breaking news
YSR
-
అర్జీదారుల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం
● 26న బద్వేలు నియోజకవర్గంలో పర్యటిస్తా ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అఽధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒకనెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 26వ తేది బద్వేలు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఆ నియోజకవర్గంలో గతంలో జరిగిన మూడు పర్యటనల్లో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలను సవివరంగా తెలియజేసేందుకు అధికారులు సన్నద్దంగా ఉండాలన్నారు. జులైలో రాజంపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పీజీఆర్ఎస్లో రీ ఓపెన్ అయిన అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అయినా కొన్ని శాఖల్లో భౌతిక ఫైల్స్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ నిధి మీనా, డీఆర్వో మల్లికార్జునుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.30గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. ● 24వ తేదీ బుధవారం ఉదయం 9.00గంటలకు పులి వెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేము ల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతారు. 10 గంటలకు ఆలయానికి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందుల భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్కు బయలుదేరుతారు. మధ్యా హ్నం 1గంట నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ● 25వ తేదీ ఉదయం 8.10గంటలకు బెంగళూరుకు తిరుగుపయనమవుతారు. మూడు రోజులపాటు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్ 24న భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టకు హాజరు -
దౌర్జన్యపరులదే రాజ్యం.. దోపిడీదారులదే భోజ్యం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో కొలువు తీరిన తర్వాత తెలుగుతమ్ముళ్లు జిల్లాలోని విలువైన ప్రకృతి సంపదపై పడ్డారు. రేయింబవళ్లు ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ చేస్తూ ఖనిజాలను కొల్లగొడుతున్నారు. తమ దోపిడీకి ఎవరైనా అడ్డుగా నిలిస్తే అంతమొందించే స్థాయికి తెగబడుతున్నారు. ప్రధానంగా ఇసుక, గ్రావెల్, అమూల్యమైన బరైటీస్ నిక్షేపాలను ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. చివరికి అధికారికంగా లీజు అనుమతులు ఉన్న వారైనా సరే, తాము చెప్పినట్లే వినాలని, తమ కనుసన్నుల్లోనే మైనింగ్ నిర్వహించాలంటూ కూటమి అక్రమార్కులు హుకుం జారీ చేశారు. అనుమతులు లేని చోట్ల కూడా యథేచ్ఛగా భారీ క్రేన్లు, హిటాచీలు బిగించి భూమాత గర్భాన్ని చీల్చుతున్నారు. ఈ విచ్చలవిడి ఇసుక గోతుల తవ్వకాల నేపథ్యంలోనే ఆదివారం అభం శుభం తెలియని ఇరువురు యువకులు పాపాఘ్ని నదిలో మృత్యువును చవిచూడటానికి కారణమైంది. పులివెందులలో మైనింగ్ దారుణాలు.. ఒకే రాత్రి రూ. 10 కోట్ల లూటీ! జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ అక్రమ మైనింగ్కు ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని వేముల, వేంపల్లె, లింగాల మండలాల్లో టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కొండల్లో అడ్డగోలుగా బ్లాస్టింగ్లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వేముల మండలం అయ్యప్పపల్లెకు చెందిన ఒక అమాయక వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా ఇటీవల వెలుగు చూసింది. వేముల మండలం కేంద్రంగా రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు ఏకంగా ఒకే రాత్రి రూ.10 కోట్ల విలువైన అమూల్యమైన బరైటీస్ ఖనిజాన్ని నిస్సిగ్గుగా దోపిడీ చేశారు. నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అధికారిక వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసి, టిఫెన్ బరైటీస్ కంపెనీ ప్రాంగణంలో భద్రపరిచిన ప్రభుత్వ ఖనిజాన్ని రాత్రికి రాత్రే లూటీ చేశారు. దాదాపు 3,500 టన్నుల బరైటీస్ ఖనిజాన్ని భారీ టిప్పర్లతో తరలించుకుపోయారు. ఈ మెగా దోపిడీపై బాధిత టిఫెన్ కంపెనీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఏడాది గడుస్తున్నా అక్రమార్కులపై పైసా చర్యలు తీసుకోలేదు. చివరికి కంపెనీ తమ స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించుకుంటున్నా కూటమి నేతలు సహించలేక బెదిరింపులకు దిగుతున్నారు. పాపాఘ్ని గుల్ల.. బెంగళూరుకు ఇసుక తరలింపు! మరోవైపు పాపాఘ్ని నది కేంద్రంగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా ద్వారా కూటమి నేతలు రోజుకు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. నది పరివాహక ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల మేర ఏకంగా 20 అడుగుల లోతుకు పైగా హిటాచీలతో తవ్వేసి, ఆ ఇసుకను నిత్యం పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు నగరానికి తరలిస్తూ వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. అడ్డగోలు తవ్వకాలతో జిల్లాలో భూగర్భ జలాలు అంతరించిపోతున్నా, స్థానికులు అడ్డు చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. ఎవరైనా నోరెత్తితే తెలుగుతమ్ముళ్లు మారణాయుధాలతో దాడులకు దిగుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం మారెళ్లమడక, గండికొవ్వూరు, కుమారకాల్వ, మరియు నిన్న ఇద్దరు చిన్నారులను బలిగొన్న అద్దాలమర్రి ప్రాంతాలలో నిత్యం వందలాది టిప్పర్లతో ఇసుక లూటీ యథేచ్ఛగా సాగుతోంది. సీఎంకు ఫిర్యాదు చేసినా చలనం లేదు.. నిర్వీర్యంగా వ్యవస్థలు! రాష్ట్రంలో వ్యవస్థలు తనంతట తానుగా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి వ్యవహరిస్తేనే ప్రజల ధన, మాన, ప్రాణాలకు కొంతలో కొంతైనా రక్షణ ఉంటుంది. కానీ, జిల్లాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. చట్టాన్ని పక్కనబెట్టి ‘దౌర్జన్యపరులదే రాజ్యం.. దోపిడీదారులదే భోజ్యం’ అన్న చందంగా జిల్లాను మార్చేశారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే నేరుగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం, మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. కలెక్టర్, ఎన్జీటీ ఆదేశాలు గోవిందా.. చేష్టలుడిగిన ఖాకీలు! పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నదుల నుంచి ఇసుకను తరలించవద్దని అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో స్వయంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పందిస్తూ.. ఆగస్టు 15 వరకూ నదులలో నుంచి ఎలాంటి ఇసుక తరలింపులు జరపరాదని జిల్లా యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించారు. అయితే, కూటమి నేతలకు ఎస్కార్ట్గా నిలుస్తూ విచ్చలవిడి దోపిడీకి పరోక్షంగా కొమ్ముకాస్తున్న పోలీసుశాఖ ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా వ్యవహరిస్తోంది. పోలీసుశాఖకు కళ్లు, చెవులుగా నిలుస్తూ నిరంతరం క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించే ఇంటెలిజెన్స్ (నిఘా వర్గాల) నివేదికలను సైతం ఉన్నతాధికారులు పూర్తిగా బుట్టదాఖలు చేస్తున్నారు. ఈ అరాచక వ్యవస్థల నిర్వాకం వల్లే జిల్లా సంపద దోపిడీకి గురవుతూ, అమాయకుల ప్రాణాలు బలిపీఠం ఎక్కుతున్నాయని జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల ఇసుక, గ్రావెల్, బరైటీస్ దందా అడ్డుకుంటే అంతమొందిస్తామంటూ బరితెగింపు ఖాకీల నీడలో.. ‘మైనింగ్’ మాఫియా అడ్డగోలు తవ్వకాలే పాపాఘ్నిలో అన్నదమ్ముల మృత్యువుకు కారణం వేముల వేదికగా ఒకే రాత్రి రూ. 10 కోట్ల ఖనిజం లూటీ ఎన్సీఎల్టీ వేలం నిల్వలపై పగటిదొంగల పంజా ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా చలనం లేదు నిర్వీర్యమైన వ్యవస్థలు, బుట్టదాఖలైన నిఘా నివేదికలు -
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి
కళాశాల విద్య ఆర్జేడీ మధుసూదన్ శర్మ కడప ఎడ్యుకేషన్: విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెండంతోపాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్కు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) డాక్టర్. మధుసూధన్ శర్మ సూచించారు. సోమవారం కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు గత సంవత్సరం కంటే మెరుగయ్యేటట్లు చూడాలని సూచించారు. అలాగే కళాశాలలోని ఆర్థిక కార్యకలాపాలు క్రమశిక్షణతో కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కడప జిల్లా ఉమ్మడి నోడల్ రీసోర్సు సెంటర్ అధ్యక్షులు డా. ఎం రవి కుమార్, సభ్యులు డా. సలీంబాషా, పలు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జోరు
● ఇడుపులపాయలో ప్రారంభమైన కౌన్సెలింగ్ , అడ్మిషన్ల ప్రక్రియ ● మొదటి రోజు 500 మందికి 406 మంది విద్యార్థులు హాజరు ● పీయూసీ 1, 2 తరగతులు ఇడుపులపాయ క్యాంపస్లోనే నిర్వహణ: డైరెక్టర్ ఒంగోలు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులకు అడ్మిషన్ పత్రాలను అందిస్తున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ప్రక్రియ సోమవారం వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ క్యాంపస్లో అత్యంత పారదర్శకంగా, ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రాంగణంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఈ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ అధికారికంగా ప్రారంభించారు. మొదటి మూడు స్థానాల్లో (ర్యాంకుల్లో) సీటు కై వసం చేసుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయన తన చేతుల మీదుగా అడ్మిషన్ల ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఇడుపులపాయలోనే ఒంగోలు పీయూసీ తరగతులు ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చెందిన పీయూసీ 1, 2 తరగతులను ఇడుపులపాయ (ఆర్కేవ్యాలీ) ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందువల్లనే ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన విద్యార్థులకు ఇడుపులపాయ క్యాంపస్లోనే అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రవేశాల మొదటి రోజు కౌన్సిలింగ్కు మొత్తం 500 మంది విద్యార్థులను పిలవగా 406 మంది విద్యార్థులు హాజరై అడ్మిషన్లు పొందినట్లు ఆయన గణాంకాలను వివరించారు. సౌకర్యాలపై డైరెక్టర్ స్వయంగా ఆరా ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొరకు కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, విజయవాడ, గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఇడుపులపాయ క్యాంపస్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కొరకు విచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్యాంపస్లో కల్పించిన తాగునీరు, భోజన, వసతి సౌకర్యాలపై డైరెక్టర్ విజయ్ ప్రకాష్ స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లపై తల్లిదండ్రులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేవ్యాలీ, ఒంగోలు క్యాంపస్ల పరిపాలన అధికారులు డాక్టర్ రవికుమార్, చంద్రశేఖర్, క్యాంపస్ డీన్ అకాడమిక్స్లు రమేశ్ కై లాష్, రూపస్ కుమార్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్స్ డాక్టర్ వెంకటేష్, అసోసియేట్ డీన్లు రాఘవరెడ్డి, నవీన్, ఉదయశ్రీ, హుస్సేన్, తిలక్ పాల్గొన్నారు. అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ శరవణ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లింగమూర్తి, జ్ఞానవెంకట్, సంతోష్, అధ్యాపకులు బిన్నీ, ఓబయ్య, కోనప్ప, రాము, దీప్తి, భాస్కరయ్య, పీఆర్ఓ తిరుపతి రెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవత్వం చాటుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా ప్రవేశానికి సోమవారం అధికారులు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు వస్తున్న ఇద్దరు విద్యార్థులకు మార్గ మధ్యలో యాక్సిడెంట్ కావడంతో సత్యవేడుకు చెందిన తుపాకుల మణికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటినా ఆ విద్యార్థి తల్లిదండ్రులు చికిత్స చేయించి ఆటోలో ఆర్కే వ్యాలీ క్యాంపస్కు తీసుకొచ్చారు. నాయుడుపేటకు చెందిన తేజస్విని అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రిమ్స్కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొంది విద్యార్థిని తల్లిదండ్రులు అడ్మిషన్ నిమిత్తం ఆర్కే వ్యాలీ క్యాంపస్కు వచ్చారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ విజయ ప్రకాష్ తక్షణమే స్పందించి వారిద్దరికీ ఆటోలోనే అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేసి అలాట్మెంట్ ఆర్డర్ను అందజేశారు. ఆ విద్యార్థులకు ఒంగోలు క్యాంపస్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. డైరెక్టర్, అధికారులు స్పందించిన తీరు పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ఎస్సీవిభాగం కార్యదర్శిగా గోటూరు వెంకటేష్ (ప్రొద్దుటూరు), రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా పంగా గురివిరెడ్డి(బద్వేల్), జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా భూమిరెడ్డి ప్రతాప్రెడ్డి(జమ్మలమడుగు)లను నియమించారు. 24 నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ కడప ఎడ్యుకేషన్: ఏపీ పాలిసెట్–2026లో అర్హత సాధించిన విద్యార్థులు డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిందని పాలిసెట్ కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ 24 నుంచి జులై 4వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణ, ఫీజు చెల్లింపు, వెబ్ అప్లన్ల నమోదు ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ polycet.ap.gov.inలో అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను పరిశీలించి నిర్ణీత గడువులోపు తమ సర్టిఫికెట్ ధృవీకరణ, ఫీజు చెల్లింపు ,వెబ్ ఆప్లన్స నమోదును పూర్తి చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ దరఖాస్తులో ఏవైనా వివరాల మార్పులు లేదా సవరణలు అవసరమైన విద్యార్థులు కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. 27 వరకు రైతన్న మీ కోసం కడప అగ్రికల్చర్: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని జిల్లాలో 2026 జూన్ 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ తరపున విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం జేసీ నిధిమీనా, డీఆర్ఓ మల్లికార్జునుడు, జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావుతోపాటు కలిసి ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో నిర్వహించబడే ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ సీఈఓ సుబ్రమణ్యం, డీపీఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాపాఘ్నిలో కన్నీటి సంద్రం
● ఆదివారం ఇద్దరు చిన్నారుల బలి ● రాత్రంతా బిడ్డల శవాల పక్కనే కన్నవారి జాగారం ● ఎంపీ అవినాష్రెడ్డి జోక్యంతో దిగొచ్చిన కలెక్టర్ ● సాయం ప్రకటన చక్రాయపేట: కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు ఆదివారం ఇద్దరు పసిప్రాణాలను బలిగొన్న ఉదంతం.. రాత్రి వేళ పాపాఘ్ని నది సాక్షిగా మహా ప్రజాపోరాటంగా మారింది. చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలో ఇసుక మాఫియా తవ్వేసిన రాక్షస గుంతల్లో పడి అన్నదమ్ములు కారపురెడ్డి జయంత్ రెడ్డి, రాజ్ వర్ధన్ రెడ్డి మృతి చెందిన విషయం విదితమే. నిన్న రాత్రంతా కన్నబిడ్డల నిశ్చేతన దేహాలను గుండెలకు హత్తుకుని, ఆ కన్నవారు, బంధువులు, ఊరు ఊరంతా కలిసి నదిలోనే కన్నీటి జాగారం చేశారు. బాధ్యులను శిక్షించే వరకు శవాలను కదిలించనిచ్చేది లేదని భీష్మించారు. అధికారులు రాత్రంతా నదిలోనే మకాం వేసి, శవాలను పోస్టుమార్టంకు తరలించాలంటూ బాధిత కుటుంబంపై అడ్డగోలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ గ్రామస్థులు లొంగలేదు. ఎంపీఆగ్రహం..దిగొచ్చిన యంత్రాంగం! సోమవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తక్షణమే నదిలోకి చేరుకుని, బాధితులకు కొండంత అండగా నిలిచారు. ‘బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన న్యాయం జరిగే వరకు ఈ చిన్నారుల శవాలతో పాటు నదిలోనే నేనూ కూర్చుంటా’ అని ఎంపీ కరాఖండిగా తేల్చి చెప్పా రు. ఎంపీ నేరుగా రంగంలోకి దిగి అధికారులను నిలదీయడంతో, అప్పటివరకు కాలయాపన చేసిన అధికార యంత్రాంగం ఒక్కసారిగా దిగొచ్చింది. తప్పు ఒప్పుకున్న ఆర్డీవో: ఎంపీ అవినాష్ రెడ్డి పోరాటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పులివెందుల ఆర్డీవో చిన్నయ్య విలేకరుల ముందుకు వచ్చి, నదిలో నిబంధనలకు విరుద్ధంగా 15 నుంచి 20 అడుగుల లోతుకు పైగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగిన మాట వాస్తవమేనని బహిరంగంగా అంగీకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధితులకు తక్షణ న్యాయం మరియు చర్యలను ప్రకటించారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబానికి కలెక్టర్ ఫండ్ నుంచి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తారు. పెండ్లిమర్రి మండలంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 సెంట్ల ఇళ్ల స్థలాన్ని మంజూరు చేస్తారు. కాగా, నదిలో అక్రమ తవ్వ కాలకు వాడుతున్న రెండు భారీ హిటాచీ మిషన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక రవాణా కోసం నదిలో వేసిన అక్రమ మట్టి రోడ్లను జేసీబీలతో పూర్తిగా ధ్వంసం చేయించారు. ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమా ర్టానికి తరలించారు. కూటమి నేతల కాసుల కక్కుర్తికి పసిప్రాణాలు బలికావడంపై జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
బీటెక్ రవి దుష్ప్రచారం మానాలి
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీకి చెందిన వారు పాపాఘ్ని నదిలో నిర్వహించిన అక్రమ మైనింగ్ వల్ల ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఇందులో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి ఆ పార్టీ నాయకుడు బీటెక్ రవి శవ రాజకీయాలకు పాల్పడుతూ దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటని చక్రాయపేట మండలం, కుమారకాల్వకు చెందిన శ్రీధర్రెడ్డి అన్నారు. సోమవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దాలమర్రి పాపాఘ్ని నదిలోని గుంతల్లో ఇద్దరు యువకులు మృతిచెందడం బాధాకరమన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అక్రమంగా ఇసుకను తరలించడంతో ప్రమాదరకంగా గుంతలు ఏర్పడ్డాయన్నారు. అయితే బీటెక్ రవి పీఎల్ఆర్ ప్రాజెక్ట్ కోసం తీసిన గుంతల కారణంగానే యువకులు చనిపోయారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్ను యర్రబొమ్మనపల్లెలో నిర్వహించామన్నారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు తెలిపారు. కాగా ఇద్దరు యువకులు అద్దాలమర్రి వద్ద గల పాపాఘ్ని నదిలోని గుంతల్లో మరణిస్తే, పీఎల్ఆర్ ప్రాజెక్ట్ పనుల కారణంగా ఏర్పడిన గుంతల్లో చనిపోయారని బీటెక్ రవి చెప్పుకోవడం అతని శవ రాజకీయాలకు నిదర్శన మన్నారు. ఆయన గూగుల్ మ్యాప్ ద్వారా యర్రబొమ్మనపల్లెను అద్దాలమర్రిగా చూపించడం అతని కుటిల బుద్దికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో యువకులు మరణించారో, అందుకు ఎవరు కారకులో నిజనిర్ధారణకు సిద్ధమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవరైనా సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. బీటెక్ రవి అసత్య ప్రచారాలు, శవ రాజకీయాలు మానాలని అన్నారు. కార్యక్రమంలో చక్రాయపేట మండలం అద్దాలమర్రి, రాజుపల్లికి చెందిన మల్లిఖార్జునరెడ్డి, రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి
● మతం మారినా దళితుల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం పోదు... ● దళిత క్రైస్తవులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది... ● కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి కడప కార్పొరేషన్ : దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కడప రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్ సగినాల కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కడప రోమన్ కాథలిక్ డియోసెస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్, పలువురు గురువులు కడప ఎంపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో క్రైస్తవుల్లో దళితులే కాదని, అనేక మంది వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారని, కానీ మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం దళితుల పట్ల తొలగిపోదని వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందని, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. కానీ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు దళితులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, తప్పక దళిత క్రైస్తవుల పట్ల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ హోదా వర్తించేలా చూడాలని కోరారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందిస్తూ ...దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. అదే వైఖరికి వైఎస్సార్సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని, దళిత క్రైస్తవుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. అంతేకాకుండా బాలకష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేస్తున్నామని, ఇప్పటికే వైస్సార్సీపీ ఎంపీలు జస్టిస్ బాలకష్ణన్కమిషన్న్కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా తప్పక అడ్డుకుంటామని, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమానికి మద్దతుగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు పంపుతున్న పోస్టు కార్డులను బిషప్, పాస్టర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, మాజీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ కుమార్, వైద్య విభాగం సభ్యుడు డా. పెంచలయ్య, పి. సంపత్, శ్యాంసన్, లారెన్స్, జోజప్ప, శ్యామ్, అధిక సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. -
ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై దృష్టి సారించాలి
కడప అర్బన్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై, ఫ్యాక్షన్తో సంబంధం ఉన్న వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫ్యాక్షన్ జోన్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, ఎస్సీ, ఎస్టీ సెల్, డీసీఆర్బీ, డీటీఆర్బీ, కోర్ట్ మానిటరింగ్ సెల్, కమాండ్ అండ్ కంట్రోల్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ట్రాఫిక్ సీఐ లను ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళలు , బాలికలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నవారి కదలికలపై నిఘా ఉంచాలని పదే పదే స్మగ్లింగ్ కు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్ ) గుర్తించి ఇతర శాఖల అధికారుల సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. సత్వరమే అర్జీల పరిష్కారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 144 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని, బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ ఎన్. సుధాకర్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
డిమాండ్ల సాధనకు ఆర్టీపీపీ ఉద్యోగుల నిరసన
ఎర్రగుంట్ల : విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆర్టీపీపీలోని ప్రధాన గేటు వద్ద విద్యుత్తు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించడంలో యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వేతన సవరణ సంప్రదింపుల కమిటీని నియమించాలని, కార్మికులను సంస్థఽలో విలీనం చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలి
కడప రూరల్ : కష్టాలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాం, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించి, ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని బ్రహ్మంగారిమఠం మండలం కమ్మవారిపల్లెకు చెందిన దంపతులు మంజుల, వెంకటసుబ్బయ్య కోరారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మంజుల మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం తాము ప్రేమించుకున్నామని, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో వెంకటసుబ్బయ్య ప్రమాదానికి గురై రెండు కాళ్లు కోల్పోయారని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకున్నానని చెప్పారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తమ వివాహం జరిగినప్పటి నుంచి తన భార్య మంజుల కుటుంబ సభ్యులు, తమ వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మధ్యవర్తులపై కూడా తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. కాగా కొంతకాలం ఇతర రాష్ట్రంలో నివసించాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తమకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడని, గ్రామంలో పెద్దలను చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించి ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని కోరారు.ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల వేడుకోలు -
షార్ట్ సర్క్యూట్తో కోళ్ల ఫారం దగ్ధం
చింతకొమ్మదిన్నె : సోమవారం బుగ్గలపల్లిలో ప్రతాపరెడ్డికి చెందిన నిర్మాణములో ఉన్న కోళ్ల ఫారంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించినది. ఈ ప్రమాదంలో కోళ్లఫారం షెడ్ లోని కూలింగ్ ప్యాడ్స్, ఫీడర్స్, విద్యుత్ పరికరాలు కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ప్రమాదంలో సుమారు 20 లక్షల నష్టం జరిగిందని బాధితుడు వాపోతున్నాడు.ప్రమాదం విషయం తెలుసుకున అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో వచ్చి మంటలను ఆర్పివేశారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణందువ్వూరు : దువ్వూరు మండలం కడప – కర్నూలు జాతీయ రహదారిపై పెద్దజొన్నవరం మెట్ట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొనికి వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పెద్ద జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన రేకులకుంట పెద్ద సుబ్బరాయుడు (50) కూలి పనికి వెళ్లి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి కడపకు వెళుతున్న టాటా నెక్సాన్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. అతనికి భార్య జయలక్ష్మి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. -
అడ్మాంట కంపెనీపై చర్యలు తీసుకోవాలని ధర్నా
కడప సెవెన్రోడ్స్ : రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసిన అడ్మాంట కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎంవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీఎన్ పల్లె మండలంలోని సంగాలపల్లె, గంగిరెడ్డిపల్లె, మిట్టపల్లె, పాయసంపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 400 ఎకరాల్లో అడ్మాంట కంపెనీ విత్తనాలు సాగు చేసి దిగుబడి రాక పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. కంపెనీ ప్రతినిధులు మునిరామశేఖర్రెడ్డి, రాంకుమార్రెడ్డి, జీవన్; రమణారెడ్డిలు విత్తనాలు మంచి దిగుబడి వస్తాయని నమ్మించి రైతులకు అంటగట్టారన్నారు. ఇప్పుడు చూస్తే దిగుబడి రాక రైతులు నష్టపోయారని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.మల్లికార్జునరెడ్డి, బాలచంద్రయ్య, టి.రామ్మోహన్రెడ్డి, కట్టా యానాదయ్య, చంద్రమోహన్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. -
జాతీయ స్థాయి చెస్ టోర్నీలో ప్రతిభ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బెంగళూరులోని మార్తహళ్లి, లేక్ వ్యూ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 21న నిర్వహించిన రెండో చెస్ టైటాన్స్ ఓపెన్ ఏజ్ కేటగిరీ టోర్నమెంట్ జాతీయ స్థాయి చెస్ పోటీల్లో కడపకు చెందిన క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు అనీష్ దర్బారి చెస్ అకాడమీ చీప్ కోచ్ అనీష్ దర్బారి తెలిపారు.అండర్–16 బాలికల విభాగంలో గోరంట్ల తేజోమయి 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానం, అండర్–12 బాలికల విభాగంలో గంట లక్ష్మీ మానస్రీ 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి 5వ స్థానం పొందినట్లు చెప్పారు. నిర్వాహకులు వీరికి ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా నుంచి పాల్గొన్న ఇతర క్రీడాకారులు కూడా మంచి ఆటతీరును ప్రదర్శించారన్నారు. -
ఏపీఎల్ మ్యాచ్లు విజయవంతం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–5 మ్యాచ్లు విజయవంతమైనట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎల్ మ్యాచ్లు కడపలో నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు కేశినేని చిన్ని, సానా సతీష్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కడప ప్రజలు వేలాదిగా తరలివచ్చి మ్యాచ్లను వీక్షించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇటువంటి మ్యాచ్లు దోహదపడతాయన్నారు. వైఎస్ రాజారెడ్డి స్టేడియాన్ని ధర్మశాల స్టేడియంతో పోల్చడం గర్వంగా ఉందన్నారు. ఈ మ్యాచ్లో పాల్గొన్న ఏడు టీముల క్రీడాకారులు స్టేడియాన్ని చూసి అద్భుతంగా ఉందని కొనియాడారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద మ్యాచ్లను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరో ఐదు వేల మంది మ్యాచ్లను వీక్షించేందుకు అదనంగా స్టేడియం సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్, అద్యక్షులు మునికుమార్రెడ్డి, అసోసియేషన్ మెంబర్ నగేష్ పాల్గొన్నారు.ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి -
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు సంగటి చిన్న ఏసోబు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్సీఎం బిషప్ సగినాల పాల్ప్రకాశ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్సీలు ఏ మతంలో చేరినా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారుగానీ క్రెస్తవ మతం స్వీకరిస్తే అమలు చేయకపోవడం ఏపాటి న్యాయమని ప్రశ్నించారు. మతం మారే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలన్నారు. దళిత క్రైస్తవుల పట్ల వివక్ష ఉండరాదన్నారు. తమ న్యాయమైన పోరాటానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహాజన రాజ్యం పార్టీ నాయకుడు సంగటి మనోహర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు, రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్దమన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం పార్టీమెంట్కు సైతం లేదని స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ తీసుకొచ్చినపుడు ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. దీంతో ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ మాట్లాడుతూ పార్లమెంటులో చట్టసవరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఏ సత్తార్, బండి జకరయ్య, ఫాదర్ ఆనంద్, ఫాదర్ సగిలి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. -
‘సర్’వేత్రా గందరగోళం
● కనిపించని మ్యాపింగ్ ఓటర్ల వివరాలు ● 2002 జాబితా ప్రదర్శించకపోవడంతో ఆందోళనజమ్మలమడుగు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) గందరగోళంగా సాగుతోంది. గత నెల నుంచి క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) 2002, 2025 ఓటర్ల జాబితాను సరిపొల్చుకుంటూ మ్యాపింగ్ చేపట్టారు.ఈనెల 14 నాటికి ఓటర్లను మ్యాపింగ్ చేసి క్షేత్ర స్థాయిలో 15 నుంచి ఇంటింటి సర్వేలో భాగంగా నోటీసులు ఇస్తున్నారు..ఎన్యుమరేషన్ పత్రాలను కొన్ని గ్రామాల్లో బీఎల్ఓలు కాకుండా గ్రామ కట్టుబడులతో పంపిణీ చేశారు. ఈ పత్రాలను నింపి ఆధార్కార్డు, ఫొటో అంటించి సచివాలయంలో ఇవ్వాలని చెప్పి పోతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు దీనిపై అవగాహన లేక తికమక పడుతున్నారు. కనిపించని మ్యాపింగ్ జాబితా జిల్లాలోని ఏడు నియోజకవర్గాలో మొత్తం 16,52,453 మంది ఓటర్లు ఉండగా అందులో ఈనెల 14 నాటికి దాదాపు 70శాతం పైగా 2002, 2025 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేశారు. అయితే నియోజవర్గాల్లోని బీఎల్ఓల వద్ద మ్యాపింగ్ అయిన జాబితా కనిపించడంలేదు. జాబితాను పోలింగ్బూత్ల వారీగా ప్రింట్ తీసి ప్రదర్శించాలి. అలా కాకుండా ఎన్నికల అధికారులు మాత్రం ఆన్లైన్లో కానీ, మీ బీఎల్ఓల వద్ద చూసుకోవాలని చెబుతున్నారు. దీంతో ఎవరి ఓటు మ్యాపింగ్ అయిందో తెలియని పరిస్థితి నెలకొంది.అధికారులు మాత్రం 70శాతం పైగా మ్యాపింగ్ చేశామని చెబుతున్నారే తప్ప ఏయే ఓటర్ల జాబితా మ్యాపింగ్ అయిందో చెప్పకపోవడంతో ఓటర్లలో గందరగోళం నెలకొంది. చాలామంది ఓటర్ల వివరాలు 2002 జాబితాలో లేవు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.ఓటర్లకు అప్పటిలో ఓటుహక్కు లేకపోవడం, 18 ఏళ్లు వచ్చినా ఓటు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం తదితర కారణాలతో అప్పట్లో ఓటుహక్కు పొందలేకపోయారు. ఈ క్రామంలో వీరి తల్లిదండ్రులు, తాత, అవ్వల వివరాలు పోల్చి చూసి సర్ సర్వే చేయాలి. అయితే కొన్ని చోట్ల 2002 జాబితాకు సంబంధించిన ఐడీ కార్డు కావాలని అడుగుతున్నారు. అప్పటి కార్డులను ఓటర్లు ఎందు ఉంచుకుంటున్నారని ప్రశ్నిస్తున్నా బీఎల్ఓలు పట్టించుకోకపోవడం గమనార్హం. -
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం పులివెందులకు వెళ్లనున్నారు. మూడు రోజులు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం, ఈనెల 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం(రేపు) సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.అలాగే, 24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడతారు. 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. -
అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు
చక్రాయపేట: ఇసుకాసురుల బరితెగింపు, ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలారని ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలోని పాపాఘ్ని నదిలో వీరు ఈతకు వెళ్లి అక్రమంగా తవ్విన ఇసుక క్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లెకు చెందిన కారపురెడ్డి జయంత్రెడ్డి (17) కారపురెడ్డి రాజ్వర్థన్రెడ్డి (15)లుగా పోలీసులు గుర్తించారు. బంధువుల కథనం ప్రకారం వివరాలివీ.. కారపురెడ్డిపల్లెకు చెందిన లోకేశ్వరరెడ్డి, ఓబుళమ్మల కుమారులైన జయంత్రెడ్డి, రాజ్వర్థన్రెడ్డిలు వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమర్రి గ్రామానికి వచ్చారు. ఆదివారం మ.3 గంటలసమయంలో అన్నదమ్ములిద్దరూ ఈతకోసం పాపాఘ్ని నదిలోకి దిగారు. అయితే, నదిలో ఇసుకాసురుల అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లోకి ఇద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. అయితే, నది వైపు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా గట్టున దుస్తులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందింతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీంతో పాటు గ్రామస్తులు నదిలోకి దిగి రెండు గంటలపాటు గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. విగతజీవులుగా మారిన పిల్లలను చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జయంత్రెడ్డి బీటెక్ ఫస్టియర్లో చేరాల్సి ఉండగా.. రాజ్వర్థన్రెడ్డి చెన్నూరులో ఇంటర్ ఫస్టియర్లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను తరలించం.. అక్రమంగా ఇసుక తవ్వి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన ఇసుక క్వారీ వారు వచ్చేవరకు మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తేలేదని గ్రామస్తులు నది వద్ద బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు శాంతించలేదు. బీటెక్ రవి సహకారంతోనే దందా.. పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలం దృష్ట్యా ఆగస్టు 15 వరకు నదుల నుంచి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ఆదేశాలిచ్చారు. అలాగే, ఇసుక అక్రమ రవాణాపై కొవ్వూరు శ్రీధర్రెడ్డి దాఖలు చేసిన 78/2026 రిట్ పిటిషన్ను స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ ఎస్. కుమార్సింగ్, గౌరవ మెంబర్ ప్రశాంత్గార్గ్ల బెంచ్.. నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. కానీ, ఈ ఉత్తర్వులన్నీ ఇక్కడ బుట్టదాఖలయ్యాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ముఖ్య సహకారంతో.. స్థానిక టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి నేతృత్వంలోనే ఈ ఇసుక అక్రమ సామ్రాజ్యం నడుస్తోందని స్పష్టమవుతోంది. ఇదే విషయమై కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్వయంగా ప్రెస్మీట్ పెట్టి ఆధారాలతో సహా ఆరోపించినా అధికారుల్లో కనీస చలనం లోపించింది. అధికారుల నిర్లక్ష్యంవల్లే అన్నదమ్ములు ఇద్దరూ మృత్యువాతపడ్డారని.. ఇసుకాసురులైన టీడీపీ నేతలపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మండలిలో అవార్డు కాలేదని అసత్యం పలికారు
రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం భూసేకరణ చేసింది. అందులో కొంత భూమికి అవార్డు పాస్ కూడా అయింది. అయితే శాసనమండలిలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాత్రం రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము ఎలాంటి భూసేకరణ చేయలేదని, అవార్డు కూడా పాస్ చేయలేదని పచ్చి అసత్యాలు పలికారు. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం రాతపూర్వకంగా అవార్డు పాసైనట్లు సమాచార హక్కు చట్టం కింద మాకు ఆధారాలు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వానికి రాజోళి నిర్మాణం చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. – పి. రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ -
ఎవరి కోసం బతకాలి?
