YSR
-
ఏడాది పాలన అంతా మోసం
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసపూరితమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పులివెందులలోని తన స్వగృహం వద్ద మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం రూ.1.51 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగిందని, కానీ ప్రజలకు మాత్రం ఏ సంక్షేమ పథకాన్ని అందజేయలేదన్నారు. రైతు భరోసా, అమ్మఒడి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇలా అనేక రకాల హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో మొదటి ఏడాది పాలనలో సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులు, 2.75 లక్షల మంది వలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. అలాగే పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేశారన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. అమ్మఒడి ద్వారా విద్యా ర్థుల తల్లులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్స్, నోటు బుక్స్ వంటివి విద్యా కా నుక ద్వారా అందించారని తెలిపారు. మహిళల భద్ర త కోసం దిశ యాప్ను ప్రవేశ పెట్టారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అందించడమేకాక రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేశారన్నా రు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం అప్పట్లో కొనుగోలు చేసిందన్నారు. ప్రజల కు ఇచ్చిన ఏ హామీని విస్మరించకుండా కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దేశంలోనే ఒక్క వైఎస్ జగనన్నకే దక్కుతుందన్నారు. అలా కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వ హించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. జర్నలిస్టుల క్రికెట్ టీంను అభినందించిన ఎంపీ గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలలో విజేతగా నిలిచిన కడప జర్నలిస్టుల టీంను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పట్టణంలోని తన నివాసం వద్ద అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే క్రీడలలో రాణించాలని ఆయన కోరారు. త్వరలో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు పులివెందులలో నిర్వహించాలని, అందుకు తాను పూర్తిగా సహకరిస్తానని జేశాప్ నాయకులకు హామీ ఇచ్చారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసిన వారిలో జేశాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, జేశాప్ రాష్ట్ర సలహాదారు భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టా మాధవరెడ్డి, టీం సభ్యులు షరీఫ్, పఠాన్, శేషు, అరుణ్, ప్రభంజన్ రెడ్డి, జయ రామకృష్ణారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, శివకేశవరెడ్డి, సురేంద్ర తదితరులు ఉన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో సీ్త్ర, పురుషులకు 100 మీ., 200 మీ., 400 మీ., 800 మీటర్లు పరుగు పోటీలు, లాంగ్జంప్, షార్ట్పుట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 70 మంది పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈనెల 14, 15 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహమర్ బాషా తెలిపారు. ఎం.లోకేశ్వరరావు, జి.సింహాచలం, పి.మంజునాథ, బి.యేసు వరప్రసాద్, కె.మహేష్, బి.మల్లికార్జున, ఆర్.మునినరేంద్ర, డి.నీలా మహేశ్వరి, ఎస్.స్నేహలత, నాగనవీన రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు నాగేశ్వరరావు, ఖాదర్ రెడ్డి, కుమార్, దిలీప్, కోచ్ అనిల్ పర్యవేక్షించారు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు క్రీడాకారుల ఎంపికప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణానికి చెందిన మై స్పేస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు అకాడమీ డైరెక్టర్ మాస్టర్ సలీం తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో ఫాతిమా, అలోక్య, హసేన్ సత్తా చాటి బంగారు పతకాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. అలాగే క్యాడెట్ విభాగంలో హసేన్, కౌసర్ బంగారు పతకాలు సాధించారన్నారు. ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను చీఫ్ కోచ్ మహబూబ్ బాషా, కోచ్లు ఇస్మాయిల్, రియాజ్, సాయికళ్యాణ్ అభినందించారు. -
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో రుచికరమైన భోజనం అందించాలని పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక రాష్ట్ర డైరెక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన స్వయంగా భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ చేసినందున విద్యార్థులు ఎలా తింటున్నారని అడిగి తెలుసుకున్నారు. వంటల నిర్వాహకులు పరిశుభ్రంగా ఉండాలని, వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి వచ్చిన పాఠ్య పుస్తకాలు, విద్యా సామాగ్రిని ఆయన పరిశీలించారు. పాఠ్య పుస్తకాలన్నింటిని పాఠశాలలకు సరఫరా చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓ శోభారాణి, అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం గీత, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.గడ్డిమందు తాగి వ్యక్తి మృతికాశినాయన : మండలంలోని కొండ్రాజుపల్లె గ్రామానికి చెందిన కుమారి రమణయ్య (52) అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతి చెందాడు. కాశినాయన ఎస్ఐ యోగేంద్ర తెలిపిన వివరాల మేరకు.. మృతుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడని, దీంతో పాటు అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఈనెల 10న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి కడపలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా గురువారం రమణయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య సుబ్బలక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.