియాసలయ్యాయి. వేసవి సెలవులు ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. కానీ ఉపాధ్యాయుల బదిలీల ఊసేలేదు. పైగా బదిలీలకు బదులు సర్దుబాటు అనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలని, పాఠశాలల్లో పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను సర్దుబాటు చేయాలని కూటమి సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయుల్లో అందోళన నెలకొంది. జిల్లాస్థాయిలోనే సర్థుబాటు.. జిల్లాల పునర్విభజనతో వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీనియారిటి జాబితా, పాఠశాలల వారిగా విద్యార్థుల సంఖ్య వంటి గణాంకాలను విద్యాశాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది, ఏయే పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు.. అక్కడ ఎంతమంది ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు.. ఇంకా పోస్టులేమైనా అవసరమా.. లేకుంటే మిగిలిన పోస్టులను ఎక్కడ సర్దుభాటు చేయాలి వంటి అంశాలపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం నాటికి సర్ధుబాటు చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. గతేడాది టీచర్ల బదిలీల సమయంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియ మించడంతోపాటు ప్రత్యేకంగా హెచ్ఎం పోస్టు కేటాయించి హెచ్ఎంగా స్కూల్ అసిస్టెంట్ను నియమించారు. ఈ సారి మోడల్ స్కూళ్లలో 40 మంది లోపు విద్యార్థులుంటే అక్కడున్న హెచ్ఎం పోస్టు రద్దు చేయాలని సర్కార్ ఆదేశించింది. సర్దుబాటు క్రమంలో అక్కడున్న హెచ్ఎంను ఎక్కడికి పంపుతారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిలో అందోళన నెలకొంది. నాలుగు వేల మంది ఎదురు చూపు.. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7276 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకే చోట ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంది, అలాగే ఒకే స్కూల్లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు, ఇలాంటి వారు జిల్లాలో దాదాపు నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఆ శలపై ప్రభుత్వం సర్దుబాటు పేరుతో నీళ్లు చల్లింది. బదిలీ అయినా బాధలు తప్పడం లేదు.. గతేడాది బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో 171 మంది ఉపాధ్యాయులు పలు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారికి రిలీవర్ రాకపోవడంతో బదిలీ అయిన స్థానాలకు వెళ్లలేక అక్కడే ఉండి పాత స్థానాల్లో పనిచేస్తున్నారు. దీంతో బదిలీ వచ్చినా లాభం లేదని, ఏడాదంతా కష్టాలు పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మా కష్టాలు తీరుతాయా లేదా అని ఎదురుచూస్తున్నారు. ఈ సర్దుబాటులోనైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం తర్వాతే.. ఉపాధ్యాయులందరూ ఉమ్మడి వైఎస్సార్జిల్లా ప్రాతిపదికన నియామకాలు పొందారు. అదే ప్రాతిపదికన బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ ఈ సారి ప్రభుత్వం కొత్త జిల్లా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సారి నూతన జిల్లా ప్రాతిపదికన బదిలీలకు బదులు సర్దుబాటు చేయనున్నారు. ఈ పక్రియ మొత్తాన్ని జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించినప్పటికి పాఠశాలలు పునః ప్రారంభమైతే కానీ ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పక్కాగా తెలియదు. అందువల్ల పాఠశాలల పునఃప్రారంభం తర్వాతే సర్దుబాటు చేయనున్నారు. సర్దుబాటుతో సరి.. ఈ ఏడాది టీచర్ల బదిలీలు లేనట్లేనా.. కొత్త జిల్లా ప్రాతిపదికన సర్దుబాటుకు సర్కారు అడుగులు? కసరత్తు చేస్తున్న విద్యాశాఖఇంకా గైడ్ లైన్స్ రాలేదు.. ఈ సారి ఉపాధ్యాయ బదిలీలా లేక సర్దుభాటా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఎలా చేయమని చెబితే అందుకు తగ్గ వివరాలను సేకరించి ముందుకు సాగుతాం. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
మొరాయించిన సర్వర్లు.. భక్తులకు ఇక్కట్లు
● బోయకొండలో ఊహించని రీతిలో రద్దీ ● సుమారు 25 వేల మంది హాజరుచౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ఊహించని రీతిలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి సుమారు 25 వేల మంది తరలివచ్చారని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో టికెట్లు పంపిణీ చేసే సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి ఇబ్బందులు పడాల్సివచ్చింది. సర్వర్లు మోరాయించడంతో అధికారులు మ్యాన్యువల్ టికెట్లను పంపిణీ చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతంలో మౌలిక వసతులతోపాటు తాగునీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. కొందరు భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకొని చేతివాటం చూపారు. కూల్డ్రింక్స్, తాగునీటిని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించారు. కోరికలు తీరిన వారు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రసాదాల కౌంటర్లో టికెట్లు లేక ప్రసాదాలు తీసుకోకుండానే నిరాశతో వెనుతిరిగారు.దీంతో ప్రసాదాల కౌంటర్ ఖాళీగా కనిపించింది. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. ఒక్కరోజు ఆదాయం.. రూ:20 లక్షలు బోయకొండ ఆలయం వద్ద వివిధ రకాల సేవా టికెట్ల విక్రయాల ద్వారా ఆలయానికి ఆదివారం రూ:20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాబో యే రోజుల్లో ఏర్పాట్లపై దృష్టిసారిస్తామని చెప్పారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : తొర్రివేముల గ్రామానికి చెందిన అవుల చిన్న వెంకటరెడ్డి (52) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం తొర్రివేముల గ్రామానికి చెందిన ఆవుల చిన్న వెంకటరెడ్డి ఆదివారం సాయంత్రం పట్టణంలోని బైపాస్లో ఉన్న బిజెఆర్ కల్యాణ మండపం సమీపంలోకి వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కూలిన మిద్దెతొండూరు : వైఎస్సార్ కడప జిల్లా మల్లేల గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన వద్ధురాలు రామిరెడ్డి సరోజమ్మ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా మిద్దె కూలి కిందపడింది. శబ్దం విన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భూమిరెడ్డి రవీంద్రారెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారి సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న సరోజమ్మను సురక్షితంగా బయటకు తీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలుమదనపల్లె టౌన్ : బి కొత్తకోట మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుతో పాటు, రోడ్డు పక్కన నిలుచుని ఉన్న మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. బి కొత్తకోట మండలం కోటా వూరు పంచాయతీ కాండ్లమడుగు క్రాసులో కాపురం ఉంటున్న లక్ష్మీదేవి(62) రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, కురబలకోట మండలం ఇరమద్దివారిపల్లి కు చెందిన వరదారెడ్డి(58) పనిమీద బైకులో బి.కొత్తకోటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ లక్ష్మీదేవిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.త్రుటిలో బయటపడిన వృద్ధురాలు -
హార్సిలీహిల్స్అతిథి గృహానికి బ్రిటిష్ పెంకులు
బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను బ్రిటిష్ ప్రభుత్వం వేసవి విడది కేంద్రంగా ప్రకటిసూ్త్ 1869 మే4న జీవోఎంఎస్ నంబర్ 11579 జారీచేసింది. దట్టమైన ఈ కొండంతా రిజర్వ్ఫారెస్ట్ కావడంతో అతిథి గృహం నిర్మాణం కోసం ఈ కొండను కనుగొన్న డబ్ల్యూడి.హార్సిలీ ఉమ్మడి కడపజిల్లా కలెక్టర్ కావడంతో ఆయన మద్రాసు ప్రభుత్వ అనుమతి కోరారు. ఈ వినతికి అనుమతి ఇస్తూ 1869 జూన్ 9న జీవోఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో కొండపై తొలి అతిథి గృహం నిర్మాణం జరిగింది. దీనికి వినియోగించిన పెంకులను హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండపైకి రవాణా చేయించుకున్నారు. ఇంగ్లాండ్లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు వాటిపై వివరాలున్నాయి. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పటి కళ్యాణీ అతిథిగృహంగా పిలుచుకునే గదే తొలి అతిథిగృహం –సాక్షి, మదనపల్లె -
బస్సును ఢీకొన్న బైక్
బి.కోడూరు : మండలంలోని పాయలకుంట్ల పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఎంపీపీ పాఠశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు పట్టణంలోని చాపలవీధికి చెందిన శెశెట్టిసుభాష్ (21) అక్కడికక్కడే మృతిచెందాడు.వివరాల్లోకి వెళితే చాపలవీధికి చెందిన శెశెట్టిసుధాకర్, అనురాధలకు ఇద్దరు కుమారులు. కుటుంబ సభ్యులతో కలిసి పోరుమామిళ్లలోని ఎల్లమ్మ జాతరకు వెళ్లార. జాతర ముగిశాక కుటుంబసభ్యులు కారులో, ఇద్దరు అన్నదమ్ములు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. పోరుమామిళ్ల నుంచి బద్వేలు వస్తున్న ఆర్టీసీ బస్సు రామచంద్రాపురం సమీపంలోని స్పీడ్బ్రేకర్ వద్ద బ్రేకు వేయడంతో వెనుక వైపు ద్విచక్ర వాహనంలో వస్తున్న సుభాష్, శివసాయిరామ్ బస్సును ఢీకొట్టారు. దీంతో సుభాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. శివసాయిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లారు. సుభాష్ అన్నమాచార్య కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శివసాయిరామ్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. లారీ, ద్విచక్రవాహనం ఢీకొని.. మైదుకూరు :మైదుకూరు శివారులో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుపాకుల బ్రహ్మక్క (45) అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త రత్నం, కుమార్తె మేరీ గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం శ్రీరాములపేట పరమేశ్వర నగర్కు చెందిన రత్నమ్మ భార్య కుమార్తెతో కలిసి దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఉన్న చర్చికి ప్రార్థనల కోసం వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వారు తిరిగి వస్తుండగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం వద్ద వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. సంఘటనలో రత్నం భార్య బ్రహ్మక్క అక్కడికక్కడే మృతి చెందింది. రత్నం, కుమార్తె మేరీకి గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేర్చారు.రత్నం పక్కటెముకల వద్ద గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్రహ్మక్క మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం -
అస్మదీయులకు హౌస్బిల్డింగ్ షాపులు !
