YSR
-
వైఎస్సార్సీపీ పీఏసీలో జిల్లా నేతలకు చోటు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో జిల్లా నేతలకు చోటు కల్పించారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషాలకు ఇందులో చోటు కల్పించారు. పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో 33 మంది సభ్యులుగా ఉన్నారు. సమష్టి కృషితోనే విజయవంతం కడప అర్బన్: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమష్టి కృషితోనే కల్యాణ ఘట్టం విజయవంతంగా ముగిసిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి చిన్న ఘటనకు తావులేకుండా చూసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, జిల్లాలోని ఇతర విభాగాల సిబ్బందికి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించిన ఇతర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు మెడికల్ ఎంప్లాయీస్ సర్వసభ్య సమావేశం కడప సెవెన్రోడ్స్: పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు కడప నబీకోటలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్రీనివాసులురెడ్డి, ఎస్ఎండీ మహబూబ్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్రావు, నాయకులు టీడీకే సాగర్, జంబారపు అహారోన్, ఎస్.బాబా సాహెబ్లతోపాటు అనంతపురం, కర్నూ లు, చిత్తూరు జిల్లాశాఖల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కానున్నారన్నారు. జిల్లాలోని యూనియన్కు చెందిన నాయకులు, ఉద్యోగులు హాజరు కావాలని కోరారు. -
కాయ..కష్టం.. నేలపాలు!
కడప అగ్రికల్చర్/చక్రాయపేట: ఈ ఏడాది మామిడి రైతులు ఆశలు అడియాసలయ్యాయి. మొదల్లో మామిడి చెట్లకు పూత బాగానే ఉన్నా ఎండల తీవ్రత పెరగడంతో తెగుళ్లు సోకి చెట్లకున్న పూతంత రాలిపోయింది. పైగా అక్కడక్కడ పిందలు కూడా నేల రాలిపోతున్నాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి ఆశలు కుప్పకూలి పోయాయి. మామిడికి తెగుళ్లు తీవ్రత అధికంగా ఉండటంతో వేలకు వేలు ఖర్చు పెట్టి పురుగుమందులను పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాలకు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందని కానీ దిగుబడి చూస్తే వేలల్లో కూడా వచ్చేలా లేదని మామిడి రైతులు ఆందోళనలు చెందుతున్నారు. జిల్లాలో 9642 ఎకరాల్లో... జిల్లావ్యాప్తంగా 9642 ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. ఇందులో అత్యధికంగా చక్రాయపేట మండలంలో 3498.48 ఎకరాల్లో సాగులో ఉండగా సిద్దవటంలో 1744.25 ఎకరాల్లో, వేంపల్లిలో 680 ఎకరాల్లో, సీకేదిన్నె మండలంలో 356 ఎకరాల్లో ఇలా జిల్లావ్యాప్తంగా 35 మండలాల్లో కలిపి 9642 ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. వాతావరణ మార్పులతోపాటు రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో తెగుళ్ల బెడద అధికమయింది. ముఖ్యంగా పేనుబంక తెగులు అధికంగా ఉంది. వాటికి మందులు వాడినా ఫలితం అంతగా లేదని రైతులు తెలిపారు. ఎండలు తీవ్రత పెరిగే కొద్ది క్రమేపి పూత రాలి పోయిందని పలువురు రైతులు బాధ వ్యక్తం చేశారు. ఇతని పేరు మధుసూదన్రెడ్డి. చక్రాయపేట మండలం సురభి గ్రామం. 20 ఎకరాల్లో మామిడిని సాగు చేశాడు. ఈ ఏడాది మామిడి తోటకు దోమపడి పూత బాగా తగ్గింది. దాని నివారణకు దాదాపు ఆరు లక్షల రుపాయ లు ఖర్చు చేసి మందులు పిచికారి చేశాడు. ఫలితం లేదు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేద ని దిగాలు పడుతున్నాడు. జిల్లాలో చాలా మంది రైతుల పరిస్థితి దయనీయంగానే ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ ఏడాది వాతావరణ మార్పులతోపాటు ఎండల తీవ్రతతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.ఎకరాలకు 70 నుంచి 80 వేల దాకా పెట్టుబడులు పెట్టా. తీరా దిగుబడి చూస్తేనేమో అంత పరిస్థితి లేదు. చేసిన అప్పులు కూడా తీరే పరిస్థితి లేదు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – మల్లికార్జున, కుప్పకూటపల్లె, చక్రాయపేట మండలం. ఉన్నపంటను కాపాడుకోవాలి ఎండల తీవ్రతతో రాలిపోగా మిగిలిన పూత, పిందెలను కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సకాలంలో చెట్టుకు నీటి తడులు అందించడంతోపాటు సత్తువలను సకాలంలో అందించాలి. – డాక్టర్ వీరయ్య, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఉటకూరు ఎండలు, తెగుళ్లతో రాలిపోయిన మామిడి పూత అధిక ఉష్ణోగ్రతలే కారణమంటున్న శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారీగా తగ్గనున్న మామిడి దిగుబడులు ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నల వినతి -
టీమిండియాకు శ్రీచరణి ఎంపిక గర్వకారణం
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా కు చెందిన ఎన్.శ్రీ చరణి భారత సీనియర్ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.భరత్ రెడ్డి, కార్యదర్శి ఎ.రెడ్డిప్రసాద్ పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి శ్రీలంకలోని కొలంబియాలో ప్రారంభమయ్యే ట్రై నేషన్స్ వన్డే సిరీస్లో పాల్గొనే భారత సీనియర్ మహిళ క్రికెట్ జట్టుకు ఎంపికైన ఎన్.శ్రీ చరణికి శనివారం మధ్యాహ్నం కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. భరత్ రెడ్డి, ఎ.రెడ్డి ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి, రెడ్డిప్రసాద్ మాట్లాడుతూ మహిళ క్రికెట్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), అలాగే జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎంతగానో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని వైఎస్సార్ కడప జిల్లా మహిళా క్రికెటర్లు సద్వినియోగం చేసుకొని శ్రీ చరణి వలె మంచి ప్రతిభ కనబరచి ఇండియా జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీ చరణి మంచి ప్రతిభ కనబరచి భారత దేశానికి, ఇండియన్ మహిళా క్రికెట్కు, వైయస్సార్ కడప జిల్లాకు, ఏసీఏకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ చరణి మాట్లాడుతూ తను భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంపై గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. తాను ఇంతటి స్థాయికి చేరుకునేందుకు జిల్లా సీనియర్ క్రికెటర్లు ఎం. సురేష్, ఖాజా మైనుద్దీన్, తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి, ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి. నాగేష్ కుమార్ రాజు, సంయుక్త కార్యదర్శి ఎం.సాయి పృథ్వితేజ, కోశాధికారి ఎం. మహేంద్ర రెడ్డి, షేక్ సిరాజుద్దీన్ దౌలా, ఎన్ మౌనిక, సభ్యులు పి. సంజయ్ కుమార్ రెడ్డి, వై. విష్ణు ప్రీతం రెడ్డి, ఎల్. మునికుమార్ రెడ్డి, ఎస్. ఖాజామైనుద్దీన్, ఎం.శ్రీకాంత్ రెడ్డి, వై. శివప్రసాద్, ఎం. సురేష్, పి.విజయ్ కుమార్, కె. విష్ణుమోహన్ రావు, అకాడమీ సిబ్బంది,కోచ్లు పాల్గొన్నారు. మహిళా క్రికెట్ను ఏసీఏ ప్రోత్సహిస్తోంది ఇందుకు శ్రీ చరణియే ఆదర్శం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. భరత్ రెడ్డి,కార్యదర్శి ఎ.రెడ్డి ప్రసాద్ -
పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్ ఆకస్మిక తనిఖీ
కడప సెవెన్రోడ్స్ : పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ తోట మెహర్ సీతారాం సుధీర్ శనివారం కడప నగరంలోని సివిల్ సప్లైస్ స్టాక్ బఫర్గోడౌన్, ఎంఎల్ఎస్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కడప డీఎం కార్యాలయంలో జిల్లా ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇన్చార్జిలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు .స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ నుంచి స్టాక్ పాయింట్లకు లూజ్ బ్యాగులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలో స్టాకింగ్ స్ప్రేయింగ్ సరిగా లేనందున తక్షణమే నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి ఎర్రగుంట్ల : పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యహరిస్తోందని ఎర్రగుంట్ల పాత్రికేయులు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై డీజీపీ ఆదేశాల మేరకు తప్పుడు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఎర్రగుంట్ల పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల ఏఎస్ఐ శంకర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతు పల్నాడు జిల్లా మాచర్లలో హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసును బాధితుల కథనం మేరకు సాక్షి దినపత్రిలో ప్రచురించారని తెలిపారు. టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ వల్లెపు శ్రీనివాసులు, పాత్రికేయులు హబీబ్, జయంత్, లక్ష్మీనారాయణ, బాలాంజనేయులురెడ్డి, శ్రీనివాసులు, డాక్టర్ నారాయణ, రఘరాముడు తదితరులు పాల్గొన్నారు ఎం.రాచపల్లి.. చిన్నారుల మృతితో తల్లడిల్లి.. చిట్వేలి : మండల పరిధిలోని ఎం.రాచపల్లిలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చొక్కారాజు దేవాన్స్ (7) తండ్రి నరసింహారాజు, తల్లి చంద్రకళ. వీరికి ఇద్దరు కుమారులు కాగా దేవాన్స్ పెద్ద కుమారుడు. అలాగే చొక్కారాజు విజయ్ (7) తండ్రి శేఖర్ రాజు, తల్లి విజయలక్ష్మీ. వీరికి ముగ్గురు కుమారులు కాగా విజయ్ చిన్న కుమారుడు. అలాగే రెడ్డిచర్ల యశ్వంత్ (6) తండ్రి వెంకటేష్, తల్లి సుప్రజ. వీరికి ముగ్గురు కుమారులు కాగా యశ్వంత్ పెద్దకుమారుడు. విజయ్ తండ్రి శేఖర్ రాజు, యశ్వంత్ తండ్రి వెంకటేష్ ఇద్దరు జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి ఉన్నారు. సంఘటన జరగడంతో శనివారం స్వగ్రామం చేరుకొని కుమారుల మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. మృతులు యశ్వంత్, విజయ్ చిట్వేలిలో ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుండగా దేవాన్స్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతునాడు. వీరి మృతితో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
కత్తితో బెదిరించి గాజులు లాక్కెళ్లాడు
కొండాపురం : మండల కేంద్రంలో పట్టపగలు ఓ గుర్తు తెలియని వ్యక్తి గోరుశెట్టి రంగమ్మ అనే వృద్ధురాలిని కత్తితో బెదిరించి రెండు గాజులు లాక్కెళ్లాడు. ఎస్ఐ ఎం. ప్రతాప్రెడ్డి వివరాల మేరకు కొండాపురం ఎస్బీఐ ఆర్అండ్ఆర్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని రంగమ్మ అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి కత్తితో ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె చేతికి ఉన్న రెండు గాజులు తీసి ఇచ్చింది. అయితే అవి బంగారు గాజులు కావని రోల్డ్గోల్డ్వి అని వాటి విలువ రూ. 450 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తప్పిన పెను ప్రమాదం అట్లూరు : పొలం గట్లపై ఉన్న కంపను కాల్చేందుకు ఓ రైతు పెట్టిన నిప్పుతో మంటలు చెలరేగి పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు మండల పరిధిలోని పాత అట్లూరు గ్రామ సమీపంలో ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ సమీపంలో ఉన్న పొలాల గట్లపై ఉన్న ముళ్ల కంపను కాల్చేందుకు రైతు నిప్పు పెట్టారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మంటలు ఎగిసి పడుతూ గ్యాస్ గోడౌన్ వైపు వ్యాపించాయి. గ్రామస్తులు అందరూ మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాక పోవడంతో బద్వేలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అగ్ని మాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేయడంతో హమ్మయ్యా.. అంటూ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బస్తాలు సీజ్ దువ్వూరు : దువ్వూరు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బస్తాలను కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ప్రొద్దుటూరు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున ఆధ్వర్యంలో దాడులు చేసి సీజ్ చేశారు. మండలంలోని కానగూడూరు గ్రామం అంగన్వాడీ కేంద్రం పక్కన వాటర్ ట్యాంక్ వెనుక రేకుల షెడ్డులో కలరి సుబ్రహ్మణ్యం అక్రమంగా నిల్వ ఉంచిన 35 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.80,500 ఉంటుందన్నారు. బియ్యాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేశామన్నారు. అలాగే పోతురాజు మహాలింగం దువ్వూరు అశోక్ నగర్ వీఽధిలో ఓ పాడుబడిన ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.1,71,580 అని చెప్పారు. తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరకు హోటళ్లకు అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. కమలాపురంలో చోరీ కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని కె. అప్పాయపల్లెలో చోరీ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అప్పాయపల్లెకు చెందిన బోయిళ్ల నాగ మల్లారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఉన్న తన కొడుకు వద్దకు వెళ్లారు. కాగా శుక్రవారం అర్థరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు ఇంటి వాకిలికి ఉన్న గడియను పగుల గొట్టి లోనికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు నగలు అపహరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఇరుగు పొరుగు వారు చూడగా తలుపు తెరిచి ఉండటంతో పాటు తలుపుకున్న గడియ పగులగొట్టడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఘటన జరిగిన ఇంటికి పరిశీలించారు. క్లూస్ టీం వస్తుందని పోలీసులు చెప్పడంతో ప్రజలు ఎవరూ ఇంట్లోకి వెళ్లలేదు. ఈ విషయంపై ఎస్ఐ విద్యా సాగర్ను వివరణ కోరగా బాధితులు హైదరాబాద్లో ఉన్నారని, వారు వచ్చి ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నీట మునిగి ఉపాధ్యాయుడి మృతి పీలేరు : తన కుమారుడికి ఈత నేర్పించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఉపాధ్యాయుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన పీలేరులో జరిగింది. నందకుమార్(50) అనే ఉపాధ్యాయుడు కేవీపల్లె మండలం మారెళ్ల పడమట పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. శనివారం తన కుమారుడికి ఈత నేర్పించడానికి పట్టణ సమీపంలోని చెక్డ్యామ్ నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి అక్కడే చనిపోయారు. -
మద్యం దుష్ప్రభావాలపై అవగాహన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో మద్యం దుష్ప్రభావాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో కేర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. శనివారం నగర శివార్లలోని రిమ్స్లో డీ –అడిక్షన్ సెంటర్లో బాధితులకు మద్యం దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్య విముక్తి సమాజంగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్, కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కృష్ణకుమార్ వైద్య, సిబ్బంది పాల్గొన్నారు. -
చేబ్రోలు కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవాలి
వేంపల్లె : చేబ్రోలు కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని వేంపల్లి వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పేర్కొన్నారు. శనివారం స్థానిక వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్హన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి గురించి నీచాతి నీచంగా మాట్లాడం దారుణమన్నారు. అతను మాట్లాడిన తీరు వైఎస్సార్సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందన్నారు. పొలాల్లో స్టార్టర్ల వైర్ చోరీ మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లె గ్రామ పొలాల్లో 15 వ్యవసాయ బోర్లకు చెందిన స్టార్టర్లు, సర్వీస్ వైర్లను దుండగులు చోరీ చేశారు. శనివారం ఉదయం రైతులు మోటార్ ఆన్ చేసేందుకు పొలాల వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ వైర్లు, సర్వీస్ వైర్లు లేకపోవడం గమనించారు. పరిసర పొలాల్లోని 15 బోర్లకు సంబంధించిన స్టార్టర్లు, సర్వీస్ వైర్ను శుక్రవారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు రైతులు గుర్తించారు. గ్రామానికి చెందిన భూమిరెడ్డి పెద్ద వెంకటసుబ్బయ్య, దండు చిన్న మునెయ్య, దాసరి వెంకటసుబ్బయ్య, నడిపి సుబ్బన్న, చిన్న సుబ్బన్న, పుల్లారెడ్డి గారి శివ, రమేష్, వెంకటసుబ్బయ్య, భూమిరెడ్డి వెంకటసుబ్బయ్య, భూమిరెడ్డి నారయ్య తదితర రైతులకు చెందిన వైర్లు చోరీకి గురయ్యాయి. ఈ వైర్ల విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని రైతులు తెలిపారు. వైర్లు చోరీకి గురైన పొలాల్లో అరటి, మిరప తదితర పంటలు సాగు చేశారు. పొలాలకు నీరు కట్టేందుకు వైర్ల చోరీతో ఆటంకం కలగడమే కాక పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టార్టర్లు, సర్వీస్ వైర్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతులు తెలిపారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని సరోజిని నగర్కు చెందిన మూలతోటి కుమార్(55) అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫ్లెక్సీ బ్యానర్ కూలీ పని చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న మూలతోటి కుమార్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చైన్నై షాపింగ్ మాల్కు చెందిన హోర్డింగ్ బ్యానర్ను షాపింగ్ మాల్ సమీపంలోని సమాధుల ప్రహరీ వద్ద కడుతుండగా విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సంఘటనపై చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించి మృతుని కుమారుడు చరణ్తేజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలిస్తుండగా కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించి, ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ హోర్డింగ్ కట్టే సమయంలో కార్మికునితో పాటు తగిన జాగ్రత్తలను తీసుకునేందుకు కాంట్రాక్టర్ గానీ, సూపర్వైజర్గానీ ముందుండాలని, అలాంటివేమీ తీసుకోకపోవడం వల్లనే కుమార్ మృత్యువాత పడ్డాడని తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం -
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : వక్ఫ్ సవరణ చట్టంను పా ర్లమెంటు ఆమోదించడాన్ని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శనివారం కడప నగరంలోని అజ్మత్ షాది ఖానాలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల ప్రకారం లౌకిక ప్రజాస్వామ్యవాదులతో రౌండ్ టేబుల్ సమావేశం అహ్మద్ బాబు బాయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్, చంద్ర, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు మతాల మధ్య విభజన పెంచి, దేశ లౌకిక స్వభావాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని నూతనంగా ఏర్పాటైన వక్ఫ్ పరిరక్షణ కమిటీ (జేఏసీ) తీర్మానించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్తార్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర నాయకుడు ఇషాక్ అలీ, ఎస్డీపీఐ నాయకుడు తాహీర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తహీర్ మిగతా మండల వారీగా ఎన్నుకోవడం జరిగిందన్నారు, నగర కమిటీని ఎన్నుకున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
గోపవరం : మండలంలోని పి.పి.కుంట సమీపంలో ఉన్న సెంచురీ పానెల్స్ పరిశ్రమ ఎదురుగా నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ నరసయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బద్వేలు నుండి పి.పి.కుంట వైపు వెళుతున్న ట్రాక్టర్ సెంచురీ పానెల్స్ వద్ద ఉన్న పెట్రోలు బంకులో డీజిల్ పట్టించుకునేందుకు తిప్పుతుండగా అదే సమయంలో నెల్లూరు వైపు నుండి అతి వేగంగా వస్తున్న లారీ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన నరసయ్యను ఆసుపత్రికి తరలించేందుకు గోపవరం అంబులెన్స్కు సమాచారమివ్వగా వాహనం మరమ్మతుకు నోచుకోవడంతో అందుబాటులోకి రాలేదు. అదే విధంగా బద్వేలు అంబులెన్స్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో దాదాపు 30 నిమిషాల పాటు తీవ్రంగా గాయపడిన నరసయ్య రోడ్డు మీదనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలో సెంచురీ పానెల్స్ పరిశ్రమ అంబులెన్స్ ద్వారా తీవ్రంగా గాయపడిన నరసయ్యను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. కాగా పి.పి.కుంట, ప్రాజెక్టుకాలనీ–1, సెంచురీ పానెల్స్ పరిశ్రమ ఎదురుగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రమాద జోన్గా గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని పరిశ్రమ నిర్వాహకులతో పాటు వాహనదారులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్న కారును ఢీ కొన్న బైక్
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని నాలుగు రోడ్ల కూడలిలో శనివారం సాయంత్రం ఆగి ఉన్న మైదుకూరు తహసీల్దారు రాజసింహా నరేంద్ర కారును వెనక వైపున వేగంగా వస్తున్న బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన మాబువల్లీ, అమీర్ బాషా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు మండల తహసీల్దారు రాజసింహా నరేంద్ర ఒంటిమిట్ట లోని సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమాన్ని ముగించుకుని ప్రొద్దుటూరుకు వెళుతూ చాపాడు వద్ద కారు ఆపుకుని ఉన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సును క్రాస్ చేస్తూ వేగంగా వెళుతున్న బైక్ ప్రమాదశాత్తు కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్లో ఉన్న మాబువల్లీ, అమీర్ బాషాలు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం అందుబాటులో లేకపోవటంతో తహసీల్దారు తన కారులోనే గాయపడిన వ్యక్తులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురికి గాయాలు -
పండువెన్నెల్లో కల్యాణ వైభోగం
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ సమీపంలో ఆరుబయట ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణవేదికపై సీతారాముల కల్యాణాన్ని రాజేష్ భట్టర్ బృందం వైభవంగా జరిపించింది. అంతకుముందు ఎదుర్కోలు కార్యక్రమాన్ని అర్చకులు, భక్తులు వేడుకగా నిర్వహించారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి శోభాయాత్రగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి పక్షాన ఈ కార్యక్రమానికి ఆచార్య చక్రవర్తుల రంగనాథస్వామి, ఆచార్య ఆకెళ్ల విభీషణశర్మ హాజరయ్యారు. సంకల్పం అనంతరం ప్రవరలు చెప్పించి కన్యాదానం నిర్వహించారు. షోడసోపచారాల అనంతరం చంద్రుని సాక్షిగా పండువెన్నెల్లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు టీటీడీ పక్షాన సీతమ్మకు సువర్ణ కిరీటం, రామయ్యకు సువర్ణ యజ్ఞోపవీతాలు, పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, రాయచోటి/ సాక్షి కడప/కడప కల్చరల్/ఒంటిమిట్ట శ్రీ సీతారామలక్ష్మణులకు స్వర్ణకిరీటాలు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్లతో విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణకిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం విరాళంగా అందించారు. దాదాపు ఏడుకిలోల బంగారంతో తయారుచేసిన ఈ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, ఈ కిరీటాలను శ్రీ సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు. ప్రజలు నీతి, ధర్మ మార్గాలను అనుసరించాలి: సీఎం ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమలలో గోవిందనామంలాగా ఒంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదం ప్రతిధ్వనించాలన్నారు. తిరుమల మాదిరిగా ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని కోరుతున్నట్లు చెప్పారు. ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. -
వైభవంగా ప్రారంభమైన ఉరుసు
కమలాపురం: పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. దర్గా పీఠాధిపతి (ముతవల్లి), సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో అశేష భక్త జన సందోహం నడుమ శుక్రవారం సాయంత్రం ప్రారంభం అయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్ జెండాను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్ మీదుగా పెద్ద దర్గాకు చేరుకుంది. ఊరేగింపులో ప్రత్యేక డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ యువత వివిధ రకాల నృత్యాలు చేశారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పెద్ద ఎత్తున పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నషాన్ జెండాను దర్గా ఆవరణలో ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ ఉరుసు ఉత్సవాల ప్రారంభానికి సూచిక. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష భక్త జనుల సమక్షంలో హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్ధీన్ షా ఖాద్రి, హాజీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రిల మజార్లపై పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ చేశారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి.హుసేన్మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. నేడు గంధం: కమలాపురం పెద్ద దర్గాగా విరజిల్లుతున్న దర్గా–ఏ–గఫారియా ఖాదరియాలో శనివారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు. ఘనంగా జెండా ఊరేగింపు భారీగా పాల్గొన్న భక్తజనం -
పెళ్లిలో విదేశీయుల సందడి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన దాసమనేని ప్ర తాప్నాయుడు కుమార్తె ప్రవల్లిక వివాహక వేడుకలలో విదేశీయులు సందడి చే శారు. శుక్రవారం రాత్రి ఈ పెళ్లి వేడుకలు పోట్లదుర్తి గ్రామ పరిధిలోని పెన్నానది ఒడ్డున ఉన్న రెడ్ల కల్యాణ మండపంలో జరిగాయి. వేడుకకు రష్యా, థాయిలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల నుంచి 8 మంది విదేశీయులు వచ్చారు. వారం రోజులుగా జరుగుతున్న మోహందీ, హల్దీ, సంగీత్ పెళ్లి కుమార్తె అలంకరణ తదితర కార్యక్రమాలో ఉత్సహగా పాల్గొని వేడుకలను తిలకించి సందడి చేశారు. -
‘సాక్షి’ ఎడిటర్పై తప్పుడు కేసు ఉపసంహరించుకోవాలి
ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్ కడప సెవెన్రోడ్స్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డితోపాటు మరో ఆరుగురిపై డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి టీవీ జిల్లా ప్రతినిధి వెన్ను శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్లలో హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసును బాధితుల కథనం మేరకు సాక్షి దినపత్రికలో ప్రచురించారని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును విచారణ చేయకుండానే డీజీపీ కేసు నమోదు చేయించారని అన్నారు. పల్నాడు పోలీసులు నమోదు చేసిన కేసు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉందన్నారు. డీజీపీ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులపై ఆగమేఘాల మీద స్పందించడం మాని వాస్తవాలను తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటే రాష్ట్ర పోలీసుల గౌరవం పెరుగుతుందన్నారు. నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవడం ద్వారా రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుతామన్న సంకేతాలను సమాజానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు బీవీ నాగిరెడ్డి, నూర్బాష, శ్రీనివాసులతోపాటు పలువురు పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. -
అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు
బి.కోడూరు : మండలంలోని మున్నెల్లి చెరువులో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వారు ఇష్టానుసారం చెరువులోని మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలానికి కూతవేటు దూరంలో ఉన్న మున్నెల్లి చెరువు నుంచి గత ఆరు నెలలుగా గుత్తేదారులు ఇష్టానుసారంగా భారీ ప్రొక్లెయిన్లు టిప్పర్లతో మట్టిని తవ్వుతుండటంతో చెరువు సుమారు పది అడుగుల లోతులోకి వెళ్ళిపోయింది. ఆయకట్టు కంటే చెరువు లెవల్ పది అడుగుల లోతులో ఉండటంతో వర్షాకాలంలో వచ్చే వర్షపునీరు గోతుల్లోకి సరిపోతుంది తప్ప ఆయకట్టు చెరువులకు అందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆయకట్టు చెరువు కింద వర్షపునీరు కంటే ఎల్ఎస్పీ ప్రాజెక్టు నీటి మీదనే ఆధారపడి ఆయకట్టు రైతులు పంటలను సాగు చేస్తారు. పది అడుగుల లోతు గోతులు తవ్వడం కారణంగా ఎల్ఎస్పీ నుండి వచ్చే కొద్దిపాటి నీరు గోతులకే సరిపోతుంది తప్ప ఆయకట్టుకు నీరందడం కష్టమని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఆయకట్టు చెరువును పరిశీలించి ఎంతో విలువైన ఆయకట్టు చెరువును కాపాడాలని మున్నెల్లి, టమటంవారిపల్లె, తువ్వపల్లె గ్రామాల రైతులు కోరుతున్నారు. -
ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలి
అనంతపురం జేఎన్టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు పులివెందుల రూరల్ : విద్యార్థులు ఉద్యోగం సంపాదించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని అనంతపురం జెఎన్టీయూ వైస్ చాన్స్లర్ హెచ్.సుదర్శనరావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక జెఎన్టీయూ కళాశాలలో ప్రిన్సిపల్ విష్ణువర్థన్ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతపురం వీసీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ హెచ్.సుదర్శనరావు స్వీయ అభ్యసన అవగాహన, నైపుణ్యాభివృద్ధి గోల్ సెట్టింగ్, అకడమిక్ క్రెడిట్ డిపాజిట్ స్కీం, మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ, సాంకేతికత, వ్యాల్యూ ఆడెడ్ కోర్సులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సబ్జెక్టు విషయాలపైనే కాక సాంకేతిక నైపుణ్యత, విలువలు, విద్యా సృజనాత్మకతతో వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధిని సంపాదించి కళాశాలను అగ్రస్థానంలో ఉంచాలన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య డి.విష్ణువర్ధన్ కళాశాల వార్షిక అభివృద్ధి, విద్యా రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ ఆచార్య శేష మహేశ్వరమ్మ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2020లో విద్యా ఆవశ్యకతను తద్వారా సాధించదగిన ప్రగతిని వివరించారు. స్పోర్ట్స్ ఇంచార్జ్ డాక్టర్ ఏ. దామోదర్ రెడ్డి విద్యార్థులు క్రీడా రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. కళాశాల అకడమిక్ మెరిట్ అవార్డులను, క్రీడా అవార్డులను విజేతలకు బహుకరించారు. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం
కడప అర్బన్ : మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు కొనియాడారు. పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ పూలే సామాజిక తత్వవేత్తగా సమాజంలో అనేక విధాలుగా ప్రజలను చైతన్యం పరిచారని, ప్రజలలో అనాదికాలంగా పాతుకుపోయిన వివక్షలను నిర్ములించుటకు తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. వితంతు పునర్వివాహం గురించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడని, ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య గారు, ఏ.ఆర్ డి.ఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్.ఐ లు ఆనంద్, టైటాస్, వీరేష్,శ్రీశైల రెడ్డి, శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు -
యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం
కడప ఎడ్యుకేషన్ : కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయంకు స్వర్ణ పతకం లభించింది. విద్యార్థి డి.మురళీకృష్ణ 59 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు. యోగి వేమన విద్యాలయానికి ఈ పతకం ఐదవది. గత ఏడాది విశ్వవిద్యాలయానికి బంగారు పతకం సాధించడంతో వైవియూ క్రీడా బోర్డు ద్వారా రూ.30 వేల క్యాష్, ప్రతినెలా పదివేల రూపాయల పారితోషకం అందజేశారు. తద్వారా మంచి పోషకాలతో ఆహారం తీసుకోవడంవల్ల తాజాగా బంగారు పతకాన్ని డి.మురళీకృష్ణ సాధించారు. మురళీకృష్ణ ఈ పోటీల్లోనే కాక అంతర్జాతీయ క్లాసికల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ప్రపంచ రికార్డు సాధించడం గమనార్హం. ఈ పథకం సాధించిన అతడిని ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, ప్రధానాచార్యులు ఆచార్య ఎస్ రఘునాథరెడ్డి, క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ కే రామసుబ్బారెడ్డి, వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల విభాగ సిబ్బంది అభినందనలు తెలియజేశారు 59 కేజీల విభాగంలో పతక సాధించిన విద్యార్థి మురళీకృష్ణ -
చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడ ప రైల్వేస్టేషన్లో సాకేత్ (3), మల్లి (2) అనే చిన్నారు లు ఉన్నారని తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్, మహిళా పోలీసులు చిన్నారులు తీసుకుని సీడబ్ల్యుసీ ఎదుట హాజరు పరిచామని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే బాలల సంక్షేమ సమితిలో సంప్రదించి తీసుకు వెళ్లాలన్నారు. బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలోని బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన నిర్వహించకుండా వారి ఓట్లతో అధికారం చలాయిస్తూ తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబయ్య, డీఎస్ జయరాం, బీసీ రమణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు నారాయణ, సీఆర్వీ ప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్దన్, పీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, పీఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ శంకర్, నాగేంద్ర, దళిత మిత్ర సంఘం అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని మహిళ వేడుకోలు కడప కోటిరెడ్డిసర్కిల్ : అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కానిస్టేబుల్ సంజీవరాయుడు సతీమణి బి.కృష్ణవేణి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. శుక్రవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను కలిసి ఆమె వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఇటీవల రూ. 1.50 లక్షలు అప్పు చేశాడని, అప్పు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి డబ్బుల కోసం మాట్లాడుతుండడంతో భర్తను ప్రశ్నించగా తమ ఉన్నతాధికారికి డబ్బులు ఇచ్చానని తెలిపారన్నారు. చిన్నచిన్న తప్పులకు కూడా ఆ ఉన్నతాధికారి లంచాలు తీసుకుని తన భర్తను దుర్బాషలాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు సమీపాన పులివెందుల రోడ్డులో శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు అరటి కాయలను లారీల లోడు నింపే కూలి పని చేసుకుంటూ పులివెందులలో నివాసముంటున్నాడు. వెంకట్రాముడు తన స్వగ్రామంలో జాతర ఉండటంతో శుక్రవారం కూలి పని తొందరగా ముగించుకొని తన స్వగ్రామానికి బైకుపై వెళుతుండగా అంకాలమ్మ గూడూరు బలపనూరు గ్రామాల మధ్యలో ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట్రాముడు(38) మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. అండర్–17 సెపక్ తక్రా పోటీలకు ఏపీ జట్లు ఎంపిక సాక్షి, అమరావతి : జాతీయ స్థాయి అండర్–17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఏపీ జట్లు ఎంపికై నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 వరకు మణిపుర్లోని ఇంఫాల్ శాయ్ సెంటర్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈజట్లకు కోచ్గా ఎస్. రమేష్ (ఎన్టీఆర్), బాలికల జట్టు మేనేజర్గా ఎం. సంతోషి కుమారి (కర్నూలు), బాయ్స్ టీమ్ మేనేజర్ డి.సుంకర రావు (కర్నూలు) వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జట్లను సమగ్ర శిక్షా ఎస్సీడీ అభినందిస్తూ విజయంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. -
