YSR
-
నాకు నలుగురు అమ్మాయిలతో ఎఫైర్ ఉంది..!
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. -
సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ ఇప్పట్ల పర్యటన అప్డేట్స్.. సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ఇప్పట్ల చేరుకున్న వైఎస్ జగన్సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ఇటీవల మృతి చెందిన సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్పార్నపల్లి నిర్వాసితులకు భరోసా.. కడపపార్నపల్లి రహదారిపై వైఎస్ జగన్ను కలిసిన రాజారెడ్డి కాలనీ వాసులు..జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆవేదన.పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదనపరిహారం ఇప్పించి ఆదుకోవాలని వైఎస్ జగన్కు వినతి.న్యాయం కోసం పోరాటం చేద్దాం.న్యాయం జరగకపోతే మూడేళ్లు ఆగండి మనం అధికారంలోకి వస్తాం..తప్పకుండా న్యాయం చేస్తామన్న వైఎస్ జగన్మీకు అన్యాయం జరగదు.. జగన్ సార్ చూసుకుంటాడని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా ఇప్పట్ల బయలుదేరిన వైఎస్ జగన్పులివెందులలో తన నివాసం నుంచి ఇప్పట్ల బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్మరికాసేపట్లో ఇప్పట్ల చేరుకోనున్న వైఎస్ జగన్ఇప్పట్ల లో ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్అనంతరం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు వైఎస్ జగన్క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్, ప్రజల నుంచి వినతుల స్వీకరణ👉లింగాల మండలం ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్👉వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.👉వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పట్లకు బయలుదేరుతారు. నేరుగా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. -
ఖాకీలు.. కథలు అల్లుతున్నారు!
సాక్షి ప్రతినిధి, కడప: ఓ జాతరలో యువకుల మధ్య తలెత్తిన గొడవ చినికిచినికి గాలివానగా మారింది.. పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్య వరకూ వెళ్లింది. నిజానికి ‘గొడవ’ సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటనే జరిగేది కాదు.. ఒక నిండు ప్రాణం పోయేదికాదు.. ఖాకీల నిర్లక్ష్యం వల్లే ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఘర్షణ సమయంలో పూర్తిగా అలసత్వం వహించిన పోలీసులు హత్య కేసు దర్యాప్తుకొచ్చేసరికి కూటమి నేతల కుట్రలో పావుగా మారారు. హత్యకు రాజకీయ రంగు పులిమి..స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కూటమి నేతలు వేసిన స్కెచ్లో భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించే యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిందితులతో అనుకూలంగా వాంగ్మూలాలు తీసుకుని...నిత్యానందరెడ్డే హత్య చేయించినట్లు కథలు అల్లుతున్నారు. ● ఈ నెల 6వ తేదీన రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన దాడిలో ఆలంఖాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ హత్యను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు పెద్ద స్కెచ్ వేశారు. చనిపోయిన పెద్ద దస్తగిరి, నిత్యానందరెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనే ఒకే ఒక తీగను పట్టుకుని నిత్యానందరెడ్డే హత్య చేయించాడనే స్థాయికి కేసును మళ్లించేశారు. నిందితుల్ని చితకబాది... తొలుత కేసు జాతరలో చోటుచేసుకున్న వివాదంపైనే విచారణ సాగింది. ఆపై రాజకీయ రంగు పులుముకొని ఇన్ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతే వేగంగా వైఎస్సార్సీపీ టార్గెట్గా అడుగులు పడ్డాయి. నిందితులను కడప డీటీసీలో చితకబాది నిత్యానందరెడ్డి పేరు చెప్పించుకుని...కేసును వైఎస్సార్సీపీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారని నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తి ఆరోపిస్తున్నారు. విచారణ జరుపుతున్న అధికారులు మార్చడంలోనే అనుమానాలుంటే...తమకు గతంలో వివాదాలున్న ఓ డీఎస్పీ చేతికి కేసు విచారణ ఇవ్వడంలో పెద్ద కుట్ర దాగుందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు... ఆలంఖాన్పల్లెలో దాడి వ్యవహారం పోలీసులకు చేరవేస్తే తక్షణమే స్పందించాల్సింది పోయి, రిమ్స్లో అడ్మిట్ కావాలని ఉచిత సలహా ఇచ్చారు. అటువైపు కన్నెత్తి చూడలేదు. రిమ్స్ వరకూ భద్రత కల్పించాలని కోరినా నిష్ప్రయోజనమే అయ్యింది. ఈమొత్తం వ్యవహారం పోలీసుశాఖను చుట్టుముట్టింది. దాంతో తక్షణమే నగర డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా సీఐ రెడ్డెప్పను బదిలీ కూడా చేశారు. పోలీసుల వైఫల్యం తేటతెల్లం కావడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు హత్య కేసును అనేక మలుపులు తిప్పుతున్నారు. పోలీసులు అనుకున్న చట్రం చుట్టూ హత్యకేసు దర్యాప్తు నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్కుమార్పై థర్డ్ డిగ్రీ రూ.5లక్షలు నగదు నరేంద్ర చేరవేశానని ఒప్పుకోవాలంటూ కోటింగ్ పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు దర్యాప్తులో అనేక మలుపులు సెర్చ్ వారెంట్ తీసుకొని నిత్యానందరెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి సోదాలు చేసిన పోలీసు అధికారులు నిత్యానందరెడ్డి సహాయకుడు రాజ్కుమార్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు సమాచారం. నిత్యానందరెడ్డి రూ.5లక్షలు నగదు ఇస్తే ఆ మొత్తం కేసులో ఉన్న నరేంద్రకు అప్పగించానని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ రింగ్ రోడ్డులోకి తీసుకొని కోటింగ్ ఇచ్చారు. కేవలం ఇంటి పనులు, వ్యక్తిగత పనులకే పరిమితమైన తనకు ఇవేవి తెలియవన్నందుకు ఖాకీలు కర్రలతో దాడులు చేశారు. ఇదే విషయాన్ని రాజ్కుమార్ సైతం వాపోతున్నారు. దీనిని బట్టే పోలీసుల విచారణ ఎలాంటి దిశలో పయనిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
ఉపాధి కూలీలకు త్వరలో వేతనాలు
కడప సిటి: జిల్లాలో ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు త్వరలోనే వారి ఎన్పీసీఐ ద్వారా లింకై న ఖాతాలకు జమ అవుతాయని డ్వామా పీడి ఆదిశేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025 డిసెంబర్ 12 నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు అందనున్నాయిని తెలిపారు. వైఎస్సార్ కడపజిల్లాకు రూ. 22.36 కోట్లు చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కడప సెవెన్ రోడ్స్: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జిల్లాలో ఆరుగురు సీఐల బదిలీ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. వి.ఆర్. అనంతపురం రేంజ్లో పని చేస్తున్న వి. శ్రీహరిని పులివెందుల ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. అలాగే పులివెందుల ట్రాఫిక్ పీఎస్లో ఉన్న పి. రామాంజులును కర్నూల్ మహిళాపీఎస్కు, కడప రిమ్స్ యూపీఎస్ (అప్గ్రేడ్ స్టేషన్)లో పని చేస్తున్న బి.రామకృష్ణారెడ్డిని చిన్నచౌక్ యూపీఎస్కు బదిలీ చేశారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం రాజగోపాల్ను రిమ్స్ యూపీఎస్కు, కడప ట్రాఫిక్ యూపీఎస్ సీఐఎ. సరేష్ రెడ్డిని ప్రొద్దుటూరు ట్రాఫిక్ యూపీఎస్కు , వీఆర్లో ఉన్న ఎం. తులసీరామ్కు కడప ట్రాఫిక్ యూపీఎస్కు బదిలీచేశారు. బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతం కావడంతోపాటు కొండపై అధిక వేడి ఉండటం, చల్లదనం లేకపోవడంతో సందర్శకులు ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. దాంతోపాటు మైదాన ప్రాంతాల్లో ఉంటున్న ఎండలే కొండపైనా ఉండటంతో అక్కడికి వెళ్లినా అంతే అన్న భావనతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఫలితంగా కొండపై గదులు ఖాళీగా ఉండగా, సాధారణ సందర్శకులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొండపై పర్యాటకుల సంచారం లేక బోసిపోతోంది. మంగళవారం కూడా కొండపై 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు కాస్త తగ్గిన ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. రాయచోటి: రాయచోటి పట్టణం ఠానా సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రాజంపేట వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొంది. మంగళవారం ఉదయం పట్టణంలో రద్దీగా ఉన్న ఠానా వద్ద చేటుచేసుకున్న ఈ సంఘటన.. అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి డిపోకి వెళ్తున్న బస్సు ఠానా సర్కిల్ నుంచి సుండుపల్లి రోడ్డు వైపు తిరగగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ గమనించి కేకలు వేశారు. నిత్యం రద్దీగా ఉండే సర్కిల్లో డ్రైవర్ అరుపులు విని పక్కకు పరుగులు తీశారు. కానీ ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూనియర్ అసిస్టెంట్ జయరాం నిద్రపోతూ కనిపించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చిన రైతులు తమ కెమెరాల్లో బంధించారు. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఆఫీస్లో నిద్ర పోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్కు సరెండర్ చేశారు. దీంతో కలెక్టర్ రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయానికి మూడు నెలల క్రితం డిప్యూటేషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ తహసీల్దార్ కిరణ్ కుమార్ వివరణ కోరడానికి ప్రయత్నించగా.. ఆయన రెండు రోజులుగా సెలవులో ఉన్నట్లు తెలిసింది. -
నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య -
‘వీరజవాన్’ను మరిచిన బాబు సర్కార్
సాక్షి ప్రతినిధి, కడప: ‘జై జవాన్, జై కిసాన్’ స్ఫూర్తి నేటి పాలకులకు కొరవడింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న జవాన్ వీరమరణం చెందితే ఆదుకోవాలనే కనీస స్పృహలేకుండా సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఏడాదిన్నర్రగా పరిహారం ఇవ్వకపోగా, కుటుంబాన్ని ఆదుకోవాలనే దిశగా ఒక్క అడుగూపడని దుస్థితి నెలకొంది. ● బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొడవటికంటి రాజేష్ (36) ఇండో టిబెటన్ పోర్ట్ బార్డర్ (ఐటీపీబీ)లో 17ఏళ్లుగా జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా చత్తీస్గడ్ అడవుల్లో మావోయిస్టుల దుశ్చర్య కారణంగా 2024 అక్టోబర్ 19న మృత్యువాత పడ్డారు. 36ఏళ్ల వయస్సులో జవాన్ రాజేష్ మృతి చెందడంతో ఆ కుటంబం దీనావస్థకు చేరింది. ముక్కుపచ్చలారని ముగ్గురు బిడ్డల ఆలనా పాలన చూసుకోవడం సతీమణి స్వాతికి కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదిన్నర్రగా రాష్ట్ర ప్రభుత్వం కరుణ కోసం అనేక పర్యాయాలు కలెక్టరేట్ దరికి చేరింది. వీరజవాన్ కుటుంబానికి అండగా నిలవాలని, రాష్ట్ర ప్రభుత్వ పరంగా లభించాల్సిన పరిహారం, వ్యవసాయ భూమి, ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ కలెక్టర్కు విన్నవించుకున్నా అమె అభ్యర్థన బుట్టదాఖలే అయ్యింది. ఇదివరకే మృతి చెందిన వీరజవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రభుత్వపరంగా డబ్బులు, ఇంటి స్థలం. 5 ఎకరాల పొలం, రాజేష్ భార్య స్వాతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. ఇచ్చిన హామీని ఎమ్మెల్యే కూడా మరుగుపర్చారు. వీరజవాన్ కుటుంబంపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు సర్కార్ను పలువురు తూర్పారబడుతున్నారు. మావోయిస్టు దుశ్చర్యలో మృతి చెందిన జవాన్ రాజేష్ ఏడాదిన్నర్ర అయినా ప్రభుత్వం నుంచి లభించని పరిహారం పలుమార్లు కలెక్టర్ను కలిసినాఫలితం శూన్యం వీరజవాన్ కుటుంబాన్ని ఆదుకోండి బి.మఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన కె రాజేష్(36) చత్తీస్గడ్ అడవులల్లో మావోయిస్టుల మందుపాతరలకు బలి అయ్యారు. ముగ్గురు పసిబిడ్డలున్న రాజేష్ కుటుంబం పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం బాధకరం. ఇప్పటికై నా రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. –ఫిలిప్స్, అధ్యక్షుడు, మాజీ సైనిక పెన్షనర్స్ అసోసియేషన్, కడప -
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
వల్లూరు: పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వాముల కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరిగాయి. క్షేత్రాధిపతియైన పరమ శివుని అంశలోని వైద్యనాఽథ స్వామి కల్యాణంతోపాటు క్షేత్ర పాలకుడైన విష్ణు అంశలోని చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం ఒకే రోజు జరగడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఉదయం శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై శ్రీ కామాక్షీ వైద్యనాథుల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి కొండపై చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని మంటపంలో ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవిలతో శ్రీ చెన్నకేశవుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాలను కనులారా చూసి తరించారు. అనంతరం శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి, శ్రీ చెన్నకేశవ స్వామికి గజవాహన సేవను నిర్వహించారు. గరుడ వాహనంపై చెన్నకేశవుడు కాగా మంగళవారం తెల్లవారుజామున శ్రీచెన్నకేశవస్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గ్రామ మాడ వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి రథోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 4. 30 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల రథోత్సవం జరుగుతుంది. వైద్యనాఽథుని కల్యాణ మహోత్సవంలో మంగళసూత్రాన్ని చూపుతున్న పురోహితులు శ్రీ చెన్నకేశస్వామి కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న వేద పండితులు -
హత్యా రాజకీయాలకు బాబే బ్రాండ్ అంబాసిడర్
పులివెందుల : హత్యా రాజకీయాలకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన చరిత్రే ఇందుకు సాక్ష్యమని వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. పులివెందులలోని భాకరాపురంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గత 23 నెలల కాలంలో 21 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. టీడీపీ వాళ్లు హత్యలు చేసి వేరే వాళ్లపై రుద్దడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో జరిగిన రిటైర్డు ఆఫీసర్ రాఘవేంద్రరావు హత్య, వంగవీటి మోహన రంగ హత్య, పింగళి దశరథరాం హత్య ఎవరు చేశారనేది జగమెరిగిన సత్యమని, దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రుద్దడం, మా పార్టీ నాయకులను బద్నాం చేయడం బాబుకు పరిపాటిగా మారిందన్నారు. 15 రోజుల క్రితం జరిగిన దస్తగిరి హత్య వ్యక్తిగతమన్నారు. దస్తగిరి వైఎస్సార్సీపీ ఫాలోవర్ అని, అందరితో కలివిడిగా ఉండేవాడని చెప్పారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి, ఈ పెద్ద దస్తగిరికి ఎప్పుడూ వైషమ్యాలు లేవన్నారు. ఆయన పేరు ఎందుకు తీసుకొచ్చారో తెలియడం లేదన్నారు.దొరికిన వారు నిత్యానందరెడ్డి దగ్గర ఉంటారని కేసులో ఇరికించడం సరికాదని తెలిపారు. పెద్ద దస్తగిరి రియల్ ఎస్టేట్ బిజినెస్ను అందరితో చేస్తారని.. అలా అని హత్య కేసును వైఎస్సార్సీపీ నేతలకు అంటించడం చాలా దారుణమన్నారు. ఎవరైతే పెద్ద దస్తగిరిని హత్య చేశారో కచ్చితంగా వాళ్లకు శిక్ష పడాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. తాను, అంజాద్ బాషా ఎస్పీని కలిసి అదే విన్నవించామని వెల్లడించారు. వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ హత్యా రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ఎవరైతే హత్య చేశారో వారిని తప్పకుండా శిక్షించాలని... అలా కాకుండా సంబంధం లేని వారిని కేసులో ఇరికిస్తే భవిష్యత్లో అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, పులివెందుల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మాటికీ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రే!
కడప అర్బన్: కడప రిమ్స్ ఆవరణలో ఈ నెల 6న కలమల్ల పెద్దదస్తగిరి (53) దారుణ హత్యకు గురైన కేసు విచారణ వెనుక ముమ్మాటికీ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి చెప్పారు. మంగళవారం కడపలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన భర్త నిత్యానందరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున కడప డిప్యూటీ మేయర్ వరకు ఎదిగారన్నారు. ఆయనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో కూటమి పెద్దలు పెద్ద దస్తగిరి హత్య కేసులో తన భర్తకు సంబంధం అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పెద్ద దస్తగిరి ఇంటినుంచి స్వాదీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఒక చిన్న అగ్రిమెంట్గానీ, డాక్యుమెంట్గానీ తన భర్త పేరుతో ఉంటే తమపై ఎలాంటి చర్యలను తీసుకున్నా తలొగ్గుతామన్నారు. మీడియాలో తన భర్తపై లేనిపోని ఆరోపణలతో కూడిన కథనాలు ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా, రాజకీయంగా, కుటుంబపరంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించడం అన్యాయమని వాపోయారు. తన భర్త నిత్యానందరెడ్డిపై ఐదు కేసులున్నాయని, నేరచరిత్ర ఉందని ప్రచారం చేస్తున్నారన్నారు. అవన్నీ సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులేనని చెప్పారు. ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి పనితీరు, మాటతీరు అగౌరవ పరిచేవిధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దదస్తగిరి హత్య కేసులో నిందితులతో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుని తన భర్త పేరును చేర్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కొట్టి ఒప్పించడం ఏమాత్రం సహేతుకం కాదని, నిందితుల్ని కోర్టులో బహిరంగంగా విచారించాలని ఆమె కోరారు. డీఎస్పీ బాలస్వామిరెడ్డి విచారణపైనా, దర్యాప్తుపైనా తమకు నమ్మకం లేదన్నారు. ఈ కేసును ప్రత్యేకంగా విచారణ చేయించి, నిజాయితీగా దర్యాప్తు కొనసాగించాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తమ వ్యక్తిగత సహాయకుడు రాజ్కుమార్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా నిందితులలో ఒకరికి రూ.5 లక్షలు నిత్యానందరెడ్డి ఇచ్చినట్టు బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారని దీప్తిరెడ్డి ఆరోపించారు. -
వైఎస్ జగన్కు వేదపండితుల ఆశీర్వచనాలు
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద పండితుల ఆశీర్వచనాలు అందాయి. పులివెందులలోని వైఎస్ జగన్ నివాసంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం వేద పండితులు.ఆశీర్వాదాలు అందించారు ఈ మేరకు సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్కు అందించారు వేద పండితులు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 21) వైఎస్ జగన్ పులివెందులకు వచ్చారు. -
పులివెందులలో వైఎస్ జగన్
కడప: మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేటి నుంచి(ఏప్రిల్ 21వ తేదీ) మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు(బుధవారం, ఏప్రిల్ 22వ తేదీ) ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరి వెళతారు వైఎస్ జగన్. 9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి తిరగుపయనమవుతారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు.అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరుతారు.9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గాన వైఎస్ జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు. -
దస్తగిరి కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి: కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు. రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యాప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావనకడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ సీఎం జగన్ వస్తారని..ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కలి్పంచాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం.వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో.. దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప: కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించి కొన్ని పత్రాలు, ఒక ల్యాప్ట్యాప్ తీసుకెళ్లారు. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
23 నుంచి ఫుట్బాల్ జిల్లాస్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ఫుట్బాల్, బాక్సింగ్ జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ గౌస్బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● ఈనెల 23న పుట్బాల్ విభాగంలో సబ్ జూనియర్ అండర్–15, అండర్–20 విభాగంలోని క్రీడాకారులకు నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నా రు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ● ఈ నెల 24న సబ్ జూనియర్ అండర్–15, జూనియర్స్ అండర్–19 బాల బాలికలకు నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. మే 2 నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలు రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 616 జయంతి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో మే 2 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు తాళ్లపాక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ సోమవారం తెలిపారు. 8వతేది వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 2న తాళ్లపాకలోని ధ్యానమందిరంలో గోష్ఠిగానం, సప్తగిరి సంకీర్తనలు, 10గంటలకు శ్రీవారి కళ్యాణం ఉంటుందన్నారు. అలాగే అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద సాయంత్రం ఊంజలసేవ నిర్వహిస్తారన్నారు. 3 నుంచి 8వతేది వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. కడప సీసీఎస్ ఇన్స్పెక్టర్గా హాజివలి కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప సీసీఎస్ ఇన్స్పెక్టర్గా హాజివలి సోమవారం బాధ్యత లు స్వీకరించారు. నంద్యాల డీటీసీ నుంచి కడపకు బదిలీపై వచ్చారు. ఈయన గతంలో పులివెందుల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా, లింగాల ఎస్ఐగా, పులివెందుల ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్ఐగా పనిచేశారు. పోలీసు శాఖలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కడపలో నేరం నియంత్రణపై దృష్టి పెట్టనున్నట్లు హాజివలి తెలిపారు. ఏసీబీ సోదాలు రాయచోటి : రాయచోటిలో సోమవారం ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ సహాయ అధికారిగా బాలాజీ పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట విధి నిర్వహణలో ఉంటూ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కదిరితో పాటు రాయచోటిలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోమవారం తిరిగి సోదాలు చేసినట్లు తెలిసింది. ఈ సోదాలలో పలు భూమి రికార్డులు, బంగారు నగలు, డబ్బులు భారీగా పట్టుబడినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆయన ఇంటితోపాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఘనంగా చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ కడప ఎడ్యుకేషన్: కడప నగరం రహమతుల్లా వీధిలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లి అమిరురన్నిసా ఇంటి నుండి గంధం కళాశాన్ని తీసుకువచ్చి దర్గాలో గంధాన్ని సమర్పించారు. అలాగే దర్గా ఆవరణంలో ఉన్న జెండా ను అలంకరించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చే నెల మే 3వ తేదీ గంధం, 4వ తేదీ ఉరుసు, 5వ తేదీ తహలీల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దర్గా ముతవల్లి అమిరున్నిసా తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాష, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అమీర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు
కడప కోటిరెడ్డి సర్కిల్ : సమానత్వం, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప తత్వవేత్త, కవి, సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా ఎస్సీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. జిల్లా ఎస్సీ కార్యాలయంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ మాట్లాడుతూ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో జన్మించి సమానత్వం, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు అన్నారు. బసవేశ్వరుడు భక్తి మార్గాన్ని ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా వచనల రూపంలో ప్రవచించారన్నారు. ఈ వచనాలు సరళమైన భాషలో ఉన్నప్పటికి లోతైన సాత్విక సందేశాన్ని అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ రమణయ్య, ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలిప్రజల నుంచి పీజీఆర్ఎస్కు వస్తున్న ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు. -
దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా!
రాజంపేట : దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దళితుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశమే అని అనన్నారు. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని తెలిపారు. గతంలో అనేక సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. దళితులను హత్య చేసేందుకు అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెనుకంజ వేయడం లేదనడానికి ఒంటిమిట్ట దళిత యువకుడు ఈరి హర్షవర్ధన్పై జరిగిన దాడే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వాతావరణానికి ముప్పు తెచ్చేలా టీడీపీ రౌడీమూకలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అగ్రకులానికి చెందిన వారు దళిత యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరచడం దారుణమన్నారు. టీడీపీ రౌడీమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ నేత దండుగోపి ధ్వజం -
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం బాధాకరం
పులివెందుల : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల లోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారకతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే వైఎస్ జగనన్న శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలులో ఉండేదని, ఆ తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో దానిని అమలు చేయలేదన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థలలో ఏకంగా 54శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కొత్త అర్థం తీసుకొచ్చారన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది ఉంటే మహిళలు విధాన నిర్ణయాలలో భాగస్వామ్యులై ఉండేవారన్నారు. వైఎస్ జగనన్న చెప్పినట్లుగా 50శాతం సీట్ల పెంపుదలే ఉత్తమమైన విధానమని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ అవినీతిని, లోపాలను ప్రశ్నించిన వారిపై ఏకంగా దేశ ద్రోహం కేసులు పెట్టి రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు వీరు చేసే అరాచకాన్ని చూస్తున్నారని బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
జీతాలు, పెన్షన్లకు గ్రాంటు విడుదల చేయాలి
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేయాలి. లైబ్రరీ సెస్సు ఎప్పటికప్పుడు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలి. నిధులు మంజూరు చేయకుండా లైబ్రరీల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి. – నాదెండ్ల బాబ్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం, కడప -
సంబరాలకు డబ్బుంది.. రైతులను ఆదుకోవటానికి లేవా
● అమరావతి పేరుతో దోచుకుంటున్నారు ● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్రంలో రైతులు పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరలు వస్తాయని అశించారు.అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు లేక నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరితే తమ వద్ద డబ్బులు లేవంటూ అమరావతి పేరుతో ఊరురా సంబరాలు చేయడం కోసం ఖర్చు పెడుతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్క పొగాకు పంటలు వేసి నష్టపోయిన రైతులు చాలా మంది మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఎకరాకు దిగుబడి 35 క్వింటాళ్ల నుంచి 40క్వింటాళ్ల వరకు వచ్చింది. ఈ పంటకు ప్రభుత్వం మద్దతు ధర కింద రూ. 2400 ప్రకటించింది. అయితే ఎక్కడ కూడా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కోనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లి రైతులు అమ్మకాలను కొనసాగిస్తుంటే వారు క్వింటాకు కేవలం 1700 రూపాయలు చెప్పి తరుగులు తీయడంతో క్వింటాకు రైతులకు 1600 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ.30వేలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. శనగ పంటను రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైతులు సాగుచేశారు.ఈ ఏడాది ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర కింద రూ.5875 ప్రకటించింది.అయితే శనగ కొనుగోలు కేంద్రాల్లో శనగలు కొనుగోలు చేయడంలేదు. కొనుగోలు చేస్తున్నా కాంట్రాక్టర్లు చిలక్కొట్టుడు కొడుతుండటంతో రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్లో వ్యాపారుల వద్ద రూ. 4900కే శనగలు అమ్ముకుంటున్నారు. శనగ రైతు ప్రతి క్వింటాకు 900 నుంచి 1000 నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రైతులను అదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకోసం కేంద్రానికి లేఖలు పంపామని, ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు రూపాయలు దొచుకోవడం కోసం ఆగమేఘాలమీద అమరావతి బిల్లును కేంద్రానికి పంపించి, రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక చట్టం తెచ్చామని కూటమి నాయకులు చెబుతున్నారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో ఎందుకు లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో 3.56 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ డబ్బులను సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టారా అంటే ఆదీలేదు అని అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిందన్నారు. ఇన్పుట్ సబ్సిడీతోపాటు ఇన్సూరెన్స్లు ఇచ్చి రైతులను ఆదుకుందని తెలిపారు.ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జిల్లాప్రధానకార్యదర్శి రమణారెడ్డి, రైతు విభాగ నాయకుడు విశ్వనాథ్రెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, విష్ణువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● అమ్మ కావాలి..!