సాక్షి టాస్క్ఫోర్స్: కడప నగరంలోని ఎన్జీవో కాలనీలో శంకరాపురం పోస్టాఫీసు, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మధ్యలో ఉన్న షాపు రూములను హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు తమకు నచ్చిన వారికి అప్పనంగా అప్పగించేశారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధన మేరకు టెండర్లు నిర్వహించకుండా, వేలం వేయకుండా..రూల్ ఆఫ్రిజర్వేషన్ పాటించకుండా కడప ఎమ్మెల్యే ఆర్. మాధవిరెడ్డి, టీడీపీ రీజనల్ ఇన్చార్జి ఆర్. శ్రీనివాసులరెడ్డి చెప్పారని చెబుతూ మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్, వారి అనుచరులకు అప్పగించినట్లు సమాచారం. టీడీపీలో కొంతమందికి మాత్రమే అన్ని విషయాల్లో ఆర్థికంగా మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సొసైటీలో సభ్యులైన వారికి టెండర్లు లేదా వేలం ద్వారా షాపు రూములు అప్పగిస్తే సొసైటీకీ అదాయం లభించే అవకాశం ఉంది. కానీ సొసైటీలో ఉన్న కీలక సభ్యులు అధికార పార్టీ నేతలతో కుమ్మకై ్క ఇక్కడ ఉన్న ఏడు షాపు రూములను ఒకరికే అప్పగించినట్లు తెలుస్తోంది. ఽఅధికార పార్టీ నేతలు సొసైటీకి నామమాత్రపు లీజు చెల్లించి, వారు మరొకరికి ఎక్కువ ధరకు లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు నిబంధనలను గాలికొదిలేసి అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం ఈ షాపురూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నిబంధనల ప్రకారం షాపులను వేలం ద్వారా కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు హౌస్బిల్టింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకటరెడ్డికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. కడప ఎమ్మెల్యే పేరు చెప్పి వారి అనుచరులకు అప్పగింత ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న ఎన్జీఓ కాలనీ హౌస్బిల్డింగ్ సొసైటీ వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు, ఆరోపణలు -
ముగిసిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో మూడు రోజులుగా జరుగుతున్న మొదటి జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన 954 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్యాడెట్, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ముగింపు వేడుకలలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తైక్వాండో కోచ్లు, క్రీడాకారులు ప్రదర్శించిన ఐస్ క్యూబ్లను పగలగొట్టడం, ఛాతిపై బండలను పగలగొట్టించుకోవడం, జంపింగ్ కిక్స్, నాంచాక్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తనను కలిసిన క్రీడాకారులకు ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ తెలంగాణ క్రీడాకారులు కై వసం చేసుకోగా, ద్వితీయ స్థానంలో తమిళనాడు, తృతీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు నిలిచారు. వ్యక్తిగత ఛాంపియన్ షాప్ను తెలంగాణ క్రీడాకారులు సాధించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మెట్టుపల్లె ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఫైటింగ్ చేస్తున్న క్రీడాకారులు, టాక్టిక్ ఫైటింగ్ విభాగంలో విజేతలుగా నిలిచిన తమిళనాడు క్రీడాకారులకు బహుమతులు అందిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విజేతలకు బహుమతులు అందించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
గాయపడిన మహిళ మృతి
జమ్మలమడుగు రూరల్ : దాడిలో గాయపడిన మహిళ కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందింది. సీఐ నరేష్బాబు కథనం మేరకు.. పట్టణంలోని నాగలకట్ట వీధికి చెందిన లక్ష్మీదేవిపై భర్త వెంకటేశ్వరెడ్డి కుటుంబ సమస్యల కారణంగా గొడ్డలితో దాడిచేయడంతో మహిళ తీవ్రగాయాలపాలైంది. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీదేవి ఆదివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు లోంగిపోయినట్లు తెలిసింది. బావిలో ఈతకు వెళ్లి ..కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో మోడమీద పల్లి సమీపంలో బావిలో ఈతకు వెళ్లి కడపకు చెందిన థామస్(36) మృతి చెందాడు. థామస్ ఆదివారం తన స్నేహితులతో కలిసి మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అందరూ బావి బయట ఉండగా థామస్ బావిలోకి దిగి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఊపిరాడలేదు. అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు థామస్ మృతదేహాన్ని వెలికితీయించి రిమ్స్ మార్చురీకి పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ సంఘటనపై మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు చిన్న చౌక్ ఎస్ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఎరువు దొరికేనా.. ఏరువాక సాగేనా!
కడప అగ్రికల్చర్/కాశినాయన: ఖరీఫ్కు ముందే ఎరువుల ధరలు రైతులను బె‘ధర’గోడుతున్నాయి. ఒకవైపు పంటలు సరిగ్గా పండకపోవడం, మరో వైపు పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లబించకపోవడంతో అన్నదాతలకు వ్యవసాయ సాగు భారంగా మారుతోంది. ఈ తరుణంలో మళ్లీ ఎరువుల ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి తయారైంది. ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న సమయాన కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్జిల్లాలో ఈ ఖరీప్లో దాదాపు 80 వేల హెక్టార్లలో వరి, పత్తి, జొన్న, మినుములతోపాటు పలు పంటలు సాగుకానున్నాయి. దీంతో రైతులపై ఒక్క ఖరీప్ సీజన్లోనే దాదాపు రూ. 15 కోట్లు అదనపు భారం పడుతుంది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఖరీఫ్సీజన్ జూన్ మొదటి వారం నుంచి ప్రారంభంకానుంది. రైతులు దుక్కులు దున్నడం కోసం తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్లో 79,773 హెక్టార్లలో వరి, పత్తి, మినుము, జొన్న, పసుపుతోపాటు పలు రకాల పంటలు సాగుకానున్నాయి. సాగుకు ముందే ఎరువుల ధరలు పెరగడంతో రైతులు అందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీప్ సీజన్లో మోంథా తుపాన్తో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు 1944 హెక్టార్లలో వరితోపాటు పలు పంటలు దెబ్బతిని రూ. 480 లక్షల మేర రైతులకు నష్టం జరిగి రైతులు విలవిల్లాడిపోయారు. ఇందుకు సంబంధించి నెలలు దాటుతున్నా ప్రభుత్వం పంటనష్ట పరిహారాన్ని అందించకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు.గత ఏడాది ఖరీఫ్, రబీ ప్రారంభంలో ఎరువుల ధరల పెంచి నాలుగైదు నెలల వ్యవధిలోనే మళ్లీ పెంచి ప్రభుత్వం రైతులపై భారం మోపింది. ఖరీఫ్ సీజన్ మొత్తం 88 వేల మెట్రిక్ టన్నులు అవసరంగా అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. ఇందులో 40 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరంగా ఉంది. ఎరువుల ధరలు బస్తాకు వివిధ కంపెనీలను బట్టి 50 కిలోల బస్తాపై రూ. 75 నుంచి 350 వరకు ధర పెరగడం రైతుల్లో కలవరం రేపుతోంది. నాడు అందుబాటులో ఎరువులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2019 – 24 వరకు ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులను అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసింది.రైతుల్లో ఆందోళన ఎరువుల ధరలు పెరడంతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. బస్తాకు రూ. 75 నుంచి రూ. 350 వరకు పెంచడం దారునం. పంటలసాగుకు అప్పులు చేసి పంటలను సాగు చేసుకునే పరిస్థితి నెలకొడటంతో రైతులు అందోళన చెందుతున్నారు. – దస్తిగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సాగు ఖర్చులు పెరిగాయి ఎరువుల ధరలతోపాటు కూలి, వ్యవసాయ యంత్రాల బాడుగల ధరలు పెరిగాయి. దీంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. పంట సాగు చేసేకంటే కూలి పనులకు వెళ్లడం నయం అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఎరువుల ధరలు తగ్గించాలి. – పి.జగన్మోహన్రెడ్డి, రైతు, మిద్దెల, కాశినాయన మండలం. పంటలకు గిట్టుబాటు ధర లేదు ఏ పంట సాగు చేసినా గిట్టుబాటు ధరలు లేవు. ఒక వైపు రైతులకు సాగు ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి.గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రభుత్వం ఎరువుల ధరలుపెంచడం దారుణం. గత ప్రభుత్వంలో ఆర్బీకేలోనే ఎరువులను అందించేవారు. –ఎ.రామలక్ష్మిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం మండల అధ్యక్షుడుపంటలసాగు కష్టమే... పెరిగిన ఎరువుల ధరలో పంటలసాగు కష్టంగా మారనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎరువుల ధరలు పెంచారు. కానీ రైతు పండించిన పంటలకు మాత్రం సరైన గిట్టుబాటు ధర కూడా కారవడంతోలేదు. దీంతో సాగు భారంగా మారుతుంది. – నాగేశ్వరెడ్డి, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం ఖరీఫ్ ప్రారంభానికి ముందేరైతులపై ఎరువుల బరువు 20.20.0.13 1450 1800 16.20.0.13 1400 1750 14.35.14 2150 2350 15.15.15 1650 1950 10.26.26 1950 2250 19.19.19 2075 2300 16.16.16 1675 1950 -
ఒక్క ఓటు తొలగించకుండా చూడాలి
సదుం: ‘సర్’ సర్వేలో పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. నియోజవర్గ నేతలతో తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకులు అనర్హులను ఓటర్ల జాబి తాలో చేర్చేందుకు ప్రయత్నిస్తే అభ్యంతరం వ్యక్తం చేయాలన్నారు. కార్యక్రమ ప్రాధాన్యత గుర్తించి సర్వే ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ సమన్వయం చేసుకుని, కష్టపడి పని చేసి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, బూత్ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో భారీగా గోవా మద్యం పట్టివేత
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న రెండు కార్లతో సహా అనంతపురం జిల్లాకు చెందిన ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాలను ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు, కడప ఎన్ఫోర్స్మెంట్, ఈఎస్టీఎఫ్ అధికారులు సిబ్బందితో కలిసి జమ్మలమడుగు రోడ్డులోని చౌటపల్లె సమీపంలో ఉన్న వైఎస్సార్ సర్కిల్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా రెండు కార్లలో పెద్ద మొత్తంలో మద్యం కేసులు ఉన్నాయి. దీంతో సిబ్బంది చుట్టు ముట్టి వాహనాల్లో ఉన్న అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్, నందిండ్ల బాషాలను అరెస్ట్ చేశారు. వాహనాల్లోని 750 ఎంఎల్ కలిగిన 480 గోవా రాష్ట్రం మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లలోని సీట్లను తొలగించి నిందితులు మద్యం సీసాల కేసులను అమర్చారు. నందిండ్ల బాషా గతంలో గోవా రాష్ట్రం నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటంతో ప్రొద్దుటూరు రూరల్, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి తెలిపారు. దాడుల్లో ఇన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠారెడ్డి, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సరస్వతీ నిలయంపై దాడి!