‘అల్లారుముద్దుగా సాదుకున్న ఇద్దరు బిడ్డలు పోయాక మాకు దిక్కెవరు? మేము ఎవరి కోసం బతకాలి?‘ అంటూ సంఘటనా స్థలంలో కన్నతండ్రి కారపురెడ్డి లోకేశ్వరరెడ్డి రోదన చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. ఆయనను ఆపడం ఎవరి తరమూ కాలేదు. ‘నాన్నా.. మేము కాలేజీలకు వెళ్లేముందు అమ్మమ్మగారింటికి వెళ్లొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి.. మాకు ఇంతదూరంగా వెళ్లిపోయారా?‘ అంటూ భోరున విలపించాడు. ‘పెద్ద కొడుకు జయంత్ను బీటెక్లో చేర్పించా, చిన్న కొడుకు రాజ్వర్ధన్ను ఇంటర్లో చేర్పించానని బంధుమిత్రులందరికీ ఎంతో ఆనందంతో చెప్పానే.. ఆ ఆనందం కొద్దిరోజులు కూడా నిలబడలేదే! వ్యాపారం చేసుకుంటూ బిడ్డలిద్దరినీ ప్రయోజకులను చేయాలని, ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదని మంచి కాలేజీల్లో చేర్పించేందుకు నేను పడ్డ తపన అంతా పాపాఘ్ని మింగేసింది‘ అంటూ ఆయన కన్నీరుమున్నీరైన తీరు చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. -
సన్షైనర్స్ సునామీ
కడప వైఎస్సార్ సర్కిల్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రికార్డుల చరిత్రను తిరగరాశారు. ఓపెనర్లు మున్నంగి అభినవ్ (137 నాటౌట్), కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ (130) విధ్వంసకర శతకాలతో కాకినాడ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరి వీరవిహారంతో ఏపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టానికి ఏకంగా 290 పరుగుల కొండంత స్కోరు నమోదైంది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయవాడ సన్షైనర్స్ 110 పరుగుల భారీ తేడాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం కాకినాడ కింగ్స్ కెప్టెన్ మనీష్ గొలమారు టాస్ గెలిచి విజయవాడ సన్షైనర్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కానీ, ఆ నిర్ణయం కాకినాడకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విజయవాడ ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే కాకినాడ బౌలర్లకు నరకం చూపించారు. మున్నంగి అభినవ్ కేవలం 69 బంతుల్లో 9 ఫోర్లు, 10 గగనతల సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ కేవలం 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 260 కి పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో షేక్ జహీర్ అబ్బాస్ కేవలం 2 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మున్నంగి అభినవ్ ఎంపకయ్యాడు. బౌలింగ్లోనూ సన్షైనర్స్ మెరుపులు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టుకు మొదటి ఓవర్లోనే విజయవాడ బౌలర్లు షాక్ ఇచ్చారు. కెప్టెన్ మనీష్ గొలమారు (0) ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, అర్జున్ టెండూల్కర్ (17), అభిషేక్ రెడ్డి (9)లు త్వరగానే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్లో పిన్నింటి తపస్వి (27), ఒమ్మి భాస్వంత్ కృష్ణ (30), మిట్టా లేఖాజ్ రెడ్డి (31), హరిశంకర్ రెడ్డి (20)లు పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి కారణంగా వికెట్లు సమర్పించుకున్నారు. విజయవాడ బౌలర్లలో బి.ప్రణవ్ రెడ్డి 3 వికెట్లు (3/30) తీసి కాకినాడ వెన్ను విరవగా, తన్నీరు భరత్ 2 వికెట్లు, సాయి వెంకట సుమిత్, సిద్ధార్థ, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ పడగొట్టి విజయవాడకు భారీ విజయాన్ని అందించారు. -
24న భూమయ్యగారి పల్లెకు వైఎస్ జగన్ రాక
● పర్యటనపై స్ధానిక నేతలతో చర్చించిన ఎంపీ ● బండలాగుడు పోటీల ప్రాంతం పరీశీలనవేముల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24న వేముల మండలం భూమయ్య గారి పల్లెలో పర్యటించనున్నారు. గ్రామంలో రూ. 1.50 కోట్లతో నూతనంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించారు.ఈ ఆలయంలో 23 నుంచి విగ్రహప్రతిష్ట వేడుకలు జరుగనున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి 24న జరిగే కార్యమానికి హజరుకానున్నారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె వెంకటబయపురెడ్డి, మండల పరీశీలకులు లింగాల రామలింగారెడ్డితో కలిసి పర్యటన ఏర్పాట్లను పరీశీలించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు. వైఎస్ జగన్ రాక సందర్భంగా జనాలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వహకులకు సూచించారు. వైఎస్ జగన్ ఆలయానికి చేరుకున్న వెంటనే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆలయంలో జరిగే అభిషేకం, ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడ నుంచి బండలాగుడు పోటీలు నిర్వహించే ప్రాంతానికి చేరుకుని పోటీలను ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే లక్ష్మీనరసింహస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకులకు ఎంత మంది హజరవుతారనే విషయాలపై నేతలతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చర్చించారు.10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీటీసీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, చందా మలిరెడ్డి, విష్ణు వర్ధన్రెడ్డి, రాజారెడ్డి, రామచంద్రారెడ్డి, మధుసూదన్రెడ్డి, స్ధానికులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు మృతి
ముద్దనూరు : మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ మధుసూదన్రెడ్డి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాండ్లోపల్లె గ్రామానికి చెందిన రవీంద్రనాథరెడ్డి(36) తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ నెల 19వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయన కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అలాగే మండలంలోని గంగాదేవిపల్లె గ్రామంలో సూర్యనారాయణరెడ్డి కొంత కాలంగా పక్షపాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రతతో మనస్తాపం చెంది ఈ నెల 20న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సోమశిల కోసం మా భూములు నాశనం అవుతున్నాయి
గత ప్రభుత్వం రాజోలి ఆనకట్ట నిర్మాణం చేపడుతుందని ప్రకటిస్తే నమ్మి మా భూములు ఇచ్చాం. మా గ్రామంలో 1 నుంచి 60 సర్వే నంబర్ల వరకు భూములు తీసుకున్నారు. ఆ తర్వాత రైతులు ఎక్కువ పరిహారం కావాలని అడిగారు. అది పక్కన పెడితే, ప్రతి ఏటా కుందూ నదిలో సోమశిల ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల నీరు పారాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా 24 వేల క్యూసెక్కుల నీరు పంపిస్తున్నారు. దీనివల్ల మా భూములన్నీ నీట మునిగి, వ్యవసాయానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. మా ఇబ్బందులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. – కృష్ణారెడ్డి, రైతు, చిన్నముడియం (పెద్దముడియం మండలం) -
పరిష్కారం కనిపించడం లేదు
రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని యువగళం పాదయాత్రలో లోకేష్ గారు మొదట రూ.18 లక్షల పరిహారం, ఆ తర్వాత ఎకరాకు రూ.24 లక్షల రూపాయలు ఇప్పిస్తామని నమ్మబలికారు. గతంలోనే అవార్డు కూడా పాస్ చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సభలో అవార్డు కాలేదని అబద్ధాలు చెబుతోంది. రైతులు అత్యవసరాలకు తమ భూములను అమ్ముకుందామన్నా సబ్–రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అధికారులు మా చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. మా సమస్యకు పరిష్కారం ఎక్కడా కనిపించడం లేదు. – సుదర్శన్రెడ్డి, బాధిత రైతు, నెమళ్లదిన్నె -
తుంగభద్రపై రాయల్ గర్జన
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఏపీఎల్ రసవత్తర పోరులో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సర్వశ్రేష్ఠ ప్రదర్శనతో తుంగభద్ర వారియర్స్ పై 6 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తుంగభద్ర నిర్దేశించిన 133 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని రాయలసీమ బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా, మరో 35 బంతులు మిగిలి ఉండగానే కేవలం 14.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించారు. పవర్ప్లేలోనే కోలుకోలేని దెబ్బ తొలుత టాస్ గెలిచిన రాయలసీమ కెప్టెన్ ధ్రువ కుమార్ రెడ్డి తుంగభద్ర వారియర్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. తుంగభద్ర వారియర్స్ బ్యాటింగ్ రాయలసీమ బౌలర్ల ధాటికి తీవ్రంగా ఒడిదొడుకులకు లోనైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 132 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. రాయలసీమ బౌలర్లు పవర్ప్లేలోనే కోలుకోలేని దెబ్బతీశారు. కల్ది అజయ్ కుమార్ నిప్పులు చెరిగే బౌలింగ్తో ఓపెనర్లు కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ (1), శ్రీ సమన్యు దత్తా (2)లతో పాటు కాకి సూర్య జయంత్ (5)లను పట్టుమని 10 పరుగులు కూడా దాటకముందే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత పార్థసారథి కూడా చెలరేగడంతో తుంగభద్ర జట్టు 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడింది. ఆనంద్ జోసియా ఒంటరి పోరాటం వికెట్లు పడుతున్నా ఒక ఎండ్లో గుత్తా రోహిత్ (34 బంతుల్లో 28) ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేయగా, మిడిలార్డర్ బ్యాటర్ కంచెర్ల ఆనంద్ జోసియా విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. రాయలసీమ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆయన.. కేవలం 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 160.53 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్ వల్లే తుంగభద్ర జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. రాయల్స్ ఆఫ్ రాయలసీమ బౌలర్లలో పార్థసారథి జి.జి అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (3/20) పడగొట్టాడు. ఆయనకు తోడుగా కల్ది అజయ్ కుమార్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు (3/24) తీసి టాప్ ఆర్డర్ను క్లీన్ చేయగా, గణేష్ సతివాడ 2 వికెట్లతో తుంగభద్ర పరుగుల వేగాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. గరిమెళ్ల తేజ విధ్వంసం లక్ష్య చేధనలో రాయలసీమకు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ ధ్రువ కుమార్ రెడ్డి (0) మొదటి బంతికే అవుట్ కాగా, సిహెచ్ సాయి సందీప్ 6 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వై.తేజ రెడ్డి (9), జి.మన్విత్ రెడ్డి (5)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గరిమెళ్ల తేజ తుంగభద్ర బౌలర్లపై పగబట్టినట్లు విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు అతనికి తోడుగా ఎ.సాయి సూర్య తేజ (24 బంతుల్లో 30 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. తుంగభద్ర బౌలర్లలో మాధా దీపక్ 2 వికెట్లు తీశారు. అభినవ్ (137), అశ్విన్ హెబ్బార్ (130) సెంచరీల మోత ఓపెనర్ల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం ఏపీఎల్ చరిత్రలోనే హయ్యస్ట్ స్కోరు 20 ఓవర్లలో 290 పరుగులు చేసిన సన్షైనర్స్ 180 పరుగులకే చేతులెత్తేసిన కాకినాడ కింగ్స్ -
యోగాతో ఆరోగ్యకర జీవితం
కమలాపురం : యోగా సాధనతో ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఎంఓ రామమూర్తి తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీసీపీఎల్లో కార్మికులు, ఉద్యోగులు, ప్రతినిధులు పలు రకాల యోగాసనాలు వేశారు. అలాగే డీఏవీ పాఠశాల విద్యార్థులందరూ వివిధ రకాల భంగిమల్లో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా సీఎంఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఉల్లాసం కోసం, ఆరోగ్యం కోసం యోగా చేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు, పరుగుల మీద జీవనం సాగిస్తుండటంతో రోగాల బారిన పడుతున్నారని వివరించారు. అదే యోగా చేస్తే ఏకాగ్రత పెరగడంతోపాటు ఎలాంటి రోగాలు దరి చేరవని సూచించారు. అలాగే బలహీనతలను తొలగించి, చైతన్య వంతుల్ని చేస్తుందన్నారు. భారతి డీఏవీ విద్యార్థులతో ఆయన ముచ్చటిస్తూ యోగా చేయడం ద్వారా చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. డీఏవీ భారతి విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా తదితర వాటిలో రాణించడం హర్షణీయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారంలో కనీసం రెండు రోజులైనా నిర్వహించాలని ఆయన ప్రిన్సిపల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీసీసీపీఎల్ సీఎంఓ రామమూర్తి భారతి సిమెంట్ కంపెనీలో యోగా దినోత్సవం -
తల్లిదండ్రులకు తీరని శోకం!
తమ్ముళ్ల ధనదాహం..చెట్టంత కొడుకులు మృతి.. కన్నవారికి కడుపుకోత! చేతికి ఎదిగిన ఇరువురు కుమారులు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం వేదన వర్ణనాతీతంగా మారింది. చెట్టంత కొడుకులు విగతజీవులుగా పడి ఉండటంతో తండ్రి కారపురెడ్డి లోకేశ్వరరెడ్డి దంపతులు గుండె పగిలి అక్కడే కుప్పకూలిపోయారు. ‘ఏమి అన్యాయం చేశాం దేవుడా.. మాకెందుకు ఇంత శిక్ష విధించావు‘ అంటూ ఆ కన్నవారి రోదనలు మిన్నంటాయి. ఇరువురు యువకుల్ని విగత జీవులుగా చూసి తరలివచ్చిన బంధువుల కడుపు తరుక్కుపోయింది. అక్కడ చేరిన మహిళలు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న విషాదకర దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. లోకేశ్వరరెడ్డి దంపతుల కడుపుకోతను అక్రమార్కులు లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు తీర్చగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టి బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతల స్వార్థం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అన్నదమ్ముల జలసమాధి ఎన్జీటీ ఆదేశాలూ బుట్టదాఖలు.. బీటెక్ రవి సహకారంతోనే దందా! ఆగస్టు 15 వరకు నిషేధమున్నా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇసుక లూటీ చెట్టంత కొడుకులు విగతజీవులుగా మారడంతో కన్నవారి గుండెకోత రాత్రి 10 గంటలైనా నదిలోనే మృతదేహాలు అద్దాలమర్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత యంత్రాల సీజ్ కోసం భీష్మించిన బంధువులు, వైఎస్సార్సీపీ నేతలు సాక్షి ప్రతినిధి, కడప/చక్రాయపేట : కూటమి నేతల స్వార్థం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఇద్దరు అమాయక యువకులను బలితీసుకుంది. చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలో కొన్ని నెలలుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా దందా.. కారపురెడ్డి జయంత్రెడ్డి, రాజ్వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములను నిలువునా మింగేసింది. తెలుగుతమ్ముళ్ల ధనదాహానికి తోడు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈ ఘోర కలి చోటుచేసుకుంది. మృతదేహాల తరలింపునకు అడ్డుకట్ట.. రాత్రి 10 గంటలైనా నదిలోనే నిరసన! అద్దాలమర్రి వద్ద అక్రమ ఇసుక క్వారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు చనిపోయారని తెలియడంతో పోలీసు యంత్రాంగం, వేంపల్లె అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నది నుంచి వెలికి తీయించారు. అయితే, ఇద్దరు ప్రాణాలు కోల్పోయేందుకు కారకులైన క్వారీ నిర్వాహకులు వచ్చేంత వరకు, అక్కడున్న మైనింగ్ యంత్రాలను సీజ్ చేసేంత వరకు మృతదేహాలను తరలించే ప్రసక్తే లేదంటూ బంధువులు, గ్రామస్థులు నదిలోనే బైఠాయించారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి బాధితులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాత్రి 10 గంటలైనా మృతదేహాలతో నదిలోనే నిరసన కొనసాగించారు. ఈ ఘోరం గురించి తెలుసుకుని ఎంపీపీ మాధవీబాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు శ్రీధర్ రెడ్డి, జనార్ధనరెడ్డి, చెన్నారెడ్డి, శేషారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి మద్దతుగా నిలిచారు. ఆర్డీవో నిలదీత చక్రాయపేట : ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతుంటే పట్టించుకోని వారు ఇప్పుడు కంటి తుడుపు చర్యలకు వచ్చారా...అసలు మీకు ఏది ముఖ్యం ప్రజల ప్రాణాలా.. లేక ఇసుక మాఫియా ప్రయోజనాలా తేల్చి చెప్పాలని మృతుల బంధువులు పులివెందుల ఆర్డీవో చిన్నయ్యను నిలదీశారు. అద్దాలమర్రి సమీపంలోని పాపాఘ్ని నదిలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలుసుకొని ఆయన రాత్రి 9 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు.పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ రాత్రి10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి రాగానే అక్కడ ఉన్న వారంతా ఒక్కమారుగా లేచి ఈ పాపానికి బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీశారు. దీంతో ఆర్డీఓ ఫోన్ ద్వారా విషయాన్ని కలెక్టర్కు వివరించారు.అనంతరం మృతుల తండ్రిని పక్కకు పిలిచి మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినా కలెక్టరు వచ్చే వరకు మృతదేహాలను తీసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాత్రి 11గంటల వరకు కూడా వారు శాంతించక పోవడంతో మృతదేహాలు పాపాఘ్ని నదిలోనే ఉండి పోయాయి. -
అక్రమ మద్యం విక్రేతలపై కేసు నమోదు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 20, 21 తేదీలలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై దాడులు చేసినట్లు తెలిపారు. 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని, ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. 178 మద్యం బాటిళ్లు స్వాధీనం బి.కోడూరు : బి.కోడూరు పోలీసుస్టేషన్ పరిధి బద్వేలు – పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో.. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 178 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. మద్యం తరలిస్తున్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన అన్నం రమణయ్యపై కేసు నమోదు చేసి, ఆటోను స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు. వీరపునాయునిపల్లె : మండలంలోని అలిదెన ఓబాయిపల్లెలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబరు 169లో 30 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తమ పార్టీ నాయకుల సహకారంతో ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని గ్రామానికి చెందిన 10 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఆక్రమణకు యత్నించారని, వారిని అడ్డుకున్నామని బాధితులు పేర్కొన్నారు. ఆదివారం వెంకటేశ్వరయ్య అనే వ్యక్తి పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో తమ గడ్డివాములను తొలగించేందుకు యత్నించారని, వారిని అడ్డుకోవడంతో పోలీసులు దుర్భాషలాడారని వాపోయారు. పోరుమామిళ్ల : మండలంలోని సిద్దవరం పంచాయతీ చిన్నాయపల్లెకు చెందిన ఇండ్ల శ్రావణి(22) ముందుగా అనుకున్న వివాహం రద్దు కావడంతో.. మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. ఈ మేరకు శ్రావణి తండ్రి ఇండ్ల చిన్న ఓబులేసు (54) ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్ఐ కథనం మేరకు.. ఈ నెల 18న ఓబులేసు, భార్య సుబ్బమ్మ, తల్లి చెన్నమ్మలతో కలసి పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి, కూతురు శ్రావణి పురుగుల నివారణ మందు తాగి కనిపించిందన్నారు. ఆమెను విచారణ చేయగా వివాహం రద్దు కావడంతో ఇక తనకు వివాహం కాదేమోనన్న వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిందన్నారు. ఈ మేరకు చిన్న ఓబులేసు ఆదివారం స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశామన్నారు. -
టీడీపీ నేతల ఇసుక దందా.. ఇద్దరు అన్నదమ్ములు మృతి
వైఎస్సార్ జిల్లా : చక్రాయపేట మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ టీడీపీ నేతల ఇసుక దందా ఇద్దరు అమాయక విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. పాపాగ్ని నదిలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లుగా గుర్తించారు.ఆదివారం నాడు బంధువుల ఇంటికి వచ్చిన వీరిద్దరూ, సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కళ్లెదుటే ఇద్దరు కొడుకులు శవాలుగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వారి ఆక్రందనలు గ్రామంలో పెను విషాదాన్ని నింపాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ భారీ గుంతల వల్లే ఈరోజు ఇద్దరు విద్యార్థులు లోపలికి దిగి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు.ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడుతున్నారు. అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నా తవ్వకాలు ఎలా సాగుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భీమవరాన్ని బుల్డోజ్ చేసిన తుంగభద్ర వారియర్స్
● జ్ఞానేశ్వర్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్ ● సాయిశ్రవణ్ హాఫ్ సెంచరీ వృథా కడప వైఎస్సార్ సర్కిల్: కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన ఏపీఎల్ రసవత్తర పోరులో తుంగభద్ర వారియర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ మొదట బౌలింగ్ ఎంచుకుని భీమవరం బుల్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. సాయి శ్రవణ్ హాఫ్ సెంచరీ భీమవరం బుల్స్ బ్యాటింగ్ ప్రదర్శన మోస్తరుగా సాగింది. తుంగభద్ర వారియర్స్ కట్టడి బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో భీమవరం జట్టు 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్ సెంచరీ హీరో రేవంత్ రెడ్డి (17), కెప్టెన్ హేమంత్ రెడ్డి (13)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ క్లిష్ట సమయంలో వన్డౌన్ బ్యాటర్ టి.వి. సాయి శ్రవణ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్తో 50 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మోపాడ రవికిరణ్ (5), బెందలం సాత్విక్ (15)లు విఫలమైనా.. లోయర్ ఆర్డర్లో వచ్చిన బి. మునీష్ వర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 35 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో భీమవరం గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తుంగభద్ర వారియర్స్ బౌలర్లలో ఎన్.సాయి చరణ్ పదునైన బౌలింగ్తో భీమవరం బ్యాటర్లను వణికించి 3 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న సౌరభ్ కుమార్ సైతం 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసి పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. జ్ఞానేశ్వర్, సూర్య జయంత్ల వీరవిహారం! లక్ష్య చేధనలో తుంగభద్ర వారియర్స్ ఓపెనర్ సమన్యు దత్తా (1) త్వరగానే అవుట్ అయినా.. వన్ డౌన్లో వచ్చిన గుట్టా రోహిత్ (9) సిక్సర్తో పర్వాలేదనిపించాడు. అయితే, మరో ఓపెనర్ అయిన కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 56 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 75 పరుగులు సాధించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మిడిలార్డర్లో కాకి సూర్య జయంత్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి గట్టి సహకారాన్ని అందించాడు. ఆఖర్లో ఆనంద్ జోసియా (13 నాటౌట్) విక్టరీ లైన్ దాటించాడు. భీమవరం బౌలర్లలో చెన్నుపాటి రవి తేజ 3 వికెట్లు తీసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. భీమవరం బుల్స్ ఇన్నింగ్స్: కె. రేవంత్ రెడ్డి(సి) శ్రీ సమన్యు దత్తా (బి) సౌరభ్ కుమార్(17 పరుగులు 15 బంతుల్లో), ఎమ్.హేమంత్ రెడ్డి ( ఛి)(సి) కాకి సూర్య జయంత్ (బి) గవ్వల మల్లికార్జున – 13 (10), టి.వి. సాయి శ్రవణ్(సి) కాకి సూర్య జయంత్ (బి) మాధా దీపక్– 50(32), మోపాడ రవికిరణ్(బి) సౌరభ్ కుమార్– 5(9), బెందలం సాత్విక్(సి) గవ్వల మల్లికార్జున (బి) ఎన్.సాయి చరణ్– 15 (18), ఎమ్. ధీరజ్ కుమార్ (ఎల్బీడబ్యు) (బి) ఎన్.సాయి చరణ్–1 (2), బి.మునీష్ వర్మ నాటౌట్–35 (21), కేవీ కశ్యప్ ప్రకాష్(సి) గవ్వల మల్లికార్జున (బి) చీపురపల్లి స్టీఫెన్– 6 (2), చల్లారపు శివ(సి) కంచెర్ల ఆనంద్ జోసియా (బి) ఎన్.సాయి చరణ్–1 (2), సత్యనారాయణ రాజు రనౌట్ (చీపురపల్లి స్టీఫెన్)–1 (1), బైలపూడి యశ్వంత్ నాటౌట్–5 (8), ఎక్స్ట్రాలు: 04 మొత్తం స్కోరు: 153/9 (20 ఓవర్లు) తుంగభద్ర వారియర్స్ ఇన్నింగ్స్ (ఛేజింగ్): సి.ఆర్.జ్ఞానేశ్వర్ (c)(¼) ^ðl¯]l$²´ësìæ Æý‡Ñ ™ólf&75 (56), } çÜÐ]l$¯]l$Å §ýl™èl¢า) & (¼) ^ðl¯]l$²-´ësìæ Æý‡Ñ ™ólf&1 (2), VýS$sêt Æøíßæ-™Œæ(íÜ) çÜ™èlÅ-¯éÆ>Ķæ$׿ Æ>k (¼) O»ñæÌSç³Nyìl Ķæ$ÔèæÓ…™Œæ&9 (8), M>MìS çÜ*Æý‡Å fĶæ$…-™Œæ(íÜ) »ñæ…§ýlÌS… Ýë†ÓMŠS (¼) ^ðl¯]l$²-´ësìæ Æý‡Ñ ™ólf&46 (33), MýS…^ðlÆý‡Ï B¯]l…§Šæ gZíÜĶæ* ¯ésosŒæ&13 (8), ^èlÆý‡-׊æh™Œæ h.Ñ.-¯é-sosŒæ&1 (1), ఎక్స్టాలు: 09 మొత్తం స్కోరు: 154/4 (18.0 ఓవర్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సి.ఆర్. జ్ఞానేశ్వర్ (తుంగభద్ర వారియర్స్) – 75 పరుగులు. -
నీట్కు సర్వం సిద్ధం
● ఎన్టీఏ మార్గదర్శకాలు పాటించాలి ● జిల్లాలో నీట్ (యూజీ)–2026 పరీక్షకు 10 కేంద్రాలు ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : నీట్ (యూజీ)–2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎన్టీఏ నిబంధనలను కచ్చి తంగా పాటిస్తూ పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. ఆదివారం జరగనున్న ‘నీట్‘ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్తో జరిగిన వీసీలో కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్ష సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యార్థులు ఎన్టీఏ జారీ చేసిన నిబంధనలు, సూచనలు పాటించాలని కోరారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఆలస్యం చేయకుండా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాన్ని విడిచి వెళ్లేందుకు అనుమతి ఉండదని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న సూచనలను చదివి వాటిని అనుసరించాలని సూచించారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో కడప పట్టణ పరిధిలో 8 కేంద్రాల్లో 2,386 మంది, ప్రొద్దుటూరు పరిధిలోని 2 కేంద్రాల్లో.. 762 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లోని పలు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను శనివారం సాయంత్రం కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, అనిబిసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలు, కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పురుషుల కళాశాలలను కలెక్టర్ పరిశీలించారు. -
ఎరువు తయారీపై శిక్షణ
కడప అగ్రికల్చర్: ఎరువుల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ సూచించారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వానపాముల ఎరువు తయారీపై రైతులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం నిర్వహించిన ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సేంద్రియ ఎరువులలో ముఖ్యమైన ఎరువు వర్మీ కంపోస్ట్ అని తెలిపారు. సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ సాయి మహేశ్వరి, డాక్టర్ ఎస్ మానస , శాస్త్రవేత్తలు డా. టి. మహేష్ బాబు, డా. ఎస్ ప్రశాంతి రైతులు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్: జులై 1వ తేదీ నుంచి వ్యవసా య ఉత్పత్తుల రవాణాకు ముందు తప్పని సరిగా లైసెన్సుదారులైన వ్యాపారస్తులు ఈ ట్రాన్సుపోర్టు పర్మిట్ పొందాలని కడప మార్కెట్యార్డు సెక్రటరీ శ్రీకాంత్రెడ్డి సూచించారు. శనివారం కడప మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని లైసెన్సుదారులైన వ్యాపారస్తులు, చెక్పోస్టు సిబ్బందితోపాటు అకౌంటెంట్లకు ఈ ట్రాన్స్పోర్టు పర్మిట్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహాయ కార్యదర్శి సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించాలను కోవడం తగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ అన్నారు. విద్యా శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1) సవరణకు కృషి చేయాలని కోరారు. కడపకు విచ్చేసిన సందర్భంగా ఆయన శనవారం కడప ఓంశాంతి నగర్లో గల హోం స్టే లో ఆ సంఘ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లా డారు. చట్ట సవరణ జరిగే వరకూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ పరీక్షను, ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయు ల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకపోతే పోరాటానికి సన్నద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్ పాల్గొన్నారు. -
వేల్పుల రాముకు.. ప్రాణ హాని !
కడప, సాక్షి ప్రతినిధి: జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియా అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. తమ అక్రమార్జనకు, కోట్ల రూపాయల పగటిదోపిడీకి అడ్డుగా నిలుస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో సామాజిక, రాజకీయ నేత, ఎంబసీ గ్రూప్ కేర్టేకర్ వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము)ని ఎలాగైనా సరే అంతమొందించేందుకు ప్రత్యర్థులు దారుణమైన వ్యూహాలు పన్నుతున్నారు. 3 వేల టన్నుల ఖనిజం లూటీ.. ‘బీటెక్ రవి’అనుచరులపై ఫిర్యాదు! వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన ఎల్.రామలింగారెడ్డి కుటుంబానికి 25 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన 2019 నుంచి ఎంబసీ గ్రూప్ సంస్థకు అధికారిక కేర్టేకర్గా వ్యవహరిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఫెన్ బరైటీస్ మైనింగ్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా అక్రమ మైనింగ్కు తెరలేపారు. ఈ క్రమంలోనే 2025 జనవరి 15న (సంక్రాంతి పండుగ రోజున) కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన దాదాపు 3 వేల టన్నుల బరైటీస్ ఖనిజాన్ని దొంగ ముఠా రాత్రికి రాత్రే అపహరించింది. ఈ మహా దోపిడీ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పరోక్ష సహకారంతో పాటు ఆయన అనుచరులైన పేర్ల పార్థసారధిరెడ్డి, పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథరెడ్డి, మారెడ్డి జోగిరెడ్డిల ప్రత్యక్ష ప్రమేయం ఉందని రాము రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లాకు చెందిన ఇంతటి పెద్ద తలకాయల పేర్లను బయటపెట్టినప్పటి నుంచి వేల్పుల రాము ప్రాణాలకు ముప్పు విపరీతంగా పెరిగింది. భద్రత కల్పించకుండా అడ్డుపడ్డ ప్రభుత్వం.. నల్లగొండుగారిపల్లెలో హత్యాయత్నం! టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, తనకు గన్మెన్ కేటాయించాలని గతంలో రాము హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు (WP 9349/2025) తక్షణమే వన్ ప్లస్ వన్ గన్మెన్ సౌకర్యం కల్పించాలని 2025 ఏప్రిల్ 9న ఆదేశించింది. ఆ మేరకు ఏప్రిల్ 17న జిల్లా ఎస్పీని కలిసి భద్రత కోరగా.. ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళ్లి ఆ భద్రతను అడ్డగించారు. ప్రభుత్వ పెద్దల అండతో రెచ్చిపోయిన మాఫియా 2025 ఆగస్టు 6వ తేదీన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా నల్లగొండుగారిపల్లెలో రాముపై అత్యంత దారుణంగా హత్యాయత్నానికి ఒడిగట్టింది. కత్తులు, రాడ్లతో టీడీపీ నేతలు స్వైర విహారం చేయగా, ఆ గ్రామానికి చెందిన ధైర్యవంతులైన మహిళల చొరవ కారణంగా వేల్పుల రాము తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. సుప్రీం కోర్టు సీరియస్ శుక్రవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక తీర్పు! రాష్ట్రంలో తనకు రక్షణ దక్కకపోవడంతో వేల్పుల రామలింగారెడ్డి తన ప్రాణాలను కాపాడుకునేందుకు సుప్రీం కోర్టును స్పెషల్ లీవ్ పిటిషన్ (LP 31993/2026) ద్వారా ఆశ్రయించారు. దీనిపై విచా రించిన సుప్రీం కోర్టు, ఈనెల 22కు కేసును వాయిదా వేస్తూనే.. ఆలోపు హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునేలా, ఆ నిర్ణయంపై హైకోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వేల్పుల రాము న్యాయవాదులు హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఆశ్రయించారు.ఈ మేరకు శుక్రవారం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. బాధితుడి ప్రాణాపాయ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సంచలన తీర్పు వెలువరించారు. తక్షణమే కడప జిల్లా ఎస్పీని స్వయంగా కలిసి భద్రత కోసం మరోమారు అధికారికంగా ఫిర్యాదు చేయాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి హత్యాయత్నం నుంచి తృటిలో ప్రాణా లు దక్కించుకున్న వేల్పుల రామలింగారెడ్డికి, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలోనైనా ఈసారైనా పోలీసు అధికారులు పూర్తిస్థాయి భద్రత కల్పించి రక్ష ణ ఇస్తారో లేదో వేచిచూడాల్సిందేనని జిల్లా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సంచలన తీర్పు తక్షణమే ఎస్పీని కలవాలని ఆదేశం కూటమి సర్కార్లో ‘పచ్చ’ మాఫియా 3 వేల టన్నుల బరైటీస్ ఖనిజం అపహ రణపై ఫిర్యాదు చేయడమే శాపమైంది -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు!
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. పోలీసుల పనితీరు ఏవిధంగా ఉందనేది ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చాంశనీయంగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సీఐ నాగరాజు వల్ల క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడం, సాయికృష్ణ లాకప్ దహనం, ఆదోనిలో జరిగిన మహిళ లాకప్ డెత్ ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు బట్టి శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజలంద రూ భావిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ఆమెకు మాటలు ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు. సాయికృష్ణ మృతదేహమే లేకుండా ఆ తల్లికి గర్భశోకం మిగిల్చారన్నారు.తన కుమారుడు ఏమయ్యాడని సాయి కృష్ణ తల్లి గర్భం ప్రశ్నిస్తోందని.. ఆమెకు ఏం సమాధానిమిస్తారని రాచమల్లు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ నాగరాజుతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటకృష్ణ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో సాయి కృష్ణ హత్యకు సంబంధించి వెంకటకృష్ణ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి కులం కార్డును వాడటం తప్పని మాట్లాడుతున్నారన్నారు. పైగా మృతులకు నేర చరిత ఉందని చెబుతున్నారని తెలిపారు. అలా అయితే 60 కేసులు ఉన్న ఎమ్మెల్యే చింతమనేనితోపాటు సృజన చౌదరి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను కూడా ఇలానే హత్య చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి పడకేసినా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకున్నా.. క్రైం రేటులో మాత్రం రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
●రోళ్లమడుగులో స్టార్ హీరో ధనుష్ హంగామా
రాజంపేట: ప్రకృతి ప్రసాదించిన అద్భుత దృశ్యాలు, దట్టమైన లోయలతో అలరారుతున్న శేషాచలం అటవీ ప్రాంతం ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమకు (కోలీవుడ్) ప్రధాన షూటింగ్ హబ్గా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథల కోసం సహజసిద్ధమైన లొకేషన్లు ఇక్కడ పుష్కలంగా ఉండటంతో, కోలీవుడ్ అగ్ర దర్శకులు మరియు స్టార్ హీరోలు తమ సినిమాల చిత్రీకరణ కోసం శేషాచలానికి క్యూ కడుతున్నారు. రెండు జిల్లాల్లో విస్తరించిన ఎర్రచందనం సంపద అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తర్వాత ఎర్రచందనం బ్యాక్డ్రాప్ కథలపై తమిళ సినీ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండే దట్టమైన అటవీ ప్రాంతం, సెలయేర్లు, లోయలు తమిళ దర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కొండల్లో కేవలం విలువైన కలప మాత్రమే కాకుండా యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ప్రకృతి అందాల నిలయం.. చెయ్యేరు నదీ తీరం శేషాచల కొండల గుండా ప్రవహించే చెయ్యేరు (బహుదా) నదీపరీవాహక ప్రాంతం అటవీ నేపథ్య సినిమాలకు అత్యంత అనుకూలంగా ఉంది. గతంలో చియాన్ విక్రమ్ నటించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘తంగలాన్’ లోని పలు యాక్షన్ ఘట్టాలను కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా, బుల్లితెర షూటింగ్లకు అనుకూలంగా ఉండే ప్రధాన లొకేషన్లు ఇవే రోళ్లమడుగు – బాలరాజుపల్లె: లోయల నడుమ సహజసిద్ధమైన యాక్షన్ సీక్వెన్సులకు పెట్టింది పేరు. అన్నమయ్య డ్యాం ఏరియా: జల వనరులు, కొండల కలయికతో అద్భుతమైన విజువల్స్ అందిస్తోంది. రాజంపేట – రాయచోటి ఘాట్ రోడ్డు: దట్టమైన వృక్షసంపదతో కూడిన ఈ ఘాట్ రోడ్డు ఛేజింగ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్ఓ శ్రీనివాసులరెడ్డి తీసుకొచ్చిన ‘రెడ్వుడ్ జంగిల్ సఫారీ’ మార్గాలు, డీప్ ఫారెస్టులోని అరుదైన అందాలు ప్రస్తుతం తమిళ సినిమాటోగ్రాఫర్లను కట్టిపడేస్తున్నాయి. రోళ్లమడుగు అటవీ ప్రాంతం శేషాచలంలో చిత్రీకరించన పుష్ప సినిమా పోస్టర్ప్రకృతి అందాలకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున సినిమా షూటింగ్లు నిర్వహించేలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) ప్రత్యేక దృష్టి సారించాలి.శేషాచలం అడవుల అద్భుత నేపథ్యం మన సొంత పరిశ్రమ కంటే పొరుగు పరిశ్రమలకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమకు (కోలీవుడ్) చెందిన అగ్ర దర్శకులు, స్టార్ హీరోలు శేషాచలం అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడి లోయలు, నదీ తీరాలలో సినిమా షూటింగ్లు చేయడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం. – బాలరాజు చంద్రశేఖర్రాజు, అధ్యక్షుడు, తెలుగు కళాసమితి, కువైట్. శేషాచలం అటవీ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్లను తమిళ సినీ వర్గాలు గుర్తించి, ఇక్కడి అందాలను తమ సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుండటం శుభపరిణామం. గతంలో ఎన్టీఆర్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమా తీసే క్రమంలో రాజంపేట పరిసరాల్లో పర్యటించారు. ఆ సమయంలో అనంతరాజుపేటలోని ప్రసిద్ధ పంజం (పీవై) భవనంలో బస చేశారు. ఆ సందర్భంలోనే శేషాచలం అటవీ ప్రాంతంలోని పలు కీలకమైన సన్నివేశాలను, విజువల్ షాట్స్ను ఇక్కడే చిత్రీకరించారు. తెలుగు దర్శకులు, నిర్మాతలు వీటిపై దృష్టి సారించి ఇక్కడ షూటింగ్స్ నిర్వహించాలి. – పంజం మనోహర్రెడ్డి, పీవై థియేటర్ అధినేత, రాజంపేట. కోలీవుడ్కు కేరాఫ్ అడ్రస్గా శేషాచలం ప్రకృతి అందాలకు నిలయం ఎర్రచందనం స్మగ్లింగ్ బేస్డ్ సినిమా షూటింగ్లు రోళ్లమడుగులో ధనుష్ సందడి తాజాగా ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న భారీ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ను శేషాచలం అడవుల పరిధిలో చిత్రీకరిస్తున్నారు. రోళ్లమడుగు, రాజంపేట–రాయచోటి ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ధనుష్ రాకతో శేషాచలం అడవుల్లో కోలీవుడ్ సినీ వర్గాల సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానిక అభిమానులు షూటింగ్ స్పాట్కు తరలివస్తున్నారు. -
పేరుమోసిన దొంగ.. పట్టించిన ‘వంద’
బద్వేలు అర్బన్ : అతను అంతర్ రాష్ట్ర దొంగ. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో దాదాపు 60 దొంగతనాల కేసుల్లో నిందితుడు. పేరుమోసిన ఆ ఘరానా దొంగ చివరికి వంద రూపాయలు చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. స్థానిక అర్బన్స్టేషన్ ఆవరణలో అర్బన్ సీఐ బి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. స్థానిక సిద్దవటం రోడ్డులోని శివరామకృష్ణనగర్ 5వ వీధిలో నివసించే బోవిళ్ల నరసింహారెడ్డి ఇంటిలో గత నెల 30న చోరీ జరిగింది. ఈ మేరకు అతను అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన పీట్లగంగాధర్గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం చెన్నంపల్లె ఫ్లైఓవర్ వద్ద గల ఆర్అర్ ఫంక్షన్ హాలు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న గంగాధర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా గత నెల 27న జైలు నుంచి విడుదలైన గంగాధర్ శివరామకృష్ణనగర్ 5వ వీధిలో చోరీకి యత్నించగా అక్కడ కేవలం వంద రూపాయలు మాత్రమే లభించాయని.. అక్కడ నుంచి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంటిలో చొరబడి రూ.1.60 లక్షల నగదు, అరతులం బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
క్యాపిటల్ను మట్టికరిపించిన కింగ్స్
కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఏపీఎల్ సీజన్–5 సమరంలో కాకినాడ కింగ్స్ సర్వశ్రేష్ఠ ప్రదర్శనతో క్యాపిటల్ అమరావతి రాయల్స్ను 120 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కాకినాడ కింగ్స్ జట్టు ఆరంభంలో ఓపెనర్ అర్జున్ టెండూల్కర్ (1) వికెట్ కోల్పోయినప్పటికీ, ఆ ఒత్తిడిని ఏమాత్రం క్షేత్రస్థాయిలోకి రానివ్వకుండా బ్యాటింగ్ పవర్ హౌస్లా విరుచుకుపడింది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (57), మిట్టా లేఖాజ్ రెడ్డి (53)లు విధ్వంసకర అర్థశతకాలతో చెలరేగగా, కెప్టెన్ మనీష్ గొలమారు (33), పిన్నింటి తపస్వి (41)లు సిక్సర్ల వర్షం కురిపించడంతో కాకినాడ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగుల హిమాలయ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. అనంతరం 226 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ జట్టుకు రన్ రేట్ ఒత్తిడి ఆరంభం నుంచే శాపంగా మారింది. కాకినాడ పేసర్లు హరిశంకర్ రెడ్డి, కావూరి సాయితేజలు పవర్ప్లేలోనే టాప్ ఆర్డర్ వెన్ను విరవడంతో అమరావతి బ్యాటింగ్ లైన్ పూర్తిగా కుప్పకూలింది. మిడిలార్డర్లో ఎస్. దుర్గా వరప్రసాద్ (13 బంతుల్లో 30) ఒక్కడే వేగంగా ఆడి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరోవైపు కరణ్ షిండే (4), కేవీ శశికాంత్ (11) లాంటి లీగ్ సీనియర్లు కనీస పోటీ ఇవ్వకుండా ఘోరంగా వైఫల్యం చెందారు. కాకినాడ స్పిన్నర్ సిరపారపు ఆశిష్ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు (4/13) పడగొట్టి అమరావతి టెయిల్ ఎండర్లను క్లీన్ చేయడంతో, ఆ జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే 105 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాకినాడ కింగ్స్ తరఫున ఐదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన మిట్లా లేఖాజ్రెడ్డి ఆఖరి ఓవర్లలో రన్ రేట్ను పతాక స్థాయికి తీసుకెళ్లినందున ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నారు. కాకినాడ కింగ్స్ ఇన్నింగ్స్ : పిట్టా అర్జున్ టెండూల్కర్ (రనౌట్–యశ్వంత్ గొల్లపూడి) (2 బంతుల్లో 1), మనీష్ గొలమారు (సి) ఎస్. దుర్గ వరాప్రసాద్ (బి) బండారు అయ్యప్ప (16 బంతుల్లో 33), అభిషేక్ రెడ్డి (బి) తలచిట్ల దీపు భార్గవ్ (38 బంతుల్లో 57), పిన్నింటి తపస్వి (సి) శీరం వెంకట రాహుల్ (బి) బండారు అయ్యప్ప (26 బంతుల్లో 41), మిట్టా లేఖాజ్ రెడ్డి (సి) వరుణ్ సాత్విక్ (బి) కేవీ శశికాంత్ (30 బంతుల్లో 53), మువ్వల యువన్ (నాటౌట్) (11 బంతుల్లో 25), గద్దె సమన్విత్ (నాటౌట్) (1 బంతుల్లో 0) మొత్తం స్కోరు: 225/5, ఓవర్లు: 20.0, ఎక్స్ట్రాలు: 15 క్యాపిటల్ అమరావతి రాయల్స్ ఇన్నింగ్స్ యారా సందీప్ (సి) గద్దె సమన్విత్ (బి) హరిశంకర్ రెడ్డి (11 బంతుల్లో 13), శీరం వెంకట రాహుల్ (బి) కావూరి సాయితేజ (8 బంతుల్లో 11), వరుణ్ సాత్విక్ (ఎల్బీడబ్ల్యు) (బి) సిరపారపు ఆశిష్ (2 బంతుల్లో 0), కరణ్ షిండే (సి) వి.గిరి ప్రసాద్ (బి) కావూరి సాయితేజ (3 బంతుల్లో 4), పైలా అవినాష్ (సి) పిన్నింటి తపస్వి (బి) వి.గిరి ప్రసాద్ (11 బంతుల్లో 6), ఎస్.దుర్గవరప్రసాద్ (బి) పిన్నింటి తపస్వి (13 బంతుల్లో 30), కేవీ శశికాంత్ (సి) గద్దె సమన్విత్ (బి) వి.గిరి ప్రసాద్ (7 బంతుల్లో 11), ఉద్దరాజు అహితేష్ వర్మ (సి) గద్దె సమన్విత్ (బి) సిరపారపు ఆశిష్ (6 బంతుల్లో 15), బండారు అయ్యప్ప (సి) అభిషేక్ రెడ్డి (బి) సిరపారపు ఆశిష్ (6 బంతుల్లో 9), తలచిట్ల దీపు భార్గవ్ (సి) గద్దె సమన్విత్ (బి) సిరపారపు ఆశిష్ (1 బంతుల్లో 0), ఎమ్.తోషిత్ యాదవ్ (నాటౌట్) (5 బంతుల్లో 2) మొత్తం స్కోరు: 105/10, ఓవర్లు: 12.1, ఎక్స్ట్రాలు: 04 -
ఆదర్శమా.. అదృశ్యమా !