రిమ్స్లో ఫార్మసిస్ట్పోస్టు భర్తీకి పైరవీలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (రిమ్స్)లో రెగ్యులర్ ఫార్మసిస్ట్– గ్రేడ్ –2ను, ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ పోస్టులో నియమించమని యూనియన్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారనీ అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకోసం యూనియన్ నాయకులు రూ. 5– 8 లక్షల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెగ్యులర్ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పోస్టులో ఉద్యోగిని నియమిస్తే జీతాలు సమస్య ఎదురవుతుందని తర్వాత భవిష్యత్తులో కాంట్రాక్టు ఉద్యోగి జాయిన్ అయితే రెగ్యులర్ ఉద్యోగస్తుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. నిబంధన ప్రకారం కాంట్రాక్టు ఫార్మసీ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగులకు పోస్టింగ్ లేదా బదిలీ ఇచ్చుట నిబంధనలకు విరుద్ధమని రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ వివరణతో యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. పైరవీలకు అలవాటు పడిన అధికార పార్టీ పేరుతో చలామణి అవుతున్న కొందరు యూనియన్ నాయకులు రిమ్స్ సిబ్బందిని చివరికి బెదిరింపు ధోరణికి పాల్పడిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈసంఘటన వివరాల్లోకెళితే ..ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడిసీ)సెంట్రల్ ట్రక్ స్టోర్లో వి.ఎన్పల్లి నుంచి డిప్యుటేషన్ లో ప్రస్తుతం ఓ రెగ్యులర్ ఉద్యోగి విధులను నిర్వహిస్తున్నారు.అతను తన మాతృశాఖకు వెళ్లుటకు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన ఉద్యోగి జిల్లా లోని ఏ పిహెచ్సీ లో పోస్టు ఖాళీగా ఉన్న కూడా పల్లెల్లో పోయి డ్యూటీ చేయుటకు ఇష్టం లేక రిమ్స్ జనరల్ హాస్పిటల్కు బదిలీ కావాలని ప్రయత్నించారు. యూనియన్ వారితో ఒక రేటు మాట్లాడుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. యూనియన్ నాయకులలో కొందరు సొంత లాభం ఆలోచించి రిమ్స్ సూపరింటెండెంట్ సంప్రదించారు. కాంట్రాక్ట్ పోస్ట్లో రెగ్యులర్ ఉద్యోగిని నియమించడం లేదా బదిలీ చేయడం డిపార్ట్మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సదరు యూనియన్ లీడర్స్ సిబ్బందిని బెదిరించి జీతాలు విషయంలో మిగతా ఏ సమస్యలనైనా డీఎంఈ కార్యాలయం లో తమకు సహకరించు అధికారులు ఉన్నారు. డీఎంఈ ఇంకా పైస్థాయిలో మేం చూసుకుంటాము మీరు క్లారిఫికేషన్ రాయండి అని ఒత్తిడి చేశారు. అయినా రిమ్స్ సూపరింటెండెంట్ మొత్తం రిమ్స్ లో ఫార్మసిస్టులు పోస్టులు 11. రెగ్యులర్ ఉద్యోగులు 11 మంది పనిచేస్తున్నారని, 10 కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ పోస్టులకు 9 మంది పని చేస్తున్నారని ఇటీవల ఒక కాంట్రాక్టు ఉద్యోగి రిజైన్ చేయడం వల్ల ఒక ఖాళీ ఏర్పడిందిదని, ఆ పోస్టు కాంట్రాక్ట్ పోస్ట్ మాత్రమే అని క్లారిఫికేషన్ ఆర్డీకి లెటర్ పెట్టారు. ఈ విధానానికి యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. కోర్టును ఆశ్రయిస్తామని రిమ్స్లో అధికారులను, సిబ్బందిని బెదరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూనియన్ నాయకులు తమ స్వార్థాలకు సమూహంగా ఏర్పడి చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారులు వీరి బెదిరింపులకు లొంగవద్దని పలువురు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ సంఘటనలో జీజీహెచ్లోని ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ యూనియన్ నాయకుల బెదరింపులకు బెంబేలెత్తి పోయింది. మరోవైపు జీజీహెచ్(రిమ్స్)లో ఫార్మసీ విభాగంలోనే పనిచేస్తున్న రెగ్యులర్ మహిళా ఉద్యోగి ఈనెలలోనే రిటైర్డ్ కాబోతుందని సమాచారం. ఆమె స్థానంలో కూడా సదరు ‘ఫార్మసీ ఆఫీసర్’ను నియమించేందుకు కూటమి అధికారపార్టీకి సన్నిహితంగా వుంటున్న పై యూనియన్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి భర్తీకి యూనియన్ నాయకులు అధికారులపై ఒత్తిడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్న పాలనా విభాగా సిబ్బందికి బెదిరింపులు ఇందుకోసం ‘పరిపాలనా విభాగం’లో కొందరి సహకారం? -
నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోముడు.. శ్రీరామచంద్రుడు.. కల్యాణ రామునిగా మారి.. సౌందర్య రాశి.. సుగుణాల తల్లి సీతమ్మను పరిణయమాడారు. నునుసిగ్గుల మొలకై న సీతమ్మకు నుదుటన కల్యాణ బొట్టు, బుగ్గన కాటుక పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలను అలంకరింపజే
● కమనీయంగా సీతారాముల కల్యాణం ● వైకుంఠాన్ని తలపించిన ఏకశిలానగరి ● పోటెత్తిన భక్తజనం ● మార్మోగిన రామనామం రాజంపేట/ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సీతారామ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఏకశిలానగరం రామనామంతో మార్మోగింది. దారులన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. జిల్లా నలు మూలల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా రామాలయంలోని సీతా,రామ,లక్ష్మణ మూర్తులను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయం ఆడిన వేల శిల్పకళాశోభితమైన కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచంద్రులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు దీర్చారు. ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా.. సీతమ్మ నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. ఆమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి.. అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నారు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కన్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళాష్టం చదివారు. హస్త నక్షత్రయుక్త శుభ లగ్నంలో 6:30 నుంచి 8:30 గంటల మధ్య సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతిదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానం చేసి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించారు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కల్యాణ ముర్తుల శిరస్సుపై వేసి కల్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది. ● వేదిక.. సుందర దీపిక కల్యాణ వేదికను టీటీడీ ఉద్యానవ విభాగం ఆధ్వ ర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతా యుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా సుందరంగా ముస్తాబు చేశారు. వేదికపై ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతరాల సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరిగింజలతో మండపం ఏర్పాటు చేశారు. రంగురంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ పూత, అరటి ఆకులు, మామిడాకులు, హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం, ఆర్కిడ్, రెడ్ ఆంధూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజుల పాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పని చేశారు. -
వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు పోరాటం
కడప కల్చరల్: ముస్లింల హక్కుల పరిరక్షణను కాలరాస్తున్న వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాడుతామని, అవసరమైతే సుదీర్ఘ ఉద్యమానికి వెనుకాడేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం స్థానిక ఏడురోడ్ల కూడలిలో ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై నల్లచట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంజద్బాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను దుయ్యబట్టారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లులకు ఏయే పార్టీల వారు మద్దతు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. ముస్లింలకు మద్దతుగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని నాయకులు వెంటనే రాజీనామాలు చేసి నల్లచట్టాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. సెక్యులర్ భావాలు గల ప్రతి పౌరుడు ఈ చట్టాలను తీవ్రంగా నిరసించాలన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ దేశంలో ముఖ్య భాగమైన ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఈ ఒక్కరోజు చేస్తే సరిపోదని, సమస్య పరిష్కారం అయ్యేవరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ముస్లింలందరూ తమలోని విబేధాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నిరసన ప్రదర్శనలో నల్లజెండాలతోపాటు నల్లరిబ్బన్లు, జాతీయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత గురువులు, ముస్లిం ప్రముఖులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు, ఉలేమా అయిమ్మ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు సుబాన్బాషా, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజమ్, డాక్టర్ గౌస్పీర్, డీసీసీ మాజీ అధ్యక్షులు నజీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నేత అలీఖాన్, ధర్మ ప్రచారకులు బాబుభాయ్, సంఘ సేవకులు సలావుద్దీన్, కాల్టెక్స్ హఫీజుల్లా, మైనార్టీ కార్పొరేటర్లు, నగర ముస్లింలు పాల్గొన్నారు. సుదీర్ఘ ఉద్యమానికి వెనుకాడబోము ముస్లింల నిరసన ప్రదర్శనలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా -
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి
బద్వేలు అర్బన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు పి.చాంద్బాషా, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్సత్తార్, అన్వర్బాషా పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఫాతిమా మసీదు ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం మైనార్టీలపై అనేక రకాలుగా దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ క్రమంలోనే వక్ఫ్ చట్టసవరణ బిల్లును తెరమీదకు తీసుకువచ్చిందని అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మతోన్మాద పార్టీలు చిచ్చు పెట్టడం దారుణమన్నారు. కేంద్రం వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కరీముల్లా, హసన్, షరీఫ్, రసూ ల్, షంషీర్, ఇబ్రహీం, హబీబ్, మస్తాన్, ఆయుబ్, ఖలీల్, పెద్ద ఎత్తున ముస్లీంలు పాల్గొన్నారు. -
ఎర్రగుంట్లలో రేషన్ రగడ
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని కార్డుదారులకు రేషన్ ఇవ్వకపోవడంతో ఎండీయూ వాహనాన్ని అడ్డుకొని మా బియ్యం మాకు ఇవ్వాలని ముస్లిం మైనార్టీ మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటల పాటు డీలర్లు, ఎండీయూ వాహన ఆపరేటర్, కార్డుదారులకు మధ్య రగడ జరిగింది. డీలర్లే రేషన్ను అమ్ముకుంటున్నారని ఎండీయూ వాహన ఆపరేటర్ సులేమాన్ ప్రజలకు మీడియాకు బహిర్గతం చేశారు. అలాగే ఆపరేటర్లే చౌకదుకాణం నుంచి రేషన్ తీసుకుని పక్కదారి పట్టిస్తున్నారని డీలర్లు ఆరోపించారు. పట్టణంలోని ఎర్రచేన్, శివ టైలర్ వీధిలలోకి రేషన్ పంపిణీ చేయడానికి 6వ షాపు ఎండీయూ వాహనంలో రేషన్ తీసుకుని వెళుతుండగా మార్గ మధ్యలో మాకు రేషన్ ఇవ్వలేదంటూ 9వ షాపునకు చెందిన కార్డుదారులు మహిళలు వాహనాన్ని అడ్డుకన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతు మా 9వ షాపు డీలర్ నెలా నెలా రేషన్ సక్రంగా ఇవ్వలేదని, తూకాలలో కూడా తక్కువగా ఇస్తున్నారని మండ్డిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ తీసుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పరస్పర వాగ్వాదం.. ఆరోపణలు : డీలర్లే బియ్యం అమ్ముకుంటున్నారని ఎండీయూ ఆపరేటర్, ఎండీయూ ఆపరేటర్లే రేషన్ తీసుకుని వెళ్లి పక్కదారి పట్టిస్తున్నారని డీలర్లు ఆరోపణలు చేసుకున్నారు. ఇలా ఇరువురు పరస్పర ఆరోపణలతో గొడవ పడ్డారు. నేను అమ్ముకుంటున్న నిరూపిస్తూ నా వాహనం కాల్చి వేస్తాను అని ఆపరేటర్ సులేమాన్ సవాల్ విసిరారు. డీలర్లు మాకు బియ్యం తక్కువగా ఇస్తున్నారని, కార్డుదారులకు సుమారు 5 కిలోలు తక్కువ ఇస్తే ఎలా తీసుకుంటారన్నారు. మాకు తూకాలు కచ్చితంగా ఇస్తే మేం కూడా బియ్యం పంపిణీ చేయడానికి ఇబ్బంది ఉండదన్నారు. ఎండీయూ వాహనాన్ని అడ్డుకున్న మైనార్టీ మహిళలు డీలర్లు, ఎండీయూ ఆపరేటర్కు మధ్య వాగ్వాదం కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ సక్రమంగా అందలేదని కార్డుదారుల ఆగ్రహం -
●గోటితో ఒలిచిన తలంబ్రాలు అందజేత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించారు.సూపరిటెండెంట్ హనుమంతయ్య అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో వీటిని అందించారు. తలంబ్రాల కోసం మూడునెలలపాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు భక్తిభావంతో మూడు నెలలపాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన ధరలతో సామాన్యుల బతుకు దుర్భరం
కడప కార్పొరేషన్ : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల బతుకు దుర్భరం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంగానీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంగానీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు చార్జీలు విపరీతంగా పెంచారని, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచారన్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్పై రూ.50లు, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచడం దారుణమన్నారు. ఉజ్వల పథకంలో ఉన్న పేదలకు కూడా పెంచిన ధర వర్తింపజేయడం వల్ల పేదలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై పడనుందన్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, సామాన్యులు ఏం కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇలాగే గ్యాస్ ధర పెంచితే దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం మినహా చేసిందేమీ లేదన్నారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...సంపద సృష్టించకపోగా ఇప్పటికే రూ.1.64లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. వారం వారం అప్పులు చేస్తున్నా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి పథకానికి పేరు మార్చి పీ–4 అనే కొత్త స్కీం తెచ్చారన్నారు. దాతల సహకారంతో గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించాలన్నది దీని ఉద్దేశమన్నారు. టీడీపీ నాయకులకు మేలు చేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన ఈ స్కీంకు దాతల సహకారం ఉండదన్నారు. సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వీరు ప్రజలకు చెప్పేదొకటి, చేసేది మరొకటని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చాలని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, బీహెచ్ ఇలియాస్, జి. శ్రీనివాసులరెడ్డి, త్యాగరాజు, శ్రీరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే పెరిగిన కరెంటు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెట్రో ధరల పెరుగుదల నిత్యావసర ధరలపై ప్రభావం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
బ్రహ్మోత్సవం.. నయనమనోహరం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అలంకారంలో స్వామివారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వ హించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి గరుడ సేవ ఘనంగా జరిగింది. రామయ్య పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కళాకరుల కోలాటాలు, చెక్కభజనల మధ్య కోదండ రాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. ఈ కార్యక్రమం టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. గురువారం సీతారాముల కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో దాశరథి దివ్యక్షేత్రాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు శుక్రవారం ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు శివధనుర్భంగాలంకారం, 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం. సాయంత్రం 3:15 నుంచి 5 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 6:30 నుంచి 8:30 వరకు కల్యాణోత్సవం, 9:30 నుంచి 10:30 వరకు గజవాహనం, 11 నుంచి 11:15 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు వైభవంగా గరుడవాహసేవ -
గంజాయి మత్తులో మైనర్లు!
సాక్షి, టాస్క్ఫోర్స్: ఇప్పటికే సోషల్ మీడియా ఊబిలో పడి చిత్తవుతున్న యువత.. గంజాయి మత్తుకూ బానిసవుతున్నారు. కాలేజీ కుర్రాళ్లే కాదు.. స్కూల్ పిల్లలు సైతం ఈ మత్తులో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా కొందరు యువత, మైనర్లతో ‘ఇన్స్ట్రాగామ్’లో గ్రూపులు కట్టి, చాటింగ్లు చేస్తున్నారు. ఇదేదో మంచి అలవాట్లకు, యువతకు ఉపయోగపడే విధంగా ఉంటే పర్వాలేదు. గంజాయి మత్తుకు అలవాటుపడేలా మైనర్ బాలురను ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రూప్లో 14 ఏళ్ల బాలుడు గంజాయి మత్తుకు అలవాటు పడ్డాడు. అంతేనా.. తన పుట్టినరోజు వేడుకను ధూంధాంగా జరుపుకుని లక్షలాది రూపాయలను ఖర్చుచేసి జల్సాలకు పాల్పడ్డాడు. ఇన్స్ట్రాగామ్లో ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్న పొడవాటి, వివిధ డిజైన్లతో ఉన్న కత్తిని పట్టుకుని ఏకంగా ఫొటోకు ఫోజులిచ్చి మైనర్లను ఆకర్షించసాగాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీస్ సబ్ డివిజనల్ అధికారితో సైతం సెల్ఫీ ఫొటో దిగాడు. స్నేహం కొద్దీ, స్ఫూర్తి కోసమో ఆ పోలీసు అధికారి సెల్పీ తీసుకోవడానికి అనుమతిస్తే, ఆ బాలుడు ఆ సెల్ఫీ ఫోటోను తన ఇన్స్టా గ్రామ్ ద్వారా చాటింగ్కు ఉపయోగిస్తూ, మిగతా ‘మైనర్ల’దృష్టిలో ‘బాస్’గా మారిపోయాడు. ఈ క్రమంలో తనచేత ఆకర్షించబడిన బాలురను కత్తితో, తన చేష్టలతో బెదిరించి ఓ మైనర్ బాలుడి ఇంటి నుంచి పలు దఫాలుగా దాదాపు 8 తులాల బంగారు ఆభరాలను తెప్పించుకుని ఎంచక్కా తాను, తన గ్రూప్ సభ్యులతో జల్సాలకు పాల్పడ్డాడు. ఈవ్యవహారమంతా గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో చోటుచేసుకుంది. ఆ సమయంలో బాధిత బాలుడి తండ్రి కువైట్లో ఉన్నాడు. ఇటీవల కడపకు వచ్చి బంగారు ఆభరణాల గురించి ఆరా తీశారు. ఇన్స్ట్రాగామ్ వేదికగా ఓ మైనర్ బాస్కు తమ కుమా రుడు దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్లి ఇచ్చినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ‘డబుల్స్టార్’ తనపాటికి తాను విచారణ చేసేందుకు ప్రయత్నిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులమంటూ ఇద్దరు వ్యక్తులు అడ్డుకుంటున్నట్లు సమాచారం. ● మత్తు పదార్థాల నివారణ కోసం పోలీసులు నిఘా కార్యక్రమాలను చేపట్టినా చాపకింద నీరులా గంజాయి మత్తు విస్తరిస్తూనే ఉండడం విచారకరం. ఇప్పటికైనా పోలీసు ఉన్న తాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోని బంగారు ఆభరణాలను సైతం దోచిపెడుతున్న వైనం.. కడపలో రెండవ ప్రధాన స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే సాక్ష్యం -
అత్తమామలు, మరిది వేధింపులపై ఫిర్యాదు
ఎర్రగుంట్ల : తనను అత్త మామలు, మరిది వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలమల్ల పోలీసు స్టేషన్ ఏఎస్ఐ రమణ కథనం మేరకు.. కలమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని క్రిష్ణానగర్ కాలనీలో ఈశ్వరమ్మ అనే మహిళ నివాసముంటున్నారు. ఈమె భార్త నాగశేషయ్య మృతి చెందాడు. ఈశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే ఈశ్వరమ్మ మరిది గోపి ఆయన భార్య ఎలిషమ్మ, అత్తమామలు కలసి నిత్యం వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు మనస్తాపానికి గురై భయపడి ఇంటిలో మాత్రలు వేసుకుని పడిపోయింది. ఆమె కుమారుడు గమనించి వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించాడు. అక్కడ కోలుకున్న తర్వాత ఈశ్వరమ్మ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. గేటు డబ్బులు అడిగినందుకు ఘర్షణ పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో లారీలు పార్కింగ్కు సంబంధించి గేటు నిర్వాహకులు గేటు డబ్బులు అడిగినందుకు లారీ డ్రైవర్లు శ్రీహరి, శ్రీనివాసులు గేటు నిర్వాహకులతో గొడవకు దిగారు. గేటు నిర్వాహకులు, లారీ డ్రైవర్ల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేబ్రోలు కిరణ్కుమార్పై ఫిర్యాదు వల్లూరు (చెన్నూరు)/జమ్మలమడుగు రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ ప్రతినిధి చేబ్రోలు కిరణ్ కుమార్పై చెన్నూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, పార్టీ అనుబంధ విభాగ సభ్యులైన నిరంజన్రెడ్డి, దేవగుడి భాస్కర్రెడ్డి, జనార్దన్రెడ్డి, సురేష్ యాదవ్, అల్లి శ్రీరాములు, పార్టీ కార్యకర్తలు చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అలాగే జమ్మలమడుగుకు చెందిన వైఎస్సార్సీపీ కడప జిల్లా మునిసిపల్ విభాగం అధ్యక్షుడు వల్లంభాయి హృషికేశవరెడ్డి గురువారం జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామక్రిష్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి మోహన్రెడ్డి, మునిసిపల్ కో ఆప్షన్ మెంబర్ ఫయాజ్ బాషా, రాష్ట్ర మేధావుల వర్గం నాయకుడు వేణుగోపాల్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి యోబు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, మైలవరం మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, తాజుద్దీన్, గాజ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కడప అర్బన్ : కడప నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, ఇతర మహిళా నేతలు కలిసి చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పార్టీలో అయినా మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు పత్తి రాజేశ్వరి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణవేణి, వైఎస్ఆర్సీపీ నాయకులు యానాదయ్య, సీహెచ్ వినోద్కుమార్, మల్లికార్జున, ఇతర మహిళా నేతలు పాల్గొన్నారు. -
చక్రాయపేట మండలంలో టీడీపీ నాయకుల వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్ : చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో గురువారం టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడిగా నియమితుడైన నాగలగుట్టపల్లెకు చెందిన రాంబాబు ఫ్లెక్సీలు కట్టి కేక్ కత్తిరించడం జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఈ దారుణానికి తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. రాంబాబును వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడిగా నియమించడంతో ఫ్లెక్సీలు కట్టి కేక్ కత్తిరించి బుధవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసులపై వత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను పిలిచి ఫ్లెక్సీలు తీయాలని ఆదేశించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు కూడా టీటీపీ నేతల ఫ్లెక్సీలు తీస్తే తాము తీసేస్తామని చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులను రప్పించుకొని నాగలగుట్టపల్లెలో ఈలలు కేకలు వేస్తూ మారణాయుధాలు చేతబట్టి భయోత్పాతం సృష్టిస్తూ వైఎస్సార్సీపీ నేతల ఫ్లెక్సీలను చించివేశారు.అక్కడే ఉన్న మండల ఉపాధ్యక్షుడు రాంబాబుపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు నాగలగుట్టపల్లెలో గురువారం జరిగిన సంఘటనకు సంబంధించి బాదితుడు దాసరి రాంబాబు చక్రాయపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి ఆంజనేయులు, మురికినాటి సాయిప్రసాద్, పగడాల పరమేశ్వర, తుపాకుల సుదర్శన్, బోర్వెల్ రామాంజులరెడ్డి, ఎద్దుల చంద్ర, తాళ్లపల్లె ప్రవీణ్తో పాటు మరికొందరు మారణాయుధాలతో వచ్చి తనపై దాడి చేసి ఫ్లెక్సీలు చించేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తమ్ముడు వచ్చి కాపాడకపోతే తనను చంపేసేవారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షుడు రాంబాబుపై దాడి వైఎస్సార్సీపీ నేతల ఫ్లెక్సీల చించివేత -
కమలాపురం ఉరుసు మహోత్సవాలను జయప్రదం చేయండి
కమలాపురం : ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కమలాపురం దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా ఉరుసు మహోత్సవాలను జయప్రదం చేయాలని దర్గా కన్వీనర్, వైఎస్సార్సీపీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆ దర్గా ఆవరణంలో పాస్టర్ ప్రభుదాస్, వేద పండితులు జితేంద్ర శర్మతో కలసి ఆయన ఉరుసు ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరిగే కమలాపురం గఫార్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఖ్యాతి గడించిన ఈ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్రం నలు మూలల నుంచే కాక దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి స్వామి వారి భక్తులు తరలివస్తారని ఆయన వివరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉరుసుకు ఏర్పాట్లు సిద్ధం రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, హజరత్ దస్తగిరి షా ఖాద్రి, హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాల నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే రంగు రంగుల విద్యుద్దీపాలతో దర్గాను సుందరంగా అలంకరించారు. మిరుమిట్లు గొలిపే కాంతులతో దర్గా కనుల విందుగా మారింది. దర్గా ఆవరణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. అన్నదాన శిబిరాలు, చలి వేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు షెల్టర్లు సిద్ధం చేశారు. చిన్నారుల కోసం జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, రంగుల రాట్నాలు, ప్రత్యేక స్వీటు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రి నివాసం ఎదుట ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు. వారికి భోజనంతో పాటు అన్ని వసతులు సిద్ధం చేసినట్లు దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ తెలిపారు. గంధం, ఉరుసుకు ప్రత్యేక బస్సులు కమలాపురం ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గంధం, ఉరుసు జరిగే రెండు రోజుల పాటు కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని డీఎంలకు విన్నవించామని, వారు స్పందించి ఆ రోజులలో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన జెడ్పీ చైర్మన్
కడప కార్పోరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లెలోని ఆయన నివాసంలో ఇటీవల జెడ్పీ చైర్మన్గా ఎన్నికై న ముత్యాల రామగోవిందురెడ్డి కలిశారు. జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఎస్వీ సతీష్కుమార్రెడ్డిలతో కలిసి ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన వారిలో జెడ్పీ చైర్మన్ తనయుడు ముత్యాల శ్రీనివాసులరెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, దువ్వూరు మాజీ జెడ్పీటీసీ గుడిపాడు బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లె సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లాకు చెందిన తెన్నేటి వీరబ్రహ్మయ్య (65) అనే వ్యక్తి మృతి చెందాడు. మైదుకూరు – బద్వేలు రహదారిలోని గోపిరెడ్డిపల్లె వద్ద సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బద్వేలు వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుని బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా పెసరవాయి గ్రామానికి చెందిన వీరబ్రహ్యయ్య గ్రామంలోనే పురోహితుడుగా పనిచేస్తున్నాడు. ప్రొద్దుటూరులో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన అక్కడ నుంచి స్వయంగా కారు నడుపుకొంటూ బద్వేలుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది కారులో ఇరుక్కుపోయిన వీరబ్రహ్మయ్య మృతదేహాన్ని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య మల్లేశ్వరమ్మ, వివాహితులైన ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సును ఢీకొని యువకుడి మృతి జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణం ముద్దనూరు రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరివెళ్ల గురుదత్ (20) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గూడెంచెరువు గ్రామం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సిరివెళ్ల గురుదత్ సొంత పనుల నిమిత్తం పట్టణానికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బైక్లో వెళుతుండగా మార్గమధ్యంలోని పతంగే రామన్నరావు ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో జమ్మలమడుగు నుంచి ముద్దనూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ సంఘటనలో గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. గురుదత్ తండ్రి సిరివెళ్ల రాఘవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కత్తితో భయపెట్టి బంగారు గొలుసు లాక్కెళ్లాడు సింహాద్రిపురం : ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో భయపెట్టి ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన సింహాద్రిపురం మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. సింహాద్రిపురం మండలం బలపనూరులో ఆశా వర్కర్గా పనిచేస్తున్న వంగల సుధేష్ణ నక్కలపల్లె గ్రామంలో నివాసముంటోంది. మధ్యాహ్నం విధులు ముగించుకుని తన స్కూటీపై బలపనూరు నుంచి నక్కలపల్లెకు వెళుతుండగా.. నక్కలపల్లె గ్రామం నుంచి ఎదురుగా బైకుపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అటకాయించాడు. కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న మూడు తులాలపైబడిన బంగారు గొలుసును లాక్కుని బైకుపై పులివెందుల వైపు పారిపోయాడు. అనంతరం ఆమె నక్కలపల్లె గ్రామానికి వెళ్లి భర్త జనార్దన్రెడ్డికి విషయం తెలపడంతో ఇరువురు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు చేరుకుని హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. -
మైలవరం జలాశయానికి నీరు విడుదల
కొండాపురం: గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేసినట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమమహేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో సాగు, తాగునీటి అవసరాలకోసం గండికోట జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేశామన్నారు. గండికోట జలాశయంలో పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 22.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయన్నారు.గండికోట ప్రాజెక్టు నుంచి గండికోట ఎత్తిపోతలపథకం ద్వారా మూడు మోటర్లతో 300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామని వివరించారు. -
నేడు ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్ : ఈ నెల 11న శుక్రవారం ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్లింపు ఈ నెల 11 వ తేదీ ఉదయం నుంచి 12 వ తేది ఉదయం వరకు అమలులో ఉంటుందని తెలిపారు. వాహనాల దారి మళ్లింపు వివరాలు.. ● కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనా లు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి. ● తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రాయ చోటి మీదుగా కడపకు చేరుకోవాలి. ● రాజంపేట వైపు నుండి కడప వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు. రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా పంపిస్తారు. 18 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు.. శ్రీ సీతారామ కల్యాణానికి రాజంపేట వైపు నుండి వచ్చే భక్తులు టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను సాలాబాద్ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 13 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. కడప రహదారి వైపు పార్కింగ్ ప్రదేశాల వివరాలు.. కడప వైపు నుండి ఒంటిమిట్ట వచ్చే భక్తుల కోసం 13 ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ● ఫోర్ వీలర్స్కు జనరల్ పార్కింగ్ – చలమయ్య యాదవ్ సైట్..మాధవరం 1 (హెచ్ పి పెట్రోల్ బంక్ తూర్పు వైపున) ● త్రీ వీలర్స్కు పార్కింగ్ –కనకదుర్గ కళ్యాణ మండపానికి పడమటి వైపున మాధవరం1 ● కార్ పార్కింగ్ – కనకదుర్గ కల్యాణ మండపం తూర్పు వైపున ...మాధవరం 1 ● కార్ పార్కింగ్ – సన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యామిలి దాబా తూర్పు వైపు ● కార్ పార్కింగ్ – సన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యామిలి దాబా పడమటి వైపు ● ట్రాక్టర్లు, లారీల పార్కింగ్ – సన్నీ ఫుడ్ కోర్ట్ నుండి పడమటి వైపు సాయిబాబా గుడి, ఉప్పరపల్లి గ్రామం(ట్రాఫిక్ మళ్లింపు ప్రదేశం) ● కార్ పార్కింగ్– ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , కొత్త మాధవరం(ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఎదురుగా) ● ఆర్.టి.సి బస్సుల పార్కింగ్ – శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, ఓబుల్ రెడ్డి వాటర్ ప్లాంట్/ స్పైసెస్ బోర్డు మధ్యలో ● ఫ్రీ బస్సులు, వి.ఐ.పి కార్ పార్కింగ్ – శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, రాయలసీమ హోటల్ (వి.వి.ఐ.పి – వి.ఐ.పి ఎంట్రెన్సు ఆర్చి ఎదురుగా) ● పోలీసు వాహనాల పార్కింగ్ –ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ – మయూర హోటల్ వెనుక వైపు ● ఇతర శాఖల వాహనాల పార్కింగ్ – ఈ ద్గా పక్కన, ఒంటిమిట్ట (కార్ పార్కింగ్) ● టి.టి.డి వాహనాల పార్కింగ్ –కల్యాణ వేదిక ప్రధాన ప్రవేశం ఆర్చ్ వద్ద ఉన్న సత్రం వద్ద ● టూ వీలర్, కార్ పార్కింగ్ – కల్యాణ రామ టౌన్ షిప్, బ్రిడ్జి పక్కన, దర్జిపల్లి రోడ్, కొత్త పల్లి గ్రామ సమీపంలో రాజంపేట రహదారి వైపు పార్కింగ్ ప్రదేశాల వివరాలు ● ఆర్.టి.సి బస్సు పార్కింగ్ –సాలాబాద్ క్రాస్ వద్ద ● ఫోర్ వీలర్ , టూ వీలర్ పార్కింగ్–మదరసా, మలకాటి పల్లి గ్రామం. ● ఫోర్ వీలర్, టూ వీలర్ పార్కింగ్–మలకాటి పల్లి గ్రామం వద్ద. ● వి.ఐ.పి కార్ పార్కింగ్ –బి.సి బాయ్స్ హాస్టల్, ఒంటిమిట్ట టౌన్ ● వి.ఐ.పి కార్ పార్కింగ్ – దుర్గమ్మ గుడి ముందు వైపు, ఒంటిమిట్ట టౌన్ ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేపథ్యంలో నిర్ణయం వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలి జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ -
టీడీపీ నేతల అండతోనే శ్రీ మాధవ ఆంజనేయస్వామి భూముల ఆక్రమణ
కడప రూరల్ : మైదుకూరులోని శ్రీ మాధవ ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన విలువైన భూముల ఆక్రమణకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల అండదండలు ఉన్నాయని చాపాడు మండలం పెద్ద చీపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్ఆర్ రాజారామిరెడ్డి ఆరోపించారు. గురువారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైదుకూరులో శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవస్ధానానికి విలువైన భూములు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ స్థలాల్లో అక్రమంగా ఇద్దరు భవనాలు నిర్మించారని, మరో 17 మంది వరకు డాబాలు, షెడ్లు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆక్రమణదారులకు స్థానిక టీడీపీ బడా నేతల అండదండలు ఉన్నాయని తెలిపారు. ఆక్రమణలపై పలు మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవల తిరుపతి దేవదాయ శాఖకు చెందిన అధికారుల వచ్చి సర్వే చేసి, ఆక్రమణలను నిర్ధారించారని పేర్కొన్నారు. మార్చి 3వ తేదీన ఆక్రమిత కట్టడాలని తొలగించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారన్నారు. టీడీపీ నేతల కారణంగా ఆ ఆదేశాలు బుట్టదాఖలు అయ్యాయన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి శ్రీ మాధవ ఆంజనేయ స్వామి ఆస్తులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. -
‘బాబూ.. వృద్ధిరేటు బాగుంటే అప్పులెందుకు?.. సూపర్ సిక్స్ ఎక్కడ?’