రాజంపేట : నియోజకవర్గంలోని నందలూరు మండలం లేబాక జిల్లా పరిషత్ హైస్కూల్(సర్వసతినిలయం)ంపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో విద్యాసంస్ధలపై కూడా రాజకీయ వర్గ వైషమ్యాలు చుట్టుముడుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. దొంగలు బీరువాలపై తమ ప్రతాపం చూపారు. బీరువాల్లో హైస్కూల్కు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. కొన్ని రికార్డులు కనిపించడంలేదని సమాచారం. హైస్కూల్ హెచ్ఎం రాజేశ్వరి నందలూరు పోలీసులకు పిర్యాదు చేశారు. లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా.. గుర్తుతెలియని వ్యక్తులు హెచ్ఎం కార్యాలయంలో లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బీరువాలను ఉద్దేశపూర్వకంగా పగులగొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనకు కారకులు ఎవరు అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. జంతువుల సంరక్షణ కోసం నోడల్ అధికారి నియామకంకడప అర్బన్ : జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేధమని జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ గోవధ, జంతుబలుల నిషేద చట్టం 1977 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంతువుల సంరక్షణ చట్టాలు సక్రమంగా అమలు చేసేందుకు ఇన్స్పెక్టర్ టి.రెడ్డెప్పను కడప జిల్లా స్థాయి నోడల్ అధికారి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జంతువుల అక్రమ రవాణా, అక్రమ వధ విషయంలో ప్రజలకు సమచారం ఉంటే టి.రెడ్డెప్పకు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9121100689 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలియజేసారు. తల్లీబిడ్డల అదృశ్యంపై కేసు ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన సంపంగి వెంకట శిరీష తన బిడ్డలతో సహా కనిపించకపోవడంతో ఆమె భర్త సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు.ఎస్ఐ మధుసూధన్ సమాచారం మేరకు శిరీష ఈనెల 20వతేదీన ఉప్పలూరు నుంచి తన 7 ఏళ్ల కుమార్తె సుప్రియ, 5సంవత్సరాల కుమారుడు సాయి అభిరామ్తో కలిసి వేసవి సెలవులుకావడంతో అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండలోని తన పుట్టింటికి బయలుదేరింది.అయితే ఆరోజు ఆమె తన పుట్టింటికి చేరుకోకపోవడంతో భర్త సుధాకర్ తన భార్య బిడ్డలకోసం కోసం వెదికాడు. వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.● రికార్డులు మాయం ● లేబాక హైస్కూల్లో ఘటన -
‘బక్రీద్’ను సంతోషంగా చేసుకోండి
శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: ప్రతి ఒక్కరూ ఆచారాల వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకుని,సమాజంపై బాధ్యతగా వ్యవహరిస్తూ బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ నెల 28న జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం కలెక్టరేట్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితర శాఖల అధికారులు, అన్ని మతాల మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువధ శాలల వద్ద ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలన్నారు. అన్ని మతాల ప్రజలు సహనం, సంయమనంతో సంతోషంగా సాంప్రదాయాలను గౌరవించుకుంటూ బక్రీద్ పండుగ ను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్న యువతను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్లాటర్ హౌస్ల వద్ద శానిటేషన్, మంచినీటి సరఫరా చేయాలని,అలాగే అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను చేస్తామని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి హిదాయతుల్లా, ప్రాసిక్యూట్ అడ్మిన్ డీడీ, రెవిన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ, పంచాయతీ శాఖ, ఫైర్ శాఖ అధికారులు జిల్లా అధికారులు,పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతాల మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా జలధార రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో జలధార కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా చేపడుతున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం జలధార–జలహారతి కార్యక్రమంపై జల వనరులశాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చెరువుల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 670 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, ఆయా గ్రామాల జలధార ప్రణాళిక పరిధిలోకి వాటిని తీసుకొచ్చామన్నారు. ఈ మేరకు అన్ని మండలాల్లో జలధార పనులు 60 శాతం మేర గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. -
● పాపం.. సుబ్బలక్షుమ్మ
● బహరైన్లో బతుకు పోరాటం ● మానవత్వం చాటిన వైఎస్సార్సీపీ బహ్రెయిన్ సభ్యులుకడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహరైన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, బహ్రెయిన్ కన్వీనర్ ఓర్సు నాగరాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం బొజ్జవారి పల్లి రాఘవరాజాపురానికి చెందిన తుమ్మలూరు సుబ్బలక్షుమ్మ పది సంవత్సరాలుగా బహ్రెయిన్లో పనిచేస్తున్నారు. 6 నెలల క్రితం అక్కడ రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదానికి గురై కోమాలోకి పోయింది. ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒక అనాథలాగా ఉండేవారు. ఆమె సల్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని కేరళకు చెందిన హాప్ వెల్ఫేర్ అసోసియేషన్, బహ్రెయిన్ సభ్యులు సుబ్బు, సుధీర్, షాజీ తెలుసుకొని వైఎస్సార్సీపీ బహ్రెయిన్ కన్వీనర్ ఓర్సు నాగరాజుకు తెలిపారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. సుబ్బలక్షుమ్మ కోమా నుంచి బయటకు వచ్చినా మాట్లాడలేదని, నడవలేదని వైద్యులు తెలిపారు. ఆమె భర్త చాలా ఏళ్లక్రితమే చనిపోయాడు, పిల్లలు, అమ్మనాన్నలు, అన్నదమ్ములు లేరు. ఆమెను ఇండియా పంపడానికి ప్రయాణ ఖర్చులు భారత రాయబార కార్యాలయం ఇస్తుంది. ప్రతినెలా అయ్యే ఖర్చు బహ్రెయిన్ కమిటీ సభ్యులు భరిస్తారని తెలిపినా ఆమెను చూసుకునేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదని తెలిసింది. ఆమె దీన స్థితిని చూసి చలించిపోయిన నాగరాజు మహిళా కార్యకర్తలతో ఆమెకు భోజనం తినిపిస్తూ, బిగుసుకుపోయిన కాళ్లు, చేతులకు ప్రతిరోజూ ఆయిల్ మసాజ్ చేయించారు. వారి సేవలతో ఆమె కాస్తా మాట్లాడే స్థితికి వచ్చారు.ఇటీవల వైఎస్సార్సీపీ సర్వసభ్య సమావేశానికి వెళ్లినప్పుడు ఆ పార్టీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కో కన్వీనర్ గోవిందు నాగరాజు ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆమెను పరామర్శించి, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్చాలని ప్రయత్నాలు చేశారు. చివరకు వైఎస్సార్ కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, తిప్పలూరు గ్రామ సమీపంలో ఉన్న ఎద్దుల పెద్ద శేషమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఏ. నాగేంద్ర ఆమెను ఆశ్రమంలో చేర్చుకునేందుకు అంగీకరించారు. ప్రతి నెల ఆమెకు అయ్యే ఖర్చులను నాగరాజు ద్వారా ఎద్దుల పెద్ద శేషమ్మ ఫౌండేషన్కు అందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ మాట్లాడుతూ సుబ్బలక్షుమ్మను ఆదుకోవాడానికి ముందుకు వచ్చి సేవలు చేసిన బహ్రయిన్ కన్వీనర్, కమిటీ సభ్యులు, భారత రాయబార అధికారులు, హాఫ్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
శ్మశాన స్థలం కబ్జా
కలసపాడు : ఖాళీగా కనిపించిన స్థలాలను ఆక్రమించే కబ్జాదారులు శ్మశానాలను కూడా వదలడం లేదు. మండల పరిధిలోని పిడుగుపల్లె గ్రామానికి చెందిన శ్మశానస్థలం కబ్జాకు గురైంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిడుగుపల్లె గ్రామ రెవెన్యూ పొలం 1439/1 లో సుమారు 30 సెంట్ల స్థలాన్ని గ్రామస్తులు శ్మశానానికి ఉపయోగిస్తున్నారు. గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించి కార్యక్రమాలన్నీ అక్కడే పూర్తి చేసుకునేవారు. అయితే ఇటీవల గ్రామానికి చెందిన గంటావెంకటరామిరెడ్డి, క్రిష్ణారెడ్డిలు తమ పొలానికి పక్కన ఉన్న 30 సెంట్ల శ్మశాన స్థలంపై కన్నేసి ఆక్రమించారు. గ్రామస్తులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినప్పటికీ రెవెన్యూ అధికారులు తగిన రీతిలో స్పందించకపోవడంతో ఆక్రమణదారులు రాత్రికి రాత్రే కంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. 1439 సర్వే నంబరులో గతంలో గంటారామిరెడ్డికి పట్టాలు మంజూరయ్యాయి. వారికి మంజూరైన స్థలం వారి ఆఽధీనంలోనే ఉండగా 30 సెంట్ల శ్మశాన స్థలం ఖాళీగానే ఉండేది. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి 30 సెంట్లు శ్మశానస్థలంగా తేల్చారు. అయినప్పటికీ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇటీవల గ్రామానికి చెందిన నాగిరెడ్డిఆదిలక్ష్మి మరణించగా అంత్యక్రియలు చేసేందుకు శ్మశానస్థలం లేక రోడ్డు పక్కనే చేయాల్సి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న శ్మశానం ఆక్రమణకు గురికావడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకుని శ్మశాన స్థలాన్ని కాపాడాలని పిడుగుపల్లె గ్రామ ప్రజలు కోరుతున్నారు.చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు -
కేవీకేలో ముగిసిన శిక్షణ
కడప ఎడ్యుకేషన్ : పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది పాత్ర కీలకం అని కేవీకే అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త శిల్పకళ అన్నారు. కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రెండో బ్యాచ్ కింద వంటవారు, సహాయకులు, కిచెన్ మేనేజర్లకు ‘‘స్మార్ట్ కిచెన్ మేనేజ్మెంట్’పై ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శనివారంతో ముగిసింది. వ్యక్తిగత పరిశుభ్రత, వంటగది శుభ్రత, వంటకు ముందు ముడి పదార్థాల శుభ్రపరిచే విధానాలు, పోషక విలువలు కోల్పోకుండా కూరగాయలను కట్ చేసే శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం చింతకొమ్మదిన్నె స్మార్ట్ కిచెన్ను సందర్శించారు. కార్యక్రమంలో నాబార్డు ప్రాజెక్టు పరిశోధన సహాయకురాలు కుమారి యం.జంభావి, కేవికే శాస్త్రవేత్తలు టి. మహేష్ బాబు, కె. సాయి మహేశ్వరి, ఎస్. మానస, ఐ. సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గాయపడిన వ్యక్తి మృతిపెండ్లిమర్రి : మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య(38) కత్తి పోటుకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తిరుపతిలో మృతి చెందాడు. శనివారం మృతదేహానికి కడప రిమ్స్లో పోస్టుమార్టం చేశారు. పోలీసుల కథనం మేరకు వెల్లటూరు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటశివలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈనెల 14వ తేదీ రాత్రి వెంకట శివ.. వెంకట సుబ్బయ్య ఇంటికి వెళ్లి తలపై కత్తితో గాయపరిచాడు. అతనిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. వైద్యుల సూచనల మేరకు తిరుపతి అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అప్పట్లో ఘర్షణ కేసుగా నమోదు చేఽశాం. ప్రస్తుతం వ్యక్తి మృతిచెందడంతో హత్య కేసుగా మార్చామని ఎస్ఐ తులసి నాగప్రసాద్ తెలిపారు. -
వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు
పులివెందుల : దివంగత వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కొనియాడారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధులతోటలో దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ సమాధుల వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.వైఎస్ రాజారెడ్డికి వైఎస్ విజయమ్మ నివాళి -
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజారెడ్డి
పులివెందుల టౌన్ : పులివెందుల ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజారెడ్డి అని మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయంలో దివంగత నేత, వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్దంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్పలతో కలిసి వైఎస్ రాజారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ పెద్దాయన వైఎస్ రాజారెడ్డి పేదలకు, తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచేవారన్నారు. వైఎస్ రాజారెడ్డి చిరస్మరణీయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిశోర్, నూర్ బాషా సంఘ రాష్ట్ర నాయకులు రసూల్, రాష్ట్ర బూత్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, మాజీ కో.ఆప్షన్ చంద్రమౌళి, నాయకులు సోపాల వీరా, యార్వ వెంకటసుబ్బయ్య, పద్మనాభ రెడ్డి, వీరారెడ్డి, సంపత్, రవి, మస్తాన్, కనక, కోళ్ల భాస్కర్, కృష్ణమూర్తి, ఫైర్ రామకృష్ణ, తోటం శెట్టి హరి, బీసీ నాయకులు కార్తీక్, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూమన కరుణాకర్రెడ్డి నివాళి పులివెందుల రూరల్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పట్టణంలోని స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అక్కడే ఉన్న ఇతర వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద కూడా ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజారెడ్డి బాటలో తాను మొదటి నుంచి నడిచానన్నారు. దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడంలో వైఎస్ రాజారెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. -
విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ముందుండాలి
కడప ఎడ్యుకేషన్ : తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో ఎన్సీసీ క్యాడెట్లు ముందుండాలని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ హరిప్రసాద్ అన్నారు. కడప తెలుగుగంగ కాలనీలో 30 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం విపత్తు నిర్వహణపై ఎన్సీపీ క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి, బాధితులను ఆదుకోవడానికి యువతను సిద్ధం చేయడమే ‘యువ ఆపద మిత్ర’పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఎన్సీసీ క్యాడెట్లు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. 30వ అంధ్రా బెటాలియన్ కమాడింగ్ అధికారి కల్నర్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రథమ చికిత్స, సురక్షిత తరలింపు విధానాలు, విపత్తు సమయంలో కమ్యూనికేషన్, సహాయక చర్యల నిర్వహణపై క్యాడెట్లకు శిక్షణ ఇచ్చిటన్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ లలిత్ బాబు, డాక్టర్ నీలయ్య, క్వార్టర్ మాస్టర్ లెఫ్టినెంట్ నాగశేషాద్రి, ట్రైనింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్ సురేంద్ర నాయక్, ఎన్సీసీ అధికారులు జయచంద్ర బాబు, చిరంజీవి, శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు. -
బీసీల కులగణనను పక్కాగా నిర్వహించాలి
రాయచోటి టౌన్: బీసీల కులగణనను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇడగొట్టు నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డెడికేటేడ్ కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో గృహ గణన ఫార్మేట్లో ఓబీసీల గృహ గణన లెక్కించే కాలమ్ లేకపోవడం సరికాదన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలు బీసీ కుల గణనతో సహా అన్ని స్థాయిల పాలన కేంద్రాలలో నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు. సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఆలయ నిర్వా హకులు విశేష ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం అశ్వ వాహనం, సోమవారం గజవాహనం, మంగళవారం హంస వాహనంపై మల్లమ్మ ఉత్సవ విగ్ర హాన్ని ఊరేగించనున్నారు. రాయచోటి: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయచోటి మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును శనివారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తనిఖీలను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. రాయచోటి ఆర్డీఓ ఎ శ్రీనివాస్, తహశీల్దార్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాటనీ పరీక్ష ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం బాటనీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 491 మందికి 438 మంది హాజరయ్యారు. సెకండియర్కు సంబంధించి 808 మందికిగాను 749 మంది హాజరయ్యారు. కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–హుబ్లి–తిరుపతి, అర్కోణం–కడప–అర్కోణం మధ్య నడు స్తున్న డెమో, ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దుచేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి–హుబ్లీ (57401) ఈనెల 23, 24, 30, 31 తేదీలలో, హుబ్లి–తిరుపతి (57402) 24, 25, 30, 31 తేదీలలో, అర్కోణం–కడప (66001) 23, 24, 30, 31, కడప–అర్కోణం (66006) 23, 24, 31 తేదీలలో రద్దు చేశా రన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారన్నారు. ప్రయాణికులు ఈ విష యాన్ని గమనించి ఆయా రోజుల్లో ప్రత్యామ్నా య మార్గాలను చూసుకోవాలని ఆయన కోరారు. కడప ఎడ్యుకేషన్: ప్రముఖ అంతర్జాతీయ చాక్లెట్ తయారీ సంస్థ ’మాండలేజ్’ (కాడ్బరీ–శ్రీసిటీ) లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26న కడపలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. ఐటీఐ (2 ఇయర్స్ కోర్సు) పాసైన పురుషులు మాత్రమే అర్హులని, వయస్సు 18 నుండి 22 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఐటీఐలో కనీసం 50% మార్కులు ఉండాలని, వేతనం నెలకు రూ. 19,500 తో పాటు ఇతర అలవెన్సులుంటాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 26న ఉదయం 9:30 గంటలకు కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐ ప్రాంగణానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రెజ్యుమెతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు, శ్రావణ్ కుమార్ మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్కి సమర్పించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాక్షి, మదనపల్లె: స్థానిక డిస్కం డివిజన్ కార్యాలయంలో ఆదివారం వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గంగాధరం శనివారం తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్ కార్యాలయ కౌంటర్లలో సిబ్బంది విధుల్లో ఉంటారని బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. కడప అగ్రికల్చర్: పంటల సాగులో రైతువాణి పుస్తకం దిక్సూచి వంటిదని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు అన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన రైతు వాణి పుస్తకాన్ని శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు, మార్కెటింగ్ సౌకర్యం, ఎరువులు విత్తనాలు పురుగుమందులు అన్ని రకాల పంటలకు సంబంధించిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయయన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య బి. దస్తగిరి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
పుడమికి ఆరోగ్యం
బహుధాన్య హారం..కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా సాగు భూముల సంరక్షణే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయ విభాగం, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ‘బహుధాన్యాల సాగు’ విప్లవానికి శ్రీకారం చుట్టా యి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటంతో జిల్లాలో భూములు నిస్సారమవుతున్నాయి. ఈ పోషకాల అసమతుల్యతను అరికట్టి, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ఏడాది ఖరీఫ్కు ముందే 40 మండలాల పరిధిలో 77,774 హెక్టార్లలో పచ్చిరొట్ట సాగును లక్ష్యంగా నిర్దేశించారు. 15.67 కిలోల కిట్.. 29 రకాల విత్తనాల వైవిధ్యం: రైతులకు పంపిణీ చేస్తున్న ప్రతి బహుధాన్య కిట్ బరువు 15.67 కిలోలు. ఇందులో 10 వృక్ష కుటుంబాలకు చెందిన 29 రకాల విత్తనాలను (తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు) మేళవించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బయో రీసోర్స్ సెంటర్ల ద్వారా అధికారులు మొత్తం 46,280 కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటికే 31,548 మంది రైతులకు 44,412 కిట్లను పంపిణీ చేశారు. అన్నదాతలు ముందస్తు వర్షాల తేమతో ఇప్పటివరకు 38,727 ఎకరాల్లో ఈ సాగును విజయవంతంగా ప్రారంభించారు. జూలై చివరి వరకు ఈ విస్తీర్ణం మరింత పెరగనుంది. ఎల్నినో ముప్పుకు బ్రేక్ ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో ఈ సాగు రైతులకు రక్షణ కవచంగా మారనుంది. పోషకాల గని: భూమిలో స్థూల, సూక్ష్మ పోషకాలు పెరిగి, సేంద్రియ కర్బనం వృద్ధి చెందుతుంది. తేమ సంరక్షణ: నేల గుల్లబారి, వర్షపు నీటిని ఎక్కు వ రోజులు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. చీడపీడల నివారణ: జీవవైవిధ్యం వల్ల ప్రధాన పంటలకు చీడపీడల ముప్పు తప్పుతుంది. పశుగ్రాసం లభ్యత: అరకొర వర్షాలకే తట్టుకునే ఈ పంటలు పశువులకు మేలైన దాణాగా ఉపయోగపడతాయి. పంట ఎదిగిన తర్వాత భూమిలోనే కలియదున్నడం వల్ల అవి త్వరగా కుళ్లిపోయి, మేలైన సేంద్రియ పదార్థంగా మారి వేరు వ్యవస్థను దృఢపరుస్తాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్రగాయాలు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరం ఎస్బీఐ ఏటీఎం సమీపంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్లో వెళుతున్న ఇద్దరు యువుకలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు..మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని దిగువ వీధికి చెందిన సాధక్(26), రఫీ(28) కడపలో భవన నిర్మాణ పనులు ముగించుకుని మధ్యాహ్నం బైక్లో ఒంటిమిట్టకు బయలుదేరారు. కడప–చైన్నె రహదారి పైకి రాగానే గుర్తుతెలియని వాహనం అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో సాధక్, రఫీలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని గాయపడిన యువకులను కడప రిమ్స్కు తరలించారు. రఫీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. లారీ ఢీ కొని యువకుడికి.. ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంటపంపల్లి సమీపంలో ఉన్న కడప– చైన్నె జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళుతున్న జశ్వంత్(22) అనే యువకుడిని లారీ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు..రాచగుడిపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ రాజంపేట నుంచి బైక్ పై ఒంటిమిట్టకు వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన జశ్వంత్ ను కడప రిమ్స్కు తరలించారు. -
● పంట నష్టం అంచనా రూ. 2.31 కోట్లు: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
పులివెందుల/లింగాల: రైతులపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. పెనుగాలులకు అరటి తోటలు నిలువునా నేలకొరుగుతున్నా ఆదుకుందామన్న ధ్యాసే లేకుండా పోయింది. ఒకవైపు అకాల ఈదురు గాలుల వల్ల వందలాది ఎకరాలలో అరటి తోటలు సర్వనాశనమై, ప్రతి ఎకరాకు లక్షలాది రూపాయల భారీ నష్టం వాటిల్లితే.. మరోవైపు వాతావరణ కేంద్రాలలో గాలి వేగం రికార్డు కాకపోవడాన్ని సాకుగా చూపిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు నిలువునా ద్రోహం చేస్తున్నాయి. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పనిచేయకపోవడం, సాంకేతిక లోపాల వల్ల గాలి వేగం నమోదు కాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అన్నదాతలకు అందాల్సిన హక్కుగా రావాల్సిన బీమా సొమ్మును నిలిపివేయడం ఏమాత్రం సబుబు కాదని ఇటు రైతాంగం, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. మళ్లీ అదే కథ.. రికార్డుల నమోదులో దొంగదెబ్బ! తాజాగా గురువారం రాత్రి సంభవించిన ప్రకృతి విపత్తులో వేలాది ఎకరాల్లో అరటి చెట్లు విరిగిపడినా, వాతావరణ కేంద్రాల గాలి వేగం రికార్డులు పరిశీలిస్తే సాంకేతిక డొల్లతనం మళ్లీ బయటపడింది. లింగాల వాతావరణ కేంద్రంలో గాలి వేగం గంటకు సగటున కేవలం 21 కిలోమీటర్లుగా నమోదైంది. ఇప్పట్ల గ్రామానికి సంబంధించిన వెదర్ స్టేషన్లో రికార్డు ‘నాట్ ఆప్లికేబుల్’ అని తేలింది. మురారిచింతల గ్రామంలో అసలు గాలి వేగమే రికార్డు కాలేదు. తోటలు కళ్లముందే నేలమట్టమైనా, ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల వాతావరణ రికార్డులలో గాలి వేగం తక్కువగా నమోదు కావడం లేదా అసలు నమోదు కాకపోవడం వల్ల ఈసారి కూడా రైతులకు బీమా సొమ్ము అందకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది కలెక్టర్ లేఖ రాసినా మారని పరిస్థితి! గడిచిన ఏడాది కూడా ఇదే తరహాలో భారీ వాతావరణ విపత్తు జరిగినప్పుడు, కలెక్టర్ స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఇఫ్కో టోక్యో ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక అధికారిక లేఖ రాశారు. వాతావరణ కేంద్రాలలో గాలి వేగం నమోదు కాలేదు తప్ప, ఇందులో రైతు తప్పిదం ఏమాత్రం లేదు కాబట్టి రైతులకు పంటల బీమా చెల్లించాలని కలెక్టర్ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా అదే దుస్థితి నెలకొంది. వెదర్ స్టేషన్లు పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం, స్టాటిస్టిక్స్ అధికారులు, పంటల బీమా సంస్థలదే తప్ప రైతులది కాదని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం దిగిరాకుంటే ‘మెడలు వంచుతాం’ : ఎంపీ అవినాష్రెడ్డి ఈ ఏడాదికి సంబంధించి నిన్న జరిగిన నష్టానికి కూ డా వెదర్ స్టేషన్ల వైఫల్యాన్ని సాకుగా చూపకుండా, ప్రభుత్వం ముందుకు వచ్చి ‘ఇన్పుట్ సబ్సిడీ’తోపాటు పంటల బీమా కూడా నష్టపోయిన ప్రతి రైతుకు చెల్లించాలని ఎంపీ అవినాష్రెడ్డి గట్టిగా డిమాండ్ చే శారు. అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రైతుల పొట్టకొట్టొద్దని హితవు పలికారు. బాధి త రైతులకు పరిహారం చెల్లించని పక్షంలో, కూటమి ప్రభుత్వం మెడలు వంచేవరకు రైతుల పక్షాన వైఎస్సా ర్సీపీ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అన్నదాతలకు న్యాయం చేయడం కోసం అవసరమైతే కోర్టుల ద్వారా న్యాయ పోరాటానికైనా తాము వెనుకాడబోమని అధికార పార్టీని గట్టిగా హెచ్చరించారు. పులివెందుల రూరల్.. నల్లపురెడ్డిపల్లెలో ఈదురుగాలులకు నేలకొరిగిన అరటి చెట్లు (ఫైల్)మురారిచింతలలో దెబ్బతిన్న అరటి తోటను పరిశీలిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపులివెందుల/లింగాల: ఇటీవల సంభవించిన అకాల ఈదురు గాలుల వల్ల నిలువునా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రతి ఎకరాకు యుద్ధప్రాతిపదికన ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా చెల్లించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన జిల్లాలోని లింగాల, ఇప్పట్ల, మురారిచింతల తదితర పంట నష్టపోయిన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, నేలమట్టమైన అరటి తోటలను స్వయంగా పరిశీలించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న అన్నదాతలను పరామర్శించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. GMýS-Æ>MýS$ ₹6 ÌS„ýSÌS ¿êÈ ¯]lçÙt…: అన్నదాతల కన్నీళ్లు ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ, నీళ్ల సమస్య, గిట్టుబాటు ధర లేమి వంటి ఎన్నో సవాళ్లను అధిగమించి కష్టపడి పంట పండిస్తే.. ప్రకృతి కన్నెర్ర చేసి రైతుల నోటి ముద్దను లాగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం టన్ను అరటి రూ. 25,000 పలుకుతోందని, ఎకరాకు సగటున 20 నుంచి 30 టన్నుల దిగుబడి వచ్చే తరుణంలో తోటలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు భారీ నష్టం వాటిల్లిందని, దాదాపు 2,000 ఎకరాల్లో పంట దెబ్బతిని రైతాంగం కోలుకోలేని స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెదర్ స్టేషన్లు పనిచేయకపోవడంతోరైతులకు నష్టం లింగాల, ఇప్పట్ల, మురారిచింతలలోరికార్డు కాని గాలి వేగం అధికారులు, బీమా సంస్థల తప్పుకు రైతులకు అన్యాయం కళ్లముందే తోటలు ధ్వంసం..రికార్డుల్లో మాత్రం ‘సున్నా’ సర్కారు మెడలు వంచుతాం:ఎంపీ అవినాష్రెడ్డి కడప అగ్రికల్చర్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, హోరుగాలులకు జరిగిన పంట నష్టంపై అధికారులు పరిశీలించి సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి పంపించామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వలన జరిగిన పంట నష్టంపై శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ఉద్యాన శాఖలకు సంబంధించిన సిబ్బంది పంట నష్టం అంచనా వివరాలను మరింత పకడ్బందీగా చేసి తుది పంట నష్టం వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. 6 హెక్టార్లలో వరి పంట నష్టం.. వ్యవసాయ శాఖకు సంబంధించి ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం, సాలాబాద్ గ్రామాలలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినిందని, ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 6 హెక్టార్లలో వరి పంట నేలకూలి 8 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో భారీగా దెబ్బతిన్న ఉద్యాన పంటలు ఉద్యాన పంటలకు సంబంధించి జిల్లాలో పులివెందుల,లింగాల, వేముల,వేంపల్లి,సింహాద్రిపురం తదితర మండలాల్లోని ఉద్యాన పంటలు 665.6 హెక్టార్లలో 705 మంది రైతులకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా అరటిపంట 630 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని పంట నష్టం అంచనా సుమారు 2 కోట్ల 31 లక్షలుగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా అని వెల్లడించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
‘వేల ఎకరాల్లో నష్టం.. రైతుల్ని వెంటనే ఆదుకోవాలి’
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. లింగాల మండలంలోని గురువారం రాత్రి కురిసిన గాలి వానకు దెబ్బతిన్న అరటి పంటలను ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) ఎంపీ అవినాష్ పరిశీలించారు. దీనిలో భాగంగా ఎంపీ అవినాష్ మాట్లాడుతూ.. ‘పులివెందుల నియోజకవర్గంలో ఈనెల 21న వీచిన గాలివానకు భారీ ఎత్తున అరటిపంట నష్టం వాటిల్లింది. లింగాల, పులివెందుల, వేముల మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నేల కూలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2వేల ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయి. ఇప్పటికే రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఓ వైపు సాగునీటి సమస్య...మరో వైపు గిట్టుబాటు ధరలు దొరకడం లేదుఅన్నిటినీ అదిగమించి మంచి దిగుబడి సాధించిన పకృతి ప్రకోపంతో వేల ఎకరాలు నేలకూలాయి. ఫలితంగా రైతుల కష్టం మొత్తం వృథా అయిన పరిస్థితి నెలకొంది. ఈ రోజున్న అరటి రేటుతో లెక్క కడితే ఎకరాకు 5లక్షల నుంచి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.ఇలా 2వేల ఎకరాల్లో పంట నష్టం అంటే ఎంత భారీ నష్టం జరిగిందో అందరూ గమనించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇటువైపు చూసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ పంటల బీమాను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.గత ఏడాది మార్చిలోనూ ఇలానే గాలివానకు భారీగా అరటి పంటకు నష్టం చేకూరింది. అరటికి బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ స్టేషన్లలో గాలివేగం నమోదును బట్టి ఉంటుంది. ఆ గాలి వేగం ఎంత ఉందో లెక్కిద్దామంటే ఆ వెదర్ స్టేషన్లు అసలు పనే చేయడం లేదు. అప్పట్లో నష్టపోయిన గ్రామాల్లో గాలివేగం రికార్డులు తీస్తే నాట్ అప్లికబుల్ అని వస్తోంది. ప్రస్తుతం ఈనెల 21న వచ్చిన గాలివేగం కూడా సక్రమంగా రికార్డ్ కాలేదుగతంలోనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు ఒకవైపు నీరు లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే ప్రకృతి కోపంతో మరింత రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