వాల్మీకిపురం : అంకుల్ అమ్మకు ఏమైంది.. అమ్మ కావాలి.. అంటూ చిన్నారి లోక్షిత రోధిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఆదివారం హత్యకు గురైన మౌనిక మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెంగళూరు నుంచి మృతురాలి కుమారుడు కౌసిక్ (7), లోక్షిత (5) ఆసుపత్రికి చేరుకున్నారు. తన అమ్మను చూడాలని గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో లోక్షిత పడిన తపన, ఆరాటాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పాపను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గంటల తరబడి ఏడుస్తూ తన అమ్మ కోసం పరితపించిపోయింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
రాజంపేట : చిట్వేలి పోలీసుసేష్టన్లో విధులు నిర్వర్తించేందుకు కానిస్టేబుల్ కే.సుధాకర్రాజు (56) రాజంపేట నుంచి బయలుదేరిన క్రమంలో సోమవారం పోలిచెరువు వద్ద డివైడర్ను ఢీ కొని మృతి చెందారు. దీంతో రాజంపేట సబ్బ్డివిజన్ పోలీసువర్గాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుధాకర్రాజు గతంలో రాజంపేట, మన్నూరు పోలీసుస్టేషన్లో పనిచేశారు. విధి నిర్వహణలో సుధాకర్రాజు క్రమశిక్షణతో పనిచేసేవారని తోటి కానిస్టేబుళ్లు గుర్తుచేసుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టరం నిర్వహించి, సంబంధీకులకు అప్పగించారు. సుధాకర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రాజంపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ నుంచి ఏ ఆర్, అక్కడి నుంచి సివిల్ కానిస్టేబుల్గా ప్రస్తుతం చిట్వేలిలో పనిచేస్తున్నారు. నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతిబి.కోడూరు : మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన చిన్నగురయ్య, సుమతిల మూడు సంవత్సరాల కుమారుడు మున్నెల్లివిహాన్ సోమవారం రాత్రి ఆడుకుంటూ నీళ్ల బకెట్లో పడి మృతిచెందాడు. విహాన్ కనిపించలేదని వెతుకుతుండగా నీళ్లబకెట్లో పడి ఉండటాన్ని గమనించారు. బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. -
ఆర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలి
జేసీ నిధి మీనాకడప సెవెన్ రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్తో పాటు ఇన్చార్జి డీఆర్ఓ వెంకట పతి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందులో కొన్ని...... ● జిల్లాలో ఎన్హెచ్ డీసీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల చేనేత కార్మికులు నష్టపోతున్నారని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున తెలిపారు. రాయతీ సౌకర్యం కల్పించే ఆ పథకాన్ని ప్రతి చేనేత కార్మికున్ని అందేలా చూడాలన్నారు. ● వేసవి తీవ్రత అధికంగా ఉన్నందువల్ల నగరపాలక సంస్దలో పని చేసే కార్మికుల విధి నిర్వహణ సమయాన్ని ఉదయం 5.30 నుంచి 11.30 వరకు ఉండేలా చూడాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుంకర రవి, కంచుపాటి శ్రీరాములు, ప్రకాశ్లు కోరారు. అలాగే విధి నిర్వహణలతో మరణించి అప్కాస్ మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగవకాశం కల్పించాలని కోరారు. -
విచారణకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు
కడప కార్పొరేషన్ : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 9వ తేదీ వైఎస్సార్సీపీ నాయకులు గుంటి నాగేంద్ర, డాక్టర్ నాగార్జునరెడ్డిలు చేసిన నిరసనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం వారు విచారణకు హాజరయ్యారు. కొత్త పలుకు అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చెబితే వారు తమ భార్యలను చెల్లెళ్లుగా భావించి ఇతరులకు సంబంధాలు చూసి పెళ్లి చేసే వెన్నెముక లేనివారని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు ఎన్. నాగార్జునరెడ్డి తదితరులు ఈనెల 9వ తేదీ రాధాకృష్ణ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆ పత్రిక బ్రాంచి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు ఈనెల 17వ తేదీ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో సోమవారం వారు పోలీసుల ఎదుట హాజరయ్యారు. కేసులో నమోదు చేసినవన్నీ బెయిలబుల్ సెక్షన్లే కావడంతో పోలీసులు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, చల్లా పవన్, సతీష్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా అక్షయ తదియ
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో ని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాల లో భాగంగా సోమవారం అక్షయ తదియ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెన్నా నదిలో స్నానాలు ఆచరించారు. అ నంతరం ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు చెన్నకేశవ స్వామి ఎదుట తడి బట్టలతో సాష్టాంగ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం లభిస్తుందనే ప్రగా ఢ విశ్వాసంతో అనేక మంది భక్తులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. వైభవంగా చెన్న కేఽశవుని పూలంగి సేవ శ్రీ చెన్నకేశవ స్వామికి పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధేశ్వర ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇష్ట వాహనాలపై హరిహరులు రాత్రి శ్రీ చెన్నకేశవ స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై భక్తుల కు దర్శనమిచ్చారు. గ్రామంలోని శ్రీ కామా క్షీ వైద్యనాఽథేశ్వర స్వాములు నంది వాహనంపై భక్తులను కరుణించారు. నేడు కల్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వాములకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి శ్రీలక్ష్మీ చెన్న కేశవ స్వామికి శ్రీదేవి, భూదేవిలతో కళ్యాణోత్స వం జరుగుతుంది. రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. -
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
● 21వ తేదీ మధ్యాహ్నం పులివెందులకు చేరుకోనున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ● క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణ ● 22న ఇప్పట్లలో వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ ● 23న తిరుగుపయనంపులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. ● 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరుతారు. 9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ● 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గాన వైఎస్జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు. -
రజకుని హత్య కేసులో నిందితుడు అరెస్టు
రాజంపేట : మండలంలోని పులపత్తూరు గ్రామంలో రజకుడు దంపెట్ల మల్లికార్జున హత్య కేసులో గోబుగారి సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతకక్షల కారణంగా పథకం ప్రకారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేశారన్నారు. పరారీలో ఉన్న సుబ్బారెడ్డిని నారమరాజుపల్లె నవోదయ కాలనీ వద్ద అరెస్టు చేశామన్నారు. రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో మన్నూరు సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గంజాయి కేసులో ఇద్దరు అరెస్ట్వేంపల్లె : వేంపల్లెలో గంజాయి సేవించడంతోపాటు విక్రయాలు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాయార్ హుస్సేన్లతో కలిసి పులివెందుల – రాయచోటి బైపాస్ రోడ్డులోని గవి మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద వేంపల్లెలోని శ్రీరాంనగర్కు చెందిన నల్లబల్ల మల్లికార్జున, యల్లంకూరు వెంకటేష్లు గంజాయి సేవించడంతోపాటు విక్రయాలు చేస్తుండడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసింహులు చెప్పారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతిమైదుకూరు : మండలంలోని వనిపెంట వద్ద సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని వనిపెంట సిద్ధమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్త సీతారామాపురం గ్రామానికి చెందిన వీరారెడ్డి, సిద్ధమ్మ దంపతులు మైదుకూరుకు వ్యక్తిగత పనిపై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్లేందుకు బ్రహ్మంగారిమఠం వెళ్లే బస్సు ఎక్కి వనిపెంటలో దిగారు. భర్త వీరారెడ్డి రోడ్డు దాటి వెళ్లగా సిద్ధమ్మ కూడా భర్తను అనుసరిస్తూ రోడ్డు దాటుతుండగా మైదుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
దస్తగిరి హత్య కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి :కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు.రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యా ప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావన కడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ వస్తారని.. ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కల్పించాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం. టార్గెట్ నిత్యానందరెడ్డి...?: వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో... దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావన మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శకు వస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం పోలీసుల డొల్లతనం బహిర్గతం అవుతుందని దర్యాప్తు డైవర్ట్ పాత పరిచయాలు, ఫొటోల ఆధారంగా కేసు చుట్టే యత్నంనిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప టాస్క్ఫోర్సు : కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించినట్లు తెలిసింది. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
ఆర్ఐపీఈగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆర్ఐపీఈ)గా డాక్టర్. ఎస్ రామకృష్ణ సోమవారం కడపలోని పాఠశాల విద్య ఆర్జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురం జిల్లా బుక్కపట్నం డైట్ కళాశాల ఇన్చార్జు ప్రిన్సిపల్గా పనిచేస్తూ బదిలీపై ఎఫ్ఏసీ ఆర్ఐపీఈగా జిల్లాకు వచ్చారు. ఈ మేరకు బాధ్య తలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆర్ఐఈపీని కలిసిన ఏపీ పీఈటీ అండ్ సాప్ అసోసియేషన్ నాయకులు ఆర్ఐఈపీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్. ఎస్ రామకృష్ణను ఏపీ పీఈఓ అండ్ సాఫ్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, ట్రెజరర్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అగ్గిరప్పయాదవ్, సంఘం సలహాదారు జిలానీబాష, సంఘ సభ్యులు మాధవి, లక్ష్మి, రాయుడు, మహేశ్వర్రెడ్డి, ఓబులేసు, విశ్వనాథ్లతోపాటు ఉపాధ్యాయులు కలిసి పూలగుచ్చంతో అభినందనలు తెలిపారు. ఏఐ..ప్రపంచాన్ని శాసిస్తుంది కురబలకోట: ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఏఐ నిలవబోతోందని బెంగళూరులోని క్లౌడ్ సెక్ కంపెనీ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ జయంత్ శర్మ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ప్రాజెక్ట్ ఎక్స్పో ఆన్ ఏఐ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ణానాలు భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తాయన్నారు. -
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తన పర్యటనలో బాగంగా వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మరుసటిరోజు(22న) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి ఇటీవలె మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చనున్నారు. తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం పర్యటన ముగించుకుని పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో ఆదివారం చైతన్య సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక –2026ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని, కవి నరాల రామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలపిట్ట మాస పత్రిక వారు 51 కథల సంకలనంగా ఉగాది ప్రత్యేక సంచిక మార్చి –2026ను తెచ్చిన ప్రతిక ఎడిటర్ గుడిపాటి వెంకట్ను ప్రశంసించారు. వివిధ ప్రాంతాల్లోని ప్రసిద్ధ కథకుల కథలను తీసుకుని కథా సంకలనంగా తేవడం ద్వారా పాఠకులు వివిధ ప్రాంతాల సంస్కృతి ఆచార సంప్రదాయాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. పట్టణానికి చెందిన కథా రచయితలు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా వెంకటరామారావు కథలు ఉండటం విశేషమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డీకే చదువుల బాబు కాశీవరపు వెంకటుబ్బయ్య రచించిన అల్లెంగుండు కథను సమీక్షించారు. రచయిత ఈ కథలో పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. రచయిత జింకా సుబ్రహ్మణ్యం పల్లా వెంకటరామారావు రచించిన దిద్దుబాటు కథనం సమీక్షించారు. ఈ కథలో పిల్లల దురాలవాట్లతో చెడిపోతున్నప్పుడు ఉపాధ్యాయుడు యుక్తిగా విద్యార్థులను చెడు అలవాట్ల నుంచి మాన్పించడం గొప్పగా ఉందన్నారు. ఈ సందర్భంగా కథా రచయితలు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా వెంకటరామారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు పల్లా కృష్ణ, కొత్తపల్లి శీను, కామనూరు రామ్మోహన్, ఆవుల శ్రీనివాస్, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, కుంభం పామిలేటి పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని కల్లూరు గ్రామ శివారులో చేపలు పట్టేందుకు వెళ్లిన కంబగిరి (50) విద్యుత్ షాక్తో మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్లమాపురం గ్రామానికి చెందిన కంబగిరి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామంలోని కొందరు వ్యక్తులతో కలిసి అతను ఆదివారం కల్లూరు కేసీ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి లైను లాగి ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా అందరూ చేపలు పట్టసాగారు. ఈ క్రమంలో కంబగిరి అనుకోకుండా నీళ్లలోకి దిగడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
కూటమి ప్రభుత్వం క్రీడాకారులతో ఆటలాడుకుంటోంది. ఆటల్లో రాణించి బంగరు భవితకు బాటలు వేసుకుందామనే యువత ఆశలను ఆదిలోనే నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంపై అక్కసుతో జాతీయ క్రీడ హాకీకి ఆటంకాలు కలిగిస్తోంది . జిల్లా కేంద్రమైన కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో మూత వేసి
వాకర్స్ మధ్యలో హాకీ ఆడుతున్న క్రీడాకారులు కడప వైఎస్సార్ సర్కిల్: జాతీయ క్రీడ హాకీపై కడప క్రీడాకారులకు ఆసక్తి ఎక్కువ. గతంలోనూ ఇక్కడి నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు. నేటితర ఆటగాళ్లు కూడా హాకీలో రాణించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇక్కడి క్రీడాకారుల ఆసక్తిని గమనించి.. వారిని మరింత ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మున్సిపల్ స్టేడియంలో ఆస్ట్రనాట్ టర్ఫ్ పిచ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సహకరించిన ఎంపీ, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మేయర్ కడప స్పోర్ట్స్ స్కూల్ నుంచి బయటికొచ్చిన ఆటగాళ్లు క్రీడల్లో మరింత రాటుదేలాలనే కసితో మున్సిపల్ స్టేడియంలో రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేక డీలాపడుతున్నారు. ముఖ్యంగా హాకీని ఎంచుకున్న ఆటగాళ్లు ఎర్రమట్టి పిచ్పైనే సాధన చేస్తూ.. జాతీయస్థాయిలో టర్ఫ్ పిచ్పై ఆడడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో అప్పటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అవినాష్రెడ్డి సహకారం కూడా తోడైంది. స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం టర్ఫ్ కోర్టు నిర్మాణానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. సీమ బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే సదాశయంతో ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో టర్ఫ్ పిచ్ను అత్యున్నతంగా తీర్చిదిద్దింది. రూ.8కోట్లతో 2023లో ప్రారంభించిన ఈ నిర్మాణ పనులు 2024ప్రారంభంలో పూర్తయ్యాయి. ఆపై ఎన్నికల కోడ్ రావడం.. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రారంభానికి ఆమడదూరంలో ఉండిపోయింది. మట్టిలో ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం డీఎస్ఏ క్రీడా మైదానంలో మట్టిలో హాకీ ప్రాక్టీస్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా క్రీడాకారుల సంక్షేమం కోసం ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ కావాలని గత వైఎస్ఆర్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రీడాకారులందరం అడిగిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కడపలో ఈ పిచ్ నిర్మాణానికి సహకరించారు. పూర్తయి మూడేళ్లయినా ప్రారంభం కాలేదు. మైదా నం బయట ఆడుతుంటే వాకర్స్ మమ్మల్ని తిడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ను ప్రారంభించాలి. –ప్రదీప్, హాకీ స్టేట్ ప్లేయర్ వైఎస్సార్ కడప జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహానేత వైఎస్ఆర్ కడపలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మించారు. అందులో చేరినవారు ఇప్పటికే పతకాల పంట పండించారు. ఎంతోమంది జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే రంజీ మ్యాచులు జరిగే విధంగా ఏసీఏ –వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. మహానేత వైఎస్సార్ ఎంతో ముందు చూపుతో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే నేటి కూటమి ప్రభుత్వం క్రీడలపై చిన్నచూపు చూస్తోంది. హాకీ టర్ఫ్ కోర్టును పూర్తి చేసినగత వైఎస్సార్ సీపీ సర్కారు రెండేళ్లుగా తాళం వేసిన కూటమి సర్కారు ప్రాక్టీస్ కోసం తీవ్ర ఇబ్బందులుపడుతున్న క్రీడాకారులు మూడేళ్లయినా ప్రారంభం కాలేదు టర్ఫ్ పిచ్ పూర్తయి దాదాపు మూడేళ్లయినా ఇంతవరకు ప్రారంభం కాలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా క్రీడాకారుల భవిష్యత్ కోసం ఈ పిచ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హాకీని మట్టిపై ఆడటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రౌండ్లో ఆడుతుంటే వాకర్స్కు మాకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి ఇంటర్నేషనల్ హాకీ టీం ఆడాలంటే ఈ పిచ్లు ఎంతో అవసరం. దీనిని ప్రారంభించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్, డీఎస్డీవోకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జితేష్, క్రీడాకారుడు.కడప కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కడపతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎర్రమట్టిపై హాకీ ప్రాక్టిస్ చేసి ఇంటర్నేషన్లో ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్పై ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో దాదాపు రూ.8. కోట్లతో టర్ఫ్ పిచ్ నిర్మించింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవ చూపారు. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షతతో ప్రారంభించకపోవడం బాధాకరం. –దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం -
పోలీస్స్టేషన్ను ముట్టడించిన దళితులు
ముద్దనూరు : స్థానిక అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ను ఆదివారం సాయంత్రం ఎస్వీగిరి కాలనీకి చెందిన దళితులు ముట్టడించారు.సుమారు గంటసేపు స్టేషన్ ఆవరణలో గుమికూడారు.బాధిత దళితుల సమాచారం మేరకు ఎస్వీగిరి కాలనీకి చెందిన శివకుమార్ అనే దళిత యువకున్ని ఆదివారం ఉదయం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఎటువంటి కారణం లేకుండా పోలీసులు కొట్టారని, దీంతో శివకుమార్కు గాయాలయ్యాయని, బాధితున్ని బయటకు పంపించాలని నినదించారు.అనంతరం శివకుమార్ను బంధువులు ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటనపై సీఐ నగేష్బాబు మాట్లాడుతూ ఆదివారం ఉదయం స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించామని, శివకుమార్ కూడా రౌడీషీటర్ కావడంతో కౌన్సెలింగ్లో భాగంగా అతనిని మందలించినట్లు తెలిపారు. -
26న చలో తిరుపతి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 26 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18 రాష్ట్ర మహాసభలును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్,కేసి. బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలోని హోచిమిన్ భవన్లో దీనికి సంబంధించిన పోస్టర్లను అవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు నోయిడాలో కార్మికుల ఆందోళన కార్యక్రమాలు చూసైనా కళ్ళు తెరవాలన్నారు మహాసభలలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు చేసి చర్చిస్తామని, రాబోయే కాలంలో కార్మికవర్గ పోరాటలకు దిశానిర్దేశం చేయడానికి దోహదపడుతాయన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటిస్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని అన్నారు. కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మద్దిలేటి, జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, నగర అధ్యక్షులు మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి తర్వాత వేగంగా ఉపాధి పొందే అవకాశాలు కలిగిన కోర్సు పాలిటెక్నిక్. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సెక్టార్లోను పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులభంగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో యువత పాలిటెక్నిక్పై ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 28,152 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 9283 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆపరాధ రుసుంతో పాలిసెట్కు దరఖాస్తు చేసుకునే వెసలుబాటు ఉంది. దీంతో దరఖాస్తు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం.... గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అమ్మాయిలకు ప్రత్యేకం... కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల అమ్మాయిలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్(ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్(ఈసీ), సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లమా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాలలో ఒక బ్రాంచికు 60 సీట్లు చొప్పున 240 సీట్లు ఉన్నాయి. దీంతోపాటు హాస్టల్ వసతి కూడా కలదు. ప్రారంభమైన ఉచిత శిక్షణ... జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్ను అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి ఉచిత పాలిసెట్ శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ర్యాంకు సాధిస్తాం... ఈ నెల 25వ తేదీ నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షలో తప్పకుండా ర్యాంకును సాధిస్తాం. కడప మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో తీసుకున్న కోచింగ్ నాకు బాగా ఉపయుక్తంగా ఉంది. బాగా చదువుకున్నాను. తప్పకుండా ర్యాంకు సాధిస్తా. – వినంత్ , విద్యార్థి, కడపచక్కటి ఉపాధి డిప్లొమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడటానికి పాలిటెక్నిక్ సరైన మార్గం, విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. ఉన్నత చదువు లకు సైతం ఉపయోగపడుతుంది.– సీహెచ్ జ్యోతి, పాలిసెట్ కన్వీనర్, ప్రభుత్వ మహిళా పాటిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, కడప. ఉచిత మెటీరియల్తో ఉపయోగం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఇచ్చిన మెటీరియల్ బాగా ఉంది. దీంతోపాటు కళాశాలలో చెప్పిన ఉచిత కోచింగ్తో రెండింటితో తప్పకుండా ర్యాంకు సాధిస్తాం. – మధురిమ, విద్యార్థి,కడప 2పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇన్పిరేషన్ టెక్నాలజీ (ఐటి)తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలోని కడప, పొద్దుటూరు, వేంపల్లి, సింహాద్రిపురం, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, కమలాపురంలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో దాదాపు 3800 సీట్లు ఉన్నాయి. అలాగే జిల్లాలొ 12 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4200 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిసి 8000 దాకా సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రారంభమైన ఉచిత పాలిసెట్ శిక్షణ జిల్లావ్యాప్తంగా 9283 మంది దరఖాస్తు 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష... -
పెద్ద దస్తగిరి హత్య కేసులో 11 మంది నిందితుల అరెస్ట్
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఆవరణలో ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున కలమల్ల పెద్ద దస్తగిరి (53) అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన 11 మంది నిందితులను ఈనెల 18న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లు , కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రిమాండ్కు పంపించారు. అరెస్టయిన వారిలో చెన్నూరు టౌన్కు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తున్న అన్నదమ్ముల్లో తమ్ముడు పేరం రవి, అన్న పేరం రాజు అలియాస్ రాజాను, కడప నగరం అలంఖాన్ పల్లెకు చెందిన అవ్వారి వెంకటేష్, తిరుపతి సురేంద్ర అలియాస్ సురేంద్ర అలియాస్ జాకీ, అలంఖాన్ పల్లె, రాణితోటకు చెందిన వనపర్తి వెంకట మనోహర్ అలియాస్ మనోహర్, వల్లూరు మండలం చిన్నలేబాక గ్రామానికి చెందిన లేవాకు ఉపేంద్ర రెడ్డి అలియాస్ ఉపేంద్ర, అలంఖాన్ పల్లెకు చెందిన గంధం విజయకుమార్, హరిగోపుల శివప్రసాద్, ఆదిమూలపు వెంకట నరేంద్ర అలియాస్ నరేంద్ర, కడప నగరం పక్కీరుపల్లెకు చెందిన గొడుగునూరు రామగోపాల్ వర్మ అలియాస్ వర్మ, సిద్దవటం మండలం వంతాటిపల్లెకు చెందిన పెయ్యల శివ ఉన్నారు. వీరు ఈనెల 6న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఐపీ, ఓపీ భవనాల మధ్య ఉన్న తారురోడ్డులో కలమల్ల పెద్ద దస్తగిరి(53)ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరిని కత్తిపోట్లకు గురి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై మృతుని కుమారుడు కలమల్ల వెంకట దస్తగిరి ఫిర్యాదు మేరకు రిమ్స్ పీఎస్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారుడు వెంకట దస్తగిరి ఫిర్యాదులో తన తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తుండగా, తల్లి రమణమ్మ ఇంటి పనులు చూసుకునేది. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు, బీటెక్ చదువుతున్న అతని ఇద్దరు సోదరీమణులు నాగపద్మిని, రాగిణి. వెంకటదస్తగిరికి చదువులో అంతగా పట్టు లేకపోవడంతో, ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ చదివి, రెండోసంవత్సరం పరీక్షలు రాసి, ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈనెల 4వ తేదీన గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా, వెంకట దస్తగిరి రాత్రి ఊరేగింపులో పాల్గొని, ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు వారి గ్రామానికి చెందిన హత్య కేసులో నిందితుడైన అవ్వారి వెంకటేష్ అలియాస్ వెంకీపై పడ్డాడు. దీంతో వెంకీ అతనిపై దాడి చేశాడు. వెంకట దస్తగిరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. అతని తండ్రి, హతుడు పెద్ద దస్తగిరి, అతని మేనమామ చిన్న దస్తగిరి, ఇతర కుటుంబ సభ్యులు వెళ్లి అవ్వారు వెంకటేష్ అలియాస్ వెంకీని మందలించారు. దీంతో వెంకీ, అతని స్నేహితులు ఇంటికి తిరిగి వచ్చి జిల్లాపరిషత్ ఉన్న పాఠశాల సమీపానికి చేరుకున్నారు. వెంకీ స్నేహితులైన వనపర్తి వెంకట మనోహర్ అలియాస్ మనోహర్ వారిపై పగ పెంచుకున్నారు. ఈనెల 5వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు, వెంకటేష్, మనోహర్లు వెంకట దస్తగిరితో గొడవపడి దాడి చేశారు. అతను వెళ్లి తన తండ్రికి, తనకు కావాల్సిన వారికి చెప్పవచ్చని బెదిరించారు. అతను ఫోన్న్లో తన తండ్రికి ఈ విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే మనోహర్తో పాటు, వెంకీ పెద్ద దస్తగిరి ఇంటికి వెళ్లి ఇంటిలోని వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారంతా వైద్య సేవల కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. వారికి సహాయం చేసేందుకు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరితో పాటు, కుటుంబసభ్యులు వెళ్లారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి ఈ హత్య కేసులో అరెస్టయిన వారంతా కత్తులతో నేరుగా రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాల్లో రిమ్స్కు చేరుకున్నారు. 5వ తేదీ అర్థరాత్రి నుంచి కాపుకాసి, 6వ తేదీన తెల్లవారు జామున (3 గంటల ప్రాంతంలో రిమ్స్ ఐపీ, ఓపీ భవనాల మధ్యన పెద్ద దస్తగిరిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరిపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తరువాత తాము వచ్చిన వాహనాల్లో పరారయ్యారు. మారెమ్మ తిరునాలలో జరిగిన చిన్న ఘర్షణ ఒక వ్యక్తి హత్యకు, మరొకరు ప్రాణాపాయస్థితికి చేరుకునేలా చేసిందని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా నివేదికలో పేర్కొన్నారు. ఎట్టకేలకు కడపలోని పోలీసు శిక్షణా కేంద్రం (డీపీటీసి) సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, ఆదివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. రిమాండ్ కోసం కడప కేంద్రకారాగారానికి పంపించామని రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఇంకా ఈ హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.పథకం ప్రకారమే హత్య చేశారని విచారణలో వెల్లడి -
పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో వృద్ధురాలు మృతి
వల్లూరు : పుష్పగిరిలో ఆదివారం రాత్రి మైదుకూరు ప్రాంతానికి చెందిన సుమారు 70 సంవత్సరాల వయసు గల సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని దైవ దర్శనాలతోపాటు రాత్రి పుష్పగిరిలో బస చేయాలనే ఉద్దేశంతో కొందరు బంధువులతో కలిసి వచ్చింది. పెన్నా నది ఒడ్డున జరుగుతున్న అన్నదాన కార్యక్రమం వద్ద అందరితో కలిసి భోంచేసింది. అనంతరం అందరూ కలిసి సమీపంలో కూర్చుని మాట్లాడుకుంటుండగా సుబ్బమ్మ గుండెల్లో నొప్పిగా వుందంటూ పక్కకు ఒరిగింది. ఆమెకు సపర్యలు చేసినప్పటికీ అప్పటికే మృతి చెందింది. ఎండ తీవ్రత నేపథ్యంలో వడదెబ్బతో ఆమె మృతి చెంది ఉండవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. -
వైభవంగా చెన్నకేశవుని చందనోత్సవం
నేడు అక్ష తదియ తిరునాలవల్లూరు: పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో శ్రీ చెన్న కేశవ స్వామి మూల విరాట్కు చందనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. చందన భూషితుడై నయనానందకరంగా వున్న స్వామి వారి దివ్య రూపాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ● పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధ స్వామి రాత్రి మయూర వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హనుమంత వాహనంపై కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పగిరిలో నేడు అక్ష తదియ ఉత్సవాలు: బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అతి ముఖ్యమైన అక్షయ తదియ తిరుణాల ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉదయం చెన్న కేశవునికి పూలంగి సేవ జరుగుతుంది. రాత్రి జరిగే వైద్యనాథుడి నందివాహన సేవకు, శ్రీ చెన్న కేశవుని గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. -
ఓఅండ్ఎం విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఇవ్వాలి
కడప కార్పొరేషన్ : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలని ఓఅండ్ఎం విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దవనం దొరబాబు, డిస్కం సెక్రటరీ బి. మురళీమోహన్, డిస్కం ప్రెసిడెంట్ డి. మౌలాలి డిమాండ్ చేశారు. ఆదివారం కో ఆపరేటివ్ కాలనీలోని ఓ ప్రైవేట్ భవనంలో తమ డిమాండ్లతో కూడిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 2026 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికై నా విద్యుత్ సంస్థ యాజమాన్యం తక్షణమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, ఓ అండ్ ఎం కార్మికులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, ఆ మేరకు సిబ్బంది నియామకాలు జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ జి. చంద్ర ఓబుల రెడ్డి, రీజినల్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. దస్తగిరి, డివిజనల్ సెక్రటరీ హరి ప్రసాద్, డివిజనల్ ప్రెసిడెంట్ గురు ప్రసాద్, టి. శేఖర్, జగదీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
మదనపల్లె టౌన్ : సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆదివారం ఏ–20 నిందితుడిని స్థానిక 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ పావని తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్సత్రిలో విజయవాడకు చెందిన సాడి జమున(29) కిడ్నీ తొలగించే క్రమంలో వైద్యం వికటించి ఆమె మత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్ టెక్నీషియన్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్లసత్య, పిల్లి పద్మ, సూరి బాబుతో పాటు కిడ్నీ తొలగించిన డాక్టర్లు ఆంజనేయులు, పార్థసారథిరెడ్డితో కలిపి మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయగా అందులో 11మందిని అరెస్టు చేశారు. ఆదివారం 20వ నిందితుడిగా ఉన్న కడపకు చెందిన గ్లోబల్ ఆస్పత్రి ఓటీ అసిస్టెంట్ నవీన్ (28)ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. -
22న జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని జయనగర్ కాలనీ జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ఈ నెల 22న జిల్లాస్థాయి బాస్కెట్బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2008 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు మే 1 నుంచి 4 వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. కడప అగ్రికల్చర్: కడప మార్కెట్యార్డులో సోమవారం పసుపు క్రయవిక్రయాలు జరగవని కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ బి. శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఇక మీదట పసుపును రోజు మార్చి రోజు క్రయ విక్రయాలను చేపడతామని తెలిపారు. ప్రస్తుతం రైతులు భారీగా పసుపును అమ్మకం నిమిత్తం కడప మార్కెట్యార్డుకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఒకే రోజు టెండర్, తూకాలతోపాటు తూకం అయిన సరుకు బయటకు పంపడం ఆలస్యం అవుతుందని తెలిపారు. అంతేకాక కడప మార్కెట్యార్డు సామర్థ్యం రోజుకు 2500 క్వింటాళ్ల కాగా ప్రస్తుతం రోజుకు 3500 క్వింటాళ్లు సరుకు వస్తోందని తెలిపారు. వచ్చిన మొత్తం సరుకును అన్లోడింగ్ చేసి టెండరుకు పెట్టడానికి మార్కెట్యార్డులో స్థలం సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు కోనుగోలుదారులు, కమీషన్ ఏజెంట్లతో చర్చించి రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో పసుపును రోజు మార్చి రోజు క్రయ విక్రయాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నందలూరు: శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమైందని ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ యద్దల సుబ్బరాయుడు తెలిపారు. ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు 2026 సంవత్సరం మార్చి 31వ తేదీకి వివిధ బ్యాంకుల్లో రూ.2,51,38,720లకు చేరుకున్నా యని పేర్కొన్నారు. ఆదివారం సేవ ట్రస్ట్లో ట్రస్టు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ 2025– 26 మార్చి నాటికి అన్నదాన పథకానికి అయిన జమా ఖర్చులు పరిశీలించామని తెలిపా రు. ఈ వేసవి కాలంలో భక్తులకు మంచినీటి వసతి కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, కార్యదర్శి కె.శైలేంద్రనాథ్, గంటా వాసుదేవయ్య, పల్లె సుబ్రమణ్యం, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య, సర్దార్ పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కలెక్టరేట్లో సోమవారం జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ● సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్లో ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కలెక్టరేట్ లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్ )‘ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా ఉంటుందని వివరించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని వివరించారు. -
● కూటమి ఆటంకాలు...
కూటమి నేతలు క్రీడాకారులకు ఆటంకాలు సృష్టిస్తోంది. ‘పూర్తయిన టర్ఫ్ పిచ్ గ్రౌండ్కు తాళం వేశారు.. కీ ఓపెన్ చేయండి సార్’ అంటూ పలువురు ఆటగాళ్లు పొరుగునే ఉన్న క్రీడా శాఖ మంత్రిని విన్నవించారు... కనిపించిన అధికారులను అడిగారు.. కడప ఎమ్మెల్యేని వేడుకున్నారు.. ఎవరికీ మనసు రాలేదు.. జాతీయ క్రీడపై, క్రీడాకారులపై కాస్తయినా కనికరం చూపలేదు.. అధికారంలో ఉన్న వీళ్లు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. హాకీ కోర్టుకి వేసిన తాళం తీస్తే చాలు..అది చేయడానికి వీరికి చేతు లు రావడం లేదు.. సందర్భం వస్తే వేదికలపై గొప్ప ఉపన్యాసాలు, విన్యాసాలు చేసే కూటమి నేతలకు, అధికారులకు క్రీడాకారులకు మేలు చేయాలనే తలంపు లేకపోవడం విచారకరమని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా హాకీ కోర్టుకి వేసిన తాళం తీసేసి ప్రాక్టీస్ చేసుకునే చర్యలు చేపట్టాలని క్రీడాకారులు కోరుతున్నారు -
సమస్యల పరిష్కారానికి కృషి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని కడప జిల్లా రికగ్నైజ్డ్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్ట్ అసోసియేషన్ (క్రుష్మ) జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు. క్రుష్మ జనరల్ బాడీ సమావేశం ఆదివారం కడపలోని రాయచోటి రోడ్డు రోడ్డులో ఉన్న ఎస్పీ కన్వెన్షన్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా క్రుష్మ జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ తరుణంలో కలసికట్టుగా ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయలు ఇవ్వలేదన్నారు. దీనివల్ల ప్రవేట్ పాఠశాలలకు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నామయన్నారు. ఈ విషయమై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను కలిసినప్పుడు ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఒక్క సంవత్సరానికి మాత్రమే ఫీజు బకాయిలు చెల్లించారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కచ్చితంగా పూర్తి బకాయిలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు క్రుష్మ నాయకుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. నూతన కమిటి ఎన్నిక : జనరల్ బాడీ సమావేశం అనంతరం క్రుష్మ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా లెక్కల జోగిరామిరెడ్డి (పవన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కడప), ప్రధాన కార్యదర్శిగా సిఎస్.రామాంజనేయరెడ్డి (స్వామి వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్, వేంపల్లి), శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ సుబ్రమణ్యం కోశాధికారిగా మరో 25 మంది కరస్పాండెంట్లను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వివిధ హోదాల్లో ఎన్నుకున్నారు.క్రుష్మ జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి -
మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి
ఒంటిమిట్ట: చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిజన వాడకు చెందిన ఈరి హర్షవర్ధన్ అలియాస్ నాని (23) అనే దళిత యువకునిపై శనివారం రాత్రి టీడీపీ అగ్రకుల మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ నెల 5వ తేదీ పుష్పయాగం రోజు రాత్రి జైంట్ వీల్ వద్ద ఒంటిమిట్ట హరిజన వాడ యువకులకు– గంగపేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న కొత్తపల్లి గ్రామ యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. చిన్నకొత్తపల్లికి చెందిన యువకులు దానిని అక్కడితో వదిలి పెట్టలేదు. గొడవతో ఎలాంటి సంబంధం లేని హరిత హోటల్లో సర్వర్గా పని చేస్తున్న హర్షవర్ధన్కు చిన్నకొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఫోన్ చేసి ‘హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ సర్వీస్ చేయాలి’ అంటూ పిలిచాడు. హోటల్ వద్దకు వెళ్లగానే హర్షవర్ధన్పై మల్లికార్జున, పలుకూరి కిరణ్, హేమంత్, కట్టా వేణు, కట్టా కిశోర్, కట్టా బాలకృష్ణ మూకుమ్మడిగా దాడి చేశారు. ‘మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి.. తరువాత అంతా మన టీడీపీ నాయకులు చూసుకుంటారు’ అంటూ కుల దూషణ చేస్తూ ముఖంపై రక్తం వచ్చేలా పిడి గుద్దులు గుద్దారు. నడుముపై క్రికెట్ బ్యాట్తో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న హర్షవర్ధన్ను స్థానికులు, బంధువులు వైద్యం కోసం స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు 108 సహాయంతో తరలించారు. పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనతో కేసు నమోదు విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట దళితవాడ, అరుంధతి వాడ ప్రజలు ఆదివారం బాధితుడితో కలిసి ఒంటిమిట్ట పోలీసుస్టేష న్ వద్దకు చేరుకున్నారు. న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు . స్టేషన్ బయట ఉన్న జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేసి, నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, ప్రశాంతంగా ఉండే ఒంటిమిట్ట మండలంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం పురుడు పోసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు. హర్షవర్ధన్పై దాడి చేసిన వారే గతంలో చెంచుగారిపల్లి వద్ద ఉన్న చిల్లర అంగడిని కూడా పెట్రోల్ పోసి దహనం చేసినట్లు విమర్శలు ఉన్నాయి. దళితునిపై టీడీపీ రౌడీ మూకల విచక్షణారహిత దాడి వైఎస్సార్ కడప జిల్లా, ఒంటిమిట్టలో దారుణం -
ఎడతెగని అల్ట్రాటెక్ పంచాయితీ
సాక్షి టాస్క్ఫోర్సు : వైఎస్సార్ కడప జిల్లా చిలంకూరు ప్రాంతంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నాలుగు రోజులుగా కూటమి శ్రేణులు శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమలోని సిమెంట్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నప్పటికీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా యంత్రాంగం స్పందించక పోవడం పట్ల ఈ ప్రాంతంలోని కార్మిక వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పరిశ్రమతో ఏమాత్రం సంబధం లేని వ్యక్తులు శిబిరాన్ని ఏర్పాటు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ఎంతకు దిగిరాక పోవడంతో అసహనానికి గురైన కూటమి శ్రేణులు ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో బోధపడక పరిశ్రమలను నిర్బంధిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల వల్ల చాలామంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరస్థితి నెలకొంది. కార్మిక శాఖతో పాటు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ, ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించాల్సి ఉంది. కానీ అధికార పార్టీ నేతలు కావడంతో అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.స్పందించని జిల్లా అఽధికార యంత్రాంగం -
రాజంపేటలో దందా!