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో ఒక ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల ముందు సంపద సృష్టి అని బిల్డప్ ఇచ్చారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.కడపలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పేదల నడ్డి విరుస్తూ కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరిచారు. సంపద సృష్టి అన్నారు. కానీ, సృష్టి పక్కన పెడితే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అన్నారు.. ఒక్కటీ అమలు కాలేదు. ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదు.జన్మభూమి పేరును మారుస్తూ P-4 అంటూ కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులకోసం ఈ కార్యక్రమం.. వారికి దోచి పెట్టేందుకే పీ-4 పథకం తెచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలి. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.మరోవైపు.. అనంతపురంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధి రేటులో ఏపీ నెంబర్-2 అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయరు?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏమైంది?. వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసును నిర్వీర్యం చేస్తున్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీసు క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి సుధాకర్కు లేదు.కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కాంట్రాక్టు పనుల ద్వారా వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయి. రాజకీయ యుద్ధం చేస్తానని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలపై విప్ కాలువ శ్రీనివాస్ ఎందుకు మాట్లాడరు?. వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు అంటూ ప్రశ్నించారు. -
సబ్స్టేషన్ కోసం పేదల ఇళ్లు కూల్చివేత
కడప సెవెన్రోడ్స్ : కడప నగరం మృత్యుంజయకుంట సూర్య ఆస్పత్రి సమీపంలో గత 30 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గతంలో కూలగొట్టిన విద్యుత్ అధికారులు ఇప్పుడు ఆ స్థలంలో సబ్స్టేషన్ నిర్మించేందుకు చదును చేస్తున్నారని బాఽధిత ప్రజలు వాపోతున్నారు. కడప నాగరాజుపల్లె గ్రామ పొలం సర్వే నెంబరు 187/1లో ఉన్న ఈ స్థలంలో రెవెన్యూ అధికారులు చాలాకాలం క్రితమే కొందరికి నివేశన స్థల స్వాధీన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ అనుబంధ పత్రాలు పొందిన పేదలు ఆ స్థలంలో చిన్నచిన్న రేకులషెడ్లు నిర్మించుకున్నారు. క్రమం తప్పకుండా మున్సిపాలిటీకి ఇంటి పన్ను, కుళాయిపన్నుతోపాటు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలన్నీ వారు చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ తమకు 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించుకునేందుకు స్థలం కావాలంటూ రెవెన్యూ అధికారులను కోరారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రస్తుతమున్న పీడబ్ల్యు ఓవర్ లోడుతో పనిచేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. కనుక తమకు సబ్స్టేషన్ కోసం స్థలం కేటాయించాలని కోరగా, అప్పటి కలెక్టర్ విజయరామరాజు సదరు సర్వే నెంబరులోని 20 సెంట్ల స్థలాన్ని ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్కు కేటాయిస్తూ గత సంవత్సరం జులై 18న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో విద్యుత్ అధికారులు వెళ్లి దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేదలు నిర్మించుకున్న ఇళ్లు ఎలా కూల్చివేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో తాత్కాలికంగా విద్యుత్ అధికారులు వెనక్కి తగ్గారు. ఈనెల 6వ తేదీ శ్రీరామనవమి రోజు స్థలం వద్దకు వచ్చి అక్కడ పేదలు ఏర్పాటు చేసుకున్న బోర్డును తొలగించి స్థలాన్ని చదును చేశారు. దీనిపై బాధితులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. ఇదే సర్వే నెంబరులో తమకు కేటాయించిన 20 సెంట్ల స్థలమే కాకుండా మరో ఎకరా ప్రభుత్వ భూమి ఉందని, ఆ స్థలంలో సబ్స్టేషన్ నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని బాధితులు అంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తమ పట్టా స్థలంలో తాము ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వని అధికారులు పరిహారం సైతం లేకుండానే స్థలం చదును లబోదిబోమంటున్న బాధితులు -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(45) రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హాకీ టోర్నీలో ద్వితీయ స్థానంలో జిల్లా జట్టుప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీలో విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వైఎస్సార్ జిల్లా జట్టుతో తలపడిన కాకినాడ జట్టు ఆది నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజేత ట్రోఫీని కై వసం చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారులు ద్వితీయ స్థానంలో నిలిచారు. క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రవిచంద్ర, సెక్రటరీ శేఖర్, డైరెక్టర్ శ్రీనివాసులు అభినందించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ జిల్లా జట్టుకు ధర్మవరం షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు వీరనారాయణ, మూడో స్థానంలో నిలిచిన అన్నమయ్య జిల్లా జట్టుకు చేనేత నాయకురాలు జయశ్రీ బహుమతులు, ట్రోఫీలను అందించారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఇరువురి అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని హోమస్పేటలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన కేసులో కొన్ని గంటల్లోనే నిందితులను త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులైన చిలంకూరి బాలయ్య, శ్రీరామ ఏసురత్నమ్మలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హోమస్పేటలో ఆయుర్వేదిక్ మందుల షాపు నిర్వహిస్తున్న ముంగర సుభాషిణి అనే వృద్ధురాలు మంగళవారం ఒంటరిగా ఉన్న సమయంలో చాపాడు మండలంలోని భద్రిపల్లెకు చెందిన చిలంకూరి బాలయ్య, ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన శ్రీరామ ఏసురత్నమ్మలు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే డీఎస్పీ భావన పర్యవేక్షణలో త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం సమీపంలో లభించిన సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం గాలించారు. ఈ క్రమంలో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని వాసవి సర్కిల్ సమీపంలో నిందితులు ఉన్నారని సమాచారం రావడంతో సీఐతో పాటు ఎస్ఐలు యోగీంద్ర సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 29 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య, ఏసురత్నమ్మలు బంధువులు అవుతారు. వీరిరువురు మరో ముగ్గురితో కలిసి 2017లో కల్లూరు గ్రామంలోని బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్టు సీఐ తెలిపారు. 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐ యోగీంద్ర, కానిస్టేబుళ్లు దస్తగిరి, సుబ్రహ్మణ్యం, బాలఏసు, జనార్దన్రెడ్డి, మహిళా కానిస్టేబుల్ సుధామణిలను డీఎస్పీ భావన అభినందించారు.24 గంటల్లోనే కేసును ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు -
ఘనంగా బిషప్ పట్టాభిషేకం
కడప కల్చరల్ : కడప కథోలిక మేత్రాసనానికి కొత్త కళ వచ్చింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నూతన బిషప్ పట్టాభిషేకం ప్రభువు దీవెనలు, ఆత్మీయుల అభినందనల మధ్య ఘనంగా సాగింది. ఇంతవరకు బిషప్గా సేవలు అందించిన రెవరెండ్ గాలిబాలి ఆధ్వర్యంలో కడప కథోలిక పీఠం నూతన బిషప్గా మోస్ట్ రెవరెండ్ సగినాల పాల్ప్రకాశ్ పట్టాభిషిక్తులయ్యారు. ఈ సందర్బంగా ఆయన తనను ఇంతగా ప్రేమించి సహకరిస్తున్న విశ్వాసులు, గురువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కడప కథోలిక మేత్రాసన బిషప్గా మోస్ట్ రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్ బుధవారం మరియాపురంలో ఏర్పాటు చేసిన భారీ ప్రత్యేక వేదికపై పట్టాభిషిక్తులయ్యారు. మరియాపురం బాలుర హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా గురువులు, విశ్వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.గురువులు ప్రత్యేకంగా రూపొందించి అలంకరించిన రథాలలో వాహనాలలో విశ్వాసులతో కలిసి ఊరేగింపుగా వేదిక వద్దకు వచ్చారు. బిషప్ పట్టాభిషేక ప్రాంగణానికి చేరుకోగానే విశ్వాసులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ హల్లెలూయా నినాదాలతో ఆ ప్రాంతాన్ని ప్రతిధ్వనింపజేశారు. తొలుత ప్రత్యేకంగా విచ్చేసిన పోప్ దూత లియోఫోల్డ్ జెరిల్లి నూతన బిషప్కు అభినందనలు తెలుపుతూ ప్రసంగించారు. అలాగే ఇంతవరకు బిషప్గా సేవలు అందించిన మోస్ట్ రెవరెండ్ గాలి బాలి ప్రసంగించారు. అనంతరం గురువులందరూ మోస్ట్ రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్తో పట్టాభిషేక సంప్రదాయాలను ఆచరింపజేశారు. విశ్వాసులందరికీ దివ్ సత్ప్రప్రసాదం అందజేశారు. కోయర్ బృందాలు నూతన బిషప్నుద్దేశిస్తూ గీతాలు ఆలపించారు. నూతన బిషప్ స్పందన తనను బిషప్గా దీవించిన దైవానికి, అభిమానించిన పోప్దూతకు, ఇంతవరకు సేవలు అందించిన గురువులు గాలిబాలికి నూతన బిషప్ కృతజ్ఞతలు తెలిపారు. పోప్ దూత మార్గదర్శనం చేసిన విధంగా ఈ ప్రాంతంలోని యువత, మహిళల ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పట్టాభిషేకం కాగానే గురువులు, విశ్వాసులు ఆయనను అభినందించారు. తరలివచ్చిన విశ్వాసులు పెద్ద ఎత్తున విచ్చేసిన పలు పీఠాల బిషప్లు, గురువులు భారీ వేదికపై సంప్రదాయంగా ప్రమాణ స్వీకారం పోప్ దూతలను కలిసిన ఎంపీ కడప కార్పొరేషన్ : కథోలిక డయాసిస్ బిషప్గా సగినాల పాల్ ప్రకాష్ పట్టాభిషేక మహోత్సావాన్ని పురస్కరించుకొని వాటికన్ సిటీ నుంచి కడప నగరానికి విచ్చేసిన అంతర్జాతీయ కథోళిక ప్రతినిధి, పోప్ దూత పూల ఆంతోని, ఇండియా కథోలిక దూత నున్సియో లను కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కలిశారు. బుధవారం పోప్ దూతలుగా జిల్లాకు విచ్చేసిన వారిని ఆయన కడప విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు అవినాష్రెడ్డిని ఆశీస్సులు అందజేశారు. అనంతరం నూతన బిషప్గా పట్టాభిషిక్తులైన సగినాల పాల్ ప్రకాష్కు అవినాష్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
అంజనీసుతపై కౌసల్యతనయ
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలో వెలసిన కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రామయ్య నవనీతకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నేటి అలంకారాలు: బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు. శ్రీరాముడిని రోల్మాడల్గా తీసుకోవాలి ఒంటిమిట్ట : శ్రీరాముడిని రోల్మాడల్గా తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒంటిమిట్ట రామయ్యను ఎంపీలు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. వీరికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అలయ ప్రదక్షణ గావించి, గర్భాలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ రంగ మండపంలో వీరికి అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, ఘనంగా సత్కరించారు. అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.శ్రీరాముడు రాజుగా సుభిక్ష మైన పాలన అందిచాడని చెప్పారు. ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ అధికారులుఒంటిమిట్ట: శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవెన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టిటిడి అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమంతవాహనంపై రామయ్య విహారం తిలకించి..పులకించిన భక్తజనం -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
ప్రొద్దుటూరు క్రైం : ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్ల ద్వారా బెట్టింగ్ కొనసాగిస్తున్న ముఠా కార్యకలాపాల గుట్టు రట్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో 25 మందిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3.10 లక్షలు నగదు, 23 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన బుధవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్పై నిఘా ఉంచారు. ఇందులో భాగంగానే బుకీలకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ చేశారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరలోని రామేశ్వరం నీళ్లట్యాంకు వద్ద క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో 18 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 2.05 లక్షలు నగదు, 18 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన దొరసానిపల్లెకు చెందిన పుత్తాగిరీష్ అనే వ్యక్తి గతంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో బిగ్బబూల్ 247.కామ్ అనే వెబ్సైట్లో కొంత మంది యువకులను యాప్లో చేర్చుకొని పందేలు నిర్వహించేవాడు. ఇలా సుమారు 40 మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఖాతాలను పరిశీలించగా సుమారు రూ. 1 కోటి పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించి ఫ్రీజ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పుత్తా గిరీష్కుమార్తో పాటు సాధు వీరప్రసాద్, పాతకోట ప్రతాప్రెడ్డి, ఆవుల సుబ్బారెడ్డి, బీచెర్ల సుబ్బారెడ్డి, వరదా సుధాకర్, మార్తల గురుశేఖర్రెడ్డి, మైలాగిని శివచైతన్య, సాధు పన్కుమార్, నల్లమారు నాగేంద్ర, వరదా ఆంజనేయులు, చిన్నకొండగిరి సుబ్బయ్య, మేకల మదనబాబు, ఎర్రమాసు ప్రతాప్, పబ్బతి శివశంకర్, తాటికొండ శ్రీను, తాటికొండ జగన్, భరతికవి చిన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె, చౌటపల్లె తదితర ప్రాంతాలకు చెందిన వారు. ఇదే కేసులో 23 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మరో కేసులో ఐదుగురు అరెస్ట్ పట్టణంలోని ఇస్లాంపురం వీధిలో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కోనేటికాల్వవీధికి చెందిన షేక్ మాబుషరీఫ్ అలియాస్ చుంచు, పిందాల జనార్దన్రెడ్డి, భూమిరెడ్డి నాగార్జునరెడ్డి, వేంపల్లి సుదర్శన్రెడ్డి, శ్రీరామ్ సుబ్బరాయుడు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 1.05 లక్షలు నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోని 23 మంది నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్ వ్యవహారంలో బడా బుకీల ప్రమేయం బెట్టింగ్ వ్యవహారంలో ప్రొద్దుటూరులోని బడా బుకీలైన టీడీపీ నాయకులకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పలువురు టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. దొరసానిపల్లె సర్పంచ్ అరవ ఈశ్వరమ్మ భర్త అరవ మునివర, షేక్ ఫారూక్, షేక్ గౌస్బాషా అలియాస్ బెంగళూరు బాషా, ప్రొద్దుటూరు మున్సిపాలిటి 25వ వార్డు కౌన్సిలర్ షేక్ హెహనూర్ భర్త ఖాదర్బాషాతో పాటు ఏలే నరసింహలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇస్లాంపురం వీఽధిలో పట్టుబడిన ఐదుగురు బుకీలు వీరి కనుసన్నల్లో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరిపై ప్రొద్దుటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ క్రికెట్ పందేల కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులో ప్రప్రథమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై బీఎన్ఎస్ 111 (2), 112 (2) అనే కొత్త సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో బీఎన్ఎస్ 111 (2) సెక్షన్ అనేది తీవ్రమైందని తెలిపారు. ఈ రెండు కూడా నాన్బెయిలబుల్ సెక్షన్లని, వ్యవస్థీకృత నేరం కింద 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదలే ప్రసక్తి లేదని డీఎస్పీ తెలిపారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు నమోదు అయితే బెయిల్ కూడా రాదన్నారు. చాలా మంది యువకులు కూడా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. యువత బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోరాదన్నారు. ప్రతి యాప్, వెబ్సైట్ పైనా పోలీసుల నిఘా ఉందన్నారు. ఐడీలు, ఐపీ అడ్రస్ ఆధారంగా యాప్లు ఎక్కడ క్రియేట్ చేశారో తెలుసుకొని సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో శ్రమించిన సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది రఘు, రామ్మోహన్లను డీఎస్పీ భావన అభినందించారు. రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో సీఐలు సదాశివయ్య, గోవిందరెడ్డి, బాలమద్దిలేటి పాల్గొన్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మంది అరెస్టు రూ.3.10 లక్షలు నగదు, 23 సెల్ఫోన్లు స్వాధీనం ఆన్లైన్లో రూ. 1 కోటికి పైగా జరిగిన లావాదేవీలు బెట్టింగ్ కేసులో పలువురు టీడీపీ నాయకులు -
టీడీపీ నేతలది రాక్షసానందం
కడప కార్పొరేషన్ : అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి హెచ్చరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా సోదరుడు అహ్మద్బాషాను ఇటీవల అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి బుధవారం ఆయన అంజద్బాషా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే మాధవి రాక్షసానందం పొందడంలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందన్నారు. అది 2022లో పెట్టిన చిన్నకేసు అని, అందులో ఉన్న బెయిలబుల్ సెక్షన్లను ఇప్పుడు నాన్బెయిలబుల్ సెక్షన్లుగా మార్చి అరెస్ట్ చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎవరైతే కేసు పెట్టారో వారు తమ పార్టీలోనే ఉన్నారని, తాము రాజీ అవుతున్నట్లు కోర్టులో పిటిషన్ కూడా వేశారన్నారు. ఆ కేసులో పోలీసులు అత్యుత్సాహంతో లక్షలు ఖర్చుపెట్టి ముంబైకి వెళ్లి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ముంబైకి వెళ్లి అరెస్ట్ చేసేంత పెద్ద కేసా ఇది...ప్రజలంతా ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో వైఎస్సార్సీపీ నాయకులను విపరీతంగా వేధిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన హోటళ్లు, ఆఫీసులు, వాటర్ప్లాంట్లను కూల్చివేస్తున్నారన్నారు. జిల్లా అభివృద్ధిపై చర్చించాల్సిన డీఆర్సీ మీటింగ్లో వీటిపైనే చర్చ చేస్తూ తర్వాతి మీటింగ్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు అంటూ మొదటి అంశంగా దానిపైనే కలెక్టర్, ఎస్పీలు చర్చిస్తున్నారంటే ఎంత అప్రజాస్వామికంగా పాలన నడుస్తోందో తెలుస్తోందన్నారు. పోలీసులు ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతా లు తీసుకుంటున్నారో, టీడీపీ కార్యాలయం నుంచి అందుకుంటున్నారో ఆలోచించాలన్నారు. అహ్మద్బాషాను అన్యాయంగా అరెస్ట్ చేస్తే 30యాక్టు అమల్లో ఉన్నా లెక్కచేయకుండా టీడీపీ నాయకులు పొట్టిశ్రీరాములు సర్కిల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకోవడం వారి రాక్షసానందానికి పరాకాష్ట అని మండిపడ్డారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకోవడానికి వాళ్లేమైనా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చారా ...లేక.. కడపకు ఉక్కు పరిశ్రమ తెచ్చారా అని ఎద్దేవా చేశారు. 30 యాక్టును ఉల్లంఘించి బాణాసంచా పేల్చారని వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టలేదని, కనీసం రశీదు కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను వేధించే విషయంలో, టీడీపీ నాయకుల అక్రమ వ్యాపారాలను చక్కబెట్టే పనిలో ఎస్ఐలు, సీఐలు చాలా బిజీగా ఉన్నారన్నారు. బుద్ధి ఉన్నవారు ఎవ్వరూ మేయర్ ఇంటి వద్ద చెత్త వేయరని, మేయర్ సురేష్ ఎలాంటి వ్యక్తో ఎమ్మెల్యే మాధవి చెప్పక్కర్లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ● 8 మంది ఎస్ఐలు, నలుగురు సీఐలు, 15 మంది కానిస్టేబుళ్లు ముంబైకి వెళ్లి ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు అహ్మద్బాషాను అరెస్ట్ చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతి పరులపై లేనిపోని కేసులు, దొంగకేసులు, ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పోలీసులు, అధికారులు ఈ ప్రభుత్వాన్ని నమ్మి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ● వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. ఈ చర్యకు పాల్పడ్డ వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. ● టీడీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులను వేధించడానికేనా ప్రజలు మీకు అధికారమిచ్చింది అని ప్రశ్నించారు. తమకు పరువుకు నష్టం కలిగేలా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఎన్నికేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, పులి సునీల్, పి. జయచంద్రారెడ్డి, సుభాన్బాషా, బీహెచ్ ఇలియాస్, యానాదయ్య, సీహెచ్ వినోద్, దాసరి శివ తదితరులు పాల్గొన్నారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ప్రైవేటు డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గుండారెడ్డి కోరారు. కడపలోని హరిత హాటల్లో బుధవారం వైవీయూ ప్రైవేటు డిగ్రీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఐదు సంవత్సరాలు అఫ్లియేషన్ ఇవ్వాలని కోరారు. జీఓ నంబరు 22 రద్దుచేసి డిగ్రీ ఫీజు నిర్ణయ విధానం పాత పద్ధతిలో కొనసాగించాలన్నారు. అధ్యక్షుడు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాం, నాయకులు శౌరీలురెడ్డి, జి.వెంకటరెడ్డి, సురేంద్ర రెడ్డి, మహానందయ్య, సుబ్బారెడ్డి, వివిధ కళాశాల యాజమాన్యాలు పాల్గొన్నారు. -
కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయండి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సభా భవన్లో జేసీ అదితిసింగ్ సింగ్తో కలిసి శ్రీ కోదండరామస్వామివారి కల్యాణో త్సవ విధుల నిర్వహణపై సంబంధిత లైజన్ అధికారులకు ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందన్నారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశామన్నారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, జెడ్పి సీఈవో ఓబులమ్మ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనపై... ఒంటిమిట్ట: రామయ్య కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే మార్గాలను, ఉండే ప్రాంతాలను కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వమించబోయే పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. -
ప్రమాదం కాదు.. హత్యే
జమ్మలమడుగు రూరల్ : బంధువుల మధ్య చిన్న తగాదే చిలికి చిలికి గాలి వానగా మారింది. అది చివరకు హత్యకు దారి తీసింది. అయితే దానిని ప్రమాదంగా చిత్రీకరించాలని బంధువులు ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల విచారణలో హత్యగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. జమ్మలమడుగు పట్టణ సీఐ ఎస్.లింగప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండల పరిధిలోని గూడెంచెరువు గ్రామం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బట్టు కిషోర్ బాబు (33) అనే యువకుడు మార్చి 24వ తేదీ జమ్మలమడుగు నుంచి స్వగ్రామమైన గూడెంచెరువుకు తన బైక్లో వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బట్టు కిషోర్ భార్య పుష్పవతి జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానంతో విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. కిషోర్ బాబుకు అన్న వరుస అయిన దేవరపల్లి ఉదయ్ కుమార్ ప్రొద్దుటూరు పట్టణంలోని కొట్టాలలో ఉంటున్నాడు. మార్చి 20వ తేదీన తన మేన మామ అయిన కిరణ్ తల్లి చనిపోయి 11 రోజులు కావడంతో దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజరైన ఉదయ్ కుమార్ను చిన్న విషయమై కిషోర్ బాబు అందరి ముందు మందలించాడు. అంతే కాకుండా ఉదయ్ కుమార్ భార్యపై కిషోర్ బాబు చేయి చేసుకున్నాడు. దీనిని అవమానంగా భావించిన ఉదయ్ కుమార్ ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 23వ తేదీన తాను డ్రైవర్గా వెళ్లే ఏపీ39–యుకె–3392 నెంబర్ గల ఐచర్ వాహనంలో జమ్మలమడుగు బైపాస్రోడ్డుకు వచ్చాడు. అక్కడి నుంచి కిషోర్ బాబుకు ఫోన్ చేసి నీ కథ ఈ రోజు తేలుస్తానని బెదిరించాడు. కిషోర్ బాబు మోటార్ బైకులో పట్టణంలోని ముద్దనూరు రహదారి గుండా వెళుతుండగా ఐషర్ లారీతో వెనుక వైపు నుంచి కిషోర్ బాబు బైకును ఢీకొని వాహనంతో పరారయ్యాడు. సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు నిందితుడు ఉదయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే వాహనంతో ఢీ కొట్టి చంపినట్లు అంగీకరించాడు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. లారీతో ఢీ కొట్టి హత్య బంధువుల మధ్య తగాదే కారణం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు -
మతసామరస్యానికి ప్రతీక.. కమలాపురం ఉరుసు
కమలాపురం : ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కెల్లా ఒక విశిష్ట స్థానానికి నిలయమైన ఒకే ఒక ప్రదేశం వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం పెద్ద దర్గా. కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా, జహీరియా మత సామరస్యానికి ప్రతీకగా, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో హజరత్ అబ్దుల్ గఫార్షాఖాద్రి, హజరత్ దస్తగిరిషాఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి , హజరత్ జహీరుద్ధీన్ షాఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్లు వెలసి ఉన్నారు. ప్రతి ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వర్గీయ పీఠాధిపతి హజరత్ హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించేవారు. ఆయన పరమ పదించిన తర్వాత ఆయన వారసులు, ముతవల్లి సజ్జాదె–ఏ–నషీన్ హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 11వ తేదీన నషాన్తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 12న గంధం, 13న ఉరుసు, 14న తహలిల్తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబు అవుతోంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం ముతవల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దర్గా విశిష్టత.. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి మత ప్రబోధనలు చేస్తూ వచ్చిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి 1916లో కమలాపురం వచ్చి స్థిర పడ్డారు. ఆయన తన భక్తులకు బోధనలు చేస్తూ ఎన్నో మహిమలు చూపారు. దీంతో ఈ ప్రాంతంలో చాలా మంది ఆయనకు శిష్యులుగా మారారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణులై విరాజిల్లుతున్న గఫార్ షా ఖాద్రి తన ప్రియ శిష్యుడైన దస్తగిరిషా ఖాద్రికి గురుత్వం బోధించి 1924 జనవరి 10న సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దస్తగిర్షా ఖాద్రి వంశీయులే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. దాదాపు 50ఏళ్లకు పైగా పీఠాధిపతిగా కొనసాగిన హజరత్ హాజీ జహీరుద్ధీన్ షా ఖాద్రి వలి అల్లాగా ప్రసిద్ధికెక్కారు. ఆయన ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన కుమారుడు ఫైజుల్ గఫార్షా ఖాద్రి గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మతసామరస్యానికి ప్రతీక హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్ దస్తగిర్షా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్టి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. గొప్ప ఖవ్వాలి.. ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీకి చెందిన ఖుత్బీ బ్రదర్స్, యూపీకి చెందిన సర్ఫరాజ్ అన్వర్ సాబిరి ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుందని, ఖవ్వాలి ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 13న బండ లాగుడు పోటీలు.. కమలాపురం ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాల్గవ బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు 13వ తేదీ ఉదయం 7గంటల్లోపు దర్గా–ఏ–గఫారియా ఆఫీసులో లేదా 97011 23459, 81219 96786 నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. అన్నదానం.. ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నషాన్ రోజున టి. హుసేన్ మియ్య, గంధం, ఉరుసు రోజుల్లో మోహన్ బీడి యజమాని కీ.శే. మహబూబ్ సాహెబ్ కుటుంబ సభ్యులు అన్నదానం చేయనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉరుసు మహోత్సవాలు 11న నషాన్, 12న గంధం, 13న ఉరుసు, 14న తహలిల్తో ముగింపు -
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడికి బెయిల్
వైఎస్సార్,సాక్షి: కూటమి కుట్రలో భాగంగా అరెస్టయిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా బెయిల్పై విడుదలయ్యారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కడప కోర్టు కొట్టివేసింది. మరో కేసులో పోలీసులు వేసిన పీటీ వారెంట్ డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.గతంలో ఓ వివాదంలో కడప తాలూకా స్టేషన్లో అహ్మద్ భాషపై కేసు నమోదైంది. ఆ సమయంలోనే అహ్మద్ బాషా రాజీ పడ్డారు. అయితే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్న కేసులు తిరగదోడింది. కక్షపూరితంగా అహ్మద్ భాషాపై పలు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది.లుక్ అవుట్ నోటీసులిచ్చి ముంబై ఎయిర్ పోర్ట్లో అరెస్ట్ చేసింది. అయితే,కేసుపై బుధవారం విచారణ చేపట్టిన కడప కోర్టు అహ్మద్బాషాకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.కోర్టు తీర్పుతో కడప సెంట్రల్ జైలు నుంచి అహ్మద్ భాషా విడుదలయ్యారు. సెంట్రల్ జైలు వద్ద అహ్మద్ భాషాకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష,పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వాగతం పలికారు. -
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్కు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్ను పులివెందుల పోలీసులు విచారించారుపవన్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్ రెడ్డి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఏపీలో వైఎస్సార్సీపీ కేడర్ వినాశమే టార్గెట్గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు. -
ఆర్టీపీపీలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ను ఆక్టోపస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఆదేశాల మేరకు , సోమ, మంగళవారాలలో ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ రాజారెడ్డి ఆధ్వర్యంలో రాంబాబు తమ కమాండోస్ బృందంతో నిర్వహించారు. ప్లాంట్లోకి ఉగ్రవాదులు చొరబడి ఉద్యోగులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినప్పుడు వారిని కాపాడిన తీరును డ్రిల్లో ప్రదర్శించారు. ఈ డ్రిల్లో ఆర్టీపీపీ సీఈ గౌరీపతి, సీఐ మహమ్మద్రఫీ, ఆర్టీపీపీ ఎస్ఈ సోమశేఖర్రెడ్డి, క్రిష్ణమోహన్, ఆర్టీపీపీ ఫ్యాక్టరీ మేనేజర్ సిద్ధయ్య, అసిస్టెంట్ కమాండెంట్ క్రిష్ణయ్య, ఫైర్ ఆఫీసర్ రఘునాథ్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నారాయణ యాదవ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మండలంలోని వనిపెంట శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.శ్రీకాంత్ (22) అనే యువకుడు మృతి చెందాడు. బ్రహ్మంగారిమఠంలోని తెలుగు గంగ కాలనీకి చెందిన శ్రీకాంత్ మోటార్ బైక్పై మైదుకూరు వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్రగాయాలతో ఉన్న అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బైక్పై వస్తున్న యువకుడిని కారు ఢీకొన్నట్టు పలువురు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నిలపకుండా వెళ్లినట్టు చెబుతున్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఒక్కడే కుమారుడువనిపెంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారు డు. బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ కాలనీకి చెందిన కుక్కే వెంకటేశ్వర్లు దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత శ్రీకాంత్ జన్మించాడు. శ్రీకాంత్ తన బావ నిర్వహిస్తున్న టెంట్ హౌస్లో పనిచేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రమాదంలో ఈ యువకుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
విరిగిన విద్యుత్ స్తంభం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు గ్రామంలో ఇళ్ల సమీపంలో విద్యుత్స్తంభం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ స్తంభం ఒరిగింది. అది మంగళవారం ఉన్నట్లుండి విరిగి పడిపోయింది. పెను ప్రమాదం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సిబ్బంది వచ్చి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేశారు. వరదయ్యగారిపల్లి ఆలయంలో చోరీరాజంపేట : మండలంలోని వరదయ్యగారిపల్లి అక్కమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఈ విషయాన్ని మన్నూరు సీఐ కులాయప్ప తెలిపారు.హుండీలు పగులకొట్టి అందులో నగదును తీసుకెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజ్ ఆధారంగా రికార్డు చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్ టీమ్ కూడా ఆలయాన్ని పరిశీలించిందన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి తీరని లోటురాయచోటి : విధులపట్ల ఎంతో నిబద్ధత కలిగిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమాను కోల్పోవడం జిల్లాకు తీరని లోటని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి అధికారిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆమె నిబద్ధత గురించి సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ చెప్పడంతోనే పీజీఆర్ఎస్కు స్పెషల్ ఆఫీసర్గా నియమించినట్లు తెలిపారు. ఈమె నియామకం తరువాత పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అన్నమయ్య జిల్లా ఎంతో వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన వ్యక్తి రమ అన్నారు. ఆమె ఎంతో మృదు స్వభావి, నిజాయితీగల అధికారిణి అని కొనియాడారు. సమావేశంలో డీఆర్ఓ మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ సహదేవరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
ఏపీజీబీ తరలింపు సీమకు తీరని ద్రోహం
కడప సెవెన్రోడ్స్ : గ్రామీణ బ్యాంకుల విలీనంలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులన్నింటినీ ఒకే బ్యాంకుగా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాయలసీమకు పెను శాపంగా మారిందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. బ్యాంకుల విలీనం చేస్తూ ఆర్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్ను నిరసిస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు చేస్తున్న అన్యాయాల లెక్కకు ఇది పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మైదుకూరు సభలో ఏపీజీబీ తరలింపు ఉండదు అని స్పష్టమైన హామీ ఇచ్చి, ఇంత అన్యాయం చేయడం ఘోరమని దుయ్యబట్టారు. ఇది రాయలసీమకు తీరని అన్యాయమని, గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న మోసాల కొనసాగింపేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6000 కోట్ల మిగులు ఉండి, 50 వేల కోట్ల డిపాజిట్లు ఉన్న ఏకై క బ్యాంకు ఏపీజీబీ అని ఆయన అన్నారు. తక్షణమే నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నగర కార్యదర్శి మగ్బూల్ బాషా, తస్లీమ్, ప్రసాద్, మునిరెడ్డి, రమేష్, అజయ్, వినోద్, ఆప్ కీ ఆవాజ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు షాజహాన్, చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ వద్ద ఆర్సీపీ నిరసన -
పేదల నెత్తిపై కూటమి ‘బండ’
కడప సెవెన్రోడ్స్ : పేదలపై కేంద్ర ప్రభుత్వం మరోమారు మోయలేని భారాన్ని మోపింది. వంట గ్యాస్(ఎల్పీజీ) ధరను సిలిండర్కు రూ.50లు చొప్పున చమురు కంపెనీలు పెంచాయంటూ ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. పెరిగిన ధర మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. సోమవారం గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారు కూడా డెలివరీ సమయంలో పెరిగిన మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే జీవన వ్యయం విపరీతంగా పెరిగి అవస్థలు పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పెనుభారంగా పరిణమించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు రోజు రోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. సామాన్యుడు ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు భగ్గుమంటున్న పరిస్థితుల్లో వంటగ్యాస్ భారాన్ని కూడా మోపడంపై ప్రజలు మండిపడుతున్నారు. గృహ వినియోగానికి సంబంధించిన 14.2 కేజీల సిలిండర్ ధర జిల్లాలో ఇప్పటికే రూ.900లు ఉండగా, గ్యాస్ ఏజెన్సీలు అదనంగా రూ.50లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిలిండర్ ధర రూ.50లు పెంచడంతో వినియోగదారుడు ఒక సిలిండర్ కోసం రూ.1000 సమర్పించాల్సి వస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ ధర రూ.503లు ఉండగా, తాజా పెంపుతో అది రూ.553కు పెరగనుంది. జిల్లాలో సాధారణ గృహ వినియోగ సిలిండర్లలో సింగిల్వి–307655, డబుల్ సిలిండర్లు–197406, దీపం కనెక్షన్లు–250532, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద కనెక్షన్లు–36962, పీఎం ఉజ్వల యోజన కనెక్షన్లు–19458 వెరసి 812013 ఉన్నాయి. నిన్నటి వరకూ ఈ మొత్తం కనెక్షన్లు కలిగిన వినియోగదారులంతా ఒక్క సిలిండర్ రూ. 900ల చొప్పున కొనుగోలు చేసేందుకు రూ.73,08,11,700 లు చెల్లించాల్సి వచ్చేది. పెరిగిన ధర నేపథ్యంలో కొనుగోలు చేస్తే రూ.77.14,12,350లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వినియోగదారునిపై రూ.4,06,00,650ల అదనపు భారం పడుతోంది. సగటున ఒక్కో కుటుంబం సంవత్సరానికి ఆరు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ మేరకు అదనపు ధర చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రూ. 50 అదనం వంటగ్యాస్ సిలిండర్పై రూ.50ల అదనపు భారం జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 8,12,013 పెంపు వల్ల అదనపు భారం రూ.4,06,00,650 -
విభిన్న ప్రతిభావంతులకు సేవలు అభినందనీయం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయడం ద్వారా చైన్నెకి చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ అండ్ ఫ్రీడమ్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సభా భవనంలో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 6, 7 తేదీలలో 219 మంది కాళ్లు కోల్పోయిన విభిన్న ప్రతిభావంతులకు కొలతలు తీసుకున్నామన్నారు. వారందరికీ ఆధునిక కృత్రిమ కాలు ఒక్కొక్కటి రూ. 51000తో మొత్తం సుమారు రూ.67 లక్షలు విలువ చేసే ఆధునిక కృత్రిమ కాళ్లు అమర్చామన్నారు. వీరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ సుందర్, యాక్సెస్ హెల్త్కేర్ ప్రతినిధి ఇలవేందన్, ట్రస్ట్ మెంబర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ -
కొనసాగుతున్న నిరసన
జమ్మలమడుగు : క్యాంప్బెల్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిరసన మంగళవారం రెండో రోజు కూడా కొనసాగింది. సీఎస్ఐ క్యాంప్బెల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అగస్టీన్రాజును తొలగించడం అన్యాయమని ఆయనను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రత్యూష మాట్లాడుతూ యలసీమ డయాసిస్లో ఎలాంటి సమావేశం జరగకుండా, ఓటింగ్ నిర్వహించకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇలా ఎవరుపడితే వారు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని ఆసుపత్రి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. బెల్టు షాపులపై విస్తృత దాడులుకమలాపురం/ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల ఎకై ్సజ్ శాఖ పరిధిలో కమలాపురంలో నిర్వహిస్తున్న బెల్టు షాపులపై విజయవాడ నుంచి వచ్చిన ఎస్టీఎఫ్ బృందం దాడులు నిర్వహించినట్లు ఎర్రగుంట్ల ఎకై ్సజ్ శాఖ సీఐ గోపీక్రిష్ణ తెలిపారు. మంగళవారం ఎర్రగుంట్ల ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కమలాపురంలో విస్తృతంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఎస్టీఎఫ్ డైరెక్టర్ రాహుల్దేవ్ వర్మకు ఫిర్యాదులు అందాయన్నారు. ఆ మేరకు విజయవాడ నుంచి ఎస్టీఎఫ్ స్క్వాడ్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కమలాపురంలో ఉన్న రెండు బెల్టు షాపులపై దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడులలో రాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టు షాపు నుంచి 44 మద్యం బాటిళ్లు, శంకర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టుషాపు నుంచి 41 బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలుములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... బి.కొత్తకోట మండలం ఎగువ శీతివారిపల్లెకు చెందిన రమేష్(23) పనుల మీద బురకాయలకోటకు ద్విచక్రవాహనంలో వచ్చాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బురకాయలకోట బైపాస్ వద్ద ఎదురుగా వస్తున్న కోటేశ్వర్రెడ్డి ద్విచక్రవాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రమేష్కి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
11లోపు అభ్యంతరాలు తెలపాలి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు పూర్వపు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) తాత్కాలిక జాబితా వెబ్సైట్ https:/rjdsekadapa.blogspot.com లో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. కావున ఏవైనా అభ్యంత రాలు ఉన్నచో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధి కారి కార్యాలయాల్లో తగిన ఆధారాలతో ఈ నెల 11లోపు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. పరిహారం అందించేందుకు కృషి పులివెందుల రూరల్: నియోజకవర్గంలో పది రోజుల క్రితం వీచిన ఈదురు గాలులు, వర్షాలకు దెబ్బతిన్న అరటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆమె జేసీ అతిథి సింగ్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. బిషప్ పట్టాభిషేకానికి పోప్ దూత రాక కడప కల్చరల్: కడప కథోలిక డయాసిస్ నూతన బిషప్గా మోస్ట్రెవరెండ్ సగినాల పాల్ ప్రకాష్ బుధవారం పట్టాభిషిక్తులు కానున్న సందర్భంగా.. ముఖ్య అతిథిగా ప్రపంచ క్రైస్తవ గురువు పోప్ దూత లియో ఫోల్డ్ జిరెల్లీ హాజరు కానున్నారు. మంగళవారం ఆయన కడప నగరానికి వచ్చేశారు. ఆరోగ్యమాత, కథడ్రల్ చర్చిలను దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఊరేగింపుగా భక్తులతో కలిసి కథడ్రిల్ చర్చికి వచ్చేశారు. మరియామాత, క్రీస్తు ప్రభువుకు ప్రార్థనలు చేశారు. విశ్వాసులు మాతను నిత్య జపం చేయాలని, కుటుంబ ప్రార్థనలు చేయాలని మార్గ దర్శనం చేశారు. కార్యక్రమంలో నల్గొండ బిషప్ ఎండీ ప్రసాద్రావు, ఆరోగ్యమాత మదర్ సరేనా, ఏఐసీయూ ప్రధాన కార్యదర్శి స్వామినాథన్, ఇతర గురువులు, మదర్లు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి కడప అర్బన్: మనోభావాలను దెబ్బతీయడమే గాకుండా, రెచ్చగొట్టే విధంగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు మంగళవారం కడప ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ అమర్నాథ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్బాషా సోదరుడు ఎస్బీ అహ్మద్బాషాను కడప పోలీసులు ముంబయిలో అరెస్టు చేసి తీసుకువస్తున్నారని, ఆయన ఇంటి సమీపంలోని గోకుల్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఆర్.వి సుబ్బారెడ్డి (పాలెంపల్లి సుబ్బారెడ్డి), యువరాజ్, పఠాన్ ఖాజాపీర్, జియావుద్దీన్, పాలంపల్లి రాజా, ఆరీఫ్, సయ్యద్ ఫైజల్ వీరితోపాటు ఆ పార్టీకి సంబంధించిన 200 మంది అరగంటపాటు బాణాసంచా కాల్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కడప నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమలులో వున్నా.. దాన్ని పాటించలేదన్నారు. ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలలో బంగారు నాగయ్య యాదవ్, రమేష్రెడ్డి, సుదర్శన్ రాయల్, నందలూరు ఫయాజ్, బి.హెచ్ ఇలియాస్ (వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్), టి.టి.డి బోర్ట్ మాజీ సభ్యులు యానాదయ్య, వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, కార్పొరేటర్ కె.బాబు తదితరులు ఉన్నారు. -
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పులివెందుల: ఇటీవల ఈదురు గాలులు, వర్షానికి అరటి గెలలు నేలకూలి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల చేత పంట నష్టం అంచనా వేసి నివేదికలు తెప్పించుకుని నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అరటి రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ కడప రైల్వేస్టేషన్లో టిక్కెట్లు రిజర్వు చేసుకునే సమయంలో మార్పులు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్కు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి రిజర్వేషన్ వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మార్పు చేశారన్నారు. రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత సమయాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. -
నీలమేఘశ్యామా..