ప్రజల గుండెల్లో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలుస్తూ..కరువు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆదుకున్న నాయకుడు దివంగత వైఎస్ రాజారెడ్డి. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బిజీగా ఉన్నా పులివెందులలో అంతా తానై నడిపించేవారు. వైఎస్ రాజారెడ్డి 1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరిని ఏకతాటిపై నడిపించిన దివంగత వైఎస్ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. అంతేకాకుండా పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్గా ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది. పులివెందుల గ్రామ సర్పంచ్గా.. రాజకీయాల్లోకి రాకముందు నుంచి పులివెందుల్లో వై.ఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం.ఈ నాటికి ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్గా 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవి్వంచారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు అన్నింటా తానే ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. రైతులను అన్నివిదాలా ఆదుకున్న దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కృషికి తోడుగా అక్కడక్కడ పెద్దాయన పేరుతో కూడా సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో రూపుదిద్దుకున్నాయి. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు కూడా వెలిశాయి. పులివెందుల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు పులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవాడు. ప్రజలు కూడా తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలువబడే వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. ప్రజల కోసం వైఎస్ రాజారెడ్డి ఇంటి వాకిళ్లు ఎప్పుడు తెరిచి ఉండేవి. అంతేకాకుండా దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్ రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవాడు. దీంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రశాంతంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవాడు. విద్యా ప్రదాతగా.. : దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాల్టెక్నికల్ కళాశాలలు నెలకొల్పాడు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్లు చూపిన బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినా‹Ùరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికి పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు. నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సు«దీకర్రెడ్డి, ఇతర కుటుంబీకులు నివాళులరి్పంచనున్నారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి పార్కులోని వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులరి్పంచనున్నారు. -
ఉద్యానశాఖ అధికారి బదిలీ
కడప అగ్రికల్చర్: జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పనిచేస్తున్న సతీష్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈయనను అడ్మినిస్టేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా జి.రమణారెడ్డి, రాష్ట్ర పంచాయితీరాజ్ విభాగం కార్య దర్శిగా కె.దశరథరామిరెడ్డిలను నియమించారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఉదయం సెషన్లో 46 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు 222 మంది, ఒకేషనల్కు సంబంధించి 51 మంది గైర్హాజరయారు. అలాగే సెకండియర్కు సంబంధించి మధ్యాహ్న సెషన్లో నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించి 162 మంది, ఒకేషనల్కు సంబంధించి 11 మంది గైర్హాజరయారు. మదనపల్లె సిటీ: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 25వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధికారులతో కడప కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి తెలిపారు. వెనుబడిన కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధా రణ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు అందజేయాలన్నారు. మదనపల్లె సిటీ: ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్డబ్యూఆర్ఈఐ సొసైటీ జిల్లా సమన్వయ అధికారిణి ఏ.ఉదయశ్రీ తెలిపారు. కడప చిన్నచౌక్లోని అంబేద్కర్ గురుకులంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఐదో తరగతి బాలికలకు ఈనెల 26న, బాలురకు 27న.. ఇంటర్ మొదటి ఏడాది బాలికలకు ఈనెల 29న, బాలురకు 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఖాళీగా ఉన్న సీట్లను ఎంపిక చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలోని పాత వాహనాలను నిబంధనల ప్రకారం ఈ నెల 30న వేలం నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరుపయోగంగా ఉన్న ఏడు పాత ఎస్హెచ్టీఓ వాహనాలకు ఈ నెల 30న వేలం వేయుటకు కమిటీ తీర్మానం చేసింది. గుర్తింపు పొందిన వేలం పాటదారులు ఏపీ. జిఓవి. ఇన్ వెబ్సైట్లో కనీస రుసుం చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని ఆ కమిటీ చైర్ పర్సన్, డీఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో ఏఓ విజయ భాస్కర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఖాన్, అసిస్టెంట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ జీవీ రఘునాధవర్మ పాల్గొన్నారు. కడప రూరల్: రాయలసీమ రీజినల్ ఎడ్యుకేషన్ ఫెయిర్–2026ను ఈ నెల 24న కడప నగరంలోని విష్ణుప్రియ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆర్ఆర్ కెరీర్ సొల్యూషన్స్ ఎండీ రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 24న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఫెయిర్ ను నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిప్లమా, డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు ఎటువంటి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తెలుసుకోవచ్చన్నారు. ఈ ఫెయిర్లో దేశంలోని 100కు పైగా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనవచ్చని వివరించారు. -
కడప మీదుగా మరొక వారాంతపు రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–చర్లపల్లి–తిరుపతి (17441/42) లైన్లో మరో వారాంతపు రెగ్యులర్ రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. తిరుపతిలో ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, దిగువమిట్ట, గిద్దలూరు, కంభం, మార్కా పురం రోడ్డు, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చేరుతుందన్నారు. అలాగే ప్రతి బుధవారం చర్లపల్లిలో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుతుందని వివరించారు. ఈనెల 26 నుంచి ఈ వారాంతపు రైలు ప్రారంభమవుతుందని తెలియజేశారు. -
ఎయిడ్స్ రహిత సమాజం కోసం ఉమ్మడి కృషి
ప్రొద్దుటూరు క్రైం: అందరి సహకారంతో ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఏఆర్టీ, ఎన్జీఓల కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ’న్యాకో’ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హైరిస్క్ గ్రూపులతో పాటు అనుమానం ఉన్న వారందరికీ హెచ్ఐవీ పరీక్షలు చేయాలని, వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ సూర్యనాగలక్ష్మి, ఆసిఫ్, టీబీ విభాగం సిబ్బంది, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వరదకు అవమానం
సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అటు కడప, ఇటు కొండాపురంలో జరిగిన సమావేశాల సరళి చూస్తే, కేవలం తన చుట్టూ భజన చేసే ‘అనుకూల’ వర్గానికే లోకేష్ పెద్దపీట వేశారని, జెండా మోసిన కార్యకర్తలను రోడ్డుపై నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్వాన్ వద్దే వరదరాజులరెడ్డికి అవమానం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి లోకేష్ పర్యటనలో తీవ్ర అవమానం ఎదురైంది. శుక్రవారం ఉదయం లోకేష్ను కలిసేందుకు మైనార్టీ నేత ముక్తియార్తో కలిసి వరదరాజులరెడ్డి ఆయన కార్వాన్ వద్దకు వచ్చారు. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మె ల్యే, సీనియర్ నేత అని కూడా చూడకుండా.. ‘ముందస్తు అనుమతి లేదు, అపాయింట్మెంట్ కష్టమే‘ అంటూ లోకేష్ పర్సనల్ సెక్రెటరీ ముఖం మీదే చెప్పేయడం గమనార్హం. దాదాపు గంటసేపు పడిగాపులు కాసినా లోకేష్ నుంచి పిలుపు రాకపోవడంతో, వరదరాజులరెడ్డి తీవ్ర అవమానంతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే ఇక తమ గతేంటని ‘తెలుగు తమ్ముళ్లు’ చెవులు కొరుక్కుంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడికే స్టేజీ కింద స్థానం దీనికి ముందు గురువారం సాయంత్రం జరిగిన కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ అవమానాల పర్వం కొనసాగింది. పార్టీ జెండానే సర్వస్వంగా భావించే ఎంతోమంది కిందిస్థాయి నాయకులకు ఈ సమావేశంలో అసలు అనుమతే దక్కలేదు. ఒకవేళ లోపలికి వెళ్లగలిగినా, సీనియర్లకు దక్కిన మర్యాద శూన్యం. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి లాంటి కీలక నేతలను సైతం స్టేజీపైకి రానివ్వలేదు. వీరంతా స్టేజీ కిందనే కూర్చోవాల్సి రావడంపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కోటరీతోనే ఏకాంత చర్చలు ప్రజాప్రతినిధి అయిన వరదరాజులరెడ్డిని గంట ల తరబడి బయట నిలబెట్టిన లోకేష్.. అదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఇన్ఛార్జీ గండ్లూరు ప్రవీణ్కుమార్రెడ్డిని కార్వాన్ లోపలికి పిలిపించుకుని ఏకాంత చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. కేవలం తనకు అనుకూలంగా ఉండే వారికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కష్టజీవులకు మొండిచేయి ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. లోకేష్ రెండు రోజుల పర్యటన జిల్లా టీడీపీలో తీవ్ర నైరాశ్యాన్ని, అసంతృప్తిని మిగిల్చింది. సీనియర్లకు నో ఎంట్రీ..కోటరీకే పెద్దపీట గంటసేపు పడిగాపులు కాసినాఎమ్మెల్యేకు దక్కని అపాయింట్మెంట్ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్,రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్రెడ్డిలకుస్టేజీ కిందనే సీట్లు -