● పెట్రోల్ బంక్ స్థలం కొట్టేయడానికి యత్నాలు ● క్వారీలను కట్టబెట్టాలని బెదిరింపులు ● అల్లాడిపోతున్న అన్ని వర్గాలురాజంపేట : రాజంపేటలో టీడీపీ ముఖ్యనేత దందా యథేచ్ఛగా కొనుసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ నేత తీరు తెన్నులపై ఇక్కడ ప్రజానీకంలో చిన్నచూపు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తాననని పదేపదే ప్రచారం చేసుకుంటున్న తరుణంలో దోచుకుంటున్నారనే అపవాదును ఇక్కడి ముఖ్యనేత మూటకట్టుకున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతున్నాయని అధికారపార్టీలో చర్చ జోరుగా కొనసాగుతోంది. పురపాలిక పెట్రోలుబంక్ స్థలం కొట్టేసేందుకు .. రాజంపేట నడిబొడ్డున ఉన్న పెట్రోల్బంకు నిర్వహణ పురపాలికస్థలంలో ఉన్నందుకు పురపాలికకు కేవలం రూ.1 అద్దె చెల్లిస్తూ కొన్నేళ్లుగా కొనసాగింది. రాజంపేటకు పురపాలిక సంఘానికి కమిషనరుగా ఫజులుల్లా వచ్చిన నేపథ్యంలో పెట్రోలు బంకు నిర్వహణ, స్ధలం వ్యవహారం వెలికి తీసారు. అప్పట్లో పెట్రోలు బంకు యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కమిషనర్లు ఎవరూ పట్టించుకోలేదన్న వాదన పట్టణవాసుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం కౌన్సిల్ పురపాలిక స్థలంలో పెట్రోలు బంకు నిర్వహణపై దృష్టి సారించింది. పెట్రోలు బంక్ నిర్వహణను అడ్డుకున్నారు. అయినప్పటికీ దొడ్డిదారిలో నిర్వహణ కొనసాగుతోందని కౌన్సిల్లో ఆరోపించారు.అంతేకాకుండా పెట్రోలు బంకు స్థలంపై కొందరి కన్ను పడిందని కౌన్సిల్ మీట్లో ఆరోపించారు. పెట్రోలుబంకు స్థలం కోట్ల రూపాయిలు విలువ చేస్తుంది.దీనిని ముఖ్యనేత తమ తమ్ముళ్లుకు అప్పజెప్పాలనే యోచనలో ఇప్పటికే పావులు కదిపినట్లు ప్రచారం. ఇప్పుడు పురపాలికస్ధలాలు కాపాడుకోవాలనే యోచనలో పురపాలిక కౌన్సిల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. క్వారీలను కట్టబెట్టాలని.. బెదిరింపులు మండలంలో కొందరి క్వారీలను తమకు కట్టబెట్టాలని సంబంధిత యజమానులపై బెదిరింపులు, ఒత్తిళ్లకు టీడీపీ ముఖ్యనేత దిగారు. చివరికి సంబంధిత మైన్స్ అధికారులను క్వారీ వద్దకు పంపించడం, లేని పోని ఆంక్షలు, నిబంధనలతో క్వారీ నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. క్వారీని కట్టబెట్టడమో, లేక ఆదాయంలో వాటాను ఇవ్వాలని రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే చెయ్యేరులో ఇప్పుడు నడుస్తున్న ఇసుక రీచ్లో ముఖ్యనేతకు వాటా ఇవ్వాల్సిందేనని ఇసుకరీచ్ నిర్వాహకులకు హుకుంజారీ చేశారు. ఆదాయం కోసం పక్కదోవ.. నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేత ఆదాయం కోసం పక్కదోవ పడుతున్నాడు. ప్రతిదానిలో కమిషన్ ఉండాల్సిందేనని టీడీపీలోని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కొందరైతే నేరుగా చినబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యనేత చేతిలో నుంచి పగ్గాలను తీసేయాలని అధిష్టానానికి సీనియర్లు మొరపెట్టుకున్నారు. కేవలం ముఖ్యనేత వర్గమే నియోజకవర్గంలో చేపడుతున్న ఆధిపత్యాన్ని అన్ని సామాజికవర్గాలకు చెందిన తమ్ముళ్లు మదనపడుతున్నారు. -
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, అమరావతి/కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 22న ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.ఇటీవల మృతి చెందిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 23న ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. గత అర్ధరాత్రి ఎస్సీ కులానికి చెందిన హర్షవర్ధన్ పై మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. 10 మంది టీడీపీకి చెందిన నాయకులు దాడి చేసి హర్షవర్థన్ను తీవ్రంగా గాయపరిచారు. నోట్లో గుడ్డలు కుక్కి మరీ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు హర్షవర్థన్ పేర్కొన్నాడు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారన్నాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ను 108 అంబులెన్స్లో హుటాహుటిన కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు బంధువులు. దాడికి సంబంధించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు బాధితులు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేయకుంటే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. అవసరమైతే రాస్తారోకో చేసేందుకైనా వెనుకాడమని హెచ్చరికలు పంపాయి. -
రైతు బిడ్డకు 99 శాతం మార్కులు
మైలవరం : హలం పట్టి పొలం దున్ని చెమటోడ్చి పని చేస్తూ పిల్లలను చదివిస్తున్న ఓ కన్నతండ్రి కష్టానికి సార్థకత చేకూర్చింది ఆ పల్లెటూరి అమ్మాయి. తల్లిదండ్రులు తనపై ఉంచిన బాధ్యతను చిన్నవయసులోనే గుర్తెరిగి శ్రద్ధతో చదివి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 99 శాతం మార్కులను సాధించింది. కన్నవారి కలలను సాకారం చేసే దిశగా తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితాన్ని అందించి పెద్దల ఆశలకు ఒకింత రూపునిచ్చింది. మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన వెంపలాకు పెద్దిరాజు కుమార్తె లక్ష్మీ ప్రణీత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 455 మార్కులకుగాను 451 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తనను చదివిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తెరిగిన.. ఆ అమ్మాయి అహర్నిశలు కష్టపడి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును చేరుకోగలిగింది. ఆంగ్లంలో మూడు మార్కులు, సంస్కృతంలో ఒక మార్కు కోల్పోయిన ఆ విద్యార్థిని గ్రూపు సబ్జెక్టుల్లో వంద శాతం మార్కులను సాధించింది. వైద్యవిద్యలో సీటు సంపాదించి పల్లె సీమల్లో ఉచిత సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని లక్ష్మీ ప్రణీత గట్టి విశ్వాసంతో చెబుతోంది. వాస్తవానికి ఆమె తండ్రి పెద్దిరాజు కూడా డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని ఉన్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ కష్టపడి పిల్లలను చదివిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం పెద్ద కుమార్తె లక్ష్మీప్రణీత తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని అందించి చెల్లికి, తమ్మునికి ఆదర్శంగా నిలిచింది. ఉత్తమ మార్కులు సాధించి కుటుంబానికి ఆనందాన్ని మిగిల్చింది. ఇంటర్మీడియట్లో విద్యార్థిని విశేష ప్రతిభ తండ్రి కష్టాన్ని గుర్తెరిగి చదివిన పల్లెటూరి అమ్మాయి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు -
అగ్గితో ఆటలొద్దు గురూ!
● ఓవైపు మండే ఎండలు...మరోవైపు చెలరేగుతున్న మంటలు ● జిల్లాలో కొనసాగుతున్నఅగ్నిమాపక వారోత్సవాలు కడప అర్బన్: ఎండలు మండే నిండు వేసవి కాలమిది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మంటలు చేలరేగి అగ్ని ప్రమాదాలు సంభవించే సమయమిది.. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అగ్నిప్రమాదాల బారి నుంచి తమతో పాటు చుట్టు ఉన్న సమాజాన్ని కాపాడుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భమిది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన వారోత్సవాలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేయనున్నారు. ● గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు అగ్నిమాపక శాఖకు 111 కాల్స్ వచ్చాయి. ● ఇందులో 15 రిస్క్ ఆపరేషన్ ప్రమాదాలు జరి గాయి. రూ. 7,94,26,500 నష్టం జరిగింది. ● రూ.27,15,44,000 ఆస్తినష్టాన్ని ఫైర్ అధికారులు రక్షించారు. ఇక అగ్ని ప్రమాదాలు నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా 10 మంది చనిపోగా, 10 మందిని అగ్నిమాపక శాఖ ద్వారా కాపాడారు. ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖ లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 10 ఫైర్ స్టేషన్లున్నాయి. ముద్దనూరులో ఫైర్ స్టేషన్ నిర్మాణ దశ త్వరలో పూర్తి కానుంది. కాగా ఆయా అగ్నిమాపక కేంద్రాల్లో లీడింగ్ ఫైర్మెన్లు, ఫైర్మెన్లు, డ్రైవర్ కమ్ ఆపరేటర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. పలుచోట్ల స్టేషన్ ఫైర్ ఆఫీసరు లేకపోవడంతో ఇన్చార్జి లీడింగ్ పైర్మెన్ విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ కమ్ ఆపరేటర్ 35 మందికిగాను ప్రస్తుతం 33 మంది విధులు నిర్వహిస్తున్నా రు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పైర్మెన్ 108 మంది ఉండాల్సి ఉండగా 36 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే 101కు సమాచారం అందించాలిప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధం అగ్ని ప్రమాదాలు, విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ హోంగార్డులకు కూడా రెస్క్యూ ఆపరేషన్లపై శిక్షణ ఇచ్చాం. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. –శరత్బాబు,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ‘అగ్నిని ఆర్పడం కంటే అగ్ని నిరోధక చర్యలే’మేలు...! చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు. ఐ.ఎస్.ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి. పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్లోడ్ వేయకూడదు. ఎలక్ట్రికల్ సాకెట్లో దాని కెపాసిటీకి తగిన ప్లగ్ను మాత్రమే వాడాలి. ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ వాల్వ్ను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్/ఆఫ్ చేయరాదు. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్లో ఆర్సీ సీ లేదా కాంక్రీట్ శ్లాబులను పైకప్పుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములను నివాస ప్రాంతాలకు దూరంగా వుండేలా చూసుకోవాలి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్ ఫైర్ ఫైటింగ్పై శిక్షణ ఇవ్వాలి. -
రేపటి నుంచి డీఎల్ఈడీ సెమిస్టర్స్
కడప ఎడ్యుకేషన్: డీఎల్ఈడీ (డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మొదటి, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి 25 తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. దీంతోపాటు సీఎల్ఐఎసీ(సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్సు) పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన హాల్టికెట్సును www.bse.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచించారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 25న శ్రీ సీతా జయంతి మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఆలయ ప్రదక్షణతో ప్రారంభమై, భగవత్ అనుగ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసు దేవ పుణ్యాహవచనం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతమ్మవారి అనుగ్రహం, కృపాకటాక్షాలను పొందాలని కోరారు. కడప సెవెన్రోడ్స్: భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చులు, సహజ మరణానికి సంబంధించిన ఆర్థికసాయం అనే నాలుగు పథకాలను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. భవన ఇతర నిర్మా ణ రంగ కార్మికులు పై పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులను సమీపంలోని సహాయ కార్మిక అధికారి లేదా గ్రామ సచివాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డులో లబ్దిదారులుగా తమ పేర్లు నమోదు, నవీకరణ చేసుకుని ఆయా సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని అత్యున్నత పద్మ అవార్డులతో ( పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) భారత ప్రభుత్వం ఏటా సత్కరిస్తోందని.. వీటికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్డీవో షేక్ గౌస్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, లిటరేచర్, విద్య, క్రీడలు, మెడిసిన్, సోషల్ వర్క్, సైన్స్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీసెస్, ట్రేడ్ ఇండస్ట్రీ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారితో పాటు క్రీడల్లో విశేష ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ పోర్టల్ https://awards.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, పూర్తి వివరాలకు జిల్లా ప్రాధికార సంస్థ కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. -
మన జలమే.. మన జీవనం
ఎర్రగుంట్ల: మన జలమే మన జీవనం అన్న విధంగా నీటిని వృథా కాకుండా పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శనివారం పోట్లదుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లాను కాలుష్యరహిత, స్వచ్ఛజిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, గ్రౌండ్ వాటర్ పీడీ మురళీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, జమ్మలమడుగు ఇన్చార్జి ఆర్డీఓ శిరీషా పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్ పరిశీలన: ఎర్రగుంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న స్మార్ట్ కిచెన్ను శనివారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. ఇక్కడ పనిచేస్తున్న పొదుపు సంఘాల మహిళలకు సూచనలు అందించారు. వంటవార్పునకు సంబంధించి శిక్షణ తీసుకున్నారా అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దెన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, స్మార్ట్ కిచెన్ నోడల్ అధికారి విజయ్కుమార్, ఏడీఈ కిరణ్కుమార్, అర్డబ్ల్యూఎస్ ఎఈ రామ్మోహన్రెడ్డి, ఏపీఎం జగదీశ్వరి పాల్గొన్నారు. ‘పీఎం రాహత్’తో ఆరోగ్య భద్రత కడప సెవెన్రోడ్స్: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం జిల్లా ప్రజల పాలిట వరం అని, వారి ఆరోగ్య భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రచురించిన.. ‘పీఎం రాహ త్ పథకానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కో సంఘటనకు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించబడుతుందని చెప్పారు. ‘‘గోల్డెన్ అవర్’’లో వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించడమే ఈ పథక లక్ష్యమని వివరించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం
వల్లూరు: పుష్పగిరి శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా పూజలు జరిపారు. ఉదయం స్వామి వారికి విశ్వక్సేన పూజ, పంచామృతాభిషేకం జరిపారు. వివిధ రకాల పరిహారాల కోసం బింబశుద్దితో 108 కళశాలను ఏర్పాటు చేసి వివిధ నదుల్లో ని పుణ్య జలాలలతో, విశేష ద్రవ్యాలతో, ఆవు పాలు, నెయ్యి, తేనె,గంధోధకంతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కళశాలలోని ద్రవ్యాలతో శ్రీ దేవి, భూదేవి సమేత చెన్న కేశవ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ చెన్న కేశవ స్వామి యాళీ వాహనంపై కొలువు దీరగా మంగళ వాయిద్యాల నడుమ దివిటీల వెలుగులో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. – శ్రీ వైద్యనాఽథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహించారు. రాత్రి శ్రీకామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామిని పురుషాన్ మృగ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు చందనోత్సవం: బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది. రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. రాత్రి శ్రీ వైద్యనాథ స్వామికి మయూర వాహన సేవ జరుగుతుంది. -
‘కార్మికులను లోనికి వెళ్లనివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారు’
కడప: కూటమి ప్రభుత్వం పాలన పారిశ్రామిక రంగానికి ఒక శాపంగా మారిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. పరిశ్రమల పట్ల జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారన్నారు. కార్మికులను లోపలకు వెళ్ళనివ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని, ఆ కంపెనీలో అన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని ఇబ్బందిపెడుతున్నారన్నారు. ఈ తరహా వైఖరి వల్ల ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా.. వీళ్ల దౌర్జన్యాలకు ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ‘షాడో ముఖ్యమంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ.. వాస్తవంలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్న పరిశ్రమలను పారద్రోలుతున్నారు. ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారు. క్వారీ ముడిసరుకు రాకుండా గూండాలను పెట్టీ అడ్డుకుంటున్నారు. చివరికి ఆ కంపెనీ ఉత్పత్తి చేసే సిమెంట్ టన్నుకి కమిషన్ డిమాండ్ చేయడం దారుణం. మీ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టుకుంటేనే పరిశ్రమలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలోనే ఇదే పరిశ్రమను నెల రోజుల పాటు మూతవేయించారు. అయినా జిల్లా యంత్రాంగం స్పందించలేదు..గతంలో ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనాంలేదు. మన ముఖ్యమంత్రి తప్పు చేస్తున్న వారిని దండించకుండా మధ్యవర్తిత్వం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం చేసి కాంట్రాక్టులు ఇప్పించే పరిస్థితిఈ తీరు చూసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. నాలుగు రోజులుగా ఆ పరిశ్రమను నిర్బంధించి ఇబ్బంది పెడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించకపోవడంపై ఆదినారాయణరెడ్డికి సహకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలిసే పరిశ్రమపై గూండాగిరి జరుగుతోందని అనుమానం ఉంది. ఎంతో మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. కార్మికులు ఫ్యాక్టరీలోకి వెళ్తుంటే పోలీసులే అడ్డుకుంటున్న తీరు దారుణం. కార్మికులు ఉండే గ్రామాల్లోకి వెళ్ళి ఆ పరిశ్రమకు పనికి వెళ్లొద్దని బెదిరిస్తున్నారు. ఇలానే వదిలేస్తే అన్ని పరిశ్రమలకు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలు సీఎం రమేష్, అది వర్గీయుల ఆధిపత్య పోరు అదానీ కంపెనీ కూడా తాకింది. లోకేష్ రచించిన రెడ్ బుక్ పాలన పరిశ్రమలకు కూడా వర్తింపు చేస్తున్నారు. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ కోసం అది, జేసీ వర్గీయులు కొట్లాటకు దిగితే చంద్రబాబు రాజీ చేశారు. తన అనుయాయులకు పరిశ్రమల నుంచి దోచిపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక కడప లాంటి ప్రాంతానికి పరిశ్రమలు ఎలా వస్తాయి..?, చంద్రబాబును కలిసి వచ్చిన మరుసటి రోజే ఈ పరిశ్రమపై ఆది దాడికి దిగాడంటే ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలన్నీ మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది’అని హెచ్చరించారు. -
వైభవం.. బ్రహ్మోత్సవం
వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాధ్యస్వామికి అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవ నిర్వహించారు.సాయంత్రం వివిధ హోమాలు జరిపారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామివారిని కొండపై నుంచి పెన్నా నది మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.● హంస వాహంపై చెన్న కేశవుడు ● సింహ వాహనంపై వైద్యనాఽథేశ్వరుడు -
మిర్చికి తెగుళ్ల ఘాటు!
పంట ఏదైనా రైతన్న కంట కన్నీరొలుకుతూనే ఉంది.. సాంప్రదాయ పంటలే కాదు ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసినా నష్టమే పలకరిస్తోంది. చేసిన కష్టమంతా చేలోనే బూడిదవుతోంది. జిల్లాలో మిరప సాగు చేసిన రైతన్నలదీ ఇదే పరిస్థితి. తెగుళ్ల దెబ్బకు మిర్చి ఘాటు చిన్నబోయింది. ఓ వైపు దిగు బడి రాక.. గిట్టుబాటు కాక.. మరోవైపు ప్రభు త్వం నుంచి భరోసా దక్కక మిరప రైతు జీవితం కష్టాలమయమైంది.. ● భారీగా తగ్గిన దిగుబడి ● నష్టాలతో మిరప రైతు కుదేలు ● ఆదుకోని కూటమి ప్రభుత్వం సిద్దమూర్తిపల్లె వద్ద సాగులో ఉన్న మిరప పంట ముడత తెగులు సోకిన మిరప పంట కలసపాడు: మిరప సాగు చేసిన రైతులు కుదేలయ్యారు. కష్టనష్టాలకోర్చి పైరు సాగు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా తెగుళ్లతో భారీగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మిరప రైతుకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. మిరప రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది మిరప రైతులు భారీ నష్టాలు మూట కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో మిర్చి సాగైంది. ఒక్క కలసపాడు మండలంలో 37.8 ఎకరాలలో రైతులు మిరప సాగు చేశారు. మండలంలోని కొత్తకోట, పెండ్లిమర్రి, మహానందిపల్లె, మామిళ్లపల్లె, సిద్దమూర్తిపల్లె తదితర గ్రామాల్లో రైతులు మిరప సాగు చేశారు. మిరప విత్తనాల నుంచి పైరు సాగు వరకు ఒక ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఇప్పటివరకు రైతులు ఖర్చు చేశారు. కానీ పైరు ఎదుగుదల లేకుండా పూత, కాయలు లేకుండా పోయాయి. మిరప పంటకు సోకిన నల్లి వల్ల వారానికి రెండు సార్లు రైతులు పురుగు మందులు పిచికారి చేసినా పైరు ఎదుగుదల లేకుండా పోయింది. ఏప్రిల్ నెల ముగుస్తున్నప్పటికీ పైరులో ఎటువంటి ఎదుగుదల లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సగం పెట్టుబడి కూడా రైతుకు అందే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో పైరు సాగుచేసిన రైతులకు ప్రభుత్వం పంటలు బీమా మంజూరు చేసేది. కాని ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎటువంటి పంటల బీమా మంజూరు చేయకపోవడం, నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయకపోవడంతో రైతులకు ఎటువంటి ఆసరా లేకుండా పోయింది. దీంతో మిరప రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుని పైర్ల సాగుపై అనాసక్తి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. 5 ఎకరాలు సాగు చేశాను నేను 5 ఎకరాలలో మిరప పంట సాగు చేశాను. ఎకరాకు ఇప్పటివరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశాను. కానీ దిగుబడి గత ఏడాది కన్నా సగం తగ్గిపోయింది. మిరప రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎనుముల అనిల్రెడ్డి, రైతు, ఎగువ రామాపురం, కలసపాడు మండలం తీవ్రమైన తెగుళ్లు ఈ ఏడాది మిరప పైరుకు తీవ్రమైన తెగుళ్లు ఏర్పడ్డాయి. వారానికి రెండుసార్లు మందులు పిచికారీ చేసి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చుచేసినాం. అయినా రైతుకు పెట్టుబడి దక్కే పరిస్థితి కూడా లేదు. – నాగిరెడ్డి జయరామిరెడ్డి, రైతు, పెండ్లిమర్రి, కలసపాడు మండలం -
సోలార్ కోసం భూముల పరిశీలన
మైలవరం: మండల పరిధిలోని సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం జాయింట్ కలెక్టర్ నిధిమీనా భూములను పరిశీలించారు. శుక్రవారం మండల పరిధిలోని దొడియం, రామచంద్రాయపల్లి, వద్దిరాల, తలమంచిపట్నం, కోనా అనంతపురం గ్రామాలకు సంబంఽధించిన భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇన్చార్జి అర్డీఓ శీరిష , తహసీల్దార్ షఫీలు వివరించారు. కడప ఎడ్యుకేషన్: ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లె కళాకేత్రంలో జాతీయ త్రిభాష కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు, సంస్థ చైర్మన్ మహమ్మద్ ఫారూఖ్ షిబ్లి, ఉర్దూలకు ఆహ్వానం పంపారని రాయల సీమ ఉర్దూ రచయితల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సత్తార్ ఫైజి తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా నుంచి ఉర్దూ కవులు ఆచార్య సత్తార్ సాహిర్, మహమూద్ షాహిద్, సత్తార్ ఫైజీ, ఇఫ్తెఖార్ జమాల్, హాషిం తలీఖ్, తాబిష్ రబ్బానీలు పాల్గొంటారని చెప్పారు. హిందీ, తెలుగు కవులు పి. రజనీ, జి. సాంబశివరావు, బి. మాధవరావు, పి. మోహన్ రావు, ప్రసాద్, వి. వల్లభరావు, ఉమర్ ఫారూఖ్లు పాల్గొంటారు. త్రిభాష కవి సమ్మేళనంలో రాష్ట్ర ప్రగతి, సాహిత్య వైభవం, సంస్కృతిపై కవితలు వినిపించనున్నారని సత్తార్ ఫైజి తెలిపారు కడప ఎడ్యుకేషన్: ఏపీ ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించబోయే 42 రోజుల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్(ప్రాక్టికల్స్) వేసవి శిక్షణా తరగతులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులను కడప చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ బాలికలోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు మే 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, సంబంధిత ట్రేడ్లో కనీస టెక్నికల్ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీలోపు రూ. 1000 ఫీజు చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసిన దరఖాస్తు, విద్యార్హతల ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్తో సహా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ ర్కొన్నారు. -
జిల్లాలో చురుగ్గా జనగణన
కడప సెవెన్రోడ్స్: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ‘‘సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్’’ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ‘‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’’ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్రం జనగణన ఎన్యుమరేషన్ కు సంబంధించి ఆన్ లైన్ నమోదు ప్రక్రియను తెలియజేశారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
మావిగన్.. మంచి విజన్
మావిగన్పై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎంత విషప్రచారం చేసినా.. వాస్తవాలను వైఎస్సార్సీపీ ప్రజలకు వివరిస్తుండటంతో ప్రజలు చంద్రబాబు కుటిల ప్రయత్నాలను అర్థం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి పొట్టిపాటి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మావిగన్ ప్రయోజనాలను తెలుపుతూ కడపలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘మావిగన్.. రాష్ట్రానికి మంచి విజన్’ అంటూ వారు పేర్కొంటుండటం విశేషం. – కడప కార్పొరేషన్ -
నేడు బండలాగుడు పోటీలు
కమలాపురం : కమలాపురంలో ఎల్లమ్మ(హేలాంబ) తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోట రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ క్యాటగిరి వృషభ రాజములకు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతి రూ.1.20 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1 లక్ష, తృతీయ బహుమతి రూ.80 వేలు, నాల్గవ బహుమతి రూ.60 వేలు, ఐదవ బహుమతి రూ.50 వేలు, ఆరవ బహుమతి రూ.40 వేలు, ఏడవ బహుమతి రూ.30 వేలు, 8వ బహుమతి రూ.25 వేలు, 9వ బహుమతి రూ.20 వేలు, పదవ బహుమతి రూ.15 వేలు, 11వ బహుమతి రూ.10 వేలు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన వారు ఆలయ ప్రాంగణంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రాత్రి నాటకాల ప్రదర్శన భక్తుల కాలక్షేపం కోసం రాత్రి నాటకాల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రామాంజనేయ యుద్ధ సన్నివేశం, చింతామణి భవానీ సీను, గయోపాఖ్యానం(యుద్ధసీను), సత్య హరిశ్చంద్ర నుంచి వారణాసి, కాటి సీను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు తిలకించాలని వారు కోరారు. మండల పరిధిలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన కీ.శే. ఓబులాపురం జనార్ధన్రెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి సుజాత, తనయులు శ్యాం సుందర్రెడ్డి, చంద్రకాంత్రెడ్డి, కుమార్తె డాక్టర్ మాధవిరెడ్డి భక్తుల సౌకర్యార్థం మూడు పూటల అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండిబజారు వీధిలో గోనె సంచుల షాపులో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది సుబ్బరాజు, శివయ్య, రామకృష్ణ, చంద్రశేఖర్, సురేష్ శుక్రవారం దాడులు నిర్వహించారు. 31 బ్యాగుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సుబ్బారెడ్డి, ఆషిద్ రెహమాన్లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘అల్ట్రాటెక్’ వద్ద కొనసాగిన నిరసన సాక్షి ట్రాస్కఫోర్సు : ఎర్రగుంట్ల మండల పరిధి చిలంకూరు గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు చేస్తున్న నిరసన మూడో రోజుకు చేరింది. శుక్రవారం ఫ్యాక్టరీలోకి విధులకు వెళ్తున్న కార్మికులను శిబిరం వద్ద ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విధుల్లోకి పోకుంటే తమకు ఇబ్బందులు వస్తాయని కార్మికులు సీఐ విశ్వనాథ్రెడ్డితో చెప్పుకొన్నారు. పోలీసులు ఇరు వర్గాల వారితో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. కాగా ఆందోళనకారులతో పరిశ్రమ యజమాన్యం ఇప్పటి వరకు చర్చలకు రాకపోవడంతో.. శిబిరం శనివారం కూడా కొనసాగే అవకశాం ఉందని కూటమి శ్రేణుల ద్వారా తెలుస్తోంది. తాము వీధులకు వెళ్లాలని చూస్తున్నా అక్కడ ఉన్న ఆందోళనకారులు లోనికి పోనివ్వడం లేదని కొందరు కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమకు వెళ్లే దారులన్నింటినీ ఆందోళనకారులు అడ్డగించారు. దీంతో పరిశ్రమలో మూడు రోజు కూడా మొత్తం పనులన్నీ నిలిచిపోయాయి. -
నకిలీ పత్రాలతో స్థలం కబ్జా
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని సత్యాటౌన్షిప్ సమీపంలో ఓ ప్లాట్కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసి విక్రయించిన ఇద్దరు నిందితులను శుక్రవారం అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక అర్బన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ టి.వి.ఎన్.చిరంజీవి వివరాలు వెల్లడించారు. పోరుమామిళ్ళ పట్టణం గిరినగర్కు చెందిన చిరుకూరి శ్రీహరి తండ్రి పేరిట ప్లాట్ నంబర్ 422ను పట్టణంలోని సత్యాటౌన్షిప్ సమీపంలో కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది. ఆ తర్వాత శ్రీహరి తండ్రి మరణించడంతోపాటు శ్రీహరి విదేశాల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని అతని కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని కలసపాడు మండలం శంఖవరం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఓబులేసు ఎలాగైనా ఇంటి స్థలాన్ని కాజేయాలని పథకం రూపొందించారు. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీహరి అక్క నివాసం వద్దకు వెళ్లి మాటమాటలతో అసలు పత్రాలను దొంగలించాడు. అనంతరం కలసపాడు మండలం శంఖవరం గ్రామానికి చెందిన పగిడి బాలరాజుతోపాటు మరికొందరి సహకారంతో చనిపోయిన శ్రీహరి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి 2017లో నకిలీ సేల్ అగ్రిమెంటు సృష్టించి రూ.12 లక్షలకు ఆ స్థలాన్ని విక్రయించారు. నిందితులు స్థలంలో ఉన్న పునాదిని సైతం ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీహరి సంబంధిత స్థలాన్ని వెళ్లి పరిశీలించగా ఎవరో నిర్మాణం చేసి ఉండటాన్ని గమనించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ ఎస్ఐ టి.వి.ఎన్.చిరంజీవి విచారణ చేపట్టగా నిందితులు శ్రీహరి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి గుట్టుగా విక్రయించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను అబ్బుసాహెబ్పేట క్రాస్రోడ్డు వద్ద అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అర్బన్ కానిస్టేబుళ్లు సిద్దారెడ్డి, ఓబులయ్య పాల్గొన్నారు. -
పోట్లదుర్తిలో ఉద్రిక్తత
● మృతదేహం పూడ్చడానికి వచ్చిన దళితులు ● ఆలయ ఆవరణలో వద్దన్న నిర్వాహకులు ● ఎట్టకేలకు సమస్యను పరిష్కరించిన అధికారులు ఎర్రగుంట్ల : మండల పరిధి పోట్లదుర్తి గ్రామంలోని ఎస్సీ వర్గానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చడానికి వచ్చిన క్రమంలో దళితులు, గ్రామంలోని పెద్దలు, ఆలయ కమిటీ నిర్వహుకుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళితే... పోట్లదుర్తిలో పెద్దమ్మతల్లి దేవాలయం ఉంది. ఈ ఆలయ స్థలం విషయంపై గతంలో గ్రామంలో పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు జిల్లా కలెక్టర్ సైతం ఆలయాన్ని పరిశీలించి దేవదాయ శాఖ అధికారులతో మాట్లాడి చుట్టూ ప్రహరీ కట్టించారు. ఆ ప్రహరీ లోపల దళితుల శ్మశాన వాటిక ఉండేది. కానీ ఇప్పుడు దళిత కులానికి చెందిన నరసింహులు మృతి చెందడంతో మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చడానికి వచ్చారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు వచ్చి అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మృతదేహాన్ని ఏ విధంగా పూడ్చతారని వారు అన్నారు. తమ పూర్వీకుల నుంచి ఇక్కడే శ్మశాన వాటిక ఉండేదని దళితులు అన్నారు. అయితే ప్రహరీ కట్టే సమయంలో ఎందుకు అడ్డుకోలేదని నిర్వాహకులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తహసీల్దార్ అమరేశ్వరి, సీఐ విశ్వనాథరెడ్డిలు వారితో చర్చించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయట పూడ్చుకోవాలని, తర్వాత శాశ్వత శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయిస్తామని అధికారులు తెలపడంతో సమస్య సద్దమణిగింది. -
క్రీడా శిక్షణ.. భవితకు నిచ్చెన
● అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు ● ఈ నెల 26 నుంచి ప్రారంభం ● ఉత్తర్వులు జారీ చేసిన శాప్ కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా అకాడమీల పునః ప్రారంభానికి రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ(శాప్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో స్పోర్ట్స్ అకాడమీలు తిరిగి ప్రారంభించనుంది. 2026 –27 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 26 నుంచి మే 6 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలను చేపట్టనుంది. ఈ మూడు అకాడమీల్లో మొత్తం 12 క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. వాటిలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, హాకీ, ఖోఖో, జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో ఎంపికై న బాల బాలికలకు శిక్షణ అందనుంది. ఆరు విభాగాల్లో.. తిరుపతి క్రీడా అకాడమీలో అత్యధికంగా ఆరు విభాగాల్లో (జూడో, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, లాన్ టెన్నిస్) రెసిడెన్షియల్ కోచింగ్ బాలురు బాలికలకు వేరువేరుగా ఇవ్వనున్నారు. జూడో, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ ఒక్కో విభాగం నుంచి పది మంది బాలురు, పది మంది బాలికలను తీసుకోనున్నారు. బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్లో ఒక్కో విభాగం నుంచి 15 మంది బాలురకు శిక్షణ అందించనున్నారు. మూడు క్రీడాంశాల్లో... విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అకాడమీలో మూడు క్రీడాంశాల(అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్ ,సైక్లింగ్)లో బాలురకు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో క్రీడ నుంచి 15 మంది బాలురను ఎంపిక చేయనున్నారు. మే 4న అథ్లెటిక్స్, మే 5న సైక్లింగ్, మే 6న వాటర్ స్పోర్ట్స్ విభాగాలకు సంబంధించి విశాఖపట్నం కొమ్మాదిలో ఎంపికలు చేపట్టనున్నారు. బాలికలకు మాత్రమే... కాకినాడలోని క్రీడా అకాడమీలో బాలికలకు మాత్రమే నాలుగు క్రీడాంశాల (వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో)లో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్ 30న హాకీ, ఖోఖో విభాగాల్లో బాలికలకు కాకినాడ డీఎస్ఏ లో ఎంపికలు చేపట్టనున్నారు. అర్హతలివే... ● దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులు. ● క్రీడాకారులు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారై ఉండాలి. ● జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, చదువుతున్న పాఠశాల/ కళాశాల నుంచి సర్టిఫికెట్ క్రీడా ప్రతిభ సర్టిఫికెట్ (రాష్ట్ర స్థాయి/ జాతీయ స్థాయి ఉంటే) మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలి. ● ఎంపికల సమయంలో క్రీడా దుస్తులు, కిట్టు తప్పనిసరి. ● ఎంపికై న వారికి షాప్ క్రీడా అకాడమీలో వసతి భోజనం, శిక్షణ సౌకర్యాలు అందించనున్నారు. ● అర్హత గల క్రీడాకారులు స్పోర్ట్స్ ఏపీ.జిఓవి.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. -
చైన్ స్నాచింగ్
ఒంటిమిట్ట : ఏప్రిల్ 1న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి బద్వేలు నుంచి విచ్చేసిన సుధామణి అనే మహిళ మెడలోని బంగారు తాలిబొట్టు సరుడును గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన వెలుగు చూసింది. బస్సు పార్కింగ్ పాయింట్ వద్ద తన మెడలోని 40 గ్రాముల బంగారు తాలిబొట్టు సరుడును లాక్కెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక అదృశ్యం ఒంటిమిట్ట : ఒంటిమిట్టకు సమీపంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం అయినట్లు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురు గురువారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీప బంధువులు, స్థానికులను విచారణ చేసినా ఆచూకీ తెలియరాలేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంఖాన్పల్లిలో వున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45– 50) మృతి చెందాడు. అతని చేతిపై క్రిస్తువేణి అనే పచ్చబొట్టు వుంది. అతని ఆచూకీ తెలిసిన వారు తమ దృష్టికి తీసుకుని రావాలని కడప తాలూకా సీఐ నరసింహరాజు తెలియజేశారు. ఫోన్ నంబర్లు: 9121100514, ఎస్ఐ 9121100516కు సమాచారం ఇవ్వాలని కోరారు. షార్ట్ సర్క్యూట్తో కూలీ మృతి బి.కోడూరు : మండలంలోని టమటంవారిపల్లె గ్రామ సమీపాన గల మెగా ఇంజినీరింగ్ ఇండస్ట్రియల్ లిమిటెట్ కంపెనీలో సబ్ కాంట్రాక్టు తీసుకుని ప్రియాన్స్ కంపెనీలో పని చేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జగదీష్ (38) అనే వ్యక్తి షార్ట్సర్క్యూట్తో శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జగ్దీష్ టమటంవారిపల్లె గ్రామ సమీపాన జరుగుతున్న కాంక్రీటు పనుల్లో భాగంగా క్యూరింగ్ చేసే పనుల్లో మోటార్ ఆన్ చేయబోయి షార్ట్సర్క్యూట్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అదే కంపెనీలో పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సహకార రంగం బలోపేతం కోసం యాత్ర
కడప అగ్రికల్చర్ : గ్రామీణ రైతాంగానికి వెన్నెముక అయిన సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్ కోరారు. సహకార రంగం బలోపేతానికి బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ సహకార రంగంలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి ఇచ్చే రుణాలపై వడ్డీ తగ్గాలంటే సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి వ్యవసాయ పరపతి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాత్ర ఈ నెల 18వ తేదీన తిరుపతి, నెల్లూరు మీదుగా ఒంగోలులో ముగియనున్నట్లు తెలియజేశారు. ఈ యాత్రలో వివిధ జిల్లాల నుంచి హాజరైన అసోసియేషన్ ప్రతినిధులతోపాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు గంటా నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, జిల్లా నాయకులు వీరబ్రహ్మం, సుధాకర్రెడ్డి, సహకార ఉద్యోగులు పాల్గొన్నారు. -
అరటి.. సంరక్షణ మేటి