కోదండ రామా.. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజు మంగళవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ‘కోదండ రామా.. నీలమేఘ శ్యామా, మా కోర్కెలు తీర్చు స్వామి’ అని వారు వేడుకున్నారు.ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడారు. సీతారాముల కల్యాణానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన వివరించారు. కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, కంకణం, అన్న ప్రసాదాలు అందజేస్తామన్నారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశామని, 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు హెచ్డీ క్వాలిటీతో ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీఎం ప్రోగ్రామ్ సమన్వయ కర్త పెందుర్తి వెంకటేష్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వేడుకగా స్నపన తిరుమంజనం సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు -
పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలి
వల్లూరు : పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. ఊర్మిళాదేవి అన్నారు. మండల పరిధిలోని వల్లూరు గ్రామ పంచాయతీలో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎస్డబ్ల్యూిపీసీ షెడ్డును పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వీధుల్లో పర్యటించి ప్రజలతో స్వయంగా మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను, అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి, టాయిలెట్లను, ఇతర వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. వారు సమన్వయంతో పని చేసి గ్రామాన్ని ఆరోగ్యవంతంగా, పచ్చదనంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కన్సల్టెంట్ శివ నారాయణ, డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సందీప్, వల్లూరు, వీరపునాయునిపల్లె మండలాల ఎంపీడీఓలు రఘురాం, చంద్ర శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ఎంఆర్సీ నాగమణి, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
యార్డు.. సమస్యల్లో రికార్డు
● కమీషన్లు తీసుకుంటారు.. వసతులు కల్పించరు కడప అగ్రికల్చర్: ‘కడప మార్కెట్యార్డులో అధికారులు అమ్మకాలపై కమీషన్లు తీసుకుంటారు కానీ వసతులు కల్పించడం లేదు’ అని ది కడప టర్మిరిక్ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. కడప మార్కెట్యార్డులో మంగళవారం వారు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేసన్ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు జవహర్లాల్ చౌదరి, సెక్రటరీ నరసింహులు, జాయింట్ సెక్రటరీ గుర్రకొండ మహేష్ మాట్లాడారు. రూ.లక్షకు వెయ్యి కమీషన్ తీసుకుంటారని, ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతుందని తెలిపారు. రైతులు ఉత్పత్తులు అమ్మకపోతే, వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన గోడౌన్ల సౌకర్యం లేదన్నారు. యార్డులోని షాపులకు సంబంధించి కడప కార్పొరేషన్కు ఏడాదికి ఒక్క భవనానికి రూ. 44 వేల పన్ను కడతామని, అలాంటి భవనాలు 35కు పైగా ఉన్నాయన్నారు. అటు కార్పొరేషన్ అధికారులు కానీ, ఇటు మార్కెట్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. యార్డు లోపల రోడ్లు కూడా సరిగా లేవన్నారు. అన్ని గుంతలేనన్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన నీరంతా వచ్చి చేరుతుందన్నారు. ఇన్ని అసౌకర్యాల మధ్య రైతులు యార్డుకు ఎలా వస్తారన్నారు. బస్తాకు రూ.9.18 నుంచి రూ.13.50 పెంచారు యార్డులో కొనుగోలు చేసిన పసుపును నిల్వ ఉంచుకునేందుకు సీడబ్లూసీ గోడౌన్లో స్టాక్ ఉంచుకుందామంటే.. గోడౌన్ వారు ఎక్కడా లేని ధరలు పెంచారన్నారు. మొన్నటి వరకు రూ.75 కిలోల బస్తాకు నెల బాడుగ కింద రూ.9.18 తీసుకునే వారని, అలాంటిది ఏప్రిల్ నుంచి ఎలాంటి సమచారం లేకుండా రూ.13.50 పెంచారన్నారు. కడప మార్కెట్ యార్డు నుంచి 2500 బస్తాల నుంచి 4 వేల బస్తాల పసుపు వస్తుందన్నారు. ఇన్ని బస్తాలకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులకే కాకుండా రైతుల వద్ద కూడా అంతే వసూలు చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు చంద్రప్రకాశ్ చోప్రా, బాబూలాల్ చోప్రా, మాజీ మార్కెట్యార్డు డైరెక్టర్ జవహర్లాల్ చౌదరి, రాజగోపాల్రెడ్డి, కాలేమనాయుడు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్: కడప మార్కెట్యార్డు సమస్యల్లో రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో.. రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి.. పంటలను కంటికి రెప్పలా కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తే.. వాటిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కడప మార్కెట్యార్డుకు జిల్లాలోని నలుమూలల నుంచి పసుపు, వేరుశనగక్కాయలను తెచ్చి అమ్ముకుంటారు. అయితే ఇక్కడ షెడ్లు లేకపోవడంతో.. ఆరుబయట, రోడ్డుపైనే ఉత్పత్తులను రాసులు పోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భాల్లో వర్షాలు వస్తే.. భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం వచ్చిన అకాల వర్షంతో పసుపు, వేరుశనక్కాయలు తడిచిపోయాయి. వాటిపైన పట్టలు కప్పినప్పటికీ.. యార్డులో వర్షపు నీరు పోయేందుకు వీలులేక నీరంతా వాటి కిందికి చేరాయి. అవి తడిచిపోకుండా కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. మళ్లీ బస్తాకు రూ.40 చెల్లించి హమాలీలతో ఆరుబయట ఎండ పెట్టుకోవాల్సి వచ్చింది. తడిచిన సరుకు కావడంతో వ్యాపారులు ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. మంచినీరు.. మరుగుదొడ్లు కరువే.. మంచినీటితోపాటు మరుగుదొడ్లు కరువయ్యాయి. సీజన్లో రైతులు రోజుకు పదుల సంఖ్యలో వస్తారు. వీరితోపాటు వ్యాపారులు, హమాలీలు, మహిళా కూలీలు ఇలా చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. ఆరుబయట చెట్ల పొదలు, గోడ పంచకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. గతంలో అక్కడ అరకొరగా ఉన్న మరుగుదొడ్లను రోడ్డు వెడల్పులో తొలగించారు. తర్వాత నిర్మించలేదు. ఒక్క మంచినీటి కూల్ క్యాన్ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు అందరికీ సరిపోకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో విశ్రాంతి భవనం ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరుకోవడంతో ఎవరూ వినియోగించుకోవడం లేదు. చెట్ల కింద, భవనాల పంచన విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు వేడుకుంటున్నారు. ప్రతిపాదనలు పంపాము జంబో షెడ్డుకు సంబంధించి సివిల్ వర్కు పూర్తయింది. మిగతా ఆగిన పనులకు సంబంధించి నిధుల కోసం ప్రతిపాదనలు పంపాము. నిధులు రాగానే మిగిలిన పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని వస్తాము. మిగతా సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సుబ్బారెడ్డి, ఈఈ, మార్కెటింగ్ శాఖ సరైన వసతుల లేవు కడప మార్కెట్యార్డులో సరైన మౌలిక వసతులు లేవు. దీంతో ఆరుబయట రోడ్డు పైన వేరుశనగక్కాయలను అమ్ముకోవాల్సి వస్తుంది. సరైన గిట్టుబాటు ధర రాకుంటే.. వాటిని మళ్లీ సంచులకు ఎత్తాలి. అప్పుడు ధాన్యంతోపాటు మట్టి, దుమ్ము వస్తుంది. అధికారులు స్పందించి వసతులు కల్పించాలి. – చిన్న సుబ్బారెడ్డి, కొత్తగిర్రిపల్లె, పెండ్లిమర్రి మండలం 40 బస్తాలు తడిచిపోయాయి ఈ నెల 3వ తేదీన 40 బస్తాల పసుపును మార్కట్యార్డుకు తెచ్చాను. అదే రోజు సాయంత్రం ఉన్నట్లుండి వర్షం కురిసింది. దీంతో పసుపంత తడిచి ముద్దయింది. మళ్లీ హమాలీలకు బస్తాకు రూ.40 ఇచ్చి ఆరుబెట్టుకున్నాను. అయినా కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకున్నాను. – ఓబుల్రెడ్డి, రైతు, తిప్పిరెడ్డిపల్లె, సికెదిన్నె మండలం మార్కెట్ యార్డులో వసతులు కరువు పట్టించుకోని అధికారులు రైతులకు తప్పని తిప్పలు ఏళ్ల తరబడి.. కడప మార్కెట్యార్డుకు గతంలో రూ.84 లక్షలతో జంబో షెడ్డు మంజూరు చేశారు. దీనిని కాంట్రాక్టర్ కొంత వరకు నిర్మాణ పనులు చేపట్టి వదిలేశారు. దీంతో నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో రైతులకు అవస్థలు తప్ప డం లేదు. కడపు నిండా భోజనం చేసేందుకు కూడా సరైన హోటల్ లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. -
మతి స్థిమితం లేని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత
కడప, అర్బన్ : ఇంటినుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితిలోని మహిళను గుర్తించి తిరిగి వారి కుటుంబం చెంతకు చేర్చి శభాష్ పోలీస్. అని ప్రజల మన్ననలు పొందారు బ్లూ కోల్ట్ పోలీసులు.. వివరాల్లోకెళితే... కడప రామాంజనేయపురానికి చెందిన సత్రమ్మ అనే మతి స్థిమితం సరిగా లేని మహిళ గత రెండు రోజుల నుంచి చిన్నచౌకు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ నేపథ్యంలో బ్లూ కోల్ట్(–10) విధులలో ఉన్న కానిస్టేబుల్ బి. రాజారమేష్ నాయక్(పి.సి 2412), హోమ్గార్డ్ సురేష్( హెచ్.జి 138) లు మంగళవారం చిన్న చౌకు పరిధిలోని పాత బైపాస్లో తిరుగుతున్న మహిళను గుర్తించి చిన్నచౌకు సీఐ ఓబులేసుకు సమాచారమిచ్చారు. చిన్న చౌకు సీఐ ఓబులేసు సూచన మేరకు మధ్యాహ్నం నుంచి ఆమె కుటుంబీకుల ఆచూకీ కోసం బ్లూ కోల్ట్ సిబ్బంది శ్రమించారు. వాట్సాప్ ద్వారా మహిళ ఫొటోను విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు 5 గంటల తర్వాత ఎట్టకేలకు రామాంజనేయపురానికి చెందిన మహిళగా గుర్తించి భర్త పరశురామ్కు అప్పగించారు. తన భార్యను తిరిగి తన వద్దకు అప్పగించేందుకు శ్రమించిన పోలీస్ సిబ్బందికి పరశురామ్ కృతజ్ఞతలు తెలిపారు. -
మందుల కోసం వచ్చాడు.. బంగారు చైన్ లాక్కెళ్లాడు
ప్రొద్దుటూరు క్రైం : వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే బంగారు చైన్ను లాక్కొని పారిపోయాడు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హోమస్పేటలో సుభాషిణి అనే 70 ఏళ్ల వృద్ధురాలు కొన్నేళ్లుగా ఆయుర్వేద మందులను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మందులు తీసుకునేందుకు గుర్తు తెలియని భార్యాభర్తలు అక్కడికి వచ్చారు. భార్య బయట ఉండగా భర్త లోపలికి వెళ్లాడు. తన భార్యకు ఆరోగ్య సమస్య ఉందని మందులు ఇవ్వమని అడిగాడు. ఆమె మందులు ఇచ్చే క్రమంలో మెడలోని బంగారు చైన్ను లాక్కొని ఆమెను తోసేశాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. దొంగ అక్కడి నుంచి బయటికి పరుగెత్తి భార్యతో కలిసి ఆటోలో పారిపోయాడు. వెంటనే సుభాషిణి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐ యోగీంద్రలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రెండున్నర తులాల బంగారు చైన్ అపహరణకు గురైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన భార్యా భర్తల ఫొటోలను త్రీ టౌన్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. వీరిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
ఉప సర్పంచ్ ఎన్నికలో ఓటమి తప్పదనే టీడీపీ అరాచకాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించి టీడీపీ అరాచకాలు సృష్టించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీకి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికకు సంబంధించి 20 మంది వార్డు మెంబర్లు ఉండగా 19 మంది వైఎస్సార్సీపీ, కేవలం ఒక్క వార్డు సభ్యుడు మాత్రమే టీడీపీ మద్దతు దారుడు ఉన్నాడన్నారు. ఒక్క సభ్యుడిని పెట్టుకుని వైస్ సర్పంచ్ పదవి కావాలని కోరడం దారుణమన్నారు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ, ప్రపంచంలోగానీ జరిగే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నిక సందర్భంగా ఏకంగా పోలీసుల మద్దతుతోనే టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారన్నారు.తమను లోనికి రానీయకుండా టీడీపీ చోటామోటా నేతలు దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర తీశారన్నారు. నకిలీ మనుషులను ఏర్పాటు చేసి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేసి వారిని పంచాయతీ వార్డు సభ్యులుగా తీసుకు వస్తే పోలీసులు వారిని లోనికి పంపించారన్నారు. ఈ నేపథ్యంలో లోపలున్న అధికారులు ఒప్పుకోకపోతే ఆయా అధికారులను బండబూతులు తిట్టారన్నారు. తమ వారిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తే తిరిగి తమ వారినే పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి నిర్బంధించారన్నారు. తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా తమకు చెందిన 100 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడు భార్గవరెడ్డి ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలో కూర్చుని తన మనుషులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేశారన్నారు. టీడీపీ వారికి ఓటమి తథ్యమనుకున్న తరుణంలో వారు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి చేత గుండెపోటు డ్రామా ఆడించారన్నారు. ప్రొద్దుటూరులో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో కడపలో జరిగే గ్రీవెన్సెల్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు రాఘవేంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, నకిలీ ఐడీ కార్డులు సృష్టించిన, ఆయా ఐడీ కార్డులను అడ్డం పెట్టుకుని ఎన్నికల హాలులోకి వచ్చిన వారిపై, ఎన్నిక సందర్భంగా అధికారులను బెదిరించిన వారిపై, వీధి రౌడీలను ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ కారణాలతో ఎస్పీ తమకు న్యాయం చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, ఆపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రొద్దుటూరును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు బలిదానం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిదేవి, గోపవరం సర్పంచ్ మోషె, ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి -
కీచక ఉపాధ్యాయులపై చర్యలేవీ?
బద్వేలు : బడిలోని చిన్నారులకు అండ దండగా ఉంటూ.. విద్యా బుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలో వరుసగా జరిగిన మూడు సంఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 26 తేదీ పోరుమామిళ్ల మండలం టేకూరుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అదే పాఠశాలలో హిందీ పండిట్గా పని చేస్తున్న కలసపాడు మండలానికి చెందిన రత్నమయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాలకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి స్పందించి కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత బద్వేలు పట్టణంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అన్వర్బాషా అనే ఉపాధ్యాయుడు ఈనెల 2వ తేదీన అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన మరువక ముందే బద్వేలు పట్టణంలోని ఏవీఆర్ పాఠశాలలో మరో కీచకుడు అయిన కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య ఆరవ తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.విద్యార్థినులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీసులు వచ్చి పెంచలయ్యను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయించని ప్రధానోపాధ్యాయుడు పోరుమామిళ్ల మండలం టేకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై ప్రధానోపాధ్యాయుడు రమణయ్య అసలు కేసు పెట్ట లేదు. హిందీ ఉపాధ్యాయుడు రత్నమయ్య కొన్నిరోజులుగా పాఠశాలలోని విద్యార్థినులతో ఆసభ్యంగా ప్రవర్తిస్తున్నా ప్రధానోపాధ్యాయుడు ఎందుకు మిన్నకుండిపోయారో అర్థం కావడం లేదు. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి బద్వేలు , మైదుకూరు విద్యాశాఖాధికారులతో విచారణ జరిపించారు. లైంగిక వేధింపులు జరిగింది వాస్తవమని తేలిన తరువాత కూడా ప్రధానోపాధ్యాయుడు కేసు నమోదు చేయించలేదు. ఈ విషయమై పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డిని వివరణ కోరగా కేసు పెట్టేందుకు ఎవరూ రాలేదని తెలిపారు. బద్వేలులోని లిటిల్ ఫ్లవర్, ఏవీఆర్ పాఠశాలలో జరిగిన సంఽఘటనలపై పోక్సో కేసు నమోదు చేశామని వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని బద్వేలు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాజగోపాల్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బద్వేలు నియోజకవర్గంలో జరిగిన వరుస సంఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. టేకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘటన జరిగిన సమయంలో తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆ సంఘటనపై విచారించి సంబంధిత ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తానే స్వయంగా ఆయా పాఠశాలలను సందర్శించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఉపాధ్యాయ వనంలో కలుపు మొక్కలను ఏరుతున్నా ఎక్కడికక్కడ మళ్లీ మొలుస్తూనే ఉన్నాయి. దారి చూపాల్సింది పోయి దారి తప్పి అభం శుభం తెలియని చిన్నారులపై బుస కొడుతూనే ఉన్నాయి. ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పాఠశాలలో పసి మొగ్గలపై దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. గురువులు వారి గురుతర బాధ్యత మరిచి చిన్నారుల పాలబుగ్గలపై కన్నేసి కాటేస్తున్నారు. చాలా పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బాధిత చిన్నారులు వచ్చీరాని మాటలతో ఇంటికి వచ్చి మా సార్ ఇలా చేశాడు అని చెప్పేంత వరకూ బయటి ప్రపంచానికి తెలియడంలేదు. చిన్నారులపై ఇలాంటి దురాగతాలకు పాల్పడిన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో భయాందోళన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
వేంపల్లె : వేంపల్లె పట్టణంలోని వివేకానంద రెడ్డి (రెడ్డయ్య) కాలనీలో గత 15 రోజులుగా తాగునీరు రాలేదని అ కాలనీ మహిళలందరూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కారును ఆపి మహిళలు తాగునీటి ఇబ్బందులను తొలగించాలని ముట్టడించారు. దీంతో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కారు దిగి వచ్చి వివేకానంద రెడ్డి కాలనీలో ఉన్న నీటి సమస్యను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగ ముందు నుంచి తమ కాలనీకి తాగునీటిని సరఫరా చేయలేదని, నీటికి ఇబ్బందులు ఉండడంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు. ప్రతిసారి మోటార్ కాలిపోయిందని సిబ్బంది చెబుతున్నారని, వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండటంతో చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పంచాయతీ సిబ్బందికి ఫోన్ ద్వారా తెలిపితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారన్నారు. తాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. రెండు రోజుల్లోగా వివేకానంద రెడ్డి కాలనీకి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు. దీంతో మహిళలు నిరసన విరమించారు. పోటాపోటీగా ట్యాంకర్లతో నీటి సరఫరా స్థానిక వివేకానంద రెడ్డి (రెడ్డయ్య కాలనీ)లో నీటి సమస్య ఉండడంతో పోటాపోటీగా వైఎస్సార్సీపీ, టీడీపీ (ఎమ్మెల్సీ వర్గం) నాయకులు నీటి ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేశారు. సోమవారం వివేకానంద రెడ్డి కాలనీకి చెందిన మహిళలు నిరసన తెలపడంతో ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కమతం రాజా, వార్డు మెంబర్ గణేష్ ప్రసాద్లు సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. అలాగే ఎమ్మెల్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులకు కూడా విషయం తెలియడంతో అటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇటు సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు ఆదేశాల మేరకు వివేకానంద రెడ్డి కాలనీ ప్రజలకు నీటి ట్యాంకర్ల ద్వారా ఇరు పార్టీల నాయకులు నీటిని సరఫరా చేశారు. అలాగే కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు లేకుండా తాగునీటి బోరును కూడా వేస్తామని సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు తెలిపారు.ఎమ్మెల్సీ కారును అడ్డగించి సమస్య తీర్చాలని నిలదీత -
మహిళపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరి అరెస్టు
ఖాజీపేట : పుల్లూరు పీడబ్ల్యూ బంగళా వద్ద భాగ్య అనే మహిళపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఖాజీ పేట సీఐ మోహన్ తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విష యంలో ఈమైపె హత్యాయత్నం జరిగింది. డ్రైవర్ శివకృష్ణకు గాయాలయ్యా యి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరితో పాటు కొప్పులోలు వెంకట సూర్య చంద్రారెడ్డి (23) షేక్ మహమ్మద్ రఫీ (38) లను రావులపల్లె క్రాస్ వద్ద అరెస్టు చేసి వారి వద్దనుంచి బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటికి 8 మందిని అరెస్టు చేశామని మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. పెన్నా నదిలో పడి వృద్ధుడి మృతిప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరానికి చెందిన ఇల్లూరు చిన్నవెంకటేష్ (73) అనే వృద్ధుడు స్నానం చేసేందుకు పెన్నా నదిలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన చిన్న వెంకటేష్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించసాగారు. ఈ క్రమంలో పెన్నానదిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేష్ పశువుల వ్యాపారం చేసేవాడు. అతనికి భక్తి ఎక్కువ. పెన్నానదిలో స్నానం చేసి గుడికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రెండు కుళాయిల సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు అక్కడ ఉన్న నీళ్లలో దిగాడు. ఈ క్రమంలో సోమవారం అతని మృతదేహం నీళ్లలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లోతు ఎక్కువగా ఉన్న కారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతనికి ఆయాసం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పేదల సొంతింటిపై చిత్తశుద్ధి లేని కూటమి
కడప సెవెన్రోడ్స్ : పేదలకు సొంతిల్లు ఉండాలన్న విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికీ రెండు సెంట్ల స్థలం, టిడ్కో ఇల్లు ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ అధ్యక్షతన జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, బాదుల్లా, సుబ్రమణ్యం, మునెయ్య, మనోహర్రెడ్డి, లింగన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీపీపీలో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్వార్టర్స్లో ఫిబ్రవరి నెలలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడు గణపత్ దావర్ (25)ను అరెస్టు చేసినట్లు కొండాపురం సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సోమవారం కలమల్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిమోతితో కలసి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లా కుక్షి తాలూకాలోని నర్వాలి గ్రామానికి చెందిన జవర్సింగ్ కుమారుడు గణపత్ దావర్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్నారు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తమ అవసరాలకు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్మాగారాలు, పెద్దపెద్ద అపార్ట్మెంట్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఆర్టీపీపీలోని క్వార్టర్స్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. ఇలా ఫిబ్రవరి నెలలో 9.10 తేదీల మధ్య రాత్రి సమయంలో ఆరు ఇళ్లలో దొంగతనాలు చేశారన్నారు. సుమారు రూ.2,40,000లు విలువ గల బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కలమల్ల ఎస్ఐ తిమోతి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం నిందితులు మళ్లీ దొంగతనాలు చేసేందుకు వచ్చారని అందిన సమాచారం మేరకు ఎర్రగుంట్ల– ముద్దనూరు మార్గంలోని కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితుడు గణపత్ దావర్ను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆధారాలను సేకరించడంలో, నేరస్తుల ఆచూకీ కనిపెట్టడంలో తన నైపుణ్యాన్ని చూపిన ఎస్ఐ తిమోతి, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ, కొండాపురం సీఐ మహమ్మద్రఫీలు అభినందించారు. -
పొగాకు కొనుగోలుకు ముందుకొచ్చిన జీపీఐ కంపెనీ
బి.కోడూరు : మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు కొనుగోలుకు ఎట్టకేలకు జీీపీఐ కంపెనీ ముందుకు వచ్చింది. మండల రైతుల నుంచి ఒత్తిడి అధికం కావడంతో సోమవారం నుంచి పొగాకును కొనుగోలుకు కంపెనీ సిద్ధమైంది. జీపీఐ కంపెనీ వారు పొగాకు కొనుగోలుకు ముందుకు రావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మందు పిచికారీతో పంట నష్టంఖాజీపేట : పంటకు తెగులు సోకిందని మందు పిచికారీ చేస్తే చేతికి వచ్చిన పంట పూర్తిగా ఎండిపోయిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ఖాజీపేట మండలం కొత్త ఏటూరు గ్రామానికి చెందిన వీరభద్ర అనే రైతుకు రెండు ఎకరాల పొలం ఉంది. పొలంలో పచ్చపెసర సాగు చేశాడు. పంటకు తెగులు సోకడంతో ప్రొద్దుటూరుకు చెందిన ఒక దుకాణంలో మందు కొనుగోలు చేశాడు. మందు పిచికారీ చేశాక సాయంత్రం కల్లా పంట పూర్తిగా ఎండిపోయింది. పంటకు సక్రమమైన మందు ఇచ్చి ఉంటే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని రైతు తెలిపాడు. ఎకరాకు రూ.50వేలు ఖర్చయిందని, కేవలం మందు పిచికారీ కారణంగా పంట పూర్తిగా నష్టపోయానని వాపోయాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు
పులివెందుల రూరల్ : భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు సిబ్బందికి సూచించారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో పులివెందుల, ముద్దనూరు వ్యవసాయ డివిజన్ల పరిధిలోని 9మండలాల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా ఉంటాయన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు కావలసిన నాణ్యమైన ఎరువులను, విత్తనాల ను అందిస్తూ రైతుకు సేవ చేసే దానిలో ఎల్లప్పుడూ ముందు ఉండాలన్నారు. రైతులు సబ్సిడీ యంత్ర పరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎ. నాగేశ్వర రావు -
పనులు త్వరగా పూర్తిచేయాలి
జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సిద్దవటం : ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని సిద్దవటం మండలం లోని కడప– చైన్నె ప్రధాన రహదారికి ఇరువైపులా పారుశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆమె భాకరాపేట, కనుమలోపల్లె గ్రామాల్లో జరిగే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ విజయ భాస్కర్, ఈఓపీఆర్డీ మోహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, శివయ్య పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్కు 19 స్లాట్ బుకింగ్లు
కడప కోటిరెడ్డిసర్కిల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చా రు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి దస్తావేజులను అందజేశారు. సోమవారం 19 స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి దస్తావేజులను అందజేసినట్లు సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ తెలిపారు. కొత్త విధానంతో ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఎక్కువ సమయం వృథా కాదని, ప్రజలు నిరీక్షించే బాధ తగ్గుతుందన్నా రు. అలాగే క్యూఆర్ కోడ్తోనూ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు తమ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. -
గ్రీవెన్స్సెల్కు వినతుల వెల్లువ
కడప సెవెన్రోడ్స్ : కలెక్టర్ కార్యాలయ సభా భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇన్ఛార్జి డీఆర్వో వెంకటపతి, ఇతర అధికారులకు తమ సమస్యలు విన్నవించారు. ● లింగాల మండలం తాతిరెడ్డిపల్లె సర్వే నెంబరు 457లో తనకు వారసత్వంగా వచ్చిన 1.41 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు సురేంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించి అరటిమొక్కలు నాటారని కోమన్నూతల గ్రామానికి చెందిన శ్రావణి ఫిర్యాదు చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నేతల నుంచి తన భూమిని ఇప్పించాలని కోరారు. ● వీఎన్ పల్లె మండలం అనిమెలలో 1976–77 ప్రాంతంలో దళితులకు మంజూరు చేసిన పట్టా భూములను ఎం.జగదీశ్వర్రెడ్డి, జోగిరెడ్డి, రాజారెడ్డి, ఝాన్సీలక్ష్మి తదితరులు ఆక్రమించారని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మునెయ్య ఫిర్యాదు చేశారు. ● ఇంజనీరింగ్ కాలేజీలో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న కొంతమంది జాబ్కార్డులు పొంది ఉపాధి హామీ సొమ్మును కాజేస్తున్నారని చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీడీఓ సుబ్బారెడ్డి మద్దతుతోనే ఇది జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ● బెంగుళూరు–విజయవాడ ఆరు లేన్ల రహదారి నిర్మాణంలో భాగంగా రెండు ఎకరాల తన భూమిని ప్రభుత్వం సేకరించిందని, తన అన్న నరసింహారెడ్డి పేరిట అవార్డు పాస్ చేశారని బ్రహ్మంగారిమఠం మండలం చిన్నాయిపల్లెకు చెందిన పెంచల్రెడ్డి ఫిర్యాదుచేశారు. అన్ని డాక్యుమెంట్ ఆధారాలు తమకు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదన్నారు. -
కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవను నిలిపేసి రోగుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. మాటలు కోటలు దాటించే కూటమి నేతలు.. ఆరోగ్యశ్రీ వైద్య సేవ దగ్గరికొచ్చేసరికి ‘కోట్ల’ బిల్లులు నిలిపేశారు. ఇంకేముంది నెట్వర్క్ ఆస్పత్రులు ఉచిత వైద్య సేవలను న
కడప రూరల్ : పేదలకు అందించే ఉచిత వైద్యం నిలిచిపోయింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ట్రస్ట్ ద్వారా నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ‘ఇన్నాళ్లు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నడిపాం. ఇకపై ముందుగు సాగలేమ’ని ఆషా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేన్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేశారు. పాపం.. ప్రజలు.. జిల్లా వ్యాప్తంగా నెట్ వర్క్ ఆసుపత్రులు మొత్తం 108 ఉన్నాయి. అందులో 36 ప్రైవేట్ ఆసుపత్రులు. మిగిలినవి ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ ఆసుపత్రుల ద్వారా అర్హులకు 3,255 రకాల వ్యాధులకు వైద్య సేవ లు అందించాలి. ప్రతి రోజు దాదాపు 2 వేల మంది రోగులు ఆసుపత్రులకు వస్తుంటారు.కాగా 36 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో, వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రుల్లో ఉండే వైద్య మిత్రలు వచ్చిన రోగులకు ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చూసే వైద్య సేవలు లేవు. ఆసుపత్రుల వారు బంద్లో ఉన్నారని చెప్పి పంపించేస్తున్నా రు. ఈ సమాధానం విని రోగులు ఆశ్చర్యపోతున్నారు. బందా..ఎప్పుడూ లేదే..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద ఔట్ పేషెంట్స్కు ఫీజు తీసుకోకుండా పేషెంట్ను చూడాలి. ఇన్ పేషెంట్స్కు అయితే ఉచితంగా వైద్య సేవలు అందించాలి. బంద్ కావడంతో ఔట్ పేషెంట్స్ డాక్టరుకు ఫీజులు చెల్లించి చూపించుకుంటున్నారు. ఆపదలో ఉన్న ఇన్ పేషెంట్స్గా అవసరమైన వ్యాధిగ్రస్తుల పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. ప్రైవేట్గా చూపించుకోవాలంటే వేలు దాటి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి బెదిరింపులు..నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలను చెల్లించి, పేదల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. వైద్య సేవలను నిలుపుదల చేసిన ఆసుపత్రుల వివరాలను తెలపాలని ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలిసింది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా బెదిరింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’లు బంద్ ఉచిత వైద్యం అందక పేదల ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా బకాయిలు నిధులు అందకపోవడంతో వైద్య సేవలను నిలుపుదల చేసిన నెట్ వర్క్ ఆసుపత్రులు ఈ వ్యక్తి పేరు అంకన్న. వేముల మండలం, గొందిపల్లె వాసి. రెండు వారాల క్రితం బండి మీద నుంచి కింద పడి కాలుకు గాయమైంది. కుట్టు వేశారు. అప్పుడు ఉచితంగా వైద్య సేవలు అందాయి. ఇప్పుడు చెకప్ కోసం వచ్చారు. వైద్య సేవలను నిలుపుదల చేయడంతో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ రోజు బంద్ ఉందంట. చాలా మంది వచ్చి వెనక్కి వెళ్లారు. ఉచితంగా వైద్య సేవలు అందకపోతే తమ లాంటి వారి పేదల పరిస్ధితి ఏమికావాలని అంకన్న ప్రశ్నించారు. ఉచిత వైద్యం అందకపోతే పేదల పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్ అంటే ఫీజు చెల్లించాను కంటి సమస్యతో కడపకు వచ్చాను. ఆసుపత్రుల వారు ఆరోగ్య శ్రీ కింద అందించే వైద్య సేవలు బంద్ చేశారని చెప్పారు. చేసేదిలేక రూ.300 ఫీజు చెల్లించి డాక్టర్ వద్ద చూపించుకున్నాను. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. – రామ్మోహన్, ముద్దనూరు. -
కోదండరాముడి కల్యాణోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్ సవిత సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడి కల్యాణ మండపం సమీపంలోని పరిపాల భవన సమావేశ మందిరంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, టీడీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ విష్ణువర్దన్ రాజు, జేసీ అదితి సింగ్తో కలిసి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 11వ తేదీన సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు.ప్రజా భద్రత కోసం సుమారు 150కిపైగా సీసీ, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.మంత్రి సవిత మాట్లాడుతూ కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కల్యాణవేదిక ప్రాంగణాన్ని భక్తులు శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, తాగునీటి వసతి కల్పించామన్నారు.108 వాహనాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ హర్షవర్దన్ రాజు మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులను కోరారు. కల్యాణ వేదిక పరిశీలన అంతకుముందు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని కల్యాణ వేదికను వారు పరిశీలించారు.ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్ మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ నాగరాజు, డీపీఓ రాజ్యలక్ష్మీ, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణయ్య పాల్గొన్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సవిత -
రాయంచపై రామయ్య విహారం
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 7 నుంచి 8:30 గంటలకు హంసవాహనసేవ వైభవంగా జరిగింది. రాములోరు రాయంచపై కొలువుదీరి మాఢవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామా..మము బ్రోవుమా అంటూ భక్తజనం ప్రణమిల్లారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసకు పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తుల్లో అహంభావం తొలగించి శ్రీదాసోహంశ్రీఅనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామి వారు అధిరోహిస్తారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు. వేలాది మంది తరలిరావడంతో రామయ్య క్షేత్రంలో భక్తజన సందడి నెలకొంది. అంతకు ముందు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాఢవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 11 నుంచి కల్యాణవేదిక వద్ద ఉత్సవమూర్తులకు అభిషేకాలు జరిపారు. అనంతరం స్నపనతిరుమంజనం నిర్వహించారు. ప్రణమిల్లిన భక్తజనం నేటి కార్యక్రమాలు... బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో శ్రీరాముడు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి సింహ వాహనంపై విహరిస్తారు. -
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
బద్వేలు అర్బన్ : భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ... ఇదే అదునుగా భావించి ఆ అల్లుడు ఆమె ఇంటికే కన్నం వేశాడు. రూ.6 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ వెల్లడించారు. గోపవరం మండలం టీ.సండ్రపల్లె గ్రామానికి చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె భర్త అయిన మంగుదొడ్డి మురళి డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వీరు గతంలో నెల్లూరు జిల్లా కలువాయి గ్రామంలో నివసిస్తూ రెండేళ్ల క్రితం నుంచి అత్తగారింటికి సమీపంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న అర్బన్ సీఐ రాజగోపాల్ అయితే గత నెల 18వ తేదీన పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన టీ.సండ్రపల్లెకు వెళ్లారు. వారితో పాటు మురళి కూడా వెళ్లాడు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం గత నెల 27న బద్వేలుకు వచ్చిన మురళి తెలుగుగంగ కాలనీలో ఉన్న అత్తగారింటికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.6 లక్షలు విలువ చేసే 7 తులాల బంగారు ఆభరణాలు (ఒక లాంగ్చైన్, ఒక జత బంగారు గాజులు, ఒక జత బుట్టకమ్మలు, ఒక పాపిడిబిళ్ల) ఎత్తుకెళ్లాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా తిరిగి టీ.సండ్రపల్లెకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఉన్నాడు. మరుసటిరోజు ఇంటి తాళాన్ని తెరిచి ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు పెంచలమ్మ రెండవ కుమార్తె శిరీషకు విషయం తెలపడంతో ఆమె వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీ చేసింది అల్లుడు మురళినే అని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తనతో పాటు ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, సిబ్బంది కలిసి నిందితుడు మురళిని పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నగలు స్వా«దీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకటే‹Ù, ఓబులేసు, చెన్నారెడ్డి, నరసింహులు, కోటేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
సాక్షి, వైఎస్సార్: అతను ఓ పోలీస్ అధికారి. అయితే వీధి రౌడీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రవర్తించడం ఆయన నైజం. పని చేసిన ప్రతి చోట వివాదాలు సృష్టించుకోవడం.. ప్రజలతో ఛీ కొట్టించుకోవడం ఆయనకు పరిపాటి. అయితే పుష్ప సినిమాలో లాగా తాను ఏమాత్రం తగ్గేదేలే అనే చందాన వ్యవహరిస్తున్నాడు. తన పద్ధతి, విధానాలను పోలీసుశాఖ లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం ఆయన ప్రత్యేకత. తన సర్కిల్ పరిధిలోని ప్రజలకు రోత పుట్టించే విధంగా విధి నిర్వహణ ఉందంటే ఆయన తీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజానిజాలు బయటపడతాయని సర్కిల్ పరిధిలోని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు సీఐ రోషన్ వ్యవహార శైలిని గమనిస్తే కడప జిల్లాలో ఎక్కడో గాని ఇలాంటి అధికారి పోలీసుశాఖలో లేడనే చెబుతారు. డబ్బుల కోసం ఏ స్థాయికైనా దిగజారే మనస్తత్వం అని కమలాపురం ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఇటీవల ఆయన విధి నిర్వహణలో అనేక భంగపాట్లు ఎదురైనా తనకు ఉన్నతాధికారుల అండ ఉందనే గర్వంతో పోలీసు స్టేషన్కు వచ్చే సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రోషన్ రోత చరిత్ర అనే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కమలాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ఒక చిన్న స్థాయి వీధి గలాటాకు సంబంధించి వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఓ వ్యక్తిని నాలుగు రోజుల కిందట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అధికార పార్టీ అగ్ర నాయకుడి ఆదేశాలతో ఆ వ్యక్తిపై పోలీసు జులుం ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 45 వేల రూపాయలు చెల్లించడంతో ఆ డబ్బు తీసుకొని ఏమాత్రం సంతృప్తి చెందక మిగిలిన డబ్బుల కోసం ఆ వ్యక్తిపై వీధి రౌడీలా ప్రతాపాన్ని చూపాడు. సీఐ రోషన్ కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోవడంతో కమలాపురానికి చెందిన ఒక వైద్యుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి వైద్యం చేయించారు. బాధితుడి కుటుంబీకులు ఈ విషయంపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే కమలాపురం పట్టణంలో ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్ష లీకేజీ వ్యవహారంలో బాధ్యులు కాని వ్యక్తులపై కూడా అధికార పార్టీ అగ్ర నాయకుడు చెప్పాడనే ఏకైక కారణంతో స్వామి భక్తిని చాటుకునేందుకు.. దీనికితోడు వారి దగ్గర డబ్బును బాగా దండుకోవచ్చనే దురుద్దేశంతో సంబంధం లేని వ్యక్తులను సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించి.. కేసు నమోదు చేసి.. వారిని బెదిరించి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసిన విషయం కమలాపురంలో వీధి వీధినా వ్యాపించింది. డబ్బులు ఇవ్వని కొందరు నిందితులను భారీ స్థాయిలో పోలీస్ కోటింగ్ ఇచ్చిన ఘనత కూడా రోషన్కే దక్కింది. అలాగే చిన్నచెప్పలి గ్రామానికి చెందిన తండ్రి కొడుకుల ఆస్తి వ్యవహారంలో రోషన్ వ్యవహరించిన అత్యుత్సాహం సామాన్యుడిని సైతం నివ్వెర పరిచింది. జిల్లా ఉన్నతాధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో రోషన్ కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించింది. ఈయన కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తికి కమలాపురానికి సంబంధించిన ఒక మైనారిటీ వర్గ నాయకుడికి జరిగిన వ్యవహారంలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ఆ మైనార్టీ నాయకుడిని బెదిరించి దాదాపు 15 లక్షలకు పైగా వసూలు చేసుకున్న ఘనాపాటి ఈ సీఐ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి స్వయంగా ఒక డివిజనల్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసి వీడియో దృశ్యాలను చూపించినా ఆ డివిజనల్ అధికారి మిన్నకుండిపోవడం గమనిస్తే ఈ సీఐ ఏ స్థాయిలో అధికారులను తన వైపు తిప్పుకుంటున్నాడో తెలిసిపోతోంది. ఇక ఇటీవల కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈ జీ అశోక్ కుమార్ తమ నియోజకవర్గ నాయకుడికి అత్యంత ఆప్తుడని, అలాగే రేంజ్ పరిధిలో ఉన్న ఓ అధికారి సైతం తమ నాయకుడి మాటే వింటాడని తనను ఎవరూ ఏమీ పీకలేరని బహిరంగంగానే ఈ అధికారి మాట్లాడడం గమనిస్తున్న కమలాపురం ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సీఐ గారికి జీతం ఇచ్చేది నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ అగ్ర నాయకుడా?? లేక పోలీస్ శాఖనా అనే విషయంపై చర్చ కూడా కమలాపురం ప్రాంతంలో జోరుగా జరుగుతోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కమలాపురం పట్టణంలో దాదాపు పదికి పైగా> అధికార పార్టీ అగ్ర నాయకుడి బెల్ట్ షాపులు బహిరంగంగా బార్లను తలదన్నే విధంగా నడుస్తున్నాయంటే వాటి నుంచి ఈయన ఎంత దండుకుంటున్నాడో మరో మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు ఈ సీఐ రోషన్ సహాయంతో నడుస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ కూడా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన జోక్యం చేసుకొని రోషన్ ఆగడాలను అరికట్టకపోతే కమలాపురం పోలీసుల తీరు మరో బీహార్ ప్రాంతాన్ని తలపించే విధంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.కోగటం సంఘటనపై సీఐ రోషన్ను వివరణ కోరగా అదంతా బోగస్ అని కొట్టి పారేశారు. వారు లాయర్కు డబ్బు ఇచ్చుకున్నారేమో గాని తాను డబ్బు అడగలేదని వివరించారు. -
నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్రెడ్డి పిటిషన్పై విచారణ
ఢిల్లీ : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది.మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్రెడ్డి గత నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై విచారణ జరిగే సమయంలో ఏపీ సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని చెప్పారు. దీంతో, మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మిథున్రెడ్డి సుప్రీం కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
వైఎస్సార్సీపీ అహ్మద్ భాషా అరెస్ట్.. పీఎస్ వద్ద భారీ బందోబస్తు!