గండికోట ముంపువాసులకు నిరాశ
జమ్మలమడుగు/కొండాపురం:కొండాపురం మండలంలో సోలార్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి నారా లోకేష్.. గండికోట ముంపు నిర్వాసితుల పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానిక నేతలు ముంపు పరిహారం సమస్యను వివరించగా.. లోకేష్ తన ప్రసంగంలో పరిహారం ఇవ్వాలని మాత్రమే చెప్పారు కానీ, ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దాటవేశారు. మరోవైపు ముంపువాసులను కాకుండా కేవలం అనుకూల వర్గాలకే పాసులు ఇచ్చి ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై టీడీపీ క్షేత్రస్థాయి క్యాడర్ మండిపడింది. ‘ఎన్నికల్లో జెండాలు మోయడానికే మేం కావాలా?‘ అంటూ సొంత పార్టీ నాయకులే నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.మరోవైపు గండికోట ముంపువాసులు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో చెప్పి న హామీ ప్రకారం అదనపు పరిహారం ప్రస్తావనే లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పర్యటన వేళ పోలీసుల జులూం మంత్రి లోకేష్ పర్యటన వేళ పోలీసులు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అరాచకానికి తెరలేపారు. మండలంలో సోలార్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ ఇక్కడ ఉండకూడదంటూ తెల్లవారకముందే ఇళ్లపైకి వాలారు. ఊళ్లో ఉంటే పీఎస్లో కూర్చోవాలని, లేదంటే మండలం దాటాలని హుకుం జారీ చేశారు. లోకేష్ కు గండికోట ముంపు సమస్యలపై వినతులు ఇవ్వకూడదని, ఆ ప్రస్తావనే తేవద్దంటూ వైఎస్సార్సీపీ నేతలు హరినారాయణరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, ప్రవీణ్లకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ప్రశ్నిస్తారనే భయంతోనే తమ గొంతు నొక్కుతున్నారని హరినారాయణరెడ్డి మండిపడ్డారు. మరోవైపు కొండాపురంలో నిలదీస్తున్న సీపీఐ నాయకుడు మనోహర్బాబుతో పాటు నలుగురిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పరిహారంపై తేల్చని లోకేష్ -
జీరో లాగిన్ ఫీజుతో గృహ రుణాలు
కడప కార్పొరేషన్: ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఆధ్వర్యంలో జీరో లాగిన్ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ పంకజ్ గాడ్గిల్ అన్నారు. కడపలోని ఎన్జీవో కాలనీలో యాక్సిస్ బ్యాంకుపైన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన బ్రాంచి ప్రారంభోత్సవం సందర్బంగా జీరో లాగిన్ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిత్య బిర్లా దేశ వ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరించిందని, కడప శాఖ ద్వారా మొత్తం బ్రాంచీల సంఖ్య 13కు చేరిందన్నారు. . జోరుగా నిషేధిత లాటరీ వ్యాపారం పుంగనూరు: పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పుమొగసాల, సెంటర్లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్ఎస్.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నారి నోటికి చేపల గాలం కలకడ : చేపలను పట్టేందుకు వేసే గాలం చిన్నారి బేబీ(2)కి ఆడుకునే బొమ్మలా అనిపించడంతో నోటిలో పెట్టుకుంది, దీంతో అదికాస్త నోటిలో చిక్కుకున్న సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన రవి దంపతులు కలకడ మండలం గుడిబండ సమీపంలో తాత్కాలిక షెడ్లు వేసుకుని నెల రోజుల నుంచి నివాసం ఉంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటల్లోని ముళ్లపొదలు, కంపచెట్లు కొట్టి బొగ్గులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి చిన్నారి షెడ్లో ఆడుకుంటూ చేపల గాలాన్ని నోట్లో పెట్టుకొని లాగడంతో ఇరుక్కుపోయింది. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా గాలం రాకపోవడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు గాలం తీయడం కష్టతరమని భావించి తిరుపతికి రెఫర్ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. -
గుర్తుతెలియని వాహనం ఢీ
– యువకుడు దుర్మరణం మదనపల్లె టౌన్: హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొంది గ్రామానికి చెందిన ఎరప్ప్ర నాయుడు కుమారుడు ఏ. శ్రీరాములు నాయుడు (35) శుక్రవారం తెల్లవారుజామున పాలెంకొండలో కూలీల కోసం వైపు హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సీటీఎం చెరువు సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం శ్రీరాములు నాయుడును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. హోరాహోరీగా సీపీఎల్ –2 వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో సీపీఎల్ –2 క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం హైపెరియన్, ఎన్కే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్కే స్పోర్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లుకు 186 పరుగులు చేసింది. హైపెరియన్ ప్లేయర్ సల్మాన్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన హై పెరియన్ జట్టు 18.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 191 పరుగులు చేసి విజయం సాధించింది. సోహన్ రెడ్డి 45 బంతుల్లో 83, జయంత్ రెడ్డి 23 బంతుల్లో 53 పరుగులు చేశారు. సోహన్రెడ్డికి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు, ట్రోఫీని స్థానిక ఎంపీడీవో మనోహర రాజు, పంచాయతీ ఈవో రవీంద్రనాథ్ అందించారు. మధ్యాహ్నం స్పార్టన్ వారియర్స్, ఆదిత్య బీఆర్ జట్ల మధ్య జరిగి మ్యాచ్ను స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి టాస్ వేసి ప్రారంభించారు. ఆదిత్య బిఆర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. జట్టులో రెడ్డిరుషీల్ 59 బంతుల్లో 95 పరుగులు చేసి నాటవుట్గా నిలిచాడు. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పార్టన్ వారియర్స్ 18.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటయింది.ఈ కార్యక్రమంలో సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి
ఏఎస్పీ విభూ కృష్ణప్రొద్దుటూరు కల్చరల్ : మహిళలు తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకుని అందులో రాణించాలని ఏఎస్పీ విభూ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జాతీయ స్థాయి తైక్వాండో ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రథమంగా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, దోహదపడుతాయని తెలిపారు. కామెన్ వెల్త్ తైక్వాండో గోల్డ్ మెడలిస్ట్ టూటౌన్ ఎస్ఐ మహబూబ్ బాషా మాట్లాడుతూ తాను కూడా తైక్వాండో క్రీడాకారుడినని, క్రీడలు నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. టూటౌన్ సీఐ వంశీనాథ్, రాష్ట్ర వక్ఫ్బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్ మాట్లాడారు. పోటీలను నిర్వహిస్తున్న ఆర్గనైజర్ సలీంను అభినందించారు. ఈ పోటీల్లో 14 రాష్ట్రాలకు చెందిన 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, నటరాజ కళాక్షేత్రం విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో యూత్ తైక్వాండో అసిసోయేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, ఎస్ఏఐ కోచ్ సోమేశ్వరరావు, యూత్ తైక్వాండో అసోసియేషన్ ఏపీ చైర్మన్ మోహన్ కృష్ణ, తెలంగాణ చైర్మన్ రమేష్, మెంబర్ రాంబాబు, సీనియర్ కోచ్ మాస్టర్ ఉదయ్, మై స్పేస్ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ మహబూబ్ బాషా, కోచ్ హరి, ఏపీ యూత్ తైక్వాండో అసోసియేషన్ వైస్ చైర్మన్ రామకృష్ణ, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
● అడ్డుకున్న టీడీపీకి చెందిన మరో వర్గం ● ఇరువర్గాల మధ్య ఘర్షణ సునీల్ కుమార్ రెడ్డి వర్గాన్ని నివారిస్తున్న బద్వేలు సీఐ రామకృష్ణ, రెడ్డయ్య వర్గాన్ని నివారిస్తున్న ఎస్ఐ నాగకీర్తన అట్లూరు : మండల కేంద్రమైన అట్లూరు రెవెన్యూ పొలంలోని కడప – బద్వేలు ప్రధాన రహదారి పక్కనే సర్వే నంబర్ 1007/3లో 32 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలాన్ని 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గుర్తించి పంపిణీకి రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి తహసీల్దార్ అట్లూరు మండల పరిధిలోని ఉన్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున లే అవుట్ వేసి జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు. అనంతరం టీడీపీకి చెందిన పోతిరెడ్డి రెడ్డయ్య ఆ స్థాలాన్ని కబ్జాకు యత్నించడంతో అప్పటి రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వం స్థలం ఎవరైనా ఆక్రమణకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం ఉదయం ఆ స్థలానికి పక్కనే బోవిళ్ల సునీల్కుమార్రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన స్థలం ఉండటంతో ఈ స్థలంలో నుంచి రస్తా కావాలని జేసీబీతో సుమారు 50 మందితో అక్కడికి చేరుకుని పనులు చేపట్టారు. పోతిరెడ్డి రెడ్డయ్యతోపాటు ఆయన అనుచర వర్గం ఇక్కడికి చేరుకుని ఈ స్థలం తనదని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్ఐ నాగకీర్తన, బద్వేలు సీఐ రామకృష్ణ, ఎస్ఐ రంగారావు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వారిని స్టేషన్కు తరలించారు. జేసీబీని సీజ్ చేశారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ సుబ్బలక్షుమ్మను వివరణ కోరగా ఈ స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు బద్వేలు ఆర్డీఓ పరిశీలిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
రూ.2 కోట్ల అవినీతి