జిల్లాలో వరి తరువాత హార్టికల్చర్లో అరటి ఎక్కువగా పండిస్తారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుండటంతో రైతులు అరటి పంటను నాటేందుకు జంకుతున్నారు. మెలకువలు తెలిసిన కొందరు పొలంలో ఎండ వేడిమి బారిన పడకుండా న్యూస్ పేపర్లను మొక్కలపై ఉంచి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్క ఎండకుండా పెరిగి పంట సాగుకు వస్తుంది. చెన్నూరు –ఖాజీపేట మధ్యలో ఇలా సంరక్షణతో పంట పండిస్తున్న దృశ్యాలు అబ్బుర పరుస్తున్నాయి. – ఫొటో గ్రాఫర్, సాక్షి, కడప -
పంచాయతీ వేలం పాటలో కూటమి పోటాపోటీ
● బీజేపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఆధిపత్య ధోరణి ● ఐదింతలు పెరిగిన బస్టాండు ఆదాయం ముద్దనూరు : బీజేపీ, టీడీపీ వర్గీయుల మధ్య విభేదాలతో గ్రామ పంచాయతీ వేలంపాట మున్సిపాలిటీ స్థాయిని మించిపోయింది. కూటమిలోని ఇరు పార్టీల వారు తమకే దక్కాలని ప్రతిష్టగా తీసుకోవడంతో.. పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా వేలంపాట సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన పాట 3 గంటల వరకు సాగింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి వర్గీయులు పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు. సర్కారు వారి పాట రూ.9లక్షల12వేల నుంచి మొదలు కాగా పోటాపోటీగా పాడి రూ.40 లక్షల వరకు తీసుకెళ్లారు. ఇక ముగింపు ఉండదని గ్రహించిన డీఎల్పీవో నూర్జహాన్ చివరకు ఒక నిమిషం సమయంలో ఎవరు ఎక్కువ పాట పాడితే వారికే కాంట్రాక్ట్ దక్కుతుందని పేర్కొన్నారు. దీంతో బస్టాండు వేలంపాట రామాంజినేయులు రూ.42లక్షల63వేలకు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన జంతువధశాల వేలంపాటను కూడా పోటాపోటీగా పాడి సుబ్బరత్నమ్మ రూ.12లక్షల77వేలకు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు పంచాయతీలో బస్టాండు వేలంపాట గరిష్టంగా రూ.11 లక్షల వరకు సాగింది. గత ఏడాది కూడా రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. అయితే కూటమిలో అంతర్గత పోరుతో వేలంపాట ఐదింతలు దాటింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల మేరకు వేలంపాట పొందిన కాంట్రాక్టర్ 7 రోజుల్లోగా అంటే ఈ నెల 24వ తేదీ నాటికి వేలం పాట మొత్తాన్ని పంచాయతీకి చెల్లించి వసూళ్లకు దిగాలని, లేకుంటే వేలంపాటలో చెల్లించిన డిపాజిట్ రూ.6 లక్షలు తిరిగి చెల్లింపు ఉండదని పేర్కొన్నారు. రూ.42 లక్షల 63 వేలకు వేలం పాట పాడటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధాకృష్ణవేణి, డిప్యూటీ ఎంపీడీవో వీరభద్రుడు పాల్గొన్నారు. భారీగా బందోబస్తు స్థానిక గ్రామ పంచాయతీ వేలం పాట నిర్వహణ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు ఎన్నికల బందోబస్తును తలపించింది. ముందు జాగ్రత్త చర్యగా వేలంపాట జరిగే గ్రామపంచాయతీ కార్యాలయం రహదారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రహదారి వెంట మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం, ఈ మార్గంలో వున్న చిరుదుకాణాలు, కూరగాయల మార్కెట్ మూసివేయడం, ప్రజల రాకపోకలు కూడా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ముద్దనూరు సీఐ నగేస్బాబు, కొండాపురం సీఐ రాజతోపాటు ఇద్దరు ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ రహదారి అంతా నిర్మానుష్యంగా మారింది. దశాబ్దాల తరబడి వేలంపాటలు నిర్వహిస్తున్నా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేలం పాట సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. -
శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షీ వైధ్యనాఽథేశ్వర స్వామి , శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల ఆలయాల్లో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైధ్యనాధేశ్వర స్వామి ఆలయంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. వైధ్యనాధునికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవికి కుంకుమార్చన చేశారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై శ్రీ కామాక్షీ వైధ్యనాధ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారు జామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజను నిర్వహించారు. నవ కళశ స్థాపన, నవ కుంభారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలతో ప్రారంభించి గరుడుని చిత్ర పటాన్ని ధ్వజ స్థంభంపై అధిష్టింప చేశారు. అనంతరం భేరీ పూజ నిర్వహించారు. అనంతరం కొండపై నుండి స్వామి వారిని తిరుచ్చి వాహనంలో మోస్తూ గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. -
మైదుకూరు జాతీయ రహదారిపై కారు బీభత్సం
మైదుకూరు/చాపాడు: కర్నూలు – చిత్తూరు, బళ్లారి – నెల్లూరు జాతీయ రహదారులపై ఓ యువకుడు గురువారం ఉదయం కారుతో బీభత్సం సృష్టించాడు. సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కారులో వస్తూ ఓ యువకుడు కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడరు వద్ద నుంచి మైదుకూరు వరకు, నెల్లూరు – బళ్లారి జాతీయ రహదారిపై మైదుకూరు నుంచి చాపాడు మండలం పల్లవోలు వరకు సుమారు 42 కిలోమీటర్ల మేర ఇష్టారాజ్యాంగా కారు నడుపుతూ ముందు వైపు ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టాడు. సంఘటనలో మైదుకూరుకు చెందిన ఎల్లాల భైరవ కొండయ్య (45)అనే వ్యక్తి బైక్పై ప్రొద్దుటూరుకు వెళుతుండగా చాపాడు మండలం పల్లవోలు వద్ద ఆ కారు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంతకుముందు మైదుకూరు పట్టణ శివారులోని శ్రీనగరం వద్ద ఉదయం 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి తన స్నేహితునితో కలిసి రాజంపేటకు చెందిన కార్తీక్ అనే యువకుడు ప్రయాణిస్తున్న కారును వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. వెంటనే ఎడమవైపునకు కారును నడిపి దువ్వూరు మండలం గొల్లపల్లెకు చెందిన మోహన్రెడ్డి, శంకర్రెడ్డి అనే వారు గ్రామం నుంచి బైక్పై మైదుకూరు వస్తుండగా అదే కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ముందుగా మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. వారిలో శంకర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలో రాజంపేటకు చెందిన కార్తీక్, అతని స్నేహితుడు ఎలాంటి గాయాలకు గురికాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తన కారును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంపై కార్తీక్ మైదుకూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీభత్సం సృష్టించిన అదే కారు తొలుత దువ్వూరు మండలం కానగూడురు వద్ద ఓ పూల వ్యాపారిని ఢీకొన్నట్టు తెలుస్తోంది. పల్లవోలు వద్ద మోటార్ బైక్ను ఢీకొట్టిన అనంతరం చాపాడు పోలీసులు కారు నడుపుతున్న యువకున్ని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. కారుతో బీభత్సం సృష్టించి ప్రమాదాలకు కారణమైన ఆ యువకుడు కడపకు చెందిన కొట్టే ప్రశాంత్గా పోలీసులు గుర్తించారు. సంఘటనపై యువకుడిని విచారించారు. ఈ సందర్భంగా చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య మాట్లాడుతూ పల్లవోలు వద్ద జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. భైరవ కొండయ్య మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకరు మృతి: ఇద్దరికి తీవ్ర గాయాలు -
● ఎన్నడూ లేని సంస్కృతి
పోలీసుశాఖ క్రమశిక్షణకు నిదర్శనం. పోలీసు, రైటర్, హెడ్కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, ఏఏస్పీ, ఎస్పీ ఇలా అంచెలంచెలుగా ఒకరిపై ఒకరు గౌరవభావంతో వారి ఆదేశాలను అమలు పరుస్తూ శాంతిభద్రతలు పరిరక్షణలో నిమగ్నమయ్యేవారు. విధులపై నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదా వైఫల్యం చెందడం ఈక్రమంలో ఎస్పీ సీరియస్ అయితే తప్పా, సీఐలకు ట్రాన్సుఫర్లు వచ్చేవి కావు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నేరుగా రేంజ్ అధికారులు పోస్టింగ్స్ ఇస్తుండడం, ఆ పోస్టింగ్స్ కూడా నిలకడగా లేకపోవడంతో పోలీసుశాఖలో క్రమశిక్షణ లోపించింది. ఎస్పీతో నిమిత్తం లేకుండా నేరుగా డీఐజీ స్థాయి అధికారితో సత్సంబంధాలుంటే చాలు అనే దిశగా సీఐలు అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే శాంతిభద్రతల డొల్లతనం తెరపైకి వస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆస్తి, మాన, ప్రాణాల రక్షణ కోసం పనిచేసేందుకు అనువుగా బదిలీలు చేస్తూ పోలీసు అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
రాయలసీమను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు
కడప కార్పొరేషన్: చంద్రబాబు సర్కార్ రాయలసీమను తడిగుడ్డతో గొంతు కోసేందుకు సిద్ధపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. గురువారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు సీమ ద్రోహులు అవగాహన లేకుండా తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమకు వైఎస్సార్, వైఎస్ జగన్ ఏమీ చేయలేదని పయ్యావుల కేశవ్, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డిలాంటి వారు మాట్లాడటం దారుణమన్నారు. వారు బుద్ధిఉండే మాట్లాడుతున్నారా లేక ఈ ప్రాంత వాసులను గొంతు కోసేందుకు సిద్ధపడ్డారా అనిపిస్తోందన్నారు. సీమలోని ప్రతి ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే రాయలసీమలో ఉన్న ప్రతిఒక్క ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అని అన్నారు. పోతిరెడ్డిపాడు, గాలేరు– నగరి, హంద్రీ– నీవా, వెలిగల్లు ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ నిర్మించారని గుర్తు చేశారు. ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వైఎస్సార్ స్ఫురణకు వస్తారని, భవిష్యత్ తరాలు ఆయన్ను చిరకాలం గుర్తుంచుకుంటాయన్నారు. ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టులకు పేరన్నా పెట్టాడు కానీ...పార్టీ లాక్కున్న చంద్రబాబు మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు కడితే భవిష్యత్లో అవి గుదిబండగా మారుతాయని చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు తన వందిమాగదులతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ లిఫ్ట్ చేపడితే... తన వ్యాపారాల కోసం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. సీమలోని రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్ళు ఉన్నాయంటే అది వైఎస్ఆర్, వైఎస్ జగన్ల వల్లేనని తెలిపారు. రాయలసీమకు మీరు గతంలో ఏం చేశారు...ఈ రెండేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాయలసీమ లిఫ్ట్ ను ఏడాదిలోగా పూర్తి చేయకపోతే..ఉద్యమం ఎలా ఉంటుందో రుచిచూస్తారని హెచ్చరించారు. ● రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు టీడీపీ నేతలు రాజీనామా చేసి సీమ లిఫ్ట్ ఉద్యమంలోకి రావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కోరారు. చంద్రబాబు సీమలోనే కాదు..అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేశాడన్నారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వద్దన్న దగుల్బాజీ ప్రభుత్వం ఇదేనన్నారు. మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, షఫీ, సీహెచ్ వినోద్ కుమార్, బాలస్వామిరెడ్డి, మియ్యా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
ఒంటిమిట్ట రామయ్యకు పెరిగిన హుండీ ఆదాయం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గురువారం ఒంటిమిట్ట రామాలయంలోని రంగ మండపంలో టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఎన్నడు లేని విధంగా ఒంటిమిట్ట రామయ్యకు నెల రోజుల వ్యవధిలో రూ. 29,11,005లు వచ్చాయి. కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రస్తుత వాహన్ పోర్టల్లో సీటింగ్, స్లీపర్ కెపాసిటీ కోసం వేర్వేరు వివరాలు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహన యజమానులు తమ బస్సుల ఆర్సీలో అప్డేట్ చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ ఇన్చార్జ్ కమినర్ వీర్రాజు పేర్కొన్నారు. గతంలో రవాణా శాఖకి చెందిన పాత సాఫ్ట్వేర్ (ఈ– ప్రగతి) లో సీటింగ్ కెపాసిటీ, స్లీపర్ కెపాసిటీ వేర్వేరుగా లేకపోవడం వల్ల సీటింగ్ కెపాసిటీ కింద రిజిస్ట్రేషన్ చేశామని పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమినర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇప్పటికే పలు వాహన యజమానులు సబ్మిట్ చేసిన దరఖాస్తుల ఆధారంగా బస్సులు తనిఖీ చేసి, ఆర్సీలో వివరాలు అప్డేట్ చేశామని వివరించారు. ఈనెల 22 లోపల ఆర్సీలో అప్డేట్ చేసుకోవాలని కోరారు. లేకుంటే సీటింగ్, స్లీపర్ కెపాసిటీలు ఆర్సీలో లో ఒక విధంగా, బస్సులో ఒక విధంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్లో ఏడుగురు విద్యార్థులు 6.5 లక్షలు వార్షికోత్స వంతో సాఫ్ట్వేర్ డెవలపర్స్గా ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు. హైదరాబాద్కు చెందిన ఎక్స్. ఎల్. ఆర్ ఎడ్యూ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్. అవినాశ్ , ప్రతినిధుల బృందం హాజరై విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ప్లేస్ మెంట్ డ్రైవ్లో ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు 64 మంది హాజరు కాగా ఏడుగురు ఎంపికయ్యారు. వారికి ఆ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చింది. -
మీ సేవలిక చాలు!
తమ్ముళ్లూ.. సాక్షి ప్రతినిధి, కడప: అవసరానికి వాడుకోవడం.. ఆపై మూలకు విసిరేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. పచ్చగా ఉన్నప్పుడు నెత్తినపెట్టుకోవడం.. పనయ్యాక పాతాళానికి తొక్కిపడేయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ‘యూజ్ అండ్ త్రో’ పాలసీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్.. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు. జిల్లా టీడీపీ నేతల విషయంలో ఈ విషయం మరోసారి రుజువైంది. ఎన్నికల సమయంలో ‘తమ్ముళ్లం’టూ ప్రేమ ఒలకబోసే చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక దగ్గరకు కూడా రానీయరు.. నాడు కందుల రాజమోహన్రెడ్డి, నేడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డిపై బాబు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా 1996లో తొలిసారి పోటీచేసిన కందుల రాజమోహన్రెడ్డికి టీడీపీలో ఎనలేని ప్రాధాన్యత లభించింది. కడప ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన రాజమోహన్ రెడ్డికి పొలిట్బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించారు. పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడిగా కన్పించారు. తర్వాత కనుమరుగయ్యారు. తర్వాత 2009లో పోటీచేసిన పాళెం శ్రీకాంత్రెడ్డి ఇదే పరిస్థితి. తాజాగా రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డిదీ ఇదే దుస్థితి. ఎన్నికల్లో వాడుకునేందుకు పదవులు ఎన్నికల్లో వాడుకునేందుకే చంద్రబాబు పార్టీ పదవులు కట్టబెడతారని పలువురు వివరిస్తున్నారు. జిల్లా టీడీపీలో క్రేజ్ ఉన్న పుత్తా నరసింహారెడ్డిని నిన్నటివరకు రాష్ట్ర ఉపాధ్యక్షపదవిలో కొనసాగించారు. బుధవారం ప్రకటించిన కమిటీలో పుత్తాకు చోటు దక్కలేదు. నిన్నటివరకు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్ష పదవిలో కొనసాగించిన అమీర్బాబుకు పంగనామాలు పెట్టారు. ఇక మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిదీ అదే పరిస్థితి. ఎంచక్కా ఎన్నికల్లో వాడుకొని ఆపై పక్కనపెట్టేశారు. దేవగుడి కుటుంబం కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న సందర్భంలో జంబాపురం రమణారెడ్డి స్థానికంగా టీడీపీలో ప్రత్యర్థిగా నిలిచారు. రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన్ను కూడా తప్పించారు. సందర్భాన్ని బట్టి వాడుకొని వదిలేయడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది అందవేసిన చేయిగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సామాజిక సమీకరణలో హరిప్రసాద్, ముక్తియార్కు చోటు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా బాలిశెట్టి హరిప్రసాద్, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డిలకు అవకాశం దక్కింది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీఎస్ ముక్తియార్ చోటు దక్కింది. సామాజిక సమీకరణలో భాగంగానే ఆ ముగ్గురికి ఆయా పదవులు లభించినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలాగే కార్యనిర్వహక కార్యదర్శిగా ఎస్ గోవర్ధన్రెడ్డి తిరిగి కొనసాగించారు. మైదుకూరుకు చెందిన మునిశేఖరరెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా బద్వేల్ నుంచి సుధాకర్లకు కూడా జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో చోటుదక్కింది. పలువురు టీడీపీ నేతలకుపార్టీ పదవులు ఊస్టింగ్ వాసుకు డిమోషన్... రాష్ట్ర కార్యవర్గం నుంచి పుత్తా, మల్లేల, జంబాపురం, వీఎస్ ఔట్ ఎన్నికల్లో వాడుకొనివదిలేస్తున్న చంద్రబాబు -
రైల్వేస్టేషన్లకు కొత్తకళ!
కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ భారత్ పథకం ద్వారా జిల్లాలోని కడప, రాజంపేట రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో అమృత్ భారత్ పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో ప్రయాణీకులకు మెరుగైన, ఆధునిక వసతులు కల్పనే పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వడివడిగా కొనసాగుతున్న పనులు జిల్లాలోని కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకుగాను రాజంపేటకు రూ.5.53 కోట్ల, కడపకు రూ. 45 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. కడప రైల్వేస్టేషన్కు సంబంధించి ముఖద్వారం పునర్నిర్మాణం, రెండు, మూడు ప్లాట్ ఫారాల విస్తరణ చేస్తున్నారు. నీటి అవసరం మేరకు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, ప్లాట్ఫాం మొత్తం గ్రానైట్ పరుస్తున్నారు. 40 అడుగుల మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్రయాణికుల నిరీక్షణ గదులు, విశ్రాంతి గదుల ఆధునికీకరణ, రాజంపేట మార్గం వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రస్తుతం మొదటి ప్లాట్ఫాంలో మాత్రమే ఉన్న లిఫ్ట్ మిగిలిన చోట్ల కూడా ఏర్పాటు, రైళ్ల రాకపోకల గురించి తెలియజేసే డిజిటల్ బోర్డు, మెరుగైన లైటింగ్ సౌకర్యం, రెండవ ప్లాట్ఫాం పూర్తిగా కవరింగ్ పనులు చేపడుతున్నారు. ● రాజంపేట రైల్వేస్టేషన్కు సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆధునిక భవనాలు, ఆధునిక శైలితో ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ ఫాం పొడవును కూడా పెంచనున్నారు. స్టేషన్లలో రైలు పట్టాల పరిశుభ్రత కోసం బ్యాలస్ట్ లెస్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఇతర సదుపాయాలు ఉంటాయి. వెయిలింగ్ హాళ్లు, వాటికి అనుబంధంగా కేఫెటేరియా, స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా, సమావేశ మందిరాలు నిర్మిస్తున్నారు. స్టేషన్కు రెండు వైపులా అప్రోచ్రోడ్లు, పార్కింగ్ ఏరియా, పాదాచారులకు ప్రత్యేక దారి, ల్యాండ్ స్కేపింగ్, ఆధునిక లైటింగ్, వేగవంతమైన వైఫే 5జీ టవర్లు ఏర్పాటు దిశగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. స్వాగతిస్తున్న ప్రయాణికులు కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. ఈ రెండు స్టేషన్ల నుంచి ప్రతినిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే ఆధునిక వసతులు సమకూరుతాయని ప్రయాణికులు భావిస్తున్నారు. గడువు కన్నా ముందే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో కడప,రాజంపేట స్టేషన్లకు నూతన హంగులు ఆయా రైల్వేస్టేషన్లకు వరంగా మారినఅమృత్ భారత్ పథకం డిసెంబరు నాటికి పనులుపూర్తి చేసేలా కసరత్తు -
అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
పులివెందుల : ఇటీవల సోషల్ మీడియాలో బీఎస్ రెడ్డి అనే ఫేస్ బుక్ యూజర్, ఎం9 న్యూస్, థింక్ అంధ్ర అనే మీడియా చానెళ్లలో తమ సోషల్ మీడియా ఖాతా, ఫేస్బుక్ ఖాతా ద్వారా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులపై, పార్టీకి సంబంధించి అసభ్యకరమైన, అవమానకరమైన, తప్పుడు ఆరోపణలతో కూడిన పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హఫీజ్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, వైఎస్సార్సీపీ నాయకులు రసూల్, చంద్రమౌళి, కనక, శివ, కార్తీక్, భాస్కర్రెడ్డి, జహిర్ అహ్మద్, కలందర్, హృషికేశవరెడ్డి, పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాయకుల గౌరవానికి, మా మనో భావాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా పోస్టులు ఉన్నాయని, సమాజంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ వర్గాలలో ద్వేషం, ఉద్రిక్తతలు రేకెత్తించే విధంగా ఉన్నాయన్నారు. ఈ చర్యలు వివిధ సెక్షన్లకు లోబడి ఉన్నాయని, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై, మీడియాపై వెంటనే కేసు నమోదు చేసి ఆ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు విన్నవించారు. భవిష్యత్లో ఇలాంటి చర్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
సమగ్ర జనగణనకు సర్వం సిద్ధం
కడప సెవెన్రోడ్స్: జన గణన–2027 కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించేందుకు జిల్లా లో అన్ని రకాల చర్యలు చేపట్టామని ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి శ్రీధర్ చెరుకూరి అన్నా రు. బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. జనగణన రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొదటి దశలో భాగంగా ఈనెల 16 నుంచి 30వ తేది వరకు స్వీయ గణన కార్యక్రమం నడుస్తుందన్నారు. మొదటిసారి పూర్తిగా డిజిటల్ ఫాంలో నమోదు జరగనుందన్నారు. ప్రజలు ఎన్యుమరేటర్ల కోసం ఎదురు చూడకుండా యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. సెల్ప్ ఎన్యుమరేషన్ ద్వారా మే 1 నుంచి 30వ తేది వరకు ఇళ్ల గుర్తింపు, వివరాల సేకరణ నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వ తేది వరకు నిజమైన జనాభా వివరాలను సేకరిస్తామన్నా రు. జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా సెన్సెస్ నోడల్ అధికారి కిరణ్కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘జలధార’ను ప్రాధాన్యతతో నిర్వహించాలి నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల భాగస్వాములతో జలధార కార్యక్రమాలను ప్రాధాన్యతతో పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలు నుంచి ‘జలధార.. నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’అమలు ప్రణాళిక, అమలుపై జేసీ డాక్టర్ నిధి మీనా, డీఎఫ్ఓ వినీత్ కుమార్ లతో కలిసి సంబంధిత అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నేటి నుంచి స్వీయ గణన ప్రారంభం మే 1 నుంచి ఇళ్ల జాబితా, గణన జిల్లా ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిశ్రీధర్ చెరుకూరి -
భళా భాస్కర్
● దొంగలను వెంటాడి పట్టుకున్న ట్రాఫిక్ ఎస్ఐ ● బాధిత మహిళకు రూ.40వేలు అప్పగింత ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు దొంగలను పట్టుకోవడమే గాక వాళ్లు దొంగలించిన డబ్బును బాధిత మహిళకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన భారతి అనే మహిళ తన తండ్రితో కలిసి బుధవారం సూపర్ బజార్ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్కు వెళ్లారు. బ్యాంక్ నుంచి రూ.40వేలు విత్ డ్రా చేసుకుని ఆటో ఎక్కారు. అదే ఆటోలో ఇద్దరు దొంగలు ఎక్కారు. కొంత దూరం వెళ్లాక మహిళ వద్ద ఉన్న రూ.40వేలు పెట్టుకున్న పర్స్ను చాకచక్యంగా దొంగలించారు. మహిళ కోర్టు వద్ద ఆటో నిలిపి దిగారు. తన వద్ద డబ్బు పర్స్ లేకపోవడంతో గట్టిగా కేకలు వేయగా జనాలంతా గుమిగూడారు. అదే దారిలో వెళుతున్న ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ వెంటనే ఆమె వద్దకు వెళ్లి విచారించారు. ఆటోలో వెళుతున్న ఇద్దరు దొంగలు తన డబ్బు దొంగలించారని చెప్పారు. దీంతో ఆటో వివరాలను సేకరించిన ఎస్ఐ వెంటనే ఆటోను వెంబడించి పట్టుకున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులను బయటకు దించి డబ్బు గురించి అడిగారు. తాము దొంగలం కాదంటూ మొదట వాళ్లిద్దరకూ ఎస్ఐని దబాయించారు. అయితే తనదైన స్టైల్లో ఎస్ఐ భాస్కర్ అడగడంతో డబ్బులు ఇచ్చేశారు. ఎస్ఐ ఆ డబ్బుబు మహిళకు అందజేశారు. బాధిత మహిళ ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఎస్ఐ బ్లూకోల్ట్స్ టీంలను పిలిపించి ఇద్దరు దొంగలను త్రీ టౌన్ పోలీస్స్టేషన్కు పంపించారు. కాగా ఇద్దరు దొంగలు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది. వీళ్లిద్దరూ బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుని వెళుతున్న వారిని పసిగట్టి చోరీ చేస్తుంటారు. దొంగలను పట్టుకున్న ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ను శభాష్ అంటూ స్థానికులు ప్రశంసించారు. -
ప్రారంభమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
వల్లూరు: జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుష్పగిరి క్షేత్రం చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శివ స్వరూపుడైన వైద్యనాధేశ్వరునికి ,విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన పుష్పగిరిలో శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయాల్లో బుధవారం జరిగిన అంకురార్పణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ సాక్షాత్తూ శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి ముందుగా పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్న కేశవునికి పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 19వ తేదీన జరిగే చందనోత్సవానికి, 20న అక్షతదియలో భాగంగా జరిగే గరుడవాహన సేవకు, 21 న జరిగే రెండు కల్యాణోత్సవాలకు , 22 న జరిగే రెండు రథోత్సవాలకు, బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన 23వ తేదీన జరిగే చక్రస్నానం, పుష్పయాగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. -
ఉప్పుటూరు వాసి కువైట్లో మృతి
అట్లూరు : మండల పరిధిలోని అట్లూరు పునరావాస కాలనీ ఉప్పుటూరు కాలనీకి చెందిన పోతిరెడ్డి అబ్బిరెడ్డి (40) బుధవారం కువైట్లో బిల్డింగ్పై నుంచి కింద పడి మృతి చెందినట్లు మృతుని బంధువులు, కాలనీ వాసులు తెలిపారు. స్థానికుల వివరాల మేరకు అబ్బిరెడ్డి పదేళ్ల క్రితం కువైట్కు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత వచ్చి భార్యను కువైట్కు తీసుకెళ్లాడు. అక్కడే ఒక కుమార్తె కూడా జన్మించింది. కుమార్తె, భార్యను ఇటీవల ఇండియాకు ఆయన పంపించారు. అయితే అక్కడ బిల్డింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అబ్బిరెడ్డి దినచర్యలో భాగంగా బుధవారం కువైట్లోని ముతల్లా అనే ప్రాంతంలో పనిచేస్తూ నాలుగు అంతస్తుల పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భర్త మృతి చెందడంతో భార్యతోపాటు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని ఇండియాలోని స్వగ్రామానికి పంపించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైలు కింద పడి వృద్ధురాలు..కడప కోటిరెడ్డిసర్కిల్ : కమలాపురం మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన జి.లింగమ్మ (86) అనే వృద్ధురాలు రైలు కింద పడి మృతి చెందింది. కమలాపురం–ఎర్రగుడిపాడు మధ్య గుర్తు తెలియని రైలు కింద పడి లింగమ్మ మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. మద్యం బాటిళ్లు స్వాధీనం కొండాపురం: మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం విక్రయాల పై బుధవారం దాడులు చేయగా చామలూరు గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి వద్ద 250 క్వార్టర్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు 250 క్వార్టర్ బాటిళ్లు కేరళ మాల్ట్ విస్కీమద్యం అక్రమంగా విక్రయాలు చేస్తుండగా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం విక్రయదారుడుని రిమాండ్కు తరలించామన్నారు. -
తేనెటీగల దాడి
● పలువురి శరీరాల్లో తేనెటీగల ముళ్లు ● చికిత్స కోసం ఆసుపత్రుల బాట రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లా కూచివారిపల్లె గ్రామస్తులపై తేనెటీగలు దాడిచేశాయి. ఆరుబయట ఉంటే సైర్వవిహారం చేశాయి. కంటికి కనిపించిన వారినల్లా కుట్టేశాయి. గుంపులుగా రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలువురి శరీరాల్లో తేనెటీగల ముళ్లు గుచ్చుకొని గాయాలబారిన పడ్డారు. చికిత్స కోసం రాజంపేట, తిరుపతి ఆసుపత్రుల బాట పట్టారు. ఈ సంఘటనలో 25 మంది గాయపడినట్లు స్ధానికులు చెబుతున్నారు. కొందరైతే శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి, కాపాడుకోనే ప్రయత్నాలు చేశారు. ఆరుబయట తెచ్చిన తంటా.. భానుడి భగభగలు తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లకే పరిమితమవుతున్న క్రమంలో గ్రామంలో సాయంసంధ్య వేళలో ఆరుబయట సేద తీరుతుంటారు..ఇది సర్వసాధారణం..ఇదే క్రమంలో కూచివారిపల్లె గ్రామంలో గ్రామస్తులు ఆరుబయట ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చాయో తేనెటీగలు గుంపులుగా జనం మీద పడ్డాయి. వాటికి తారసపడిన ప్రతి ఒక్కరిని కుట్టాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. భద్రత కలిగిన ప్రదేశాలలో చేరుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు ఊటుకూరు వెంకటరమణ, భార్య సుబ్బలక్షమ్మ ఇక్కడి విలేకర్లకు తెలిపారు. అలాగే గాయపడిన వారిలో కొంతమంది చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో చేరారు. మరికొందరికి వాంతులు, విరేచనాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు బంధవులు తెలియచేశారు. -
అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు
కడప అర్బన్: అనుమతి లేకుండా మద్యం క్రయ విక్రయాలు చేయడం, వాటికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలు (బెల్ట్ షాపులు), నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. దాడుల్లో మొత్తం సుమారు రూ.1,60,000 విలువైన 578 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 115 లీటర్ల నాటుసారా, 10 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 కేసులు నమోదు చేసి 37 మందిని అరెస్టు చేశామన్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలంలోని గుండాపురం ఎస్సీ కాలనీకి చె ందిన పాణ్యం శ్రీహరి (35) జీవనోపాధి కోసం హైదరాబాదుకు వెళ్లాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో హైదరాబాదులో తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులు తీరకపోగా వడ్డీలు పెరగడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ. 59,325 జరిమానా విధించామని ఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని , రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి రాజంపేట: రాజంపేట–రాయచోటి రహదారిలోని బ్రహ్మణపల్లె సబ్స్టేషన్ వద్ద డీ.శివ(30) అనే వ్యక్తి బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు. బ్రహ్మణపల్లె నుంచి రాజంపేటకు స్కూటీలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తిరుపతి జిల్లా ఏర్పేడు రాచగన్నేరు సబ్స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి మన్నూరు పోలీసులు చేరుకొని మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బెల్టుషాపుపై పోలీసులు దాడి రాజంపేట: పట్టణంలోని రాజంపేట బైపాస్రోడ్డు(ఉస్మాన్నగర్)లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ప్రాంతంపై బుధవారం అర్బన్ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నాగార్జున తెలిపారు. బోయభీమారాముడు, చిన్నవీరన్నలను వేర్వేరు చోట్ల అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 81బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రౌడీయిజం ఎక్కడా ఉండకూడదు
కడప అర్బన్: జిల్లాలో రౌడీయిజం ఎక్కడా ఉండకూడదని, రౌడీల ఆట కట్టించి శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని, మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవనే హెచ్చరిక ప్రజల్లోకి వెళ్లాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించాలని, విస్తృతంగా దాడులు చేసి పట్టు బడ్డ వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు సబ్ – డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి కదలికలపై నిఘాపై ఉంచి సమాచారముంటే నేరం చేయకముందే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐ.పీ.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో బెట్టింగ్ కేసుల్లో ఉన్న కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. భూ వివాదాలు, ఆర్ధిక పరమైన అంశాల వలన క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని పరిశీలించి కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. లాడ్జిలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని, వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ, సబ్ డివిజన్ లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
రైల్వేస్టేషన్లో పోలీసుల ఆకస్మిక తనిఖీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప రైల్వే స్టేషన్లో బుధవారం పోలీస్, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతో కలిసి పోలీసులు డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం – కడప ఎక్స్ప్రెస్ రైలులోని బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ సెంటర్లు, అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్ను పరిశీలించారు. ఎక్స్ప్రెస్ రైలులోని బోగీలను, ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972, పోలీసులకు లేదా డయల్ 112 కు తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలియజేశారు. ఈ తనిఖీల్లో జిల్లా నార్కోటిక్ సెల్ ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి్, రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రమోహన్, ఆర్పీఎఫ్ ఎస్ఐ నాగభూషణం, ఈగల్ టీం హెడ్ కానిస్టేబుళ్లు అయూబ్ ఖాన్, గుణశేఖర్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
వల్లూరు: కడప– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన వల్లూరు మండల పరిధిలోని ఏ ఓబాయపల్లె క్రాస్ వద్ద ఈ నెల 8 వ తేదీ రాత్రి జరిగిన కొప్పుల సుబ్బయ్య హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఆర్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎస్ఐ శివనాగిరెడ్డితో కలిసి వల్లూరు పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. మండలంలోని ఏ ఓబాయపల్లెకు చెందిన కొప్పుల సుబ్బయ్యకు అదే గ్రామానికి చెందిన నిందితులైన మద్దెల రాజేష్, మద్దెల మోహన్ రంగా, మద్దెల రఘురాంలకు మధ్య వున్న కుటుంబ విషమైన తగాదాల కారణంగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సుబ్బయ్యపై కక్ష పెంచుకున్న రాజేష్, మోహన్ రంగాలు ఈ నెల 8 వ తేదీన రాత్రి వల్లూరులోని మద్యం షాపు వద్ద సుబ్బయ్యతో గొడవ పడ్డారు. అనంతరం ఇంటికి వచ్చి మద్దెల రఘురాం ప్రోత్సాహంతో ఏ ఓబాయపల్లె క్రాస్ వద్ద సుబ్బయ్యను మచ్చుకత్తులతో నరికి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ మోహన్, ఎస్ఐ శివ నాగిరెడ్డి బుధవారం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
కూటమిలో వేలంపాట పోరు
ముద్దనూరు: ముద్దనూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్షిక వేలంపాట కూటమి వర్గీయుల్లో అంతర్గత పోరుకు దారితీసింది. బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాట కూటమి విభేదాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. వివరాలలోకి వెళ్తే గ్రామ పంచాయతీలో బస్టాండు, జంతువధశాలకు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహులు వేలంపాట నిర్వహించారు. అయితే వేలంపాట నిర్వహణలో కార్యదర్శి ఒకవర్గానికి అనుకూలంగా వ్యవహరించారని, తమను వేలంపాటలో ఉద్దేశంగా పాల్గొనకుండా చేశారని, గదిలో కూర్చొని వేలంపాట నిర్వహించారని ఒకవర్గం వాదించారు. వేలంపాటలో పోటీదారులు సమయానికి రాలేకపోవడం , డిపాజిట్ సొమ్ము చెల్లించకపోవడంతో తమకే వేలంపాట దక్కిందని, వేలంపాట పూర్తయిన తర్వాత వాదించడం తగదని కూటమిలోని మరోవర్గంవారు వాదించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ తతంగం నడిచింది. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి పంచాయతీ కార్యాలయంలో సుమారు 2గంటలకు పైగా కార్యదర్శితో చర్చించారు. ఎట్టకేలకు చివరికి కార్యదర్శి వేలంపాటను ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయడమైనదని ప్రకటించారు. సీఐ నగేష్బాబు సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు. ప్రతి ఏడాది ప్రశాంతంగా నిర్వహించే వేలంపాట అధికారుల తీరు, నిర్లక్ష్యంవల్ల రసాభాసగా మారిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యా యత్నం
పోరుమామిళ్ల: మండలంలోని సిద్దవరం పంచాయతీ చిన్నాయపల్లెకు చెందిన మేరుగ బాబు బుధవారం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మానసిక వేదనతో పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. ఎస్ఐ హనుమంతు కథనం మేరకు బాబు ఫెయిల్ అయ్యాననే బాధతో పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు వెంటనే పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లిదండ్రులు, బంధువులు కడప లో హోలిస్టిక్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని యస్ఐ తెలిపారు. జాతీయస్థాయిలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ వేంపల్లె : భారత ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మమైన మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 పోటీలలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జాతీయస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ మేథస్సు, విశ్లేషణ, సామర్థ్యం బడ్జెట్ లోతైన అవగాహనతో ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఫైనల్ రౌండ్ పోటీలలో తమ కళాశాల విద్యార్థులు ఉన్నత స్థాయి సంభాషణలో చురుకుగా పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డైరెక్టర్తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, అకడమిక్ డీన్ రమేష్ కై లాస్, డాక్టర్ కోనప్ప అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. -
ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాలలో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్లను ఉచిత న్యాయసహాయం కోసం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ అన్నారు. తమ సిబ్బందితో కలిసి బుధవారం కడప పురుషుల కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాలలోని ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. లీగల్ఎయిడ్ బాక్సులను పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సకాలంలో మందులను వాడాలని తెలియజేశారు. వైద్యాధికారికి తగు సూచనలు ఇచ్చారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ -
అ్రల్టాటెక్కు ‘ఆది’ సెగ..!