● జిల్లాలోని 115 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో తగ్గిపోయిన హాజరు ● 60 మంది లోపు విద్యార్థులతో వెలవెలబోతున్న సర్కారు బడులు ● ఒంటిమిట్టలో అత్యంత దారుణం.. విద్యాశాఖ నివేదికలో షాకింగ్ నిజాలు! కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ప్రైవేట్ బడులకు దీటుగా వసతులు కల్పించి, విద్యార్థుల నమోదును పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 397 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఉండగా, అందులో దాదాపు మూడో వంతు అంటే 115 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 లోపునకే పడిపోయినట్లు విద్యాశాఖ అధికారులు జరిపిన తాజా సర్వేలో గుర్తించారు.ఒంటిమిట్టలో అత్యంత దారుణం!జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో ఉన్న ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 20 మంది లోపునకే పరిమితమై మూతపడే స్థితికి చేరుకుంది. మండలాల వారీగా కుంచించు కుపోయిన విద్యార్థుల వివరాలు 21 నుండి 30 మంది లోపు: బి.మఠం, గోపవరం, కలసపాడు, కమలాపురం, ఖాజీపేట, మైదుకూరు, పెద్దముడియం, ఒంటిమిట్ట మండలాల పరిధిలోని ఆదర్శ పాఠశాలలు. 31 నుండి 40 మంది లోపు: బి.కోడూరు, బద్వేల్, చాపాడు, కడప, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, కొండాపురం, లింగాల, ముద్దనూరు, పెండ్లిమర్రి, ప్రొద్దుటూరు, కాశినాయన, సిద్ధవటం మండలాలు. 41 నుంచి 50 మంది లోపు (అత్యధిక మండలాలు): ఆట్లూరు, బద్వేల్, సికెదిన్నె, చాపాడు, చెన్నూరు, కడప, దువ్వూరు, గోపవరం, జమ్మలమడుగు, కలసపాడు, కమలాపురం, ఖాజీపేట, కొండాపురం, లింగాల, మైదుకూరు, ముద్దనూరు, పెద్దముడియం, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, సిద్ధవటం, సింహాద్రిపురం, సుండుపల్లి, వీఎన్పల్లి, వల్లూరు, వీరబల్లి, వేముల, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల మండలాలు. 51 నుంచి 59 మంది లోపు: ఆట్లూరు, బద్వేల్, సికెది న్నె, చక్రాయపేట, చాపాడు, కడప, దువ్వూరు, జమ్మ లమడుగు, కొండాపురం, మైదుకూరు, నందలూరు, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజుపాలెం, తొండూరు, వల్లూరు, వీరబల్లి, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల మండలాల్లోని పాఠశాలలు ఉన్నాయి. -
ఓటర్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఎస్ఐఆర్
ప్రొద్దుటూరు కల్చరల్ : దేశ ఓటరు భవిష్యత్తును అత్యంత ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఓటరు సర్వే ఎస్ఐఆర్ అని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) వ్యవస్థాపక నాయకుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులోని ఏకేఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఎస్ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో కోట్లాది మంది ఓటర్లను తొలగించారన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టులో ఒక అడ్రస్లో 900 ఓటర్లు ఉన్నారన్నా. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఒక్క ఓటరు లేరన్నారు. దీన్ని బట్టి ఎస్ఐఆర్ నిజంగా దొంగ ఓట్లను, మరణించిన వారి ఓట్లనే తొలగిస్తుందని గ్యారెంటీ లేదన్నారు. అభ్యర్థుల ఓట్లు లెక్కించి ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వెల్లడించి గెలుపును ప్రకటించడం ఎన్నికల కమిషన్ పని అన్నారు. కానీ ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని ప్రకటించాక ఓట్ల లెక్కింపు వివరాలు చెబుతున్నారంటే దేశంలో ప్రజాస్వామ్యానికి ఏ గతి పట్టిందో అర్థమవుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధనా కార్యదర్శి కె.ప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఐఆర్లో 2002లో మీరు ఎక్కడ ఓటేశారు, ఏ బూత్లో వేశారు, ఏ పార్ట్ నంబర్ మీది అనే వివరాలతో సహా నేడు ఎన్యూమరేషన్ ఫాంలో పూర్తి చేస్తేనే మీ ఓటింగ్ మ్యాపింగ్ అవుతుందన్నారు. లేకుంటే మీ ఓటు గల్లంతే అని అన్నారు. జూలై 14 ఇంటింటి ఓటర్ సర్వే పూర్తయి జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటిస్తారన్నారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు, ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా అని మరి కావాల్సిన సమయం ఇచ్చి ఎస్ఐఆర్ను పూర్తి చేయొచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జై భారత్ జాతీయ అధ్యక్షుడు లోక్నాథ్, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, జిల్లా అధ్యక్షుడు పల్లవోలు రమణ, ప్రధాన కార్యదర్శి శివరాం, విరసం నాయకురాలు వరలక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సర్పంచ్ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్, జమా అతె ఇస్లాం హింద్ నాయకులు రెహాన, రాయలసీమ మహిళా శక్తి నాయకురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. అవగాహన సదస్సులో డాక్టర్ బ్రహ్మారెడ్డి -
బాలికపై అఘాయిత్యం
కడప అర్బన్: కడప నాగరాజుపేటలో ఓ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై, అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వడిషా వెంకటేశ్వర్లు (42) కన్ను వేశాడు. 2023 ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 4:30 గంటల సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేని సమయాన్ని చూసి, నిందితుడు నివాస ప్రాంగణంలోని వర్కర్ల గది వద్దకు బాలికను మాట్లాడాలని పిలిచాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్న్లో రికార్డు చేసి, ఆ వీడియో చూపిస్తూ బాలికను అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలపడంతో, ఆమె కడప వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి కడప వన్టౌన్ సీఐ ఎన్.వి. నాగరాజు నమోదు చేశారు. నిందిడుడిని అరెస్ట్చేశారు. దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కడప పొక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.ఏ సోమశేఖర్ ఈ కేసును విచారించారు. సాక్ష్యాధారాలను పరిశీలించి,నేరం రుజువు కావడంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన పొక్సోకోర్టుఅడిషనల్ పబ్లిక్ప్రాసిక్యూటర్ కె. వేణుగోపాల్, నిందితునికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన కోర్టు మానిటరింగ్ సెల్ ఏఎస్ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ చంద్రశేఖర్రెడ్డి, ప్రస్తుత సీఐ వి. చిన్న పెద్దయ్యను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రశంసించారు. నిందితుడికి మూడేళ్ల జైలు -
యువత ఉపాధి, సామాజిక భద్రతే లక్ష్యం
– కలెక్టర్ డాక్టర్చెరుకూరి శ్రీధర్ కడప సెవెన్రోడ్స్ : యువతకు ఉపాధి, సామాజిక భద్రత కల్పనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో కలెక్టరేట్ సభా భవనంలో వర్చువల్గా పాల్గొన్నారు. పీఎం వీబీఆర్వై పథకం ద్వారా ఉద్యోగ అవకాశాలతోపాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి మరింత మంది కార్మికులు వస్తారన్నారు. జిల్లాలో కూడా పరిశ్రమల అభివృద్ది, నైపుణాభివృద్ది, ఉపాధి కల్పనా చర్యలకు జిల్లా యంత్రాంగం సహకరిస్తోందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ జిల్లాలో వ్యవస్థాపక సంస్కృతికి కొత్త ఊపు తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. నేడు కడపలో జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధికల్పనాధికారి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అందెల సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే టయోవిజన్ కాంపోజిటివ్ టెక్నాలజీ సంస్థలో ప్రొడక్షన్, క్వాలిటీ ఇంజినీర్లు, క్యూఎంఎస్ ఇంజినీర్ తదితర ఉద్యోగాలకు డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అల్డిక్సన్ కంపెనీలో వివిధ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నుంచి పీజీ వరకు, ఐటీఐ డిప్లొమా అర్హత గల అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. -
సన్షైనర్స్ను కుమ్మేసిన బుల్స్
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్–5 సమరంలో భాగంగా కడప నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో మూడో రోజు జరిగిన తొలి మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు సంచలన విజయంతో దూసుకుపోయింది. విజయవాడ సన్షైనర్స్తో జరిగిన ఈ హై–స్కోరింగ్ థ్రిల్లర్లో భీమవరం బుల్స్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి ఘన విజయాన్ని సాధించారు. టాస్ గెలిచిన భీమవరం బుల్స్ కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అశ్విన్ హెబ్బార్ ధమాకా.. విజయవాడ భారీ స్కోరు! తొలుత బ్యాటింగ్కు దిగిన విజయవాడ సన్షైనర్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. లీగ్ స్టార్ అశ్విన్ హెబ్బార్ మైదానంలో విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికే 124 పరుగులు చేసిన విజయవాడ జట్టులో, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జహీర్ అబ్బాస్ (25 బంతుల్లో 48, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్షవర్ధన్ (23 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ధాటిగా ఆడారు. అయితే ఆఖరి ఓవర్లలో భీమవరం బౌలర్లు పీవీఎస్ఎన్ రాజు (3 వికెట్లు), సీహెచ్ రవితేజ, బి.యశ్వంత్ (తలో రెండు వికెట్లు) లు అద్భుతంగా కట్టడి చేయడంతో విజయవాడ సన్షైనర్స్ జోరు తగ్గింది. అయినా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. రేవంత్ రెడ్డి విధ్వంసకర శతకం.. 17.3 ఓవర్లలోనే ఫినిష్! అనంతరం 213 పరుగుల హిమాలయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భీమవరం బుల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హేమంత్రెడ్డి త్వరగానే అవుట్ కాగా, మరొక ఎండ్లో క్రీజులోకి వచ్చిన రేవంత్ రెడ్డి కడప మైదానాన్ని తన సిక్సర్లతో హోరెత్తించాడు. విజయవాడ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఏకంగా 61 బంతుల్లో 14 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 126 పరుగులు చేసి సంచలన సెంచరీ సునామీ సృష్టించాడు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రవికిరణ్ కూడా వేగంగా ఆడుతూ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును విజయ తీరాల వైపు నడిపించాడు. వీరిద్దరి వీరవిహారంతో భీమవరం బుల్స్ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 17.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మైదానాన్ని ఉర్రూతలూగించిన భీమవరం బుల్స్ బ్యాటర్ రేవంత్రెడ్డి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.రేవంత్రెడ్డి (126), భీమవరం బుల్స్ 61 బంతుల్లోనే 126 పరుగులతో రేవంత్ రెడ్డి వీరవిహారం అశ్విన్ హెబ్బార్(73) మెరుపులు వృథా 213 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఊదేసిన భీమవరం పీవీఎస్ఎన్ రాజు మూడువికెట్ల పంజా రసవత్తర పోరులో భీమవరం సరికొత్త రికార్డు ఉర్రూతలూగిన కడప స్టేడియం విజయవాడ సన్ షైనర్స్ ఇన్నింగ్స్ : అభినవ్ (సి)మునీష్ (బి) పీవీఎస్ఎన్ రాజు (18 బంతుల్లో 26), అశ్విన్ హెబ్బర్ (సి)హేమంత్ (బి) యశ్వంత్ (73 బంతుల్లో 29), హర్షవర్దన్ (సి)సాత్విక్ (బి) శ్రావణ్ (18 బంతుల్లో 26), షేక్ జహీర్ అబ్బాస్ (సి)హేమంత్ (బి)రాజు (25 బంతుల్లో 48), పాండురంగరాజు (సి)రాజు (బి) యశ్వంత్ (11 బంతుల్లో 19), సిద్దార్థ (సి) హేమంత్ (బి)రవితేజ (2 బంతుల్లో 1), ఏవీవీ విజయ్ (సి)హేమంత్ (బి) రాజు ( 03 బంతుల్లో 06),ప్రశాంత్ (సి) రవి కిరణ్ (బి) రవితేజ(3 బంతుల్లో 2), జీఎస్వీ సుమిత్ (రనౌట్–రవికిరణ్, రాజు)(2 బంతుల్లో 1), లలిత్మోహన్ (నాటౌట్) (2 బంతుల్లో 2)భరత్ (నాటౌట్) 00 మొత్తం స్కోరు : 212/9 ఓవర్లు 20, ఎక్స్ట్రాలు : 04 బీమవరం బుల్స్ ఇన్నింగ్స్ : హేమంత్రెడ్డి (సి)ప్రశాంత్ (బి) సుమిత్ (6 బంతుల్లో 9), రేవంత్రెడ్డి (నాటౌట్) (61 బంతుల్లో 126), సాయిశ్రావణ్ (సి) శంబు అఖిల్ (డి)సుమిత్ (9 బంతుల్లో 19), రవికిరణ్ రటౌట్ ((సబ్) పిన్నింటి తేజస్వి / తన్నీరు భరత్) (24 బంతుల్లో 46), సాత్విక్ (నాటౌట్) (6 బంతుల్లో 14) మొత్తం స్కోరు : 218/3 ఓవర్లు 17.3, ఎక్స్ట్రాలు : 04 -
ఫారం నింపండి..సర్ !
ఈ దరఖాస్తులో ఉన్న సాంకేతిక కొర్రీలు ఓటర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకవేళ ఓటరు పుట్టిన తేదీ మే 2002కు ముందైతే.. ఫారంలో ఎడమ చేతివైపు ఉన్న బాక్సులో ఓటరు నంబరు ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. అదే కుటుంబ సభ్యులతో మ్యాప్ చేసి ఉంటే కుడి చేతి వైపు ఉన్న బాక్సులో వివరాలు నింపాలి. అంటే అవసరానికి అనుగుణంగా ఏదో ఒక బాక్సు మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కనీస విషయాలు ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రోజెని, సెల్ఫ్ ప్రోజెనిలలో ఏది చేయించుకోవాలో ఓటరే స్వయంగా తె లుసుకుని బీఎల్ఓకు చెప్పాల్సి వస్తోంది. ఇందుకోసం ఓటరు 2002 నాటి పాత ఎస్ఐఆర్ జాబితాను పరిశీలించి, తాను ఏ మ్యాపింగ్కు చెందుతానో నిర్ధారించుకోవాల్సి రావడం సామాన్యులకు నరకంగా మారింది. ఆధార్, ఓ టరు ఐడీలను మాత్రమే ప్రామాణికంగా తీసు కుని ఓటరు జాబితా సవరణ చేపట్టాలని వా మపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులలో ఒక్కటి కూడా అట్టడుగు వర్గాల ప్రజల వద్ద అందుబాటులో లేవని చెబుతున్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రతి ఏటా ఎంతో సజావుగా, ప్రశాంతంగా సాగిపోయే ఓటర్ల సవరణ ప్రక్రియ (స్పెషల్ సమ్మరి రివిజన్) ఈసారి మాత్రం ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపుల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం జరుగుతున్న శ్రీస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్శ్రీ ఇటు ఓటర్లు, అటు బూత్ లెవెల్ అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారింది. ఎస్ఐఆర్లోని అనేక కఠినమైన, సంక్లిష్టమైన నిబంధనలే ఇందుకు ప్రధాన కారణం. కాగితాలు నింపడం చేతకాక, ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల గుర్తింపు పత్రాలు సమర్పించలేక పేద ప్రజలు సతమతమవుతుండగా, అసలు తమ ఓటు హక్కు జాబితాలో ఉంటుందో లేదోననే కలవరం మొదలైంది. మసీదుల వద్ద హెల్ప్డెస్క్లు ముస్లింల పేర్లు ఒకేలా ఉండటం, 2002 నాటి ఎస్ఐఆర్ సమయంలో వారు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారుతోందని అధికారిక సిబ్బంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ముస్లింల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తారనే వదంతులు జిల్లాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. దీంతో ముస్లిం వర్గాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ సామాజిక వర్గ స్వచ్ఛంద సేవకులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మసీదుల వద్ద ప్రత్యేకంగా శ్రీహెల్ప్డెస్క్శ్రీలను ఏర్పాటు చేశారు. తమ వద్ద 2002 నాటి పాత ఎస్ఐఆర్ జాబితాలను ఉంచుకుని, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బీఎల్ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను వారే స్వయంగా నింపుతూ ఓటర్లకు కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ గందరగోళం వల్ల ఓటర్లు తమ ఓట్లను కాపాడుకోవడానికి స్థానిక సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం కడప తారకరామ నగర్కు చెందిన పలువురు మహిళలు గుంపులుగా 18వ డివిజన్లోని విశ్వనాథపురం సచివాలయానికి తరలివచ్చారు. ఎన్యుమరేషన్ పత్రాలు ఎలా నింపాలో తెలియడం లేదని, తమకు సహాయం చేయాలంటూ అక్కడి సిబ్బందిని కోరుతూ సతమతమవడం కనిపించింది. ఒక్క కడప నగరంలోనే కాకుండా జిల్లాలోని ప్రతి సచివాలయంలోనూ ప్రస్తుతం ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. బీఎల్ఓ సస్పెన్షన్.. శ్రీహరిరావు వీధి ప్రజల తిప్పలు! కడప నగరం 30వ డివిజన్ 92వ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బూత్ లెవెల్ అధికారి సురేంద్రబాబు ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ అయ్యారు. అయితే, ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎన్నికల అధికారులు మరొక బీఎల్ఓను నియమించకపోవడంతో శ్రీహరిరావు వీధికి చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపలేక ఓటర్ల అవస్థలు ఓట్లు ఉంటాయో.. పోతాయోనని తీవ్ర అయోమయం గతంలో లేని నిబంధనల కొర్రీలు సచివాలయాల చుట్టూ జనం పరుగుల మసీదుల వద్ద ముస్లింల హెల్ప్డెస్క్లు -
ఖాకీ గంజాయి నాటకం..బూటకం
● అడ్డంగా బుకై ్కన కడప పోలీసులు ● సీసీ ఫుటేజీ, ఎస్ఐ ఐడీ కార్డుతో హైకోర్టులో గుట్టురట్టు ● హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినందుకు బాధితులపై ‘పీడీ యాక్ట్’ పెట్టాలని పగ సాక్షి ప్రతినిధి, కడప: ఎవరినో సంతోష పెట్టడానికి, మరొకరి కళ్లల్లో ఆనందం చూడాలనే తపనతో అమాయకులను కేసుల్లో ఇరికించబోయిన పోలీసులు ఇప్పుడు తాము తవ్విన గోతిలో తామే అడ్డంగా పడిపోయారు. ఒక అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి గంజాయి డ్రామా ఆడిన ఖాకీలకు, ఇప్పుడు హైకోర్టు ‘హేబియస్ కార్పస్’ ఉచ్చు దెబ్బకు చెమటలు పడుతున్నాయి. లాడ్జి సీసీ ఫుటేజీతో సహా అన్నీ కోర్టుకు జీవనోపాధి కోసం చైన్నె వెళ్లిన కడపకు చెందిన రియాజ్, అతుల్లను మే 12 అర్ధరాత్రి దాటిన తర్వాత కడప చిన్నచౌక్ పోలీసులు చట్టవిరుద్ధంగా, కిడ్నాప్ తరహాలో అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరినీ ఏపీ39జీజెడ్ 1608 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారులో గుట్టుచప్పుడు కాకుండా కడపకు తరలించారు. తాము చేసిన పని ఎవరికీ తెలియదనుకున్న పోలీసుల అతి తెలివికి చైన్నె లాడ్జి యాజమాన్యం గట్టి షాకే ఇచ్చింది. కడప పోలీసులు లాడ్జిలో చొరబడి బాధితులను ఈడ్చుకెళ్లిన విజువల్స్ మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ య్యాయి. అంతటితో ఆగకుండా, దాడికి వచ్చిన కడప ఎస్ఐకి సంబంధించిన ఐడీ ఆధారాలు సైతం అక్కడ దొరికిపోయాయి. ఈ సాక్ష్యాలన్నింటినీ రియాజ్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించడంతో పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. గంజాయి డ్రామా ఫ్లాప్.. ఇప్పుడు పీడీ యాక్ట్ కుట్ర! హైకోర్టులో పిటిషన్ నంబర్ 14533/2026 ద్వారా హేబియస్ కార్పస్ కేసు దాఖలవడంతో.. ఆ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి మే 15న కడప వన్టౌన్ పోలీసులు పాతబస్టాండ్ వద్ద వీరిద్దరినీ గంజాయితో పట్టుకున్నామంటూ తప్పుడు కేసు బనాయించి రిమాండ్కు పంపారు. అయితే ఈ అక్రమ గంజాయి కేసు కోర్టులో నిలబడకపోవడంతో జూన్ 15న వీరికి బెయిల్ మంజూరైంది. కాగా, తమ అక్రమాలను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించినందుకు ప్రతిఫలంగా.. బాధితులు ఇద్దరూ జైలు నుంచి విడుదల కాగానే వారిపై ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేయాలనే క్రూరమైన ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసమే గత మూడు రోజులుగా కడప సెంట్రల్ జైలు ప్రాంగణంలో చిన్నచౌక్, వన్టౌన్ పోలీసులు స్పెషల్ టీమ్లతో కలిసి వాహనాలలో తిష్ట వేసి కూర్చున్నారు. -
రెండేళ్ల సభ అట్టర్ ఫ్లాప్ !
● రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి గైర్హాజరు ● ఎమ్మెల్యే మాధవిరెడ్డి రాక ఆలస్యం..ప్రసంగానికి దూరం ● నేతల ప్రసంగాలకు కొరవడిన స్పందన ● ఉత్సాహం నింపని టీడీపీ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీ గురువారం స్థానిక పుత్తా ఎస్టేట్లో నిర్వహించిన టీడీపీ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ వెలవెలబోయింది. ఈ కార్యక్రమం అటు నేతల్లో, ఇటు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపక పూర్తిగా కళ తప్పింది. అధిష్ఠానంపై ‘వాసు’ గుర్రు కడప నియోజకవర్గంలో ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఆయన తన అసమ్మతిని ఇన్స్టా పోస్టు ద్వారా బహిరంగంగానే వెళ్లగక్కారు. అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయన కడప నియోజకవర్గంలో విజయోత్సవ సభ నిర్వహించలేదు. ఇదే సందర్భంలో కడప పుత్తా ఎస్టేట్లో నిర్వహించిన టీడీపీ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు కూడా హాజరు కాకపోవడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సభకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి కార్యక్రమం మధ్యలో హాజరయ్యారు. అయితే, వేదికపైన ఆమె ప్రసంగించకపోవడం గమనార్హం. దీంతో వారిద్దరు టీడీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు బహిరంగంగా చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందోనని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. గొప్పలకే పరిమితమైన నేతలు కార్యక్రమానికి హాజరైన టీడీపీ కూటమి నేతలు అది చేశాం.....ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. దీంతో సభకు వచ్చిన ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలతోపాటు ఇతరులు కూడా విసుగు చెందారు. నేతలు ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ కార్యకర్తల నుంచి కనీస స్పందన కూడా కరువైంది. కార్యక్రమం మధ్యలోనే జనాలు సభా కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ గా దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన వారు ఇదేమి విజయోత్సవ సభ అంటూ వ్యాఖ్యానించడం కనిపించింది. కళ తప్పిన సభ పుత్తా ఎస్టేట్లో జిల్లా స్థాయి సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏర్పాట్ల తీరును, జనాల రాకను పరిశీలిస్తే జిల్లా స్థాయి సభ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయోత్సవ సభ జనాలతో పోటెత్తుతుందేమోనని, సభా ప్రాంగణ ప్రాంతం గల బిల్టప్ కూడలి అంతా జనాలతో కిక్కిరిసిపోతుందని భావించారు. తీరా అక్కడికి వెళ్లిచూస్తే సభా ప్రాంగణం చిన్నదైనా ఖాళీ కుర్చీలే దర్శన మిచ్చాయి. జిల్లా జనాభాతో పోల్చుకుంటే ఈ సభకు వచ్చిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. రెండేళ్ల పాలన విజయవంతమైతే ప్రజలు విజయోత్సవ సభకు స్వచ్ఛందంగా రావడానికి ఆసక్తి చూపేవారని పలు వురు వ్యాఖ్యానించారు. రెండేళ్ల పాలన ఫెయి ల్యూర్ కావడం వల్ల ప్రజలు ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. -
అమరావతిపై ‘లయన్స్’ పంజా!
సాక్షి ప్రతినిధి, కడప: కడప రాజారెడ్డి స్డేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగిన మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్, అమరావతి రాయల్స్పై 44పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వైజాగ్ లయన్స్కు ప్రారంభంలోనే కెప్టెన్ రికీ భుయ్ (5) వికెట్ కోల్పోయి పెద్ద షాక్ తగిలింది. ఆ ఒత్తిడిని ఏమాత్రం క్షేత్రస్థాయిలోకి రానివ్వకుండా కోగటం హనీష్ వీరా రెడ్డి (34 బంతుల్లో 62), మహీప్ కుమార్ (41 బంతుల్లో 62) మూడో వికెట్కు అద్భుతమైన జుగల్ బందీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఆఖర్లో మార్తల ధనుష్ 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 257 స్ట్రైక్ రేట్తో ఏకంగా 36 పరుగులు సాధించి ఫినిషర్ పాత్రను పోషించడంతో వైజాగ్ లయన్స్ 20 ఓవర్లలో 202 పరుగుల భారీ కొండను బోర్డుపై ఉంచగలిగింది. చేతులెత్తేసిన అమరావతి 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ జట్టుకు రన్ రేట్ ఒత్తిడి ఆరంభం నుంచే శాపంగా మారింది. కెప్టెన్ యర్రా సందీప్ (17), వరుణ్ సాత్విక్ (8)లు పవర్ప్లేలోనే వికెట్లు సమర్పించుకున్నారు. ఉప్పర గిరినాథ్ (37) కొద్దిసేపు నిలకడగా ఆడినా ‘రిటైర్ అవుట్’ కావడం ఆశ్చర్యపరిచింది. మిడిలార్డర్లో ఎస్.దుర్గ వరాప్రసాద్ (31 బంతుల్లో 42) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరోవైపు కరణ్ షిండే (2), కేవీ శశికాంత్ (0) వంటి లీగ్ సీనియర్లు వైఫల్యం చెందడంతో అమరావతి 19 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది. వైజాగ్ లయన్స్ బౌలర్ల పంజా వైజాగ్ లయన్స్ భారీ స్కోరు చేయడమే కాకుండా బౌలింగ్లోనూ అత్యంత పదునైన వ్యూహాలను అమలు చేసింది. ముఖ్యంగా పి.గిరినాథ్ రెడ్డి (3/29) మిడిలార్డర్ వెన్ను విరవగా, కె.ప్రమోద్ కుమార్ (3/34) టెయిల్ ఎండర్లను క్లీన్ చేసి అమరావతి పతనాన్ని వేగవంతం చేశారు. షేక్ మహ్మద్ కామిల్ (3 ఓవర్లలో 13 రన్స్) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రన్ రేట్ పెరిగేలా ఒత్తిడి తెచ్చాడు. -
కడప ర్యాలీకి వెళ్లి వచ్చి వృద్ధుడు మృతి
ఎర్రగుంట్ల : కడపలో జరిగిన కూటమి విజయోత్సవ ర్యాలీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి కుప్పకూలిపోయి సన్నపురెడ్డి జయరామిరెడ్డి (82) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. ఎర్రగుంట్లకు చెందిన సన్నపురెడ్డి జయరామిరెడ్డి ఐసీఎల్ ప్యాక్టరీలో పంపు అపరేటర్గా రిటైరయ్యాడు. ఇతను కడపలో జరిగిన ర్యాలీకి వెళ్లాడు. ర్యాలీ ముగియగానే ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ఒక బంకు వద్ద కూర్చొని అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇతను టీడీపీ పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డు కలిగి ఉన్నాడు.. -
నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:00 గంటలకు క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ తెలిపారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు, తల్లితండ్రులకు భోజన వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖ ద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం పదవ తరగతిలో పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ, విద్యార్థి ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు తదితర వాటిని పొందుపరిచి అడ్మిషన్ పూర్తి చేస్తారు. రెండు రోజుల్లో 1,010 మందికి కౌన్సెలింగ్ : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం 19వ తేదీ శుక్రవారం 500 మంది అభ్యర్థులకు, 20వ తేదీ శనివారం 510 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు, వారి మొబైళ్లకు సందేశాలు పంపించారు. అలాగే ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కి సంబంధించి ఈనెల 22, 23 తేదీలలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ క్యాంపస్లోనే అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
సరిహద్దు గ్రామాలు గజ గజ!
– మూడు రోజులుగా ఏనుగుల గుంపు విధ్వంసం సుండుపల్లె:శేషాచలం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన గజరాజుల గుంపులు సుండుపల్లె మండల పరిధిలోని ముడుంపాడు గ్రామ పంచాయతీలోని గోపాలకృష్ణపురం, నగిరి, ఆరోగ్యపురంతో పాటు మరికొన్ని సరిహద్దు ప్రాంతాలలోని పంట పొలాలలో మంగళవారం, బుధవారం అర్ధరాత్రి సమయాలలోవిరుచుకుపడ్డాయి. చేతికొచ్చిన మామిడి, కొబ్బరి తోటలను, వరినార్లను పూర్తిగా నాశనం చేశాయి. అలాగే పంట బోర్లు, నీటిసరఫరా పైపులైన్లు, పొలాల రక్షణకు వేసుకున్న కంచె కూసాలను సైతం ధ్వంసం చేసి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం తోటలలో మామిడికాయల కోతలు జోరుగా కొనసాగుతున్న తరుణంలో ఏనుగుల భయంతో తోటల్లోకి వెళ్లడానికి కూలీలు ససేమిరా అంటున్నారు. ఏనుగులు వరుసగా దాడులు చేస్తుండటంతో సుండుపల్లె, కేవీ పల్లె మండలాలలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గజరాజులు పల్లెలను ముట్టడిస్తున్నా అటవీ అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారే తప్ప, వాటిని అడవిలోకి తోలేందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని రైతాంగం మండిపడుతోంది. -
రాయల్గా తొలి విజయం
కడప సాక్షిప్రతినిధి: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ తొలి వియం అందుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ హై–స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లో కాకినాడ కింగ్స్ విధ్వంసకర ఇన్నింగ్స్కు రాయల్స్ ఆఫ్ రాయలసీమ దూకుడుగా సమాధానమిచ్చి విజయాన్ని అందుకుంది. అభిషేక్ రెడ్డి సెంచరీ మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టుకు ఓపెనర్ అభిషేక్ రెడ్డి (60 బంతుల్లో 112 నాటౌట్) సునామీ సెంచరీకితోడు, ఆఖర్లో మిట్టా లేఖాజ్ రెడ్డి (17 బంతుల్లో 37) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగుల భారీ కొండను బోర్డుపై ఉంచింది. తేజ, వాసుల వీరవిహారం! భారీ లక్ష్య చేధనలో రాయలసీమ ఓపెనర్లు ధ్రువ కుమార్ రెడ్డి (14), మామిడి వంశీ కృష్ణ (11)లు త్వరగానే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సీహెచ్ సాయి సందీప్ (26) ధాటిగా ఆడాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గరిమెళ్ల తేజ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు సాధించి ఆఖరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. వై.తేజ రెడ్డి (41) ఇతనికి సహకారమందించాడు. లోయర్ ఆర్డర్లో వచ్చిన యాడ్ల వాసు కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 42 పరుగులు సాధిం రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. ‘రాయల్’ విక్టరీ.. ‘కింగ్స్’పై సంచలన విజయం! గరిమెళ్ల తేజ(76) విధ్వంసం.. యాడ్ల వాసు(42) పరుగుల సునామీ 212 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఊదేసిన రాయల్స్! -
టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
● వీఆర్ఏ పోస్టు పేరిట రూ.4.50 లక్షలు దండుకున్న దాయాది నేత ● బిల్టప్ సభలో బారికేడ్ల వద్ద 250 ఎంఎల్ పురుగుల మందు తాగిన యువకుడు ● 3 నెలల పసికందు తండ్రి పరిస్థితి విషమం ● తిరుపతికి తరలింపుకడప అర్బన్: తెలుగుదేశం పార్టీ రెండేళ్ల ‘అభివృద్ధి’ జంబూర సభ.. ఒక పేద కార్యకర్త పాలిట ప్రాణాంతకంగా మారింది. సొంత పార్టీ నేతల అవినీతి, నమ్మకద్రోహానికి బలైన ఓ యువ కార్యకర్త సభా ప్రాంగణంలోనే అందరూ చూస్తుండగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ముద్దనూరు మండలం కాండ్లపల్లెకు చెందిన చప్పిడి పద్మనాభరెడ్డి పెద్దకుమారుడు చప్పిడి సతీష్కుమార్ రెడ్డి (29) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, మూడు నెలల క్రితమే ఓ కుమారుడు జన్మించాడు. సతీష్కు విఆర్ఏ పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికి, అతని దాయాది అయిన ఒక స్థానిక టీడీపీ నాయకుడు రూ.4.50 లక్షల లంచం దండుకున్నాడు. ఆపై సతీష్ను కొన్ని రోజుల పాటు అవుట్సోర్సింగ్లో చేర్పించి, ఆ తర్వాత ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం పోవడం, ఇచ్చిన భారీ మొత్తం తిరిగి రాకపోవడంతో సతీష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.గురువారం కడప నగరంలోని బిల్టప్ వద్ద ఆర్భాటంగా ప్రారంభమైన టీడీపీ అభివృద్ధి సమావేశానికి వచ్చిన సతీష్, బారికేడ్ల వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును గడగడా తాగేశాడు. గమనించిన సహచర కార్యకర్తలు వెంటనే అతని చేత మందును కక్కించే ప్రయత్నం చేసి, 108 ద్వారా కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి అత్యవసర వైద్యం అందించిన పల్మనాలజీ వైద్యులు డాక్టర్ సి.రామాంజులరెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సుప్రజారెడ్డిలు మాట్లాడుతూ.. బాధితుడు దాదాపు 250 ఎంఎల్ కంటే ఎక్కువగానే పురుగుల మందు సేవించాడని, యాంటిబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ 72 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమన్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్లో తిరుపతికి తరలించారు.ఈ ఘోరం జరగడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు, డిప్యూటీ కమిషనర్ రాకేష్చంద్రం, తహసీల్దార్ మహబూబ్చాన్ ఆసుపత్రి వద్ద హడావుడి చేశారు. అయితే అసలు సతీష్ ఎందుకు పురుగుల మందు తాగాడో తమకు తెలియదంటూ అధికారులు దాటవేత సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కడప తాలూకా సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ కేసు విచారిస్తున్నారు. చప్పిడి సతీష్కుమార్ రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్యులుఆసుపత్రి వద్ద విలపిస్తున్న బాధితుడి తల్లి శారద, నాయనమ్మ -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్ (జనరల్) మొదటి సంవత్సరానికి సంబంధించి మొత్తం 4410 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 1300 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 4262కి సంబంధించి 2348 మంది ఉత్తీర్ణులయ్యారు. గురుకుల పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు – వనిపెంటలో జూనియర్ కాలేజీని ప్రారంభించిన మంత్రి సవిత మైదుకూరు : రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్త మ ఫలితాలను సాధిస్తున్నారని బీసీ సంక్షేమం, చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం మండలంలోని వనిపెంట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల స్థాయిని పెంచుతూ మంజూరు చేసిన జూనియర్ కాలేజీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మంచి సంస్కారాన్ని అలవర్చుకొని బాగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు మంత్రి సవిత, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్ స్పోర్ట్స్ యూనిఫాంను అందజేశారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్ర, పాఠశాల ప్రిన్సిపాల్ వి.నిర్మల తదితరులు పాల్గొన్నారు. 36.35 శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15 నుంచి గురువారం వరకు జిల్లాలో 6,89,367 ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 1896231 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికి 36.35 శాతం ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే బద్వేలు 86938 (39.15 శాతం), రాజంపేట 63514 (26.05), కడప 86797 (30.57), పులివెందుల 89738 (38.97), కమలాపురం 79,685 (38.55), జమ్మలమడుగు 99,663 (40.66), ప్రొద్దుటూరు 109537 (43.73),మైదుకూరు 73,495 (34.37)మందికి ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలు అందజేశారు. ఇందులో డిజిటైజ్డ్ 9431 (0.50 శాతం). ఇంకా డిజిటైజ్డ్ కాని ఎన్యుమరేషన్ పత్రాలు 1886548 (99.49 శాతం), బీఎల్ఓ వెరిఫికేషన్ లేకుండా ఓటర్లే సమర్పించిన ఎన్యుమరేషన్ పత్రాలు 167 (0.01 శాతం) ఉన్నాయి. బీఎల్ఓలు వెరిఫై చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు 9264 (0.49శాతం) ఉన్నాయి. 20న వైఎస్సార్సీపీ రాష్ట్ర రజక విభాగం సమావేశం కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రజక విభాగం ముఖ్య నాయకుల సమావేశం ఈనెల 20వ తేది నిర్వహించనున్నామని ఆ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోగిడి జయన్న ఒక ప్రకటనలో తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు తాడేపల్లి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 175 నియోజకవర్గాల వారీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రజక విభాగపు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని పార్టీ వివిధ అనుబంధ విభాగాలు, కమిటీలలో కొనసాగుతున్న రజకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓ గ్రామమే ఓటరు జాబితాలో లేదు కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సిల్ రివిజన్(సర్) కార్యక్రమంలో నిర్వహిస్తున్న ఓటర్ల వెరిఫికేషన్లో 2002 ఓటర్ల జాబితాలో రామరాజుపల్లె గ్రామ పంచాయితీలోని రామచంద్రాపురం గ్రామమే లేదు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, 48వ డివిజన్ ఇన్చార్జి బంగారు నాగయ్య యాదవ్ గురువారం కడప నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను 60 ఏళ్లుగా ఆ గ్రామంలో ఉన్నానని, 45 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నానని, 1989లో రామరాజుపల్లె ఉప సర్పంచ్గా పనిచేశానన్నారు. అయితే 2002 ఓటర్ల జాబితాలో తమ గ్రామంగానీ, అందులో ఓటర్లుగానీ లేరన్నారు. తనది, తన కుటుంబ సభ్యుల ఓట్లు అసలే లేవన్నారు. అధికారులు దీన్ని సవరించకపోతే న్యాయస్థానాన్ని అశ్రయిస్తానని తెలిపారు. -
నన్ను గెలికితే.. ‘ఆపరేషన్ సింధూర్’ తప్పదు!