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సోదరుడు వైఎస్సార్సీపీ నేత అహ్మద్ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆయనను ఏ పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత అహ్మద్ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు. అయితే అహ్మద్ భాషాను ఏ పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కడప చిన్న చౌక్ పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లోనే ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కడప తాలూకా పోలీసు స్టేషన్లో స్థల వివాదం విషయంలో అహ్మద్ భాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రామ మందిరం..సాహితీ సౌరభం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామయ్య సేవలో ఎందరో కవులు పుణీతులయ్యారు. అమూల్య ఆధ్యాత్మిక రచనలను రామయ్యకు అంకితం చేశారు. అయ్యలరాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీ నాయక మకుటంతో ఆయన వెలువరించిన శతకం లభ్యమైంది. తొలుత రాచరిక పాలనలో తన పాండిత్యాన్ని సాగించినప్పటికీ తరువాత పూర్తిగా దాశరథి సేవకు అంకితమయ్యారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామయ్య సేవలో తరించిన కవులపై కథనం. చమత్కార శైలి.. విభిన్నం అయ్యలరాజు రామభద్రుడు ఒంటిమిట్టలో క్రీ.శ. 1550లో ఇక్కడ నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు రామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజుకు ఈ కావ్యాన్ని అంకితం చేశారు. రామాభ్యుదయం 8 ఆశ్వాసాల గ్రంధం. రామభద్రుని కవిత్వంలో చమత్కారం తొణికిసలాడుతుంది. చరిత్రపుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప.. చరిత్ర పుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప.. వరకవి నల్లకాలువ అయ్యప్ప కోదండ పాణిని సేవించి వర కవి అయ్యారు. చంద్రగిరిని పాలించిన రెండో వెంకటపతి రాయల బావమరిది కుమారుడు ఓబరాజు. ఈయన సర్వసైన్యాధ్యక్షుడిగా సేవలందిచారు. ఆయనను ప్రసన్నం చేసుకుని అయ్యప్ప కృతులు చెప్పారు. నెల్లూరు జిల్లా భీమవరం గ్రామాన్ని అగ్రహారంగా పొందారు. పూర్వం నెల్లూరు నుంచి తిరుపతి వరకు దాడులు జరిగాయి. బద్వేలు, నందలూరు, రాజంపేట, కోడూరు, మామండూరు ప్రాంతాల మీదుగా దాడులు చేశారు. ఈ ఘటనలన్నింటిని నిర్భయంగా శతక రూపంలో అద్భుతమైన పద్యాలతో ఆవిష్కరించారు. ఆ శతకమే ‘శతృసంహార వెంకటాచల విహార’ సాహితీ మణి మకుటం మట్లిరాజులు సిద్దవటం కేంద్రంగా పరిపాలన చేశారు. వీరు రామయ్య క్షేత్రాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దారు. గుడి నిర్మాణ సమయంలో ఉప్పు గొండూరు వెంకట కవి తరచూ సందర్శన నిమిత్తం ఇక్కడకి వచ్చేవారు. ఆ సమయంలోనే ఏకశిలానగరి రామయ్య మీద దశరథరామ అనే మకుటంతో శతకం రాశారు. రామయ్యను దర్శించిన అన్నమయ్యకోదండ రామస్వామిని పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. నేటికి ఈ ప్రాంత ప్రజలకు ఆ కీర్తనలు సుపరిచితం. కోదండపాణి సేవలో పునీతులైన కవులు భాగవతం రచించిన బమ్మెర పోతన వాసుదాసు వాల్మీకి రామాయణం అంకితం అపర భక్తుడు మాల ఓబన్న రాముడికే అంకితం చేశారు. వావిలి కొలను సుబ్బారావు వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) తన యావదాస్తిని రాముడికి అంకితం చేశారు. వా ల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కుమారాభ్యుదయం, కౌసల్యా పరిణయం రాశారు. 1908 అక్టోబర్ 9, 10, 11 తేదీలలో రామాయణం గ్రంథాన్ని రాముడికి అంకితం ఇచ్చారు. అక్షర హాలికుడు పోతన వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన తెలుగులో రాశారు. మహావిష్ణువును శ్రీరాముడిగా ఆదరించి తరించిన అపర భక్తుడు. భాగవతం రచన చేసి జగదభిరాముడి చరణానికి అంకితం చేశారు. ఇక్కడి నేల తల్లితో మమేకమై అక్షర సేద్యం చేసి హాలికుడిగా ఆయన ప్రత్యేకతను చాటారు. అమూల్య సాహితీ గ్రంథాలను తనకు అంకితమివ్వమని రాజులు అడిగితే అందుకు ఆయన అంగీకరించ లేదు. ఆయనది సడలని భక్తి భావం రామాలయం తూర్పు దిశలో మాలకాటిపల్లె గ్రామం ఉంది. ఈ ఊరికి చెందిన భవనాసి మాల ఓబన్న జీవిత లక్ష్యం శ్రీరామచంద్రునిపై సడలని భక్తి భావం. ఆయన అమృత కంఠంతో నిరుపమాన రామకీర్తనలు పాడారు. పగటి పూట పనులు చేసుకుని రాత్రి పూట గుడికి ఎదురుగా ఉన్న సోపానాల ముందు కూర్చుని భజన పాటలు గానం చేసేవారు. బాగా పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లేవారు. ఒక రోజు సాయంత్రం రామయ్య దర్శనం కోసం తహసీల్దార్ వచ్చారు. ఆయన రావడాన్ని ఓబన్న గమనించలేదు. ఆధ్యాత్మికంగా అనురక్తితో లీనమై గానామృతం చేస్తూనే ఉన్నారు. దారికి అడ్డు తొలగలేదని తహసీల్దార్ ఆయనను దూషించారు. అదే రాజు రాత్రి తహసీల్దార్కు కలలో రాముడు కనిపించి భక్తుడిపై దూకుడు ప్రదర్శన మంచిది కాదని హితబోధ చేశారట. ఆ మరుసటి రోజు అధికారి ఓబన్న చెంతకు వచ్చి పొరపాటు జరిగిందని చింతించారు. భవనాసి పట్టుదల, భక్తిభావాన్ని చూసి మెచ్చుకున్నారు. నేటి పాలకులు మాల ఓబన్న సేవలను గుర్తించలేదు. ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భక్తుల ఆవేదన. -
వెంటిలేటర్పై వైద్య సేవ
పేదలకు ఉచిత వైద్యం అందించే బృహత్తర పథకం ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ (ఆరోగ్య శ్రీ) పథకం పతనం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఈ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టారు. మూడు దఫాలుగా విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తాజాగా ఆషా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోషియేషన్) రాష్ట్ర కమిటీ వైద్య సేవల నిలుపుదలకు నిర్ణయించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కూటమి పాలకుల్లో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకంపై ‘పచ్చ’నీడలు కమ్ముకున్నాయి. కడప రూరల్: ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం వెంటిలేటర్పై ఉంది. ఈ పథకంలో భాగంగా కార్పొరేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు లభించడమే ప్రధాన ఉద్దేశ్యం.ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ. కోట్లల పేరుకు పోయాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ‘బకాయిలు చెల్లిస్తే గాని తాము కోలుకోలేము..పేదలకు ఉచిత వైద్యంను అందించలేము’అని స్పష్టం చేశాయి. పేరుకు పోయిన బకాయిలు.. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పరిధిలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. అందులో ప్రైవేట్ కార్పొరేట్ (నెట్వర్క్) ఆసుపత్రుల తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ● ప్రైవేట్ ఆసుపత్రులు వంద పడకలు, 50 పడకలు గల ఆసుపత్రులు ఉన్నాయి. ఒక రోజుకు వేలాది మంది నిరుపేద రోగులు ఉచిత వైద్యం కోసం నెట్ వర్క్ ఆసుపత్రులకు వస్తుంటారు. వారికి వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల యాజమాన్యానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం కోట్లల్లో బకా యిలు చెల్లించాల్సి ఉంది. ఒక నెలకే ఒక ఆసుపత్రికి రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలను సక్రమంగా చెల్లించలేదు. విడుదల చేసిన నిధుల కన్నా..ఆసుపత్రుల్లో అందించిన వైద్య సేవలు, అందాల్సిన బిల్లులు అధికంగా ఉన్నాయి. దీంతో నెట్ వర్క్ ఆసుపత్రుల వారు అవకాశం ఉన్న బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు, ప్రైవేట్ సంస్థల నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నిర్వహిస్తున్నట్లు ‘ఆషా’ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ప్రభుత్వ రంగానికి చెందిన ఆసుపత్రుల్లో ‘వైద్య సేవ’పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ డెలివరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ డెలివరీలతో పాటు సర్జరీలు, అలాగే గర్భాశయం తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఇందుకు గాను ఒక్కో వ్యాఽధిని బట్టి వైద్య సేవ ట్రస్ట్ నుంచి బిల్లులు మంజూరవుతాయి. ఆ విధంగా వచ్చిన డబ్బును ప్రోత్సాహకం కింద వైద్యులకు 45 శాతం, ఆసుపత్రుల అభివృద్ధికి 55 శాతం కేటాయిస్తారు. అధిక సంఖ్యలో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారానే దాదాపుగా 95 రకాల పైగా వ్యాధులకు ఉచిత వైద్య సేవలు లభించడంతో, ఈ ఆసుపత్రులపైనే పెనుభారం పడనుంది. ‘ఆరోగ్య శ్రీ’పై అక్కసు... 2007–2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యంను అందించాలనే సంకల్పంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా లక్షలాది మంది పేదలు ఉచిత వైద్యం ద్వారా పునర్జన్మను పొందారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. కాగా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ‘ఆరోగ్య శ్రీ’పథకం ఒడిడుడుకులను ఎదుర్కొంటుంది. దీంతో ‘ఆరోగ్య శ్రీ’అంటే టీడీపీకి అక్కసు అనే అభిప్రాయం నెలకొంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిపే పరిస్థితులు వచ్చాయి. దీంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’వెంటిలేటర్పై ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలను పట్టించుకోని ప్రభుత్వం‘వైద్య సేవ’లో పనిచేస్తున్న వైద్య మిత్రలు ఇతర సిబ్బంది తమ ఉద్యోగ భద్రత, సంస్థ మనుగడపై ఆందోళన చేపట్టారు. విడతల వారీగా విధులను బహిష్కరించి, శాంతియుత నిరసన తెలిపారు. నామమాత్రంగా చేపట్టిన విధుల బహిష్కరణకే ఉచిత వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా నెట్ వర్క్ ఆసుపత్రుల వారే పూర్తిగా వైద్య సేవల నిలుపుదలకు గట్టిగా నిర్ణయించా రు. ఇంత జరుగుతున్నా పాలకులకు చీమ కుట్టి నట్లైనా లేదు. వైద్య సేవలు నిలిచిపోతే అనారోగ్యం పాలైన రోగులకు ఉచిత వైద్యం అందక, వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవడమే కష్టం. రూ.కోట్లల్లో పేరుకు పోయిన బకాయిలు స్పందించని కూటమి పాలకులు నేటి నుంచి ఉచితవైద్య సేవలు నిలుపుదల ‘ఆషా’రాష్ట్ర కమిటీ నిర్ణయం పేదల ఉచిత వైద్యంపై పెను ప్రభావం మాకు సహకరించాలి నెట్ వర్క్ ఆసుపత్రుల వారికి కోట్లల్లో బిల్లులు అందాలి. ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తేనే ఆసుపత్రులను నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7 నుంచి ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేస్తున్నాం. – డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు, ఏపీ స్పెషాలిటీ హస్పిటల్ అసోషియేషన్ ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి సకాలంలో వైద్యం అందితేనే కోలు కోవడానికి చాలా టైమ్ పడుతుంది. అలాంటిది ఉచిత వైద్య సేవలు నిలిచిపోతే అనర్థాలు జరిగిపోతాయి. అనారోగ్యం పాలైతే లక్షలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకోలేం. ప్రభుత్వం మా లాంటి పేదలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. –గంగాధర్రెడ్డి, అక్కాయపల్లె, కడప -
చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాదులోని చర్లపల్లి–తిరుపతి (07017– 07018) మధ్య ప్రత్యే రైలును ప్రవేశపెట్టినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఈనెల 6, 11, 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నా రు. అలాగే తిరుపతి నుంచి ఈనెల 7, 12, 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26 31 తేదీల్లో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో చర్లపల్లిలో రాత్రి 9.35 గంటలకు, తిరుపతిలో సోమ, శనివారాలలో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైలు మల్కాజ్గిరి, కాచిగూడ, హుందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తిరోడ్డు, గద్వాల్, కర్నూలుసిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వు చేసుకోవాలని సూచించారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
ప్రొద్దుటూరు: స్వయంగా పోలీసుల సమక్షంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వారంలో గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతలు అనుసరించిన వైఖరిని తూర్పారబట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నడిబజారులో నిలబెట్టారని విమర్శించారు. వాస్తవానికి టీడీపీకి ఒకే వార్డు మెంబర్ ఉన్నారని, పార్టీ మారిన వారితో కలిపి ఆరుగురు అయ్యారన్నారు. వైఎస్సార్సీపీకి సంబంధించి 14 మంది వార్డు మెంబర్లు ఉంటే టీడీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా బెదిరించి వైఎస్సార్సీపీ వార్డు మెంబర్లను ఓటింగ్కు రాకుండా రాళ్లతో దాడి చేశారన్నారు. వాస్తవానికి వార్డు మెంబర్లు మాత్రమే పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా 30 మంది టీడీపీ నాయకులు చేపల మార్కెట్కు వెళ్లినట్లు వస్తున్నా పక్కన ఉన్న పోలీసులు ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. తమ వార్డు సభ్యులు ఓటింగ్కు వెళుతుండగా రాళ్లతో దాడి చేయడంతో ప్రాణభయంతో బయటపడ్డారన్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారన్నారు. నిస్సిగ్గుగా టీడీపీ నేతలు వ్యవహరించిన కారణంగానే చివరికి ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఫేక్ ఐడీ కార్డులతో దొంగ వార్డు సభ్యులను లోనికి పంపి ఎన్నిక జరిపించాలని టీడీపీ నేతలు ఎన్నికల అధికారిని బూతులు తిట్టి చేయిచేసుకున్నారని ఆరోపించారు. బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, సెల్పాయింట్ నవీన్, చీమల రాజశేఖరరెడ్డి, పర్లపాడు మహేశ్వరరెడ్డి లాంటి వారంతా లోనికి ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. స్వయంగా తమ ఉప సర్పంచ్ అభ్యర్థిని కొట్టుకుంటూ ఈడ్చుకెళుతున్నా పోలీసులు నిలువరించలేకపోయారని తెలిపారు. డీఎస్పీతోపాటు పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతోపాటు అక్కడే ఉండగా ఈ దౌర్జన్యకాండ జరిగిందన్నారు. టీడీపీ నేతలు విచ్చల విడిగా అరాచకానికి, దౌర్జన్యానికి పాల్పడినా కనీసం ప్రశ్నించలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నాయకులు అడ్డు అదుపు లేకుండా పెట్రేగిపోతున్నారని విమర్శించారు. ● సమావేశంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, సర్పంచ్ మోషా, ఉపసర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలి నేడు ఎస్పీని కలుస్తాం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
సాక్షి, టాస్క్ఫోర్స్ : అతను ఓ పోలీస్ అధికారి. అయితే వీధి రౌడీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రవర్తించడం ఆయన నైజం. పని చేసిన ప్రతి చోట వివాదాలు సృష్టించుకోవడం.. ప్రజలతో ఛీ కొట్టించుకోవడం ఆయనకు పరిపాటి. అయితే పుష్ప సినిమాలో లాగా తాను ఏమాత్రం తగ్గేదేలే అనే చందాన వ్యవహరిస్తున్నాడు. తన పద్ధతి, విధానాలను పోలీసుశాఖ లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం ఆయన ప్రత్యేకత. తన సర్కిల్ పరిధిలోని ప్రజలకు రోత పుట్టించే విధంగా విధి నిర్వహణ ఉందంటే ఆయన తీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజానిజాలు బయటపడతాయని సర్కిల్ పరిధిలోని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు సీఐ రోషన్ వ్యవహార శైలిని గమనిస్తే కడప జిల్లాలో ఎక్కడో గాని ఇలాంటి అధికారి పోలీసుశాఖలో లేడనే చెబుతారు. డబ్బుల కోసం ఏ స్థాయికై నా దిగజారే మనస్తత్వం అని కమలాపురం ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఇటీవల ఆయన విధి నిర్వహణలో అనేక భంగపాట్లు ఎదురైనా తనకు ఉన్నతాధికారుల అండ ఉందనే గర్వంతో పోలీసు స్టేషన్కు వచ్చే సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రోషన్ రోత చరిత్ర అనే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కమలాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ఒక చిన్న స్థాయి వీధి గలాటాకు సంబంధించి వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఓ వ్యక్తిని నాలుగు రోజుల కిందట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అధికార పార్టీ అగ్ర నాయకుడి ఆదేశాలతో ఆ వ్యక్తిపై పోలీసు జులుం ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 45 వేల రూపాయలు చెల్లించడంతో ఆ డబ్బు తీసుకొని ఏమాత్రం సంతృప్తి చెందక మిగిలిన డబ్బుల కోసం ఆ వ్యక్తిపై వీధి రౌడీలా ప్రతాపాన్ని చూపాడు. సీఐ రోషన్ కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోవడంతో కమలాపురానికి చెందిన ఒక వైద్యుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి వైద్యం చేయించారు. బాధితుడి కుటుంబీకులు ఈ విషయంపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే కమలాపురం పట్టణంలో ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్ష లీకేజీ వ్యవహారంలో బాధ్యులు కాని వ్యక్తులపై కూడా అధికార పార్టీ అగ్ర నాయకుడు చెప్పాడనే ఏకై క కారణంతో స్వామి భక్తిని చాటుకునేందుకు.. దీనికితోడు వారి దగ్గర డబ్బును బాగా దండుకోవచ్చనే దురుద్దేశంతో సంబంధం లేని వ్యక్తులను సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించి.. కేసు నమోదు చేసి.. వారిని బెదిరించి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసిన విషయం కమలాపురంలో వీధి వీధినా వ్యాపించింది. డబ్బులు ఇవ్వని కొందరు నిందితులను భారీ స్థాయిలో పోలీస్ కోటింగ్ ఇచ్చిన ఘనత కూడా రోషన్కే దక్కింది. అలాగే చిన్నచెప్పలి గ్రామానికి చెందిన తండ్రి కొడుకుల ఆస్తి వ్యవహారంలో రోషన్ వ్యవహరించిన అత్యుత్సాహం సామాన్యుడిని సైతం నివ్వెర పరిచింది. జిల్లా ఉన్నతాధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో రోషన్ కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించింది. ఈయన కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తికి కమలాపురానికి సంబంధించిన ఒక మైనారిటీ వర్గ నాయకుడికి జరిగిన వ్యవహారంలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ఆ మైనార్టీ నాయకుడిని బెదిరించి దాదాపు 15 లక్షలకు పైగా వసూలు చేసుకున్న ఘనాపాటి ఈ సీఐ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి స్వయంగా ఒక డివిజనల్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసి వీడియో దృశ్యాలను చూపించినా ఆ డివిజనల్ అధికారి మిన్నకుండిపోవడం గమనిస్తే ఈ సీఐ ఏ స్థాయిలో అధికారులను తన వైపు తిప్పుకుంటున్నాడో తెలిసిపోతోంది. ఇక ఇటీవల కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈ జీ అశోక్ కుమార్ తమ నియోజకవర్గ నాయకుడికి అత్యంత ఆప్తుడని, అలాగే రేంజ్ పరిధిలో ఉన్న ఓ అధికారి సైతం తమ నాయకుడి మాటే వింటాడని తనను ఎవరూ ఏమీ పీకలేరని బహిరంగంగానే ఈ అధికారి మాట్లాడడం గమనిస్తున్న కమలాపురం ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సీఐ గారికి జీతం ఇచ్చేది నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ అగ్ర నాయకుడా?? లేక పోలీస్ శాఖనా అనే విషయంపై చర్చ కూడా కమలాపురం ప్రాంతంలో జోరుగా జరుగుతోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కమలాపురం పట్టణంలో దాదాపు పదికి పైగాా అధికార పార్టీ అగ్ర నాయకుడి బెల్ట్ షాపులు బహిరంగంగా బార్లను తలదన్నే విధంగా నడుస్తున్నాయంటే వాటి నుంచి ఈయన ఎంత దండుకుంటున్నాడో మరో మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు ఈ సీఐ రోషన్ సహాయంతో నడుస్తున్నప్పటికీ సంబంధిత ఎకై ్సజ్ శాఖ కూడా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికై నా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన జోక్యం చేసుకొని రోషన్ ఆగడాలను అరికట్టకపోతే కమలాపురం పోలీసుల తీరు మరో బీహార్ ప్రాంతాన్ని తలపించే విధంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ అండతో రెచ్చి పోతున్న సీఐ రోషన్ డబ్బుల కోసం ప్రజలను పీక్కు తింటున్న వైనం గతంలో ఉన్నతాధికారులు హెచ్చరించినా మారని తీరు కోగటం సంఘటనపై సీఐ రోషన్ను వివరణ కోరగా అదంతా బోగస్ అని కొట్టి పారేశారు. వారు లాయర్కు డబ్బు ఇచ్చుకున్నారేమో గాని తాను డబ్బు అడగలేద ని వివరించారు. -
శ్రీరాముడి జీవితం ఆదర్శం
– డీఈఓ డాక్టర్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : ప్రతి ఒక్కరూ శ్రీ రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, సన్మార్గంలో నడవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్. షంషుద్దీన్ సూచించారు. కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో పదవ తరగతి ప్రశ్నా పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రామయ్య చిట్స్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పానకం, వడపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులంతా ఈర్ష్య, అసూయ, ద్వేషాలను విడనాడి ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా జీవించాలన్నారు. పానకం, వడపప్పు పంపిణీకి ఆర్థిక సహకారం అందించిన శ్రీ రామయ్య చిట్స్ నిర్వాహకులు కళావతి, రమేష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్ రెడ్డి, కడప ఎంఈఓ గంగిరెడ్డి, డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ బాదుల్లా, ఆపస్ నాయకులు పోగుల వెంకట్రామిరెడ్డి, సుబ్బరాయుడు, దేవిరెడ్డి కొండారెడ్డి, మిట్టా కేశవరెడ్డి, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఎస్ఎల్టీఏ నాయకులు అంకాల్ కొండయ్య, గిరిబాబు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కుమారుడికి వైద్యం అందక...
ఆళ్లగడ్డ/ఎర్రగుంట్ల: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పేదలకు పెను శాపంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.3,500 కోట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పెట్టింది. దీంతో పేదలకు ఎక్కడా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలిసిపోయే దుస్థితి నెలకొంది. తన కుమారుడికి ఫిట్స్ రావడంతో ఉచితంగా వైద్యం అందక ఓ తండ్రి తల్లడిల్లిపోయాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాడు. ఇంకా డబ్బులు అవసరం కావడంతో తన కొడుకును కాపాడుకునేందుకు బాడుగకు ఇసుక తోలితే కిరాయి డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ అతని ఆశలకు పోలీసులు గండికొట్టారు. రూ.5వేలు బాడుగ కోసం ట్రాక్టర్లో ఇసుక తీసుకువెళ్లిన ఆయన్ను పోలీసులు పట్టుకుని రూ.20వేలు లంచం అడగడంతో దిక్కుతోచక విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వైఎస్సార్ జిల్లాలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ఉచిత వైద్యం అందక పేదలు పడుతున్న కష్టాలు... ఇసుక ఉచితమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా పేదలు ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకువెళ్లలేని దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లి గ్రామానికి చెందిన ఎన్.రవీంద్ర ఫైనాన్స్లో ట్రాక్టర్ కొనుక్కుని జీవిస్తున్నాడు. అతని కుమారుడికి ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పెన్నానది నుంచి ట్రాక్టర్లో ఇసుక తీసుకుని సమీపంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వెళ్లి విక్రయిస్తే బాడుగ డబ్బులు రూ.5వేల వరకు వస్తాయని ఆశించాడు. శుక్రవారం పోట్లదుర్తి వద్ద పెన్నా నది నుంచి ఇసుకను ట్రాక్టర్లో తీసుకువెళుతుండగా... చాగలమర్రి టోల్గేట్ వద్ద ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ ఆపి పోలీస్ స్టేషన్కు రావాలని బెదిరించారు. ట్రాక్టర్ వదిలేయాలంటే రూ.20 వేలు ఇవ్వాలని ఆయన వెంట ఉన్న హోంగార్డు ద్వారా చెప్పించారు. ఇసుక ట్రాక్టర్ను ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్కు తరలించారు. రూ.10వేలు ఎస్ఐ చెప్పిన నంబర్కు ఫోన్ పే చేసినా వదల్లేదు. దీంతో రవీంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన ఆవేదనను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఆయన శనివారం విషం డబ్బా తీసుకుని పోట్లదుర్తి గ్రామంలో పెన్నానది వద్దకు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి పెన్నానది ప్రాంతంలో వెదికారు.అప్పటికే విషం తాగి నది వద్ద పడి ఉన్న రవీంద్రను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వందలాది లారీల్లో ఇసు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకోని పోలీసులు ఒక పేదవాడు ట్రాక్టర్ ఇసుక తీసుకువెళితే వేధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్
కడప సెవెన్రోడ్స్: సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయనకు దేశం యావత్తు నీరాజనాలు అర్పిస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనితా దీప్తి,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, వివక్షతను నిర్మూలించడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం ‘సమతా దివస్‘గా పరిగణించిందన్నారు. విలువలతో కూడిన ఆయన జీవితం మన అందరికీ ఆదర్శనీయమని, ఆయన అడుగు జాడల్లో నేటి యువత నడవాలని కోరారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్, అధికారులు,వివిధ సంఘాల నేతలతో కలసి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జనార్దన్, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఎస్సీ,ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు జేవీ రమణ, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, లోక్ జనశక్తి పార్టీ ప్రతాపరెడ్డి, మహాజన పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్, దళిత మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె రామాంజులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు బాబూ జగజ్జీవన్ రామ్ కడప అర్బన్: దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కొనియాడారు. శనివారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి కె.శ్రీనివాస రావు, ఆర్ఐలు ఆనంద్, వీరేష్, టైటాస్, శివరాముడు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
సీతారాముల అనుగ్రహం అందరికీ ఉండాలి
– ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంటిమిట్టలో జరగబోయే సీతారామ కళ్యాణం వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా శ్రీరామనవమి పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులుగా డాక్టర్ లలిత కడప ఎడ్యుకేషన్ : జువైనల్ జస్టిస్ బోర్డ్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా వైవీయూ సైకాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె.లలిత ఎంపికయ్యారు. కమిటీ చైర్ పర్సన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు, ఇతర సభ్యులు ఉన్నారు. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుండి ప్రొఫెసర్ వి.లలిత కుమారి (సోషియల్ వర్కర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి), బి పద్మావతి(మెంబర్ ,కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్)ను సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. పొడదుప్పిపై మానవత్వం కలసపాడు : మండలంలోని సింగరాయపల్లె గ్రామంలో పొడదుప్పిని కుక్కల దాడి నుంచి కాపాడి గ్రామస్థులు మానవత్వం చాటారు. అడవి నుండి పొడ దుప్పి గ్రామంలోకి వచ్చింది. కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా గమనించిన సింగరాయపల్లె గ్రామస్తులు అడ్డుకుని పొడ దుప్పిని ఒక ఇంటిలో ఉంచారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ అధికారి రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె సెక్షన్ అధికారి రమణయ్య, మామిళ్లపల్లె బీట్ అధికారి భారతి, డాగ్ స్క్వాడ్ అధికారి హసన్, గురయ్య, ప్రొడక్షన్ ఫోర్స్ సిబ్బంది చేరుకుని పొడదుప్పిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థుల సాయంతో అటవీ వాహనంలో తీసుకెళ్ళి తడుకుచెరువు సమీపాన అడవిలో వదిలారు. అంతర్ జిల్లా దొంగల అరెస్టు మదనపల్లె : షట్టర్లు తొలగించి దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అంతర్ జిల్లా దొంగల అరెస్టు వివరాలను శనివారం మీడియాకు ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన గుజిరీ వ్యాపారి మాదిగజార్జి(26), అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం భైరవగుట్టకు చెందిన బండపల్లిరెడ్డిశేఖర్(23) ముఠాగా ఏర్పడ్డారు. అన్నమయ్య జిల్లా కురబలకోట, మదనపల్లె, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో దుకాణాల షట్టర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు క్రైమ్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టామన్నారు. సాంకేతికతను ఉపయోగించి నిందితులకు సంబంధించిన పక్కా సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ఉదయం కురబలకోట మండలం కడప–మదనపల్లె రోడ్డులోని కడప క్రాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి కురబలకోట, గుర్రంకొండ, మదనపల్లె, చిత్తూరు, ఆదోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించిన వస్తువులు...సోనీ టీవీ, ల్యాప్టాప్, 50 కిలోల కాపర్వైర్, మూడు ట్యాబ్లు, ఒక టేబుల్ ఫ్యాన్, సిగరెట్లు, ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ కనపరిచిన సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్, స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ డి.కొండయ్యనాయుడు అభినందించారు. -
కల్యాణోత్సవంలో ప్రతి భక్తుడికి తలంబ్రాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నా మని టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీలలో ఉండే భక్తులతోపాటు కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పా ట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాల పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ఈడీ స్క్రీన్లు, ఆలయం, కల్యాణ వేదిక తదితర ప్రాంతాలలో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు మూడు లక్షల తాగునీరు బాటిళ్లు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీమ్ లు, ఎనిమిది అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్డీపీపీ 18, దాస సాహిత్య ప్రాజెక్టు 4, అన్నమాచార్య ప్రాజెక్టు 8 ఆధ్వర్యంలో మొత్తం 30 కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలలో 12 టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ప్లవర్స్తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. ఆర్డీఓ జాన్ ఎర్విన్ పాల్గొన్నారు. -
వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చామంటూ టీడీపీ దుష్ప్రచారం
కడప సెవెన్రోడ్స్: వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చిందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారానికి దిగడం వారి నీచ సంస్కృతిని బట్టబయలు చేస్తోందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ.అంజద్బాషా ధ్వజమెత్తారు. కడపలో మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ రాజ్యసభలో మద్దలిచ్చిందంటూ టీడీపీ నేతలు నక్కాఆనంద్బాబు, నాగుల్ మీరాలు చెప్పడంలో ఎలాంటి నిజం లేదన్నారు. తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడే ఉంటారని, లోక్సభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్రెడ్డి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ వైవీ.సుబ్బారెడ్డి బిల్లును వ్యతిరేకిస్తూ సుమారు పది నిమిషాలు మాట్లాడారన్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వైవీ.సుబ్బారెడ్డి జారీ చేసిన విప్ను ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారన్నారు. విప్ జారీలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా వచ్చిన 95 ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్వే ఏడు ఉన్నాయన్నారు. ఈ విషయం నేషనల్ మీడియా తెలియజేసిందని, పవన్ కల్యాణ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లింలపై ఈగ వాలనివ్వబోమని, వక్ఫ్ ఆస్తులకు నష్టం కలగదని, ముస్లింలకు అండగా ఉంటామని మాట్లాడి.. ఇప్పుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ● ఉభయ సభల్లో వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు ఓటేశారు ● లోకేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా బురదజల్లే యత్నం ● బిల్లులకు మద్దలిచ్చిన టీడీపీ మైనార్టీ ద్రోహిగా నిలిచిపోయింది ● రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా -
‘మౌలానా’ అరెస్టు టీడీపీ కుట్ర!