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్సార్ కడప జిల్లా చిలంకూరులోని అ్రల్టాటెక్ సిమెంటు పరిశ్రమపై మరింతగా రెచ్చిపోయారు. తాజాగా చంద్రబాబుతో నేరుగా భేటీ అనంతరం అ్రల్టాటెక్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ఆది ముప్పుతిప్పలకు గురి చేస్తున్నారు. బుధవారం తన అనుచరులను పంపి పరిశ్రమలోకి కార్మికులు వెళ్లకుండా అడ్డుకున్నారు. క్వారీ నిర్వహణను అడ్డగించారు. వాహనాలను కూడా అనుమతించలేదు. రాకపోకలను స్తంభింపజేశారు. బెదిరించి దారికి తెచ్చుకుని.. చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమపై ఆధిపత్యం చలాయించేందుకు కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేయని దౌర్జన్యమంటూ లేదు. ఎన్ని సమస్యలు సృష్టించినా యాజమాన్యం దిగిరాకపోవడంతో మరింత చెలరేగిపోతున్నారు. తన దుశ్చర్యలకు పచ్చ సిగ్నల్ కోసం చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ‘కమ్మ’గా సాగుతోందని, కమ్మ కులస్తులకే ప్రాధాన్యం లభిస్తోందని తిరుపతిలో బాహాటంగానే వ్యాఖ్యానించారు. అనంతరం కూటమి సర్కార్లో తన పనులేమీ జరగడం లేదని, ఇలాగైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పిలిపించి మాట్లాడారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఆది కార్యాచరణకు ఉపక్రమించారు. తన అనుచరులతో అ్రల్టాటెక్ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద తిష్ట వేయించారు.దీంతో అల్ట్రాటెక్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆందోళనకు దిగి.. కాంట్రాక్టులు పట్టేసి! అ్రల్టాటెక్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత లేదని.. కాలుష్య నియంత్రణ సక్రమంగా చేపట్టడం లేదని.. చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏవీ లేవంటూ ఎమ్మెల్యే ఆది తన అనుచరుల ద్వారా ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికార యంత్రాంగం అ్రల్టాటెక్ సిమెంటు ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నట్లు గుర్తించింది. కాలుష్య నియంత్రణ చర్యలు సైతం సక్రమంగా ఉన్నట్లు రూఢీ అయ్యింది. దీంతో తిరిగి బుధవారం స్థానికులకు ప్రాధాన్యత లేదంటూ మరో నాటకం తెరపైకి తెచ్చారు. ఇలా ఆందోళన చేసిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక కాంట్రాక్టు తనకు అనుకూలంగా ఇప్పించుకోగల్గుతున్నారు. ఇందుకోసం పరిశ్రమ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముడిఖనిజం సరఫరా చేసే టిప్పర్లపై కేసులు పెట్టించి ట్రాన్స్పోర్టర్లను కట్టడి చేసే యత్నం చేశారు. ఫ్యాక్టరీ తమ చెప్పు చేతుల్లో ఉండాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
చెరువులో పడ్డ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్
బద్వేలు అర్బన్ : అదుపుతప్పి తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం చెరువులో పడ్డ ఘటన మంగళవారం బద్వేలు పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రి పరిధిలోని తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనానికి కలసపాడుకు చెందిన రాకేష్రెడ్డి పైలట్గా వ్యవహరిస్తున్నాడు. మంగళవారం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రి పరిధిలోని ఓ గర్భిణీసీ్త్రని ప్రసవం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి అక్కడి నుంచి కడప రిమ్స్లో చేర్పించి తిరిగి పోరుమామిళ్ళకు వెళుతున్న సమయంలో పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో గేదెలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి నాగులచెరువులో పడింది. ఈ ఘటనలో పైలట్ రాకేష్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనం చెరువులో పడిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల జిల్లా మేనేజర్ భార్గవ్ ఘటన స్థలాన్ని పరిశీలించి చెరువులో పడిన వాహనాన్ని బయటికి తీసే చర్యలు ప్రారంభించారు. పైలట్కు స్వల్ప గాయాలు -
మంచినీరు అధికంగా తాగాలి
వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చర్మంలోని నీటి శాతం పూర్తిగా ఆవిరైపోతుంది. ఎండలు విపరీతంగా పెరగడంతో చెమట ద్వారా సోడియం లవణాలు ఎక్కువగా వెళ్లిపోతాయి. దీంతో వడదెబ్బ సొకే అవకాశం ఉంటుంది. దీంతో జ్వరం , మగతగా కమ్మటం, వాంతులు రావడం జరుగుతుంది. లవణాల శాతం ఉధృతంగా తగ్గితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లేవారు ఉప్పు బాగా వేసుకుని మజ్జిగ తీసుకోవాలి. బయట తిరిగే ప్రతి ఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల నీరు తాగుతూ ఉండాలి. – డాక్టర్ మహబూబ్ అలీ, ఎండీ(ఫిజిషియన్అండ్ షుగర్ స్పెషలిస్టు), కడప -
సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీగా వేణు
కడప సెవెన్రోడ్స్: సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వేణును డిప్యూటేషన్పై జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముద్దనూరు: ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలోని ఘాట్రోడ్డులో చిరుతపులి కనిపించినట్లు సమాచారం రావడంతో స్థానిక అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక మునయ్యకోన సమీపంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రోడ్డుపై పులి కనిపించినట్లు ఫారెస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది ఘాట్రోడ్డులో తనిఖీలు చేపట్టారు. పులి సంచరించినట్లు ఆనవాళ్లు లభించలేదని, ఈ రహదారిలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక డిప్యూటీ రేంజి అధికారి శ్రీనివాసులు తెలిపారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రత్యేక ‘స్వీయ గణన‘ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి దశలో ’ఇళ్ల జాబితా,గృహల గణన’ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారన్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30 వరకు స్వీయగణన గడువు ఉంటుందన్నారు. మే 1 నుంచి మే 30 వరకు (30 రోజులు) పాటు ఎన్యూమరేటర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి గణన నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న ప్రజా ప్రతినిధులతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు, విద్యార్థులు, అంగన్వాడీ లబ్ధిదారులు, గిరిజన ప్రాంతాల ప్రజలు, పారిశ్రామిక కార్మికులకు ప్రత్యేక రోజులను కేటాయించి అవగాహన కల్పిస్తారని జిల్లా కలెక్టర్ వివరించారు. కడప ఎడ్యుకేషన్: మేడే సందర్భంగా మే 1న కడపలో మహా సంకల్ప గర్జనను నిర్వహించనున్నామని.. దీనిని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షమ్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్( ఏపీ సీపీఎస్ ఈఏ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీయపురెడ్డి వెంకట జనార్థన్రెడ్డి పిలుపునిచ్చారు. కడపలోని 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో మంగళవారం ఏపీ సీపీఎస్ ఈఏ నాయకులు ’మేడే మహా సంకల్ప గర్జన’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఏపీఎస్) పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతోందని పేర్కొన్నారు. మే 1వ తేదీన ఉదయం 10:30 గంటలకు కడప నగరంలోని వాజ్పేయ్ విగ్రహం నుంచి కొత్త కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖాదర్ భాష, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్, బిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివార్జున తదితరులు పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూ లు, నంద్యాల జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈనెల 15వ తేది బుధవారం పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారిశ్రామిక విద్యుత్ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ‘పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక‘ను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయంలో మొదటి బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారానికి నోచుకోని పారిశ్రామిక విద్యుత్ సమస్యలను మూడవ బుధవారం తిరుపతిలోని ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా నేరుగా సీఎండీని కలిసి ఆ సమస్యల్ని విన్నవించవచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి : కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండల కేంద్రంలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కడప వాస్తవ్యులు కె.వేణుగోపాలరెడ్డి, విశాలాక్ష్మి దంపతులు రూ.50,116 విరాళంగా మంగళవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ వివాహిత క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకున్న ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జరప్పల్లికి చెందిన రెడ్డెప్ప భార్య చైత్ర(26) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి చైత్రను వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు.అన్నదమ్ములపై కర్రలతో దాడి మదనపల్లె టౌన్ : ఇంటి నిర్మాణం అడ్డుకొని అన్నదమ్ములపై ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. మంగళవారం బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సోంపాళ్యంకు చెందిన అన్నదమ్ములు ఊరికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో పునాది వేసి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. అదే సమయంలో అక్కడికి తన అనుచరులతో వచ్చిన మారయ్య ఆ స్థలం తమదంటూ గొడవకు దిగాడు. గొడవ తారా స్థాయికి చేరింది. అప్పటికే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో మారయ్య తన అనుచరులు అన్నదమ్ములు కుమార్, అనీల్ పై విచక్షణా రహితంగా దాడి చేసి చితక బాదారు. వారికి గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు వైద్యం అందిస్తున్నారు. ఘర్షణ సమాచారంపై ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూటర్ ఢీకొని వృద్ధుడికి గాయాలు మదనపల్లె టౌన్ : స్కూటర్ ఢీకొని వృద్ధుడు గాయపడిన సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన రైతు వెంకటరమణ(65) సొంత పనిమీద మదనపల్లెకు వచ్చాడు. స్థానిక చిత్తూరు బస్టాండులో బస్సు దిగి రోడ్డు పక్కన అంగడి వద్దకు నడిచి వెళుతుండగా ఓ స్కూటరిస్టు వచ్చి ఢీకొట్టి వెళ్లి పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితున్ని ఓ కారు యజమాని జిల్లా ఆస్పత్రికి తరలించాడు. -
బైక్ వేగంగా నడపొద్దని చెప్పినందుకే హత్య
● పర్లపాడు హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ ● ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ విభూకృష్ణ స్వాధీనం చేసుకున్న పిడిబాకు, కట్టెలు ప్రొద్దుటూరు క్రైం : అది ప్రాణాలను తీసేంత సమస్య అయితే కాదు.. చిన్నపిల్లలు తిరుగుతుంటారు బైక్లో వేగంగా వెళ్లొద్దని అతన్ని వారించారు. ఆ మంచి సూచనే గొడవకు కారణమైంది. పరస్పర అహంకారం, పూర్వకక్షల కారణంగా అది తీవ్రమైన ఘర్షణగా మారి హత్యకు దారి తీసింది. రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో ఈ నెల 10న హత్యకు గురైన బంగి మహేష్బాబు కేసులో ముగ్గురు నిందితులను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను ఏఎస్పీ విభూకృష్ణ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో బంగి చరణ్ బైక్లో వేగంగా వెళ్తుండటంతో వీధిలో పిల్లలు ఉన్నారని, నెమ్మదిగా వెళ్లాలని మహేష్బాబు కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో చరణ్ వారితో వాగ్వాదానికి దిగాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన చరణ్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మహేష్బాబు కుటుంబ సభ్యులు సాయంత్రం సమయంలో వీధిలో వెళ్తున్న సమయంలో వారిని చరణ్ అడ్డగించి దాడి చేశాడు. విషయం తెలియడంతో మహేష్బాబు ఘటనా స్థలానికి వెళ్లి ఎందుకు తమ కుటుంబ సభ్యులను కొడుతున్నారని అడుగగా.. చరణ్తోపాటు వారి కుటుంబ సభ్యులు పిడి బాకుతో మహేష్బాబు గొంతులో పొడిచారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో మహేష్బాబు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్కు తీసుకొని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. ఈ ఘటనపై అదే రోజు రాజుపాళెం పోలీస్స్టేషన్లో మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితులు బంగి చరణ్, బంగి సురేష్, బంగి దేవమ్మలు చిన్నశెట్టిపల్లె దారిలో ఉన్నారని తెలియడంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిడి బాకు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరచి, త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ సీఐ నాగభూషణ్, రాజుపాళెం ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి, ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, రాజుపాళెం పోలీస్స్టేషన్ సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకొని హింసకు దిగడం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 112 ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. -
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచకం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ● ఘనంగా అంబేడ్కర్ జయంతి కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సీఈసీ సభ్యులు కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, అణగారిన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు అధికమయ్యాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొనాలని, అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. విశ్వనాయకుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ ఒక కులానికి నాయకుడు కాదని, ఆయన(యూనివర్సల్ లీడర్) విశ్వనాయకుడని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు, వర్గాలు ఉన్నా ప్రజలంతా కలిసి మెలసి ఉన్నారంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనమేనన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కిశోర్ బూసిపాటి, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య, సీహెచ్ వినోద్ కుమార్, రామ్మోహన్రెడ్డి, బి.వేణుగోపాల్ నాయక్, త్యాగరాజు, కంచుపాటి బాబు, సింధేరవి, బసవరాజు, పవర్ అల్తాఫ్, జాషువా, నాగరాజు, కుమార్, ఆర్.చెన్నయ్య, కె.బాబు, పి.సంపత్, శ్రీరంజన్రెడ్డి, జి.మోహన్రెడ్డి, తోటక్రిష్ణ, డాక్టర్ పెంచలయ్య, పస్తం అంజి, టీపీ వెంకట సుబ్బమ్మ, రత్నకుమారి, మరియలు, తులశమ్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
చెమటోడ్చినా దక్కని ఫలం
భూగర్భజలమే కాదు.. మామిడి రైతుల్లో ఆశా అడుగంటింది... నిండుగా పూత పూసిందనుకునేలోపే నేలరాలి నిలువునా కోత మిగిల్చింది.. అరకొరగా పట్టిన పిందైనా ‘ఫలమి’స్తుందని ఆశపడితే.. చుక్క నీరందక.. నిలువెత్తు చెట్టు ఎండిపోతోంది.. సీమను ఉద్యాన హబ్గా మారుస్తాన్న చంద్రబాబు మాటలాగే.. ఈ ఏడాదీ మామిడి రైతు బతుకుల్లో తియ్యదనం కరువైంది.. ‘కాయా’కష్టానికి తగిన ‘ఫలం’దక్కక తోట కొట్టాలో.. ఇంకా ‘కాపు’కాయాలో తెలీక.. తేల్చుకోలేక నడితోటలో చూస్తుండిపోయాడు రైతు.. ఎండిన చెట్టు లాగే.. చక్రాయపేట: మామిడి రైతుల బతుకులు మాడిపోతున్నాయి.. తోటల్లోని బోర్లలో నీటి మట్టం అడుగంటిపోవడంతో చుక్క నీరందించలేక అన్నదాత ముఖమూ వాడిపోతోంది. దిక్కు తోచని రైతులు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందించి చెట్లను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈసమస్య చాలదన్నట్లు విద్యుత్ శాఖ అధికారుల వైపు నుంచి కూడా రైతులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఉద్యాన పంటల రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఫారం ఫాండ్లు ఉపయోగించుకుందామంటే విద్యుత్ శాఖ అధికారులు వాటికి మోటార్లు బిగించొద్దని అడ్డు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ఫారం ఫాండ్లు నీటితో నింపి తోటలు పారగట్టుకుందామంటే వాటికి మోటార్లు బిగించొద్దంటే అవి ఉండి ప్రయోజనం ఏమిటని రైతులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి అడ్డంకులు ఏమీ లేవని కూటమి ప్రభుత్వంలో అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర కాపునకు అగచాట్లు ఎన్నో.. ఈ ఏడు మామిడి పూత తొలుత ఆనందాన్ని ఇచ్చినా పిందె పట్టే సమయానికి పూత మొత్తం రాలిపోయి దుఃఖాన్ని మిగిల్చింది. అప్పటికే ఎకరాకు సుమారు లక్షపైగా రైతన్నలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. పూతతో పాటు అరకొరగా పట్టిన పిందె కాస్తా రాలిపోవడంతో రైతు బతుకుల్లో తీపి కరువైంది. ఎండలు ముదిరి పోవడంతో ట్యాంకర్ల నీళ్లు చెట్లకు చాలక వాడు ముఖం విడిచి పెట్ట లేదు.దీంతో ఉన్న పిందే కాస్తా నేల పాలైంది. తోటలు కొట్టేయాలో.. పరువుకోసం పాకులాడాలో... కాపు మొత్తం పోయి అప్పులు మిగిల్చి ఖాళీగా ఉన్న మామిడి తోటలను కొట్టేయాలో పరువు కోసం వాటికి ట్యాంకర్లతో మళ్లీ లక్షలు ఖర్చు పెట్టి కాపాడు కోవాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. మూడేళ్లుగా మామిడి రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ట్యాంకర్లు పెట్టి తోలుదా మంటే దరిదాపుల్లో వాటికి నీళ్లు పట్టించే నాథుడు కూడా లేడని రైతులు వాపోతున్నారు. ఈపరిస్థితిలో చెట్లు కొట్టేస్తే గ్రామాల్లో తోటలకు నీళ్లు తోలుకోలేక కొట్టేశాడని జనాలు ఎత్తి పొడుపు మాటలు వినాల్సి వస్తోందని ఓరైతు కంట తడి పెట్డాడు ఏదీ భరోసా గత ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకొంది. రైతు భరోసా పేరుతో వారికి అండగా నిలిచింది.కూటమి ప్రభుత్వం వచ్చాక మామిడి రైతులకు భరోసానే కరువైంది.దీనికి తోడు గతేడాది బీమా కింద హెక్టారు రూ.8వందల వరకు రైతులచే కట్టించుకున్న ప్రభుత్వం చివరకు ఒక్క పైసా కూడా విదిల్చ లేదు. భీమా పేరుతో కూడా రైతులను ముంచిన ప్రభుత్వం అనే అపవాదును కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది. చతికిల పడ్డ బోర్లు తోటలు కాపాడుకునేందుకు పాట్లు ఫారం ఫాండ్లు వాడుకుందామంటేఅడ్డంకులు విద్యుత్ మోటార్లు బిగించొద్దంటూ అధికారుల కొర్రీతోటలు కొట్టేసేది మేలేమో రైతు అగచాట్లు అన్నీ ఇన్నీ కాకుండా ఉన్నా యి. ఈఅగచాట్లు పడే కంటే తోటలు కొట్టే ఎక్కడికై నా వెళ్లి పోయేది మేలని పి స్తోంది. ట్యాంకు నీల్లు తోటలోకి వచ్చేదానికి రెండు వేలు పైగా ఖర్చు వస్తోంది. పంట దిగుబడులు లేవు. ఆదాయాలు లేవు ఎంత కాలం ఇలా బతకాలో తెలియకుండా ఉంది. –తులసీ రామ్,రైతు, సురభి ఫారం ఫాండ్లకు మోటార్లు వద్దంటున్నారు వేవిలో అరకొర నీళ్లు రైతులు ఫారం ఫాండ్లతో తోటలు పారకట్టుకుందామంటే విద్యుత్ అధికారులు వాటికి మోటార్లు బిగించొద్దని చెబుతున్నారు.ప్రభుత్వం రైతులు ఫారం ఫాండ్లు తవ్వుకోమని సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే విద్యుత్ సర్వీసులు కల్పించక పోతే అవి ఎందుకు ఉపయోగ పడతాయి. –అల్లపురెడ్డి సూర్య ప్రసాదరెడ్డి, మామిడి రైతు, మహబూబ్ నగర్, సురభి గ్రామం ఎన్ని నీళ్లని తోలాలో దిక్కు తోచలే పెద్ద పెద్ద చెట్లు అయినాయి. ట్యాంకరు నీళ్లు పట్టకస్తే నాలుగు చెట్లకు చాలవు. తోటకు ఒక తడి నీళ్లు ట్యాంకుతో పట్టేందుకు ఎకరాకు 20 వేలవుతుంది. మళ్లీ మొదటికి వచ్చే కొద్ది చెట్లు వాడి పోతున్నాయి. కాయలు వాడి వత్తులు అయి పోతున్నాయి. ఇట్లా ఎంత కాలం ఎన్ని నీళ్లని తోలాలో తెలియడం లేదు. –ఊటుకూరు మధుసూధనరెడ్డి మామిడి రైతు ఊటుకూరు వాండ్లపల్లె -
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
కడప అర్బన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితం అవుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) బి.రమణయ్య, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అర్చకుల నివాస సముదాయంలో డమ్మీలు
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలోని అర్చకుల నివాస గృహ సముదాయంలో కొందరు డమ్మీలు వచ్చి తిష్ట వేశారు. వారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోయినా గృహాలను కేటాయించడమే కాకుండా.. ఏకంగా ఆలయంలో హారతి పళ్లెం వద్ద స్థానం కల్పించారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఆలయానికి చెందిన ప్రధాన వ్యక్తి అండదండలు ఉన్నందునే వారిని తొలగించడానికి భయపడుతున్నారనే అపవాదును అధికారులు మూటగట్టుకొంటున్నారు. ఈ విషయం రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణ అనే వ్యక్తి బ్రాహ్మణ తెగకు సంబంధించిన వారు కాదు. అయినా గత కొన్నేళ్లుగా గండిలోనే తిష్ట వేశాడు. ఆయన ప్రధాన వ్యక్తి సహకారంతో అర్చకుల వసతి గృహ సముదాయంలో చోటు సంపాదించుకున్నారు. అక్కడే ఉంటూ ఆలయంలోకి వెళ్లడం, స్వామిని దర్శించుకొని హారతి పళ్లెం వద్ద నిలుచొని హారతులు ఇస్తూ.. అందులో భక్తులు వేసే కానుకలు భద్రపరచి తనకు ఆశ్రయం కల్పించిన ప్రధాన వ్యక్తికి అందజేసే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన బ్రాంహణ తెగకు చెందిన వాడే అని తెలియని భక్తులు ఆయనకు పాద నమస్కారాలు సైతం చేస్తుంటారు. ఈ విషయం తెలిసిన వారు పాపం అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే కొన్ని నెలల క్రితం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందని వ్యక్తి సతీ సమేతంగా వచ్చి మరో వసతి గృహంలో దిగాడు. ఆయన గత నెలలో వెళ్లిన ఉగాది పండుగ వరకు ఆలయంలో తాయత్తులు విక్రయించి వచ్చిన మొత్తాన్ని, మిగులు తాయత్తులను ఆ ప్రధాన వ్యక్తికి నమ్మకంగా అప్పగించే వాడు. ఉగాది అనంతరం జరిగిన పరిణామాలతో అధికారులు తాయత్తులు విక్రయంచకూడదని చెప్పడంతో ఆయన శుభ కార్యాలకు వంటల తయారీకి వెళుతున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి భార్య ప్రధాన వ్యక్తి ఇంటిలో పనులు చెక్కబెడుతుంటుందని చర్చలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కూడా ఆలయ కార్యనిర్వాహణాధికారికి తెలిసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఆలయంలోని ప్రధాన వ్యక్తి అండదండలతోనే జరుగుతున్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే.. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ హారతి పళ్లెం వద్ద ఉన్న వ్యక్తిని వెంటనే పంపించేయండి అంటూ ఆలయ సిబ్బందికి ఫోన్ ద్వారా ఆదేశాలు జరీ చేశారు. వంటలు చేయడానికి వెళ్లే వ్యక్తి విషయం మాత్రం ఏమీ బయటికి రాలేదు. కానీ కారకులపై మాత్రం విచారణకు గానీ చర్యలకు గానీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు ఇవ్వకపోవడం చర్చలకు దారి తీస్తోంది. పూజారులు కాకపోయినా గదుల కేటాయింపు ఆలయంలోనూ అనధికారికంగా విధులు అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం -
టీ 20 మ్యాచ్ విజేత అనంతపురం జట్టు
టి.వంశీకృష్ణ, 107 పరుగులు (కడప) జహీర్ అబ్బాస్, 85 పరుగులు (కడప) మల్లికార్జున, 4 వికెట్లు (అనంతపురం) ఆరిఫ్ బాషా, 3 వికెట్లు (కడప) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ మెన్ టీ20 మ్యాచ్లు ఎంతో ఉత్సాహంగా ముగిశాయి. ఈ టీ20 మ్యాచ్లో అనంతపురం జట్టు 12 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, కడప 8 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మంగళవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్లో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ జట్టులోని వంశీకృష్ణ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 53 బంతుల్లో 2 ఫోర్లు, 12 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. జహీర్ అబ్బాస్ 85 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ 1, సూర్య చరణ్ 1, దీపన్ సాయినాథ్ 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 49, జివి చరణ్జిత్ 55 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆరిస్ బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో కడప జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెల్లూరుపై అనంతపురం జట్టు విజయం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 19.3 ఓవర్లకు 168 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తోఫిత్ యాదవ్ 48, సాకేత్రామ్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున అద్భుతంగా చక్కటి లైనప్తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. వినయ్కుమార్ 2, ప్రమోద్కుమార్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 12.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ జట్టులోని హానీష్ వీరారెడ్డి 75, ఎంకె దత్తరెడ్డి 39 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సాకేత్రామ్ 3 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీ20 మ్యాచ్ల్లో అనంతపురం జట్టు 15 పాయింట్లతో ముందంజలో ఉండగా , కడప 12 పాయింట్లతో రెండవ స్థానం, నెల్లూరు జట్టు 8 పాయింట్లతో మూడవ స్థానం, చిత్తూరు జట్టు 4 పాయింట్లతో నాల్గవ స్థానం సాధించింది. కాగా కర్నూలు జట్టు సున్నా పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. -
గంజాయి కేసులో ఒకరి అరెస్ట్
కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కడప టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి. ప్రసాదరావు మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ డీఎస్పీ బాల స్వామిరెడ్డి సూచనల మేరకు మాదక ద్రవ్యాలపై నిఘా పెంచినట్లు తెలిపారు. ఈ నెల 14 తేదీన కడప నగరంలోని సీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో కేసీ కెనాల్ కల్వర్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఒక వ్యక్తి స్కూటర్పై వచ్చి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని పట్టుకుని విచారణ చేయగా అతని వద్ద గంజాయి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. వాహనం తనిఖీ చేసి 1250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అరెస్టు అయిన షేక్ ఇస్మాయిల్ బాషా గంజాయిని రౌడీ షీటర్ షేక్ అరాఫత్, షేక్ మహమ్మద్ అలీతో కలిసి కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా అమ్మాలని యత్నించినట్లు తెలిపారు. అదే విధంగా వ్యక్తిగత శత్రుత్వంతో ఇతరుల ఇళ్లలో గంజాయి పెట్టి వారిని పోలీసులకు చిక్కించే పన్నాగం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో షేక్ ఇస్మాయిల్ బాషాను పోలీసులు అరెస్ట్ చేయగా, రౌడీ షీటర్ షేక్ అరాఫత్, ఎంఐఎం పార్టీకి చెందిన షేక్ మహమ్మద్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కేసులో 1250 గ్రాముల గంజాయి గల టీవీఎస్ యాక్సెస్ స్కూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ రౌడీ షీటర్లు ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత గంజాయి, మద్యం వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో కడప టూ టౌన్ ఎస్ఐ రామకృష్ణతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
అందినకాడికి దోచుకున్నారు!
సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరంలోని వివాదాస్పద విజయదుర్గ కాలనీ వెంచర్ అనుమతులపై విచారణ వేగవంతమైంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వేసిన ఈ వెంచర్ వల్ల కేసీ కెనాల్, రహదారి స్థలం అన్యాక్రాంతమైంది. చుట్టుపక్కల భూములతో కలిపి చదును చేసినట్లు తీవ్ర ఆరోపణ ఉంది. నిబంధనలను కేసీ కాలువలో తొక్కుతూ.. ఎంచక్కా కమీషన్లు తీసుకుంటూ అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇన్నాళ్ల తర్వాత సంజాయిషీ ఇచ్చేందుకు జేసీ ఎదుట హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా ప్రశ్నలకు సదరు అధికారులు ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయే దుస్థితి వచ్చింది. టౌన్ ఫ్లానింగ్ అధికారుల అక్రమార్జన కారణంగా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా కార్పొరేషన్ యంత్రాంగం క్యూ కట్టాల్సి వచ్చింది. ● రెండు దశాబ్దాల క్రితం విజయదుర్గ కాలనీ వెంచర్ వేశారు. అప్పట్లో రైతుల భూములతో పాటు ఆ భూములకు ఉన్న కాలువలు, కాలువకు ఇరువైపులా ఉన్న దారి దాదాపు 2.5 ఎకరాలు అన్యాక్రాంతమైందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పత్రికల్లో కథనాలు సైతం వెలుగుచూశాయి. ఆమేరకు అడపదడపా ఉన్నతస్థాయిలో పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి సదరు అధికారులు వెంచర్ యజమానులకు అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ వ్యవహారాన్ని తొక్కిపెట్టేవారు. అప్పట్లో కార్పొరేషన్ అధికారుల పాలిట విజయదుర్గ వెంచర్ కామధేనువుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. విజయదుర్గ కాలనీ వెంచర్అనుమతుల ఆరోపణలపై కూపీలాగుతున్నారు! ఇదివరకూ పనిచేసినకమిషనర్లకు తాఖీదులు జేసీ ఎదుట విచారణకు హాజరు సంజాయిషీ కోసం ఈనెల 30 వరకుగడువు కోరిన కమిషనర్లు తేలుకుట్టిన దొంగల్లా టౌన్ ప్లానింగ్ యంత్రాంగం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయ సమీపంలో రింగ్ రోడ్డు వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన పృథ్వీ(36) వేముల మండలం తుమ్మలపల్లె గ్రామ సమీపంలో ఉన్న యురేనియం ప్రాజెక్టులో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే యురేనియం ప్రాజెక్టుకు వెళ్లి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా టీడీపీ కార్యాలయ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పృథ్వీకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్పందించని 108 వాహనం రోడ్డు ప్రమాదంలో పృథ్వీ అనే యువకునికి తీవ్ర గాయాలై రోడ్డుపైనే పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్కు సమాచారం అందించేందుకు 108 నంబర్కు ఫోన్ చేయగా వారు సరిగా స్పందించలేదు. దీంతో అర్ధగంట సేపు 108 అంబులెన్స్ వాహనం రాకపోవడంతో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే పృథ్వీ తన ప్రాణాలను దక్కించుకునే వాడని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనం అందుబాటులోకి వచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 సరిగా స్పందించడం లేదని స్థానికులు విమర్శించారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా 108 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా 108 జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సూరీడు ‘ఎండ’ప్రచండమై విజృంభిస్తున్నాడు.. ఎర్రగా మారి నిప్పుల వాన కురిపిస్తున్నాడు.. ఏప్రిల్ రెండోవారంలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తూ భగభగమండుతున్నాడు.. సూర్య తాపానికి జనం ‘ఉక్క’రిబిక్కిరవుతుండగా... ఉదయం 11 దాటిందంటే చాలు జనాలు లేక రోడ్లు కర్ఫ్యూను తలపిస్త
కడప అగ్రికల్చర్: ఒక వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోత.. వెరసి జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలో వారం రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాడ్పులు ‘ఉక్క’రిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఏప్రిల్ రెండవ వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. ఫలితంగా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతోపాటు రాత్రి(కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరగుతున్నాయి. అటు పగలు, ఇటు రేయి ఉక్కపోతతో జనాలు నిద్రలు లేని రాత్రుల గడుపుతున్నారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ● బయటకు వెళ్లేటప్పుడు ఎండ తీవ్రతన తప్పించుకునేందుకు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ వాడాలి ● తెలుపురంగు, పలచటి వస్త్రాలతోపాటు లూజుగా ఉన్న దుస్తులనే దరించాలి ● ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 4 గంటల మధ్య అవసరమైతే తప్ప ఆరుబయట తిరగకూడదు. ● వీలైనని సార్లు నీరు తాగడం చేయాలి. అలాగే ఎండలో తిరిగే సమయంలో కొబ్బరినీరు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నీటిలో నిమ్మరసం, కాస్తంత ఉప్పు కలిపిన ద్రావణాన్ని కూడా అప్పడప్పుడు తీసుకుంటే మంచిది. ● దూరప్రాంతాలకు ప్రయాణం చేసే వారు ఉదయం 10 గంటలలోపు గమ్యాలను చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే సాయంత్రం 4 గంటల తరువాత ప్రయాణం చేయాలి. ● ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వికారంగా వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలను పాటించడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. పెరిగిన విద్యుత్తు వినియోగం... జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరిగింది. ఎండల తీవ్రతకు తట్టుకోలేక 24 గంటలు ఫ్యాన్లు తిరగాల్సి వస్తుంది. వీటితోపాటు కూలర్లు, ఏసీల వాడకం కూడా పెరిగింది. బయట తిరిగే జనాలు ఎండ నుంచి తప్పించుకునేందుకు టోపీలను, చిన్నపాటి గోడుగులను కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు ఎత్తైన భవనాల్లో ఉండేవాళ్లు కూల్ పెయింట్లను వేయించుకుంటున్నారు. జిల్లాలో ఎండల తీవ్రత గణనీయంగా పెరగడంతో మధ్యాహ్ననికే రోడ్లన్నీ జనాలు లేక బోసిపోతున్నాయి. కొంతమంది ఎండ వేడికి తట్టుకోలేక గొడుగులను, మరికొంతమంది టోపీలు ధరించి ఎండతీవ్రత నుంచి కాసింత ఉపశమనం పొందుతున్నారు. ఎండల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలు ...ఉక్కతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం ఏప్రిల్ రెండో వారంలోనే43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రాబోవు రోజుల్లో మరింత తీవ్రరూపం జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులు -
జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రత పెరగక ముందే ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తలు పాటించాలి. పండ్ల జ్యూసులు, జావ, నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం మంచింది. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. –డాక్టర్ రవిబాబు, ఇంచార్జు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
సబ్స్టేషన్లో షిఫ్ట్ స్కాం !
● కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు ● ముఖ్యనేతల సిఫార్సులతో సబ్స్టేషన్లోకి ఎంట్రీ ● నకిలీపత్రాల కుంభకోణం వ్యవహారంతో జారుకున్న వైనం రాజంపేట: ఎపీఎస్పీడీసీఎల్ రాజంపేట డివిజన్ పరిధిలోని కడపజిల్లా, తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పరిధిలో సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల స్కాం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వంలో సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఎపీఎస్పీడీసీఎల్ ఉన్నతస్థాయినుంచి ఒత్తిడి పెట్టి తమకు అనుకూలమైన వారికి ఆపరేటర్ పోస్టులలో భర్తీ చేయించుకున్నారు. అర్హతకు సంబంధించిన పత్రాలను పరిశీలించకుండా డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఒకరు ఏ విధంగా జాయిన్ చేసుకున్నారనే అనుమానాలు తలెత్తాయి. 38 మంది షిఫ్ట్ ఆపరేటర్ల పత్రాల విచారణకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించినట్లు చెప్పుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట డివిజన్ ఉన్నప్పుడు సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్లోని రెండు నియోజకవర్గాల ముఖ్యనేతలకు షిఫ్ట్ ఆపరేటర్ నియామకంలో భాగంగా ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.8లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శలు వచ్చాయి. రైల్వేకోడూరు ముఖ్యనేత బామ్మర్ది కనుసన్నల్లో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల నియామకం జరిగిందనే ఆరోపణలు వెలువడ్డాయి. నకిలీపత్రాలతో.. కూటమి ప్రభుత్వంలో నకిలీపత్రాలతో తమకు అనుకూలమైన వారిని సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కుర్చీల్లో కూర్చొబెట్టారనే అపవాదు మూటకట్టకుంది. వీరిలో ఎక్కువగా నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఉన్నారనే విషయం ఇటీవల ఎపీ ఎస్పీడీసీఎల్ చేసిన విచారణలో వెల్లడైంది.ఇలాంటి వారు ముందస్తు సమాచారంతో తమ పోస్టులకు గుడ్బై చెప్పి వెళ్లిపోయారు. పత్రాలను సంబంధిత విద్యాసంస్థలు వెరిఫైకి వెళ్లిన నేపథ్యంలో నకిలీ పత్రాల వ్యవహారం బహిర్గతమైంది. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం అవినీతితో కూడుకున్నదన్న సమాచారం ట్రాన్స్కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్వేలి మండలం కందులవారిపల్లె సబ్స్టేషన్లో చేరిన నలుగురు, నకిలీపత్రాలతో చేరిన వారు విచారణ సమాచారంతో ఆ పోస్టుల నుంచి అపాయిట్మెంట్ ముందే వెనుదిరిగారు. రైల్వేకోడూరు (ఒకప్పుడు అన్నమయ్య జిల్లా )పెనగలూరు, రాజంపేట, నందలూరులో కొంతమంది షిప్ట్ ఆపరేటర్లపై కూడా దృష్టి సారించారు. ఇందులో కొన్ని సబ్స్టేషన్లలో ఉన్న వారు సర్దుబాటు కూడా చేసుకున్నట్లు తెలిసింది. విచారణ నుంచి తప్పించుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా కడప జిల్లాలో 38 అనర్హత కలిగిన షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు చీఫ్ మేనేజర్ రామచంద్రరావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా అన్ని సబ్స్టేషన్లలో ఏళ్లతరబడి పనిచేస్తున్న వారి విద్యార్హత పత్రాలను పరిశీలించనున్నట్లు ఎపీఎస్పీడీసీఎల్లో ప్రచారం జరుగుతోంది. ఎపీఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్ తిరుపతిలోని ఎపీఎస్పీడీఎల్ సీఎండీ కార్యాలయం రాజంపేట డివిజన్లోని రైల్వేకోడూరు, రాజంపేట పరిధిలోనే కాకుండా జిల్లాలోని ఇతర సబ్స్టేషన్లలో ఖాళీ అయిన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులపై టీడీపీ నేతల కన్నుపడింది. 2014లో టీడీపీ ప్రభుత్వంలో షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరిన వారిని తొలగించి, ఇప్పుడు తమకు అనుకూలమైన వారిని నియమించాలని ఎపీఎస్పీడీసీఎల్ డివిజన్న్ స్ధాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీ చేయాలని ముఖ్యనేత ప్రయత్నిస్తే పచ్చ కాంట్రాక్టర్ అడ్డపడటం చూస్తుంటే ఏ మేరకు లావాదేవీలు కొనసాగుతున్నాయో అవగతమవుతుందని పలువురు సిబ్బంది చెబుతున్నారు. డివిజన్ స్ధాయి అధికారి ఓ టీడీపీ నేత పచ్చ కాంట్రాక్టర్తో సఖ్యతగా ఉంటూ ఇద్దరు తమకు జేబులు నింపే వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.ఈ విషయం గురించి ఏపీఎస్పీసీఎల్ రాజంపేట డివిజనల్ ఇంజినీర్ రాజశేఖర్రెడ్డిని వివరణ కోరగా అనర్హత కలిగిన, నకిలీ ధ్రువీకరణపత్రాలతో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు డివిజన్ పరిధిలో లేరన్నారు. కడప జిల్లాలో రాజంపేట, పాత అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరులో నకిలీపత్రాలతో చేరిన షిఫ్ట్ ఆపరేటర్లు లేరని వెల్లడించారు. -
ఆర్పీల సమస్యలపై ఆందోళన
కడప సెవెన్రోడ్స్ : తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు మెప్మా పీడీ చర్యలు చేపట్టాలని జిల్లాలో పనిచేస్తున్న ఆర్పీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చి అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తమను మొదట 10వ తరగతి చదివి చదవను, రాయను వస్తే చాలని తెలియజేశారన్నారు. ఆర్పీలలో కొంతమందికి మాత్రమే టెక్నాలజీ పరంగా అవగాహన ఉందన్నారు. తమకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా అధికారులు లక్ష్యాలను విధిస్తూ జూమ్ మీటింగుల పేరుతో ఒత్తిడి చేయడం తగదన్నారు. మీకు పనిచేతకాకపోతే మానుకోవాలని, కొత్తవారువస్తారని బెదిరించడం సరికాదన్నారు. తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్న ఆర్పీలకు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా అందుకు బాధ్యులెవరన్నారు. ఒకరిద్దరు తప్పుచేస్తే దానిని మొత్తం ఆర్పీలపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్పీలకు ఐదు నెలల నుంచి వేతనం అందలేదని, పనిమాత్రం లక్ష్యాలు పెట్టి చేయించుకోవడం దారుణమన్నారు. ఆర్పీల స్థితిగతులను గుర్తించి ఏపీయూ ఒత్తిడిని తగ్గించి జియోటాగ్ లోకేషన్ తీసి వేయాలని కోరుతున్నామన్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. -
15న జలధారపై అవగాహన
బద్వేలు అర్బన్ : జలమే సంపద, జలమే జీవనాధారం అన్న సత్యాన్ని ప్రజలు గుర్తెరిగేలా ఈ నెల 15న జలధార అవగాహన కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి బద్వేలు ఆర్డీఓ కార్యాలయం నుంచి జలధార ... నీటి భద్రత – తాగునీటి సంఘాల బాధ్యత అమలు ప్రణాళికపై ఈ నెల 15న అవగాహన కల్పించే కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. జలధార కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 15న ప్రతి గ్రామంలో జలచిత్రపటం ఆవిష్కరణ చేసి గ్రామంలో ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు. భూగర్భజలశాఖ వారు అందించే వాటర్ ఆడిట్ రిపోర్టు ఆధారంగా ప్రతి గ్రామంలో, గ్రామ సచివాలయంలో విలేజ్ టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో జలవనరులకు సంబంధించిన జలచిత్రపటాన్ని తయారు చేయాలన్నారు. నీటి వనరులను గుర్తించడం, నీటి భద్రత, సాగునీటి పొదుపు, వాగులు, చెరువుల అనుసంధానం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తొలుత చింతలచెరువు గ్రామంలో నిర్వహించిన జలధార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ నాయకుడు రితీష్కుమార్రెడ్డితో కలిసి రైతులు, సాగునీటి సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, డ్వామా, డీఆర్డీఏ, భూగర్భజల, మైనర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–తిరుపతి మధ్య తి రుగుతున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సును నడిపేందుకు అర్హులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తె లియజేశారు. ఆసక్తి, అర్హులైన వారు తమ ఆధా ర్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ (18 నెలలు పూర్తయి ఉండాలి), ఆర్టీవో క్లియరెన్స్, 8వ తరగతి ఉత్తీర్ణులైన సర్టిఫికెట్, మూడు పాస్పోర్టు సైజ్ ఫో టోలతో తిరుపతిలోని అలిపిరి డిపోకు రావాలని తెలిపారు. ఇతర వివరాలకు 73828 74600, 99598 53427 నంబర్లలో సంప్రదించాలన్నారు. 19న నెలనెలా సీమ సాహిత్యం కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న నెల నెలా సీమ సాహిత్యం కార్యక్రమంలో భాగంగా 154వ సదస్సును ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించానున్నారు. ఈ విషయాన్ని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి పేర్కొన్నారు. ఈ సదస్సులో ‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి జీవితం – సాహిత్యం’అనే అంశంపై బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి ప్రసంగిస్తారని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి – జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 152 ఫిర్యాదులు(పీజీఆర్ఎస్)కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్సీ ఎన్.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 15న హాజరు కావాలి కడప ఎడ్యుకేషన్: కడపజిల్లాలో నూతన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు15వ తేదీ తిరుపతిలో జరిగే కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏప్రిల్ 15న తిరుపతి గొల్లవనిగుంట క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కావున ఆరోజు ఉదయం 9 గంటలకు తిరుపతి డీఎస్డీఓ, డీఏఓ ముందు హాజరు కావాలని డీఈఓ తెలిపారు. ఆరోజున ఆన్డ్యూటీగా పరిగణించనున్నట్లు డీఈఓ తెలిపారు. రక్షణ కోరిన ప్రేమ జంట కడప రూరల్: ప్రేమ వివాహం చేసుకున్నాం. తమకు రక్షణ కల్పించాలని ఆ జంట వేడుకుంది. సోమవారం కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చాపాడు మండలం లక్ష్మీ పేటకు చెందిన స్రవంతి, అదే మండలం పాటిమీద పల్లెకు చెందిన సుమంత్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఉన్న స్నేహం ప్రేమగా మారిందన్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కడపకు సమీపంలో ని ఒక గుడిలో వివాహం చేసుకున్నామని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలవనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఇజితిమా ధార్మిక సభలు కలికిరి: కలికిరి సమీపం మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలకు సంబంధించి అన్నమయ్య జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో జమాత్ సభ్యులు సుమారు రెండు మాసాలుగా ప్రచారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరు కానున్నారు.దీంతో ఏపీఐఐసీ స్థలంలో మైదానాన్ని చదును చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హాజరవ్వనున్నట్లు సమాచారం. ధార్మిక సభలకు ఇస్లాం బోధకులు, మత గురువులు హాజరై ధార్మిక ఉపన్యాసాలు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం మదనపల్లె అర్బన్హెల్త్ సెంటర్ లో ఐసీటీసి, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ డాక్టర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మిషన్ ఎయిడ్స్ సురక్షా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. క్లస్టర్ ఇన్చార్జి భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని కోరారు. ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
పలువురి సీఐల బదిలీ
కడప అర్బన్: కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు సీఐలు బదిలీ అయ్యారు. మంత్రాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న పి. రామాంజులును పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ చేశారు. పులివెందుల ట్రాఫిక్ సీఐగా పని చేస్తున్న కె. శాంతి లాల్ ను పులివెందుల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా, పులివెందుల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వి. సీతారామరెడ్డిని నంద్యాల టీటీసీకి బదిలీ చేశారు. నంద్యాల డీటీసీలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న డి. హాజీవలీని వైఎస్సార్ కడప జిల్లా సీసీఎస్– టు ఇన్స్పెక్టర్గా, అనంతపురం వీఆర్లో పనిచేస్తున్న ఎస్.కె చాంద్బాషాను వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా, చెన్నూరులో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం. కృష్ణారెడ్డిని అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్కు, కడప సీసీఎస్ టు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వి. శ్రీహరిని ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్గా, బద్వేలు రూరల్ సీఐ గా పని చేస్తున్న ఎన్.కృష్ణయ్యను టి. సుండుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా, టి.సుండుపల్లి నుంచి ఏపీ మస్తాన్ ను బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. వీరు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ వైఎస్సార్ కడప జిల్లా కడపలోని తాలూకా సీఐగా నరసింహరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం ఒంటిమిట్ట సీఐగా పని చేస్తూ కడప తాలూకాకు బదిలీ అయ్యారు. కడప తాలూకా పరిధిలో అలంఖాన్ పల్లెలో ఈనెల 6వ తేదీ పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని రిమ్స్లో దారుణంగా హత్య చేసిన సంఘటనలో బాధితుల ఆరోపణ మేరకు కడప తాలూకా సీఐగా పనిచేసిన రెడ్డప్పను వీఆర్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కడప తాలూకా సీఐగా నరసింహరాజు బాధ్యతలు చేపట్టారు. -
తాటి చెట్టు పైనుంచి పడి..
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం పుట్రాయునిపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి సోమవారం గ్రామ సమీపంలో ఉన్న తాటిచెట్టు పైకి ఎక్కి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి మృతి చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి ప్రతి ఏడాది వేసవి కాలంలో తాటి చెట్లకు కాయలు కోసి పులివెందుల తెచ్చి విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటుండే వాడు. ఈ నేపథ్యంలో సోమవారం తాటి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలుడి అప్పగింత ప్రొద్దుటూరు క్రైం : స్థానిక నాగేంద్రనగర్కు చెందిన సత్యజితేంద్రనాథ్ అనే 9వ తరగతి చదువుతున్న బాలుడు తండ్రి మందలించాడని ఈనెల 9న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏఎస్ఐ జాషువా, కానిస్టేబుల్ నరసింహ దర్యాప్తు చేపట్టరు. బాలుడు కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఉన్నట్లు సాంకేతికత ఆధారంగా గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం బాలుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ జాషువా, కానిస్టేబుల్ నరసింహనాయుడులను ఏఎస్పీ విభూకృష్ణ, సీఐ టీవీ కొండారెడ్డి అభినందించారు. బాలిక అదృశ్యం రొంపిచెర్ల : మైనర్ బాలిక (16) అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన మైనర్ బాలిక ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. -
ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన
● పీఆర్సీ కమిటీ వెంటనే వేయాలి ● 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలి ● ఉపాధ్యాయ సంఘాల నాయకులుకడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన వెల్లువెత్తింది. పీఆర్సీ కమిటీని వెంటనే వేసి, 30 శాతం ఐఆర్ను మంజూరు చేయాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో) డిమాండ్ చేసింది. కడపలో పదో తరగతి మూల్యాంకన కేంద్రమైన మున్సిపల్ కార్పొరేషన్ (మెయిన్) హైస్కూల్ వద్ద సోమవారం ఆ ఆర్గనైజేషన్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూసో సభ్య సంఘాలు ఏపీటీఎఫ్ అమరావతి, పీఎస్హెచ్ఎంఏ, ఏఐఐటీఏ, ఎస్టీయూ–డీ, ఎస్ఈఏఏపీ, ఈడబ్లూఏ, ఎంటిఎస్ అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రూసో రాష్ట్ర చైర్మన్ సీవీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ ఆర్థిక లాభాలు రిటైర్డ్ అయిన రోజే చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎస్హెచ్సీఎంల సమస్యలు పరిష్కరించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు. రాష్ట్ర కో చైర్మన్ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దగ్గర పడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఏఐఐటీఏఎస్ ఏసీ మెంబర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులకు పెండింగ్ ఉన్న ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున, సుదర్శన్ బాబు మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవన భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలి పీఎస్హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, శ్యాంసుందర్ మాట్లాడుతూ సీపీఎస్ వెంటనే రద్దు చేయాలని, ప్రతి ఉద్యోగికి ఓపీఎస్ అనువర్తింప చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ అమరావతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఈశ్వరచంద్ర, చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐఐటీఏ జిల్లా అధ్యక్షులు నజీర్ బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శించాలని కోరారు. దీనిపై రూసోతో చర్చలు జరపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగరాజు, కట్టు గంగాధర్, అబ్దుల్ కలాం, ఫయాజ్, అబ్బాస్ ఆలీ, పకృద్దీన్, అబిన్ బాషా, గుప్తా, గురువిరెడ్డి, శామీర్తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కారు బోల్తా.. ఇద్దరి మృతి
గోపవరం : మండలంలోని శ్రీనివాసపురం సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారి (ఎన్హెచ్–67)పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అట్లూరు మండలం మలినేనిపట్నం(బాలిరెడ్డిబావి)కు చెందిన కేశవ (24), బద్వేలు పట్టణానికి చెందిన శివచంద్ర (25) సెంచూరీ పానెల్స్ పరిశ్రమలో విధులు ముగించుకుని కారులో బద్వేలుకు వెళుతుండగా.. మండల కాంప్లెక్స్ ఎదురుగా ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు హుటాహుటిన వారిని అతి కష్టం మీద బయటికి తీశారు. అప్పటికే శివచంద్ర మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న కేశవను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించే సమయంలో కేశవ కూడా మృతి చెందాడు. ప్రతి రోజూ వారిద్దరూ కలిసి సెంచూరీ పానెల్స్కు వెళ్లి విధులు ముగించుకుని తిరిగి వస్తుండేవారు. ఉన్నపలంగా ఒక్కసారిగా ఇరువురినీ మృత్యువు వెంటాడింది. ప్రయాణిస్తున్న కారు వేగంగా రావడమే కాక ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని దుకాణాలపై పడింది. సమాచారం అందుకున్న బద్వేలు రూరల్ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాల వద్ద బోరున విలపించారు. -
బస్సు, కారును ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
మైదుకూరు : మైదుకూరు మండలం వరదాయపల్లె ఎస్సీ కాలనీ వద్ద సోమవారం బద్వేలు – మైదుకూరు జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కారు, కాలేజీ బస్సును బద్వేలు వైపు నుంచి వచ్చిన సిమెంటు ట్యాంకర్ ఢీకొంది. ఈ సంఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడి రోడ్డుపై నుంచి 20 అడుగుల మేరకు జారుకుంటూ ట్రాన్స్ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పడిపోయింది. సిమెంటు ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. బద్వేలు నుంచి మైదుకూరుకు వస్తున్న కారు ఎడమవైపు వెళ్లడంతో ట్యాంకర్ కింద పడకుండా తప్పించుకుంది. సంఘటనలో సిమెంటు ట్యాంకర్ డ్రైవర్ సచిన్ బైస్, కాలేజీ బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థుల్లో హేమంత్ అనే విద్యార్థి, బస్సు డ్రైవర్ చిన్న నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ఉన్న డ్రైవర్ గోవిందరాజు, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని నేషనల్ హైవే అంబులెన్స్లో మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కడపకు చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్గా పని చేస్తున్న చిన్ననాయుడు ఉదయం తన ఊరు భాగ్యనగరం నుంచి బయల్దేరి కూడలిలో ముగ్గురు విద్యార్థులను ఎక్కించుకొని జీవీ సత్రం వైపు వస్తోంది. మైదుకూరుకు చెందిన కారు యజమాని ప్రసాద్ను బద్వేలులో వదిలి డ్రైవర్ గోవిందరాజు తన స్నేహితుడైన మరొక వ్యక్తితో కలిసి తిరిగి మైదుకూరు వస్తున్నాడు. వరదాయపల్లె ఎస్సీ కాలనీ వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన సిమెంటు ట్యాంకర్ ముందు వైపు వెళుతున్న కారును, కాలేజీ బస్సును వేగంగా వచ్చి ఢీకొన్నట్టు కారు డ్రైవర్ గోవిందరాజు తెలిపారు. సంఘటనపై కాలేజీ బస్సు డ్రైవర్ చిన్ననాయుడు ఫిర్యాదు మేరకు మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ట్యాంకర్ డ్రైవర్, ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు -
మావిగన్–అమరావతిపై ప్రజలు ఆలోచించాలి
● ఏది మేలో నిర్ణయం తీసుకోవాలి ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్ర రాజధానిగా మావిగన్–అమరావతిలలో ఏది మేలో ప్రజలు ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా నది ప్రాంతంలో అమరావతి నిర్మాణం జరగుతోందని, ఏటా రాజధానిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో, ఆ నీటిని ఎత్తిపోయటానికి ప్రతి ఏడాది 600 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ పేరుతో ప్రతిపాదించిన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో జాతీయ రహదారులతోపాటు గన్నవరం ఎయిర్ పోర్టులు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతంలో నిర్మిస్తే మనకు ఒక రాజధాని త్వరగా ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అవుతోందని, ఇంత వరకు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాజధానిని కొత్తగా ఏర్పాటు చేయాలంటూ.. లక్షల కోట్ల అవసరం అని కూటమి ప్రభుత్వం చెబుతోందన్నారు. అంత డబ్బులు అప్పులు తీసుకుని వచ్చి రాజధాని నిర్మాణం చేపడితే, తీర్చడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అమరావతిలో పెట్టే ఖర్చులో, 20 శాతం పెడితే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. ఏబీఎన్ వార్తలు సరికావు వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ను సూచన చేస్తే.. దానిపై చర్చించాల్సింది పోయి మీడియా ద్వారా జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరింత దిగజారి కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతినే విధంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో వార్తలు ప్రసారం చేయడం దారుణమన్నారు. ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని, మావిగన్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంటుందా, లేదా అమరావతి లక్షల కోట్లు రూపాయలు అప్పులు తెచ్చి నిర్మించుకోవడం కరెక్టా అని సూచించారు. బాధ్యతాయుమైన జాతీయ పార్టీలో ఉన్న వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గొడ్డలి అంటూ వెటకారంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. నిజంగా షర్మిల జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థానంలో ఉండి మావిగన్పై ఒక కమిటీని ఏర్పాటు చేయించి, ఏది మంచిదో తెలుసుకోవాలని తెలిపారు. కేవలం చంద్రబాబు మాయలో పడి వారి ప్రాపగండం కోసం పాకులాడటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, వద్దిరాల రామాంజనేయుల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తు
సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శిస్తున్న విద్యార్థులు, మాట్లాడుతున్న కళాశాల విద్య ఆర్జేడీ జ్ఞానేశ్వర్కడప ఎడ్యుకేషన్ : ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. కడపలోని ప్రభుత్వ పురుషుల కళాశాల(ఆర్ట్స్ కళాశాల)లో సోమవారం 78వ వార్షికోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్జేడీ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు కళాశాలలో బాగా చదివి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. అందుకు తగినట్లుగా అధ్యాపకులు వివిధ రకాల నైపుణ్యాలను బోధిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ అతిథులు, కళాశాల ప్రణాళికా సంఘం సభ్యులు మానస చిన్నపరెడ్డి, పోతుల వెంకట్రామిరెడ్డి, సర్వశిక్షా అభియాన్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురివిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ మాట్లాడుతూ ఈ కళాశాల ఎంతో మంది ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అధ్యాపకులు, కళాకారులను తయారు చేసిన ఘనత పొందిందని అన్నారు. ఈ కళాశాలలో చదువుకోవడం తమ అదృష్టమని పూర్వ విద్యార్థులైన వారు కొనియాడారు. తాము కళాశాల అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తామని ప్రకటించారు. కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ ఎం. రమేష్లు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నాయకత్వంలో అధ్యాపకుల సహకారంతో విద్యార్థినీ, విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. కళాశాల పరిపాలనాధికారి డాక్టర్ రమణరావు మాట్లాడుతూ కళాశాల ఎంతో ప్రఖ్యాతి, ఘనతలు కలిగినదని, ఈ కళాశాలలో పని చేయడం తమ అదృష్టమని అన్నారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం బాటిళ్లు స్వాధీనం
మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయపల్లె లో పెద్ది వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్ట్షాప్పై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో బెల్ట్ షాప్ లో అక్రమంగా విక్రయించేందుకు ఉంచిన పది క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 16 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ రమణారెడ్డి ఆదేశాలతో వెంకటసుబ్బయ్య పై కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ తెలిపారు. మహిళ బలవన్మరణం కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్యకాలువ గ్రామంలో గంజి పార్వతి(36) అనే మహిళ సోమవారం బలవన్మరణం పొందింది. ఘటనా స్థలాన్ని కొండాపురం ఎస్ఐ జయరాములు పరిశీలించారు. ఎస్ఐ వివరాల మేరకు.. వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన గంజి లక్ష్మినారాయణకు పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన గంజి పార్వతితో వివాహం జరిగింది. వేరే కాపురం, ఆస్తి పంపకాల విషయంలో తరచూ భర్తతో గొడవ పడి, తన మాట వినలేదని మనస్తాపం చెంది క్షణికావేశంలో ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతిరాలి సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీన కె.రామసుబ్బమ్మ (80) అనే పేరుతో వృద్ధురాలిని వైద్యం కోసం చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
శ్మశాన ఆక్రమణ తొలగించాలి
మా గ్రామ సర్వే నంబరు 178/2బీలో 1.83 ఎకరాల శ్మశాన స్థలాన్ని యల్లటూరు అన్వర్బాష, యల్లటూరు కమాల్బీ ఆక్రమించి మామిడి చెట్లు నాటారు. అధికారులకు ఫిర్యాదుచేయగా, సర్వే నిర్వహించి ఆ భూమి శ్మశాన వాటికదేనని నిర్ధారించారు. మామిడి చెట్లు తొలగించి బోర్డు ఏర్పాటు చేయాలని తాము తహసీల్దార్ను కోరగా, నిధులు లేవంటూ తప్పించుకుంటున్నారు. గతంలోనూ పలుమార్లు రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చింతకుంట శివారెడ్డి, పొన్నోలు కొత్తపల్లె, సిద్దవటం మండలం -
ప్రజల మనిషి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
● ఆయన వ్యక్తిత్వం మహోన్నతం ● మైదుకూరు మాజీ శాసనసభ్యుడు రఘురామిరెడ్డికడప ఎడ్యుకేషన్ : జిల్లాలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కోసం పని చేసే నాయకుడిగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేరు పొందారని మైదుకూరు మాజీ శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులోని తమ స్వగృహంలో వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా వెంకటయ్య రాసి, వ్యాఖ్యానించి, రూపొందించిన డిజిటల్ డాక్యుమెంటరీని రఘురామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వైఎస్ అవినాష్రెడ్డిపై కొందరు రాజకీయ స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలు, తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారికి వెంకటయ్య రూపొందించిన డాక్యుమెంటరీ కనువిప్పు కలిగిస్తుందన్నారు. వైవీయూ పాలక మండలి సభ్యుడు, జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తన శిష్యుడు తవ్వా వెంకటయ్య వైఎస్ కుటుంబం పైన అపారమైన అభిమానం ఉన్నవాడని, గత ఎన్నికల సమయంలో అవినాష్రెడ్డి పైన పాట రాసి, తానే స్వయంగా గానం చేశారని అన్నారు. ప్రస్తుతం కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో.. వారి నోళ్లు మూయించడానికి వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో కళ్లకు కట్టినట్టు డాక్యుమెంటరీ రూపొందించి, వ్యాఖ్యానించారన్నారు. వైఎస్ జగన్ అడుగుజాడల్లో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ ఎవరికి కీడు చేయకుండా ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి తన అన్న జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడిచే గొప్ప ప్రజా నాయకుడు అవినాష్రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవరెడ్డి మాట్లాడుతూ భూమికి ఎంత సహనం, ఓర్పు ఉందో అవినాష్రెడ్డికి అంతటి ఓర్పు, సహనం ఉన్నాయని అన్నారు. అవినాష్రెడ్డి వ్యక్తిత్వం గురించి కడప జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ఆయన అక్కలైన సునీతమ్మ, షర్మిలమ్మకు తెలియకపోవడం శోచనీయం అన్నారు. తవ్వా రూపొందించిన వీడియో ద్వారా అయినా వాళ్లు ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ అవినాష్రెడ్డి తనకు మొట్టమొదట రాజకీయాలు పరిచయం చేశాడని, ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైందన్నారు. అనంతరం వారు డాక్యుమెంటరీ రూపకర్త తవ్వా వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త జింకా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కార్యదర్శి నారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, తవ్వారుపల్లె మాజీ సర్పంచ్ అమరేశ్వర్రెడ్డి, మైదుకూరు నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజశేఖరరెడ్డి, మైదుకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి, సుబ్బరాయుడు యాదవ్, మైలవరం మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, సుబ్బారావు, ముద్దనూరు మండల నాయకులు శివప్రసాద్, ప్రొద్దుటూరు పార్టీ అభిమానులు రాజేష్, ఆల్ప్రైడ్, ఓబులేసు, మోషా తదితరులు పాల్గొన్నారు. -
అయోమయం.. అటవీ పాలన !