జమ్మలమడుగు: ‘‘నేను ఎవరి జోలికీ వెళ్లను, ఎవరినీ గెలకను.. కానీ నన్ను ఎవరైనా గెలికితే మాత్రం ‘ఆపరేషన్ సింధూర్’ చేపడతా’’ అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర బెదిరింపులకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మలమడుగులో నిర్వహించిన ర్యాలీ అనంతరం పాత బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభ ప్రారంభం నుంచి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నంత సేపూ కింద ఉన్న కొందరు కార్యకర్తలు అరుస్తూ గోల చేస్తుండటంతో ఆదినారాయణరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆవేశంతో..కోపంతో ఊగిపోతూ.. ‘‘నేను మూడు రెండు వేసి అరుస్తాను.. నేను ఆరు వేసినా అరవకుండా ఉంటారా?’’ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నివిధాలుగా అభివృద్ధి చేశామంటూ ప్రగల్భాలు పలికారు. నియోజకవర్గంలో చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆయన మైకులో చెబుతుండగానే.. కింద ఉన్న ఒక చేనేత కార్మికుడు గట్టిగా స్పందిస్తూ, తనకు ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు రాలేదని అందరి ముందూ వాపోవడంతో సభలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది.వైఎస్సార్సీపీ సభకు పోటీగా పెట్టినా.. వెలవెలబోయిన కూటమి సభ!ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ’వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చి సభను భారీగా విజయవంతం చేశారు. దానికి పోటీగా ఎలాగైనా సరే జమ్మలమడుగులో అంతకంటే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తామేంటో నిరూపించుకోవాలని కూటమి నేతలు ఆశపడ్డారు. అయితే, వైఎస్సార్సీపీ సభకు వచ్చిన జనంలో సగం మంది కూడా ఈ రోజు కూటమి సభకు రాలేదని, కేవలం నాలుగు నుంచి ఐదు వేల మంది మాత్రమే హాజరయ్యారని అక్కడికి వచ్చిన వారి సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకోవడం ఇక్కడ కొసమెరుపు. -
ఏపీఎల్లో విజయవాడ సన్ షైనర్స్ శుభారంభం
సాక్షి ప్రతినిధి, కడప: కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)–2026 సీజన్–5 తొలి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్పై విజయవాడ సన్షైనర్స్ విజయం సాధించింది. టాస్ వేయడానికి బీసీసీఐ అపెక్స్ మెంబర్ చాముండేశ్వరినాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాస్ గెలిచిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కడపకు చెందిన జహీర్ అబ్బాస్ విజయవాడ తరఫున రంగంలోకి దిగి కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో జట్టు స్కోరు 198 పరుగులకు చేరింది. తుంగభద్ర బౌలర్లలో దీపక్, హిమ శ్రీనివాస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తుంగభద్ర వారియర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సమన్యు 24 బంతుల్లో 51 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్లు), సత్య సూర్యనారాయణ 21 బంతుల్లో 29 పరుగులు (4 ఫోర్లు), చివర్లో సౌరవ్కుమార్ 15 బంతుల్లో 23 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసినా టీంకు విజయాన్ని చేకూర్చలేకపోయారు. విజయవాడ బౌలర్లలో భరత్ 4 వికెట్లు పడగొట్టి తుంగభద్ర జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. -
గుమాస్తా దొంగావతారం
● చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ ● రూ. 22.91 లక్షల నగదు స్వాధీనంప్రొద్దుటూరు క్రైం : అతను ఎన్నో ఏళ్ల నుంచి తన యజమాని వద్ద నమ్మకంగా పని చేస్తున్నాడు. అయితే ఇంట్లో లక్షల నోట్ల కట్టలు చూసిన అతనికి ఆశ కలిగింది. దీంతో తనను నమ్మిన యజమానినే మోసగించి నోట్ల కట్టలతో ఉడాయించాడు. పట్టణ శివారులోని రైల్వేస్టేషన్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 22.91 నగదును త్రీ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కలిసి ఇటీవల బంగారు వ్యాపారి అనికేత్ జయవంత్ బాబర్ ఇంట్లో రూ. 23 లక్షలు దోచుకున్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అరెస్ట్ వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అనికేత్ జయవంత్ బాబర్ కొన్నేళ్లుగా బంగారు పని చేసుకుంటూ ఇక్కడే నివసిస్తున్నాడు. అతను పట్టణంలోని సూపర్బజార్ వీధిలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతనికి సహాయకుడిగా సొంత రాష్ట్రానికి చెందిన ప్రథ్మేష్ బాబాసాహెబ్ కోలిని గుమాస్తాగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అనికేత్ జయవంత్, తన భాగస్వాములు కలిసి బంగారు కొనుగోలు చేసుకునేందుకు రూ. 23 లక్షలు సమకూర్చుకున్నారు. ఆ డబ్బును అనికేత్ జయవంత్ తన ఇంట్లోనే భద్రపరిచాడు. ప్రథ్మేష్ బాబాసాహెబ్ తన స్నేహితుడు మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్కు పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు విషయం చెప్పాడు. ఈ డబ్బు దొంగలిస్తే ఇద్దరి కష్టాలు తీరిపోతాయని, జాలీగా జీవించవచ్చని మాట్లాడుకున్నారు. ఇంట్లో భద్రపరిచిన నగదును దొంగలించేందుకు ఇరువురు వ్యూహం రచించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఉదయం అనికేత్ జయవంత్ బాబర్ వాకింగ్ కోసమని బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నిందితులిద్దరూ ఇంట్లోని రూ. 23 లక్షలు తీసుకొని పరారయ్యారు. వాకింగ్కు వెళ్లిన జయవంత్ ఇంటికి వచ్చి చూసుకోగా నగదు కనిపించలేదు. ఇంట్లోని గుమస్తా కూడా కనిపించకపోవడంతో అతనే చోరీ చేసి ఉంటాడని భావించిన జయవంత్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రథ్మేష్ బాబాసాహెబ్తో పాటు అతనికి సహకరించిన మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్ను బుధవారం త్రీ టౌన్ పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 22.91 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన త్రీ టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐలు సంజీవరెడ్డి, మైనుద్ధిన్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
నీట్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్కు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హాల్ టికెట్ చూపించి నీట్ విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీలు కడప అర్బన్: కడప జిల్లాలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప డీసీఆర్బీలో ఉంటున్న ఎం. సత్యనారాయణను జమ్మలమడుగు యూజీఎస్కు బదిలీ చేశారు. జమ్మలమడుగు యూజీఎస్లో విధులు నిర్వహిస్తున్న పి. హైమావతిని తలముంచి పట్నం పీఎస్కు, అక్కడ పని చేస్తున్న సి. లక్ష్మీనారాయణను కడప వన్టౌన్కు బదిలీ చేశారు. జి. అమర్నాథ్ రెడ్డిని కడప వన్టౌన్ నుంచి డీసీఆర్బీకి, టి. హరిప్రసాద్ను కడప తాలూకా నుంచి చిన్నచౌక్ పీఎస్కు బదిలీ చేశారు. అలాగే కడప సైబర్సెల్లో విధులు నిర్వహిస్తున్న వి. నారాయణను కడప తాలూకాకు, వీఆర్లో ఉంటున్న ఎస్ కే అహ్మద్ను పీసీఆర్ ప్రొద్దుటూరు పీఎస్కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. జెడ్పీ సీఈఓ తనిఖీ రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిషత్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ డిఫ్యూటీ సీఈఓ రామచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమీషన్) నిధులపై చర్చించారు. అలాగే జనరల్ ఫండ్ నిధులు, అక్షరాంధ్ర కార్యక్రమం, తల్లికి వందనం, పథకాలపై చర్చించారు. ఆయా పథకాల పురోగతి ఎలా ఉందనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. కడప ఎడ్యుకేషన్: ఉర్దూ భాషను ప్రోత్సహించడం, ఉర్దూ మాట్లాడని వారికి సులభంగా ఉర్దూ బోధించడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ రూపొందించిన ‘ఆవో ఉర్దూ సీఖేన్’ పుస్తకం ఆధారంగా కడపలోని ఎస్.కె.ఆర్ – ఎస్.కె.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 30 రోజుల ప్రత్యేక ఉర్దూ శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం బాషా మాట్లాడుతూ, ఉర్దూ ఏ మతానికో లేదా ఒక ప్రత్యేక వర్గానికో చెందిన భాష కాదని, అది భారతదేశ ఉమ్మడి నాగరికత, సంస్కృతి సంప్రదాయానికి ఒక అందమైన ప్రతీక అని అన్నారు. అడకమిక్ కో ఆర్డినేటర్ డా. నాగమణి రెడ్డి సహకారంతో, ఉర్దూ విభాగ అధ్యక్షురాలు డా. షాజియా బేగం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఖిద్మత్–ఎ–ఖల్ఖ్ ఫౌండేషన్ ఛైర్మన్ ముహమ్మద్ గియాస్ షరీబ్ , కడప ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్ ఇన్చార్జి మహమ్మద్ జహీర్, ఉర్దూ కంప్యూటర్ ఫ్యాకల్టీ షేక్ మస్తానీ, లైబ్రేరియన్ హసీనా బానో పాల్గొన్నారు. -
ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి
చాపాడు : చాపాడు మండల పరిధిలోని రేపల్లెలో ప్రైవేట్ ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కంభంపాటి రామాంజనేయులు (42) బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం వివరాలు ఇలా ఉన్నాయి. రేపల్లె గ్రామంలో మృతుడు తన ఇంటికి ప్రొద్దుటూరుకు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం పొందాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో కొన్ని కంతులు పెండింగ్లో పడ్డాయి. దీంతో ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెందిన రామాంజనేయులు మంగళవారం పురుగుల మందు తాగాడు.ప్రొద్దుటూరులో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ‘20న మదనపల్లెలో సీఎం కాన్వాయ్ని అడ్డుకుంటాం’ కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటనను అడ్డుకుంటామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం కడప పాత మున్సిపల్ కార్యాలయంలో డైలీ వేజ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ఎక్కడికి అక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకోవాలని నిర్ణయించినట్లు, ఇందులో భాగంగా మదనపల్లెలో జరుగుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రెండు లక్షలకు పెంచి ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆప్కాస్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై నెల 7వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు వీరమల్లి నరసింహులు, కలువాయి ఈశ్వరయ్య, కోశాధికారి వెంకటాద్రి, యూనియన్ నాయకులు వేలంగి రాజశేఖర్, బక్క రాజేష్, అశోక్ పాల్గొన్నారు. యువతిని మోసగించిన కేసులో వ్యక్తి అరెస్ట్ కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న మహేశ్వర్రెడ్డికి భార్య, పిల్లలున్నారు. రాయచోటికి చెందిన సచివాలయ ఉద్యోగితో ఇన్స్ట్రాగాంలో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి సన్నిహిత జీవితాన్ని గడిపాడు. నిందితుడికి భార్య, పిల్లలున్నారని, తనను మోసం చేశాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ నరసింహారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతిమైదుకూరు : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై చింతకుంట బయనపల్లె వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. మైదుకూరు మండలం వనిపెంట అటవీ రేంజ్ గంజికుంట బీట్ పరిధిలో ఈ సంఘటన జరిగిందని ఎఫ్ఆర్ఓ చలపతి నాయుడు తెలిపారు. -
బెయిల్పై నిత్యానందరెడ్డి విడుదల
కడప అర్బన్ : కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఏప్రిల్ 6న అలంఖాన్ పల్లెకు చెందిన కలమల్ల దస్తగిరి (53) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రతో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని పోలీసలు ఏ13 నిందితుడిగా చేర్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డిని, న్యాయవాది నాగిరెడ్డి గతనెల 11న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. 12వ తేదీన సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో విచారణ చేసి నిత్యానందరెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా కడప కేంద్ర కారాగారానికి రిమాండ్కు తరలించారు. బుధవారం కడపలోని జిల్లా కోర్టులో బెయిల్ కోసం వేసిన పిటీషన్పై విచారణ జరిపారు. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం సాయంత్రం నిత్యానందరెడ్డి విడుదలయ్యారు. మాజీ మేయర్ పాకా సురేష్కుమార్, ఎస్ఈసీ సభ్యుడు మాసీమబాబు, సోషల్ వెల్పేర్ మాజీ చైర్మన్ పులీసునీల్కుమార్, సిహెచ్ వినోద్కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బరాయుడు, మాజీ కార్పొరేటర్ శ్రీరంజన్ రెడ్డి, జిల్లా యువజన నాయకుడు ఫయాజ్, షఫీ, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సునీతారెడ్డి,తదితరులు,వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు కడప కేంద్రగారం వద్ద నిత్యానందరెడ్డిన కలిశారు.చోరీ కేసులో ఇద్దరికి జైలుశిక్ష బద్వేలు అర్బన్ : బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో గతేడాది నమోదైన ఓ చోరీ కేసులో ఇద్దరు నిందితులకు బుధవారం 15 నెలలు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్కుమార్ తీర్పు ఇచ్చినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా సీఎస్.పురం మండలం కొండరాజుపల్లె గ్రామానికి చెందిన కొండరాజుసురేష్, తిరుపతి జిల్లా చిత్తూరు టౌన్ కామరాజనగర్కు చెందిన షేక్మస్తాన్లు బద్వేలులోని విద్యానగర్లో రాయల్ బుల్లెట్ వాహనాన్ని చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా సాక్షాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన అర్బన్ సీఐ రామకృష్ణ, కోర్టు కానిస్టేబుల్ నాగరాజులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. నిందితుడి అరెస్ట్కు పోలీసుల మోహరింపుకడప అర్బన్ : కడప వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల గంజాయి కేసులో నిందితుడిగా ఓ వ్యక్తి కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నాడు. ఈనెల 16వ తేదీన అతనికి బెయిల్ మంజూరైంది. అయితే నిందితుడు అల్మాస్పేట వద్ద గత నెల 9వ తేదీన జరిగిన ఘర్షణలో పాల్గొన్న కొందరు వ్యక్తులకు డబ్బులను ఇచ్చి ఏర్పాటు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు సమాచారం. అతన్ని అల్మాస్పేట ఘటన కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు మోహరించారు. -
అధునాతన గ్రౌండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఐదు రోజులు జరిగే ఏపీఎల్ క్రికెట్ పండుగ బుధవారం ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్ల కోసం ఇప్పటికే గ్రౌండ్ను పలు అభివృద్ధి పనులు చేశారు. దీనికి సంబంధించి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ వర్చువల్గా ప్రారంభించారు. దేశవాళీ మ్యాచ్లను సైతం కడప ఆతిథ్యం ఇవ్వాలని అధ్యక్ష కార్యదర్శులు ఆకాంక్షించారు. స్టేడియంను నూతనంగా రెన్యువెట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ మెరుగైన మ్యాచ్లు నిర్వహిస్తూ మంచి గ్రౌండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నా రు. రాబోయే రోజుల్లో మరింతగా సౌకర్యాలు పెంచి మరిన్ని మ్యాచులు కడప స్టేడియంలో జరిగే విధంగా చూస్తామని భరత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్, సి ఓ ఓ గిరీష్ డోంగ్రి , సీఏఓ జై కిషన్, ఏసీ ఏ గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మెస్ కుమార్, కడప క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముని కుమార్ రెడ్డి, సెక్రటరీ రెడ్డి ప్రసాద్, స్టేడియం కమిటీ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ సంజయ్ కుమార్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఆకట్టుకున్న సునీత ప్రదర్శన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా సినీ నేపధ్య గాయనీ సునీత తన గానమాధుర్యంతో అందరినీ అలరించా రు. సినిమాల్లో ఆలపించిన గీతాలతోపాటు ఇతర పాటలను పాడి అందరిలోనూ ఉత్తేజాన్ని నింపారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ అభివృద్ధి పనులు వర్చువల్గా ప్రారంభం -
ఆటోను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణం
ఒంటిమిట్ట : కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప వైపు వెళుతున్న ఆటోను తిరుపతి వెళుతున్న లారీ ఢీ కొట్టడంతో ఆటో చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో లో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. రేణుకా(27) అనే వివాహిత బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకుని, మండల కేంద్రంలోని దిగువ వీధికి చెందిన షేక్ రఫీ(46) ఆటోలో వన్ మాధవరం, లక్ష్మీపురంలోని తన పుట్టింటికి బయలు దేరింది. ఈ క్రమంలో ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి కల్యాణ వేదిక మొదటి స్వాగత తోరణం వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై బళ్లారి నుంచి శ్రీకాళహస్తి కి ఐరన్ ఓర్ లోడుతో వస్తున్న లారీ ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన రేణుక ను 108లో కడప రిమ్స్కు తరలించారు. రఫీ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదించారు. రఫీ మూడు ఏళ్ల కిందట కువైట్ నుంచి ఇంటికి వచ్చి బతుకు తెరువు కోసం ఆటో తోలుతున్నాడు. ఇతనికి భార్య ఆశ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రేణుకకు ఇటీవల అసిస్టెంట్ రైల్వే లోకో పైలెట్ గా పనిచేస్తున్న విజయభాస్కర్ రెడ్డి తో వివాహమైంది. వీరు ఎర్రగుంట్లలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట వన్ మాధవరం, లక్ష్మీపురంలోని పుట్టింటికి వచ్చి, బుధవారం రామయ్య దర్శనం చేసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఇరుక్కున్న రఫీ మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రత్యేక వాహనంలో కడప రిమ్స్కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
సౌమ్యనాథ స్వామికి రూ.5,93,130 ఆదాయం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించగా రూ.5,93,130 వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. 30 రోజులకు సంబంధించి ఆదాయం లెక్కించినట్లు చెప్పారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి ఏసుదాసు, భక్తులు పాల్గొన్నారు. ఆన్లైన్ రుణం పేరుతో మోసంముద్దనూరు : స్మార్ట్ఫోన్లో ఆన్లైన్ ద్వారా రుణం మంజూరు చేస్తామంటూ ప్రకటన చూసి ఓ ఆటోడ్రైవర్ మోసపోయాడు. స్థానిక పాతవీధికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో రుణ ప్రకటనచూసి హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధిని సంప్రదించాడు.ఆధార్,పాన్కార్డు పంపిస్తే రూ.5లక్షలు రుణం మంజూరు చేస్తామని తెలిపారు.ఇందుకుగాను మొదటి రూ.26వేలు చెల్లించాలని తెలిపారు.ఫోన్ ద్వారా రూ.26వేలు చెల్లించిన తర్వాత మరో విడతో రూ.3వేలు చెల్లించాడు.తన ఖాతాలో సొమ్ము ఎప్పుడు వేస్తారని ఆటోడ్రైవరు సంస్థ ప్రతినిధిని ఆడగ్గా.. మరో రూ.5300లు ఫోన్ఫోచేస్తే 5 నిమిషాల్లో రూ.5లక్షల రుణం మీ ఖాతాల్లో జమ అవుతుందని ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.అయితే అప్పటికే సుమారు రూ.30వేలు నష్టపోయిన ఆటోడ్రైవర్కు పలువురు ఇదంతా మోసమని తెలియజెప్పడంతో బాధితుడు డబ్బునష్టపోవడమే కాకుండా తీవ్ర నిరాశకు గురయ్యాడు. మైదుకూరు ఏఎంసీ కార్యదర్శి సస్పెన్షన్ మైదుకూరు : మైదుకూరు వ్యవసాయ మార్కె ట్ కమిటీ (ఏఎంసీ) కార్యదర్శి పి.వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వెంకటలక్ష్మి అవకతవకలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దువ్వూరు మండలంలోని ఓ ప్రైవేట్ వ్యవసాయ గోదాం విషయంలో ఏఎంసీ కార్యదర్శి అవకతవకలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశాలతో కలెక్టర్ ఆమెను సెస్పండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. -
అదరగొట్టిన ‘లోకల్ బాయ్’
సాక్షి కడప : వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కడప లోకల్ బాయ్ అదరగొట్టాడు. విజయవాడ తరఫున మిడిల్ ఆర్డర్లో బరిలో దిగిన కడపకు చెందిన జహీర్ అబ్బాస్ కేవలం 25 బంతులలోనే నాలుగు 4 సిక్స్లు, మూడు ఫోర్లతో 52 పరుగులు చేశారు.. లోకల్ బాయ్ ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది అబ్బాస్ సిక్స్లు, ఫోర్లు కొట్టినప్పుడల్లా ‘పక్కా లోకల్’ పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఆకట్టుకున్న ‘రోబో’ కడపలోని వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రోబో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా వీఐపీలు వచ్చిన సందర్భంలోనూ.. ఇతర కెప్టెన్లు టాస్కు వెళుతున్న సందర్భంలో రోబో అలా స్టేడియంలో కనిపించి సందడి చేసింది. జహీరో అబ్బాస్ 52 నాటౌట్ (24 బంతుల్లో) సిక్సర్లు 4, ఫోర్లు 3 -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్
సిద్దవటం : ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ నిందితులను అరెస్టు చేసి 11 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్హెగ్డే తెలిపారు. సిద్దవటం మండలం భాకరాపేట వద్ద బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిని ఎస్ఐ హారిక, హెడ్ కానిస్టేబుల్ అంజినాయక్, హోంగార్డు ప్రదీప్కుమార్లు వెంబడించి అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వారు ప్రతిఘటించారన్నారు.హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా సిద్దవటం,ఒంటిమిట్ట, చిత్తూరు జిల్లా బంగారుపాలెం, తిరుపతి జిల్లా భాకరాపేట, తమిళనాడు రాష్ట్రంలోని మహాలింగాపురం, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పోలీస్స్టేషన్లలో కేసులతో పాటు గతంలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు అంగీకరించారన్నారు. నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు, కేటీఎం ద్విచక్రవాహనం, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ప్రధానంగా వృద్ధ మహిళలు, ఒంటరిగా ప్రయాణించే మహిళను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అద్దెకు తీసుకున్న బైక్లను ఉపయోగించడం, నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చడం, హెల్మెట్లు, మాస్కులు ధరించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లెకు చెందిన వెంకటేష్ బాలమురుగన్, తమిళనాడు రాష్ట్రం రామనాధపురం జిల్లాకు చెందిన ముత్తుపాండి ముత్తు రామలింగంలను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిద్దవటం ఎస్ఐ హారికకు, కానిస్టేబుల్ అంజినాయక్, హోంగార్డు ప్రదీప్కుమార్లకు జిల్లా ఎస్పీ నగదు రివార్డు ప్రకటించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, కడప సీసీఎస్ సీఐ హాజీవలి, సిద్దవటం ఎస్ఐ హారిక, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పాత్రధారులకు శిక్షతో సరిపోతుందా!
‘పచ్చ’గా గంజాయి దందా..పెద్దతిప్పసముద్రం/ప్రొద్దుటూరు క్రైం : ఒకప్పుడు సాగునీరు, పాడిపంటలతో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రాయలసీమ గడ్డ.. నేడు మత్తు పదార్థాల వ్యాపారులకు కాసుల వర్షం కురిపించే అడ్డాగా మారుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా విభజన తర్వాత ఏర్పాటైన కడప, అన్నమయ్య జిల్లాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా, వినియోగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెల నుంచి నగరాల నడిబొడ్డు వరకు గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో, పాత నేరస్థులు సైతం ఎటువంటి భయం లేకుండా బెంగళూరు, ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ యువతను సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టి.సదుం క్రాస్ వద్ద 2 కిలోల గంజాయి.. పాత నేరస్థుడికి పచ్చజెండా! అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో తాజాగా జరిగిన గంజాయి పట్టివేత ఉదంతం క్షేత్రస్థాయిలో సాగుతోన్న అక్రమ వ్యాపారానికి నిలువెత్తు అద్దం పడుతోంది. మండలంలోని టి.సదుం క్రాస్ వద్ద పోలీసులు జరిపిన మెరుపు తనిఖీల్లో రెండు కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలోని బెంగళూరు రోడ్డు, గిరిరావ్ వీధికి చెందిన గంగిశెట్టి శివకుమార్ (22) అనే నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడి గత చరిత్రను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గతంలోనూ బెంగళూరులో గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ మదనపల్లి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. ప్రొద్దుటూరు శివారులో 3.5 కిలోల సరుకుతో ’అనిల్’ అరెస్ట్! మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ శివారులోని కొత్తపల్లె సర్కిల్ వద్ద ఎకై ్సజ్ పోలీసులు జరిపిన దాడిలో అంతర్రాష్ట్ర గంజాయి నెట్వర్క్ మరో ముక్క బయటపడింది. ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.నీలకంఠారెడ్డిలు సంయుక్తంగా మైదుకూరు రోడ్డులో తనిఖీలు చేపట్టారు. కొత్తపల్లె సర్కిల్ వద్ద ప్లాస్టిక్ సంచిని చేతిలో పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న పెరుగు అనిల్ కుమార్ అనే యువకుడు, అధికారుల వాహనాలను చూసి అకస్మాత్తుగా పారిపోవడానికి ప్రయత్నించగా ఎకై ్సజ్ సిబ్బంది వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన పెరుగు అనిల్ గతంలో వ్యాపారం చేసేవాడు. ఇటీవల నష్టాలు రావడంతో కుటుంబ పోషణ సాకుతో, సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి దందాలోకి దిగాడు. ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఈ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నట్లు నిందితుడు ఎకై ్సజ్ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 3.5 కిలోల ఎండు గంజాయి విలువ మార్కెట్లో రూ. 40 వేల పైనే ఉంటుందని అధికారులు నిర్ధారించారు. గతంలో భారీ నెట్వర్క్లపై వేటు.. నేడు పాలకుల ఉదాసీనత! కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి ముఠాల కదలికలు కొత్తేమీ కాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పీటీఎం–ములకలచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన సండ్రడవి వద్ద ఏకంగా 104 కిలోల గంజాయితో పాటు 12 మంది నిందితులను వాహనాలతో సహా పట్టుకుని యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.కానీ కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత మళ్లీ పాత నెట్వర్క్లు పుంజుకున్నాయి. అధికార పార్టీ నేతలు జూదం, క్రికెట్ బెట్టింగులు, ఇసుక, మట్టి మాఫియాల్లో మునిగితేలుతూ సొంత లాభాలు చూసుకుంటున్నారే తప్ప, జిల్లాలో యువతను నిర్వీర్యం చేస్తోన్న గంజాయి కట్టడిపై చిత్తశుద్ధి చూపడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ నల్లమందు సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు సిసలైన ’పెద్ద తలకాయల’ను ఎందుకు పట్టుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రెండు జిల్లాలను డ్రగ్స్ రహితంగా మార్చాలంటే కేవలం చిన్న చిన్న పాత్రధారులను కాకుండా, అధికార పార్టీ అండతో చెలరేగిపోతోన్న ప్రధాన గంజాయి మాఫియా డెన్లపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.గ్రామాలకు పాకిన మహమ్మారి.. గాడి తప్పుతున్న యువత! గతంలో కేవలం పెద్దపెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి అమ్మకాలను వ్యాపారస్థులు నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరింపజేశారు. ప్రొద్దుటూరులో పట్టుబడిన అనిల్, పరిసర ప్రాంతాల్లోని కళాశాల విద్యార్థులకు, రోజువారీ కూలీలకు నిత్యం గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. గంజాయి అమ్మకాలు, వినియోగానికి ఊరి చివర ప్రాంతాలు, ప్రహరీ గోడల వెనుక, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా మార్చుకుని విక్రేతలు దర్జాగా దందా సాగిస్తున్నారు. పరిసర మండలాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతుండటంతో యువత మత్తులో మునిగి తేలుతోంది. మత్తుకు బానిసలైన యువత తమ జీవితాలను అర్ధాంతరంగా చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ‘పచ్చ‘నోట్ల కక్కుర్తి కోసం సాగుతున్న ఈ గంజాయి దందా.. పచ్చని జిల్లాల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోంది. పాలకపార్టీలకు చెందిన కొందరు నాయకుల అండతో సాగుతున్న ఈ అక్రమ నెట్వర్క్ను తక్షణమే ఉక్కుపాదంతో అణచివేయకపోతే యువత మత్తు ఊబిలో శాశ్వతంగా కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. కూటమి రాజ్యంలో బార్లా తెరిచిన అంతర్రాష్ట్ర సరిహద్దులు పల్లె పల్లెకూ విస్తరిస్తున్న మహమ్మారి! ఒరిస్సా, బెంగళూరు డ్రగ్స్ మాఫియాతో పాత నేరస్థుల లింకులు వరుస పట్టివేతలతో కదులుతున్న నెట్వర్క్! సూత్రధారులను పట్టుకునేదెన్నడు? -
సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలని పోస్టు కార్డు ఉద్యమం
● దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి వెల్లడి కడప కార్పొరేషన్: దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించలేమని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కోరారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి కడపలో దేశవ్యాప్త పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ 2026 మార్చిలో చింతాడ ఆనంద్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఓ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. చర్చి పాస్టర్ అయిన చింతాడ ఆనంద్ పెట్టిన ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు చెల్లదని తీర్పునివ్వడం బాధాకరమన్నారు. దళితులు చర్చికి పోయినంత మాత్రాన వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పురాదని, సొంత విశ్వాసంతో వారు చర్చికి పోతున్నారన్నారు. చర్చికి పోయే దళితులను బీసీ–సీలుగా గుర్తించడం సరికాదన్నారు. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి తీర్పే వచ్చినప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అసెంబ్లీలో అదే రకమైన తీర్మానం చేశారన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందని దళిత క్రైస్తవులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రం ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ వేయడమో, మరొకటో చేయాల్సి ఉందన్నారు. కానీ కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జైనులు, బౌద్దులు, సిక్కులు మతం మారితే వారి కులం మారడం లేదని.. ఒక్క దళితుల విషయంలోనే ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు పోస్టు కార్డు ద్వారా తెలియజెప్పేందుకు కడప నుంచి తొలిసారిగా పోస్టు కార్డు ఉద్యమం చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా దీనికి మద్దతుగా స్పందన రావాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు సీహెచ్ వినోద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు త్యాగరాజు, సుబ్బరాయుడు, పార్టీ నాయకులు రాయల్ బాబు, డా. పెంచలయ్య, చార్లెస్, దానం, కంచుపాటి బాబు, సంపత్, రత్న కుమారి, సుశీలమ్మ, తులశమ్మ పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
అట్లూరు : ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి సుశాంత్(13) అనే బాలుడు మృతి చెందిన సంఘటన అట్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కమలకూరు గ్రామానికి చెందిన కొర్రపాటి తిరుపాల్, రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుశాంత్, రెండో కుమారుడు సునీల్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇరువురు పిల్లలు గ్రామ సమీపంలో ఉన్న చిన్న చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. ముందుగా సుశాంత్ చెరువులోకి దిగాడు. మునిగిపోతున్న సుశాంత్ను చూసిన సునీల్ గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు తెలిపారు. బంధువులు, స్థానికులు అక్కడికి వెళ్లే సరికి సుశాంత్ మృతి చెందాడు. కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుశాంత్ 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతిలో చేర్పించాలని తల్లిదండ్రులు కలల కన్నారు. ఇంతలోనే ఈత రూపంలో తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ఐటీడీపీ యాప్ ద్వారా ఓట్లు తొలగించే కుట్ర
ప్రొద్దుటూరు : ఐ టీడీపీ యాప్ ద్వారా వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి, తొలగించే కుట్ర జరుగుతోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రారంభమై ఒక్క రోజు మాత్రమే అయిందని, ఆ ఒక్క రోజులోనే టీడీపీ లీలలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ విషయంపై మంగళవారం ఆయన ఏఈఆర్ఓ, తహసీల్దార్ ఉదయకుమార్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైందని, మన ఓటును మనమే సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓటర్లు గతంలో పాలకులను నిర్ణయించేవారని, ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయించి ఎవరి ఓటు ఉండాలి.. ఎవరి ఓటు వద్దు.. అనేది నిర్ణయిస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 800 నుంచి 1,100 ఓట్లు ఉన్నాయని, ఐటీడీపీ యాప్ ద్వారా టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి, ఫాం 7 ద్వారా తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. అమృతానగర్లో బూత్ లెవెల్ అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే చేయకుండా, కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లను పిలిపించుకోవడం సరికాదన్నారు. శంకరాపురంలో బీఎల్ఓ.. టీడీపీ వారు ఉన్న వీధుల్లోకి రావద్దని వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు చెప్పడం సరికాదన్నారు. కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఈవీఎంల ద్వారా తాము ఓటమి పాలయ్యామని, సర్ ద్వారా వచ్చే ఎన్నికల్లో మోసపూరితంగా మళ్లీ తమను ఓడించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. అర్హులైన ఓటర్లను తొలగించిన అధికారులకు ఉరి శిక్ష వేసినా తప్పు కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. సర్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లతోపాటు ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.● ఒక్క రోజులోనే వెలుగులోకి టీడీపీ లీలలు ● ఇళ్ల వద్దకు వెళ్లకుండా ఒకచోట కూర్చొని సర్వే చేయడం సరికాదు ● అర్హులైన ఓటర్లను తొలగించిన వారికి ఉరి శిక్ష వేసినా తప్పులేదు ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపాటు -
‘అంతరార్థం’.. ‘పిండి’తార్థం చెబుతాం!
● అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో సొసైటీపై విచారణకు ఆదేశం ● ‘సాక్షి’ సంచలన కథనానికి ఎండోమెంట్ అధికారుల స్పందన ● క్షేత్రస్థాయికి ఇన్స్పెక్టర్లు ● గుట్టు రట్టవడంతో సొసైటీ సభ్యుల ఉలికిపాటు ● ‘రద్దు చేస్తాం.. రాద్దాంతం వద్దు’ అంటూ బుకాయింపు ● తమ మెడకు చుట్టుకుంటుందని అర్చకుల ఆందోళనప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని చరిత్రాత్మక శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్ ట్రస్టుబోర్డుకు సమాంతరంగా కొందరు ప్రైవేట్ సొసైటీని ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఎండోమెంట్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సాక్షాత్తూ ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకులు సతీష్కుమార్, మహేశ్వర శర్మలు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో దొడ్డిదారిన సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే . ఈ కుట్రలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’అంతరార్థం అగస్త్యేశ్వరునికెరుక’ శీర్షికన ఇచ్చిన కథనం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కథనంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమాలపై ఆరా తీశారు. అడ్డంగా దొరికిపోయి.. రద్దు చేస్తామంటూ బుకాయింపు! ‘సాక్షి’ దెబ్బకు అక్రమ సొసైటీ సూత్రధారుల్లో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. ఆలయ నిధులను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ఈ సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎండోమెంట్ ఉన్నతాధికారులు సదరు కమిటీని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో అడ్డంగా దొరికిపోయిన కొందరు సొసైటీ సభ్యులు.. ‘దీనిపై చర్చించాల్సింది, చెప్పుకోవాల్సింది ఏముంది.. కావాలంటే సొసైటీని రద్దు చేస్తాం, ఎందుకు దీన్ని ఇంతగా రాద్దాంతం చేస్తున్నారు‘ అంటూ భయంతో అధికారుల ముందే బుకాయించినట్లు సమాచారం. అయితే, ఈ సొసైటీ ఏర్పాటు వ్యవహారం ఎండోమెంట్ శాఖలోని కొందరు కిందిస్థాయి అధికారులకు తెలియకుండా జరిగి ఉండదని భక్తులు గట్టిగా ఆరోపిస్తున్నారు. మా మెడకు చుట్టుకుంటుంది.. కొందరు అర్చకుల ఆవేదన! ఇదిలా ఉండగా, ఈ అక్రమ సొసైటీ వ్యవహారం ఆలయ అర్చక వర్గాల్లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా, తమ అంగీకారం తీసుకోకుండా కేవలం చైర్మన్, ప్రధాన అర్చకులు బలవంతంగా తమ పేర్లను సొసైటీలోకి లాగారని కొందరు తోటి అర్చకులు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన కింద ఈ దొంగ సొసైటీ వ్యవహారం ఎక్కడ తమ ఉద్యోగాల మెడకు చుట్టుకుంటుందోనని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించిన అసిస్టెంట్ కమిషనర్ శివాలయంలో వెలుగుచూసిన ఈ సమాంతర ప్రైవేట్ సొసైటీ ఏర్పాటు విషయమై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కర్బాలాజీని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఇన్స్పెక్టర్కు స్పష్టం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు వాస్తవమని తేలితే చైర్మన్, అర్చకులతో సహా బాధ్యులందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య
● వంశీ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ ● ప్రధాన నిందితుడి కోసం గాలింపుకడప అర్బన్ : తన భార్యతో డ్రైవర్ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానంతో యజమాని చింతా రామసుబ్బారెడ్డి మరో ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రాజగోపాల్ వెల్లడించారు. హత్య సంఘటనకు రెండు రోజులు ముందు ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి సింగపూర్ టౌన్షిప్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మరో ముగ్గురు నిందితులైన దేవకుమార్, నాగార్జున, శ్రీనివాసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఈ నెల10వ తేదీ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామసుబ్బారెడ్డి తన సహచరులతో వంశీని సదరు ఇంటికి పిలిపించుకుని కత్తులతో దారుణంగా హత్య చేశారు. తన భార్య మధురవాణితో కారు డ్రైవర్ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానం పెనుభూతంగా మారింది. వంశీ, మధురవాణిలు వ్యాపార నిమిత్తం వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు పది రోజులు కానీ, 20 రోజులు అక్కడే ఉండి కలిసి ఉంటున్నట్లు, అలాగే తన పిల్లలు, తన భార్య కూడా రామసుబ్బారెడ్డి మాట వినకుండా, డ్రైవర్ వంశీనే మంచోడు అని చెబుతూ కుటుంబ సభ్యులందరూ లెక్క చేయకపోవడంతో అది చూసి ఓర్చుకోలేకపోయాడు. రామసుబ్బారెడ్డి ఎలాగైనా డ్రైవర్ వంశీని అడ్డు తొలగించాలనుకున్నాడు. తనకు తెలిసిన బుడ్డాయపల్లెకు చెందిన దేవకుమార్, మోడీమీదిపల్లికి చెందిన నాగార్జున, శ్రీనివాసులు సహాయం తీసుకున్నాడు. పక్కా స్కెచ్ వేశారు. పథకం ప్రకారం హత్యకు ప్లాన్ వేసి అతన్ని సింగపూర్ టౌన్షిప్లోని ఒక ఇంటిలోనికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని ఒంటిమిట్ట మండలం సాలాబాదు రోడ్డులోని సోమశిల జలాలకు దగ్గరలో గుర్తుతెలియని ప్రదేశంలో కొండ దగ్గర పడేశారు. ఈ హత్య కేసులో దేవకుమార్, నాగార్జున, శ్రీనివాసులును అరెస్టు చేసి వారి వద్ద నుంచి, రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, రెండు రాడ్లు ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు పంపించారు. ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఛిద్రమవుతున్న చిత్రావతి
● అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు ● కూటమి నాయకుల దందా ● పట్టించుకోని అధికారులులింగాల : లింగాల మండలం పార్నపల్లె సమీపంలోని చిత్రావతి నది ఛిద్రమవుతోంది. కూటమి నాయకులు యథేచ్ఛగా ఇసుకను భారీ యంత్రాలు, టిప్పర్లతో తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూటమి నాయకుల దందా కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిఘా కొరవడింది. దీంతో పార్నపల్లె చిత్రావతి నదిలో ఇసుక రీచ్ లేకపోయినా అక్రమంగా రాత్రి సమయంలో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. చిత్రావతి నది బ్రిడ్జి సమీపంలో టన్నుల కొద్ది ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తుండటంతో బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పార్నపల్లె గ్రామ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీబీఆర్ బ్రిడ్జి వద్ద పోలీసు చెక్పోస్టు, సీసీ కెమెరాల నిఘా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు చెక్పోస్ట్ ఎత్తేసి సీసీ కెమెరాలు తొలగించారు. దీంతో నిఘా కొరవడింది. అటు భూగర్భగనుల శాఖ అధికారుల పర్యవేక్షణ శూన్యంగా మారింది. ప్రతి రోజు రాత్రి 10 గంటల తర్వాత భారీ పొక్లెయిన్లు చిత్రావతి నదిలోకి తీసుకెళ్లి భారీ టిప్పర్లతో టన్నులకొద్ది ఇసుకను తవ్వుతున్నారు. టిప్పర్ల ద్వారా సమీపంలో ఓ కంపెనీ వారు నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రానికి, రాష్ట్ర సరిహద్దులు దాటి కర్ణాటక రాష్ట్రానికి కూడా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుకను అరికడతామని, వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. చేసిందేమీ లేదన్నారు. భారీ ఎత్తున ఇసుక తరలుతున్నా భూగర్భ గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తుండటంతో ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చిత్రావతి బ్రిడ్జికే కాక, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి నాయకులు ఇసుకను భారీ తరలించి జేబులు నింపుకొంటున్నారు. పరిసర గ్రామాల రైతులు తట్టెడు ఇసుకను గృహ అవసరాలకు తీసుకెళ్లాలన్నా భయాందోళనకు గురవుతున్నారు. అయితే కూటమి నాయకులు యథేచ్ఛగా టన్నులకొద్ది ఇసుకను తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అక్రమ ఇసుక తవ్వకాలను అధికారులు ఆపివేయకపోతే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యం అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్లో జరిగిన రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ చోరీ కేసులో ఎట్టకేలకు త్రీ టౌన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ మెగా స్కామ్లో ప్రధాన నిందితుడు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యంను పోలీసులు సోమవారం రాత్రి అధికారికంగా అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్ నుంచి ఇటీవల సుమారు 268.71 టన్నుల ప్రభుత్వ ఐరన్ మాయమైంది. ఈ గోడౌన్కు ఇన్చార్జిగా ఉన్న ఏఈ సుబ్రమణ్యం ప్రమేయం లేకుండా ఇంత భారీ ఎత్తున ఐరన్ పక్కదారి పట్టే అవకాశం లేదని నిర్ధారించిన హౌసింగ్ పీడీ రాజారత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26న త్రీ టౌన్ పోలీసులు ఏఈపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఏఈ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినప్పటికీ ఏఈ సుబ్రమణ్యం పోలీసుల విచారణకు అస్సలు సహకరించడం లేదని సమాచారం. ఇనుమును ఎక్కడకి తరలించారు, ఎవరికి విక్రయించారు అనే ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులకు ఈ విచారణ సవాల్గా మారింది. దీంతో పూర్తి నిజాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెద్దల గుండెల్లో రైళ్లు.. బయటపడనున్న అసలు సూత్రధారులు కొన్ని రోజుల క్రితం ఏఈ సుబ్రమణ్యం ఒక వీడియో విడుదల చేస్తూ, ఈ ఐరన్ చోరీ వెనుక కొంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రస్తుత పోలీసు విచారణలో కూడా కొందరు హౌసింగ్ అధికారులతో పాటు బయటి వ్యక్తుల పేర్లను ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితులను కూడా పోలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. వీరంతా నోరు విప్పితే హౌసింగ్ శాఖలోని పెద్ద తిమింగలాల పాత్రతో పాటు ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. రూ.1.70 కోట్ల ఐరన్ చోరీ కేసు రూరల్ హౌసింగ్ గోడౌన్లో 268 టన్నుల ఇనుము మాయం కడప సెంట్రల్ జైలుకు తరలింపు నోరు విప్పని నిందితుడు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు త్రీటౌన్ పోలీసుల కసరత్తు కీలక అధికారుల పాత్రపై ఏఈ ఆరోపణలు త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం -
మాకు న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : తమ ఇంటిని తెలియకుండా ఇతరులకు అమ్మడమే కాకుండా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి బారి నుంచి కాపాడి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మస్తాన్, ఆయన కుటుంబ సభ్యులు కోరారు. మంగళవారం వారు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరం భవానినగర్ అక్కాయపల్లె ప్రాంతంలో తాము 40 ఏళ్లుగా నివాసముంటున్నామన్నారు. అయితే వైద్య శాఖలో పని చేస్తున్న శ్రీదేవి అనే మహిళ ఇంటికి లోను ఇప్పించగా, 2017 నుంచి 2020 వరకు తాను లోను కట్టానని తెలిపారు. ఆ తర్వాత శ్రీదేవి మిగిలిన రుణాన్ని చెల్లించి ఇంటిని ఇతరులకు విక్రయించడం జరిగిందన్నారు. రుణం మంజూరు సందర్భంగా తాను ఐదు లక్షల వరకు కమీషన్ సైతం ఇవ్వడమే కాకుండా క్రమం తప్పక ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా శివ అనే యువకుడితోపాటు కొంత మంది అల్లరి మూకల కారణంగా తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామన్నారు. తమ ఇంటికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వివరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు తమ విషయంపై విచారణ చేసి, అల్లరి మూకల నుంచి తమను కాపాడాలని, తమ ఇంటిని తిరిగి తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుడు మస్తాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ కళా జాగృతి బృందం నాటక ప్రదర్శనచింతకొమ్మదిన్నె : జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం సీఎంఆర్ పల్లె సమీపంలోని అంగడివీధిలో పోలీస్ కళా–జాగృతి బృందం ఇన్చార్జ్ నరసరామ్ బృందంచే ‘ఓ యువతా... మేలుకో’ నాటక, పాటల ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ మత్తుపదార్థాల వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, సమాజంలోని రుగ్మతలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. మత్తు పదార్థాల ఆచూకీ తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఈగల్ టీం అధికారులు ఆయూబ్ ఖాన్, గురుశేఖర్, చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగని మోటారు వైర్ల చోరీలుబి.కోడూరు : మండలంలో కొంత కాలంగా వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురవుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రభలవీడు, నర్సయ్యకొట్టాలు, పెద్దుళ్లపల్లె గ్రామాల్లో గతంలో కేబుల్ వైర్లు దొంగలిస్తున్న దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించినా చోరీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సోమవారం రాత్రి ఐత్రంపేట గ్రామంలో కూడా ఎనిమిది మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. దీంతో మండలంలోని రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కేబుల్ వైర్లను చోరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. -
అనుమానం నిజమైంది.. ‘సర్’లో పారదర్శకత లోపించింది. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేల ఓట్లే, ఇంటి పేర్లే గల్లంతవడం చూసి సామాన్య ఓటరులో కలవరం మొదలైంది. ఓట్ల జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో జరుగుతున్నా.. పట్టపగలు పచ్చ నేతలు ఓటు పేరిట డేటా చోరీ చేస్తున్నా అధికార యంత్రా
● ఐటీడీపీ యాప్ ద్వారా వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు స్కెచ్: రాచమల్లు ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా గృహ నంబర్లే గల్లంతు ● మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓటు మాయం ● తమ ఓటుహక్కు ఎక్కడ పోతుందోనని మైనార్టీల్లో తీవ్ర భయాందోళనలు ● సచివాలయాల వద్ద ప్రజల క్యూలు కడప సెవెన్రోడ్స్: జిల్లాలో సాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని చూస్తుంటే.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు, సానుభూతిపరుల ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకేనన్న అనుమానాలు పతాకస్థాయిలో బలపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రక్రియలో సాక్షాత్తు మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా సొంత నివాస గృహ నంబర్లు, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం ఇందుకు గట్టి బలాన్ని చేకూరుస్తోంది. నియోజకవర్గాల్లోని కీలక అగ్రనేతల ఓట్లకే దిక్కులేకపోవడంతో సామాన్య ఓటర్లు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఓటుహక్కు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని తీవ్ర ఆందోళనలతో వార్డు, గ్రామ సచివాలయాల వద్దకు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. ఐటీడీపీ యాప్తో ఓట్ల వేట.. ఆర్ఓకు రాచమల్లు ఫిర్యాదు! ఈ ఓట్ల తొలగింపు కుట్రల వెనుక డిజిటల్ మాఫియా నడుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మంగళవారం ఆయన ప్రొద్దుటూరు ఏఈ ఆర్ఓ విజయభాస్కర్రాజుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారిక ‘ఐటీడీపీ’ యాప్ను ఉపయోగించి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి, వారి ఓట్లను టార్గెట్ చేసి తొలగించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంటింటి పరిశీలనలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ‘సర్’ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కమలాపురం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఉత్తమారెడ్డి, టౌన్ కన్వీనర్ గంగారెడ్డి తదితరులు కమలాపురం తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ముస్లిం మైనార్టీల్లో ‘సర్’ కలకలం ç³Õa-Ð]l$-»ñæ…-V>ÌŒæ, ½àÆŠæ, E™èl¢-Æý‡{ç³-§ólÔŒæ, ™èlÑ$-âýæ-¯éyýl$ Æ>[ÚëtÌZÏ VýS™èl…ÌZ fÇ-W¯]l A¯]l$-¿ýæÐéÌS ¯ól糫§ýlÅ…ÌZ OÐðl$¯éÈ-tÌS Krϯ]l$ ¿êÈV> ™öÌS-W…-^ól…-§ýl$MóS MýS*rÑ$ {糿¶æ$™èlÓ… D çܯЇ M>Æý‡Å-{MýS-Ð]l*°² Aç܈…V> Ðéyýl$-MýS$…-sZ…-§ýl¯ól ºÌS-OÐðl$¯]l B…§øâýæ¯]l Ð]l¬QÅ…V> Ð]l¬íÜÏ… OÐðl$¯é-Èt Ð]lÆ>YÌZÏ Ð]lÅMýS¢-Ð]l$-Ð]l#-™ø…-¨. ©…™ø C…sìæ…sìæ G¯]l$ÅÐ]l$-Æó‡çÙ¯ŒS {´ëÆý‡…¿ýæ… M>MýS-Ð]l¬…§ól ç³Ë$Ð]l#Æý‡$ Ð]l¬íÜÏ… ¯ól™èlË$ 2002 ¯ésìæ KrÆý‡Ï gê¼-™éË$ ¡çÜ$MýS$° „óS{™èl-Ýë¦-Ƈ$$ÌZ {ç³f-ÌSMýS$ AÐ]l-V>-çßæ¯]l MýSÍ-µçÜ*¢ çÜçßæ-MýS-Ç-çÜ$¢-¯é²Æý‡$. C™èlÆý‡ Ð]lÆ>YÌSMýS$ ^ðl…¨¯]l KrÆý‡$Ï MýS*yé ÐéÇ Ð]l§ýlªMýS$ ÐðlãÏ ™èlÐ]l$ KrÏ çÜÐ]l*-^éÆý‡… ™ðlË$-çÜ$-MýS$…-r$-¯é²Æý‡$. ½G-ÌŒæ-KË$ C…sìæ…sìæ ç³Ç-Ö-ÌS¯]lMýS$ Ð]l_a¯]l çÜ…§ýl-Æý‡Â…ÌZ {ç³fË$ MýS*yé A…§ýl$»ê-r$ÌZ E…yìl gê{VýS-™èl¢V> G¯]l*Å-Ð]l$-Æó‡-çÙ¯ŒS ¸ëÆ>Ë$ ç³NÇ…_ çÜÐ]l$-Ç-µ…-^éÍÞ E…r$…-¨. {ç³fË$ C糚yýl$ gê{VýS™èl¢V> E…yýl-MýS´ù™ól Æ>¯]l$¯]l² G°²-MýSÌZÏ Kr$-çßæ-MýS$P¯]l$ Ô>ÔèæÓ-™èl…V> MøÌZµÄôæ$ {ç³Ð]l*§ýl… E…§ýl° Æ>f-MîSĶæ$ ÑÔóæÏçÙ-MýS$Ë$ òßæ^èla-Ç-çÜ$¢-¯é²Æý‡$. Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ Æý‡-Ò…-{§ýl-¯é£Šl-Æð‡yìlz, Ð]l*i yìlç³NÅsîæ ïÜG… A…f-§Šæ-»ê-Úë, GÐðl$Ã-ÎÞ G…Ò Æ>Ð]l$-^èl…-{§éÆð‡yìlz, Ð]l*i Ðól$Ķæ$ÆŠ‡ ´ëM> çÜ$Æó‡‹Ù ™èl¨-™èlÆý‡ ¯ól™èlÌS º–…§ýl… hÌêÏ MýSÌñæMýStÆŠ‡ yéMýStÆŠ‡ }«§ýlÆŠ‡ ^ðlÆý‡$-MýS*ǰ MýSÍíÜ D A{MýS-Ð]l*ÌSOò³ íœÆ>ŧýl$ ^ólÔ>Æý‡$. {糿¶æ$™èlÓ A«¨-M>-Æý‡$Ë$ M>MýS$…yé sîæyîlï³ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ KrÆý‡Ï ÍçÜ$t-ÌS™ø †Æý‡-VýS-yýl…Oò³ Ñ^é-Æý‡×æ fÆý‡´ë-ÌS-°, çܯЇ M>Æý‡Å-{MýS-Ð]l*°² ి ´ëÆý‡-§ýl-Æý‡Ø-MýS…V> fÆý‡-V>ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. కడప నగరం బీకేఎం వీధిలోని ఇంటి నెంబరు 19/420లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా నివాసం ఉంటున్నారు. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. అయితే, ప్రస్తుత 2002 సర్ జాబితాలో ఆయన నివాస గృహ నంబరుతో పాటు వరుసగా మరో నాలుగు ఇంటి నంబర్లు మాయమయ్యాయి. తద్వారా ఆ ఇళ్లలోని ఓట్లను డిలీట్ చేయడానికి పక్కా స్కెచ్ వేశారని స్పష్టమవుతోంది. దీనిపై అంజద్బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు పతాకస్థాయికి చేరాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి స్వగ్రామమైన నక్కలదిన్నెలో ఆయన పేరుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు 2002 ఓటర్ల జాబితాలో పూర్తిగా గల్లంతయ్యాయి. చాపాడు మండలం చిన్నగులువలూరు గ్రామంలో రఘురామిరెడ్డి కుమారుడు, కోడలి ఓట్లను కూడా అక్రమంగా డిలీట్ చేశారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో మరో గ్రామానికి చెందిన పేర్లను చొప్పించి గందరగోళం సృష్టిస్తున్నారని రఘురామిరెడ్డి అధికార యంత్రాంగంపై ధ్వజమెత్తారు. -
ఏపీఎల్కు సర్వం సిద్ధం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలో తొలిసారిగా నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్–5 మ్యాచ్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏసీఏ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు భరత్రెడ్డి తెలిపారు. మంగళవారం నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయన్నారు. రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ మ్యాచ్లను జిల్లా ప్రజలు వీక్షించి ప్రోత్సహించాలన్నారు. ఈ మ్యాచ్ల్లో కడపకు చెందిన 9 మంది క్రీడాకారులు ఆడనున్నట్లు వివరించారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, ఉచితంగా మ్యాచ్లను వీక్షించవచ్చని తెలిపారు. బీసీసీఐ మెంబర్ చాముండేశ్వరినాథ్తో పాటు ఏసీఏ నుంచి పలువురు పెద్దలు హాజరు కానున్నారన్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ సీఈఓ గిరీష్ గోగ్రే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్ గ్యారీ స్టేడ్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డిప్రసాద్, అధ్యక్షుడు మునికుమార్రెడ్డి, స్టేడియం కమిటీ మెంబర్ సంజయ్కుమార్ పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహిళలు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను నేర్చుకుని వాటి ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని ఇందిరా మహిళా మండలి ప్రెసిడెంట్ వైఎస్ భారతీరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలో గల రిమ్స్ సమీపంలోని ఇందిరా మహిళా మండలిలో మొదటి విడత ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులు మూడు నెలలు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా మహిళా మండలి ద్వారా పేద ప్రజలకు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతోందన్నారు. టైలరింగ్తోపాటు ఇతర శిక్షణా కార్యక్రమాలను మహిళలు ఎంత మంది అయినా వచ్చి ఉచితంగా నేర్చుకోవచ్చన్నారు. అనంతరం దాదాపు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను పూర్తి చేసుకున్న 40 మంది మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా మండలి ట్రైనింగ్ ఇన్చార్జి సరస్వతమ్మ, మెంబర్లు ఎ.సుశీలమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
ఈ వంతెనల కథ అంతేనా !
● కూటమి సర్కారు రాజకీయ కక్షతో స్తంభించిన రూ.76 కోట్ల ఆర్అండ్బీ ప్రాజెక్టులు ● కె.రాజుపల్లె వంతెన పూర్తయి రెండేళ్లయినా అప్రోచ్ రోడ్డు కరవు ● రైతులకు చెల్లించని పరిహారం ● జగనన్న హయాంలో పూర్తయిన ‘గండి కొవ్వూరు’ వంతెన చక్రాయపేట: వర్షాకాలం ముంచుకొస్తున్నా పాపాఘ్ని నదీతీర ప్రాంత వాసుల ప్రయాణ కష్టాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది. గత జగనన్న పాలనలో నదీతీర గ్రామాల భయాలను పారదోలుతూ శాశ్వత పరిష్కారం కోసం ఆఘమేఘాలపై వంతెనల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా.. నేటి పాలకుల రాజకీయ కక్ష, నిర్లక్ష్యం వల్ల నిధులున్నా పనులు నిలిచిపోయి వంతెనల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జగనన్న సర్కారు మాస్టర్ ప్లాన్.. కూటమి బ్రేకులు 2020 వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి రూ.76 కోట్ల భారీ నిధులతో హైలెవెల్ వంతెనల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా కుప్పం – కె.రాజుపల్లెల మధ్య రూ.23 కోట్లతో నిర్మించిన వంతెన వైఎస్సార్సీపీ హయాంలోనే రికార్డు స్థాయిలో పూర్తయింది. అయితే, అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన 4.73 సెంట్ల భూములకు సంబంధించిన రైతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో అప్రోచ్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. బ్రిడ్జి పూర్తయి రెండేళ్లు దాటుతున్నా కూటమి నేతలు ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంతో, రానున్న వర్షాకాలంలో రాకపోకలు మళ్లీ స్తంభించడం ఖాయంగా కనిపిస్తోంది. నత్తనడకన అద్దాలమర్రి.. మరోవైపు, వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసి ప్రారంభించిన అద్దాలమర్రి బ్రిడ్జి పనులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత రెండేళ్లుగా ఇక్కడ కేవలం 50 శాతం మేర మాత్రమే పనులు జరిగాయని స్థానికులు వాపోతున్నారు. ఇదే సమయంలో, గత ప్రభుత్వంలో పీఎంజీఎస్వై కింద రూ.28.5 కోట్ల కేంద్ర నిధులతో శ్రీకారం చుట్టిన గండి కొవ్వూరు–వెన్నపల్లె వంతెన పనులను కాంట్రాక్టర్ ఏడాదిలోనే పూర్తి చేశారు. కేంద్ర నిధులు కావడంతోనే కూటమి ప్రభుత్వం ఇక్కడ వివక్ష చూపలేకపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. -
చికెన్ వ్యర్థాలనూ వదలని నేతలు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాల వ్యాపారానికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కాంట్రాక్టర్లు మారుతున్నారు. ఆదాయం కోసం పోటీపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ వ్యర్థాలను తమ పార్టీ నాయకుడికి ఇవ్వాలని స్థానిక అధికార పార్టీ నేతలు సిఫారసు చేశారు. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఏకంగా చికెన్ సెంటర్ల యజమానులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రొద్దుటూరులో సుమారు వందకుపైగా చికెన్ షాపులు ఉన్నాయి. చికెన్ తయారు చేసేటప్పుడు వెలువడే వ్యర్థాలను షాపుల యజమానులు భద్రపరచడం, కాంట్రాక్టర్లు వీటిని వ్యాన్ల ద్వారా తరలించడం జరుగుతోంది. ఈ వ్యర్థాలను గతంలో మైలవరానికి చెందిన కాంట్రాక్టర్ తీసుకెళ్లేవారు. ఏడాది కిందట నంద్యాలకు చెందిన కాంట్రాక్టర్ అనధికారికంగా పోటీపడి వ్యాపారం దక్కించుకున్నారు. చికెన్ వ్యర్థాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఏడాది పాటు అనుమతి పట్టణంలో చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను మంగదొడ్డి ఓబులేసుకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గత నెల 29న చికెన్ షాపుల యజమానులకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు ఏడాది పాటు ఈ కాంట్రాక్టర్కు అనుమతి ఇచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సాధారణంగా కాంట్రాక్టర్ వాహనం ఏర్పాటు చేసుకుని వ్యర్థాలను తరలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాంట్రాక్టర్ అధికార పార్టీ నేత కావడంతో.. ఆ వాహనానికి ఏకంగా మున్సిపాలిటీ స్టిక్కర్ అతికించుకుని వ్యర్థాలను తరలిస్తున్నారు. వాహనం చూసిన వారంతా మున్సిపల్ సిబ్బంది వీటిని తరలిస్తున్నారేమోనని చర్చించుకుంటున్నారు. ఎందుకు ఈ స్టిక్కర్ అతికించారని మున్సిపాలిటీ సిబ్బందిని ప్రజలు ప్రశ్నిస్తుండగా.. కమిషనర్ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. పట్టణంలోని చికెన్ షాపుల వారు పురపాలక సంఘం వారికి సహకరించి ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అంటువ్యాధులు వ్యాపించకుండా సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని సుమారుకు వందకుపైగా చికెన్ షాపుల నుంచి టన్నుల కొద్ది ఉత్పత్తి అయ్యే చికెన్ వ్యర్థాలను కాంట్రాక్టర్ సేకరిస్తున్నారు. వీటిని చేపలకు ఆహారంగా వినియోగించేందుకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మా వారికే ఇవ్వండి అధికార పార్టీ నాయకుడి ఆదేశాలు సర్క్యులర్ జారీ చేసిన కమిషనర్ మున్సిపాలిటీ స్టిక్కర్తో రవాణాకాలుష్యాన్ని తగ్గించేందుకే.. పట్టణంలోని చాలా మంది చికెన్ సెంటర్ యజమానులు చికెన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ కాలువల్లో, రోడ్లపై వేస్తున్నారు. ఈ కారణంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు ఆయనకు అప్పగించాం. ఇందుకు ఎలాంటి టెండర్లు పిలువలేదు. పలు మున్సిపాలిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేశారు. వ్యాన్కు ఉన్న మున్సిపాలిటీ స్టిక్కర్ను తొలగిస్తాం. – రవిచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు. -
గురుకులంలో గందరగోళం
కడప రూరల్ : కడప చిన్నచౌక్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించగా.. ప్రవేశ పరీక్ష రాసిన వారితోపాటు పరీక్ష రాయని వారు కూడా హాజరయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఆ పాఠశాల సిబ్బంది మొదట ప్రవేశ పరీక్షలు రాసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఖాళీలు ఉంటే మిగతా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాత్రం అందరికీ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడంతోనే వచ్చామని తెలిపారు. కాగా 8,9వ తరగతి విద్యార్థులకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సిబ్బంది చెప్పడంతో, కౌన్సిలింగ్కు వచ్చినవారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చామని, మళ్లీ కౌన్సెలింగ్కు రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని పలువురు వాపోయారు. కాగా చిన్న చౌక్ కడప నగరానికి కాస్త దూరంగా ఉండటంతో కౌన్సెలింగ్కు వచ్చిన పిల్లలు, పెద్దలు ఆహారానికి, తాగునీటికు ఇబ్బంది పడ్డారు. కౌన్సెలింగ్కు హాజరైన వారిలో ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ విషయమై ఆ శాఖ జిల్లా కోఆర్డినేటర్ ఉదయశ్రీ ని ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు !
కడప సెవెన్రోడ్స్ : జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ‘నీట్’ పరీక్ష నిర్వహణపై ఎస్పీనచికేత్ విశ్వనాథ్, డీఆర్వో మల్లికార్జునుడు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా కడపలో 8 కేంద్రాలు, ప్రొద్దుటూరులో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 264 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లుతెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ నీట్ (యూజీ)–2026 పరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, పరీక్ష నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప, ప్రొద్దుటూరు సిటీ కో ఆర్డినేటర్స్ మునీష్ మీనా, జయచంద్రా రెడ్డి, పోలీసు, రెవెన్యూ, ఏపీఎస్పీడిసిఎల్, మెడికల్, లేబర్, డిసేబుల్, పోస్టల్ తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వాధీన సామగ్రి భద్రతపై ప్రత్యేక దృష్టి ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తు సామగ్రి భద్రత కోసం జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్రక్క్ఆ హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ ఎస్. కమలాకర రెడ్డి సంబంధిత న్యాయమూర్తులతో కలిసి.. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) చట్టం కింద స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల భద్రత కోసం జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న శాశ్వత నిల్వ కేంద్రాల నిర్మాణ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై జిల్లాలో ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువుల తాత్కాలిక, శాశ్వత భద్రతా ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలు, నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
నేడు డీఆర్సీ సమావేశం
కడప సెవెన్రోడ్స్ : కడప కలెక్టరేట్ లోని ిపీజీఆర్ఎస్ హాలులో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. దర్గాలో ప్రార్థనలు జమ్మలమడుగు రూరల్: పట్టణంలోని ఆస్థాన యే గౌసియా దర్గాను ఐపీఎస్ అధికారిణి షేక్. షీరిన్ బేగం మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా పీఠాధిపతి సయ్యద్ షా గౌస్పీరా ఖాద్రీ ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఆమె విజయవాడ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్ గౌస్, జహంగీర్ భాష, మూగ్దుమ్ సాబ్రి, రజాక్ పీర్, చాపాడు మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీపీపీలో క్వార్టర్స్ ప్రక్షాళనకు శ్రీకారం ఎర్రగుంట్ల : మండల పరిధి డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని క్వార్టర్స్ ప్రక్షాళనకు యజమాన్యం శ్రీకారం చుట్టింది. క్వార్టర్స్లో నివాసం ఉండే బయటి వ్యక్తులు, ఇతరులు వెంటనే ఖాళీ చేయాలని మెయింటెనెన్స్ విభాగ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్టీపీపీలో 1420 మంది దాకా అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరితోపాటు కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 1650 మంది పని చేస్తున్నారు. వీరి నివాసం కోసం వీవీరెడ్డి కాలనీలో 1739 క్వార్టర్స్ నిర్మించారు. అయితే కొందరు అధికారుల, ఉద్యోగులు బాడుగకు ఇచ్చి ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులు వెంటనే ఖాళీ చేయాలని 125 మందికి ఆర్టీపీపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు పది రోజుల్లోగా ఖాళీ చేయాలని నోటీసులలో పేర్కొన్నట్లు ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు తెలిపారు. ఫైనాన్స్ వారి వేధింపులతో ఆత్మహత్యాయత్నం చాపాడు : మండల పరిధిలోని రేపల్లె గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రేపల్లెకు చెందిన కంభంపాటి రామాంజనేయులు గ్రామంలోని తన ఇంటికి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్లో హౌస్ లోన్ పొందాడు. కొన్నేళ్లుగా పెండింగ్ లేకుండా కంతులు కడుతూ ఉండగా ప్రస్తుతం రెండు కంతులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ వారు తరచుగా ఇంటి వద్దకు వచ్చి మహిళలపై ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన తన భర్త పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రామాంజనేయులు భార్య శ్రీలత తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల పారదర్శకత, రోగులకు అందించే వైద్య సదుపాయల నాణ్యతను పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో క్షయ రోగులకు అందుతున్న సేవల రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రఫీక్ ఫాషా తదితరులు పాల్గోన్నారు. మొహర్రం మాసం ప్రారంభంచిన్నమండెం : నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం నుంచి మొహర్రం మాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు చిన్నమండెం మండల కేంద్రంలో గంధపు పీర్లను నిలబెట్టారు. మండల కేంద్రంలోని పీర్లమకాన్లో గంధపు పీర్లను నిలబెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటి నుంచి పది రోజుల పాటు మొహర్రం వేడుకలను నిర్వహించనున్నారు. -
ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ‘సర్’ చిత్ర విచిత్రాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘సర్’ ప్రక్రియలో చిత్ర విచిత్రాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటు 2002 జాబితాలో గల్లంతయ్యింది. అంజాద్ బాషా కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. అంజాద్ బాషా ఇంటి పక్కన ఉన్న నాలుగు ఇళ్ల ఓట్లు కూడా గల్లంతు కావడంతో జిల్లా కలెక్టర్కు అంజాద్ బాషా ఫిర్యాదు చేశారు.‘‘నేను పుట్టినప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నా.. ఓట్లు ఎలా మాయమవుతాయి?. 2002 ఓటర్ల జాబితాలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓటు కూడా మిస్ అయ్యింది. వెంటనే జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.శెట్టిపల్లి ఇంటిపేరు ఉన్న అందరికి పేర్లు మాయమయ్యాయి. 2002లో ఎమ్మెల్యేగా చేసిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి.. జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరే లేకపోవడంతో అవాక్కవుతున్నారు. నక్కలదిన్నెలో రఘురామిరెడ్డి కొన్నేళ్లుగా ఓటు వేస్తున్నారు. పక్క గ్రామం ఖాదర్పల్లి బూత్లోకి ఓటు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు. -
పాలకులకు సైట్.. పింఛన్లు క్లోజ్
పాత పింఛన్లే దిక్కు.. ఎన్నికల హామీలపై మౌనం !● ప్రభుత్వ పింఛన్ల వెబ్సైట్ మూసివేత ● ‘రీ వెరిఫికేషన్’ పేరిట 4 వేల దివ్యాంగుల పింఛన్లకు కోత కాశినాయన: కూటమి సర్కార్లో కొత్త పింఛన్ల మంజూరు దేవుడెరుగు కానీ, ప్రస్తుతం వస్తున్న పాత పింఛన్లను కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో ప్రభుత్వం ఊడబీకుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన పేదలు, ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్లను సైతం వెరిఫికేషన్ సాకుతో తీసేస్తుండటంతో సామాజిక పింఛన్దారులలో తీవ్ర భయాందోళనలు, అసహనం వ్యక్తమవుతున్నాయి. 4 వేల దివ్యాంగ పింఛన్ల కట్.. కడప, ప్రొద్దుటూరుకు తిప్పలు! సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం మొదట దివ్యాంగులను లక్ష్యంగా చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4,000 మంది దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరిట నిలిపివేసి ఘోర అన్యాయం చేశారు. అర్హులైన దివ్యాంగ పింఛన్దారులకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నోటీసులు ఇస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ నోటీసుల ప్రకారం రీ వెరిఫికేషన్ కోసం కడప రిమ్స్ లేదా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులలోని మెడికల్ బోర్డుల (సదరం క్యాంపుల) చుట్టూ తిరగాలని అధికారులు నిబంధనలు పెడుతున్నారు. తీవ్రమైన శారీరక వైకల్యంతో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులు అంతదూరం ప్రయాణాలు చేయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. రెండేళ్లయినా తెరచుకోని వెబ్సైట్.. సిబ్బంది అవస్థలు! ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో నిలిపివేసిన పింఛన్ల వెబ్సైట్ను, కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయినా ఇప్పటికీ తెరవకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, వికలాంగులు ఆశతో గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు. అయితే సైట్ ఓపెన్ కాలేదని చెప్పడానికి సచివాలయ సిబ్బంది సైతం చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఎవరైనా వృద్ధులు కార్యాలయం బయట కనిపిస్తే ఏం సమాధానం చెప్పాలా అని సిబ్బంది మదనపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సర్దిచెప్పే సమాధానం ఇచ్చి పంపిస్తుండటంతో, లబ్ధిదారులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. గతంలో నిరంతర ప్రక్రియ.. నేడు గగనం! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియలా సాగేది. అప్పట్లో పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి గ్రామ వలంటీర్లే నేరుగా దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్ చేసేవారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి ఆరు నెలలకోసారి (జూన్, డిసెంబర్లలో) క్రమం తప్పకుండా కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్సైట్ను పూర్తిగా నిలిపివేయడంతో అర్హులైన వారు నిత్యం సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల్లో పనికాకపోవడంతో, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో సైతం పింఛన్లు మంజూరు చేయాలంటూ వేలాదిగా అర్జీలు సమర్పిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2,55,719 పింఛన్లు లబ్ధిదారులకు అందుతున్నాయి. అయితే, ఈ పింఛన్లన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. ప్రస్తుతం సచివాలయాల్లో కేవలం ఒకే ఒక రకమైన పింఛన్ ప్రక్రియ మాత్రమే సాగుతోంది. అదేమిటంటే.. ఇప్పటికే పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే, అతడి వారసత్వంగా ఆ పింఛన్ను భార్యకు బదిలీ చేసి ఇస్తున్నారు తప్ప కొత్తగా అర్హత సాధించిన ఎవ్వరికీ నూతన పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు, తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన కీలక హామీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ఉన్న పింఛన్లను తొలగించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు, వృద్ధులకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
అంతరార్థం అగస్య్తేశ్వరునికెరుక !
● ప్రొద్దుటూరు శివాలయంలో సమాంతర సొసైటీ కలకలం ● చైర్మన్, అర్చకులు అధ్యక్ష, కార్యదర్శులుగా సేవా సంఘం రిజిస్ట్రేషన్ ● ఈఓ, అధికారిక రశీదులను కాదని సొంత అకౌంట్లతో చందాల వసూళ్లకు స్కెచ్ ● నేటి నుంచే మహా కుంభాభిషేకం ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ కొంతకాలంగా తరచూ వివాదాలు నడుస్తున్నాయి. తాజా గా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో ఆల య కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకుడు సతీష్కుమార్ అధ్యక్షుడిగా, మరో అర్చకుడు మహేశ్వర శర్మ ఉపాధ్యక్షుడిగా, ఉదయ్భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా సంస్థను రిజిష్టర్ చేయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సంస్థ బైలాలో కూడా శివాలయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. జీతాలు ప్రభుత్వానివి.. సొసైటీలు ప్రైవేటా?! ఎండోమెంట్ ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అర్చకులు, దేవాదాయ శాఖ నుంచి గౌరవవేతనం తీసుకుంటున్న చైర్మన్ శివాలయం పేరుతో మరో సొసైటీని ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని ఎండోమెంట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆలయ పెద్దలే ఇందులో ఉండటం వల్ల ఈ సొసైటీ ఆలయానికి అధికారికంగా సంబంధించిందేనని భ్రమపడి సామాన్య ప్రజలు, శివయ్య భక్తులు ఇతోధికంగా భారీ విరాళాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన కమిటీ ఉండగా, మళ్లీ ఈ కమిటీలోని వ్యక్తులే దొడ్డిదారిన మరో సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈఓ పర్యవేక్షణకు పాతర.. నిబంధనల ప్రకారం ఆలయ ట్రస్టు బోర్డు ద్వారా చందాలు లేదా విరాళాలు వస్తే దానికి తగిన అధికారిక రశీదు ఇచ్చి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) పర్యవేక్షణలోనే ట్రస్టు బోర్డు సభ్యులు వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగానో, ప్రైవేట్ సొసైటీల పేరుతోనో చందాలు వసూలు చేయడం, తమకు ఇష్టమొచ్చినట్లు స్వతహాగా ఖర్చు చేయడం ఎండోమెంట్ యాక్ట్కు పూర్తిగా విరుద్ధం. మహా కుంభాభిషేకం వేళ అధికారుల ఆరా! ఈ వివాదం ఇలా ఉంటే, మంగళవారం (జూన్ 16) నుంచి ‘మహా కుంభాభిషేకం మహోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. సరిగ్గా ఇటువంటి పవిత్రమైన సందర్భంలోనే ఈ అక్రమ సేవాసంఘం వ్యవహారం బయటకు రావడంతో భక్తులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బందికి సోమవారం ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల పదోన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కడపలోని ఇంటర్ విద్య ఆర్జేడీ కార్యాలయంలో సోమవారం ఈ పదోన్నతి కార్యక్రమాన్ని ఆర్జేడీ సురేష్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బంది అయిన పార్వతి, దీప్తి, శిరీష, అపర్ణ,, అశ్విని, భాస్కర్, కిషోర్, శివకుమార్ తదితరులకు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వారిని చిత్తూరు నాన్ టీచింగ్ స్టాప్ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కళాశాల విద్య ఆర్జేడీ సురేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఎవరెవరికి అవకాశాలు?
● వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్ ధమాకా ● తొలిసారి ఫ్లడ్లైట్ల వెలుగుల్లో మ్యాచ్లు ● బుధవారం నుంచి సమరం ● అభిమానులకు ఉచిత ప్రవేశం ● సందడి చేయనున్న సింగర్స్ సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో క్రికెట్ క్రీడాభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026’ రెండో దశ మ్యాచ్లు బుధవారం (జూన్ 17) నుంచి తొలిసారిగా జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. స్థానిక వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు మొత్తం 9 మ్యాచ్లను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్లైట్స్ వెలుగుల్లో ఈ టీ–20 పోరు సాగనుండటంతో జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. రూ.7 కోట్లతో ఆధునిక వసతులు ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఏసీఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్, రికీ భుయ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటడానికి ఇప్పటికే కడపలో అడుగుపెట్టారు. ఏడు జట్ల హోరాహోరీ.. రోజుకు రెండు మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో 7 జట్లు తలపడనున్నాయి. ప్రతి రోజూ రెండు మ్యాచ్లు జరగనుండగా, మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 2:00 గంటలకు, రెండో మ్యాచ్ సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మ్యాచ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో హై–వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ను పంచనున్నాయి. ఊరూరా విస్తృత ప్రచారం.. పాఠశాలల ప్లాన్! కడపలో ఏపీఎల్ నిర్వహణపై ఏసీఏ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ టోర్నీ కోసం విడుదల చేసిన ప్రత్యేక సాంగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగ్స్, బెలూన్స్ ద్వారా ఏపీఎల్పై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ క్రికెట్ మ్యాచ్లు చూపించాలనుకుంటుండటంతో ఏపీఎల్ పండగలా మారింది. చక్కటి వసతులు.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం! కడపలో మ్యాచ్లు వీక్షించేందుకు వచ్చే క్రీడాభిమానులకు స్టేడియంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి వసతులు సమకూర్చినట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవెలప్మెంట్ కమిటీ సభ్యుడు భరత్రెడ్డి, జిల్లా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మునికుమార్రెడ్డి, రెడ్డిప్రసాద్లు తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 ప్లేఆఫ్స్ (టాప్–4 స్థానాల) రేసు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ఆధారంగా ఏడు జట్ల ప్లేఆఫ్స్ అర్హత అవకాశాలు క్రింది విధంగా ఉన్నాయి. క్యాపిటల్ అమరావతి రాయల్స్/భీమవరం బుల్స్ ఈ రెండు జట్లు తలా 6 పాయింట్లతో టేబుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అర్హత సమీకరణం: అమరావతి రాయల్స్ ఆడిన 3 మ్యాచ్లూ గెలిచి అజేయంగా ఉంది. వీరు కడప లెగ్లో ఆడబోయే 3 మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ సీటు ఖరారవుతుంది. భీమవరం బు ల్స్ ఒక్క విజయం సాధిస్తే సేఫ్ జోన్లో ఉంటుంది. కాకినాడ కింగ్స్/విజయవాడ సన్షైనర్స్ఈ రెండు జట్లు తలా 4 మ్యాచ్లు ఆడి, 2 విజయాలతో 4 పాయింట్లు సాధించాయి. అర్హత సమీకరణం: ఈ జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే కడప దశలో వీరు ఆడబోయే రెండు మ్యాచ్లలో కనీసం ఒకటైనా భారీ రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండూ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా క్వాలిఫై అవుతారు. సింహాద్రి వైజాగ్ లయన్స్/తుంగభద్ర వారియర్స్ ఈ రెండు జట్లు కేవలం ఒక్కో విజయం (2 పాయింట్లు)తో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. అర్హత సమీకరణం: వీరికింకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రేసులో నిలవాలంటే కడప గడ్డపై ఆడబోయే 3 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. నెట్ రన్ రేట్ చాలా మైనస్లో ఉన్నందున భారీ విజయాలు అవసరం. రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆడిన 3 మ్యాచ్లలోనూ ఓడిపోయి సున్నా పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అర్హత సమీకరణం: రాయలసీమ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై అద్భుతం జరగాలి. కడపలో వారు ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్లలోనూ భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, విజయవాడ, కాకినాడ జట్లు తమ మిగిలిన మ్యాచ్లలో ఓడిపోవాలని ప్రార్థించాలి. కెప్టెన్: షేక్ రషీద్ ప్రధాన ఆటగాళ్లు: జె. సాకేత్ రామ్, ఎస్.ధ్రువ కుమార్ రెడ్డి, తేజ రెడ్డి ఎర్రగుడి, సాయి పూర్ణ తేజ గరిమెళ్ల, వంశీ కృష్ణ మామిడి, వాసు యెడ్ల, ఎన్. మాధవ్. -
వైఎస్ఆర్ జిల్లా
7మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026కెప్టెన్: సీ.ఆర్. జ్ఞానేశ్వర్ ప్రధాన ఆటగాళ్లు: సౌరభ్ కుమార్, ఎమ్.దీపక్, ఎమ్.కె.దత్తా రెడ్డి, గుట్టా రోహిత్, ప్రణీత్ మాన్యాల. కెప్టెన్: నితీష్ కుమార్ రెడ్డి ప్రధాన ఆటగాళ్లు: పి.వి.సత్యనారాయణ రాజు, హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కల్లూరు, టి.వి.సాయి శ్రవణ్, మునీష్ వర్మ భూపతిరాజు, బైలపూడి యశ్వంత్, ధీరజ్ కుమార్ మైచర్ల, భువనేశ్వర్ రావు, రవికిరణ్ మోపాడ, వంశీ కృష్ణ తన్నేరు, గిరీష్ కుమార్ రెడ్డి, సతీష్ నోదగాల. కెప్టెన్ : అశ్విన్ హెబ్బార్ ప్రధాన ఆటగాళ్లు: జి. సాయి వెంకట సుమిత్, జహీర్ అబ్బాస్, ఎమ్.అభినవ్, ఎ.లలిత్ మోహన్, తేజస్వి పిన్నింటి, విజయ్ ఆకుల. కెప్టెన్: కె.ఎస్.భరత్ ప్రధాన ఆటగాళ్లు: పిన్నింటి తప స్వి, గొలమారు మనీష్, మిత్తా లేఖాజ్ రెడ్డి, కె.పి.సాయి రాహు ల్, మిద్దె అంజనేయులు, కె.సుదర్శన్, షేక్ కమరుద్దీన్, అభిషేక్ ఎమ్. రెడ్డి. -
సర్ ఎన్యూమరేషన్ ప్రారంభం
కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలోని బీఎల్ఓలు ఆయా ఏఈఆర్ఓ కార్యాలయాల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకుని ఇంటింటి సందర్శన కార్యక్రమానికి వెళ్లారు. ఓటర్లకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ప్రధాన పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బీఎల్ఓల వెంట ఇంటింటిని సందర్శించారు. తొలిరోజు కావడంతో చాలా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఇంటింటికి బీఎల్ఓలు వెళ్లలేకపోయారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 287 పోలింగ్ కేంద్రాలు ఉండగా, చాలా ప్రాంతాల్లో బీఎల్ఓలు రాలేదని ప్రజలు తెలిపారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం వచ్చేనెల 14వ తేది వరకు జరగనుంది. మృతి చెందిన, డూప్లికేట్, శాశ్వత వలసలు వెళ్లిపోయిన వారి ఓట్లను జాబితాలో నుంచి తొలగించనున్నారు. అలాగే విదేశీయులు ఎవరైనా జాబితాలో ఓటరుగా ఉంటే గుర్తించి తొలగిస్తారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీయే ‘సర్’ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 18,94,520 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 19,952 ఉండగా, బీఎల్ఓలు అదే సంఖ్యలో ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు 1963 మంది బీఎల్ఓలు 52,959 ఎన్యుమరేషన్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. -
‘సర్’సరా.. సాగుతోంది!
జమ్మలమడుగు: జిల్లాలో ఓటర్ల జాబితా ల్యాండ్ మ్యాపింగ్ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం (సర్) అత్యంత వేగంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు 2002 నుండి 2025 వరకు ఉన్న పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న డేటాను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ ప్రక్రియను ముమ్మరం చేశారు. జూన్ 13వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 74.26 శాతం మేర ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు జూన్ 15వ తేదీ సోమవారం నుంచి జూలై 15 వరకు ఒక నెల రోజుల పాటు బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ఇంకా 4.25 లక్షల మందికి పైగా మ్యాపింగ్ అవసరం! ప్రింటెడ్ జాబితా పంపిణీ.. 2002 రికార్డులతో నిఘా సోమవారం నుండి క్షేత్రస్థాయికి వెళ్లే బీఎల్ఓలు తాము మ్యాపింగ్ చేసిన ఓటర్ల జాబితాను ప్రింట్ తీసి నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దే అందజేస్తారు. 2002లో ఓటు హక్కు లేని వారు కూడా ఈ సర్వే ద్వారా తమ స్థానికతను నిరూపించుకోవచ్చు. తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? 2002 నాటికి వారు ఎక్కడ నివాసం ఉన్నారో తెలియజేస్తూ సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ గతంలో ఓటు హక్కు ఉండి, ప్రస్తుతం జాబితాలో పేరు లేకపోతే.. ‘మీకు ఓటు హక్కు ఎందుకు తొలగించబడింది? కారణాలు ఏమిటి?‘ అనే విషయాలపై బీఎల్ఓలు లోతుగా ఆరా తీస్తారు. ఈ సర్వే ద్వారా ఓటర్ల లిస్టులో ఉన్న అక్షరదోషాలు, తప్పు అడ్రసులు, వయసు మరియు ఫొటోలకు సంబంధించిన తప్పు ఒప్పులను సరిదిద్దుకోవచ్చు. అలాగే డూప్లికేట్ (బోగస్) ఓట్లను మరియు చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి పూర్తిగా తొలగిస్తారు. అధికారుల సన్నద్ధత.. నూతన నమోదుకు 30 రోజుల ఛాన్స్! బీఎల్ఓలు క్షేత్రస్థాయి సర్వే సజావుగా నిర్వహించడానికి వీలుగా జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష చేతుల మీదుగా గొడుగు, టోపీ, వాటర్ బాటిల్, రైటింగ్ ప్యాడ్, స్కేల్, పెన్సిల్, రబ్బరు వంటి 13 రకాల వస్తువులతో కూడిన కిట్లను అధికారులకు అందజేశారు. సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ఆమె హెచ్చరించారు. బీఎల్ఓలు సేకరించిన డేటా ఆధారంగా తయారుచేసే ఓటర్ల నూతన జాబితాను ప్రభుత్వం పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలలో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ జాబితాలో పేర్లు లేని వారు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడం కోసం ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రత్యేక సమయాన్ని కేటాయించనుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వైఎస్సార్సీపీతో పాటు కూటమి నాయకులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దించారు. కడప జిల్లాలో 74.26% పూర్తి 13 రకాల కిట్లతో నేటి నుంచి ఇంటింటికీ బీఎల్ఓలు వైఎస్సార్ కడప జిల్లా ఓటర్ల మ్యాపింగ్ ‘సర్’ వివరాలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ పూర్తి శాతం ఇంకా చేయాల్సినవి బద్వేలు 2,22,043 1,69,454 76.32% 52,589 కడప 2,83,973 1,89,288 66.66% 94,685 పులివెందుల 2,30,276 1,82,535 79.27% 47,741 కమలాపురం 2,06,701 1,69,240 81.88% 37,461 (టాప్) జమ్మలమడుగు 2,45,095 1,87,471 76.49% 57,624 ప్రొద్దుటూరు 2,50,513 1,63,594 65.30% 86,919 (లీస్ట్) మైదుకూరు 2,13,852 1,65,538 77.41% 48,314 మొత్తం 16,52,453 12,27,120 74.26% 4,25,333ముఖ్యాంశాలు: జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా కమలాపురం (81.88%), అత్యంత తక్కువగా ప్రొద్దుటూరు (65.30%) నమోదు. (ఈనెల 13వతేదీ నాటికి మ్యాపింగ్ అయిన డేటా) జిల్లాలోని మొత్తం ఓటర్లు : 16,52,453 మంది ఇప్పటివరకు పూర్తయిన మ్యాపింగ్ : 12,27,120 మంది 74.26 శాతం ఇంకా చేయాల్సిన మ్యాపింగ్ : 4,25,333 మంది -
చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి
కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాల వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) అంకితభావంతో పనిచేస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కడపలోని మానస ఇన్ సమావేశ మందిరంలో ఆదివారం ఇంటాక్ కడప చాప్టర్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ లయన్ కె. చిన్నపరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బ్రహ్మంగారిమఠంలో పాక్షికంగా దెబ్బతిన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహాన్ని (పురాతన కట్టడం) దాని సహజత్వం దెబ్బతినకుండా పునర్నిర్మించే బాధ్యతను ప్రభుత్వం ఇంటాక్ సంస్థకు అప్పగించారన్నారు. భవిష్యత్తులో సంస్కృతి, సంప్రదాయాలు, కళల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి,కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీం బాషా, ఇంటాక్ కో–కన్వీనర్ పి.వి. సుబ్బారెడ్డి, రాజంపేట చాప్టర్ కన్వీనర్ వెంకటరమణ, డాక్టర్ ఓ.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఎయిమ్స్ యాప్ను నిలిపివేయాలి
కడప కార్పొరేషన్: ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా రైతాంగానికి సరిపడా ఎరువులను వైఎస్సార్ కడప జిల్లాలో పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం యాప్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన మేరకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. వరి పంటకు సంబంధించి ఒక ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు ఎరువులు అవసరం కాగా ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా కేవలం ఒకటి, రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులకు సరిపోవడం లేదన్నారు. శాస్త్రవేత్తలు సిఫారసు మేరకు ఒక ఎకరాకు 100 నుంచి 110 కేజీల యూరియాను అధిక దిగుబడుల కోసం తప్పనిసరిగా వాడాలని నిబంధనలు ఉండగా,ప్రస్తుత నూతన విధానం ద్వారా కేవలం 60 నుంచి 70 కేజీలు మాత్రమే వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయడం సరికాదన్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా కేవలం 15,000 మెట్రిక్ టన్నులే అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, వైయస్సార్సీపీ నాయకులు పి. మహేశ్వర్రెడ్డి, ఎం. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. కమలాపురం : కమలాపురం జడ్పీటీసీ సభ్యురాలు లింగాల సుమిత్రా భర్త రాజశేఖర్ రెడ్డిపై దాడి చేసిన సునీల్ అనే యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. శనివారం రాత్రి రాజశేఖర్రెడ్డి భోజనం చేశాక వాకింగ్ చేస్తుండగా అదే గ్రా మానికి చెందిన ఉప్పర సునీల్ కత్తితో పొడిచాడన్నారు. శరీరం వెనుక, ముందు వైపు కూడా దాదాపు 12 చోట్ల పొడిచాడన్నారు. కత్తిపోట్లకు గురైన రాజశేఖర్ రెడ్డి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. క్షతగాత్రుడుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న కేక్ కట్ చేసే నేపథ్యంలో గ్రామంలోని యువకులు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి వారిని మందలించి ఇంటికి పంపారు. అప్పటి నుంచి రాజశేఖర్రెడ్డిపై పగ పెంచుకున్న సునీల్ దాడికి పాల్పడి ఉండాడని గ్రామస్థుల ద్వారా తెలిసిందన్నారు. భాధితుడి భార్య సుమిత్రా ఫిర్యాదు మేరకు సునీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. జమ్మలమడుగు రూరల్ : ప్రమాదవశాత్తు నాపరాయి గనిలో పడి గురుకుమార్ (20) అనే యువకుడు మృతి చెందిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. ఎస్ఐ హైమావతి వివరాల ప్రకారం.. మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన భీమునిపాటి గురుకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అతడి తమ్ముడు భీమునిపాటి గురుకుమార్ సిమెంట్ పని చేసి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. అన్న గురు రాత్రి అయినా ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. గురు బయటకు వెళ్లాడని చెప్పడంతో అన్నను వెతుకుతూ బయటకు వెళ్లారు. గంట తరువాత అన్న వచ్చాడు. కానీ అన్న కోసం వెళ్లిన గురుకుమారు రాలేదు. దీంతో తండ్రి పెద్ద గురుస్వామి మైలవరం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం జమ్మలమడుగు మండల పరిధిలోని పొన్నతోట నాపరాయి గునుల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలపడంతో మృతదేహన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతుడు గురుకుమార్గా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వంశీని హత్య చేసింది యజమాని రామసుబ్బారెడ్డే !
కడప అర్బన్: పక్కాగా స్కెచ్ వేసి అక్కుపల్లి వంశీ(26) అనే యువకుడిని అతని యజమానే దారుణంగా హత్య చేశాడనీ పోలీసులకు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఈనెల 10న విన్యాస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చింతా రామసుబ్బారెడ్డి, తన భార్య మధురవాణితో తమ దగ్గర పనిచేసే డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. తరువాత గుట్టు చప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లో దాచేసి కారులో సోమశిల బ్యాక్ వాటర్స్లో మృతదేహాన్ని పడేయాలని భావించి రాజంపేట వైపు వెళ్లాడు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ రోడ్లో రాచపల్లి పంచాయతీ పరిధిలో అటవీప్రాంతంలో పడేశారు. 11వతేదీన వంశీ తండ్రి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పీఎస్లో అదృశ్యం కేసు నమోదు చేశారు.విచారణలో భాగంగా ఫొటోలను జిల్లాలోని పోలీసులకు పంపించారు. సంఘటన స్థలంలో మృతదేహాన్ని స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, వంశీ తండ్రి మునెయ్యను పిలిపించి గుర్తుపట్టాక కడప రిమ్స్ వైద్యబృందం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తరువాత రామసుబ్బారెడ్డి కోసం ప్రత్యేకంగా పోలీసు బృందం గాలింపుచర్యలు చేపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వంశీ ఆరునెలల క్రితమే రామసుబ్బారెడ్డి వద్ద డ్రైవర్ ఉద్యోగం చాలించి ఇంటివద్దనే వుంటున్నాడు. ఇటీవల వంశీని మళ్లీ డ్రైవర్గా పిలిపించారు. మరోవైపు రామసుబ్బారెడ్డికి, అతని భార్య మధురవాణితో విభేదాలు ముదిరిపోయాయి. ఇంకోవైపు ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే వంశీని హత్య చేశాడని సమాచారం. ఈహత్యకు మరో నలుగురు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలను తీసుకుంటామనీ కడప రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్ తెలియజేశారు. ● భయాందోళనలో ప్రజలు కడప అర్బన్: కడప నగరంలో మైనర్ డ్రైవింగ్ స్టంట్స్ రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రిమ్స్,శిల్పారామం మార్గంలో ఆదివారం సాయంత్రం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ బైక్ పై స్టంట్స్ చేశారు. జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా స్టంట్స్ వదలడంలేదు. కొద్ది నెలల క్రితం విమానాశ్రయం సమీపంలో బైక్ పై స్టంట్స్ చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బైక్ లకు ఎటువంటి నంబర్ ప్లేట్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నారు. గాలివీడు : మండల పరిధిలోని నూరివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెకు చెందిన మహిళా రైతు కె.సాలమ్మ, బి.శివారెడ్డిలకు చెందిన విద్యుత్ వైర్ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా వైర్ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేఘం మెరిసెను.. చినుకే కురిసెను!
● జిల్లా అంతటా వర్షం ● ఆరుతడి పంటలసాగుకు సమాయత్తం ● సత్తువ పంటలతో పాటు ఆరుతడి పంటల సాగుకు సన్నద్ధం ● నీటి వసతి ఉన్న రైతులు నారుమడులసాగుకు ఉపక్రమణ ● ఖాజీపేట మండలంలో అత్యధికంగా 94.8 ఎంఎం వర్షం ● అన్నదాతలల్లో చిగురించిన ఆశలు కడప అగ్రికల్చర్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన విస్తారమైన వర్షాలు పల్లెల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అక్కడక్కడ జల్లులు పడుతున్నప్పటికీ, తాజా భారీ వర్షంతో నేల పూర్తిగా పదును కావడంతో సాగు పనులను ప్రారంభించేందుకు అన్నదాతల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆరుతడి పంటల సాగుకు ఇదే తగిన అదును జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ, కంది, పసుపు, మినుము వంటి ఆరుతడి పంటల సాగుకు ఇదే అత్యంత అనుకూలమైన సమయం (అదును) అని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో చాలా చోట్ల రైతులు ఆరుతడి పంటల సాగు కోసం ఇప్పటికే దుక్కి దున్నడం చేసి సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న ఆరుతడి, ఉద్యానవన పంటలకు ఈ వర్షపు నీరు అమృతంలా మారి ఎంతో మేలు చేసింది. సత్తువ విత్తనాల పంపిణీ ముమ్మరం.. నారుమడుల హడావుడి జిల్లావ్యాప్తంగా ఇటీవల అధికారులు పంపిణీ చేసిన పచ్చిరొట్ట ఎరువులైన జీలుగలు, జనుములు, పెసల విత్తనాల సరఫరా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ వర్షపు పదునును ఉపయోగించుకుని రైతులు వీటిని సత్తువ పంట కింద సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్ ప్రధాన పంట అయిన వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ’రైతు భరోసా కేంద్రాల’ ద్వారా ముమ్మరంగా సాగుతోంది. కేసీ కాలువతో పాటు పెన్నా నది పరివాహక ప్రాంతాలైన చెన్నూరు, ఒంటిమిట్ట, చాపా డు, రాజుపాలెం తదితర ఏరియాల్లో సొంత నీటి వసతి (బోర్లు, బావులు) ఉన్న కొంతమంది రైతులు ఇప్పటికే సత్తువ పంటలను సాగు చేసి, నారుమడుల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ వర్షాలు మరో నాలుగైదు రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఈ నదీ పరివాహక ప్రాంతాలలో చాలా మంది రైతులు పెద్ద ఎత్తున నారుమడులు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖాజీపేట మండలంలో అత్యధిక వర్షపాతం జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఓస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే అత్యధికంగా ఖాజీపేట మండలంలో 94.8 మిల్లీమీటర్ల (ఎంఎం) భారీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ మరి యు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షంతో ఖాజీపేట పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తగిన యాజమాన్య పద్ధతులు పాటించి ఖరీఫ్ పంటల సాగును ప్రారంభించాలని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. -
చమర్తి దౌర్జన్యాలకు చరమగీతం!
● రాజంపేట టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి ● రణరంగంగా మారిన మంటపంపల్లిఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీరుపై సొంత పార్టీ సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లిలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు కిరణ్ స్వామి నివాసంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ముఖ్య నేతలు అత్యవసర అసమ్మతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా పార్టీ గెలుపు కోసం, జెండా మోసి కష్టపడిన నిబద్ధత గల నాయకులను, కార్యకర్తలను ఇన్ఛార్జ్ పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఇసుక, మట్టి మాఫియా శక్తులను చమర్తి చేరదీస్తున్నారని.. వారికే కీలక పదవులు కట్టబెడుతూ, వారు చెప్పిందే వేదంగా పాలిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ధ్వంసం.. నేతల బాహాబాహీ పోరు చమర్తిపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఇన్ఛార్జ్ వర్గానికి చెందిన జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, మంటపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల బాషా, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య మరికొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి దూసుకొచ్చారు. తమకు సమాచారం లేకుండా ఒంటిమిట్టలో సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సీనియర్ నేతలతో వాదనకు దిగారు. సమావేశాన్ని బలవంతంగా భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి, పరిస్థితి బాహాబాహీ వరకు దారితీసింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ఇరువర్గాలకు తేల్చి చెప్పారు. పోలీసుల జోక్యంతో అసమ్మతి నాయకులు తమ సమావేశాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. నాయకత్వ లోపం బయటపడుతుందనే భయం చమర్తి వర్గీయుల దాడితో సమావేశం రద్దయిన అనంతరం, టీడీపీ సీనియర్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, ఒంటిమిట్ట నేత కిరణ్ స్వామి సంయుక్తంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చమర్తి జగన్ మోహన్ రాజు నాయకత్వ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే తమ సమావేశాన్ని రౌడీయిజంతో భగ్నం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలతో అస్సలు సంబంధం లేని చమర్తి అనుచరులను, సొంత కుటుంబ సభ్యులను మండల ఇంచార్జ్లుగా నియమించి.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కరుడుగట్టిన కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని హెచ్చరించారు. ఇంచార్జ్ పదవి చూసుకుని గర్వంతో ఊగిపోతూ పార్టీ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న చమర్తి జగన్ మోహన్ రాజు అక్రమాలపై త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని నేతలు స్పష్టం చేశారు. -
ఇన్–సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కడప ఎడ్యుకేషన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఫోర్టో రాష్ట్ర కో చైర్మన్ ఎస్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సేవలో చేరిన తర్వాత ప్రత్యేక అర్హత పరీక్షలు లేవన్నారు.కానీ ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సమంజసం కాదన్నారు. 20 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను ఇప్పుడు మరోసారి పరీక్ష రాయమని చెప్పడం వారి అనుభవాన్ని, సేవలను అవమానపరచడమే అని ఆయన అన్నారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయంలో అనేక రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు పలు అంశాలపై తీర్మానం చేశారు. జూన్ 15, 16 తేదీల్లో ప్లకార్డులతో నిరసన, జూన్ 20 నుంచి ఎంపీలకు ప్రాతినిధ్యాలు అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తుపాకుల మురళి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, విద్యాసాగర్, శ్రీరాములు పాల్గొన్నారు. -
జలాశయాల్లో తగ్గుతున్న నీటి మట్టం
జమ్మలమడుగు : గండికోట, మైలవరం జలాశయాల్లో నీరు తగ్గిపోతుంది.రెండు నెలల కిందట గండికోటలో 20 టీఎంసీలు నిల్వ ఉండటంతో దిగువన ఉన్న మైలవరం జలాశయం, పైడిపాలెం, సర్వరాయసాగర్ ప్రాజెక్టులకు గండికోట ద్వారా నీటిని విడుదల చేశారు.దీంతో గండికోట జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం గండికోటప్రాజెక్టులో 17టీఎంసీల నీరు నిల్వ ఉంది. మైలవరం జలాశయంలో నీటి సామర్థ్యం 6.5టీఎంసీగా ఉంది. మైలవరం జలాశయం నుంచి ఉత్తర, దక్షిణ కాలువలతోపాటు ఆర్టీపీపీ తాగునీటి అవసరాలకోసం జమ్మలమడుగు పెన్నానదిలోనికి నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం మైలవరం జలాశయంలో1658 టీఎంసీలు మాత్రమే మిగిలింది. బొమ్మెపల్లి ఎత్తిపోతల పథకానికి 28 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరి కొద్దిరోజులపాటు సరైన వర్షాలు పడకపోతే మైలవరం జలాశయం అడుగంటిపోవడంతోపాటు ఖరీఫ్లో రైతులు పంట సాగుచేస్తే నీరు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. -
18న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కడప వైఎస్సార్ సర్కిల్ : ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఈవో సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీలు), అలాగే వైఎస్సార్ కడప మరియు అన్నమయ్య జిల్లాల అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. నేడు ’డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’కడప కార్పొరేషన్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 15వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలోనూ ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీ ర్ దష్టికి తీసుకువచ్చేందుకు వినియోగదారులు 08562242457 నంబర్కు కాల్ చేయవచ్చు. సౌత్ జోన్ అండర్–16 క్రికెట్ పోటీలకు ఎంపిక మదనపల్లె సిటీ : సౌత్ జోన్ అండర్–16 బాలుర అంతర్ జిల్లా మల్టీ డే క్రికెట్ పోటీలకు మదనపల్లెకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు మదనపల్లె క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ జనార్థన్ తెలిపారు. షారిక్ అక్తర్ , తేజేష్ , ఎస్ఎండి మౌలా , వి.జె.నోయల్ ఎంపికై నట్లు తెలిపారు. జులై 2 వరకు వాల్మీకిపురంలోని జీవీఎస్సీఎస్ క్రికెట్మైదానంలో పోటీలు జరుగుతాయన్నారు. ‘మిట్స్’కు 4ఏ రేటింగ్కురబలకోట : కేరీర్స్ ర్యాంకింగ్స్–26లో మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి 4ఏ రేటింగ్ దక్కినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల అనుసంధానం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు వంటి కీలక అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జాతీయస్ఠాయిలో ఈ అరుదైన గుర్తింపు లభించడానికి కారణమైన సిబ్బందిని ఛాన్సలర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి అభినందించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చుకడప కోటిరెడ్డి సర్కిల్ : విద్యార్థులు బట్టీ చదువులకు పరిమితం కాకుండా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని భారతీయ రైల్వేస్ నాగపూర్ జాయింట్ జనరల్ మేనేజర్ గాలి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం తొగటవీరక్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కింద నగదు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం మార్కులు మాత్రమే సాధించడం కాకుండా జ్ఞానం, నైపుణ్యాలు, ఆలోచన సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరమన్నారు. విద్య అనేది జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని, ఏ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వారైనా విద్య ద్వారా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. సంఘం నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కల్యా సుధాకర్, పల్లా నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమంలో తాలూకా సీఐ నరసింహరాజు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు, ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి టేకూరు సుదర్శన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లా మురళీకృష్ణయ్య, ఉపాధ్యక్షుడు చౌడం సూరిబాబు పాల్గొన్నారు. -
గంగమ్మ ఆలయంలో చోరీ
తొండూరు : తొండూరు మండలంలోని గంగనపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ గుడిలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి నగదును అపహరించారు. ఆదివారం ఉదయం అర్చకుడు ఆలయ తలుపులు తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. హుండీలో ఎంత నగదు ఉందనే విషయం తెలియరాలేదు. కొన్ని వారాలుగా హుండీ ఆదాయాన్ని లెక్కించలేదు. దీంతో హుండీలో ఎక్కవ మొత్తంలో నగదు ఉంటుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆలయంలో వెండి నగలు అపహరణ ముద్దనూరు : మండలంలోని మంగపట్నం గ్రామంలో వెలసిన శ్రీ అంకాలమ్మ ఆలయంలో అమ్మవారి వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. స్థానిక హెడ్కానిస్టేబుల్ రమేష్ సమాచారం మేరకు శనివారం రాత్రి దుండగులు ఆలయం తలుపులు పగలగొట్టి వెండి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. అర్చకుడు మహేశ్వరరావు ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లాడ్జీల్లో తనిఖీలు కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం లాడ్జీల్లో తనిఖీ చేశారు. ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జీల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. రిజిస్టర్ ను పరిశీలించారు. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. -
తెలుగు‘బెంగ’.. ఖాళీ ‘క్వార్టర్స్’ !
బద్వేలు: పట్టణ కేంద్రంలోనే ఉన్నా పగలే నిర్మానుష్య వాతావరణం.. చీకటి పడితే పోకిరీలకు కొండంత అండ.. ఇదీ బద్వేలు మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుగంగ కాలనీ క్వార్టర్ల ప్రస్తుత దయనీయ స్థితి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలతో కళకళలాడిన ఈ ప్రభుత్వ భవనాలు, రెండు దశాబ్దాలుగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నయా అడ్డాగా మారాయి. విద్యాసంస్థలు, మున్సిపాలిటీ ఆఫీస్ నడుమ ఘోరం ఈ శిథిలావస్థకు చేరుకున్న తెలుగుగంగ క్వార్టర్లు పట్టణంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల మధ్య ఉండటం గమనార్హం. ఒకవైపు ప్రముఖ బిజివేముల వీరారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణం, మరోవైపు తెలుగుగంగ ప్రధాన రహదారి వీధి.. ఇంకోవైపు అత్యంత సమీపంలోనే బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయ సముదాయం ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన లొకేషన్లలో ఉన్నప్పటికీ, ఈ సువిశాల ఖాళీ స్థలం పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ నిర్మానుష్యంగానే ఉంటుంది. క్వార్టర్ల చుట్టూ ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో కంపచెట్లు విపరీతంగా పెరిగి చూడటానికి ఒక ‘చిట్టడవి’లా తయారైంది. ఈ చిట్టడవే ప్రస్తుతం మందుబాబులకు, పేకాట రాయుళ్లకు ప్రత్యేక రక్షణ వలయంలా ఉపయోగపడుతోంది. గదుల నిండా మద్యం బాటిళ్లు.. గంజాయి, వ్యభిచారం కలకలం! తెలుగుగంగ కాలనీలో నిర్మించిన ఈ 30కి పైగా క్వార్టర్ల భవనాలలో ఒక్కో దానికి ఐదారు గదులు ఉన్నాయి. ఈ విశాలమైన గదుల వసతి పోకిరీలకు మరింత సౌకర్యంగా మారింది. భవనాల గదుల లోపల, పైన ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కొందరు పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇక్కడ చేరి మద్యం సేవిస్తూ, పేకాట జోరుగా సాగిస్తున్నారు. ఈ పాడుపడిన క్వార్టర్లను ఆవాసాలుగా చేసుకుని కొందరు వ్యభిచారం కూడా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు కొందరు రిక్షా కార్మికులు, ఆకతాయిలు ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతూ డ్రగ్స్ దందాకు కూడా తెరలేపుతున్నారు. పోలీసుల గస్తీ.. శూన్యం! దారుణాలపై స్థానిక కాలనీవాసులు పలుమార్లు పోలీసులకు గట్టిగా ఫిర్యాదులు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులు మాత్రం పోలీసులు ఆ ప్రాంతంలో మొక్కుబడిగా గస్తీ నిర్వహించి, ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల గస్తీ నిలిచిపోవడంతో అల్లరి మూకలు మళ్లీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కంపచెట్లను పూర్తిగా తొలగించి, అక్కడ పటిష్టమైన పోలీసు నిఘా మరియు శాశ్వత గస్తీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. బద్వేలు నడిబొడ్డున అసాంఘిక కార్యక్రమాలు మున్సిపల్ ఆఫీస్ పక్కనే పోకిరీల రాజ్యం కాలనీలో మద్యం, వ్యభిచారం, గంజాయి జోరు D M>ÓÆý‡t-ÆŠ‡ÞMýS$ çÜÒ$-ç³…ÌZ¯ól ™ðlË$-VýS$-VýS…VýS Æøyýl$z M>ÌS-±, ÒÆ>-Æð‡yìlz 1, 2 M>ÌS± {ç³fÌS °Ðé-ÝëË$ E¯é²Æ‡$$. CMýSPyìl MýS$r$…»êÌSMýS$ ^ðl…¨¯]l í³ÌSÏË$, Ð]l$íßæ-âýæË$ {ç³†Æøþ D ¿ýæÄ¶æ*-¯]lMýS M>ÓÆý‡tÆý‡Ï Ò$§ýl$-V>¯ól ™èlÐ]l$ ѧéÅçÜ…çܦ-ÌSMýS$, 糯]l$-ÌSMýS$ वे-âêÏÍÞ E…r$…-¨. AMýSPyýl °Æý‡…-™èlÆý‡… †ÇVóS AÌSÏÇ Ð]lÊMýS-ÌS¯]l$, AÝë…íœ$MýS ÔèæMýS$¢-ÌS¯]l$ ^èl*íÜ Ñ§éÅ-Æý‡$¦Ë$, ÝëÐ]l*¯]lÅ {ç³fË$ ¡{Ð]l ¿ýæÄ¶æ*…§ø-âýæ-¯]l-ÌSMýS$, Cº¾…§ýl$ÌSMýS$ VýS$Æý‡-Ð]l#-™èl$-¯é²Æý‡$. -
కడప, రాజంపేటలో రైల్వే జీఎం పర్యటన
రాజంపేట/కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వేస్టేషన్లలోని పలు విభాగాలను పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వీటిని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు రాజంపేటలో గుంతకల్ డీఆర్యూసీ సభ్యుడు తల్లం భరత్కుమార్రెడ్డి.. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వివిధ రైల్వే సమస్యలపై రూపొందించిన లేఖలను అందజేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు. జీఎంను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడగలం శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ నాయకుడు ధారా వెంకటరమణ తదితరులు ఉన్నారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యెద్దల విజయసాగర్ తదితరులు తమ ప్రాంత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కడపలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కడప డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ వినీత్కుమార్, ఇతర అధికారులు సురేష్కుమార్, రాజ్కుమార్, శ్రావణ్కుమార్, మనోజ్, సుదర్శన్రెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, మోహన్రెడ్డి, జనార్దన్ పాల్గొన్నారు. -
తల్లిని దూషించాడనే.. చంపేశాడు!
మైదుకూరు : తన తల్లిని దూషించినందుకు మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గాలి సుదర్శన్రెడ్డి.. అదే కాలనీకి చెందిన సంపంగి నాగేంద్ర అలియాస్ నాగేంద్రబాబు అలియాస్ పెద్ద షకీలా అనే యువకుడిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంపంగి నాగేంద్ర అదే కాలనీకి చెందిన సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యంగా అతని తల్లిని పదే పదే అవమానకరంగా దూషిస్తూ అసభ్య పదజాలంతో వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్రెడ్డి నాగేంద్రను హత్య చేయాలని మనసులో పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఈనెల 7న తెల్లవారుజామున కాలనీలోని ఆలయం ముందున్న అరుగుపై నిద్రిస్తున్న నాగేంద్రపై మచ్చు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతుడి సోదరుడు నాగేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అర్బన్ సీఐ కె.రమణారెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుదర్శన్రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. శనివారం మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిలోని ఎర్ర చెరువు సమీపంలో సుదర్శన్రెడ్డిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడని, అతడు చూపించిన ప్రదేశం నుంచి హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐలు కె.చిరంజీవి, కె.వెంకటరమణ, ఏఎస్ఐ శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ శివభాస్కర్రెడ్డి, కానిస్టేబుల్ నవీన్కుమార్, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.హత్య కేసులో నిందితుడి అరెస్ట్ -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 1న అనారోగ్యం కారణంగా జిల్లా ఆస్పత్రిలో చేరిన అతను తన పేరు బాలగంగాధర్ (56) అని ఐపీ రిజిస్టర్లో రాయించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన బంధువులు జిల్లా ఆస్పత్రిలోని అవుట్ పోస్ట్లో సంప్రదించాలని ఔట్ పోస్ట్ ఇన్చార్జి షబ్బీర్ బాషా తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఒక ఆటో చోరీ చేసిన కేసులో శనివారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకర్ల సమావేశంలో మన్నూరు సీఐ ఎస్.లింగప్ప వివరాలు వెల్లడించారు. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న వినాయక గుడి వెనుక వైపు పార్కింగ్ చేసి ఉంచిన ఆటో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చోరీకి గురి అయింది. దీనిపై బాధితులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేపట్టారు. నిందితుడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్లో నివాసం ఉంటున్న చిట్టివడ్డి మురళీ కృష్ణ అని తెలియడంతో అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు. నిందితుడిపై ఇది వరకే కదిరి టౌన్ పీఎస్, పీలేరు పీఎస్, తిరు మల 2 టౌన్ పీఎస్లో ఆటో, మోటార్ సైకిల్ చోరీల కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. ఆటో, బైక్ రికవరీమైదుకూరు : మైదుకూరు పట్టణంలో ఆటో, ఓ మోటార్ బైక్ చోరీ కేసులో ఇడగొట్టు రాఘవేంద్ర అలియాస్ గండి వీరాంజనేయులు అనే నిందితుడిని అరెస్టు చేశారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తన కార్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. మైదుకూరులో గత నెల 29న ఆటో, ఈ నెల 3న మోటార్ బైక్ చోరీకి గురి కాగా వాటి యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ కేసుల్లో ఉన్న ఇద్దరు నిందితుల్లో జగనన్న కాలనీకి చెందిన ఇడగొట్టు రాఘవేంద్ర అలియాస్ గండి వీరాంజనేయులును మైదుకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన మరో నిందితుడు షరీఫ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన ఆటో, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇడగొట్టు రాఘవేంద్రపై ప్రొద్దుటూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో రెండు దొంగతనాల కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ వెంకటరమణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
‘ఆది నారాయణరెడ్డి .. ఓ చిల్లర వ్యక్తి’
జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఓ చిల్లర డాన్ అని, డబ్బుల కోసం దౌర్జన్యాలు, గుండాయిజం చేసి ఫ్యాక్టరీల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి చిల్లర తీసుకునే వ్యక్తి అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది అంటేనే అబద్ధం, అరాచకమని అలాంటి వ్యక్తికి.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. నాలుగు సార్లు నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే.. దాల్మియా కంపెనీ ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశ పడి దాల్మియా బాధిత రైతుల కుటుంబాలను తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి.. ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే అన్నారు. దాల్మియా రెండో ప్లాంట్ కోసం చుట్టు పక్కల గ్రామాల ఎన్విరాన్మెంట్ ఓపెన్ ఫోరంగా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి.. చివరకు దాల్మియాకు దాసోహం అయ్యారన్నారు. అదే విధంగా ఉన్నత స్థానంలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం దాల్మియా బాధిత రైతులకు అన్యాయం చేశారన్నారు. దాల్మియా యాజమాన్యం పెద్దలు.. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని తనకు హామీ పత్రం ఇచ్చిన తర్వాతనే.. ఈ సమావేశానికి రావడం జరిగిందని నెల రోజుల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారని గుర్తు చేశారు. అయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని, గ్రామాలను మార్చాల్సిన అవసరం లేదంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించి రైతులకు, ప్రజలకు మోసం చేశారన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, బీసీ నాయకుడు సుబ్రమణ్యం, తలమంచిపట్నం వినయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజంపేట ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
రాజంపేట : రాజంపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు. సూపరింటెండెంట్ పీవీఎన్ రాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్టకు చెందిన 45 ఏళ్ల వయసు కలిగిన వివాహిత గురువారం ఆస్పత్రికి వచ్చింది. ఆమె కుడి తొడపై పెద్దగడ్డ ఉంది. దానిని ప్రాంతీయ వైద్యుల సలహాతో డాక్టర్ పి.వెంకటేశ్వరరాజు, అనస్తీషియా డాక్టర్ శిరీష, సిస్టర్ సరళ, విజయ్కుమార్, ప్రియాంక, సహాయకుడు భార్గవ్, శ్రీలత ఆపరేషన్ పూర్తి చేశారు. గడ్డ శ్యాంపిల్ను పరీక్ష నిమిత్తం కడప రిమ్స్కు పంపించారు. శనివారం రోజు ఆమెను డిశ్చార్జి చేశారు. కాగా ఈ మహిళ గడ్డతో బాధపడుతూ అనేక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఆమె రాజంపేట ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ పీవీఎన్ రాజును సంప్రందించారు. ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేశారు. అనంతరం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ పీవీఎన్ రాజు, ఆసుపత్రి సిబ్బంది సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. గడ్డ బరువు కేజీ ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ పీవీఎన్ రాజు మాట్లాడుతూ ఆపరేషన్ అనంతరం రోగి ఆరోగ్యకరంగా ఉన్నారని, ఆమెను డిశ్చార్జి కూడా చేశామన్నారు.తొడపై ఉన్న కేజీ గడ్డ తొలగింపు -
భార్గవరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
ఎర్రగుంట్ల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి కుటుంభ సభ్యులను శనివారం పరామర్శించారు. ఇటీవల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని శనివారం విశ్వభార్గవరెడ్డి కుమారుడు యర్రంరెడ్డి ఉదయ్కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడద్దని చెప్పారు. 17 నుంచి ఏపీఎల్ మ్యాచ్లుకడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియల్ లీగ్ ఐదవ సీజన్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 9 మ్యాచ్లు కడపలో జరుగుతాయన్నారు. ఇందులో విజయవాడ సన్సైనర్స్, తుంగభద్ర వారియర్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, బీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఈ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు రూ.7 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ మ్యాచ్లకు రోజుకొక అతిథితో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందజేయడంతోపాటు టాస్ వేయడం జరుగుతుందన్నారు. మ్యాచ్లో సినీ ప్రముఖులైన గాయకులు సునీత, సింహా, గీతామాధురి, కృష్ణచైతన్య, సంగీత వాయిద్యకారులు శ్రీహరి పాల్గొని ప్రేక్షకులను అలరిస్తారన్నారు. ఈ మ్యాచ్లను తిలకించేందుకు ఎంట్రీ ఉచితమని వివరించారు. గ్యాలరీల్లో ప్రేక్షకులకు కావాల్సిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మునికుమార్రెడ్డి, కార్యదర్శి రెడ్డిప్రసాద్, స్టేడియం చైర్మన్ శ్రావణ్రాజ్రెడ్డి, వైస్ చైర్మన్ పృథ్వి, స్టేడియం కన్వీనర్ సంజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అవయవ దానం చేసి.. ఆదర్శంగా నిలిచి..