కడప రూరల్: మౌలానా జాకీర్ హుస్సేన్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేయించడంపై అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు వెనక కూటమి నేతల కుట్ర ఉందని ఆరోపించారు. శనివారం కడప వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ఖాన్, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జేఏసీ కన్వీనర్ అహ్మద్బాబు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం దారుణమన్నారు. మతాల మధ్య విభజన పెంచి దేశ లౌకిక స్వభావాన్ని, మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మత గురువు మౌలానా జాకీర్ హుస్సేన్ గళం విప్పితే ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసిన విధంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ పరిణామాల వెనుక టీడీపీ, బీజేపీల హస్తం ఉందని ఆరోపించారు. అక్రమ అరెస్ట్లతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మౌలానా జాకీర్ హుస్సేన్పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సవరించిన వక్ఫ్ చట్టంలో గణనీయమైన మార్పులు తేవడం తగదన్నారు. ముస్లింలు తమ మతాన్ని ఆచరించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2024ను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. తాహిర్, సయ్యద్ సలావుద్దీన్, మక్బూల్బాషా, దస్తగిరి, న్యాయవాది అహ్మద్అలీ, ఖాన్అమీద్ తదితరులు పాల్గొన్నారు. ‘వక్ఫ్ బిల్లు’ను వ్యతిరేకిస్తే అరెస్టు చేస్తారా! వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి సమావేశంలో అఖిలపక్ష,ప్రజా సంఘాల నేతల ధ్వజం -
మోడల్ పరీక్షలోనూ మహిళలదే ఆధిపత్యం
కడప అర్బన్ : కడప బార్ అసోసియేషన్లో శనివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్షలో ఎనిమిది మంది మహిళలు ఆధిపత్యం సాధించడమేగాక అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. కడప భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సి.సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ ముందుగానే ప్రకటించడంతో 40 మంది న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మోడల్ పరీక్ష శనివారం ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు జరిగింది. కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రధాన కార్యదర్శి చంద్రవదన, ఉపాధ్యక్షులు ఉమాదేవి ప్రశ్నపత్రం విడుదల చేశారు. వంద ప్రశ్నలతో కూడిన పరీక్ష పూర్తవగానే కీ విడుదల చేశారు. షేక్ ముస్తఫాకు 86, సి.రాజ్యలక్ష్మికి 84, ఎ.రాహుల్కు 80 మార్కులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటశివ, సురేష్, చిన్నయ్య పాల్గొన్నారు. -
అరటితోటలో 300 మొక్కలు దగ్ధం
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్య కాలువ గ్రామానికి చెందిన ఎస్.శంకర్రెడ్డి అరటి తోటలో 300 మొక్కలు దగ్ధమైన సంఘటన రెండు రోజుల కిందట జరిగింది. రైతు వివరాల మేరకు... తోట సమీపంలోని బీడు భూమిలో ఎండిన గడ్డికి అగ్గిపెట్టడంతో నిప్పు రవ్వలు అరటితోటలో పడ్డాయి. దీంతో సుమారు 300 మొక్కలు కాలిపోయాయి. మొక్కలు గేల వేసే సమయంలో ఈ ఘటన జరగడంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణంపై అవగాహన ఉండాలి కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోర్డినేటర్(ఎన్జీసీ) టీవీ.రమణయ్య సూచించారు. ఏపీ ఎన్జీసీ, పర్యావరణ విద్య సౌజన్యంతో నేచర్ క్యాంపు శనివారం నిర్వహించారు. పొలతలలో జిల్లా నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వృక్ష, జంతు సంబంధమైన విషయాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి పర్యావరణంపై క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు కడప పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో డీఈఓ షంషుద్దీన్, కడప ఉప విద్యా శాఖాధికారి రాజగోపాల్రెడ్డి సర్టిఫికెట్, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్స్ విజయమోహన్రెడ్డి, దానం, రవీంద్ర, సూర్యచంద్ర రెడ్డి, అహల్యాభాయి తదితరులు పాల్గొన్నారు ఈత సరదా తీసింది ప్రాణం పులివెందుల రూరల్ : మండు టెండల్లో ఉపశమనం కోసం సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు, ఓ విద్యార్థికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన వైనం శనివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పులివెందుల మండలం అచ్చివెళ్లి పంచాయతీ పరిధిలోని కానేపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడి కుమారుడు శివ(26) పులివెందుల పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కుంట వద్దకు శనివారం సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ సమయంలో అతడికి ఫిట్స్ రావడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పెద్ద దిక్కుగా మారిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ముమ్మడిగుంటపల్లెలో మరొకరు.. సిద్దవటం : మండలంలోని ముమ్మడిగుంటపల్లె వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకు వెళ్లి ఫిట్స్ రావడంతో మరో విద్యార్థి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ఒంటిమిట్ట మండలం చొన్నకొత్తపల్లె గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు(16) శనివారం మధ్యాహ్నం గ్రామస్తులు, స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లె వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈత కోసం వెళ్లారు. బావిలో ఈత కొట్టి బయటకు రాగానే శ్రీనివాసులుకు ఫిట్స్ రావడంతో అక్కడికకక్కడే మృతిచెందారు. వడదెబ్బతో దివ్యాంగుడు మృతి రాజంపేట రూరల్ : ఎండ వేడిమి అధికం కావడంతో వడదెబ్బ సోకి దివ్యాంగుడు కుల్లూరు నరసింహులు(38) శనివారం మృత్యువాత పడ్డారు. పట్టణ శివారులోని డీబీఎన్పల్లి అరుంధతి వాడకు చెందిన కుల్లూరు చిన్న నరసింహులు, రంగమ్మలకు ఆరుగురు సంతానం. తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద కుమారుడు శ్రీనివాసులు బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతనికి తోడుగా దివ్యాంగులైన నరసింహులు, చెంగలరాయుడు బేల్దారి పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నరసింహులుకు శుక్రవారం నుంచి విరేచనాలు, వాంతులయ్యాయి. శనివారం తీవ్రం కావడంతో తన గృహంలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే డీ హైడ్రేషన్ కారణంగా నరసింహులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆయన బంధువు మహేశ్వరి తెలిపారు. దాతలు ఆదుకోవాలని కోరారు. రెండు జేసీబీలు, ట్రాక్టర్ సీజ్ కలికిరి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు జేసీబీలు, ఒక ట్రాక్టరును సీజ్ చేసినట్లు సీఐ రెడ్డిశేఖర్రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని మేడికుర్తి పరిధిలోని బాహుదానదిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జేసీబీలతో ట్రాక్టర్లకు ఇసుక వేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. నదిలో ఉన్న రెండు జేసీబీలను, ఒక ట్రాక్టరును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దారుకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఏఎల్సీసీ మూవీ టీజర్ రిలీజ్ కురబలకోట : ఏఎల్సీసీ(ఓ యూనివర్సల్ బ్యాచిలర్) మూవీ టీజర్ను అంగళ్లు వద్ద విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఫంక్షన్లో విశ్వం విద్యా సంస్థల అధినేత ఎం.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్పై నిర్మించిన ఏఎల్సీసీ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర హీరో జెపి.నవీన్, దర్శక, నిర్మాత కోలా లెలీదర్రావుకు గుర్తింపు రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో నవీన్, నటులు శ్రీనివాసరెడ్డి, ధనుష్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రమణారెడ్డి, ఎఎల్సీసీ చిత్ర బృందం పాల్గొన్నారు. -
బాబూ జగ్జీవన్రాం ఆదర్శప్రాయుడు
కడప కార్పొరేషన్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం ఆదర్శప్రాయుడు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. జగ్జీవన్రాం జయంతి సందర్భంగా కడప మహావీర్ సర్కిల్లో జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచు పాటి బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్రాం అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కులాలకు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆయనఅనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయక్, పార్టీ నాయకులు బి. రెడ్డెన్న, పులి సునీల్, సీహెచ్ వినోద్, కె.బాబు, త్యాగరాజు, ఎం.సుబ్బరాయుడు, బండి ప్రసాద్, పి. జయచంద్రారెడ్డి, యానాదయ్య, బీహెచ్ ఇలియాస్,దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ, షఫీ, బసవరాజు, మునిశేఖర్రెడ్డి, ఏ1 నాగరాజు, రత్న కుమారి, బండి మరియలు, సుశీలమ్మ, తులశమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టి పంపిస్తున్నారు
కడప అర్బన్ : అధికార పార్టీ నాయకులు అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి డబ్బులిచ్చి ఇళ్లపైకి పంపిస్తున్నారని, ఇది విష సంస్కృతికి నాంది పలుకుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ.అంజద్బాషా, నగర మేయర్ సురేష్బాబు, ఇతర వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కడప ఎస్పీ బంగ్లాలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ను వారుకలిసి వినతిపత్రం అందజేశారు. అంజద్బాష మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్త ఇబ్రహీంమియా చెన్నూరు బస్టాండు వద్ద వ్యాపారం చేసుకుంటుండగా, కొందరు మహిళలు వారి అనుచరులతో వచ్చి విచక్షణారహితంగా కొట్టి నీ అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారన్నారు. ఇబ్రహీంమియా తనకు జరిగిన అన్యాయంపై వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని, అక్కడి పోలీసులు మియా ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదన్నారు. మియా తనకు ఫోన్ ద్వారా తెలుపగా వన్టౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి సీఐ రామకృష్ణతో మాట్లాడానన్నారు. ఇబ్రహీం మియాకు తగిలిన గాయాలు చూపించి కేసు కట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు అశోక లాడ్జి వద్ద తన ఇంటి నివాస స్థలానికి కొంతమంది మహిళలు వారి అనుచరులు, కొంతమంది మీడియాతో వచ్చి తన చిత్రపటాన్ని ఫ్లెక్సీలను ముద్రించి ఆందోళన చేశారన్నారు. సాధారణంగా తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు తాను ముందుంటానని, అందులో భాగంగానే శుక్రవారం స్టేషన్కు వెళ్లి వైఎస్సార్సీపీ కార్యకర్త ఇబ్రహీం మియాను పరామర్శించడం జరిగిందన్నారు. గతంలో మేయర్ సురేష్బాబు ఇంటి ఎదుట చెత్త వేయించి నినదిస్తూ కూర్చొన్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే కడపలో ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, సురేష్బాబు జెడ్పీ చైర్మన్గా, రెండు సార్లు నగర మేయర్గా, నాలుగుసార్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేశామని, తమకే భద్రత లేకపోతే కార్యకర్తలు, సాధారణ ప్రజలకు ఏం భద్రత ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ సంఘటనలపై విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులిసునీల్కుమార్, ఎస్ఎండీ.షఫీ, దాసరి శివప్రసాద్, దేవిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీకి వైఎస్సార్సీపీ నేతల వినతి -
సకల గుణాభిరామా.. శ్రీరామా
సకల సద్గుణాలకు మారురూపుగా, మానవాళికి ఆదర్శంగా అపురూపమైన బంధాలకు ఆలవాలంగా నిలిచిన శ్రీరాముడు జన్మించిన శుభదినం. ఆయన సీతారాముడయ్యే శుభలగ్నం వెరసి ఆదివారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా అంతటా రామాలయాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. కడప కల్చరల్ : సీతా, రాముల కల్యాణ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఆయా ఆలయాల్లో నిర్వాహకులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అధికారిక ఆలయం కోదండ రామాలయం జిల్లా ఒంటిమిట్టలో ఉండడంతో జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీరామ నవమి పండగను జిల్లాలో ఇటీవల భారీగా నిర్మించిన రామాలయాలలో ఘనంగా నిర్వహిస్తారు. శనివారం సాయంత్రానికే ఆలయాలు, వీధుల్లో చలువ పందిళ్లు, షామియానాలు వెలిశాయి. ఇక పండగ రోజున ప్రజలు ఒకే చోట చేరి స్వామి, అమ్మవారి పెళ్లి తిలకించి విందు భోజనాలు చేస్తారు. ఔత్సాహిక భక్తులు, నిర్వాహకులు అందించే పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు శ్రీరామ నవమి ప్రత్యేకతను చూపుతాయి. ఓ శుభ కార్యానికి బంధుమిత్రులు, ఇరుగుపొరుగులతో కలిసి రెండు గంటలపాటు ఒకే చోట కలిసి ఉండే అపురూపమైన అవకాశం శ్రీరామ నవమి ఇస్తోంది. జిల్లాలో చిన్న, పెద్ద రామాలయాలు దాదాపు 4 వేలకు పైగా ఉన్నాయి. వాటితోపాటు పెద్ద వైష్ణవాలయాలు కూడా శ్రీరామనవమి పండుగకు సిద్ధమయ్యాయి. ఉదయం పది గంటల తర్వాత ఆయా ఆలయాల్లో పురోహితుల నిర్ణయాన్ని బట్టి సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. భక్త బృందాలు ఆలయాలకు పండగ శోభ కల్పించడంలోభాగంగా మామిడి తోరణాలు, అరటి బోదలతో అలంకరించడం, కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ప్రసాదంగా పంచి పెట్టేందుకు పానకం, వడపప్పు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. పలు పెద్ద ఆలయాలలో కల్యాణ అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులందరికీ విందు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని ఆలయాల్లో ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతిరోజు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం లోపుగా కల్యాణం, సాయంత్రం 6 గంటల నుంచి నగరోత్సవాలు నిర్వహించేందుకు రథాలు, పల్లకీలు సిద్ధం చేసుకుంటున్నారు. నేడు జిల్లా అంతటా కల్యాణానికి ఏర్పాట్లు -
వక్ఫ్ బిల్లును ఆమోదించింది.. కూటమి ప్రభుత్వమే
కమలాపురం: లోక్ సభ, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభు త్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆమోదించిందని, అయితే ఆ బిల్లును రెండు సభల్లోనూ వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని పత్రికల్లో, పచ్చ మీడియాలో వైఎస్సార్సీపీ లోక్ సభలో వ్యతిరేకించి, రాజ్యసభలో మద్దతిచ్చిందని రావడం అసత్యం అన్నారు. వైఎస్సార్సీపీ రెండు సభల్లోనూ పూర్తిగా వ్యతిరేకించిందని ఆయన నొక్కి వక్కాణించారు. మహానేత వైఎస్సార్ ముస్లింల పక్షపాతి అని, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉపాధిలో స్థిరపడేలా చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. అలాగే ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ముస్లింల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు ప్రతి మసీదులో ఇమాం, మౌజన్లకు జీతాలిచ్చే పద్ధతి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు రెండు కళ్ల పద్ధతి పాటిస్తున్నారని, ఏపీలో ముస్లింల ఓట్లు దండుకుని, ఢిల్లీలో ముస్లింలు వ్యతిరేకిస్తున్న బిల్లుకు మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్లను వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకుడు ఆయనొక్కడే అన్నారు. వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ ఆస్తులను తమ పార్టీ నాయకులకు, బినామీలకు కట్టబెట్టేందుకే చంద్రబాబు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నారన్నారు. బిల్లు ఇలా పాస్ అయిందో లేదో అప్పుడే వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేయడానికి ఇష్టమున్న వారు ముందుకు రావాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు రావడం ఇందుకు నిదర్శనమని, మొబైల్ ఫోన్లో చూపిస్తూ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు దోచేయడానికి టీడీపీ నాయకులు కుట్ర పన్నారని, బిల్లుకు ప్రజల ఆమోదం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పటికీ ముస్లింలకు బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్రెడ్డి, గంగాధర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి,మోహన్ రెడ్డి, కొండారెడ్డి, ఆర్వీఎన్ఆర్, లక్ష్మీ నారాయణరెడ్డి, జగన్ మోహన్రెడ్డి, గఫార్, ఖాజా హుసేన్, జిలాని, ఆచారి, జనార్థన్ రెడ్డి, ఆంజనేయరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జెట్టి నగేష్, శ్రీరాం రమణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ బిల్లుకు ప్రజల ఆమోదం లేదు వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేదు కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
శాస్త్రోక్తంగా అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తొలుత ఉత్సవ నిర్వాహకుడు రాజేష్భట్టర్ను సంప్రదాయబద్ధంగా ఆలయంలోకి తీసుకువచ్చారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కోలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. రాత్రి 6 నుంచి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ రంగ మండపంలో ఉత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు తొడిగి, తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకుడు రాజేష్భట్టర్ ఉత్సవ మూర్తులకు అంకురార్పణ పూజలు నిర్వహించి, ఆలయంలోని పవిత్ర పుట్టమన్నును యాగశాలలో ప్రతిష్టించారు. నేడు ధ్వజారోహణం ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:15 గంటల మద్య వృషభలగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుంచి 9 వరకు శేషవాహన సేవ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్బాబు, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ అర్చకులు, పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త పెన్షన్ బిల్లు ఉపసంహరించుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎస్ఎండీ.ఇలియాస్బాషా అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్–14’ను ఉల్లంఘించడం సరికాదన్నారు. సిపిఎస్/జిపిఎస్ స్థానంలో ఆమోద యోగ్యమైన పెన్షన్ విధానం తెస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57 మేరకు పాత పెన్షన్ వర్తింప చేయాలన్నారు. ఏఐఎస్టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తినరసింహారెడ్డి మాట్లాడుతూ 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన 11వ పీఆర్సీ, డీఎ, సరెండర్ లీవ్, సీపీఎస్ బకాయిలు కలిపి రూ.23వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న మూడు విడతల డీఏ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె.సురేష్బాబు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీచేయాలన్నారు. రాష్ట్ర నాయకులు పిల్లిరమణారెడ్డి, కంబం బాలగంగిరెడ్డి, రషీద్ఖాన్ మాట్లాడుతూ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పది శాతం, 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ అమలుచేయాలని కోరారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, వీణా విజయరామరాజు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ఎన్.సంగమేశ్వర్రెడ్డి, శివశంకర్, గురుకుమార్, దాదా పీర్, గురు ప్రసాద్, రవిశంకర్రెడ్డి, కొత్తపల్లి శ్రీను, వాకా చంద్రశేఖర్, చెన్నకేశవరెడ్డి మహబూబ్ బాషా, రామ్మోహన్, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అల.. ఏకశిలానగరిలో..
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది. టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడు కూడా శనివారం నుంచి ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. తొలిరోజున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈనెల 11న రాములోరి కల్యాణం కన్నుల పండువగా చేయనున్నారు. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసందర్భంగాఒంటిమిట్ట రామయ్య క్షేత్రం ప్రత్యేక కళను సంతరించుకుంది. ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్టలోని కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టనున్నారు. రోజుకొక అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రధాన విశేషం.. సీతారామలక్ష్మణులు కొలువుదీరిన ఏ ఆలయంలో అయినా హనుమ కూడా దర్శనమిస్తారు. అయితే ఒంటిమిట్ట గుడిలో సీతారామలక్ష్మణులు మాత్రమే ఏకశిలపై దర్శనమిస్తారు. ఆంజనేయుడి విగ్రహం లేదు. అయితే ఆలయ తూర్పు గాలిగోపురానికి తూర్పుగా రథశాల పక్కనే సంజీవరాయుడుగా వెలసిన ఆంజనేయస్వామి గుడి నిర్మించారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం.. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని పురాణ కథనం. అప్పుడు సీతమ్మకు దప్పిక అయింది..రాముడు బాణం సంధించి భూమిలోకి వదిలాడు. నీరుపైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తాను ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలనే నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నామనే కథ పురాణాల ద్వారా తెలుస్తోంది. ధర్మ సంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి.. రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార వస్త్రాలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయులు తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెలను తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకారకుడ్యాలు సమున్నతమైనగోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్పవిన్యాసాలు కనిపిస్తాయి. ఏకశిలానగరానికి ఎలా చేరుకోవాలంటే.. చెన్నై–ముంబాయి రైలుమార్గంలోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో దిగి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)కు చేరుకోవచ్చు. కడప నుంచి రేణిగుంట తిరుపతికి వెళ్లే బస్సు మార్గంలో , కడప నుంచి 25కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట వస్తుంది. ఆలయ చరిత్ర.. విజయ నగర స్రామాజ్యంలో క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఆయన కొంతపరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ అడవుల్లో ఇద్దరు బోయలు ఉండేవారు. వారే వంటడు, మిట్టడు. వీరు రాజుగారికి సేవలందించారు. ఈ సమయంలో సమీపంలో గుట్టమీద చిన్నపాటి గుడి ఉంది. జాంబవంతుడు నిలిపిన శిలలో సీతారామలక్ష్మణులని భావించి దండం పెట్టుకొంటున్నారని, అక్కడ గుడి కట్టి పుణ్యం కట్టుకోమన్నారు. సీతమ్మను వెతుకుతూ ఒకనాడు జాంబవంతుడు ఈ గుట్టమీద విశ్రమించాడని, ఆరాత్రి అక్కడే నిద్రించాడని ఉదయం తిరిగి వెళ్తూ ఆ శిలలో సీతారామలక్ష్మణులను భావించుకొని నమస్కరించుకొని వెళ్లాడట. వంటడు..మిట్టడు చెప్పిన మేరకు కంపరాయులు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించారు. ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. కాగా.. ఒంటడు.. మిట్టడు.. ఆలయ నిర్మాణంలో భాగం అయ్యారు గనుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందనే పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఏకశిలా నగరంగా.. ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మితమై ఉన్నాయి. ఇది అరుదైన సంగతి. జాంబవంతుడు ముగ్గుర్ని ఒకే శిలలో భావించుకొన్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలవైన ఏకశిలావిగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన. రాత్రిపూటే కల్యాణం.. ఒంటిమిట్ట స్వామివారి కల్యాణం రాత్రిపూట నిర్వహిస్తారు. చతుర్ధశినాటి రాత్రి వివాహమహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడని పురాణకథ చెపుతోంది. కాగా రాత్రి కల్యాణం సంప్రదాయం ఇప్పటిదికాదు. అది ఒంటిమిట్ట ఆలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. అన్ని రామాలయాలలో నవమిరోజున కల్యాణం నిర్వహిస్తారు. అది పగటిపూట. ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయంలోనే రాత్రి పూట రాములోరి కల్యాణం జరుగుతుంది. ఈ నెల11న రాత్రి 8–10 గంటలలోపు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. రామయ్య సేవలో కవులుఒంటిమిట్ట కోదండరామాలయంలో వెలసిన రఘురాముడిని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకట కవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు తమతమ స్థాయిలో కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలుతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.ఆలయ నిర్మాణం ఇలా..విజయ నగర సామా్రజ్య చక్రవర్తి బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిలో ఏకశిలా విగ్రహం నిలిపిన నాటికి గర్భాలయం, అంతరాళం, చిన్నగోపురం ఉండేవి. మొదటి దశ నిర్మాణమిది. మూడవ దశలో మహా మంటపం (రంగ మంటపం), మహా ప్రాకారం, తూర్పు, ఉత్తర , దక్షిణ గాలిగోపురాలు, మహా ప్రాకారం లోపల నైరుతి దిక్కున కళ్యాణ మంటపం, ఆగ్నేయ దిశలో పాకశాల, ప్రాకారంలోపల ఉత్తరం వైపు తూర్పున, పడమర ఎదుర్కోలు మంటపాలు, రామలింగదేవుని గుడి (1966)లో లింగాన్ని నిలిపారు. సంజీవరాయస్వామి, రథం, రథశాలను ఏర్పాటుచేశారు. అనంతరం అనంతరాజు గుడిని విస్తరించాడు. మహామంటపం, మహాప్రాకారం, గాలిగోపురాల నిర్మాణాలు చేపట్టారు. తెలుగురాష్ట్రాలలో ఒంటిమిట్ట గాలిగోపురాల తరహాలో మరెక్కడా కనిపించవు. ఈ ఆల యాన్ని దర్శించిన టావెర్నియర్ అనే యాత్రికుడు ఎత్తయిన గోపురాలు చూసి విస్మయం చెందాడు. రామయ్యకు బ్రహ్మోత్సవ శోభ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలతో ఏకశిలానగం శోభాయమానంగా వెలుగొందనుంది. ఇప్పటికే కళ్యాణవేదిక ముస్తాబు, భక్తుల కోసం గ్యాలరీలు చకచకా ఏర్పాటుచేశారు. 60 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీవీఐపీ, వీఐపీ, సాధారణ భక్తులును దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దాశరథి కల్యాణానికి వచ్చే భక్తులకు తోపులాట వాతావరణం లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రేపటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూరికావస్తున్నాయి. దాశరథి కోవెలలో నవమి ఏర్పాట్లు... ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోజున ఆలయంలో పోతన జయంతి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనున్నది. కవిసమ్మేళనం నిర్వహిస్తారు. నవమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున రానున్నారు. -
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడిన వారు.. వీరంతా నిరుపేదలు. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళ్తాయన్న దివ్యాంగులు వీరు. అయితే వీరి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. పునః
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు ● కుటుంబ సభ్యుల అపసోపాలు ● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన ● అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు ● రిమ్స్లో కనీస సౌకర్యాలు కరువుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్చైర్లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్చైర్, స్ట్రెక్చర్ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
చదువుకున్నారు.. చోరీలు ఎంచుకున్నారు
బద్వేలు అర్బన్ : ఒకరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. మరొకరు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఇంకొకరేమో బీటెక్ చివరి దశలో మానేశారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు ఎంచుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు.. దురలవాట్లకు బానిసలుగా మారి పక్కదారి పట్టారు. చేసిన అప్పులు తీర్చేందుకు, జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు ఇద్దరు పోలీసులకు చిక్కి కటకటాల పాలు కాగా, మరొకరేమో పరారీలో ఉన్నాడు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ నుంచి నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసేందుకు యత్నించగా రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎం.నాగభూషణ్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్లేవుడ్ బోర్డులను ఎగుమతి చేస్తుంటారు. ఇందుకోసం వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వారి ద్వారా వాహనాలను సమకూర్చుకుంటారు. ఈ క్రమంలో కలకత్తాకు చెందిన సరస్వతి ప్లేబోర్డ్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సెంచురీ పానెల్స్ పరిశ్రమకు రూ.5 లక్షల విలువ చేసే 885 ప్లేవుడ్ బోర్డుల ఆర్డర్ వచ్చింది. ఇందుకు సెంచురీ పరిశ్రమ యాజమాన్యం వాహనం కోసం తమ వెబ్సైట్లో పొందుపరచగా... విజయవాడకు చెందిన ఫైన్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాహనం సమకూర్చే హక్కును దక్కించుకుంది. అయితే అప్పటికే సంబంధిత ట్రాన్స్పోర్ట్ కంపెనీతో సంబంధాలున్న నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామం పడమటివీధికి చెందిన ఆకులమహేష్ ముందస్తు ప్రణాళికలో భాగంగా కంపెనీ తరఫున తన స్నేహితుడైన పూంగవనంశివకుమార్ ద్వారా నకిలీ ఆర్సీ, ఎఫ్సీ, పర్మిట్ సృష్టించి మరొక స్నేహితుడైన మనీష్ ద్వారా వేరొక వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి గత నెల 20వ తేదీన సరుకును తీసుకెళ్లాడు. అయితే సరుకును కలకత్తాకు తీసుకెళ్లకుండా నెల్లూరులోని ఓ గదిలో భద్రపరిచి.. కొద్ది రోజుల తర్వాత అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. కంపెనీ నుంచి సరుకు బయటికి వెళ్లినప్పటి నుంచి అన్లోడ్ చేసే వరకు వాహనాన్ని జీపీఎస్ ట్రాకింగ్ చేస్తారు. అయితే ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ట్రాకింగ్ లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఈ నెల 2వ తేదీన రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ ఎం.నాగభూషణ్, బి.కోడూరు ఎస్ఐ కె.సి.రాజులు సిబ్బందితో కలిసి గాలిస్తుండగా శుక్రవారం పి.పి.కుంట సమీపంలో ఆకులమహేష్, పూంగవనం శివకుమార్లను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఇదే కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న మనీష్ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా నిందితులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు స్టేషన్ పరిధిలో కూడా గత నెల 25న ఇదే తరహాలో పామాయిల్ డబ్బాలను లోడ్ చేసుకుని చేర్చవలసిన పాయింట్కు చేర్చకుండా కాజేసే యత్నం చేసినట్లు విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుళ్ళు శ్రీను, పీరయ్య తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసిన యువకులు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్టు, పరారీలో ఒకరు -
నేడు జగ్జీవన్రామ్ జయంతి
కడప సెవెన్రోడ్స్: బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమావేశం కడప సెవెన్రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. డీఈఓ వెబ్సైట్లో జాబితా కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్సైట్లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిచనున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆశీనులు చేస్తారు. అనంతరం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆగమ శాస్త్రం ప్రకారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆలయంలోని పుట్టమన్నును యాగశాలకు తీసుకెళ్లే కార్యక్రంమతో అంకుకార్పణ ముగుస్తుంది. రేపు ధ్వజారోహణం ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 వరకు శేష వాహనసేవ జరగనున్నాయి. ● ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోపురాలు, కల్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో విద్యుత్దీపాలు అమర్చారు. -
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగ్జీవన్రామ్ జయంతి
కడప సెవెన్రోడ్స్: బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమావేశం కడప సెవెన్రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. డీఈఓ వెబ్సైట్లో జాబితా కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్సైట్లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్ : ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే.. అటువంటి సంఘటన మరొకటి పునరావృత్తమైంది. పట్టణంలోని సుందరయ్యకాలనీ సమీపంలో గల ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. అదే పాఠశాలలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారితోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. బద్వేలు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని త్యాగరాజకాలనీకి చెందిన ఓ విద్యార్థిని సుందరయ్యకాలనీ సమీపంలోని ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో గోపవరం మండలం అడుసువారిపల్లె గ్రామానికి చెందిన పెంచలయ్య కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొంత కాలంగా పెంచలయ్య బాధిత విద్యార్థినితోపాటు మరికొంత మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో త్యాగరాజకాలనీకి చెందిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడి ఆగడాలను తట్టుకోలేక శుక్రవారం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులతోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్కు తరలించారు. అనంతరం విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు పెంచలయ్యపై అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, బంధువులు స్టేషన్కు తరలించిన పోలీసులు బద్వేలులోని ఏవీఆర్ స్కూల్లో ఘటన -
రైతులపై పాలకులే కాదు ప్రకృతీ పగబట్టింది. చేతికొచ్చిన పంటను.. రైతన్న నోటికాడ కూడును అమాంతం లాగేసింది. అకాల వర్షాలు.. ఈదురుగాలుల రూపంలో పచ్చని పంటను నేలమట్టం చేసింది. పచ్చని అరటిపంటే కాదు.. రైతన్నల ఆశల్నీ నేలరాల్చింది. కోటి ఆశలతో సాగు చేసిన రైతన్నకు కడగండ్ల
లింగాల: లింగాల మండలంలో గురువారం బలమైన ఈదురు గాలులకు అరటి పంట నేలకూలింది. మండలంలోని ఇప్పట్ల, అక్కులగారిపల్లె, తేర్నాంపల్లె, పెద్దకుడాల, లింగాల, లోపట్నూతల గ్రామాల్లోని అరటి చెట్లు సుమారు 30ఎకరాలలో నేలకూలాయని రైతులు వాపోతున్నారు. తన అరటితోటలో సుమారు 3వేల అరటి చెట్లు నేలకూలాయని లోపట్నూతల గ్రామానికి చెందిన బాల పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కోతకు వచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తున్నాయని.. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖాధికారి రాఘవేంద్రారెడ్డి స్పందిస్తూ ఆర్ఎస్కే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. సుమారు 30ఎకరాలలో అరటి పంట కూలిపోయిందని రూ.60లక్షల మేర పంట నష్టం సంభవించినట్లు ఆయన వెల్లడించారు. అకాలవర్షం... రైతులకు నష్టం కొండాపురం: మండల పరిధిలోని తిరుమలాయపల్లె,బుక్కపట్నం వెంకయ్య కాలువ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో అనుకోకుండా అకాలవర్షం కురవడంతో పంటలు నేలకొరిగాయి. బుక్కపట్నం, తిరుమ లాయపల్లె గ్రామాల్లో మిర్చిపంటలో ఎండు మిరపకాయలకోసం ఉంచిన పొలంలో ఈదురుగాలులు వీయడంతో పండుమిరపకాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే వెంకయ్యకాలువ లో అరటి కోత దశలో స్వల్పంగా అరటి మొక్కలు నెలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాలల్లో రైతులకు నష్టం వాటిలింది.నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షాలు,గాలులకు కూలిన అరటితోటలు జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులు -
భూ సేకరణ పనులను పూర్తిచేయాలి
కడప సెవెన్రోడ్స్: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాలు, లీగల్ క్లియరెన్స్ ప్రక్రియలను పెండింగ్ లేకుండా...త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పై శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ అదితి సింగ్, డీఎఫ్ఓ వినీత్ కుమార్లతో కలిసి సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ దేశంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయన్నారు. అందు లో భాగంగా బెంగుళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేస్తోందన్నారు. భూములు కోల్పోయినవారికి పరిహారం కూడా ఇస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మూడు రకాలైన సోలార్ అనుబంధ పవ ర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను, ఇతర అనుమతులను క్లియర్ చేయాలన్నారు. జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్న య్య, ఎన్ హెచ్ఏఐ ఎస్డీసి వెంకటపతి, పీడి అశోక్ కుమార్, డిప్యూటీ మేనేజర్లు వేణుగోపాల్, సుదర్శన్ కుమార్, ఆర్అండ్బీ నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, నెడ్ క్యాప్ జిల్లా అభివృద్ధి అధికారి యల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాలను అధిగమించాలి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా.. అన్ని ప్రాధాన్యతా రంగాలను మరింత పటిష్టం చేసి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించాల్సిన ప్రగతి.. తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. విత్తనాల ఉత్పత్తి, పంటల మార్పులు, మైక్రో న్యూట్రియన్స్ల పై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుబడిని పెంపొందించాలని.. ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం పై రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడిన వారు.. వీరంతా నిరుపేదలు. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళ్తాయన్న దివ్యాంగులు వీరు. అయితే వీరి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. పునః
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు ● కుటుంబ సభ్యుల అపసోపాలు ● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన ● అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు ● రిమ్స్లో కనీస సౌకర్యాలు కరువుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్చైర్లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్చైర్, స్ట్రెక్చర్ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
అకాల వర్షం.. అపార నష్టం