● మూడుజిల్లాల్లో రాజంపేట ఫారెస్టు ● తేలని జిల్లాల అటవీ విభజన వ్యవహారం ● పత్తాలేని రీ ఆర్గనైజేషన్ కమిటీ ● ఆందోళనలో అటవీ సిబ్బంది రాజంపేట: అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోని ఎర్రచందనానికి నిలయమైన రాజంపేట అటవీ డివిజన్ మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో పాలనలో సందిగ్ధత నెలకొందన్న వాదన అటవీశాఖలోనే వినిపిస్తోంది. మూడు జిల్లాల్లో రాజంపేట అటవీ ప్రాంతం విస్తరించిన నేపథ్యంలో ఎవరి జిల్లా పాలన వారే చేయాలా..లేక ఇతర జిల్లాకు చెందిన పాలన రాజంపేటలోనే చేయాలా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లలేని పరిస్ధితిలో ఉన్నారని తెలుస్తోంది. తేల్చని కూటమి ప్రభుత్వం... అటవీపాలన విడ్డూరంగా తయారైందన్న విమర్శలున్నాయి. జిల్లా సరిహద్దులకు సంబంధించి కూడా రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. రాజంపేట, మార్కాపురం లాంటి ప్రాంతాల్లో పాలనకు సంబంధించి సమస్యలు తలెత్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రీ ఆర్గనైజేషన్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అటవీవర్గాలు చెపుతున్నాయి. ఆ కమిటీ పత్తాలేకుండా పోయింది. అటవీశాఖ మంత్రి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అటవీపాలనపై పట్టుకోల్పోతున్నారనే విమర్శలు అటవీవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అటవీసిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన కొత్త జిల్లాల స్వరూపం మారిన నేపథ్యంలో రాజంపేట అటవీ డివిజన్ సిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తమ విధులను మూడుజిల్లాలో అందిస్తున్నారు. ఏ జిల్లా పరిధిలో ఉంటే అక్కడేఊ జిల్లా అటవీశాఖాధికారి పర్యవేక్షణలో పాలన జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు కనిపించడంలేదు. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల పరిధిలో రాజంపేట ఫారెస్టు డివిజన్ ప్రాంతం ఉంది. రాజంపేట అటవీ డివిజన్ కడప జిల్లాలో ఉంది. డివిజన్కు చెందిన రేంజ్లు తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో ఉన్నాయి. కడపలో అన్నమయ్య అటవీ జిల్లా కార్యాలయం.. అన్నమయ్య జిల్లా (మదనపల్లె)అటవీ కార్యాలయం వైఎస్సార్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి పాలన కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయం జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఏర్పాటుకావాల్సి ఉంది. అక్కడి నుంచే జిల్లా అటవీపాలన కొనసాగించాల్సి ఉంటుందని అటవీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడి అటవీ పాలన కడప డీఎఫ్ఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అలా ఇప్పుడు జరగడంలేదని అటవీ వర్గాలు అంటున్నాయి. రేంజ్ ఇక్కడ...జిల్లా అక్కడ... రాజంపేట డివిజన్ పరిధిలో రేంజ్లు ఇక్కడ ఉన్నాయి. జిల్లా వేరుగా ఉంది. రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయింది. దీని పరిధిలో ఉన్న చిట్వేలి రేంజ్, రైల్వేకోడూరు సబ్డీఎఫ్ఓ, బాలపల్లె రేంజ్లు ఒకప్పుడు రాజంపేట ఫారెస్టు డివిజన్లో కొనసాగాయి. ఇప్పుడు ఈరేంజ్ తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య అటవీజిల్లాలో కొనసాగుతోంది. తిరుపతి డీఎప్ఓ కంట్రోల్లోకి ఈ రేంజ్లు వెళ్లాల్సి ఉంటుందని అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాకు ..ఆ జిల్లా రేంజ్లను అప్పగిస్తే గందరగోళ పరిస్థితులు ఉండవని సిబ్బంది అంటున్నారు. జిల్లా పరిధి రేంజ్లు అన్నమయ్య పీలేరు, రాయచోటి, మదనపల్లె కడప రాజంపేట, సానిపాయి తిరుపతి చిట్వేలి, కోడూరు, బాలపల్లె 1966 నుంచి రాజంపేట ఫారెస్టు డివిజన్ కొనసాగింది. ముందుగా కడప జిల్లాలోనే ఉండేది. తిరిగి కడప జిల్లాలోకి వెళ్లింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో అన్నమయ్య జిల్లాలోకి రాజంపేట ఫారెస్టు డివిజన్ చేరింది. మళ్లీ ఇప్పుడు జిల్లాల విభజన క్రమంలో రాజంపేట ఫారెస్టు డివిజన్ కడపలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అన్నమయ్య జిల్లా అటవీ పాలన ఇక్కడి నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐఎఫ్ఎస్ల రాజ్యం కొనసాగింది. డీఎఫ్ఓ కార్యాలయం సబ్డీఎఫ్ఓ కార్యాలయంగా మారనుందని సంకేతాలు వస్తున్నాయి. -
●2021 నుంచి ఆసంపూర్తిగా...
కడప అగ్రికల్చర్: నెలల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి కంటికి రెప్పలా పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తే వాటిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తెచ్చుకుంటే ఇక్కడ సరైన వసతులు లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. రాయలసీమలోనే ఏకై క పసుపు యార్డు కడప వ్యవసాయ మార్కెట్లో ఉంది. ఇక్కడికి కడపజిల్లా నలు మూలల నుంచే కాకుండా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా రైతులు పసుపు, వేరుశనగ కాయలు తెచ్చి అమ్ముకుంటారు. అయితే మార్కెట్యార్డులో సరైన మౌలిక వసతులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెట్యార్డులోని షెడ్లతోపాటు ఆరుబయట ఉత్పత్తులను రాసులు పోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఉన్నట్లుండి అకాల వర్షాలు పడితే దిగుబడులు వర్షార్పణం అయితే నష్టపోవాల్సి వస్తుందని రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేక.. మార్కెట్యార్డుకు సీజన్లో పసుపు, వేరుశనగ దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తారు. వీరితోపాటు మార్కెట్యార్డులో వ్యాపారులు, హమాలీలు, మహిళా కూలీలు ఇలా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవు. ఒక్క మరుగుదొడ్డి లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే మంచినీటికి సంబంధించి ఒకే ఆర్వో ప్లాంట్ ఉంది. అంతమంది ఉన్న మార్కెట్యార్డులో ఒక్క ఆర్వో ప్లాంట్ ఉంటే ఎలా పరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్యార్డుకు వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో భవనాన్ని ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీనిని ఎవరూ వినియోగిండం లేదు. మార్కెట్యార్డుకు వచ్చే రైతులు చెట్ల కింద, భవనాల పంచన బస్తాలపైన విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ. 38 కోట్ల వ్యాపార లావాదేవీలు... ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి కడప మార్డులో పసుపు కొనుగోలు ప్రారంభించారు. మొదట్లో క్వింటా పసుపు ఫింగర్, బల్ప్ ధర రూ. 13500 ధర పలికింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్వింటా రూ. 11 వేల నుంచి రూ. 11500 వరకు ధర పడిపోయింది. ప్రస్తుతం పసుపు ఽనాణ్యతను బట్టి దర పెరిగి ఫింగర్ కనిష్ట ధర క్వింటాల్ రూ. 11196 నుంచి గరిష్ట ధర రూ. 13,262 పలుకుతోంది. అలాగే బల్ప్ రకం కనిష్ట ధర క్వింటాల్ 8800 నుంచి గరిష్ట ధర 12388 వరకు పలుకుతోంది. అయితే మార్కెట్ యార్డు ప్రారంభం నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు వైఎస్సార్జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి రైతులు తీసుకొచ్చిన పసుపుకు సంబంధించి 38,307 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. దాదాపు 38 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగాయి. దీంతో కడప మార్కెట్యార్డుకు సెస్ రూపంలో 38 లక్షలు రూపాయలు వచ్చింది. కానీ మౌలిక వసతులు మాత్రం కరువయ్యాయి. తమ గురించి పట్టించునే వారే కరువయ్యారని పలువురు రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జెడ్పీ సమావేశంలో... కడప పసుపుమార్డులోని మౌలిక వసతుల గురించి జిల్లా పరిషత్తు కో ఆప్షన్ సభ్యులు అచ్చుకట్ల కరీముల్లా పలుమార్లు జెడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా సంబంధిత సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అచ్చుకట్ల కరీముల్లా చెప్పారు. కడప మార్కెట్ యార్డ్లో వసతులు కరువు సేద తీరాలంటే చెట్లు, పసుపు బస్తాలే గతి ఆగిపోయిన జంబో షెడ్ నిర్మాణం ఆరు బయటే పసుపు, వేరుశనగ విక్రయాలు కడప మార్కెట్యార్డుకు 2021లో రూ. 84 లక్షలతో జంబో షెడ్డు మంజూరు చేసింది. దీనిని కాంట్రాక్టర్ కొంత నిర్మాణం చేపట్టి తర్వాత పనులు చేయకుండా వదిలేశారు.ఫలితంగా కడప మార్కెట్యార్డుకు రైతులు పసుపు, వేరుశన కాయలను అమ్మకాల కోసం తీసుకుని వస్తే ఆరుబయట, రోడ్లుపై పోసి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు అందోళన చెందుతున్నారు. కడప పసుపుమార్కెట్ యార్డులో రైతులకు సరైన మౌలిక వసతులు లేవు. కొద్దిసేపు సేద తీరుదామంటే నిలువ నీడలేదు. ఎండసెగకు సంచులపైనే కూర్చోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – సుదర్శన్, రైతు, చిట్వేల్ మార్కెట్యార్డులో మరుగుదొడ్లు లేవు. దీంతో పసుపు, వేరుశనగ కాయలను తీసుకొచ్చే రైతులు మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడాల్సి వస్తోంది.వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి. అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో వసతులు కల్పించాలి. – మునిస్వామి, రైతు మార్కెట్యార్డుకు పసుపు తీనుకుని వచ్చాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటే సరైన వసతి లేదు. దీంతో బస్తాలౖపైనే పడుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. కల్పించాలి. – క్రిష్ణయ్య, చింతమరాసుపల్లె, ఒంటిమిట్ట మండలం, -
కీర్తన హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
ఖాజీపేట : మండలంలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన దారుణ హత్యపై ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిజనిర్ధారణ నిర్వహించారు. కీర్తన హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు, బంధువులు, చుట్టపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కీర్తన ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి వెళ్లి దాడి చేసి గొంతు కోసి చంపాడని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారన్నారు. ఏడాది ముందు నిందితుడు కీర్తనను ప్రేమించమని బలవంతం చేశాడు. బాలిక తండ్రి, సోదరులు వెంకటేష్ను హెచ్చరించారన్నారు. వెంకటేష్, ప్రవీణ్కుమార్ తమ్ముడు తనపై దాడి చేశారని కీర్తన చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఇద్దరిపై ఫిర్యాదు చేస్తే కేవలం వెంకటేష్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. మృతురాలి ఇంటి దగ్గర కెనరా బ్యాంక్ సీసీ టీవీ పుటేజీని కొందరి ఒత్తిడి మేరకు తొలగించారన్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడని, ఇద్దరు పోలీసులపై రాళ్లతో దాడి చేశాడని, అతన్ని ఆపడానికి జరిపిన కాల్పులలో కాలికి బుల్లెట్ గాయమైందని పోలీసులు తెలిపారన్నారు. కానీ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఎలా దాడి చేయగలిగాడని ప్రశ్నించారు. వైద్యులు ఇచ్చిన నివేదికలో ఫ్రాక్చర్ అనే మాట వినిపిస్తోందని, బుల్లెట్ లభ్యమైనట్లు తెలియలేదన్నారు. కీర్తన అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే నిందితుడి తల్లి మీడియాతో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు., కీర్తన, వెంకటేష్ల ప్రేమ వ్యవహారం తనకు తెలియదని, ఘటన జరిగిన రోజు తన కుమారుడు ఇంటికి వచ్చి ప్రేమ విషయంలో కీర్తన తనను మోసం చేసిందని తెలిపాడన్నారు. ఈ విషయం అడగడానికి వెళితే కత్తితో గొంతు కోసుకుంటానని బెదిరించిందని, పెనుగులాటలో గొంతు కోసుకుందని చెప్పాడని ఆమె తెలిపారు. దీనిని బట్టి నిందితుడిని రక్షించే ప్రయత్నం ప్రారంభమైనట్లు తెలుస్తోందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని, వారికి అవసరమైన సహాయ సహకరాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పద్మ, కమిటీ సభ్యురాలు అనిత, జేవీవీ సమత అధ్యక్షురాలు అరుణ, రాయలసీమ మహిళా శక్తి కార్యదర్శి వడ్ల లక్ష్మీదేవి, సీపీఎం మండల ఇన్చార్జి రాజశేఖర్, సాగర్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.నిజనిర్ధారణ కమిటీ సభ్యులు -
30న అరుణాచలానికి ప్రత్యేక బస్సు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి కడప నుంచి ఈనెల 30వ తేదీ ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9. గంటలకు కడపలో బయలుదేరి 10.15కు రాయచోటి మీదుగా అరుణాచలానికి బస్సు వెళుతుందన్నారు. ఈ బస్సులో రానుపోను చార్జీల కింద కడప, రాయచోటి నుంచి రూ.1050గా నిర్ణయించారన్నారు. సర్వీసు నంబర్ 913337తో తమ టిక్కెట్లను రిజర్వు చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు డీఎం 9959225774. కో ఆర్డినేటర్ 94404 49559 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. నిత్యాన్నదానానికి రూ. 3లక్షల విరాళం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కేంద్రానికి ఆదివారం రూ. 3లక్షల విరాళం అందింది. గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన ఆలపాటి మాధవరావు రూ. 1,01,116, ఆలపాటి కృష్ణ కుమారి రూ. 1,01,116, కృష్ణా జిల్లా వీరంకిలాకుకు చెందిన సుజాత రూ. 1,00,001 విరాశం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్కు అందజేశారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. మదనపల్లె ఆర్ఓకు అరెస్ట్ వారెంట్ సాక్షి, అమరావతి: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ) జీవి.పల్లవి అరెస్ట్కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్ అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవిని ఆన్లైన్లో హజరుకావాలని తెలియజేసినప్పటికి హజరుకాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్ వారంట్ను జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది. వెలుగు అక్రమాలపై విచారణ బి.కొత్తకోట: స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ లోతుగా జరుగుతున్నట్టు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, ఫర్నిచర్ మాయం కావడం, మంజూరు చేసిన రుణాలు రికవరీ కాకపోవడం, సీ్త్రనిధి రుణాలకు సంబంధించి కొన్ని గ్రామాల నుంచి నిధులు రికవరీ కాకపోవడం, ఓ గ్రామంలో రుణాలు ఇచ్చినా పైసా వసూలు చేయకపోవడంపై డీఆర్డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రుణాల రికవరీ సంబంధించి ఇప్పటికే విచారణలో అధికారులు నివేదికలో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ నివేదికలపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ మాయం కావడానికి ఏపీఎంను బాధ్యుని చేసి రూ.54 వేలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కోటావూరు డెయిరీ పేరుతో ఖర్చు చేసిన నిధుల వివరాలు, బి.కొత్తకోట డెయిరీకి సంబంధించిన నిధుల వ్యయంపైనా విచారణ జరగనున్నట్టు చెబుతున్నారు. హాకీ జట్టు ఎంపిక మదనపల్లె సిటీ : పట్టణంలోని బీటీ కాలేజీ హాకీ గ్రౌండ్లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు సెలక్షన్ ట్ర యల్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేసి,ఏప్రిల్ 16 నుంచిచిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయిపోటీలలో అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీషెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 247 కేసులు నమోదు చేసి, రూ. 54,354 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆకస్మిక వాహన తనిఖీలు కడప నగరంలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో వాహన తనిఖీలను నిర్వహించారు. రోడ్లపై అనవసరంగా తిరిగే వారికి పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఊటుకూరు సర్కిల్ లో వాహన తనిఖీలను పరిశీలించి పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. సరైన రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్కు పోలీస్ అధికారులు తరలించారు. అనంతరం కడపలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో షాపులు నిర్దేశించిన సమయానికి మూసివేశారా.. లేదా అని ఎస్పీ పరిశీలించారు. తనిఖీల్లో కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య, కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య, చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, కడప టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు, సీకే దిన్నె ఎస్.ఐ శ్రీనివాసుల రెడ్డి, చిన్న చౌకు ఎస్.ఐ రాజ రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లోచోరీ
ములకలచెరువు : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కాలువపల్లెకు చెందిన సురేష్ స్థానికంగా ఉన్న వినాయక్నగర్లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కాలువపల్లెకు వెళ్లారు. గమనించిన దుండగులు గేటు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి అందులోని రూ. 85 వేల నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి దొంగలించారు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని గమనించి బాధితుడికి సమాచారం అందించారు. అదేవిధంగా పక్కనే ఉన్న రమణ ఇంటిలోకి జొరబడేందుకు దొంగలు ప్రయత్నించారు. కానీ ఇంట్లో మనుషులను చూసి వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
రంగస్వామి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం : ఆత్మహత్య చేసుకున్న ఆవుల రంగస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. కుటుంబ సభ్యుల రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి, ప్రమీల అనే వివాహిత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామంలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరువురూ శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగస్వామి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరుకు వచ్చారు. వారు రాగానే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ సహజీనం చేస్తున్న విషయం ఇన్ని రోజులుగా తమకు తెలియదని, ఇటీవలే తెలిసినట్లు ఆయన పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులు రంగస్వామి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల మృతదేహం కోసం రాని కుటుంబ సభ్యులు ప్రమీల మృతి చెందిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపినా వాళ్లు ఎవ్వరూ ప్రొద్దుటూరుకు రాలేదు. ఆదివారం కూడా రూరల్ పోలీసులు పలుమార్లు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినా వాళ్లు రావడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ప్రమీల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. మృతదేహాన్ని ఆస్పత్రిలో ని మార్చురీలో భద్రపరిచారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు రాకుంటే పోస్టుమార్టం నిర్వహించి ప్రొద్దుటూరులోనే ప్రమీల మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రమీల ఇద్దరు కుమారులు ముత్తు అలియాస్ రంగస్వామి, ప్రకాష్లను పోలీసులు కడపలోని చైల్ట్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. -
ఉత్సాహంగా టీ20 మ్యాచ్లు
5 వికెట్లు తీసిన శ్రీకాంత్ 129 పరుగులు చేసిన కడప బ్యాట్స్మెన్ ధృవకుమార్రెడ్డి 121 పరుగులు చేసిన గిరినాథ్ 84 పరుగులు చేసిన కర్నూలు బ్యాట్స్మెన్ కరణ్ షిండేకడప వైఎస్ఆర్ సర్కిల్: టీ20 మ్యాచ్లు ఉత్సాహంగా జరిగాయి.ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో అనంతపురం, కడప జట్లు విజయం సాధించాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్లో చిత్తూరు–అనంతపురం జట్లు తలపడ్డా యి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని పృధ్వీరాజ్ 42, ధరణికుమార్ నాయుడు 45 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 2, ప్రమోద్కుమార్ 2, ఎస్ఎండీ కమిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 19.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ రోన్ 74, విజయ్కుమార్ 38 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ 5 వికెట్లు తీశాడు. గిరిష్ కుమార్ రెడ్డి 2, దీపన్ సాయినాఽథ్ 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో అనంతపురం జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ● వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యా హ్నం జరిగిన మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధృవకుమార్రెడ్డి 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. జయవర్దన్ 58, ధనుష్ 45 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని ఎస్కె కమరుద్దీన్ 2, ఆంజనేయులు 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆ జట్టులోని గిరినాఽథ్ 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. కరణ్ షిండే 84 పరుగులు చేశాడు,కడప జట్టులోని సుదర్శన్ 2, ఆరిష్ భాష 1, మహ్మద్ రఫీ 1 తీశారు. దీంతో కడప జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.అనంతపురం, కడప జట్ల విజయం -
పది మూల్యాంకనంలో జాప్యం!
● నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు ● గడువులోగా ఫలితాల వెల్లడిపై సందేహాలు?కడప ఎడ్యుకేషన్ : పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్) ఆధునికీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత వ్యవస్థ ప్రారంభ దశలోనే సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటోంది. నెట్వరర్క్ లోపాలు, సర్వర్ అంతరాయాలు, పరికరాల పనితీరులో సమస్యల కారణంగా మూల్యాంకన ప్రక్రియ కొంత ఆలస్యమవుతోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా సుమారు 28154 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన మూల్యాంకన పక్రియ ఈ నెల 6వ తేదీ నుంచి కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1,95,674 సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాధ్యమా అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో డిజిటల్ ఆటోమేషన్ను ప్రవేశపెట్టి లక్షల రూపాయల వ్యయంతో ట్యాబ్లు, సాంకేతిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు లక్షలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేసినప్పటికీ, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఈనెల 6వ తేదీన ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ సాంకేతిక ఆటంకాల కారణంగా ఆలస్యంగానే కొనసాగుతోంది. దీంతో అయ్యవార్లు ఆందోళనకు గురవుతున్నారు. ట్యాబ్ల పనితీరుపై అందోళన.. ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్లు సరిగా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ అంతరాయాలు వంటి సమస్యల వల్ల మార్కుల నమోదు ప్రక్రియ అనుకున్న మేర జరగడం లేదు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉన్నప్పటికీ మొదటి రోజున సగటున 20 పత్రాలకే పరిమితమయ్యారు. మూల్యాంకనం అనంతరం ప్రతి జవాబు పత్రాన్ని స్కాన్ చేసి ట్యాబ్లో మార్కులు నమోదు చేయాల్సిన ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన మార్కులను నమోదు చేసే బాధ్యతను ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక అసిస్టెంట్లకే పరిమితం చేయడం వల్ల పనిలో వేగం తగ్గింది. సాఫ్ట్వేర్ పరిమితుల కారణంగా ఇతరులు నమోదు చేయలేకపోవడం వల్ల జాప్యం నెలకొందన్న వాదనలున్నాయి. సాధారణంగా ఉదయం ప్రారంభమయ్యే మూల్యాంకనం సాంకేతిక సమస్యల వల్ల రాత్రి వరకు కొనసాగుతోంది. రోజువారి మూల్యాంకనం సాయంత్రానికి ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం పూర్తికాకపోవడంతో కొన్నిసార్లు జవాబు పత్రాలను మళ్లీ భద్రతా గదులకు తరలిస్తున్నట్లు తెలిసింది. మొదట ఏప్రిల్ చివరికల్లా ఫలితాలను ప్రకటించాలని భావించారు.అయితే సాంకేతిక లోపాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం అవసరమే అయినప్పటికీ, దానికి తగిన మౌలిక వసతులు, సమర్ధవంతంగా అమలు చేయలేకపోతే ఆశించిన ఫలితాలు సాధ్యం కావనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మూల్యాంకన ప్రక్రియను సజావుగా కొనసాగించడం విద్యాశాఖకు సవాల్ మారింది. -
హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం మాలేపాడుకు చెందిన నరసింహులు 2024 డిసెంబర్ 3న తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, అలివేలు మంగాపురం మెట్ల దారిలో దారుణ హత్యకు గురి కావడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చంద్రగిరి పోలీసులు నిందితులైన సీటీఎం గ్రామానికి చెందిన నాగరాజు, మాలేపాడుకు చెందిన కత్తి నరసింహులు, మునిరాజ, నారాయణస్వామి లను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు పోలీసులకు చిక్క కుండా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి చంద్రగిరి సిఐ సురేష్ కుమార్ తన సిబ్బందితో ఆదివారం మదనపల్లె మండలానికి వచ్చారు. సిబ్బంది నిందితుల కోసం ఒక వైపు గాలిస్తుండగా సిఐ పాత ముద్దాయిలను స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్కు పిలపించి విచారణచేశారు. త్వరలోనే తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై పోరాటం కడప వైఎస్ఆర్ సర్కిల్ : కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని పాత రిమ్స్లో సీఐటీయూ 10వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఒకపక్క ప్రభుత్వంతోనూ మరోపక్క యాజమాన్యంతోను పోరాటం చేయడంలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సరైన వేతనాలు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారం రాకముందు ప్రస్తుత ఉన్నటువంటి పాలకులు కార్మిక వర్గానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా చేయడం దారుణమని ఘాటుగా విమర్శించారు. సీఐటీయూ 17 వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు జరిగే మహాసభలకు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మనోహర్, శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి మదనపల్లె టౌన్ : మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. స్థానిక తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొన్నేటి పాళ్యం పంచాయతీ, బెంగళూరు రోడ్డులోని చిప్పిలికి చెందిన వీరభద్ర (55) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిద్దైపెన పడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడక పోవడంతో అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు బాధితున్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నేడు వైఎస్ అవినాష్ రెడ్డిపై డాక్యుమెంటరీ ఆవిష్కరణ
కడప ఎడ్యుకేషన్ : వైఎస్ అవినాష్రెడ్డి పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ తవ్వా వెంకటయ్య డాక్యుమెంటరీ రూపొందించారు. ఏడు నిమిషాలు నిడివిగల డాక్యుమెంటరీని సోమవారం మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ వర్తమాన రాజకీయ నేతలలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో బయట ప్రపంచానికి తెలియ చెప్పడానికి దీనిని రూపొందించామన్నారు. షర్మిల కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ‘నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది‘అన్నట్లు వైఎస్ అవినాష్రెడ్డి కడప జిల్లా ప్రజలకు గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలిసేలోపు ఆయన గురించి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..వీటిని ఖండిస్తూ ఆయన గురించి వాస్తవాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తవ్వా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి, గౌరవ అతిధిగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆత్మీయ అతిథిగా మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారని చెప్పారు. -
ఆర్టీపీపీలో లైనర్ల ప్లేట్లు చోరీ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని కోల్ ప్లాంట్లో ఉన్న లైనర్ ప్లేట్లు (ఇనుప ప్లేట్లు) చోరీకి గురయ్యాయి. వీటిని స్టేజీ–1లోని విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. కోల్ప్లాంట్లో పనిచేస్తున్న ముద్దనూరుకు చెందిన సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు అదివారం తెల్లవారుజామున మూడు లైనర్ ప్లేట్లను దొంగతనం చేసి స్కూటీలో తీసుకెళుతుండగా ఆర్టీపీపీ విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్ తన సిబ్బందితో కలసి పట్టుకొన్నారు. స్కూటీని, ఇనుపప్లేట్లను కలమల్ల పోలీస్స్టేషన్కు అప్పగించారు. కలమల్ల ఎస్ఐ మాట్లాడుతు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యఒంటిమిట్ట : మండలపరిధిలోని పెద్దకొత్తపల్లిలో శనివారం పలుకూరు మురళి(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు...మురళి తనకున్న భూమితో పాటు ఇతరులకు చెందిన భూములు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాల్లో చామంతి సాగుచేశాడు. పూలకు గిట్టుబాటు ధరలేక నష్టం వచ్చింది. అప్పుల భారం పెరిగింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక పొలంలోనే విషద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మురళిని 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, నలుగురు సంతానం ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గతనెల 24వ తేదీన గుర్తు తెలియని మహిళ (36) అనారోగ్యంతో వైద్యసేవలకు వచ్చింది. ఈనెల 10వ తేదీన మృతి చెందింది. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రిమ్స్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభంకురబలకోట : మండలంలోని తెట్టు వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.మునిరాజ తెలిపారు. ఆదివారం ధ్వజా రోహణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 17న కల్యాణోత్సవం, అదే రోజు రాత్రి గరుడోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 18న తేరు ఉత్సవం జరుగుతుందని తెలిపారు. -
తండ్రి ఆచూకీ కోసం తనయుడి ఫిర్యాదు
కలకడ : మతిస్థిమితం లేని తన తండ్రి ఆచూకీ తెలియజేయాలని తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమారుడు కేతంరెడ్డి శివకుమార్రెడ్డి (బాధితుడి) కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ ఆరిపెంటదిన్నె గ్రామానికి చెందిన కేతంరెడ్డి వెంకట్రమణరెడ్డి(72), 5 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి కుమారుడు శివకుమార్రెడ్డి చికిత్స చేయిస్తూ, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లిన సమాచారం తెలుసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకువచ్చేవాడు. 8వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన అతని తండ్రి జాడ తెలియకపోవడంతో చుట్టుపక్కల విచారించినా ఫలితం లేదన్నారు. దీంతో ఆయన ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిస్తే 9441495608ను కానీ, కలకడ పోలీస్స్టేషన్ను గానీ సంప్రదించాలని కోరారు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
కత్తిపోట్లకు గురైన పవన్ కుమార్, భవానిగుడిసివారిపల్లెలో కాలిపోతున్న బైక్మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలోని గుడిసివారిపల్లెలో ఆదివారం రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలోఅన్నా చెల్లెలు కత్తిపోట్లకు గురైయ్యారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, గుడిసివారిపల్లెకు చెందిన ఏ.పవన్ కుమార్(30), అతని చెల్లెలు ఏ.భవాని (25) లకు అదే ఊరికి చెందిన అన్నదమ్ములు నవీన్. అనూప్ వర్గానికి పాత గొడవలు ఉన్నాయి. ఆదివారం ఇరు వర్గాలు మాటామాట పెంచుకుని దూషణలకు దిగారు. ఈ గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై మరొకరు కర్రలు, కత్తులతో పర్సపర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో అన్నా చెల్లెలు పవన్ కుమార్, భవాని కత్తి పోట్లకు గురికాగా పవన్కుమార్ తల్లి అంజమ్మ, మేన మామ రెడ్డెప్ప లపై ప్రత్యర్థులు నవీన్, అనూప్ లు కర్రలు, కత్తులతో దాడులు చేశారని తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి పవన్ కుమార్, అతని చెల్లెలును తిరుపతికి రెఫర్ చేశారు. కాగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నవీన్ బైక్ను పవన్ కుమార్ వర్గీయులు తగల బెట్టడంతో మంటల్లో కాలి పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అన్నా చెల్లెలుకు కత్తి పోట్లు -
కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై బాధితులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ. ఆవులపల్లెకు చెందిన వెంకటేష్, గంగరాజు, శివలు బైక్లో స్థానిక టమాటా మార్కెట్యార్డు వద్ద ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు వెళుతుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అనంతరం గంగరాజుకు కాలు విరగడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు నిలపకుండా వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మొరవవడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు పట్టణం నాగిరెడ్డి కాలనీకి చెందిన వాసిఫ్ (30) ద్విచక్రవాహనంలో తలపులకు బయలుదేరాడు. ముందు వెలుతున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి తలపుల నుంచి పీలేరు వైపు ఎదురుగా వచ్చిన కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాసిఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం ఆయన్ను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో.. మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వినుకొండకు చెందిన తిరుపాల్ కుమారుడు తిరుమల దావీదురాజు(26) బైకులో సొంతపనిపై మదనపల్లె మీదుగా పుంగనూరు రోడ్డులో వెళుతుండగా స్థానిక తట్టి వారిపల్లె బైపాస్ రోడ్డులో హైవే రోడ్డు పనులు గమనించ కుండా వేగంగా వెళ్లాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు. -
దివ్యాంగుడు అనుమానస్పద మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఓ దివ్యాంగుడు ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలూకా పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, కొత్తపల్లె పంచాయతీ, రంగారెడ్డి కాలనీ (కొత్త ఇండ్లు)కి చెందిన ఎల్.లక్ష్మినారాయణ కుమారుడు దివ్యాంగుడు ఎల్.శంకర్ (49) సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీళ్ల తొట్టిలో పడి చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శంకర్ స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కవర్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. భార్య సునీత అలియాస్ భారతి భర్తతో మనస్పర్థల కారణంగా గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటోందని శంకర్ తల్లి రత్నమ్మ తెలిపింది. తనతో పాటు మనవళ్లు పవన్, కార్తీక్ లను శంకర్ పోషించుకుంటూ ఉన్నాడని చెప్పింది. అయితే శనివారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాని చెప్పి, తన దగ్గర రూ.200 డబ్బు తీసుకుని రాత్రి వెళ్లిన తన కుమారుడు ఆదివారం ఉదయం తట్టివారిపల్లె చెరువు కట్టపై చనిపోయి ఉన్నాడని పోలీసులు ఫోన్ చేసినట్లు తెలుపుతూ రత్నమ్మ విలపించింది. తలకు, శరీరంపైన బలమైన రక్త గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీక రించారని మృతుని తల్లి ఆరోపించడంతో ఎవరైనా పథకం ప్రకారం శంకర్ను కొట్టి చంపేసి నీళ్ల తొట్టిలో పడేసి వెళ్లారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈశ్వర్ మృతిపై అనుమానం ఉందని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శంకర్ది హత్య లేక మరే ఇతర కారణాలతో మృతి చెందాడా అన్నది తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం!