బ్రహ్మంగారిమఠం : తాను చనిపోయినా.. మరొకరికి జీవితాన్ని ఇవ్వాలని సంకల్పించాడు. తన అవయవాలను దానం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ మద్దిరెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు భోగిరెడ్డి సిద్దారెడ్డి (40) ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 10వ తేదీన బైక్లో కమలాపురం నుంచి ఖాజీపేటకు వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. అతన్ని హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అవయవాలలోని కళ్లు, కిడ్నీలు, గుండెలను దానంగా ఇవ్వడం జరిగిందని సిద్దారెడ్డి తమ్ముడు డోజర్ సిద్దారెడ్డి తెలిపారు. మృతి చెందిన సిద్దారెడ్డికి భార్య, చిన్న పిల్లలైన బాబు, పాప ఉన్నారు. నేడు మాజీ ఎమ్మెల్యే పరామర్శ భోగిరెడ్డి సిద్దారెడ్డి మృతదేహానికి నివాళి అర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి ఆదివారం వస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఎం. రత్నకుమార్యాదవ్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. -
అక్షరాలా దోపిడీ!
● ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల మోత ● 30 శాతం వరకు పెంపుతో సామాన్యుడి వెతకడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ చదువులు మధ్యతరగతి తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వేటను మొదలుపెట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచేయడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1,86,514 మంది విద్యార్థులలో సగానికి పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు.ఫీజుల దోపిడీ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల ఆవేదనే నిదర్శనం. ఎల్కేజీలో చేర్పించాలంటేనే భయం కడప నగరంలోని ముత్యాలమ్మకుంటకు చెందిన రాజేష్ అనే లబ్ధిదారుడు తన పాపను ఎల్కేజీలో చేర్పించేందుకు ఒక కార్పొరేట్ స్కూల్కు వెళ్లగా.. కేవలం స్కూల్ ఫీజే రూ.28,000 అడిగారు. దీనికి తోడు అడ్మిషన్ ఫీజు, పుస్తకాల ఖర్చులు కలిపి ఒక్కసారిగా రూ.35,000 కట్టమనేసరికి అంత ఫీజు ఎలా కట్టాలో తెలియక భయమేస్తోందని ఆయన వాపోయారు. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి 7 వేలకు పెంపు నగరానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది 3వ తరగతికి రూ.25,000, 5వ తరగతికి రూ.28,000 చొప్పున ఫీజు కట్టాడు. కానీ ఈ ఏడాది ఆ ఫీజులను ఒక్కసారిగా రూ.32,000 మరియు రూ.35,000లకు పెంచేశారు. ఇవి కాకుండా కేవలం పుస్తకాల కోసమే అదనంగా రూ.8 వేల నుండి 10వేలు అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూల్ భారం కడప నగరంలో నివసించే ఒక మేసీ్త్ర తన కుమారుడికి 8వ తరగతిలో గతేడాది రూ. 35,000 ఫీజు చెల్లించాడు. ఈ ఏడాది 9వ తరగతికి వచ్చేసరికి ఆ ఫీజును ఏకంగా రూ. 45,000లకు పెంచేశారు. దీనికి తోడు పుస్తకాల కోసమే రూ. 8 వేలకు పైగా వసూలు చేశారు. డీజిల్ సాకుతో బస్ ఛార్జీల పెంపు ట్యూషన్ ఫీజులతో పాటు రవాణా, ఇతర సామగ్రి పేరుతో ప్రైవేటు స్కూళ్లు చేస్తున్న నిలువు దోపిడీ సామాన్యుడిని అప్పులపాల్జేస్తోంది. గతేడాది రూ. 10,000 ఉన్న స్కూల్ బస్ ఛార్జీలను ఈ ఏడాది రూ. 15,000లకు పెంచేశారు. దీనిపై యాజమాన్యాలను నిలదీస్తే.. డీజిల్ ధరలు పెరిగాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. సిలబస్ పేరుతో బ్లాక్మెయిల్ పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, యూనిఫాం, బూట్ల పేరుతో వేలకు వేలు దండుకుంటున్నారు. బయట మార్కెట్లో తక్కువ ధరకు కొందామంటే.. శ్రీఈ బుక్స్ మా స్కూల్ సిలబస్కు సంబంధించినవి కావు, మా వద్దే కొనాల్ఙి అంటూ యాజమాన్యాలు కచ్చితంగా నియమం పెడుతూ తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఫౌండేషన్ కోర్సులు, ప్రాజెక్టుల పేరిట హడావుడి చిన్న వయసు నుంచే ఐఐటీ–జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ పాఠశాలలు సరికొత్త హడావుడిని సృష్టిస్తూ, రెగ్యులర్ ఫీజుకు అదనంగా వేలాది రూపాయలను ఒకేసారి రాబడుతున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రాజెక్టు వర్కులు, స్మార్ట్ క్లాసుల పేరిట నిరంతరం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు.విద్యాశాఖ తనిఖీలు చేపట్టాలి జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో యాజమాన్యాలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – అంకన్న, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
కొండకింద ఊరు.. గుర్తింపుకోసం పోరు !
గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం ‘పెద్ది’ సినిమాలోని కొండకింద ఊరును తలపిస్తోంది. ఈ ఊరు పరిధిలో సుమారు 328 మంది రైతులకు సంబంధించి 1800 వందల ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల వరకు అంటే.. కూటమి కొలువుదీరక ముందు వరకు రెవెన్యూ రికార్డుల్లో ఊరు భద్రంగా ఉంది. భూములకు, వన్బీలు, ఆండంగ్లు, మ్యూటేషన్లు, ప్రభుత్వ పథకాలు పక్కాగా అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీరి బతుకు దుర్భరంగా మారింది. ఏకంగా ఊరంతా రెవెన్యూ రికార్డుల్లో మాయమైంది. ఆన్లైన్లో గ్రామానికి సంబంధించిన ఒక్క రైతు భూమి కనిపించడం లేదు. దీంతో రెండేళ్లుగా ఆగ్రామంలో ఒక్కరికి కూడా రెవెన్యూ సేవలు అందకపోగా రైతులకు సంబంధించిన వ్యవసాయ పథకాలు అందడం లేదు. తాజాగా ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లోనూ చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి చెందిన వేలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫలితంగా గ్రామానికి చెందిన328 మంది రైతులు రైతు గుర్తింపు కార్డుల కోసం యుద్ధమే చేస్తున్నారు. రెండేళ్లుగా రెవెన్యూ సేవలు బంద్ చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబందించి రెండేళ్లుగా రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలోనూ చిట్టిబోయనపల్లె భూములకు సంబందించి ఎటువంటి మ్యూటేషన్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో అడంగల్, ఒన్బీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకమీదట రైతులకు రైతు భరోసా పథకం వర్తించాలంటే తప్పనిరిగా రైతుగుర్తింపు కార్డు ఉండాలనే నిబంధన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా 6125 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్సైట్లో నమోదు చేశారు. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగకపోవడం విచారకరం. -
ప్రజలను నిండా ముంచిన కూటమి
పులివెందుల రూరల్ : కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జనాలకు వెన్నుపోటు పొడిచిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నప్పటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ, పరిశ్రమలు ఏర్పాటు గానీ చేయలేదని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వారిపై కేసులలో పెడుతున్నారని మండిపడ్డారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఇలా అన్ని వర్గాల వారిని కూటమి ప్రభుత్వం నిండా ముంచిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్లో ప్రజల వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజా దర్బార్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
కూటమి అంతానికి ఇది ఆరంభం
● వెన్నుపోటుకు రెండేళ్లు ర్యాలీల సక్సెస్తో కూటమిపై వ్యతిరేకత ఎంతుందో తెలిసింది ● తిరుపతిలో టీడీపీ విజయోత్సవ సభలో బాబు చెప్పినవన్నీ అబద్దాలే ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నుంచి కురుపాం వరకూ అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో నిన్న జరిగిన ర్యాలీలతో తెలిసిపోయిందన్నారు. కూటమి పాలన అంతానికి ఇది ఆరంభమన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈ ర్యాలీలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ఈ సారి కూటమిగా వచ్చిన మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో తాము ఎంత ఎంత నష్టపోయామో ప్రజలు లెక్కలేసుకుంటున్నారన్నారు. ‘మీ హామీలు ఏమయ్యాయి... చంద్రబాబు’ అని రాష్ట్ర ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తన పాలనలో రైతులను, మహిళలను, యువతను, విద్యార్థులను మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతనే లేదని, ప్రతి క్షణం మోసం, ప్రతి పనిలో దగా.. అంతా స్కామ్లమయమేనని ధ్వజమెత్తారు. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి, సంక్షేమం కాదని, పచ్చి అబద్ధాల ప్రచారమన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వమని’ చెప్పుకునే కూటమి పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో లక్షల మంది యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రతి హామీని గుర్తుంచుకుంటున్నారని, ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారని హెచ్చరించారు. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, వ్యతిరేకతకు అద్దంపట్టాయి... వారి ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాలను పరిశీలిస్తే....కూటమికి కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోనూ కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, బద్వేలు ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని, ఆ సభ ప్రభుత్వ పతనానికి వీడ్కోలు సభలా అనిపించిందన్నారు. రెండేళ్లయినా ఇంకా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, వైఎస్ జగన్ నామస్మరణ చేయడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో అన్నివర్గాల అండ, ప్రజాబలం, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రజలకు ... వారికి తోడుగా నిలబడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, ఫయాజ్ పాల్గొన్నారు. -
15 నుంచి ఆందోళనలు
ఎర్రగుంట్ల : విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరాల కోసం ఈ నెల 15 నుంచి దశల వారీగా చేస్తున్నట్లు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీపీపీలో తన యూనియన్ కార్యాలయంలో ఆందోళనలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు.నేడు కవితా పురస్కార సభ ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వసంతపేటలోని శ్రీకోదండరామస్వామి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పల్లా జాతీయ కవితా పురస్కారం–2026 సభ నిర్వహించనున్నట్లు యువ సాహితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది అనంతపురానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకులు ఉమ్మడిశెట్టి రాధేయ రాసిన పావుకోళ్లు కవితా సంపుటికి పురస్కారం దక్కిందని వివరించారు. సాహితీ మిత్రులు సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా రైతుకు పురస్కారం కడప అగ్రికల్చర్: పెండ్లిమర్రి మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు పి.రాజశేఖర్కు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు లభించింది. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ స్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అభ్యుదయ రైతు’ పురస్కారాన్ని అందజేశారు. గుంటూరులో జరిగిన ఈ ఘనమైన వేడుకల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) సత్యనారాయణ చేతుల మీదుగా రైతు రాజశేఖర్ ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకున్నారు. రైతు పి.రాజశేఖర్ సాధించిన ఈ విజయానికి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డాక్టర్ వి.శిల్పకళ, సిబ్బంది ఆయనను శనివారం ఘనంగా సత్కరించారు. గిరిజన బిడ్డకు ఐఐటీలో సీటు వేంపల్లె : బక్కన్న గారి పల్లె గ్రామానికి చెందిన బంజారా గిరిజన బిడ్డ ధార్మిక్ వెంకట్ నాయక్ చైన్నె ఐఐటీలో సీటు దక్కించుకున్నారు. శనివారం వేంపల్లె జెడ్పిటీసీ రవికుమార్ రెడ్డి ధార్మిక్ వెంకట నాయక్ను అభినందించారు. ఐఐటీలో ఆలిండియా 27వ ర్యాంకు సాధించి సీటు పొందడం సంతోషకరమైన విషయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రమేష్ నాయక్, తావు నాయక్ పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం!
● 8.50 లక్షల ఇళ్ల పూర్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ● మంత్రి కొలుసు పార్థసారథి ప్రొద్దుటూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని బొల్లవరం హౌసింగ్ లేఅవుట్లో శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను మంత్రి నిశితంగా పరిశీలించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెప్మా మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సుమారు రూ.48 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలను వెలికితీసి నిధులు పక్కదారి పట్టించినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.50 లక్షల ఇళ్ల లక్ష్యం రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ రంగాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మరో 4 లక్షల ఇళ్లను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పేదలకు అందజేస్తామని, ఇళ్ల నిర్మాణంతో పాటు లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, హౌసింగ్ సీఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, తహసీల్దార్ ఉదయభాస్కర్, హౌసింగ్ డీఈలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. -
సమస్యలే తొలి పాఠం
కడప ఎడ్యుకేషన్ : వేసవి సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ యజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో అసౌకర్యాలు స్వాగతం పలికాయి. ‘బడి తెరిచిన రోజే పిల్లలందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేస్తాం. అదే రోజు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలకు జమ చేస్తాం’ అని చెప్పిన మాటలన్నీ నీటి మీద బుడగలనేని మరోమారు కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బడి తెరిచిన రోజే అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక పంపిణీ చేసి ప్రభుత్వ బడుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా విద్యార్థులు పాత యూనిఫాం, పాత బ్యాగులు, పాత చెప్పులతో పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలకు విద్యాకానుక కిట్లు ఇచ్చినా.. అందులో అన్ని వస్తువులు అందలేదు. బ్యాగు, బెల్ట్, షూ, సాక్సులతోపాటు 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలు అసలు పాఠశాలకే రాలేదు. దీంతోపాటు కొన్ని పాఠశాలల్లో నోట్బుక్స్, వర్క్బుక్స్, పాఠ్యపుస్తకాలు కూడా కొంతమంది విద్యార్థులకు అందలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు నిరాశ చెందారు. ఇక తల్లికి వందనం విషయానికి వస్తే పాఠశాలలు తెరిచిన రోజే తల్లుల ఖాతాలకు నగదు జమ చేస్తామని చెప్పారు. అది కూడా ఎంత మంది పిల్లలను బడికి పంపితే.. అందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాకు నగదు జమ చేస్తామన్నారు. తీరా బడి తెరిచే నాటికి జూలై మొదటి వారంలో జమ చేస్తామని చెప్సి తుస్సుమనిపించారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మొదటి రోజే పిల్లలు నిరాశ నిస్పృహలకు గురి కావాల్సి వచ్చింది. మొదటి రోజు... జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథకోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 3145 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 324371 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 277980 మంది విద్యార్థులు హాజరై 85.5 శాతం హాజరు నమోదైంది. మొదటి రోజు అంతంత మాత్రంగానే విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం తర్వాత మరుసటి రెండు రోజులు సెలవులు కావడంతో విద్యార్థులు పెద్దగా రాలేదు. దీంతో పాఠశాలల్లో పండగ వాతావరణం కన్పించలేదు. పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు అరకొరగా విద్యామిత్ర కిట్లు తొలిరోజు అంతంత మాత్రమే హాజరు -
వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’నిరసన కార్యక్రమం విజయవంతమైంది. సీఎం చంద్రబాబు సర్కార్పై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. నియోజకవర్గ కేంద్రాలు శుక్రవారం నిరసన ర్యాలీలతో హోరెత్తాయి. ప్రజల్ని వంచించిన సీఎం చంద్రబాబుకు పాలించే అర్హత లేదంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ప్రజల్ని వంచించిన ముగ్గురు మోసగాళ్లుంటూ ధ్వజమెత్తారు. వేలాది మంది నిరసనలో పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద దివంగత వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకూ వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతి ఏదంటూ మండిపడ్డారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎక్కడంటూ చంద్రబాబు సర్కార్ను నిలదీశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రజల్ని వంచించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సూపర్ సిక్స్ పేరుతో మోసం జమ్మలమడుగు పట్టణంలో టీటీడీ కల్యాణ మండపం వద్దనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులు అర్పించిన అనంతరం.. నారాపుర స్వామి దేవాలయం మీదుగా పాలగాడిమోట్, కాపు వీధి, పెద్దమ్మ మోటు, మార్కెట్ వీధి మీదుగా పాత బస్టాండ్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సర్కార్ అన్నీ వర్గాల ప్రజల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా పేదల సంక్షేమమే ఎజెండాగా వైఎస్సార్సీపీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలిస్తే, తద్భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బద్వేల్ పట్టణంలో సిద్దవటం రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సుమారు 145 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ విస్మరించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ ఆటలు ఆడుతోందని, డీఎస్సీలో సైతం అక్రమాలకు అవకాశాలు కల్పించారని ఆరోపించారు. రాజంపేటలోని ఆర్అండ్బి అతిథి గృహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ టీడీపీ మ్యానిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలంటూ చంద్రబాబు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. కమలాపురంలో గ్రామ చావిడి వద్ద నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మోసాలతో ప్రజలు విసిగిపోయారని, నీతి తప్పిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టగా వర్ణించారు. నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్రామాంజులరెడ్డి మాట్లాడుతూ దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కాపాడగలరన్నారు. చంద్రబాబు సర్కార్ను ప్రజలు బంగాళఖాతంలో కలపనున్నట్లు తెలిపారు. ముగ్గురు మోసగాళ్ల శైలిపై ధ్వజం ప్రొద్దుటూరులో మున్సిపల్ ఆఫీసు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పార్టీ రంగులతో కూడిన గొడుగులు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్, పవన్కళ్యాణ్ కలిసికట్టుగా ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. ముగ్గురు మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మైదుకూరు పట్టణంలో ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న మూలబాట నుంచి కడప రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద మోసగాడు చంద్రబాబేనని తెలిపారు. జీవితమంతా ప్రజల్ని వంచించడమేనని విమర్శించారు. కడప నగరంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కోటిరెడ్డిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. సమన్వయకర్త, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ అపరమేధావి ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకొనే చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇచ్చి గద్దెనెక్కారన్నారు. మాజీ మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ కూటమి సర్కార్లో అరాచకాలు, దౌర్జన్యాలు అధికం అయ్యాయని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాబట్టే వైఎస్సార్సీపీకి విశేష మద్దతు లభిస్తోన్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్లమయం అయ్యిందని, పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని, సీబీఐ విచారణ చేయించాలని కోరితే సర్కార్ తోకముడుస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొని కదం తొక్కాయి. ప్రజలు ఎక్కడికక్కడ భారీగా పాల్గొని పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం విశేషం. కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు వంచించిన చంద్రబాబుకు పాలించే అర్హతలేదని మండిపాటు హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల ఆగ్రహం నియోజకవర్గ కేంద్రాల్లో వెల్లువెత్తిన నిరసన ర్యాలీ -
మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీగా గీతా బాయి
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం(జోన్–4) రీజనల్ డైరెక్టర్గా డాక్టర్ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ రీజనల్ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ రామ గిడ్డయ్య ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఈ స్థానంలోకి డాక్టర్ గీతాబాయి రానున్నారు. డాక్టర్ నాగరాజుకు ఆర్డీగా పదోన్నతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పని చేస్తున్న డాక్టర్ నాగరాజుకు రీజినల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈయన గుంటూరు(జోన్ –3) ఆర్డీగా బాధ్యతలు చేపట్టనున్నారు. కడప ఆర్డీగా రావడానికి ప్రయత్నాలు కాగా కడప ఆర్డీగా డాక్టర్ గీతా బాయిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడికి ఆర్డీగా రావడానికి ఒకరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెద్ద స్థాయిలో పావులు కదిపితే ఆ అధికారి ప్రయత్నం ఫలిస్తుందని, లేదంటే ఇక్కడికి ఆర్డీగా గీతాబాయి రావడం తథ్యం అనే ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలకు ఈ నెల 30తో తెరపడనుంది. పసికందు మృతదేహంపై విచారణకడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ సమీపంలో ముళ్ల పొదల్లో ముక్కుపచ్చలారని పసికందు మృతదేహాన్ని గుర్తుతెలియని వారు పడేసిన సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన పవన్, సింహాద్రిపురానికి చెందిన దివ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భవతిగా ఉన్న దివ్య ప్రసవ వేదనతో ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నెల 8న దివ్యకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అక్కడ నుంచి కడపలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఈనెల 10న ప్రైవేట్ ఆసుపత్రి వైద్య బృందం దివ్య ఆరోగ్య పరిస్థితిని గమనించి ఆపరేషన్ ద్వారా మగ బిడ్డను ప్రసవింపచేశారు. అయితే.. అప్పటికే మగబిడ్డ విగత జీవిగా మారిపోయాడు. అదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్న నరసింహులు చేతికి పసికందు మృతదేహాన్ని తండ్రి పవన్ దహన సంస్కారాలు చేయాలని అప్పగించాడు. అందుకు రూ.1500 డబ్బులు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డ్ నరసింహులు మద్యం తాగి పసికందు మృతదేహాన్ని వినాయకనగర్లోని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ మృతదేహాన్ని తమ నోటికి కరిపించుకొని కుక్కలు తీసుకెళ్తూ ఉండగా స్థానిక ప్రజలు గమనించి వెంటపడ్డారు. కుక్కలు మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాయి. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ సెల్కే నచ్చితే విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా సీఐ నరసింహారాజు, ఎస్సై రఫీ తమ సిబ్బందితో విచారణ చేపట్టారు. సెక్యూరిటీ గార్డ్ నరసింహులును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఎస్సై తెలియజేశారు. పోలీసుల అదుపులో పరారైన జీవిత ఖైదీకడప అర్బన్ : ౖవెఎస్ఆర్ కడప జిల్లా కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తూ ఈనెల 11వ తేదీన తెల్లవారుజామున తిరుమల ఎక్స్ప్రెస్లో గూడూరు సమీపంలో ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన జీవిత ఖైదీ సాకే రాజ్కుమార్ను ప్రొద్దుటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది తప్పిదమా? లేక రాజ్ కుమార్ ఎస్కార్ట్ సిబ్బంది కన్నుగప్పి పరారయ్యాడా? అనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టారు. పోలీసు గాలింపు చర్యల్లో ఎట్టకేలకు 24 గంటల్లోపే.. ఖైదీని అదుపులోకి తీసుకోవడం, విచారణ చేపట్టడం జరిగింది. సంఘటనలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. -
ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం
– సోషల్ మీడియాలో వీడియో వైరల్ జమ్మలమడుగు : తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ్రెడ్డి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పట్టణ పరిధి బెడుదూరుకు చెందిన మనోజ్ శుక్రవారం వీడియో రికార్డు చేసి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. స్థానికులు ఆయనను తాడిపత్రిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి బంధువుల వివరాల ప్రకారం.. మనోజ్ గతంలో బెడుదురులో రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత భూమి విక్రయించిన రైతు బంధువులైన గురుశేఖర, లక్షుమయ్య రెండెకరాల భూమిని తమకు తిరిగి ఇవ్వాలంటూ మనోజ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతోపాటు పోలీసులను ఆశ్రయించారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ్ వద్ద పంచాయితీ పెట్టించారు. ఈ కేసుకు సంబంధించి మనోజ్ హైకోర్టు నుంచి ఎస్ఐకి నోటీసులు పంపించారు. దీన్ని మనసులో పెట్టుకుని ఎస్ఐ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎస్ఐతోపాటు మరికొందరు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి మనోవేదనకు గురి చేస్తుండటంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్లో ఉన్న 268 టన్నుల స్టీల్ దొంగతనం విషయం హౌసింగ్ పీడీతోపాటు మరికొందరి అధికారుల పాత్ర ఉందని ఈ కేసులో సస్పెండ్ అయిన రూరల్ ఏఈ కేఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసు కేసు నమోదైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పీడీ సూచన మేరకు ముందస్తు బెయిల్ కోసం తాను ఊరు వదిలి వెళ్లానని చెబుతూ శుక్రవారం వీడియో రిలీజ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎవరికి స్టీల్, సిమెంట్ అదనంగా ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిల్వలను అలాగే ఉంచాలని హౌసింగ్ ఎండీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గతేడాది విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి స్టీల్ నిల్వలు ఉన్నా యని ధ్రువీకరించారన్నారు. ఈ ఏడాది మొదట్లోనే స్టీల్ మాయమైందన్నారు. అధికారులు 268 టన్నులు మాయమైనట్లు చెబుతున్నారని, వాస్తవానికి 212 టన్నులు మాత్రమే అని తెలిపారు. సంస్థలో పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ జయ నరసింహులు, రవికుమార్, ఏఈ టీకే ప్రతాప్రెడ్డి, ఈఈ రాజశేఖర్ల పాత్రపై తనకు అనుమానం ఉందన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ జయ నరసింహులు కోట్ల రూపాయలు అక్రమా స్తులు సంపాదించాడన్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, గతంలోనే బద్వేలు మండలానికి అదనపు విధులు నిర్వహించాలని పీడీ సూచించారన్నారు. తానే వద్దని వెళ్లలేదని తెలిపారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి
కడప సెవెన్రోడ్స్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కార్మిక, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మెకానిక్ షాపులు, హోటళ్లు, గ్యారేజీలు, గనులు, సిమెంట్ పరిశ్రమల్లో బాల కార్మికుల నియామకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతకుముందు స్థానిక మున్సిపల్ హైస్కూల్లోని స్మార్ట్ కిచెన్ను సందర్శించిన శ్రీనివాసమూర్తి, వంట సిబ్బంది తప్పనిసరిగా చేతి తొడుగులు, తల టోపీలు, ఏప్రాన్లు ధరించాలని సూచించారు. స్థానిక రామాంజనేయపురంలోని రెవెన్యూ సేవా సమితి నిర్వహిస్తున్న అమ్మఒడి ఆశ్రమాన్ని సందర్శించిన డా.శ్రీనివాసమూర్తి, అక్కడి బాలలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కడప సెంట్రల్ జైలు, మహిళా జైలును సందర్శించిన ఆయన, రిమాండ్ ఖైదీలలో 18 సంవత్సరాల లోపు బాలలు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించారు. సాయంత్రం సీకే దిన్నె మండలంలోని బుగ్గలపల్లి దళితవాడను సందర్శించి, అంగన్వాడీ కేంద్రంలో సేవలు పొందుతున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రమాదేవి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, పోలీసు శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బాలబాలికలు పాల్గొన్నారు. -
కడపలో యువకుడి దారుణ హత్య
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఒంటిమిట్ట మండల పరిధిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ సంఘటనపై కడప రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్, మృతుడి తండ్రి మునెయ్య, బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వేకోడూరు మండలానికి చెందిన చింతా రామసుబ్బారెడ్డి గత 15 సంవత్సరాలుగా కువైట్కి జీవనాధారం కోసం వెళ్లి ఇండియాకు అప్పుడప్పుడు వస్తుంటాడు. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల కిందట రామ సుబ్బారెడ్డి, తన భార్య మధురవాణి, కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి కడపలో రిమ్స్కు వెళ్లే దారిలో ఉన్న విన్యాస అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. అప్పటి నుంచి చిట్వేలి మండలం సిద్ధారెడ్డిపల్లెకు చెందిన అక్కుపల్లి మునెయ్య కుమారుడు వంశీ(25).. రామసుబ్బారెడ్డి వాహనానికి డ్రైవర్గా పని చేస్తున్నాడు. రామ సుబ్బారెడ్డి గత ఏడాది నుంచి కడపలోనే ఉంటున్నాడు. రామ సుబ్బారెడ్డి సతీమణి మధురవాణి కడపకు వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ వ్యాపారం చేస్తూ, కువైట్ ఇతర దేశాలకు వస్తు సామగ్రిని ఎగుమతి, దిగుమతి చేస్తుండేది. ఈ క్రమంలో మధురవాణి, డ్రైవర్ వంశీతో సన్నిహితంగా ఉండేదని రామసుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన రామసుబ్బారెడ్డి తమ డ్రైవర్ వంశీని తనతో పాటు వాహనంలో బయటికి తీసుకెళ్లాడు. తర్వాత ఇంటికి రాలేదు. ఈ నెల 11వ తేదీన వంశీ తండ్రి మునయ్య తన కుమారుడికి ఫోన్ చేసినా స్పందించలేదు. వంశీ యజమాని రామసుబ్బారెడ్డికి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీతోపాటు రామసుబ్బారెడ్డి ఇంటికి రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీపంలో రాచపల్లి పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడి శవం కనిపిస్తే స్థానిక ప్రజలు అక్కడి కానిస్టేబుల్కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఈనెల 11వ తేదీ రాత్రి అక్కుపల్లి వంశీ కనిపించడం లేదని రిమ్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. మునెయ్యను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి యువకుడి మృతదేహాన్ని పరిశీలింప చేయగా తన కుమారుడు వంశీ మృతదేహమే అని గుర్తించాడు. ప్రాథమికంగా ఇది హత్యగా గుర్తించారు. కడప రిమ్స్ వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తండ్రికి అప్పగించారు. మృతదేహంపై దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు. తన కుమారుడి మరణానికి అతని యజమాని రామసుబ్బారెడ్డి కారణమని పోలీసులకు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై రిమ్స్ సీఎస్ సీఐ రాజగోపాల్, ఇన్చార్జి ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి తమ సిబ్బందితో కలిసి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
పులివెందుల : ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు అనేక అబద్ధపు హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో సంతకాలు చేసిన బాండ్ల కాపీలు కూడా ఇచ్చానని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలు కానీ, వాటితోపాటు మేనిఫెస్టోలో పెట్టిన మరో 143హామీలు ఎంతమాత్రం అమలుపరిచారో ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి పెద్దలకు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండేళ్లలో అంతా చేశామని చెప్పుకుంటూ విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడం కూటమి నేతలకే చెల్లిందని విమర్శించారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమవుతున్నా.. తల్లికి వందనం పథకం ఊసేలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానంగా పవిత్రంగా భావించి మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కూటమి నాయకులకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. నేటి ర్యాలీలను జయప్రదం చేయండి... చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసన ర్యాలీలలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. -
ఇకపై ఇలా...
● ముగిసిన వేసవి సెలవులు ● తల్లిదండ్రులపై గురుతర బాధ్యత కడప ఎడ్యుకేషన్: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్నాళ్లు ఇళ్లల్లో అల్లరి చేసిన చిన్నారులు ఇక బడిబాట పట్టనున్నారు. మూలన పడేసిన స్కూల్ బ్యాగులు దుమ్ముదులిపి సర్దుకొని భుజాన తగిలించనున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా వారిని బడికి పంపేందుకు సన్నద్ధమవుతూ వారికి కావాల్సిన విద్యా సామగ్రిని సిద్ధం చేసి వారిని బడికి పంపే పనిలో పడ్డారు. ఒకటా రెండా 50 రోజుల పాటు అల్లరి చేసిన పిల్లలు ఒక్కసారిగా బడిబాట పట్టాలంటే కాసింత భారంగా ఉంటుంది. భారమైన బడివైపు అడుగులు వేయాల్సిందే. వారిని సిద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులదే. వారం ముందు నుంచే ప్రణాళికతో... తల్లిదండ్రులు వారం ముందు నుంచే తమ పిల్లల చదువులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు, ఇతర వస్తువులు సమకూర్చుకున్నారు. దీంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో ముందుగా ఫీజులు చెల్లించడం, పుస్తకాలు, ఇతర సామగ్రి కోసం డబ్బులను కట్టి విద్యాసామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఠారెత్తించిన ఎండలతో... దుమ్మురేగిన ఆటలతో కుస్తీ ముగిసింది.. బళ్లో పాఠాలతో.. పుస్తకాల బ్యాగులతో దోస్తీ కట్టే వేళయింది.. అమ్మమ్మ ఊరిలో చేసిన సందడికి.. అయ్య కారులో తిరుగుతూ చేసిన అల్లరికి బైబై చెప్పే సమయం ఆసన్నమైంది.. అదిగో.. గణగణమంటూ బడిగంట శబ్దం మోగింది... ఇదిగో.. సావాసగాడితో జతకట్టి వెళ్లే క్షణం రానే వచ్చింది... సుమారు యాభై రోజుల వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. రా రమ్మంటూ పిల్లలను ఆహ్వానిస్తున్నాయి.. బడికెళ్లేటప్పుడు ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేసేవారో ఇప్పుడు అదే సమయానికి పిల్లలను మేల్కొనేలా చూడాలి. సెల్ఫోన్లు చూడటం మాన్పించాలి. ఇప్పటి వరకు రోజుకు రెండు మూడు గంటల చూస్తే వచ్చే వారం పదిరోజులు రోజుకు అరగంట మించకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. కథల పుస్తకాలు, జీవిత చరిత్ర, వ్యక్తిత్వ వికాస, తరగతి పుస్తకాలు రోజుకు కనీసం అయిదారు పేజీలైనా చదివేలా చూడాలి బడికెళ్లేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర వేళకు భోజనం క్రమశిక్షణగా చేసినట్టే ఇప్పుడూ అలవాటు చేయాలి. చిరుతిళ్లను మాన్పించాలి. పాఠశాలల్లో భోజన సమయాలను తెలుసుకుని ఇప్పటినుంచే ఆ విధంగా అందించాలి 1361 బేసిక్ ఫౌండేషన్ స్కూల్స్207 జిల్లాలో ఫౌండేషన్ స్కూల్స్35 అప్పర్ ప్రైమరీ స్కూల్స్397 మండల పరిషత్తు స్కూల్స్ 307 హైస్కూల్స్(ఇంక్లూడింగ్ బీపీఎస్ +ఎంిపీఎస్)886 ప్రైవేటు స్కూల్స్64 ఎయిడెడ్ స్కూల్స్ -
చట్టాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించం !
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి కడప కోటిరెడ్డిసర్కిల్ : పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల చట్టాల అమలులో అలసత్వం వహిస్తే సహించబోమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యా హక్కు అమలు, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నియంత్రణ, పాఠశాలలు–హాస్టళ్లలో భద్రతా ప్రమాణాల అమలుపై జిల్లా స్థాయి వర్క్షాప్, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యా హక్కు చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, జువైనెల్ జస్టిస్ చట్టం అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
బాబు హామీ మూగబోయింది
● అరకొరగానే విద్యాకానుక ● నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ● నేటికీ రాని బ్యాగులు, షూ, బెల్ట్, డిక్షనరీలు కడప ఎడ్యుకేషన్ : కూటమి మాట ఒట్టిమాటేనని తేలిపోయింది.. బడాయి మాటలు చెప్పడం ఆపై వెనకడుగు వేయడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పాఠశాలలు తెరిచేనాటికి విద్యాకానుక ఇస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పిన హామీలు నీటి మూటగానే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. విద్యాకానుక కోసం ఎదురు చూస్తున్న పిల్లల ఆశలపై బాబు సర్కారు నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు తొలి విడతగా యూనిఫాం, నోట్బుక్స్, టెక్స్బెక్స్, వర్కుబుక్స్, డిక్షనరీలు మాత్రమే పంపిణీ చేయ నుంది. మిగతా బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్తోపాటు డిక్షనరీలు అసలుకే రాలేదు. బుక్స్ ఇస్తారు సరే .. ఆ పుస్తకాలను ఎక్కడ పెట్టుకోవాలోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అరకొరగా విద్యాకానుక వస్తువులు.... జిల్లావ్యాప్తంగా 40 మండలాల్లో 2425 పాఠశాలలు ఉన్నాయి, ఇందులో 1,37,498 మంది విద్యార్థులు ఉన్నారు. నోట్బుక్స్(6వ తరగతి నుంచి 10వ తరగతి) 7,24,453 రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 717428 రాగా ఇంకా 7025 నోట్బుక్స్ రావాల్సి ఉంది. ఇక వర్కుబుక్స్ 5967, టెక్స్ బుక్స్ 29172 రావాల్సి ఉంది. ఇక బ్యాగులు, బె ల్ట్, ఆక్స్పర్డ్ డిక్షనరీ(6వ తరగ తి)సంబంధించి షూ, సాక్సులు ఒక్కటీ పాఠశాలలకు చేరలేదు. జగన్ హయాంలో తొలిరోజే విద్యాకానుక.. గత వైఎస్సార్సీపీ సర్కార్ పాఠశాలలు పునః ప్రారంభంరోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్ అందించేది. దీంతో పిల్లల ముఖంలో ఆనందం వెల్లివిరిసేది. విద్యాకానుక కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్లు, మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగు, జత షూ, రెండు జతల సాక్సులు, బెల్ట్లు ఉండేవి, దీంతోపాటు యూనిఫాంకు సంబంధించి కుట్టుకూలి కూడా ప్రభుత్వమే చెల్లించేది. నెల రోజుల ముందుగానే విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుని అందుకు తగ్గట్టుగా షూ పంపేవారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థికబారం పడేదికాదు, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కూడా ఇంకా బ్యాలెన్సే పెట్టింది. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వారంలో అన్నీ అందజేస్తాం... విద్యాకానుకకు సంబంధించి ఇంకా రాని వస్తువులను వారం రోజుల్లో అందజేస్తాం. యుద్ధం కారణంగా కొన్ని వస్తువుల వచ్చే దానికి ఆలస్యమైంది. అవి రాగానే పిల్లలకు అందచేస్తాం. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి. విద్యా కానుక వివరాలు ఇలా..కాంపోనెంట్ ఇండెంట్ వచ్చినవి రావాల్సినవి బ్యాగ్స్ 129654 0 129654 బెల్టులు 89472 0 89472 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 11758 0 11758 (6వ తరగతి) షూ అండ్ సాక్స్ 129654 0 129654 నోట్బుక్స్ 724453 71,7428 7025 (6 నుంచి 10) వర్కు బుక్స్ 120996 115029 5967 టెక్స్ బుక్స్ 565852 536680 29,172 -
జోన్ మారుతోంది !