కేంద్ర కారాగాలను పరిశీలించిన జడ్జి కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీదేవి సూచనల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తమ సిబ్బందితో కలిసి గురువారం కడప నగర శివార్లలోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళల కారాగారంలోని ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలతో మాట్లాడారు. సకాలంలో డాక్టర్ సలహాలు తీసుకుంటూ మందులు వాడాలన్నారు. అనంతరం కారాగారం పరిసరాలను, టాయిలెట్లను, వసతి గదులను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. ఫిర్యాదుల పెట్టెను పరిశీలించడం జరిగినది, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. కారాగారం లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం మొదలగు అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుషుల కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, మహిళ కారాగారపు సూపరింటెండెంట్ కృష్ణవేణి, డాక్టర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్ : పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మొన్న చక్రాయపేట మండలంలో ఈదురు గాలులకు 2700 ఎకరాలకుపైగా అరటి పంట నేలవాలి దెబ్బతిని రూ.50 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లింది. ఆ సంఘటన మరువకముందే మళ్లీ గురువారం సాయంత్రం ఉన్నట్లుండి కురిసిన అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో రైతులకు అపారనష్టం కలిగింది. జిల్లాలోని ఖాజీపేట, సికెదిన్నె మండలాల్లో పలువురు రైతులకు చెందిన అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులకు రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇందులో ఖాజీపేట మండలంలో 30 మంది రైతులకు సంంధించి 71.5 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. దీంతో 7.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సికె దిన్నె మండలంలో 20 మంది రైతులకు సంబంధించి 35 ఎకరాల్లో ఆరటి పంట నెలకొరిగింది. దీంతో వారికి రూ. 3.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తంగా 50 మంది రైతులకు సంబంధించి 106.5 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినడంతో రూ.10.65 లక్షల నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక నష్ట పరిహారాన్ని గుర్తించారు. మార్కెట్యార్డులో తడిసిన పసుపు కడప మార్కెట్యార్డులోకి వర్షపునీరు చేరి ఎండు పసుపు తడిచి ముద్దయింది. అమ్మకం కోసం మార్కెట్యార్డుకు తెచ్చిన పసుపును కుప్పలుగా పోసుకుని ఉండగా.. ఉన్నట్లుండి కురిసిన వర్షంతో నీరంతా పసుపు కొమ్ముల కుప్పల అడుగుభాగంలో చేరి తడిచిపోయింది. వర్షం ప్రారంభం కాగానే పసుపు కుప్పలసై పట్టలు కప్పినా అడుగుభాగంలోకి వర్షపు నీరు చేరడంతో ఎండు కొమ్ములు తడిచాయని గోపులాపురానికి చెందిన వెంకటరెడ్డి, రామాంజనేయరెడ్డి, అప్పరాజుపల్లికు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపేటకు చెందిన సుబ్బరాయుడులతోపాటు పలువురు రైతులు తెలిపారు. వర్షపునీటితో కొమ్ములు తడవటంతో పసుపు నాణ్యత తగ్గడంతోపాటు బరువు కూడా తగ్గుతుందని వారు వాపోయారు. తడిచిన పసుపు కొమ్ములను మళ్లీ ఆరబెట్టి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేక పోవడంతోనే ఎండు పసుపు తడిచిందని పేర్కొన్నారు. ఈ విషయమై యార్కెట్యార్డు సెక్రటరీ సుజాతతో మాట్లాడగా.. పసుపు తడిచినట్లు రైతులెవరూ తమ దృష్టికి తేలేదని తెలిపారు. ఈదురు గాలులతో.. చింతకొమ్మదిన్నె : మండలంలో గురువారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలుల ధాటికి అరటి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగింది. నాగిరెడ్డిపల్లె, గూడావాండ్లపల్లె, బుగ్గలపల్లె, లింగారెడ్డిపల్లి తదితర గ్రామాలలో తోటలలో గెలలతో ఉన్న అరటి చెట్లు.. ఈదురుగాలికి చాలా చోట్ల నేలకొరిగాయి. అమృతపాణి రకం అరటి చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల నేలపై వాలిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశామని, తీరా చేతికి వచ్చే తరుణంలో ఈదురు గాలులు తమకు శాపంగా మారాయన్నారు. అరటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం తమను అఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న నువ్వుల కట్టె వేముల : అకాల వర్షాలతో నువ్వుల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిసెంబర్, జనవరి నెలలో సాగు చేసిన రైతులు.. నువ్వుల కట్టెను కోతలు కోసి కల్లాలకు తరలించారు. అక్కడ మూడు రోజులపాటు మగ్గిన తర్వాత నువ్వుల కట్టెను నూర్పిళ్ల కోసం వేశారు. ఎండలు బాగా ఉంటే రెండు, మూడు రోజులలో నువ్వుల కట్టెను తీసి వేసి.. నువ్వులను వేరు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఈలోగా అకాల వర్షాలు రావడంతో కల్లాల్లో ఉన్న నువ్వుల కట్టె తడిసి ముద్దమైంది. నువ్వుల కట్ట కింద ఉన్న నువ్వులు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసి మూడు నెలలపాటు కాపాడుకుంటే నోటికాడికి వచ్చిన తర్వాత వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నేలకొరిగిన అరటి చెట్లు లబోదిబోమంటున్న రైతులు -
ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దు
కమలాపురం : కూటమి ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపిస్తోంది. ముస్లింలకు అండగా ఉంటాం.. ఆడపిల్లల చదువుకు చేయూతనిస్తాం.. అంటూ మాటల్లో ప్రేమ ఒలకబోస్తూ... చేతల్లో కర్కశత్వం చూపిస్తూ.. కపట నాటకమాడుతోంది. కమలాపురంలోని యూపీ ఉర్దూ స్కూల్ను రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే అందుకు నిదర్శనం. కమలాపురం పట్టణ పరిధిలోని బీడీ కాలనీలో ఉన్న ఉర్దూ యూపీ స్కూల్ను ప్రైమరీ స్కూల్గా మారుస్తూ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న స్థానికులు .. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. తమ కాలనీలోని యూపీ స్కూల్ను రివర్షన్ చేసి ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు మహబూబ్ బాషా, షఫీవుల్లా, హబీబున్, మాబుచాన్ తదితరులు కోరారు. ఈ విషయమై వారు ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాలనీలో మొత్తం బీడీ కార్మికులేనని, నిరుపేదలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలను తిరిగి రివర్షన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా తమ కాలనీలోనే ఈ పాఠశాల ఉండటంతో తమ పిల్లలు చదువుకుంటున్నారని, దీనిని ప్రైమరీ పాఠశాలగా మార్చి 6, 7 తరగతులను దూరంగా ఉన్న పాఠశాలల్లో కలిపితే తమ ఆడపిల్లలు చదువుకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలపై ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఎంతో అభివృద్ధి చేసిందని, ఇలాంటి సమయంలో యూపీ పాఠశాలగా తీసివేయడం బాధాకరమన్నారు. చెన్నూరు మండలంలోని ఒక పాఠశాలలో కేవలం 25 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ పాఠశాలను యూపీ పాఠశాలగానే కొనసాగిస్తున్నారని, మరి తమ బీడీ కాలనీలోని యూపీ పాఠశాలకు ఎందుకు రివర్షన్ ఇస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఆవేదన యూపీ ఉర్దూ స్కూల్ రివర్షన్పై మండిపాటు -
విద్యార్థిని అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని లక్ష్మీనగర్కు చెందిన ముత్తులూరు ప్రత్యూష (16) అనే విద్యార్థిని కనిపించడం లేదని తల్లి ప్రభావతి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రామక్రిష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీనగర్కు చెందిన ముత్తులూరు ప్రత్యూష పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంగడికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రానట్లు గురువారం పట్టణ పోలీస్స్టేషన్లో తల్లి ప్రభావతి ఫిర్యాదు చేసింది. రేషన్షాపు సీజ్ కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని రేషన్షాపును సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ తెలిపారు. 25 క్వింటాళ్లు బియ్యం, 75 కేజీల చక్కెర స్టాకులో తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి జమ్మలమడుగు రూరల్ : ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఎస్. మహమ్మద్ అజీజ్ (40) అనే ఆటో డ్రైవర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మహమ్మద్ అజీజ్ గురువారం ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగుకు బాడుగ కోసం వచ్చాడు. తిరిగి ప్రొద్దుటూరుకు వెలుతుండగా దానవులపాడుకు రాగానే అకస్మాత్తుగా ఆటోలోనే మృతి చెందాడు. అయితే కొంతకాలంగా అజీజ్ అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. నకిలీ ఫోన్ పే మోసగాళ్ల అరెస్ట్ చాపాడు : నకిలీ ఫోన్ పే యాప్ ఉపయోగించి మూడు నెలలుగా జనరల్ స్టోర్లో మోసం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ భవానీ వివరాలు వెల్లడించారు. చాపాడులోని నక్కలదిన్నె రోడ్డులో గల పెంచల నరసింహా జనరల్ స్టోర్లో.. చాపాడుకు చెందిన ముత్యాల శివశంకర్, లక్ష్మీపేటకు చెందిన భూమిరెడ్డి వీరాంజనేయరెడ్డి, సీతారామాపురానికి చెందిన సాయి గత మూడు నెలలుగా నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా సరకులు కొనుగోలు చేస్తూ మోసానికి పాల్పడ్డారు. రూ.3 లక్షల వరకు సరకులు తీసుకెళ్లడంతోపాటు కత్తితో బెదిరించిన ఘటనపై బుధవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి శివశంకర్, వీరాంజనేయరెడ్డి, సాయిలను అరెస్ట్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్ఐ చిన్న పెద్దయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా రహిత జిల్లాగా మారుద్దాం
కడప సెవెన్రోడ్స్: డయేరియా రహిత, ఆరోగ్య సహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి డయేరియా నియంత్రణ క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. నియోజకవర్గ, మండ ల, గ్రామ స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు మైక్రో ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. పారిశుద్ద్య పర్యవేక్షణ చర్యలు చేపట్టేందుకు పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, ఆర్డబ్ల్యూఎ్స్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డీఎంహెచ్ఓ నాగరాజు, నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి, ఇన్ఛార్జి డీపీఓ ఖాదర్బాష, రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి, ఎపిడమాలజిస్టు ఖాజా మోహిద్దీన్ పాల్గొన్నారు. 15 నుంచి జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఖాకీ వనంలో కలుపు మొక్కలు!
● ఎన్నికల అధికారికి గుండెపోటు వచ్చేలా.... తొలి రోజు వాయిదా పడిన ఎన్నిక మరుసటి రోజైన 28న నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమాయత్తమైతే వారిపైనే దౌర్జన్యానికి దిగి ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చేలా చేశారు. ఇదంతా కూడా డీఎస్పీ సమక్షంలోనే చోటుచేసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు కాలేదు. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు నంద్యాల అనందభార్గవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఎన్నికల గదిలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. టీడీపీకి చెందిన వారు ఎన్నికల అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను చించేశారు. కుర్చీలు ఎత్తేసి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో సదరు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా యి. ఇంత తతంగం తెరపైకి వచ్చినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సాక్షి ప్రతినిధి, కడప: సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు... గోడలు దూకి మరీ అరెస్టులు చేసే పోలీసులు...ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల్లో దౌర్జన్యం, దాడులకు దిగితే చూస్తుండిపోయారు. వైఎస్సార్సీపీ సభ్యులపై దాడు లు చేసి.. ఫేక్ ఐడీ కార్డులతో ఎన్నికను తారుమా రు చేయాలనుకున్నా.. మౌనాన్నే ఆశ్రయించారు. ఎన్నికలు రూమ్లోకి వెళ్లి ఎన్నికల అధికారిపైనే దౌర్జన్యానికి దిగినా నో కేస్. చివరికి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు చేసిన దౌర్జన్యానికి ఎన్నికల అధికారికి గుండె పోటు కూడా వచ్చినా నో కేస్. ఇదీ.. కూటమి పాలనలో ఖాకీల పనితీరు. ● ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ చేయని అరాచకం లేదు. సాక్షాత్తు డీఎస్పీ ముందే ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు అనందభార్గవ్రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఎన్నికల అధికారిపై దౌర్జన్యానికి దిగితే కనీసం కేసు కూడా లేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ దౌర్జన్యకాండను కళ్లకు కట్టినట్లు బహిర్గతం చేశాయి. ఎటువంటి బలం లేని కారణంగా ఎలాగైనా ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకునేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి బంధువు లు చేయని అరాచకం లేదు. మార్చి 27న వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు వస్తుంటే వారి వాహనంపై దాడి చేసి, మహిళా సభ్యులను సైతం గాయపరిచి ఎన్నికకు రాకుండా అడ్డుకున్నారు. అదే రోజు ఎలాగైనా గెలవాలని నలుగురు వ్యక్తులకు ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఎన్నిక గదిలోకి పంపినా వారిని కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను అపహాస్యం చేసే విధంగా వారు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యల్లేవు. ఎన్నికల కమీషన్ ఆదేశాలకే దిక్కులేదు... 20 మంది వార్డు మెంబర్లు ఉన్న గోపవరం పంచాయితీలో ఉప సర్పంచ్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకే జిల్లాలో దిక్కులేకుండా పోయింది. ఎన్నికకు సంబంధం లేని తెలుగుదేశం నాయకులు ఎన్నికల రూమ్లోకి ప్రవేశించారు. పోలీసు అధికారులు సైతం అదే వీడియోలో కన్పిస్తున్నారు. అయినా నియంత్రించలేదు. పోలీసుల కళ్లముందే దౌర్జన్యానికి దిగినా వారికి కనిపించలేదు. మరోవైపు ‘ఒక్క ఫోన్ కొడితే చాలు న్యాయం చేస్తా’మని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ప్రకటించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు చేపట్టిన 20 మంది వార్డు మెంబర్లు ఉన్న ఎన్నికల్లో అరాచకం తాండవించినా చట్టపరమైన చర్యలు లేకపోవడం ఎస్పీ ప్రకటనను ప్రశ్నాకర్థంగా మారుస్తోంది. ఆలస్యంగా వీడియోలు బయటకు రావడంతో చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యకాండ వెలుగు చూసింది. ఇప్పటికై నా జిల్లా పోలీసు యంత్రాంగం చట్టాన్ని పరిరక్షించేందుకు ముందుండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తాపత్రయం ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఉల్లంఘించినా కేసుల్లేవు గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం ఫేక్ ఐడీలతో పట్టుబడినా చర్యల్లేవ్ ‘దేశం’ నేతలు కావడంతోచట్టపరమైన చర్యలకు వెనుకంజ -
ఆస్పత్రిలో రోగుల భోజన నాణ్యతపై తనిఖీ
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్యశాల(రిమ్స్)లోని రోగులకు అందిస్తున్న భోజన నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు యండి.షంషీర్ ఖాన్, డాక్టర్ ఎం.హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం , పోషక విలువలు సంవృద్ధిగా ఉన్నాయా? లేదా అన్నది స్వయంగా పరీక్షించారు. రోగులతో మాట్లాడి అందుతున్న భోజనం గురించి వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు,ప్రైవేట్ ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లు అందిస్తున్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భోజనం నాణ్యతలో ఎక్కడైనా లోపం కనబడితే తక్షణమే వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి పైన తెలిపిన ఆసుపత్రి ముడి పదార్థాల నాణ్యత కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ఈక్రమంలో డైట్ కాంట్రాక్టర్లకు తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైటిషన్ బాలాజీ నాయక్, డైట్ కాంట్రాక్టర్ ఖాజా పాల్గొన్నారు. -
ప్రారంభమైన పది మూల్యాంకనం
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం గురువారం కడపలోని మున్సి పల్ హైస్కూల్ మొయిన్లో ప్రారంభమైంది. ఈ మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్గా డీఈఓ షేక్ షంషుద్దీన్ వ్యవహరించారు. ఈ మూల్యాంకనానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1,75,934 పేపర్లు వచ్చాయి. ఈ మూల్యాంకన విధుల్లో 105 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 604 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 198 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొని 12,910 పేపర్లను మూల్యాంకనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసర్, డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఈ మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 9 వరకు జరుగుతుందన్నారు. తొలి రోజు 12, 910 పేపర్లను మూ ల్యాంకనం చేశారని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేసు తెలిపారు. తొలి రోజు 12,910 సమాధాన పత్రాలకు మూల్యాంకనం -
జిల్లా ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిని కాయకల్ప పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించింది. జాయింట్ డైరెక్టర్ సాగర్, స్టేట్ టీబీ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్రకుమార్ ఆస్పత్రిని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల పనితీరును బట్టి కాయకల్ప అవార్డును ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా అధికారుల బృందం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వార్డులతో పాటు, ఓపీ విభాగాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబు కాయకల్ప బృందానికి ఆస్పత్రిలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రూపానంద్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు. -
జజ్జనకర జనారే.. జాతర భళారే..!
రాజంపేట టౌన్ : పట్టణంలోని బలిజపల్లెలో గురువారం గంగమ్మ జాతర సంబరం అంబరమంటింది. వేడుక బుధవారం రాత్రి నుంచే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత నిర్వహణలో భాగస్వాములైన నాపరపురెడ్డిపల్లె నిర్వాహకులు, ప్రజలు.. గంగమ్మ సోదరుడైన పోతురాజును ఊరేగిస్తూ అమ్మవారికి నవధాన్యాలు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మకు పుట్టినిల్లయిన తుమ్మల అగ్రహారం నుంచి.. ఆ గ్రామ మహిళలు పెద్దఎత్తున గండదీయలను బలిజపల్లెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన నిర్వాహకులు, యువకులు తప్పెట్ల దరువుకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. కర్రసాము విన్యాసాలు చేస్తూ, దీపావళిని తలపించేలా బాణాసంచా పేల్చుతూ చేరుకున్నారు. బలిజపల్లెలో గంగమ్మ ప్రతిమ తయారైన అనంతరం.. నిర్వాహకులు గురువారం తెల్లవారుజామున రథంలో అమ్మవారిని ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలోకి తీసుకొచ్చి కొలువు దీర్చారు. గంగమ్మ ఊరేగింపుగా గుడిలోకి వచ్చే సమయంలో పోతురాజును ఎగిరించేందుకు భక్తులు పోటీపడ్డారు. గంగమ్మ గుడిలోకి వస్తుండగా.. వందలాది మంది భక్తులు ముద్దలు పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. గంగమ్మా.. కాపాడమ్మా ఈ సందర్భంగా భక్తులు ‘అమ్మా గంగమ్మ తల్లి.. మము కరుణించి కాపాడమ్మా’ అంటూ వేడుకున్నారు. గంగమ్మ గుడిలోకి చేరుకోక ముందే వేలాది మంది బలిజపల్లెకు చేరుకోవడంతో.. బలిజపల్లె గ్రామం ఇసుకవేసినా రాలనంతగా భక్తులతో నిండిపోయింది. అమ్మవారు గుడిలో కొలువు దీరాక భక్తులు ఒక్కసారిగా గంగమ్మను దర్శించుకునేందుకు త్వరపడటంతో పోలీసులు అధికారులు, సిబ్బంది అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గంగమ్మ గుడిలో కొలువుదీరగానే జాతర ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు కిలోమీటరు మేర భక్తుల రద్దీ కొనసాగింది. దారులన్నీ జాతర వైపే బలిజపల్లె గంగమ్మ జాతరలో అమ్మవారికి వరపడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల బుధవారం రాత్రి నుంచే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు బలిజపల్లెకు చేరుకోవడం ప్రారంభించారు. జాతరలోకి వచ్చేందుకు నాలుగువైపులాఉన్న రహదారుల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. దీంతో పట్టణంలోని అన్ని దారులు జాతరవైపు సాగి కోలాహలంగా మారాయి. వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతర ఆకట్టుకున్న యువకుల విన్యాసాలు భారీగా తరలివచ్చిన భక్తులు గంగమ్మను దర్శించుకున్న ఆకేపాటి, పోలా జాతర సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి.. గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బలిజపల్లె గంగమ్మ ఎంతో విశిష్టత సంతరించుకున్న దేవత అని, గంగమ్మ బలిజపల్లె గ్రామంలో స్వయంభుగా వెలియడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. బలిజపల్లె గంగమ్మ వల్ల జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ రాజంపేటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు. గంగమ్మ కరుణతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిపించి ప్రజల, రైతుల కష్టాలు తీర్చాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన గంగమ్మ జాతరలో తాను ప్రతి ఏడాది పాల్గొని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారిని వేడుకునే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. -
రిమ్స్లో తీరు మారదంతే..!
కడప టాస్క్ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)తీరు మారడం లేదు. ఓపీ విభాగంలో మహిళా కంటి విభాగం(ఆప్తాలమిక్)లో గురువారం ఉదయం 10:20 గంటలైనా వైద్యులు రాకపోవడం గమనార్హం. అలాగే ఆప్తాల్మిక్, ఈఎన్టీ విభాగాలకు శ్రీరీ వెరిఫికేషన్శ్రీకు వచ్చిన రోగులు, వారి సహాయకుల క్యూలైన్ పెద్దదిగా వుండి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ రిజిస్టర్లలో పేర్లను నమోదు చేసేందుకు విద్యార్థులను.. ఎలాంటి ఉద్యోగి పర్యవేక్షణ లేకుండానే వారికి వదిలేయడం ఎంత వరకు సమంజసం. ● ఓపీ విభాగంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతుల బెడద తప్పడం లేదు. ఈ కోతుల బెడదకు ఒకవైపు చిన్నారులు, బాలింతలు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు. ● గైనిక్ విభాగం ఓపీ విభాగం ముందు భాగాన విరిగిపడి మూలనపడిన ఇనుపకుర్చీ నిరుపయోగంగానే పడివుంది. ● కడప జీజీహెచ్ (రిమ్స్)లో ప్రభుత్వం మంజూరు చేసిన స్టాఫ్ నర్సులు 402 కాగా వీరిలో రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 62 మంది, కాంట్రాక్ట్ పద్ధతిలో 202 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 138 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా వున్నాయి. త్వరలోనే భర్తీ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా 13 మంది స్టాఫ్ నర్సులు వివిధ ఓపీ, ఐపీ, పరిపాలనా విభాగాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ (డి.ఈ.ఓ) పనులను మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరికి ఎలాంటి షిఫ్ట్ డ్యూటీలు లేకపోవడం, ఆయా పోస్టింగ్లకే అధికారులు పరిమితం చేయడం పలురకాల ఆరోపణలకు తావిస్తోంది. ఇంకా సిటీ స్కానింగ్ విభాగంలో అటెండర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా ఐదు సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తున్నాడు. తనను కంప్యూటర్ ఆపరేటర్గా తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ● మరోవైపు కడప రిమ్స్ ఓపీలోని క్యాంటీన్ మూసివేత వ్యవహారం రోజురోజుకు ముదిరిపాకాన పడుతోంది. టెండర్ వేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అధికారులు ప్రస్తుత క్యాంటీన్ నిర్వాహకులను బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు. మొదటి రోజున ఏకంగా తాళళం వేసిన ఓ ప్రైవేట్ వ్యక్తి మూడవరోజున ఆ తాళం కాస్తా తీసేశాడు. మరోవైపు అధికారులు తగిన ఉత్తర్వులను ఇస్తే తాము ఖాళీ చేస్తామని ప్రస్తుత నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఓపెన్ టెండర్ను నిర్వహిస్తే అందరికీ మంచిదంటున్నారు. కంటి మహిళా ఓపీలో 10:20 గంటలైనా రాని వైద్యులు గైనిక్ ఓపీ ముందు మూలనపడ్డ కుర్చీ 13 మంది స్టాఫ్ నర్సులు డీఈఓ ఉద్యోగాలకే పరిమితం -
వైవీయూ క్యాంపస్ డ్రైవ్కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. ప్రముఖ బయోకాన్ మల్టీనేషనల్ కంపెనీ వైవీయూలో గురువారం చేపట్టిన ఎంపికలకు తిరుపతి, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, కడప జిల్లాల నుంచే కాక చత్తీస్ఘడ్, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500 మంది ఇంజినీరింగ్, డిగ్రీ పీజీ అర్హత గల అభ్యర్థులు హాజరయ్యారు. వైవీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథ్రెడ్డి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మలు క్యాంపస్ డ్రైవ్ ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.విజయ భారతి ఎంపికల ప్రక్రియను సమన్వయం చేశారు. బయోకాన్ కంపెనీ క్వాలిటీ అస్సూరెన్స్ మేనేజర్ లక్ష్మినరసయ్య, హెచ్.ఆర్ విభాగ డిప్యూటీ మేనేజర్ జయప్రకాష్, ఎస్సార్ డైరెక్టర్ జయభారత్, ఆపరేషన్ హెడ్ ఎన్హెచ్ అశోక్, క్లస్టర్ హెడ్ రాజశేఖర్, హెచ్ఆర్ విభాగ ఆర్ శరత్ విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఇందులో 160 మంది అభ్యర్థులను కంపెనీ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ ,ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యురాలు ప్రొఫెసర్ చంద్రమతి శంకర్, ప్లేస్మెంట్ సెల్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ గణేష్ నాయక్, డాక్టర్ సుభోస్ చంద్ర, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
‘చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది’
సాక్షి, కడప: రాజ్యాంగ విరుద్ద ముస్లిం సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్సభలో టీడీపీ, జనసేనల వైఖరితో ముస్లింలను వంచించారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్ధతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయి. మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ రెండు పార్టీలు వాడుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన నిజస్వరూపం బయటపడింది. 1995లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, 2004లో ఓడిపోయిన తర్వాత `నా జీవితంలో చారిత్రాత్మక తప్పిదం చేశానని మైనారిటీలకు క్షమాపణలు చెప్పాడు.ముస్లిం వ్యతిరేక బీజేపీతో భవిష్యత్తులో కలిసేది లేదని బహిరంగ సభలో ప్రకటించారు. కానీ 2014లో అవసరం కొద్దీ అదే ముస్లిం వ్యతిరేక బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనారిటీకి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర చంద్రబాబుది. మళ్లీ 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు మైనారిటీల ఓట్ల కోసం ఎన్ఎండీ ఫరూక్ను మంత్రిని చేసిన మోసగాడు చంద్రబాబు. 2019లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు, మళ్లీ అధికారం కోసం 2024లో బీజేపీతో జతకట్టాడు.ఇప్పుడు ముస్లింల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతిచ్చి మైనారిటీలకు వెన్నుపోటు పొడిచాడు. బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుని కలిసినప్పుడు వారికి అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా చూస్తానని నమ్మించాడు. ఆఖరుకి పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇప్తార్ విందులోనూ మైనారిటీలకు అన్యాయం జరగనివ్వనని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తానని మోసపూరిత హామీ ఇచ్చాడు.తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్టు నేషనల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నాడు. తీరా చూస్తే ఆ పార్టీ ఎంపీలు బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారు. టీడీపీ సపోర్టుతో నడిచే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు తలచుకుంటే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశమే ఉండేది కాదు. అయినా చంద్రబాబు ముస్లింల మనోభావాలను కాలరాసేలా తన ఎంపీలతో బిల్లుకు మద్దతు పలికారు.మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేదుఈ బిల్లు మైనార్టీలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. మౌజన్లు, ఇమామ్లకు ఇవ్వాల్సిన 6 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో పెట్టాడు. 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పింఛన్లు ఇస్తానని చెప్పాడు. దుల్హన్ పథకం కింద పెళ్లి కుమార్తెకు రూ.లక్ష సాయం చేస్తానని చెప్పాడు.మైనారిటీలకు రూ.5 లక్షల రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ. లక్ష ఇస్తామని చెప్పాడు. వీటిలో ఏ ఒక్క హామీని కూడా ఈ పది నెలల్లో చంద్రబాబు అమలు చేసిన పాపాన పోలేదు. 2024లో హజ్ యాత్రకు వెళ్లిన ఏ ఒక్కరికీ రూపాయి కూడా సాయం చేయకపోగా విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ సెంటర్ రద్దు చేసేలా చర్యలు తీసుకున్నాడు. మసీదుల నిర్వహణకు నెలకు రూ. 5 వేలు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీరాష్ట్రంలో మైనారిటీలకు న్యాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత మహానేత వైఎస్సార్, ఆ తరువాత అదే ఒరవడిని కొనసాగించిన వైఎస్ జగన్ జగన్ మాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలను రాజకీయంగా ప్రోత్సహించింది. నలుగుర్ని ఎమ్మెల్యేలుగా మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత వైఎస్ జగన్దే. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిని మైనారిటీలకు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఏనాడూ మండలిలో నలుగురు మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదు.జకియా ఖానంను శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్గా నియమించారు. అనేకమందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా గత ఐదేళ్ల పాలనలో మైనారిటీల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. జగన్ హయాంలో మైనారిటీలకు జరిగినంత రాజకీయ లబ్ధి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలి. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల గొంతు కోసిన టీడీపీలో కొనసాగితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముస్లిం సమాజం వెలివేస్తుందన్ని హెచ్చరిస్తున్నా.. -
కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం సౌకర్యవంతం
ప్రొద్దుటూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటం ప్రజలకు చాలా సౌకర్యవంతమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామ సచివాలయ నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అనే అంశంతో సచివాలయం, రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఒకే ప్రాంగణంలో నిర్మించాలన్న ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. సంపదను సృష్టించడం నాయకుడి ప్రధాన లక్షణమని, ఉన్న ఊరు సొంత ప్రాంతాన్ని చక్కపెడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని 4వ స్థానంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,260 విలేజ్ హెల్త్ క్లినిక్లను మంజూరు చేసిందని, ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రలో భాగంగా ప్రజలు, దాతలు భాగస్వాములతో అట్టడుగున ఉన్న పేదలను అత్యున్నతంగా ఉన్న సంపన్నుల ద్వారా అభివృద్ధి చేయడం పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు నంద్యాల వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, ఆర్డీఓ సాయిశ్రీ, డీఎస్పీ భావన, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘశరెడ్డి, వీఎస్ ముక్తియార్, కొనిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయాధికారి శివశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ -
పది మూల్యాంకనానికి సర్వం సిద్ధం
● నేటి నుంచి ప్రారంభం.. 9వ తేదీ వరకు నిర్వాహణ ● ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు ● జిల్లాకు చేరిన సమాధాన పత్రాలు ● 1337 మంది సిబ్బందితో మూల్యాంకనం కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీకి ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 28,700 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. కాగా.. సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి కడపలోని మున్సిపల్ హైస్కూల్ మొయిన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లకు కోడింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులకు కోడింగ్ ముగియగానే చివరగా సోసియల్ సబ్జెక్టుకు కోడింగ్ జరుగుతోంది. సిబ్బందికి వసతుల ఏర్పాటు... మూల్యాంకనం చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1337 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో ఛీప్ ఎగ్జామినర్లు 121 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 732 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 484 మందిని ఇలా మొ త్తంగా 1337 మందిని నియమించారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. పక్కాగా నిబంధనలు అమలు: మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న అన్ని రోజులు అటువైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ● విడతల వారిగా.. ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,72,172 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయనున్నారు. ఇందుకోసం 1,337 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. ఈ మూల్యాంకన కేంద్రంలో జిల్లా విద్యా శాఖ అధికారి క్యాంపు ఆఫీసర్గా, డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా, మరో ఏడు మంది అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. వీటితోపాటు ప్రతి గ్రూపునకు ఒక ఛీప్ ఎగ్జామినర్ (సీఈఓలు), ఆరుగురు సహాయ ఎగ్జామినర్లు (ఏఈలు), ఇద్దరు స్పెషల్ అసిసెంట్లు (ఎస్పీఏ) పాల్గొంటారు. ప్రతి సహాయక ఎగ్జామినర్ రోజుకు 40 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం
కడప సెవెన్రోడ్స్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్బాష విమర్శించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 25, 26 స్ఫూర్తికి వక్ఫ్ సవరణ బిల్లు తూట్లు పొడుస్తోందన్నారు. ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరుల స్థాయికి దిగజార్చేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోందన్నారు. 1954 నుంచి అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి గతంలో జరిగిన సవరణలకు, నేటి సవరణలకు చాలా వ్యత్యాసముందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం మత పెద్దలతో చర్చించాకే సవరణలు చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. మసీదులు, దర్గాలు, అషుర్ఖానాలు, స్మశానాల నిర్వహణ కోసం తమ పూర్వీకులు భూములను దానంగా ఇచ్చారని తెలిపారు. అవి అల్లాహ్కు సంబంధించిన ఆస్తులుగా తాము భావిస్తామన్నారు. కానీ నేటి ఎన్డీయే ప్రభుత్వం దాని అర్థాన్నే మార్చేస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆధార పత్రాలు చూపమంటే ఎవరు చూపగలరని ప్రశ్నించారు. ఎవరు వక్ఫ్ చేయాలన్నా వారు ఐదేళ్లు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలని, ఇందుకు సంబంధించిన డిక్లరేషన్ను కోరడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. వక్ఫ్ ట్రిబ్యునల్, సర్వే కమిషన్లా అధికారాలను తొలగించి కలెక్టర్లకు కట్టబెట్టడం తగదన్నారు. ఇప్పటివరకు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి టైటిల్ నిర్ధారించే హక్కు వక్ఫ్ ట్రిబ్యునల్, కమిషన్కు మాత్రమే ఉండేదని, దాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఎందుకంటే కలెక్టర్లు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటారని తెలిపారు. డిఫెన్స్, రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డుకే అధికంగా ఆస్తులు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడటం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం రైల్వే, డిఫెన్స్లకు భూములు కేటాయించింది తప్ప వక్ఫ్కు కేటాయించలేదన్నారు. వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్న భూములు తమ పూర్వీకులు దానం చేసినవన్న విషయాన్ని మరవరాదన్నారు. బీజేపీ తన రాజకీయ లబ్ధికోసం దేశాన్ని ముక్కలు చేసేందుకు వక్ఫ్ సవరణ బిల్లు తెలుస్తోందని ఆరోపించారు. సవరణ బిల్లు ద్వారా వక్ఫ్కు ఆదాయం పెంచుతామని ప్రభుత్వం మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇప్పటివరకు వచ్చే ఆదాయంలో ముతవల్లీలు ఏడు శాతం వక్ఫ్కు చెల్లించేవారని, ఇప్పుడు సవరణ బిల్లులో దాన్ని ఐదు శాతానికి తగ్గించారన్నారు. ఇందువల్ల వక్ఫ్కు ఆదాయం తగ్గుతుందేగానీ ఎలా పెరుగుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. వక్ఫ్బోర్డులో నాన్ మైనార్టీలకు అవకాశం కల్పిస్తూ సవరణలు చేయడం అన్యాయమన్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానం తదితర పాలక మండళ్లలో మైనార్టీలకు అవకాశం కల్పించనప్పుడు వక్ఫ్బోర్డులో ఇతరులకు ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లింలకు రక్షణగా ఉంటానన్న మఖ్యమంత్రి చంద్రబాబు బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లిం ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. టీడీపీలోని మైనార్టీలు పునరాలోచించుకోవాలని, లేదంటే వారిని ముస్లింలు వెలివేస్తారని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింల కోసం రిజర్వేషన్లను తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. మైనార్టీల సంక్షేమానికి రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఆయనదేనన్నారు. హజ్ యాత్రికుల కోసం ఎంబార్కేషన్ పాయింట్ను తీసుకొచ్చారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. ఈ సమావేశంలో హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజం, కార్పొరేటర్లు షఫీ, అక్బర్ అలీ, మైనార్టీ నాయకుడు బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లింల పూర్వీకులు ఇచ్చినవి ఆధార పత్రాలు చూపాలంటే ఎలా సాధ్యం వక్ఫ్ చేయడానికి డిక్లరేషన్ కోరడం అసంబద్ధం ట్రిబ్యునల్, సర్వే కమిషన్ అధికారాల తొలగింపు తగదు బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు మైనార్టీ ద్రోహి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్బాష -
లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 1580/బిలో చర్మకారుల సొసైటీకి కేటాయించిన 3.64 ఎకరాల స్థలంలో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం బద్వేలు పర్యటనకు వచ్చిన ఆయన ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు ఉదయభాస్కర్రాజుతో కలిసి సొసైటీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి చర్మకారులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ లిడ్క్యాప్ డైరెక్టర్ రాజశేఖర్, చర్మకారుల సొసైటీ సభ్యులు, దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఎవరిదీ ‘చెత్త’పని?