కడప ఎడ్యుకేషన్: కడప జిల్లా రాజంపేటలోని బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం బయటపడింది. ఈ శిల్పం యుద్ధంలో మరణించిన వీరుల త్యాగాన్ని.. వారి భార్యల సతీసహగమనాన్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసినదిగా మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. శిల్పశైలి, వస్త్రధారణను బట్టి విజయనగర కాలానికి చెందినదిగా గుర్తించారు. శిల్పం విశేషాలు.. మధ్యలో ఉన్న వీరుడు తన రెండు పాదాలను కుడివైపు తిప్పి ఏకముఖ పాదవిన్యాసంలో ఉన్నాడు. ఇది ఆయనలోని శౌర్యాన్ని సూచిస్తోంది. వీరుని ముఖం కొంత ఛిద్రమైనా తలపై కేశబంధం, చెవులకు లోలాకులు, నడుము నుంచి పాదాల వరకు వస్త్రధారణ, ఎడమ చేతిని ఎడమవైపు కిందికి ఉంచినట్లు, కుడి చేతిలో ఖడ్గం ధరించి కింది వైపు పట్టుకున్నట్లు శిల్పం ఉంది.కుడివైపు సతి సమపాద స్థానకంలో నిల్చుని ఉందని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. తలపై కుంతలం, పెద్ద లోలాకులు, సన్నని నడుముతో శిల్పి ఆమెను అత్యంత సుందరంగా మలిచారు. ఈమె కుడి చేతిలో కలశం, ఎడమ చేతిలో కమల మొగ్గ ధరించి ఉందని చెప్పారు. ఎడమవైపు సతి అర్ధవైతస్థితిక స్థానకంలో నిలుచుని ఉందని తెలిపారు. కుడి చేతిని నడుము కింద ఆనించి కటిహస్త ముద్రలో ఉండటం భర్త పట్ల ఆమెకున్న అచంచల నిశ్చయాన్ని చాటుతోందని చరిత్రకారుడు రమేష్ చెప్పారు. -
కీర్తన తల్లిదండ్రులను ఓదార్చిన ఎంపీ అవినాష్ రెడ్డి
వైఎస్సార్జిల్లా: ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని కీర్తన తల్లిదండ్రులను ఎంపీ అవినాష్ రెడ్డి ఓదార్చారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉన్నారు.అనంతరం,ఎంపీ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓ దుర్మార్గుడి చేతిలో కీర్తన మరణించడం అత్యంత బాధాకరం. తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఆడబిడ్డలపై ఇటువంటి దాడులు మితిమీరిపోతున్నాయి.తీవ్రమైన, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనుకాడకూడదు.ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రెండేళ్లుగా ఇలా ఆడబిడ్డలపై, చివరికి చిన్నారులపై దాడులు పెరిగిపోయాయి. చివరికి ఇంటికి వచ్చి గొంతు కోసే పరిస్థితులు నెలకొన్నాయి.ముఖ్యంగా పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన బుద్దులు కూడా నేర్పాలి. గంజాయి, బెల్టు షాపులు కూడా మితిమీరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటాలు పెరిగిపోతున్నాయి. గంజాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతోంది...గ్రామానికి రెండు మూడు బెల్టుషాపులు ఉన్నాయి.ఇలాంటి మత్తు పదార్థాల వల్ల మనుషులు కూడా మృగాలుగా మారుతున్నారు. గంజాయి, బెల్టు షాపులను తక్షణమే అరికట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
ఖాజీపేట ప్రేమ్మోనాది ఘటనలో బిగ్ ట్విస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత.. మీడియా ముందుకొచ్చారు. తన కుమారుడు, కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన కొడుకు జేబులో ఒక లెటర్ దొరికింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోందని ఆమె తెలిపారు.‘‘నా కుమారుడు కీర్తన వెంట తిరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. నాకెప్పుడూ చెప్పలేదు. హత్య జరిగిన రోజు బయటకు వెళ్లి కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను గుండెలకు హత్తుకొని ఏడ్చాడు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని ఆడగటానికి వెళ్తే కత్తి తీసుకొని గొంతు కోసుకుంటానని బెదిరించిందని చెప్పాడు. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చానని చెప్పాడు. నా కొడుకు అమాయకుడు. ఇంతటి ఘోరం చేసుంటాడని అనుకోవడం లేదు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి. మరో రకంగా వద్దు. మరో రకంగా శిక్షించేటట్లయితే... నా కుమారుడితో పాటు నన్నూ శిక్షించండి’’ అంటూ సుజాత పేర్కొంది.తన కొడుకు చంపాలని వెళ్లి ఉంటే కత్తి తీసుకువెళ్ళేవాడు కదా అంటూ తల్లి ప్రశ్నిస్తోంది. పెనుగులాటలో పొరపాటున ప్రమాదం జరిగిందని కొడుకు తనకు చెప్పాడన్న తల్లి.. ముందే బాలికను పెళ్లి చేసుకుంటానని తన కొడుకు ఆమె తండ్రిని అడిగాడని సుజాత అంటోంది. ‘‘ప్రేమించుకున్నాం కదా పారిపోయి పెళ్లి చేసుకుందామని నా కుమారుడు అడిగాడు. బాలిక రానని చెప్పింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన కుమారుడిని ఎన్కౌంటర్ చేస్తారని పుకార్లు ఉన్నాయి. చట్టప్రకారం తప్పుచేసి ఉంటే శిక్షించండి. ఎన్కౌంటర్ చేస్తే.. నన్ను కూడా చంపేయండి’’ అంటూ వెంకటేష్ తల్లి వ్యాఖ్యానించారు. -
దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న పాత బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని అర్బన్ పోలీస్స్టేషనల్లో ఆయన అర్బన్ సీఐ శ్రీరామ్, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, తిమోతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జగదీష్పై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శనివారం పది గంటల ప్రాంతంలో పట్టణంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర విక్రం, తిరుపాలు, శ్రీనివాసులును అరెస్టు చేశామన్నారు. అనంతరం దాడి జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి దాడి ఎలా జరిగిందో సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో మరొక నిందితుడు చిన్నా అలియాస్ తరుణ్ పరారీలో ఉన్నారన్నారు. గొడవకు ప్రధాన కారణం అరటి కాయల కూలీల విషయంపై మనస్పర్థలు వచ్చి తాగిన మద్యం మత్తులో మాటకుమాట పెరిగి జగదీష్పై దాడి చేశారన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా ఘర్షణలకు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
14న అంబేడ్కర్ జయంతి వేడుకలు
కడప సెవెన్రోడ్స్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఈనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు హాజరు కావాలని ఆమె కోరారు. 13న గండిలో టెండర్లు చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ, మహాకుంభాభి షేకం ఏర్పాట్లకు సంబంధించి ఈనెల 13న షీల్డ్ టెండర్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవదాయ శాఖ కర్నూలు డిప్యూటి కమిషనర్ గురుప్రసాద్ తెలిపారు.ఆరు రోజుల పాటు జరిగే ఈ వేడుకల సందర్భంగా షామియానా,బారికేడ్లు.పందిళ్ల ఏర్పాట్లు,లైటింగ్,పూలు డెకరేషన్లు, స్వాగత ఆర్చీల ఏర్పాటు,దేవస్థానం కుభాభి షేకానికి సారవలు ఏర్పాటు,యాగశాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వ హిస్తున్నట్లు చెప్పారు.వీటికి టెండరు షెడ్యూలు ధర వెయ్యి చొప్పున, రూ.ఐదువేల చొప్పున ధరావత్తు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.అలాగే ఏడాది పాటు దేవస్థానానికి పాలు పెరుగు,అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు సరఫరా చేసే హక్కులు కల్పించేందుకు కూడా అదే రోజున టెండర్లు నిర్వహిస్తామని చెప్పారు, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఎస్బీఐ ఏటీఎంలలో నగదు నిల్ కడప కార్పొరేషన్: జిల్లాలో ఎక్కువ మంది ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. చాలావరకూ ఎస్బీఐ ఏటీఎంలు మూసేశారు. కొన్ని ఏటీఎంలలో నగదు ఉన్నా రూ.100 నోట్లు మాత్రమే ఉన్నాయి. రూ.500 నోట్లు ఉండటం లేదు. మార్చి 31 నుంచి జిల్లాలో, ముఖ్యంగా కడప నగరంలో ఈ పరిస్థితి ఉందని ఖాతాదారులు వాపోతున్నారు. రూ.100 నోట్లే ఉండటంతో రూ.4వేలకు మించి విత్డ్రా చేయడం వీలు కావడం లేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎస్బిఐ అధికారులు చర్యలు చేపట్టి నగదు కష్టాలకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. -
కళా సౌరభం..సురభి నాటకం
చక్రాయపేట: నలభై ఏళ్ల సుదీర్ఘ విరామానంతరం సురభి కళామండలి సొంత గడ్డపై అడుగిడబోతోంది. ప్రజలకు తమ నాటక నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వస్తోంది. 141వ వార్షికోత్సవం సందర్భంగా ఐదు రోజుల విభిన్న నాటక ప్రదర్శనలు ఇచ్చేందుకు మరో పదిహేను రోజుల్లో కళాకారుల బృందం రానుంది.అందుకు తగ్గ ఏర్పాట్లను చేపట్టేందుకు సురభి నాటక కళాకారుల వంశీకుడు భాను ప్రసాద్,సురభి యువకళా సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు,స్థానిక నేతలను కలిశారు. 140 ఏళ్ల చరిత్ర ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు అత్యంత ప్రీతి కరమైన తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తూ.. గ్రామాల్లో తిరుగుతూ సురభి గ్రామానికి కళాకారుల బృందం చేరుకుంది. ఆ పరిసర గ్రామాల్లో నాటక ప్రదర్శనలు ఇస్తూ సాయంత్రం వేళకు అల్లపు రెడ్డి వంశీకులకు చెందిన మామిడి తోటకు చేరుకునేది.ఆమామిడి తోట యజమాని అల్లపురెడ్డి చెన్నారెడ్డి వారి కళలను గుర్తించాడు. స్వతహాగా ఆయనకూ కళల పట్ల అభిమానం ఉండటంతో కళాకారులకు ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించాడు.కళాకారుల మూల పురుషుడు వనారస గోవిందరావు ఆలోచనలకు అల్లపురెడ్డి చెన్నారెడ్డి సహాయ సహకారాలు తోడు కావడంతో తోలుబొమ్మలాట నుంచి 1885లో నాటక రంగంగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతుంటారు.క్రమేణా నాటక రంగం సినిమా సెట్టింగులను తలదన్నేలా మరో సారి రూపురేఖలను మార్చుకొని కళాకారులు సాంకేతిక నైపుణ్యంతో తమ నాటకాలను జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటించి దేశ విదేశాలకు విస్తరించి ప్రజల మన్ననలను పొందారు.సురభి వంశీకుల సహాయ సహకారాలతో తమ నాటక రంగం విస్తరించినందుకు కృతజ్ఞతగా ఎక్కడైతే తమ కళలకు బీజం పడిందో అదే గ్రామ పేరైన ‘సురభి’పేరును తమ కళామండలికి పెట్టు కోవడంతో సురభి నాటక కళామండలిగా రూపాంతరం చెందింది. కళామండలిగా మారిన తర్వాత 1984లో సురభి గ్రామం నాగలగుట్టపల్లెలోని జిల్లా పరిషషత్ ఉన్నత పాఠశాలలో అప్పటి జిల్లా కలెక్టర్ కేవీ రమణాచారి సహకారంతో నాటకాల ప్రదర్శనలు ఇచ్చింది.నాడు లవకుశ, మాయాబజారు,బాలనాగమ్మ తదితర నాటకాలను ప్రదర్శించి ప్రజలను అబ్బుర పరచింది. నాగులగుట్టపల్లెలో.. సుమారు నలభై ఏళ్ల కిందట ఇచ్చిన ప్రదర్శనలను సొంత గడ్డపై ప్రజలకు చూపించేందుకు సురభి నాటక మండలి కళాకారులు ఈనెల 21న రాబోతున్నారు.ఈనెల 27 నుంచి మే 1 వరకు ప్రదర్శనలు ఇవ్వనుంది. 27న భక్త ప్రహ్లాద, 28న పాతాళ భైరవి, 29న లవకుశ, 30న భూకై లాష్, మే 1న మాయాబజార్ నాటకాలను ప్రదర్శించనున్నారు.సురభి నాటక కళామండలిగా సుదీర్ఘంగా కొనసాగిన అనంతరం మండలి పలు శాఖలుగా విడిపోయి ఇప్పుడు భానోదయ నాటక మండలి పేరుతో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని భాను ప్రసాద్ తెలియ జేశారు.నలభై ఏళ్లక్రితం నాగలగుట్టపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రదర్శనలు ఇచ్చిన సురభి కళాకారులు ఇప్పుడు అదే ఊరులోని నాగచైతన్య విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం స్కూల్ వేదికగా ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సురభి నాటక మండలిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన నాగేశ్వరరావు(బాబ్జి)కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అంద జేసింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది. కళాకారులు నాడు నివాసం ఉన్న ఇళ్లు కూలిపోయింది.తమ కళలకు నాంది పలికిన ఊరును,తమ పూర్వీకులు నివాసం ఉన్న ఈ ఇంటి గుర్తుగా ఇక్కడి మట్టిని తీసుకెళ్లి పూజలు చేస్తూ నాటక ప్రదర్శన సందర్భంలో తిలకంగా దిద్దు కునే ఆనవాయితీ నేటికీ ఈ కళాకారులు కొనసాగిస్తున్నారు. 141వ వార్షికోత్సవ వేడుకలకు సమాయత్తం ఈనెల 27 నుంచి నాటక ప్రదర్శనలు ఏర్పాట్లలో సురభి యువ కళాసమితి సమాయత్తం -
యూరియాను సాగు కోసమే వినియోగించాలి
కడప అగ్రికల్చర్: రైతులు యూరియాను కేవలం వ్యవసాయ అవసరాల కోసమే వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా దుర్వినియోగం జరగకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. యూరియా వ్యవసాయ అవసరాలకు కాకుండా పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన సందర్భంలో ఎరువుల నియంత్రణ ఆదేశాలు 1985 ప్రకారం క్లాజ్ 25 నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యు లు నిరంతరం యూరియా అమ్మకాలపై పర్యవేక్షణ చేస్తూ అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడతారని తెలిపారు. అలాగే వచ్చే ఖరీఫ్ సీజన్ పంటల దృష్ట్యా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి తగిన మోతాదులో ఎరువులను సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామని జేడీఏ పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరరావు -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఉమ్మడి శెట్టి జయవాణి(29) మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపరాల గ్రామం కొత్త కొట్టాలలో జయరాముడు, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో జయవాణి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనను గమనించిన తండ్రి జయరాముడు వెంటనే ఆమెను జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాళం వేసిన ఇంటికి కన్నంముద్దనూరు : మండల కేంద్రంలోని తాడిపత్రి రహదారిలో హెబ్రోను చర్చి సమీపంలో తాళం వేసిన ఇంటిలో శనివారం చోరీ జరిగింది. సీఐ నగేష్బాబు తెలిపిన మేరకు వివరాలు.. నాగలక్షుమ్మ అనే మహిళ ఈ నెల 9వ తేదీన ఆమె తల్లి కంటి ఆపరేషన్ కోసం ఇంటికి తాళం వేసి ప్రొద్దుటూరుకు వెళ్లింది. శనివారం ఉదయం తిరిగి ఇంటికి రాగా తాళం పగలగొట్టినట్లు గుర్తించింది. ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా వాకిలి తెరిచి ఉంది. అందులోని రూ.20 వేల నగదు, సుమారు 3 గ్రాముల బంగారు కమ్మలు చోరీకి గురైనట్లు గుర్తించింది. బంగారు విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని క్లూస్టీం సభ్యులు తనిఖీ చేసి వివరాలు సేకరించినట్లు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం బద్వేలు అర్బన్ : అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 59 బస్తాల రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గుంతపల్లె సమీపంలో శబరికుమార్ అనే వ్యక్తి ఇంటింటికి వెళ్లి రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమ రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వెళ్లి దాడులు నిర్వహించగా 59 బస్తాల రేషన్ బియ్యం లభ్యమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతాప్రసాద్రెడ్డి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కడప లోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని ఆయన శనివారం డీఈఓ షేక్ షంషుద్దీన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మూల్యాంకన కేంద్రంలో ఇచ్చిన ట్యాబ్లకు సంబంధించిన సర్వర్ సరిగా పనిచేయకపోవడం వల్ల మార్కులు అప్లోడ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సర్వర్ కెపాసిటీ పెంచాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే కొత్త పీఆర్సీ కమిటీ, ఐఆర్తోపాటు డీఏలను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నాడు–నేడు పనులతో పాఠశాలు ఎంతగానో అభివృద్ధి చెందాయాన్నారు. వైఎస్సార్టిఎఏ నాయకులు అమర్నాథరెడ్డి, రమణారెడ్డి, కిరన్కుమార్రెడ్డి, రమేష్బాబు, శంకర్రెడ్డి, జీవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
అవాంతరాల స్పాట్
● పదోతరగతి మూల్యాంకనంలో అయ్యవార్లకు అగచాట్లు ● నిత్యం నెట్వర్క్ సమస్య ● మొరాయిస్తున్న ట్యాబ్స్లు ● మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయుల ధర్నా కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం ఉపాధ్యాయులకు సవాల్గా మారింది. ముఖ్యంగా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ ఇక్కట్లకు గురి చేస్తోంది. స్పెషల్ అసిస్టెంట్లకు ఈ విధానం తలకుమించిన భారంగా మారింది. వారికి ఇచ్చిన ట్యాబులు సాంకేతిక సమస్యతోపాటు నెట్వర్క్ సరిగా అందకపోవడంతో పడరానిపాట్లు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జామినర్లకు కలిసి ఒక స్పెషల్ అసిస్టెంట్ ఏర్పాటు చేస్తారు. అ స్పెషల్ అసిస్టెంట్ ట్యాబ్లో మార్కులు నమోదు చేస్తారు. ఇలా ప్రతి స్పెషల్ అసిస్టెంట్ రోజుకు 40 జవాబు పత్రాల చొప్పన ఇద్దరికి సంబంధించి 80 సమాధాన పత్రాలకు మార్కులను ట్యాబ్ల్లో అప్లోడు చేయాల్సి వస్తుంది. అలాగే ఒక్కో పేపర్ స్కానింగ్ చేయడానికి వారికి 15 నుంచి 20 నిమిషాలకు పైగా సమయం పడుతుందని తెలిసింది. దీనికితోడు ఎక్కువ మంది స్పెషల్ అసిస్టెంట్లు ఒకేసారి నెట్వర్క్ వినియోగిస్తుండటంతో ట్యాబ్లు సైతం మెరాయిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రతి రోజు మూల్యాంకన పక్రియ అనేది ఒక ప్రహసనంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు పొద్దుపోయే వరకు.. సాధారణంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఉదయం 9 నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు పక్రియ సాంకేతిక సమస్యల కారణంగా రాత్రి పొద్దుపోయేవరకు జరుగుతుండటంతో నిత్యం ఆయ్యవార్లు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతం నుంచి మూల్యాంకన విధులకు వచ్చే వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పడరానిపాట్లు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్వర్క్ సమస్య ఒక కారణం కాగా విద్యార్థి రాసిన జవాబుపత్రంలోని ప్రతి పేజీని స్కాన్ చేసి అప్లోడు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతోపాటు అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన పత్రాలను క్షుణంగా పరిశీలించాల్సి రావడం కూడా ప్రధాన సమస్యగా తలెత్తింది. దీంతోపాటు అధికారులు మార్కుల విషయంలో ఎటువంటి తేడా వచ్చిన పూర్తి బాధ్యతను స్పెషల్ అసిస్టెంట్లదేనని చెప్పడంతో వారిలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. మూల్యాంకన కేంద్రంలో ట్యాబ్లతో ధర్నా.. కడప మున్సిపల్ హైస్కూల్ మొయిన్లో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రంలో ట్యాబ్లకు సంబంధించిన టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం స్పెషల్ అసిసెంట్లు ట్యాబ్లతో ధర్నా నిర్వహించారు. మొదటి నుంచి ఈ ట్యాబ్లతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సమస్యను డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, డీఈఓ షేక్ షంషుద్దీన్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధింత సమస్యను డీఈఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
అద్భుతం.. నందీశ్వరాలయం
● నందిపల్లెలో రూ.7 కోట్లతో నిర్మాణం ● వైఎస్ జగన్, వైఎస్ అవినాష్రెడ్డి సహకారం ● మారం శ్రీకాంత్రెడ్డి రూ.3 కోట్లకు పైగా వ్యయం ● నేడు మండల పూజకడప సిటీ/వేంపల్లె : ఆ యువకుడు లండన్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లక్ష్మీదేవి కూడా లండన్ కంపెనీలోనే ఇంటి దగ్గరి నుంచే (వర్క్ ఫ్రం హోమ్) విధులు నిర్వర్తిస్తూ ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యారు. తన తల్లి నందిపల్లె గ్రామ సర్పంచ్ (ప్రస్తుతం మాజీ సర్పంచ్)గా ఉన్న మారం సులోచన, ఆయన భార్య లక్ష్మీదేవి అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఆలయ నిర్మాణానికి సహకరించారు. రూ.35 లక్షలుగా అనుకున్న ఆలయ నిర్మాణం చివరకు రూ.7 కోట్లకు పైగా వెచ్చించి పూర్తి చేశారు. దాదాపు మూడు సంవత్సరాలకుపైగా సమయం పట్టింది. వేంపల్లె సమీపంలో పులివెందుల రోడ్డులో నందిపల్లె గ్రామ పరిసరాల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రాచీన కళ ఉట్టిపడేలా.. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి గుడి నిర్మాణాలతో పోల్చకుండా.. ఆ తర్వాత నిర్మించిన ఆలయాల్లో దక్షిణ భారతదేశంలోనే నందిపల్లె నందీశ్వరాలయం పేరు గాంచింది. ఎక్కడా కూడా సిమెంటు, ఇటుక వాడకుండానే గుడి నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రాచీణ కళ ఆలయ పరిసర ప్రాంతాల్లో వెల్లివిరుస్తోంది. 43 వేల టన్నుల గ్రానైట్ రాళ్లు ఈ ఆలయ నిర్మాణానికి 43 వేల టన్నుల గ్రానైట్ రాయి (బ్లాక్ పెరల్)ని వాడారు. కోటప్పకొండలోని వీరభద్ర క్వారీ నుంచి 100 లారీలకు పైగా 43 వేల టన్నుల గ్రానైట్ రాయిని తీసుకొచ్చి నిర్మాణానికి ఉపయోగించారు. తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్ నేతృత్వంలో ఆలయ నిర్మాణం జరిగింది. చదరపు అడుగు రూ. 400 రేటు పడగా, మొత్తం రూ.3.50 కోట్లు గ్రానైట్ రాళ్లకు ఖర్చు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు హాజరైన మాజీ సీఎం ఈ నందీశ్వరాలయ నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారం అందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వారు దాదాపు 1.40 కోట్ల రూపాయలను ఆలయ నిర్మాణానికి అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వాహకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఇక్కడ నిర్వహించిన యజ్ఞంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు భక్తజన సందోహం మధ్య పాల్గొన్నారు. విశేష పూజలు నిర్వహించారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రతిష్ఠ చేసిన కంచి కామకోటి పీఠాధిపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన 70వ కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్రెడ్డి నిర్వహించారు. మండల పూజకు సర్వం సిద్ధం ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగి నేటికి (ఆదివారం) 48 రోజులు అనగా మండలం పూర్తి కావడంతో అందుకు సంబంఽధించిన పూజలకు సర్వం సిద్ధం చేశారు. కొత్తగా శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజాధికాలు పక్కన తాత్కాలికంగా నిర్మించిన యజ్ఞశాలలో నిర్వహించనున్నారు. ఇంకా యాగశాల, పార్కు, కల్యాణ మండపం, రెయిలింగ్ తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
పూలే గొప్ప సామాజిక తత్వవేత్త
కడప కార్పొరేషన్ : మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. శనివారం పూలే 200వ జయంతి సందర్భంగా పాతబస్టాండులోని ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ దివంగత వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఆశయాల సాధన కోసం కృషి చేశారని తెలిపారు. వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశారని తెలిపారు. బీసీలు తమ పేటెంట్ అని చెప్పుకునే టీడీపీ వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందన్నారు. పాతబస్టాండులో రూ.1.50 కోట్లు ఖర్చు చేసి తాము పూలే విగ్రహం పెట్టి, సర్కిల్ ఆధునీకరిస్తే కూటమి ప్రభుత్వం దానికి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి పూలే విగ్రహానికి దండ కూడా వేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్.శివరామ్, రాష్ట్ర కార్యదర్శి కె.శివయాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు పి.జయచంద్రారెడ్డి, బసవరాజు, తోటక్రిష్ణ, సీహెచ్ వినోద్, ఎస్.వెంకటేశ్వర్లు, త్యాగరాజు, బీహెచ్ ఇలియాస్, రాయల్బాబు, అక్బర్ అలీ, సుబ్బరాయుడు, నారాయణమ్మ, రత్నకుమారి, సిందేరవి, గంగరాజు, మల్లికార్జున, కిరణ్, జాషువా, రహీం, పస్తం అంజి, గోపాలక్రిష్ణ, కంచుపాటి బాబు, అబ్దుల్ సుభాన్, చైతల్య, పి.సంపత్, షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే
కడపసెవెన్రోడ్స్ : మహాత్మా జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి నిధి మీనా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. గౌరవ అతిధులుగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి డైరెక్టర్ వడ్ల శ్రీనివాసచారి, రాష్ట్ర సగర ఉప్పర సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ పేట చంద్రశేఖర్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ మేదర రవికుమార్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎం. శ్రీధర్, రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, రాష్ట్ర నూర్భాష అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ నగూర్ వీరభద్రుడు, రాష్ట్ర దాసరి అభివృద్ధి సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ గోవింద్ సుబ్బయ్య, రాష్ట్ర యాదవ్ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ యాదవ్తోపాటు ఇతరప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సామాన్య జీవితంతో అసాధారణంగా కృషి చేసిన మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. ‘సత్య షోడచ సమాజం’అనే సంస్థను నెలకొల్పిన ఆయన అన్ని వర్గాల వారి మధ్య అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. డీఆర్వో మల్లికార్జున మాట్లాడుతూ కుల వ్యవస్థను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా అభివృద్ధి చెందినపుడే సాధ్యమవుతుందన్నారు. వీటన్నింటినీ అధిగమించాలంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుందని అనుభవ పూర్వకంగా గ్రహించిన అధ్యయనకర్త జ్యోతిరావు పూలే అన్నారు. ఎస్డీసీ వెంకటపతి మాట్లాడారు. అంతకుముందు మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి ముఖ్య అతిధులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత బస్టాండు వద్ద పూలే సర్కిల్లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జేసీ డాక్టర్ నిధి మీనా -
పూజా స్కూల్ నిర్వాకంపై ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : మెహరాజ్బాను అనే మహిళ పిల్లల చదువు కోసం కట్టిన రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను దూషించడమే కాకుండా మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవిపై పూజా స్కూల్ సీఈఓ కవిత రూరల్ పోలీస్స్టేషన్లో తప్పుడు కేసు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన మెహరాజ్బాను అనే మహిళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా పని చేసేది. సోఫియా జోయా, మహమ్మద్ ముత్తజా సాధిక్, సుఫియాన్ అనే ఆమె ముగ్గురు పిల్లలు చౌడూరు సమీపంలోని పూజా స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో 2023లో మెహరాజ్ భర్త దస్తగిరి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ కారణంగా పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితులు ఏర్పడటంతో.. పెద్దశెట్టిపల్లె గ్రామ వైఎస్సార్సీపీ నాయకుల సాయంతో మెహరాజ్బాను అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిని ఆశ్రయించింది. ఆమె కుటుంబ పరిస్థితులను చూసి చలించిన రాచమల్లు ముగ్గురు పిల్లలకు 10వ తరగతి వరకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని చెప్పారు. పిల్లల పేరుతో రూ.3 లక్షల బాండ్లు, రూ.2 లక్షలు నగదు ఇచ్చారు. ముగ్గురు పిల్లలకు 10వ తరగతి వరకు అయ్చే రూ.10 లక్షలను భరిస్తానని ఆమెకు ఽధైర్యం చెప్పి ఆ మేరకు పూజా స్కూల్ యాజమాన్యానికి రూ.5 లక్షలు కట్టారు. ఈ డబ్బు అయిపోగానే మిగతా రూ.5 లక్షలు ఇస్తానని చెప్పారు. అయితే పూజా స్కూల్ నిర్వాహకుడు రాజారెడ్డి హత్యకు గురి కావడం, పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి మూసేయడంతో మెహరాజ్ తన పిల్లలను మరో స్కూల్లో చేర్పించింది. పిల్లలు చదువుతున్న పాఠశాల యాజమాన్యం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డబ్బు కోసం మెహరాజ్ పూజా స్కూల్కు వెళ్లింది. నాటి నుంచి నేటి వరకు అంటే రెండేళ్ల పాటు డబ్బు కోసం స్కూల్ వద్దకు తిరుగుతూనే ఉంది. డబ్బు తిరిగి ఇవ్వకపోగా పాఠశాల యాజమాన్యం ఆమెనే హేళన చేస్తూ దూషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయాన్ని మెహరాజ్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి వద్దకు వెళ్లి వివరించారు. దీంతో రాచమల్లు ఈ విషయమై మాట్లాడేందుకు మూడు రోజుల క్రితం మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, మరి కొంత మంది పార్టీ మహిళా నేతలను పూజా స్కూల్ వద్దకు పంపించారు. పాఠశాల సీఈఓ కవితతో డబ్బు విషయమై మాట్లాడుతుండగా వారి పట్ల ఆమె నిర్ల్యక్ష్యంగా వ్యవరించి పరుష పదజాలంతో దూషించింది. అంతటితో ఆగక తనను బెదిరించారంటూ మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవిపై ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లిన రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి బాధిత మహిళ మెహరాజ్, పార్టీ శ్రేణులతో కలసి శనివారం రూరల్ పోలీస్స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ పూజా స్కూల్లో పని చేసే కవిత, భవ్య అనే ఇద్దరు మహిళలు మెహరాజ్ పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నారు. డబ్బు తిరిగి ఇవ్వబోము, తమకు సంబంధం లేదు ఇక్కడి నుంచి గేటు దాటు అంటూ పరుష పదజాలంతో అవమానించారన్నారు. ఈ విషయం తనకు తెలియడంతో వైఎస్సార్సీపీకి చెందిన మహిళా నేతలను స్కూల్ వద్దకు పంపగా వాళ్లను కూడా వారు చులకనగా, హేళనగా, బెదిరింపు ధోరణితో నిర్లక్ష్యంగా మాట్లాడారని చెప్పారు. అంతేగాక మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవిపై పూజా స్కూల్ కవిత ఫిర్యాదు చేయగా ఆగమేఘాల మీద, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రెండేళ్లుగా పాఠశాల యాజమాన్యం మెహరాజ్ను ఇబ్బంది పెట్టారని, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని, అడిగేందుకు వెళ్తే కవిత, భవ్యతోపాటు గణేష్ అనే మరో వ్యక్తి పరుష పదజాలంతో దుర్భాషలాడారని వీరిపై చర్యలు తీసుకోవాలని మెహరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు నమోదు చేయాలని, మానవతా హృదయంతో స్కూల్ యాజమాన్యాన్ని పిలిపించి పిల్లలకు రావాల్సిన డబ్బు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే రేపు మళ్లీ స్టేషన్కు వస్తామని రూరల్ ఎస్ఐ రాజుతో అన్నారు. బాధితురాలికి స్కూల్ యాజమాన్యం డబ్బు చెల్లించే వరకు శాంతియుతంగా పోరాడతామని, అందుకు పోలీసులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లె లక్ష్మీదేవి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. న్యాయం చేయండి సారూ.. పిల్లల స్కూల్ ఫీజు కట్టకపోవడంతో వారి చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని, తమకు రావాల్సిన రూ.5 లక్షలను పూజా స్కూల్ యాజమాన్యం నుంచి ఇప్పించాలని బాధిత మహిళ మెహరాజ్బాను తెలిపారు. డబ్బు ఇవ్వాలని రెండేళ్లుగా పూజా స్కూల్ చుట్టూ తిరుగుతున్నా వాళ్లకు కనికరం లేకుండా పోయిందన్నారు. దయచేసి డబ్బులు ఇప్పిస్తే పిల్లల చదువులు పూర్తి చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యం వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసు పోలీస్స్టేషన్కు వచ్చిన రాచమల్లు సీఈఓ, సిబ్బందిపై బాధితురాలు ఫిర్యాదు -
ఓ వైపు బిడ్డ చనిపోయిందన్న ఆవేదన.. మరోవైపు కిరాతకుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆందోళన వెరసి ఖాజీపేట ఉద్రిక్తంగా మారింది. తమకు కడుపు కోత మిగిల్చిన ఉన్మాదిని ఉరి తీసే వరకు తమ శోకం తీరదంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఖాజీపేట : ప్రేమోన్మాదిని ఎన్కౌంటర్ చేయాలని.. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రామకీర్తన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం నిరసనకు దిగారు. అంత్యక్రియలు చేసేది లేదంటూ ధర్నా చేపట్టారు. వివరాలు.. ఖాజీపేట మేజర్ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన (16) అనే బాలికను ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ శుక్రవారం ఉదయం ఇంటిలోనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఈ కేసు విషయంలో బాలిక తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం శవ పరీక్షలు పూర్తి చేసి రామకీర్తన మృతదేహాన్ని స్వగ్రామం అగ్రహారానికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకొచ్చారు. అయితే అంత్యక్రియలు చేస్తే తమ కుమార్తెకు న్యాయం జరగదని రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు భావించారు. అందరూ ఖాజీపేట బస్టాండ్ కూడలికి చేరుకుని ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకూ ధర్నా చేశారు. మైదుకూరు డీఎస్సీ వెంకటేశ్వర్లు, కడప దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి బాలిక బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిందితుడికి చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం.. ఇందులో ఎవరి భాగస్వామ్యం ఉన్నా వదిలేది లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే హత్య చేసిన వ్యక్తితోపాటు ఇందులో ఇతరులు కూడా ఉన్నారని, వారి పేర్లు కూడా కేసులో నమోదు చేయాలని బాలిక బంధువులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు తిరిగి ఫిర్యాదు తీసుకుని పేర్లు నమోదు చేసేందుకు హామీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు ధర్నా విరమించారు. భారీ పోలీసు బందోబస్తు శుక్రవారం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అగ్రహారంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. రామకీర్తన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు పరామర్శ అతి కిరాతకంగా హత్యకు గురైన రామకీర్తనకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మృతి విషయం తెలుసుకుని బాలికకు నివాళి అర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంతకుడికి ఊరిశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ప్రేమోన్మాదిని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడే బాలికకు న్యాయం జరుగుతుంది మృతురాలి బంధువుల ధర్నా నేడు అంత్యక్రియలు కడప కార్పొరేషన్: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థ మొద్దు నిద్ర పోతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖాజీపేటలో బాలికను పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు. ఆడపిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వస్తారా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కూటమి సర్కార్ వచ్చాక ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ మార్చేసిందని, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. దీనివల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. మొన్న ఆలంఖాన్పల్లెలో దస్తగిరిని హత్య చేశారని, దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఈ హత్యల వెనుక ఉన్న వారిని వెలికి తీసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మూల విరాట్ నర్మదా నది నుంచి..
నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మొలచిన విగ్రహం కాదు. మధ్యప్రదేశ్లోని నర్మద నదిలో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని గజ ఈతగాళ్లతో వెలికి తీసి తెప్పించారు. ఈ విగ్రహానికి రూ.4 లక్షలకు పైగా వెచ్చించారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. సాలేగ్రామ్ విగ్రహం కావడంతోపాటు స్వయంభుగా వెలిసినట్లు తెలుస్తోంది. మధ్యలో ఎరుపు రంగు ఉండి మిగతాదంతా తెల్ల రంగుతో ఉండటం విశేషం. మాములుగా శివలింగం అంటేనే నలుపు రంగులో ఉండటం సహజం. నర్మద నది శివలింగాలకు పుట్టినిల్లని ప్రతీతి. మిగతా వినాయకుడు, పార్వతీదేవి విగ్రహాలను టీటీడీ నుంచి తెప్పించారు. ప్రధాన ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన నంది విగ్రహం ఆళ్లగడ్డలో తయారు చేయించారు.