వేంపల్లె : స్థానిక చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీలో దాదాపు రూ.2కోట్ల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. దీంతో పులివెందుల కో–అపరేటవ్ బ్యాంకు సబ్ డివిజనల్ అధికారి కమలమ్మను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం చింతలమడుగుపల్లె సొసైటీలో విచారణ చేపట్టేందుకు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న కత్తులూరు, అలిరెడ్డిపల్లె, వేంపల్లె, చింతలమడుగుపల్లెతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు మూకుమ్మడిగా చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకుని విచారణ అధికారి కమలమ్మను తమకు అన్యాయం జరిగిందని చుట్టుముట్టారు. అలాగే సొసైటీ కార్యాలయానికి రైతులు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో చింతలమడుగుపల్లె సహకార సొసైటీలో సీఈఓగా పనిచేసిన రామిరెడ్డి అవినీతికి పాల్పడినట్లు బయారెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పుల్లయ్య, సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామానందరెడ్డిలతోపాటు పలువురు రైతులు అరోపించారు. సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చింతలమడుగుపల్లె సొసైటీలో వివిధ రకాల రుణాలను 1400మంది రైతులు తీసుకున్నట్లు తెలిపారు. పంట రుణాల్లో సీఈఓ రామిరెడ్డి 9 శాతం వడ్డీని వసూలు చేయాల్సి ఉండగా.. 12 శాతం వరకు వసూలు చేసినట్లు అరోపించారు. 12ఏళ్ల నుంచి సీఈఓ రైతుల నుంచి అధిక వడ్డీని వసూలు చేసి తన జేబులో వేసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీ, ఇతర రుణాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఒక్కో రైతుకు సంబంధించిన రుణాల్లో రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు స్వాహా చేసినట్లు అరోపించారు. రూ.కోట్లల్లో అవినీతి చేసిన సీఈఓ రామిరెడ్డిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప.. సీఈఓపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 5 సార్లు విచారణ చేశారని, సీఈఓ చేసిన అవినీతి బయటపడినా కూడా అధికారులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణాల వడ్డీ రెన్యువల్ చేయకుండా కోట్ల రూపాయలను వ్యవసాయ సహకార సంఘం సీఈవో రామిరెడ్డి మింగేశాడని వాపోతున్నారు. అనంతరం సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని విచారణ అధికారిణి కమలమ్మకు రైతులు రాతపూర్వకగా వినతి పత్రం అందజేశారు. సీఈఓ రామిరెడ్డిపై వచ్చిన అరోపణలపై విచారణ అధికారి కమలమ్మను వివరణ కోరగా.. ప్రజా సమస్యల వేదికలో కత్తులూరుకు చెందిన బయారెడ్డి, ప్రతాప్ రెడ్డిలు చింతలమడుగుపల్లె సహకార సొసైటీ సీఈఓ రామిరెడ్డిపై పిర్యాదు చేశారని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప కోఅపరేటవ్ బ్యాంకు ఉన్నతాధికారులు తనను విచారణ అధికారిగా వేయడంతో వేంపల్లె సొసైటీ కార్యాలయానికి వచ్చానన్నారు. రాత పూర్వకంగా రైతులు వినతి పత్రం అందజేశారన్నారు. విచారణలో సీఈఓ రామిరెడ్డి అవినీతికి పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం
కడప అర్బన్: కడపలోని బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ వివరాల మేరకు వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ చాన్ (33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం బాడుగకు రాజంపేటకు వెళ్లి తిరిగి అదే రోజున ఇంటికి రాత్రి 9.30కు బయలుదేరాడు. వైఎస్సార్ కాలనీకి వెళ్లేందుకు ఆటో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బీబీజాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రొద్దుటూరు క్రైం : మండల పరిఽధిలోని చౌడూరు గ్రామంలో గుర్తు తెలియని బైక్ ఢీ కొని నాగిరెడ్డి (77) అనే వృద్ధుడు మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చౌడూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి గురువారం రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని బైక్ అతన్ని ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. వల్లూరు : మండల పరిధిలోని గోటూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై అట్లూరి భాస్కర్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు...భాస్కర్ తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై గాయపడ్డాడు. బంధువులు చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని భార్య నాగ రత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ నాగిరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ అదృశ్యంపై కేసు ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన గజ్జపనేని సంజీవమ్మ అనే వివాహిత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంజీవమ్మ ఈ నెల 20న టాట్లెట్లు తీసుకొని వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఇంత వరకు తిరిగి రాలేదు. తెలిసిన వాళ్ల ఇళ్లలోనూ. బంధువుల ఊళ్లలో విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ షేక్ మహబూబ్బాషా తెలిపారు. -
జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు !
● ఒకరిపై దాడి చేశారని ఫిర్యాదు : నలుగురిపై కేసు ● యువకులపై కానిస్టేబుల్ దాష్టీకం కడప అర్బన్: కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐడీ పార్టీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చంద్ర నారాయణరెడ్డి ఓ కేసులో నిందితులుగా ఉన్న యువకులను పిలిపించి వారిని కొట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు మరింత రాజుకుంది. ఈ సంఘటనపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనసేన నాయకులైన హరిరాయల్, తాతంశెట్టి నాగేంద్రలు పరస్పరం సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తాతం శెట్టి నాగేంద్ర తనకు దగ్గరగా ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు యువకులను మరో నాయకుడైన హరి రాయల్పై దాడికి పంపించాడు. దీనిపై హత్యాయత్నం కేసును నమోదు చేయాలని హరిరాయల్ పోలీసులను పట్టుబట్టారు. దీంతో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య సంఘటన పై విచారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితులుగా ఉన్న నలుగురు యువకులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సదరు కేసులో నిందితులకు 41–ఏ నోటీసులు ఇచ్చి పంపిస్తామని చెప్పి సీఐ ఇతర విధులకు వెళ్లాడు. ఆ సమయంలో ఐడీ పార్టీ కానిస్టేబుల్ చంద్ర నారాయణరెడ్డి అత్యుత్సాహం చూపారు. ఈకేసులో ఫిర్యాదుదారుడు, జనసేన నాయకుడైన హరి రాయల్ ను పోలీస్స్టేషన్కు పిలిపించారు. అతని ముందే కానిస్టేబుల్ యువకులను కొట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు. యువకులు గాయపడ్డారు. తర్వాత విధులనుంచి వచ్చిన సీఐ ఎదుట హాజరు పరిచి వారికి 41– ఏ నోటీసులను ఇచ్చి పంపించేశారు. కాగా ఈ సంఘటన శుక్రవారం సోషల్ మీడియాలో యువకుల శరీరాలపై గాయాలతో కూడిన ఫొటోలతో జోరుగా ప్రచారం సాగింది. ఈ సంఘటనపై కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ను వివరణ కోరగా, జనసేన నాయకుడు హరి రాయల్ పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించామని, వారికి 41– ఏ నోటీసులు ఇచ్చి పంపించామని తెలియజేశారు. కానిస్టేబుల్ వారిపై దాడి చేశారన్న విషయం తమ దష్టికి రాలేదని, దీనిపై సమగ్రంగా విచారిస్తామన్నారు. కాగా ఈ సంఘటనలో నలుగురు యువకులను హరి రాయల్ పై దాడి చేసేందుకు పంపించిన మరో జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తనను తాను కాపాడుకునేందుకు, పోలీసుల నుంచి తనపట్ల ఎలాంటి చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు ఆస్కారం లేకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్రజల గుండెల్లో పెద్దాయన
● వైఎస్ఆర్ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు ● పులివెందుల పెద్దాయనగా ప్రజల మన్ననలు ● నేడు దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలుస్తూ..కరువు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆదుకున్న నాయకుడు దివంగత వైఎస్ రాజారెడ్డి. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బిజీగా ఉన్నా పులివెందులలో అంతా తానై నడిపించేవారు. వైఎస్ రాజారెడ్డి 1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరిని ఏకతాటిపై నడిపించిన దివంగత వైఎస్ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. అంతేకాకుండా పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్గా ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది. పులివెందుల గ్రామ సర్పంచ్గా.. రాజకీయాల్లోకి రాకముందు నుంచి పులివెందుల్లో వై.ఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం.ఈ నాటికి ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్గా 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు అన్నింటా తానే ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. రైతులను అన్నివిదాలా ఆదుకున్న దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కృషికి తోడుగా అక్కడక్కడ పెద్దాయన పేరుతో కూడా సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో రూపుదిద్దుకున్నాయి. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు కూడా వెలిశాయి. పులివెందుల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు పులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవాడు. ప్రజలు కూడా తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలువబడే వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. ప్రజల కోసం వైఎస్ రాజారెడ్డి ఇంటి వాకిళ్లు ఎప్పుడు తెరిచి ఉండేవి. అంతేకాకుండా దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్ రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవాడు. దీంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రశాంతంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవాడు. విద్యా ప్రదాతగా.. : దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాల్టెక్నికల్ కళాశాలలు నెలకొల్పాడు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్లు చూపిన బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికి పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు. నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్రెడ్డి, ఇతర కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి పార్కులోని వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు.