కడప కార్పొరేషన్ : కడపలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీకి అవమానం జరిగింది. నగరంలోని రాజీవ్ పార్కు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద స్థానిక వ్యాపారులు చెత్త వేస్తున్నారు. ఎవరి వద్ద ఏర్పడిన చెత్తను వారే ఎత్తాలని నిబంధన ఉన్నా ఎవరికి వారు చెత్త ఎత్తకుండా ఇదిగో ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట వేస్తున్నారు. దీన్ని నగరపాలక సిబ్బంది కొన్ని సార్లు ఎత్తేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే వారు ఇలాగే వేయడం వల్ల నగరపాలక సిబ్బంది ఎత్తడం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇలా విగ్రహం ముందు భాగమంతా చెత్తమయంగా మారింది. -
కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, సత్వరమే పరీక్షల తేదీ ప్రకటించకుంటే నిరుద్యోగుల పక్షాన చలో విజయవాడ పిలుపునిస్తామని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ హెచ్చరించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రకటించాలని కోరుతూ బుధవారం కడపలోని మహావీర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండగా యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో కోర్టు కేసులు క్లియర్ చేసి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ నరసింహులు, నగర కార్యదర్శి విజయ్, నగర సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వంశీ, విద్యుత్ రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. -
సీపీఎం నేతల చుట్టూ స్థల వివాదం
సాక్షి టాస్క్ఫోర్స్ : కడప భగత్సింగ్ నగర్లోని విలువైన ఓ ప్రభుత్వ స్థలం విషయంలో స్థానిక ప్రజలు, సీపీఎం నాయకుల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. ఆ స్థలం తమ పట్టా అంటూ సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి నారాయణరెడ్డి ఇటీవల చదును చేయడంతో, అది గుడి స్థలమంటూ స్థానికులు అడ్డుచెప్పడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. గతంలో ఇదే స్థలాన్ని లైబ్రరీ నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయించిన సీపీఎం, నేడు ఆ పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి ఆ స్థలం తమదేనంటుంటే మౌనముద్ర దాల్చడం చర్చనీయాంశంగా మారింది. చిలికి చిలికి ఈ అంశం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేత ప్రభాకర్రెడ్డి ఇటీవల కడపలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. స్థల వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.... చెమ్ముమియాపేట గ్రామ సర్వే నెంబరు 344 లో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దక్షిణం వైపు మూడు సెంట్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. సెంటు రూ. 20 లక్షలకు పైగా పలుకుతోంది. ఆ స్థలం విషయంలో చంద్రగిరి నారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్న గణేష్ ఉత్సవ కమిటీ, సీపీఎం నాయకుల మధ్య సుమారు పదేళ్లు గా వివాదం ఉంది. 1998 నుంచి ఆ స్థలంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించేవారమని, అక్కడ సీతారామాంజనేయ ఆలయం నిర్మాణాన్ని చేపట్టేందుకు చందాలు పోగు చేసుకుని ఐరన్ ఫిల్లర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని స్థానికుల కథనం. అయితే సీపీఎం నాయకులు కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ 2016 డిసెంబరు 20న కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2001–02లో అప్ప టి తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి తమ పార్టీ నా యకుడు బి.నారాయణరెడ్డి సతీమణి పి.పద్మమ్మకు ఆ స్థలాన్ని డీకేటీ పట్టాగా ఇచ్చారని సీపీఎం నాయకుల వాదన. లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ఆమె తన స్థలాన్ని బహుమానంగా ఇచ్చారని వారు చెబుతూ దాన్ని ఆక్రమించేందుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొంతమంది అక్కడ సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేసి మతపరమైన హింసను ప్రేరేపించడం ద్వారా శాంతికి విఘాతం కల్పిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం నాయకుడు 2016 డిసెంబరు 31న కడప తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నివే దిక ఆధారంగా అప్పటి కడప తహసీల్దార్ ప్రేమంత్కుమార్ ఆ స్థలంలోకి ఎవరూ ప్రవేశించరాదంటూ సెక్షన్ 145 సీఆర్పీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలం తమ పార్టీ నేత నారాయణరెడ్డి సతీమణిదంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన సీపీఎం నాయకులు, చెమ్ముమియాపేట వీఆర్వోకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ స్థలం బి.సరస్వతమ్మకు ప్రభుత్వం కేటాయించగా, ఆమె అనుమతితో తాము నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించామని పరస్పర విరుద్ధంగా చెప్పడం గమనార్హం. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపాలని వీఆర్వో కోరగా, కనిపించడం లేదని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా అందుకు సంబంఽధించిన రికార్డులు లేవని స్పష్టం చేస్తూ చెమ్ముమియాపేట వీఆర్వో నివేదిక ఇచ్చారు. దాన్ని అప్పటి తహసీల్దార్ 2017 మే 15వ తేదీ ఆర్డీఓకు పంపారు. ఆ స్థలంలో స్థానికుల కోరిక మేరకు గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే అర్థం స్ఫురించే విధంగా తహసీల్దార్ తన నివేదికలో రాశారు. ఈ క్రమంలో సీపీఎం జిల్లా నాయకత్వం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీలో తీర్మానం చేయించేందుకు ప్రయత్నించింది. లైబ్రరీ కమిటీ (సుందరయ్య స్మారక కేంద్రం ట్రస్టు)కి అనుమతి ఇస్తూ జనరల్ బాడీ సమావేశం 2017 ఏప్రిల్ 19వ తేది తీర్మానం నెంబరు 155 ఆమోదించింది. అయితే గతనెల 24వ తేది సీపీఎం నాయకుడు నారాయణరెడ్డి ఆ స్థలం తనదేనంటూ జేసీబీతో చదును చేయించగా, శ్రీ సీతారామాలయ కమిటీ చైర్మన్ సి.నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ స్థలంపై నకిలీ పట్టా సృష్టించి హార్డ్వేర్ షాపు యజమాని సురేంద్రారెడ్డి అనే వ్యక్తికి సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శి విక్రయించారని సి.నారాయణ అనే స్థానికుడి అభియోగం. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఆ స్థలాన్ని గుడి నిర్మాణానికి కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. సీపీఎం నేతల మౌన ముద్ర భగత్సింగ్ నగర్లోని ప్రభుత్వ ఖాళీ స్థలం విషయంలో ఇంత జరుగుతున్నా సీపీఎం జిల్లా నాయకులు మౌనముద్ర వహించడం విమర్శలకు తావిస్తోంది. ఒకప్పుడు అదే స్థలాన్ని లైబ్రరీ కమిటీకి కేటాయించాలని మున్సిపల్ జనరల్ బాడీలో తీర్మానం చేయించిన ఆ పార్టీ నాయకులు, నేడు అదే పార్టీకి చెందిన మాజీ జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి ఆ స్థలం తన పట్టా అని మాట్లాడుతున్నా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం లైబ్రరీకి కేటాయింపు కార్పొరేషన్లో తీర్మానం చేయించిన సీపీఎం నాయకులు నేడు తన పట్టా అంటున్న ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి భగత్సింగ్ నగర్లో స్థానికులు, సీపీఎం నేతల మధ్య ముదిరిన వివాదం -
మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలాయపల్లిలో గ్రామంలో వల్లెపు ఆశ అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ఓ దండగుడు పరారైన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉగాది పండుగ సందర్భంగా మేకలబాలాయపల్లె గ్రామంలోని బంధువుల ఇంటికి సింహాద్రిపురం మండల పరిధిలోని గురిజాల గ్రామానికి చెందిన వల్లెపు ఆశ అనే మహిళ వచ్చింది. ఈ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా పెద్దమ్మతల్లి, దుర్గమ్మతల్లికి గ్రామ ప్రజలు బోనాలు మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. బుధవారం వల్లెపు ఆశ పిల్లలకు ఐస్ కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్లో వచ్చి వల్లెపు ఆశ మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ప్రొద్దుటూరు వైపు పరారయ్యాడు. వెంటనే బాధితురాలు కలమల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. కొండాపురం సీఐ మహమ్మద్రఫీ మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. విద్యార్థిని అదృశ్యం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సాంఘిక సంక్షేమ గిరిజన స్కూల్లో విద్యార్థిని అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న యశోద ఉదయం 7 గంటలకు హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైందన్నారు. విద్యార్థినికి మతిస్థిమితం సరిగా లేదని స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశమన్నారు. -
ఆలయంలో చోరీకి యత్నం.. పట్టుకున్న గ్రామస్తులు
ముద్దనూరు : మండలంలోని కొర్రపాడు గ్రామంలోని ప్రముఖ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ సముదాయంలో బుధవారం పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. అయితే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండడంతో నిందితుల్లో ఒకరని పట్టుకుని బంధించారు. మరొకరు పారిపోయినట్లు సమాచారం. గ్రామస్తుల కథనం మేరకు గ్రామంలో చెన్నకేశవ ఆలయంతో పాటు శివాలయం, రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి కల్యాణం చదివింపులు, ఇతర ముడుపులు, కానుకలు రూపంలో భారీగా సొమ్ము హుండీలో చేరింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇరువురు యువకులు మూడు ఆలయాల్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. చెన్నకేశవస్వామి ఆలయంలో నగదు, ఇతర ఆభరణాలను దొంగిలించే యత్నం చేశారు. ఆలయంలోని సుమారు రూ. 50 వేల నగదును ఒక వస్త్రంలో పడేసి మూట కట్టారు. ఇంతలోనే గ్రామస్తులు గుర్తించి దొంగలలో ఒకరిని పట్టుకున్నారు. మరొకరు అప్పటికే పారిపోయాడు. పట్టుబడిన నిందితుడు మైనర్గా గుర్తించి బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన నిందితునిది ప్రొద్దుటూరుగా గుర్తించారు. పోలీసు అధికారులు, ఆలయ ఈఓ దేవాలయాన్ని సందర్శించి చోరీ వివరాలను సేకరించారు. ఆలయంలో జరిగిన ఉత్సవాల సందర్భంగా భారీ సొమ్ము ఉంటుందనే నిందితులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
కత్తితో దాడి చేసిన నిందితులు అరెస్టు
కమలాపురం : కత్తితో పొడిచి ముగ్గురు యువకులను గాయపరిచిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఎస్కే రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ సల్మాన్ అనే యువకుడు అక్సా నగర్కు వచ్చి వేగంగా బైక్ నడుపుతుండగా అదే కాలనీకి చెందిన సోహైల్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని మందలించాడు. దీంతో సల్మాన్ అతనిపై కక్ష పెంచుకుని తండ్రి మహబూబ్ షరీఫ్తో కలసి గత నెల 31వ తేదీన సోహైల్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా కావాలనే బైక్ తగిలించాడు. అతడు కిందపడిన తర్వాత కత్తితో పొడిచి బలమైన రక్తగాయం చేశాడు. అదే సమయంలో అతడిని వారించడానికి వచ్చిన షాబాజ్, రియాజ్లను సైతం సల్మాన్ తన తండ్రి సహకారంతో పొడిచి గాయపరిచాడు. ఈ కేసులో నిందితులను బుధవారం పట్టణ పరిధిలోని కంచి వరదరాజ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తితో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి వరకు పిల్లలు బయట తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలించాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
బద్వేలు అర్బన్ : నీరు తాగేందుకు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని కోనసముద్రం గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బి.మఠం మండలం టి.రామా పురం గ్రామానికి చెందిన నాగిపోగు హృదయరాజు (32) గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య దివ్యశ్రీతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. గొర్రెల మేత కోసం పచ్చని గ్రాసం ఉన్న గ్రామాలకు బృందాలుగా వెళుతుంటారు. ఈ క్రమంలో కోనసముద్రం సమీపంలోకి కొందరు గొర్రెల పెంపకందారులు గొర్రెలను మేత కోసం తీసుకువచ్చారు. మధ్యాహ్నం సమయంలో దాహం వేస్తుండటంతో నీరు తాగి వస్తానని చెప్పి బావి వద్దకు వెళ్లాడు. అయితే ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తోటి కాపరులు బావిలోకి వెళ్లి చూడగా బావిలో నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే వారు బావిలోకి దిగి హృదయరాజును బయటికి తీసుకురాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అయితే హృదయరాజుకు ఈత రాదని తెలిసింది. నీరు తాగే సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్ఐ చంద్రమౌళి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సమస్యల సాధనకు ఉద్యమిస్తాం
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం, పీఆర్సీ, ఐఆర్లపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం బుధవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్ఎండి ఇలియాస్ బాషా అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని ర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్, జపీపీఎస్ల స్థానంలో ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి(ఐ.ఆర్) ప్రకటిస్తామన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు రూ.30 వేల కోట్లు ఉండగా ఇటీవల రెండు విడతలుగా రూ.7300 కోట్లు చెల్లించారన్నారు. మిగిలిన సుమారు రూ.23 వేల కోట్ల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని పోరాటం చేయాల్సి రావడం శోచనీయమన్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి మహావీర్ సర్కిల్ మీదుగా మళ్లీ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఏవీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జనరల్ రాళ్లపల్లె అబ్దుల్లా, కో చైర్మెన్ వెంకటసుబ్బారెడ్డి, రామచంద్ర బాబు, మాదన విజయకుమార్, శ్యామలాదేవి, శ్రీనివాసులరెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు లక్ష్మి రాజా, శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె.సురేష్ బాబు, కంభం బాల గంగిరెడ్డి, జిల్లా నాయకులు సంగమేశ్వర్ రెడ్డి, బి.రాజు, వీరాంజనేయరెడ్డి, ఖాదర్ బాషాతోపాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన ఫ్యాప్టో నాయకులు -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని తొట్టిగారిపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన చరణ్, చిన్న, రాజేశ్వర్రావులు హైవే రోడ్డు పనులకు కూలీలుగా వెళుతుండేవారు. రోజూ మాదిరే పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురూ కిందపడి గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. పలుచోట్ల దొంగతనాలు వేంపల్లె : వేంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి వేంపల్లెలోని మెయిన్ బజార్లో ఉన్న అమ్మవారిశాల అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాలు తీసి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 35 ప్యాకెట్ల కంది పప్పు, నాలుగు బాక్సులు (40 లీటర్ల) పాల ప్యాకెట్లను దొంగిలించినట్లు అంగన్వాడీ కార్యకర్త తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ బాలుర పాఠశాల సమీపంలో ఉన్న ఇందు ట్రావెల్స్ కార్యాలయానికి ఉన్న బీగాలు పగులగొట్టి రూ.45వేల నగదుతోపాటు మూడు పాత సెల్ ఫోన్లు చోరికి గురైనట్లు బాధితుడు సురేష్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ఉన్న ప్రాంతంలో సాయంత్రం పూట ఎక్కువ మంది ఆకతాయిలు ఉంటారని, వారి పనై ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం పులివెందుల బైపాస్ రోడ్డులో కూడా చిన్న, చిన్న దుకాణాల్లో చోరీలు జరిగినట్లు సమాచారం. అలాగే బృందావన కాలనీలో 10 బైకులలో ఉన్న పెట్రోలును దుండగులు దొంగిలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో బోల్తా కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపంలోని నాలుగు వరుసల జాతీయ రహదారిపై ఆటో టైరు పగలడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా.. మండలంలోని తిమ్మాపురం నుంచి తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న ఆటో దారి మధ్యలో కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపం వద్ద జాతీయ రహదారిపై టైర్ పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ముగ్గురు గాయపడటంతో 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ధర్మవరానికి చెందిన పుల్లయ్యకు తలకు తీవ్ర గాయంతో పాటు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. -
తక్కువ కాలుష్య నగరం కడప
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023–24లో కడపలో వాతావరణ కాలుష్యం (గాలిలో ధూళి కణాలు పది మైక్రోమీటర్లు.. అంతకంటే తక్కువ వ్యాసం) పీఎం 10 సగటున 42 యూజీ/ఎం3 (ఎం క్యూబ్డ్)గా నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 15 ప్రధాన నగరాల వాతావరణ కాలుష్య గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం కాలుష్య తక్కువ ఉన్న నగరాల్లో 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో, 56 పాయింట్లతో కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయి. రాష్ట్రం మొత్తంమీద అత్యధిక కాలుష్యమున్న నగరంగా విశాఖ రికార్డులకు ఎక్కింది. విశాఖలో సగటున వాతావరణ కాలుష్యం 120 పాయింట్లుగా ఉంది. విశాఖ తర్వాత 76 పాయింట్లతో రాజమండ్రి రెండో స్థానంలో, 73 పాయింట్లతో విజయనగరం మూడో స్థానంలో నిలిచాయి. రాజధాని నిర్మాణం పూర్తి కాకుండానే, ఇంకా ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు మొదలు కాని అమరావతిలో కాలుష్యం సగటున 71 పాయింట్లు నమోదు కావడం గమనార్హం. దేశంలో అత్యంత కాలుష్య నగరంగా పేరొందిన ఢిల్లీలో సగటున 208 పాయింట్లు నమోదైంది. ఢిల్లీ తర్వాత నోయిడా 182 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.సత్ఫలితాలు ఇస్తున్న చర్యలునేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్క్యాప్) కింద దేశ వ్యాప్తంగా 130 నగరాలు, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు కొన్ని పట్టణాల్లో సత్ఫలితాలిస్తున్నాయి. మన రాష్ట్రంలో విజయవాడలో కాలుష్యం బాగా తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2022–23లో 90 పాయింట్లుగా ఉన్న కాలుష్య స్థాయి 2023–24 నాటికి 61 పాయింట్లకు తగ్గింది. కడపలో 57 నుంచి 42 పాయింట్లకు, కర్నూలులో 64 నుంచి 56, నెల్లూరులో 56 నుంచి 52, శ్రీకాకుళంలో 71 నుంచి 68, విజయనగరంలో 75 నుంచి 73 పాయింట్లకు తగ్గింది.మిగిలిన పట్టణాల్లో కాలుష్య స్థాయి పెరిగింది. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి బీఎస్6 ప్రమాణాలను అమలు చేయడం, పాత వాహనాలను తుక్కు చేసిన వారికి ప్రోత్సాహకాలు అందించడం, చెత్తను సమర్థవంతంగా నిర్వహించడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కనీసం 5 శాతం వ్యవసాయ వ్యర్థాలను వినియోగించేలా నిబంధనలు తీసుకురావడం వంటి అనేక చర్యలను కేంద్రం అమలు చేస్తోంది. -
గతి తప్పిన రిమ్స్
కడప టాస్క్ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్, రిమ్స్)లో వైద్యులు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ గతి తప్పుతోంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తుంటారు. వీరుగాక కొందరు వైద్యులు మాత్రం తమకు నచ్చిన, తమను మెచ్చిన వైద్యులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని ‘రిమ్స్’ ప్రాంగణంలోనే తిరుగుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. కొందరు డాక్టర్లు తమకేమీ పట్టనట్లు బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ వేసిన తరువాత అలా బయటకు వెళ్లి టిఫిన్లు, కాఫీలను ముగించుకుని ఎంచక్కా 9 గంటలకు పైగా తమకు నచ్చిన సమయంలో వచ్చి విధులను నిర్వహిస్తుంటారు. మరికొందరు ఇంటి నుంచి తమ, తమ సొంతకారులో ఐపీ విభాగానికి వారి వార్డులకు వెళ్లి అక్కడ విధులను నిర్వహిస్తున్న హౌస్సర్జన్లు, పీజీలకు విధులను అప్పజెప్పి ‘హాయ్, బాయ్’ అని చెపుతూ తమదారిన తాము కారు పార్కింగ్ దగ్గరకు వచ్చేస్తారు. తరువాత రిమ్స్ ఆవరణంలోనూ, రిమ్స్ ఆవరణం చుట్టూ బైపాస్ రోడ్లలోకి వెళ్లి తమ ‘ఇష్టాలు, కష్టాలు’ పంచుకుని మరలా వైద్యాఽధికారులు రౌండ్స్కు వచ్చే సమయానికి ఎంచక్కా విధులకు హాజరై కాలక్షేపం చేసి సమయం పూర్తికాగానే ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● మంగళవారం ఓపీ విభాగంలో కొన్ని విభాగాలలో హెచ్ఓడీలు, వైద్యులు ఎంచక్కా విధులకు వస్తే కొన్ని విభాగాలలో మాత్రం హౌస్సర్జన్లు, పీజీ వైద్యులు మాత్రమే వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. మహిళా ఆర్థోపెడిక్ విభాగానికి వైద్యులు అస్సలు అరగంటపైగా దాటినా రాకపోవడం గమనార్హం. ఈ విధులకు హాజరుకాని వైద్యులలో ఇద్దరు గతంలో బయోమెట్రిక్కు వేలిముద్రలు మాయం చేసి, అవి అధికారుల దృష్టికి వెళ్లడం, ప్రతి చర్యగా సదరు వైద్యులను కొన్ని నెలలపాటు కలెక్టరేట్లో విధులు నిర్వహించేలా చేసినా వారి పద్ధతిని మార్చుకోలేదనే ప్రజలు అనుకుంటున్నారు. ● పరిపాలనా విభాగంలో ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీ ఎంబర్స్మెంట్ ‘బిల్లులు’ మంజూరు కావాలంటే తప్పనిసరిగా ‘చేయి తడపాల్సిందే’. తమకు అనూకూలంగా పర్సెంటేజీల వంతుగా చేతులు తడిపితే కానీ ఫైళ్లు ముందుకు కదలవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులైనా, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వైద్యులకై నా ఈ తిప్పలు తప్పడం లేదంటున్నారు. ● ఇక్కడ పనిచేస్తున్న కొన్ని విభాగాల వైద్య సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ చార్ట్లను వేయడంలో కొందరు నకిలీ విలేకరుల ప్రమేయం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు మహిళా అధికారులను ఏకంగా సదరు నకిలీ విలేకరులు, ఫోన్లలో బెదిరించడం సదరు అధికారులు, మహిళా సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లుగా, తాము ఎవరికై నా చెప్పుకుంటే తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగినట్లుగా భావిస్తూ ‘పంటి బిగువు’న ఆ వేధింపులను, వెకిలి చేష్టలను సైతం భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్కు తాళం.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఓపీలో క్యాంటీన్ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేవి. ఈ క్యాంటీన్కు వచ్చే రోగులు, వారి సహాయకులు బయటకు వెళ్లకుండానే తక్కువ ధరలకే టీ, కాఫీ, వాటర్ బాటిళ్లు, ఇతర అల్పాహార సేవలను పొందేవారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా సేవలను అందుకునేవారు. కాస్త ఉపశమనం పొందేవారు. గడువు ముగిసిన తరువాత అధికారులు నిబంధనల మేరకు టెండర్లను పిలవకుండానే.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మనిషినంటూ ఓ వ్యక్తి వచ్చి క్యాంటీన్కు తాళం వేసి ఎంచక్కా వెళ్లాడు. ఓ ప్రైవేట్ వ్యక్తి వచ్చి తాను ఎమ్మెల్యే మనిషినంటూ క్యాంటీన్కున్న రెండు వాకిళ్లకు తాళాలు వేసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు సైతం తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారం తెలిసినా తమకేమీ పట్టనట్లు, తెలియనట్లు అధికారులు సైతం వ్యవహరించడం కొసమెరుపు. ఉదయం 9:20 అవుతున్నా విధులకు రాని ఆర్థోపెడిక్ వైద్యులు వైద్య సిబ్బంది డ్యూటీ చార్ట్లలో నకిలీ విలేకరుల ప్రమేయం మెడికల్ రీ ఎంబర్స్మెంట్ బిల్లుల మంజూరులో ‘చేతులు తడపాల్సిందే’ ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్కు తాళాలు వేసినా పట్టించుకోని అధికారులు -
పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్జెండర్ల ఆందోళన
కడప అర్బన్ : సహచర ట్రాన్స్జెండర్కు మోసం చేసిన కడప నగరం అశోక్ నగర్ చెందిన యువకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పలువురు ట్రాన్స్జెండర్లు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా..దేవి అనే ట్రాన్స్జెండర్ను సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు. అయితే దేవి ఆరోగ్యం బాగా లేదని వదిలేశాడన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని కూర్చున్నారు. ఈ ఆందోళనపై స్పందించిన కడప వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బాధితురాలికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఫిర్యాదు చేసిన ట్రాన్స్జెండర్లతో పాటు యువకుడిని పిలిపించి సీఐ బి.రామకృష్ణ మాట్లాడారు. సమస్య సద్దుమణగడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కడప ఒన్టౌన్ ఎస్ఐ అమర్నాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండీయూ ఆపరేటర్లకు చెక్
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరు మండలంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లను కాదని చౌకదుకాణాల డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ చేసే విధంగా అధికార పార్టీ నేతలు హుకూం జారీ చేశారు. నేతల ఆదేశాలకు అధికారులు తలూపడంతో అటు కార్డుదారులతోపాటు ఇటు ఆపరేటర్లు నష్టపోతున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 144 చౌకదుకాణాలు ఉన్నాయి. ఈ చౌకదుకాణాల పరిధిలో 70వేల రేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ తీసుకునేందుకు కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొన్ని ప్రాంతాలతోపాటు అసలు రేషన్ షాపులు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్ అందిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా రేషన్ షాపులన్నీ టీడీపీ నేతలు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ వర్గీయులకు రేషన్షాపులను ఇవ్వాలని అధికారులకు సిఫారసు లేఖలు పంపించారు. ఈ కారణంగా ప్రస్తుతం చౌకదుకాణాలన్నీ టీడీపీ వర్గీయుల చేతిలో ఉండగా ఎండీయూ ఆపరేటర్లు మాత్రం గత ప్రభుత్వంలో నియమించిన వారే ఉన్నారు. సాంకేతిక సమస్యలతోపాటు బ్యాంక్ లోన్ కారణంగా ఆపరేటర్లను తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా తాము ఆదాయం కోల్పోతున్నామని భావించిన డీలర్లు అధికార పార్టీ నేతలను ఆశ్రయించి ఆపరేటర్లను నిలుపుదల చేస్తూ నేతల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ కొనసాగుతుండగా ప్రొద్దుటూరులో మాత్రమే బ్రేక్ పడింది. మా పొట్ట కొట్టకండి తమను తొలగించి తమ పొట్ట కొట్టొద్దని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులమైన తాము ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే వేతనంతో జీవనం సాగిస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చని, అందరి పొట్టకొట్టడం సరైన విధానం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆథరైజేషన్ వేస్తేనే పంపిణీ గత ప్రభుత్వంలో అమలు చేసిన నిబంధనల ప్రకారం గోడౌన్ నుంచి డీలర్లు సరుకును ప్రతి నెల తీసుకోవాల్సి ఉంటుంది. డీలర్ తీసుకున్న సరుకును ఎండీయూ ఆపరేటర్కు ఇవ్వడం, ఈ పాస్ మిషన్లో ఆథరైజేషన్ వేసి వారు కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రతి ఎండీయూ ఆపరేటర్కు ప్రతినెల రూ.21వేలు వేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. డీలర్లకు చౌకదుకాణాలను అప్పగిస్తే ఎండీయూల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వ్యాన్లన్నీ ఆపరేటర్ల పేరుతోనే ఉన్నాయి. అన్ని చోట్ల డీలర్లే పంపిణీ చేస్తున్నారు ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 43 మంది ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో 26 మంది మున్సిపాలిటీ పరిధిలో ఉండగా 17 మంది మండల పరిధిలో ఉన్నారు. తొలి రోజు అన్ని చోట్ల డీలర్లే బియ్యం పంపిణీ చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారి మాట్లాడుతూ ఎండీయూ ఆపరేటర్లకు సంబంధించిన ఈ పాస్ మిషన్ ఆథరైజేషన్ ఫింగర్ వేసి డీలర్లకు అప్పగించాలని చెప్పినట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేయడం వల్ల కార్డుదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యల్లయ్య, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్చార్జి గడ్డం నరసింహా తదితరులు మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సాయినాథ్రెడ్డికి వినతి పత్రం అందించారు. బడుగు బలహీన వర్గాల వారు రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. వ్యవస్థను పటిష్టం చేసి సక్రమంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరారు. రేషన్ షాపుల్లోనే బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు పొట్టకొట్టొద్దంటున్న ఎండీయూ ఆపరేటర్లు ప్రొద్దుటూరులోనే అమలు కార్డుదారులకు తప్పని ఇబ్బందులు -
చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు
పులివెందుల రూరల్ : చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి ఎం.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పులివెందుల ప్రభుత్వ గిరిజన సమీకృత బాలికల వసతి గృహంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నపిల్లలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరోధించేందుకు సుప్రీంకోర్టు 2012 నవంబర్ 12వ తేదీన పోక్సో చట్టం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కిశోర్ కుమార్ రెడ్డి. పాలగిరి ప్రకాష్, వార్డెన్ కళావతి, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. -
విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తనపై విచారణ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని శివానగర్లో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్లో గత నెల 29న 4వ తరగతి విద్యార్థిని పట్ల అన్వర్బాషా అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మంగళవారం ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్రెడ్డి విచారణ చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ విచారణలో భాగంగా తొలుత పాఠశాలకు వెళ్లి పాఠశాల కరస్పాండెంట్ను, తోటి ఉపాధ్యాయులను విచారించారు. అలాగే అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎన్ని నెలలుగా పాఠశాలలో పనిచేస్తున్నాడనే విషయంపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, విచారణలో సేకరించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓలు చెన్నయ్య, రఘురాములు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈత కొమ్మలకు భలే గిరాకీ
పులివెందుల రూరల్ : వేసవి కాలంలో ఈత కొమ్మలకు భలే గిరాకీ ఏర్పడింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఈత కొమ్మలను కొనుగోలు చేసి వాటిని అరటి మొక్కలకు అండగా ఈత కొమ్మలను నాటుతారు. పులివెందుల ప్రాంతంలో అరటిని ఎక్కువ సాగు చేయడంవల్ల అరటి పిలకలు నాటినప్పుడు ఆ పిలకలు ఎండ వేడిమి నుంచి, వివిధ రకాల అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు ఈత కొమ్మలను రైతులు అరటి పిలకల పక్కనే నాటుతారు. హిందూపురం, పెనుగొండ, సత్యసాయి, అనంతపురం ప్రాంతాల నుంచి ఈత కొమ్మలను చెట్ల నుంచి కోసుకొని వచ్చి పులివెందుల ప్రాంతంలో ఒక్కో ఈత కొమ్మను రూ.5ల చొప్పున విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా సంబేపల్లె : చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడింది. కడప నుంచి సిలిండర్ ఫుల్ లోడుతో నిమ్మనపల్లెకు వెళుతున్న లారీ మండల కేంద్రంలోని వడ్డపల్లె క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శివకు గాయాలయ్యాయి. -
కరువు మండలాల ప్రకటనలో అన్యాయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలోని పడమటి ప్రాంతాలను ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలను విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర కరువు, 1 మండలంలో సాధారణ కరువు ఉన్నట్లు మొత్తం పది మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఎలాంటి నీటి పారుదల సౌకర్యం లేని కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని మెట్ట (వర్షాధారం) మండలాలను ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కరువు మండలాల సంఖ్య పెరిగే కొద్దీ పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కరువు మండలాలను తగ్గిస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ఉచితంగా పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా మంజూరు చేయాలన్నారు. వలసలను నివారించేందుకు ఉపాధి హామీ దినాలను పెంచాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేసీ బాదుల్లా పాల్గొన్నారు. పశ్చిమ మండలాలను విస్మరించారు.. కడప జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మండలాల్లో గత ఖరీఫ్, రబీ సీజన్లో అతివృష్టి, అనావృష్టితో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని రైతు సంఘాలతో గాని, వివిధ పార్టీల ప్రతినిధులతో గాని మాట్లాడకుండా, జిల్లాలోని అన్ని మండలాలు పర్యటించకుండా, రైతాంగంతో మాట్లాడకుండా, జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన అరకొర సమాచారంతో కేంద్ర ప్రభుత్వ కరువు బృందం జిల్లాలోని 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. ఆ మండలాల్లో కడప జిల్లా పశ్చిమ మండలాలు ఏ ఒక్కటీ లేకపోవడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ, కేవలం పది మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయమన్నారు. -
నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిల విడుదల, సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్, మెడికల్ బిల్లుల రీఎంబర్స్మెంట్, కారుణ్య నియామకాలు తదితర సమస్యల సాధన కోసం ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2వ తేదీ బుధవారం కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలోని ఎస్టీయూ కార్యాలయంలో నిరసన కార్యక్రమానికి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యుడు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఆర్.అబ్దుల్లా, నాయకులు ఖాదర్ బాషా, రాజశేఖర్, నరసింహారావు, సాజిద్, బాలగంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్పై టీడీపీ వర్గీయుల దాడి చెన్నూరు(వల్లూరు) : మండల కేంద్రమైన చెన్నూరులో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మిట్టా మాధవరెడ్డిపై దాడి చేశారు. టీడీపీ నేతలు, మద్దతుదారులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తూ, వారి అక్రమ ధనార్జనకు అడ్డుగా మారాడనే అక్కసుతో ఆ పార్గీకి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలిలా.. చెన్నూరుకు చెందిన మిట్టా మాధవరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మండలంలో టీడీపీ నేతలు, వారి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీడీపీ వర్గీయులకు ఇది కంటగింపుగా మారింది. తమ ఆదాయాలకు గండి కొడుతున్నాడనే కారణంగా అతనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు అదును కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చెన్నూరులోకి కొత్త రోడ్డులో గల ఒక హోటల్లో ఉన్న మాధవ రెడ్డిపై టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవరెడ్డిని పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరామర్శించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవరెడ్డిని పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వామ్మో.. ఎలుగుబంటి
అట్లూరు : అట్లూరు మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఎలుగుబంటి సంచారం గ్రామస్తులను హడలెత్తిస్తోంది. అసలే ఎండలు ఆపై ఉక్కపోత తట్టుకోలేక రాత్రివేళల్లో గ్రామస్తులు ఆరుబయట నిద్ర పోతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా నల్లకుంట చెరువు లోని కంపచెట్ల నుంచి రాత్రి వేళల్లో ఎలుగుబంటి వీధుల్లోకి వస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే కుక్కలు వెంటబడడంతో ఎలుగుబంటి కంపచెట్లలోకి వెళుతోందని, ఎప్పుడు ఎవరిమీద పడి దాడి చేస్తుందో అని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.కడప ఉక్కు పరిశ్రమపై స్పందించాలిప్రొద్దుటూరు : కడప ఉక్కు పరిశ్రమపై రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారన్నారు. 11 ఏళ్లు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనలకే పరిమితం చేశారన్నారు. రాయలసీమ ప్రజలను ఓట్లు, సీట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.ఉరి వేసుకుని యువతి ఆత్యహత్యపోరుమామిళ్ల : మండలంలోని రాజాసాహేబ్పేట పంచాయతీ తిరువెంగళాపురానికి చెందిన కల్లూరి రామతులసి(25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. వివాహ సంబంధాల విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి జయరామిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.పదో తరగతి విద్యార్థిని అదృశ్యంలక్కిరెడ్డిపల్లి : మండలంలోని కాకులవరం గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని చివరిరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసి కనిపించలేదని బాలిక తల్లిదండ్రులు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర బాబు తెలిపారు.