● జోన్ 4 నుంచి జోన్–5లోకి కడప ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ ● తగ్గనున్న ఉద్యోగుల సంఖ్య.. పని భారం ● మారనున్న వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన స్వరూపం కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖ జోన్ విభాగంలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం కడప కేంద్రంగా ఉన్న జోన్ –4 ప్రాంతీయ కార్యాలయం కడప పాత రిమ్స్లో కొనసాగుతోంది. ఈ శాఖ పరిధిలోకి వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి సత్యసాయి మొత్తం 8 జిల్లాలు వస్తాయి. దాదాపు 17 కేడర్లు, మొత్తం 11 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్ కు సంబంధించిన అంశాలతో పాటు ఉద్యోగ నియామకాల అంశాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. తాజాగా జోన్ లను విభజించడంతో ఆ శాఖ పరిధి తగ్గడంతో పాటు ఉద్యోగుల సంఖ్య.. పరిపాలనాపరమైన అంశాలు గ ణనీయంగా తగ్గనున్నాయి. ఉదాహరణకు కడప కేంద్రంగా ఉన్న జోన్–4 కార్యాలయం పరిధిలోకి ప్రస్తుతం 8 జిల్లాలు ఉండగా, ఇకపై జోన్–5 గా మారడంతో ఈ శాఖ పరిధిలోకి వైయస్సార్ కడప తో పాటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు మాత్రమే రానున్నాయి. మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 జోన్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నం జోన్–1, రాజమండ్రి జోన్ –2, గుంటూరు జోన్–3, వైయస్సార్ కడప జోన్ –4 గా ఉన్నాయి. తాజాగా జోన్ ల విభజనకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ ను, రాష్ట్ర ప్రభుత్వం జీఓ ను జారీ చేసింది. ఆ ప్రకారం 2 మల్టీ జోన్ లు, ఆరు జోన్ లు ఏర్పాటు కానున్నాయి. ఒక మల్టీ జోన్ పరిధిలోకి మూడు జోన్ల చొప్పున ఉంటాయి. ఆ ప్రకారం మల్టీ జోన్ –1 పరిధిలో జోన్–1 గా విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలు, జోన్ –2గా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, జోన్–3గా వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కష్ణాజిల్లాలు ఉంటాయి. మల్టీ జోన్–2 లో జోన్–4 గా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–5గా వైయస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, జోన్–6గా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు కొనసాగనున్నాయి. జోన్ కేంద్రాల కొనసాగింపుపై సందిగ్ధం.. ఇప్పటివరకు కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు కేంద్రాలుగా ప్రాంతీయ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. విభజన కారణంగా అదనంగా మరో రెండు కొత్తగా రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పనిచేస్తున్న ప్రాంతీయ కార్యాలయాలు అదే కేంద్రంలో పనిచేస్తాయా.. లేక మరొక చోటికి తరలిస్తారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు కానున్న రెండు ప్రాంతీయ కార్యాలయాలు ఆ జోన్ లకు సంబంధించి ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు అనే చర్చ ఆ శాఖ ఉద్యోగుల్లో జోరుగా కొనసాగుతోంది మార్పు వచ్చేనా...? జోన్ల పెంపు.. జోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాల కుదింపుతో ఆ శాఖ కార్యాలయం పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. అలాగే నియామకాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. కాగా కొత్త జోన్ల ఏర్పాటుతో ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు స్థానభ్రంశం కలగనుంది. అంటే అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించి మరొకచోటికి పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు ఇక్కడ మేము పనిచేయలేమంటూనే, ఉన్న సీట్లోనే పాతుకు పోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొంతమంది మరో ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ కార్యాలయం‘ఖజానాకు నిలయం’గా భావించడంతో కొంతమంది ఉద్యోగులు అక్కడ సీటు సంపాదించడానికి పాకులాడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఇక్కడ కొంతమంది ఉద్యోగ నేతల మధ్యవర్తిత్వం.. పెత్తనం పెద్దగానే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. -
పారదర్శకంగా ‘సర్’
కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సభా భవనంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఈడీటీలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తరుచూ ప్రజలు వలసలు వెళ్లడం, ఒకే వ్యక్తి పేరు పలు ప్రాంతాల్లో నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకే సర్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఎన్యుమరేషన్ దశలో బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేయాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను స్వీకరించి డిజటలైజేషన్ చేయాలన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే మూడుసార్లు సందర్శించి ఫారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరి ఓటునైనా విచారణ నిర్వహించిగానీ తొలగించడానికి వీలుండదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వంచనపై గర్జన
● కూటమి మోసపూరిత హామీలపై వైఎస్సార్ సీపీ రణభేరి ● రెండేళ్లపాలనపై నేడు నిరసన ర్యాలీలు కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ రణ భేరికి సిద్ధమైంది. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నేడు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోర్యాలీలు కొనసాగనున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీలు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాయి. రెండేళ్లు పూర్తయినా వాటిని సక్రమంగా అమలు చేయలేదని, ప్రధానమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి వాటిని విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అనేక స్కామ్లతో ముందుకు వెళుతుండడం, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో విఫలం కావడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు రణభేరి మోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 4వ తేదిన ఎక్కడికక్కడ టీడీపీ మ్యానిఫెస్టో ప్రతులను ప్రధాన కూడళ్లలో దహనం చేసి నిరసన తెలియజేశారు. అనంతరం 8,9 తేదీలలో నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించి ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో వివరించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా రవిశంకర్
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం జాయింట్ సెక్రటరీగా మైదుకూరుకు చెందిన జి.రవిశంకర్రెడ్డి నియమితులయ్యారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ రజక విభాగం అధ్యక్షుడిగా ప్రొద్దుటూరుకు చెందిన ఎం.లింగమయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 14న పురస్కారాలు ప్రదానం కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించిన తొగటవీర క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగరశాఖ అధ్యక్షుడు కళ్యా సుధాకర్, ప్రధాన కార్యదర్శి పల్లా నరసింహారావు వెల్లడించారు. గురువారం సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా 13 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఈనెల 14న ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్ లో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహుకరిస్తామన్నారు. కాశీపురం సుధాకర్రెడ్డికి ‘మట్టి మనిషి’పురస్కారం కడప సెవెన్రోడ్స్ : అవుకు మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గంగిరెడ్డి సుధాకర్రెడ్డిని ‘మట్టి మనిషి’పురస్కారానికి ఎంపిక చేశారని తపన సాహిత్యవేదిక వ్యవస్థాపకులు సడ్లపల్లె చిదంబరరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగంలో నిరంతరం అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న సుధాకర్రెడ్డిని ఈ అవార్డుకు కమిటీ ఎంపిక చేసిందని పేర్కొన్నారు. ఈనెల 21వ తేది ఉదయం 10 గంటలకు హిందూపురం టీచర్స్ కాలనీలోని తమ కార్యాలయంలో పురస్కార ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. మట్టిమనిషి పురస్కారానికి సుధాకర్రెడ్డి ఎంపిక కావడంపై కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి, రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ప్రతినిధి దండా ప్రసాద్, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జనార్దన్రాజు హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివితే ఉజ్వల భవితమదనపల్లె సిటీ: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీఈఓ సుబ్రమణ్యం అన్నారు. గురువారం స్థానిక లయన్స్ కంటి ఆస్పత్రిలో 2025–26 సంవత్సరంలో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాఽధించిన 16 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఓవరాక్షన్
కడప కార్పొరేషన్: కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలను ఆమె తరచూ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా గురువారం కడప నగరంలోని 47వ డివిజన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటిముందు ఇంటర్ లాకింగ్ టైల్స్ వేసి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.వెంటనే అడిషనల్ కమిషనర్ రాకేష్చంద్ర, టౌన్ ప్లానింగ్ అ«ధికారులు పాత తేదీతో స్థానికులు ఫిర్యాదు చేసినట్టు ఒక పత్రాన్ని సృష్టించి ఆగమేఘాలపై జేసీబీని రప్పించి మాజీ మేయర్ సురేష్ ఇంటిఎదుట ఉన్న ఇంటర్ లాకింగ్ టైల్స్, ర్యాంపును తొలగించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మాజీ కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని వారి వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేసినందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డికి చెందిన షాపుల ఎదుట ఉన్న ర్యాంపులను జేసీబీతో తొలగింపజేశారు. ఇటీవల ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీ ఎదుట కాలువ ఉందన్న నెపంతో కాలేజీ ముందు వైపు ఉన్న తాపలను జేసీబీతో కూల్చివేయించారు. నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిముందు వేసుకున్న టైల్స్, ర్యాంపును తొలగించడం అన్యాయమని మాజీ మేయర్ పాకా సురేష్ సతీమణి రాధిక అన్నారు. చాలా ఏళ్లుగా ఇవి ఉన్నాయని, స్థానికులకుగానీ, ఈ దారి వెంట వెళ్లే వారికిగానీ ఇబ్బంది కలిగించలేదన్నారు. అయినప్పటికీ గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు వచ్చిందంటూ జేసీబీ తెచ్చి కూల్చివేయడం దారుణమన్నారు. -
‘నా ఐదోతనాన్ని కాపాడండి‘
మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్క్లబ్లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్ సరి్టఫికెట్ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది. -
● ఏ తల్లి పాపమో !
అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన బిడ్డ.. ముళ్లపొదల్లో చేరి మృత్యు కౌగిట్లో జారిపోయాడు.. తండ్రి చేతుల్లో పెరగాల్సిన బిడ్డ.. శునకాల నోట చిక్కి విలవిల్లాడిపోయాడు.. ఎవరి పాపమో.. విధి శాపమో గానీ.. కళ్లు తెరవకుండా శాశ్వతంగా కన్నుమూశాడు.. కడప వినాయకనగర్ సమీపంలో ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిన హృదయ విదారక ఘటన కలిచివేస్తోంది. వినాయకసాగర్ ముళ్లపొదల సమీపంలో కుక్కలు ఓ పసికందును నోట కరుచుకుని తీసుకెళ్తుండటాన్ని గమనించారు. తీవ్ర గాయాలతో అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ తెలిపారు. – కడప అర్బన్ -
కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాపాడు మండలంలోని రాజువారిపేటకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి తనతో మాట్లాడాలని ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన వివాహితను కొన్ని రోజులుగా వేధించేవాడు. తన వెంట పడొద్దని సదరు మహిళ పలుమార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో మహిళ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యపుంగనూరు : మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి (67) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. మహిళకు పాము కాటుమదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని కురవూరుకు చెందిన రైతు ఏ. వెంకటరమణ భార్య ఏ. మునెమ్మ (60), ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్ద టమోటా చెట్లలో కాయలు కోస్తోంది. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న నాగుపాము మునెమ్మ కాలిపై కాటేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఆది వర్గీయుల దాడి
జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ దాడిలో ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్రెడ్డి, ఆయన తల్లి మేకల వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మాలేపాడులోని సర్వే నంబర్ 373లో 86 సెంట్ల స్థలాన్ని 2013లో ప్రసాద్రెడ్డి తండ్రి మేకల సుబ్బిరెడ్డి రూ.90 వేలకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో పంట సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ భూమిని ఎవరికీ తెలియకుండా ప్రొద్దుటూరుకు చెందిన టంగుటూరు మారుతీప్రసాద్, రావుశ్రీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ప్రొద్దుటూరు మండలంలోని రామాపురానికి చెందిన పైడికాలువ జగన్కు విక్రయించారు. బాధితులు 2015లో దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలలో తామే అనుభవంలో ఉన్నామని ప్రసాద్రెడ్డి ఆధారాలతో సహా నిరూపించుకోగా, ఆ భూమి ప్రసాద్రెడ్డిదేనని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో బుధవారం కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు పైడికాలువ జగన్, ఆయన తండ్రి ఓబన్న అలియాస్ జయన్న, పైడికాలువ ప్రసాద్, ఎర్రమాసి ప్రతాప్, పైడికాలువ భరత్ మరో 20 మంది కలిసి మారణాయుధాలతో భూమిలో దిగారు. ప్రసాద్రెడ్డి తల్లి వరలక్ష్మి వారికి అడ్డుచెప్పగా వారు ఆమైపె తీవ్రంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు నుంచి నేరుగా ఇంటికి రాగా, ఎమ్మెల్యే వర్గీయులు ఆయనపైనా దాడి చేశారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పరామర్శించారు. ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్రెడ్డి, ఆయన తల్లికి తీవ్రగాయాలు -
రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఆ సమయాల్లో ప్రత్యేక నిఘా, పటిష్ట ట్రాఫిక్ అమలు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 51 బ్లాక్ స్పాట్లు, 125 జీరో ఫెటాలిటీ క్రాష్ ప్రోన్ ప్రాంతాలు, 162 యాక్షనబుల్ ప్రదేశాల వద్ద తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. డివైడర్లను పగలగొట్టి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో అధిక జనసంచారం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు భద్రతా చర్యల్లో మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రవాణా శాఖ నిబంధనలు ఇవీ..
● ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు ● బడి బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ● అన్నీ సక్రమంగా ఉంటేనే ఎఫ్సీ ఇస్తామంటున్న అధికారులు కడప వైఎస్ఆర్ సర్కిల్: వేసవి సెలవులకు బైబై చెప్పే సమయం ఆసన్నమైంది.. పిల్లలు బడిబాట పట్టే వేళయింది. పిల్లలే కాదు వారిని తీసుకెళ్లే బస్సులు కూడా సిద్ధం కావాల్సిన తరుణం రానే వచ్చింది. అవును.. రవాణాశాఖ ఆధ్వర్యంలో అన్ని సామర్థ్య పరీక్షలు చేసుకుని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. కాగా గత ఏడాది జారీ చేసిన సర్టిఫికెట్లకు కాలం చెల్లడంతో ప్రస్తుతం జిల్లాలో ఈ ప్రక్రియ జరుగుతోంది. విద్యా సంస్థలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి కండీషన్లో ఉన్నాయో లేదో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏటీసీ సెంటర్ ద్వారా ఎఫ్సీలు జారీ గతంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రతి వాహనాన్ని ఒకటి రెండు కిలోమీటర్లు నడిపి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఈ పనిని బాబు సర్కారు ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. జిల్లాకు సంబంధించి వైవీయూ యూనివర్శిటీ సమీపంలో ఏటీఎస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల నుంచి బడి బస్సులను ఇక్కడికే తీసుకువచ్చి ఎఫ్సీ పొందాల్సి వస్తోంది. ఈ ఏటీఎస్ సెంటర్పై ఏమాత్రం అజమాయిషీ లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉదయం ఆరు గంటలకు బస్సు తీసుకొని వస్తే రాత్రి 9 గంటలైనా పని పూర్తి కావడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు 460 బస్సులు తనిఖీ జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, ప్రాంతాల్లో దాదాపు 618 పైగా విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 460 బస్సులను తనిఖీ చేశారు. వీటిలో 92 బస్సులకు ఎఫ్సీలు జారీ చేశారు. బడి బస్సులో లోపాలు ఉన్న 368 బస్సులకు నోటీసులు ఇచ్చారు. గుర్తిస్తున్న లోపాలు ఇవీ...... రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయ టకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పని చేయకపోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్ మెంట్ లేకపోవడం, ఎక్స్పైరీ డేట్తో ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తిస్తున్నారు ● స్కూల్ బస్సుకు డ్రైవర్గా 60 ఏళ్లు నిండిన వారు అనర్హులు ● బస్సు నడిపే డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ● డ్రైవర్ నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తప్పనిసరిగా తెలియ జేయాలి. డ్రైవర్లకు ఐదేళ్ల అనుభవం, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ● కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి నెల వాహనం ిస్థితి గతులను నమోదు చేయాలి. ఫిర్యాదు పుస్తకం ఉండాలి. ● బస్సులోని అన్ని లైట్లు, సిగ్నల్స్ ఖచ్చితంగా పని చేయాలి. ● బ్రేకులు కండీషన్లో ఉండాలి ● ఎమర్జెన్సీ డోర్, అగ్ని ఆర్పే పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి విద్యా సంస్థల బస్సులకు తప్పనిసరిగా ఎఫ్సీ కలిగిఉండాలి. దీనిపై ఇప్పటికే జిల్లాలోని విద్యా సంస్థలకు సమాచారం ఇచ్చాం. ఎఫ్సీ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లినా, నిబంధనలు పాటించకపోయినా బస్సులను సీజ్ చేసి జరిమానా విధిస్తాం. వీటిపై ప్రత్యేక బృందాలను నియమించాం. – వీర్రాజు, ఇన్చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా -
జూద స్థావరంపై పోలీసుల దాడి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం బ్రాహ్మణపల్లె రోడ్డులోని జూదస్థావరంపై ఎస్ఐ తిమోతి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 8 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టగా, నిందితులు పట్టుబడ్డారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని ఎస్ఐ తిమోతి పేర్కొన్నారు. గొర్రెల చోరీపై కేసు నమోదు ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలు చోరీ చేసిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గోపవరం గ్రామంలో రేకుల షెడ్డును కత్తిరించి అందులో ఉన్న 13 గొర్రెలు నిందితులు చోరీ చేశారు. గొర్రెలను నిందితులు బొలెరో వాహనంలో తీసుకెళ్లినట్లు బాధితుడు అనిల్కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొర్రెలు విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు బనగానపల్లెలో వాసులుగా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రాజు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్పీర్(31) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి బుధవారం తెలిపారు. చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్పీర్, గురుశేఖర్లు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేపలను నిల్వ చేసుకోవడానికి ఐస్ కోసమని ఇద్దరు కలసి ఈ నెల 8వ తేదీన స్కూటర్పై చెన్నూరుకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా తిప్పలూరు గ్రామంలోని సచివాలయం వద్దకు రాగానే తుఫాన్ వాహనం వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్ గౌస్పీర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసమని కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వృద్ధుడు అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని బొల్లవరానికి చెందిన వృద్ధుడు పందిటి సామేల్ (80) అదృశ్యంపై త్రీ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సామేల్ తమిళనాడులోని వేళాంగినికి వెళ్తున్నానని చెప్పి ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు వెళ్లిన అతను ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఊళ్లలోనూ, తెలిసిన చోట్ల వెతికినా అతని ఆచూకీ తెలియలేదు. త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రోబోటిక్ ల్యాబ్ను పరిశీలించిన డీఈఓ
రాజంపేట టౌన్ : పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ను బుధవారం డీఈఓ షంషుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ఈరోబోటిక్ ల్యాబ్ను త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మరో పది పాఠశాలల్లో రోబోటిక్ ల్యాబ్లను, స్టెమ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైస్కూల్స్లోని రోబోటిక్ ల్యాబ్స్ సిద్దాంతానికి, ఆచరణకు మధ్య వారధిగా పనిచేస్తూ అనుభవాలుగా మారుస్తాయన్నారు. ఫలితంగా విద్యార్థులు రోబోలను డిజైన్ చేసేందుకు, నిర్మించేందుకు, కోడ్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సి, ఇంజనీరింగ్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. హై స్కూల్ స్థాయిలో ఈ ప్రయోగాలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు. రోబోటిక్ ల్యాబ్ వల్ల విద్యార్థులు వైఫల్యాలను విశ్లేషించడం, కోడ్లోని సమస్యలను పరిష్కరించడం, హార్డ్వేర్ను సర్దుబాటు చేయడం, సవాళ్ళను ఎదుర్కోవడానికి పునరావృతమయ్యే దశలవారీ విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి విద్యార్థులు నేర్చుకుంటారని తెలిపారు. భవిష్యత్తులో రోబోల ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీపై పట్టు సాధించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ లంకాయగారి నాగయ్య, ఎంఈఓ–1 కొండూరు రఘునాధ్రాజు, ఎంఈఓ–2 సుబ్బరాయుడు, హెచ్ఎం నాగమణి, సైన్స్ ఉపాధ్యాయుడు, రోబోటిక్ ల్యాబ్ ఇన్ఛార్జ్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నా భర్తను అప్పగించండి మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్క్లబ్లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్ సర్టిఫికెట్ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది. -
బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్రోడ్స్ : జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా జే.భరత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో సర్వే, భూమి రికార్డుల నిర్వహణ, సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. జెడ్పీలో నియామకాలు కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాల కింద 22 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య, సీఈఓ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఈఓ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్: రాష్ట్రంలోకి రుతు పవనాల ఆగమనంతో జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 32.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే ఒంటిమిట్ట మండలంలో 18.2, లింగాల, దువ్వూరు మండలాల్లో 5.2, సీకేదిన్నె మండలంలో 4.6 ముద్దనూరు మండలంలో 2.4, బద్వేల్ మండలంలో 1.2, గోపవరంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. దుప్పి మాంసాన్ని పంచుకున్న ఇద్దరు అరెస్టు మైదుకూరు : వనిపెంట అటవీ రేంజ్లోని గంగాయపల్లె బీట్లో చుక్కల దుప్పి మాంసాన్ని భాగాలు చేసి పంచుకున్న ఇద్దరిని బుధవారం అటవీ అధికారులు అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. అటవీ రేంజ్ అధికారి చలపతి నాయుడు తెలిపిన వివరాల మేరకు.. గంగాయపల్లె బీట్లో బుధవారం ఉదయం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేసి చంపాయి. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన పది మంది ఆ దుప్పిని కోసి భాగాలు వేస్తున్న విషయాన్ని వనిపెంట అటవీ అధికారులకు తెలిసింది. వారు దాడి చేయగా వెంకటసుబ్బయ్య, ప్రసాద్ దొరికారు. ఆరు కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. డీప్యూటీ ఈఓ మీనాక్షిపై వేటు ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖాధికారి మీనాక్షిపై రాజకీయ వేటు పడింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఇటీవల జరిగిన డీఆర్సీలో ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తప్పించడంతో పాటు విద్యాశాఖ డైరెక్టరేట్లో రిపోర్టు చేసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియ ఆదేశాలు జారీ చేశారు. -
బాబు పేరు చెబితే మోసం గుర్తుకువస్తుంది
● 12న చేపట్టే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలి ● వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె.సురేష్ బాబుకడప కార్పొరేషన్ : ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది నిర్వహించనున్న నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె. సురేష్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక అపూర్వ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పింఛన్లు తప్పా మరేమీ ఇవ్వలేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చారన్నారు. పింఛన్ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు కోత కోశారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి రూ.13వేలే ఇస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 20లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని కేవలం 5 సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే మోసం, దగా, అబద్ధాలు గుర్తుకు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేదీ భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, క్లస్టర్ పార్టీ అధ్యక్షులు పి. రామ్మోహన్రెడ్డి, బీహెచ్ ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, మున్సిపల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు : పట్టణంలోని యూబి కాంపౌండులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా .. 15 ఏళ్ల క్రితం అహ్మద్బాషాతో వివాహం జరిగింది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాహనం ఢీకొని వృద్ధురాలికి గాయాలు మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముది వేడు వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలి పరిస్థితి విషమించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 70 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వృద్ధ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించామన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను ముదివేడు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
ప్రధాన క్రికెట్ బుకీలపై చర్యలేవీ..?
ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు రెండు నెలల పాటు జరిగాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకమునుపే పోలీసులు బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై దృష్టి సారించారు. అన్ని స్టేషన్ల పరిధిలోని బుకీలను పిలిపించి స్వయంగా ఏఎస్పీ విభూకృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐపీఎల్ ప్రారంభం అయ్యేనాటికే రెండు, మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కౌన్సిలింగ్కు ప్రధాన బుకీలెవ్వరూ హాజరు కాలేదు. చిన్నా చితకా క్రికెట్ పందేలు నిర్వహించే బుకీలు మాత్రమే కౌన్సిలింగ్కు వచ్చారు. ఈ ఏడాది మార్చి 28న ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మే 31న ముగిశాయి. ప్రధాన బుకీలందరూ ఇతర దేశాలకు వెళ్లారు. అక్కడే ఉంటూ రెండు నెలల పాటు నిర్విరామంగా బెట్టింగ్ నిర్వహించారు. టోర్నమెంట్ ముగియడంతో కౌన్సిలింగ్కు డుమ్మా కొట్టిన వారు, పోలీసుల లిస్టులో వాంటెడ్గా ఉన్న బుకీలు ఇప్పుడిప్పుడే సొంత గూటికి వస్తున్నారు. ఐపీఎల్ సీజన్లో అదృశ్యం.. సీజన్ ముగియగానే ప్రత్యక్షం.. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్్ అనేది ఈ రోజు పుట్టింది కాదు. ఇక్కడ క్రికెట్ పందేలను ప్రారంభించిన అనేక మంది బెట్టింగ్ డాన్లుగా ఎదిగారు. వీరి నీడన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది బుకీలు పని చేస్తున్నారు. ప్రొద్దుటూరు విషయానికొస్తే అధికార పార్టీలో ఉంటున్న కొందరు బుకీలు స్థానికంగా చక్రం తిప్పుతున్నారు. నిన్న మొన్నటి వరకు సబ్బుకీలు, కొరియర్ బాయ్లుగా ఉన్న యువకులు నేడు బడా బుకీలుగా మారారు. జిన్నారోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు బెట్టింగ్ కార్యకలాపాలను విస్తరించాడు..ఇతను కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ప్రధాన బుకీతో కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నాడు. వన్టౌన్ ప్రాంతంలో ఒకరు, బంగారు అంగళ్ల వీధిలో ఒక యువబుకీ, మైదుకూరు రోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, అతని సోదరుడు క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పొలిటికల్ అండతో ప్రొద్దుటూరులో అనేక మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాగానే వీళ్లంతా కువైట్, దుబాయ్, మస్కట్, శ్రీలంక తదతర దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే యాప్ల ద్వారా, ఫోన్లలోనూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. పోలీసుల భయంతో రెండు నెలల పాటు ఇతర దేశాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. ఇటీవలే ఐపీఎల్ సీజన్ ముగియడంతో తిరిగి ఒక్కొక్కరుగా ప్రొద్దుటూరుకు వస్తున్నారు. నాడు పోలీసుల భయంతో పారిపోయినోళ్లే.. నేడు పోలీసుస్టేషన్ల ముందే ఫోజులు కొడుతున్నారు ఐపీఎల్, టీ ట్వంటి వరల్డ్కప్ లాంటి క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో వారం రోజులు ముందే క్రికెట్ బుకీలు వారెంచుకున్న ప్రాంతాలకు వెళ్లిపోతారు. క్రికెట్ మ్యాచ్ల ముందు పోలీసులు పట్టుకుంటే బెట్టింగ్ నిర్వహించుకునేందుకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందుగా స్థావరాలకు చేరుకుంటారు. ఒక వేళ క్రికెట్ సీజన్ ప్రారంభమైనా బిక్కు బిక్కుమంటూ పోలీసులకు కనిపించకుండా దాక్కొని తిరుగుతుంటారు. క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో ఫోన్ నంబర్లను మార్చుకొని పందేలు నిర్వహిస్తుంటారు. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తిస్తారేమోననే భయంతో కొత్త సిమ్ కార్డులను తీసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తారు. క్రికెట్ మ్యాచ్లు ముగిసిన వెంటనే బుకీలు ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. రెండు నెలల క్రితం వరకు పోలీసులను చూస్తే భయపడిన బుకీలే ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై పోలీసుల ముందే జెంటిల్మెన్లా తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా అక్రమ క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు, నిఘా సంస్థలు ఎంత మేరకు పర్యవేక్షణ చేస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్రికెట్ సీజన్లో నీడలా మాయమై..ఫైనల్ మ్యాచ్ ముగిశాక ప్రత్యక్షమయ్యే ఈ జెంటిల్మెన్ల వ్యవహారంపై ఆయా పోలీస్స్టేషన్ల పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన క్రికెట్ పందేలు నిర్వహించే కొందరు వ్యక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీస్స్టేషన్లకు వెళ్లి పంచాయతీలు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో పాల్గొంటున్న వ్యక్తులతో కొందరు పోలీసు సిబ్బంది సన్నిహితంగా కనిపించడం ప్రొద్దుటూరులో పరిపాటిగా మారుతోంది. పలువురు ప్రధాన బుకీలపై కేసులు..? ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రొద్దుటూరు పోలీసులు పలువురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీసులు 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి రూ.11 లక్షలుపైగా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు షేక్ జావిద్ అలియాస్ బాలాజీ, అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సోదరుడు షేక్ జిలానిబాషాలు అరెస్ట్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మరో రూ. 14 లక్షలను జప్తు చేశారు. అలాగే వన్టౌన్ పోలీసులు ఆరుగురు బుకీలను అరెస్ట్ చేసి రూ. 2.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ. 4.14 లక్షలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ రెండు స్టేషన్లలో నమోదైన బెట్టింగ్ కేసుల్లో పలువురు ప్రధాన బుకీలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కారణంగా 5–6 మంది ప్రధాన బుకీలు ఇప్పటికీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఐపీఎల్ సీజన్లో అదృశ్యం.. సీజన్ ముగియగానే ప్రత్యక్షం రెండు నెలల పాటు విదేశాల్లో మకాం వేసిన క్రికెట్ బుకీలు ఇటీవల ఐపీఎల్ సీజన్ ముగియడంతో సొంతగూటికి పయనం క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో పోలీసుల లిస్టులో వాంటెడ్గా ఉన్న బుకీలే.. నేడు పెద్ద మనుషులుగా, సమాజ సేవకులుగా చలామణి మోస్ట్ వాంటెడ్ బుకీలపై పోలీసులు చర్యలు తీసుకుంటారా..! -
ఇంటిల్లిపాదికీ యోగానందం
కడప వైఎస్ఆర్ సర్కిల్: మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతమవుతుందని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’ కార్యక్రమానికి సుమారు 4 వేల మందికి పైగా హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. 16వ తేదీన గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించే ‘టూరిజం, హెరిటేజ్ యోగా’థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు విశేషంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తితో పాటు మంచి జీవనశైలి కుడా అలవడుతుందన్నా రు. సబ్ కలెక్టర్, కడప నగర కమిషనర్ హెచ్.ఎస్. భావన మాట్లాడారు. కడప ఆర్డీఓ మురళి, ఎస్డీసి హరిప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రవికుమార్, డీఎంహెచ్ఓ నాగరాజు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నిధీ మీనా -
ఇసుకమాఫియా కోరల్లో పెన్నమ్మ
● పరివాహక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ● ఇసుక తోడేస్తుండటంతో దెబ్బతింటున్న తాగునీటి పైపులైన్ ● ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసిన అధికారులుట్రాలీని వదిలి ఇంజన్తో పరారైన ఇసుకాసురులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్న అధికారులు ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పరిధి పోట్లదుర్తి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు పగిలిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రొద్దుటూరు, యర్రగుంట్ల ప్రాంతాలకు అధికార పార్టీ అండదండలతో వారి అనుచర వర్గీయులే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోట్లదుర్తి గ్రామ సమీపంలోని బ్రిడ్జి సమీంలోనే ఇసుకను తోడేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పెన్నానది అంతా గుంతలు పడింది. అడుగుభాగాన ఉన్న ఇసుకను తోడేయడంతో మట్టి మాత్రం నదిలో మిగిలింది. అధికారుల రాకతో పరుగులు పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రని గ్రామంలోని కొందరు బుధవారం రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ అమరేశ్వరీ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రమీల వీఆర్ఓ పెన్నానదిలోకి వెళ్లి దాడులు చేశారు. తర్వాత పోలీసులు వచ్చారు. అధికారులు వస్తున్నారని తెలిసి ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను వదిలి పరుగులు పెట్టారు. నదిలో ఉన్న ఐదు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అడుగంటిపోతున్న భూగర్భజలాలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్నానదిలోని ఇసుకపై అధికార పార్టీ నాయకుల అనుచర వర్గీయుల కన్నుపడింది. దీంతో ఇసుకను ఇష్టరాజ్యంగా తోడేస్తున్నారు. ఈ కారణంగా పైపులైన్ దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ప్రొద్దుటూరు నుంచి అధికంగా ఇసుక మాఫియ దారులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇసుక బయట ప్రాంతాలకు తరలిపోతోంది. -
చీటింగ్ వెనుక గూడుపుఠాణి !
రాజంపేట : జిల్లా వ్యాప్తంగా రాజంపేటలో సంచలనం రేపిన చిట్టీల వ్యాపారి కంచి నాగేంద్ర వర్మ కోట్ల రూపాయిలు బాకీ వెనుక గూడుపుఠాణి దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా రేకిత్తిస్తున్నాయి. తొలుత ఐసీఐసీఎస్ బ్యాంక్లో బీమా విభాగంలో పనిచేసిన ఈయన జనం దగ్గర డబ్బులు కాజేయాలని వివిధ రకాల పన్నాగాలతో వ్యూహం తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. మోసపూరిత విధానాలతో ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా అక్రమ సంపాదనను సమకూర్చుకున్నాడు. ఈ మాయమాటల గారిడితో మోసపోయిన బాధితుడు ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగేంద్రవర్మ మోసపూరిత ఆర్ధికలావాదేవీలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాబితా సేకరణలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యా రని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే గూడుపుఠాణి బయటికి వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత సహకారం? .. నాగేంద్ర వర్మకు పట్టణంలో టీడీపీ నేతగా వున్న వడ్డీ వ్యాపారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇతని వల్లనే ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేందుకు అవకాశం కలిగిందని టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఆయన ఇంటిలో జనానికి నాగేంద్ర పెట్టిన కుచ్చుటోపికి సంబంధించి బంగారం, వెండి రూ.కోట్లాది నగదు ఉందని టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ధికనేర వ్యవహారంలో ఇతని సహకారం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేనా అన్న అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడు రూ.50 కోట్లకుపైగా నగదు లావాదేవీలు జరిపాడంటే ఎవరి ప్రోత్సాహం ఉందనే అంశాలపై అనేక అనుమానాలు రాజంపేట వాసులలో కలుగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. నాగేంద్రవర్మకు సహకరించినది ఎవరు..? నిష్పక్షపాతంగా పోలీసు విచారణ జరిగేనా? మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగేనా రూ.కోట్లాది మార్పిడిపై ఐటీ దాడులు ఏవీ.. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా !
కడప కార్పొరేషన్/కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాచునూరు, నందిమండలం, అలిదెన, పగిడాల పల్లె, జమాల్పల్లె, కొండపేటలో మట్టి, గ్రావెల్, నల్లమట్టి మాఫియా రెచ్చిపోతోందని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల విలువైన మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రూ.కోట్లలో మట్టి, గ్రావెల్ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ దందాను బీజేపీ తరఫున ఖండిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా మైనింగ్ శాఖ స్పందించి, అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వృద్ధులకు శాపం
● జిల్లా ఆస్పత్రిలో ఆగిన కంటి శస్త్రచికిత్సలు ● రోజూ వచ్చి వెనుతిరుగుతున్న వైనం ● పనుల నిర్వహణపై శ్రద్ధ చూపని కూటమి నాయకులుప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో రూ. 20.50 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కాకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది నవంబర్ 17న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇతర పనులు కొంచెం ఆలస్యంగా చేసినా.. కంటి విభాగం మాత్రం మొదటి ప్రాధాన్యతగా మార్చి చివరి నాటికి పూర్తి చేసి తమకు అప్పగించాలని ఆస్పత్రి అధికారులు కోరారు. అంతకంటే ముందుగానే పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు, టీడీపీ నాయకులు చెప్పారు. కంటి విభాగం పనులు ఇప్పటికీ మందకొడిగా కొనసాగుతుండటంతో ఈ ఏడాది కంటి శస్త్రచికిత్స ఒక్కటి కూడా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలంలో 300కు పైగా కంటి ఆపరేషన్ల నిర్వహణ వేసవి కాలంలో పేద వృద్ధులు కంటి ఆపరేషన్లు చేయించుకుంటారు. ప్రొద్దుటూరులో ప్రైవేట్ కంటి ఆస్పత్రులు అనేకం ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు ఆరోగ్యశ్రీ కింద కూడా శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఆపరేషన్లు చేయడానికి 20 నుంచి 30 రోజుల వరకు సమయం చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ మంది జిల్లా ఆస్పత్రికి వస్తుంటారు. పైగా ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు బాగా చేస్తారనే భావనతో.. ఇక్కడికి రావడానికే ఎక్కువ శాతం మంది ఇష్టపడతారు. వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో ప్రతి యేటా 300కు పైగా జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. అయితే వేసవి ముగుస్తున్నా ఇప్పటికి ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. దూర ప్రాంతాల నుంచి ప్రతి రోజు ఆస్పత్రికి వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని కంటి విభాగంలో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారే కానీ.. ఇంత వరకు శ్వాబ్ పరీక్ష నిర్వహించలేదు. వారానికి ఒక సారి చొప్పున రెండు వారాలు ఆపరేషన్ థియేటర్లో శ్వాబ్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు, గాలిలో సూక్ష్మ జీవుల కాలుష్యాన్ని గుర్తించడం కోసం ఈ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడో.. కంటి ఆపరేషన్లు ప్రారంభమయ్యేది ఎప్పుడోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోగుల ఇబ్బందులకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. చేతులెత్తేశారు.. నవంబర్లో పనులు ప్రారంభించినా.. మొదట్లో రెండు, మూడు నెలలు మందకొడిగా సాగాయి. తర్వాత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు ఇతర టీడీపీ నాయకులు రెండు, మూడు సార్లు జిల్లా ఆస్పత్రిని సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. శిలాఫలకాన్ని ప్రారంభించి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఆస్పత్రిలోని 47 బ్లాకుల్లో మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో చిన్న పిల్లల వార్డు, బ్లడ్బ్యాంక్, మూడు ఆప రేషన్ థియేటర్లను ఆధునీకరించాల్సి ఉంది. 200 వరకు మరుగు దొడ్లు కూడా నిర్మించాలి. అలాగే గ్రౌండ్ఫ్లోర్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాన్ఫరెన్స్ హాల్, శానిటేషన్ వర్కర్ల గదులు, అంబులెన్స్ షెల్టర్ తదితర పనులను ఇంకా ప్రారంభించనే లేదు.కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం కంటి విభాగం భవనాన్ని ఈ నెలాఖరు నాటికి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెప్పాడు. సాధ్యమైనంత తొందరగా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కంటి విభాగం భవనంలో రూఫ్ వర్క్, పెయింట్ పనులు జరుగుతున్నాయి. తొందరలోనే కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆనంద్బాబు, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.ముత్యాలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కలసి ఆర్టీసీ పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటాలకు ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు టి.ముత్యాలరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీకి చెందిన విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం, డిపోలు ఖాళీ చేయించి ఆర్టీసీ విలువైన స్థలాలను లీజు పేరుతో ప్రవేటువారికి దారా దత్తం చేయడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని పేర్కొన్నారు. -
పగలంతా ఉక్కపోత.. రాత్రికి కుండపోత !
కడప కోటిరెడ్డిసర్కిల్: పగలంతా ఉక్కపోత... సాయంత్రానికి నల్ల మబ్బుల జాతర.. కాస్త పొద్దు వాలగానే ఒక్కసారిగా కుండపోత.. ఇదీ మంగళవారం కడపలో వాతావరణం. నల్లని మబ్బులన్నీ ఒక్కసారిగా కరిగిపోవడంతో కడప నగరం వర్షంలో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారుల్లోనే వర్షపు నీరు వరదలా పారింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్జీఓ కాలనీ, మృత్యుంజయకుంట, అప్సర సర్కిల్, చిన్నచౌకు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. మొత్తం మీద ఓ మోస్తరు వర్షం కారణంగా నగర వాసులకు తిప్పలు తప్పలేదు. కడపలో మురికి నీటితో కలిసి రోడ్డుపై పారుతున్న వర్షపునీరు -
స్మార్ట్ కిచెన్లతో ఆరోగ్యానికి భరోసా
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి శుభ్రమైన,సురక్షితమైన, పోషక విలువలు కలిగిన వేడివేడి భోజనం అందించడమే స్మార్ట్ కిచెన్ల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్మార్ట్ కిచెన్ల నిర్వహణపై సంబంధిత స్టేక్ హోల్డర్స్ కు అవగాహన పెంచే ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు కీలక మార్గదర్శకాలను వెల్లడించారు. స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్య సభ్యులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఈఓ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
వైన్షాప్లో చోరీ
వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి వైన్షాప్లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గుర్తు తెలియని దుండగులు స్థానిక తరిగొండ రోడ్డులో వైన్షాప్లోకి చొరబడ్డారు. దుకాణం పైకప్పు రేకులు తొలగించి, లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లోని రూ.76 వేల నగదు, మద్యం బాటిళ్లు చోరీ చేశారని క్యాషియర్ యుగంధర్రెడ్డి తెలిపారు. మంగళవారం షాప్ తెరిచేందుకు వెళ్లిన క్యాషియర్ యథావిధిగా షెట్టర్ తీసి లోనికి వెళ్లారు. అక్కడ క్యాష్ కౌంటర్ పెట్టెను పగలగొట్టడం గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు. పిచ్చి కుక్క వీరంగంమదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ కంబాలపల్లిలో మంగళవారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతోంది. గ్రామంలో ఊర, పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.