వృద్ధురాలి అదృశ్యంప్రొద్దుటూరు క్రైం : పట్టణానికి చెందిన నాగమ్మ అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగమ్మ మే 27న స్థానిక రామేశ్వరం మునిస్వామి దేవస్థానం ఎదురు వీధిలో ఉన్న తన చిన్న కుమారుడు గంగాధర్ ఇంటి నుంచి మనస్థాపంతో వెళ్లిపోయిందని కుమారులు గంగాధర్, బాబులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిజమ్మలమడుగు రూరల్ : మోరగుడి గ్రామానికి చెందిన చాకలి అంకాలయ్య (38) అనే వ్యక్తి గురు వారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ హైమావతి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మోరగుడి గ్రామానికి చెందిన చాకలి అంకలయ్య గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగా డు. గురువారం ఆరోగ్యం సరిగా లేదని సోదరుడి కుమారుడు యోగేశ్వర్కుతో మాత్రలు తెప్పించుకున్నాడు. మాత్రలు వేసుకున్న తరువాత ఆయాసం ఎక్కువ కావడంతో వెంటనే తమ్ముడు సంజీవకు సమాచారం ఇచ్చారు. ఆటోలో జమ్మలమడుగులో ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా ముక్కులో నుంచి రక్తస్రావమైంది. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘డీఎస్సీ’కి 275 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు గురువారం 275 మంది గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో 8 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1410 మంది అభ్యర్థులకు గాను 1325 మంది హాజరు కాగా 85 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 1410 మందికి గాను 1220 మంది హాజరు కాగా 190 మంది గైర్హాజయ్యారు. మొత్తం 2820 మందికి గాను 2545 మంది హాజరు కాగా 275 మంది గైర్హాజరయ్యారు.వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషికడప అగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లా వ్యవసాయ అధికారిగా కడప కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.డీసీఓ బాధ్యతల స్వీకరణకడప అగ్రికల్చర్: జిల్లా కో ఆపరేటివ్ అధికారి(డీసీఓ)గా వెంకటసుబ్బయ్య గురువారం కడప కలెక్టరేట్లోని కోఆపరేటివ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన కర్నూలు జిల్లా డ్వామా పీడీగా, జెడ్పీ సీఈఓగా పని చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేయడంతోపాటు డీసీఓగా పని చేస్తూ తాజాగా వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.మెరుగైన విద్యే లక్ష్యంకడప ఎడ్యుకేషన్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఇంటర్మీడియెట్ విద్య వైఎస్సార్ కడప జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి(డీఐఈఓ) టీఎన్వీవీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన గురువారం తన చాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని మురుమండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పని చూస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.రామక్రిష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ రవీంద్రారెడ్డి, ట్రెజరర్ రమణయ్య, స్టేట్ కౌన్సిలర్ పద్మావతి, అధ్యాపకులు నాగమహేశ్వరరెడ్డి, హబీబుల్లా సన్మానించారు. -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కడప కార్పొరేషన్ : జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ షఫీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురు ప్రసాద్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ రాష్ట్రంలో 87లక్షల మంది విద్యార్థులు ఉండగా కేవలం రూ.8వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం దారుణమన్నారు. వారందరికీ తల్లికి వందనం ఇవ్వాలంటే రూ.13వేల కోట్లు అవసరమవుతుందని తెలిపారు. విద్యార్థులకు 4 సెమిస్టర్ల ఫీజు రీయంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎక్కువైందని, రకరకాల పేర్లు చెప్పి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, ఈశ్వర్రెడ్డి, సందీప్రెడ్డి పాల్గొన్నారు. -
పాఠశాలను విలీనం చేస్తే ఒప్పుకోం!
చాపాడు: తమ ఊరిలోని పాఠశాలను వేరే గ్రామంలోకి విలీనం చేస్తే ఒప్పుకోబోమని సిద్దారెడ్డిపల్లె వాసులు తేల్చిజెప్పారు. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సిద్దారెడ్డిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఇక్కడ ఉండే 3, 4, 5 తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులను గ్రామ నుంచి 1.50 కిలోమీటర్ల దూరంలో ఉండే మొర్రాయిపల్లె మోడల్ స్కూల్లో విలీనం చేశారు. ఈ క్రమంలో గురువారం విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు రాగా తల్లిదండ్రులు పంపబోమని వారితో చెప్పారు. గతంలో ఇదే విధంగా విద్యార్థులను పంపబోమని చెప్పినప్పటికీ.. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తమ పిల్లలను ఇంటి వద్దనైనా ఉంచుకుంటామని, దూరంగా ఉండే పాఠశాలకు మాత్రం పంపబోమన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. ససేమిరా అన్నారు. కిలో మీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉండే పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే ఆటో చార్జీల కోసం రూ.600 చెల్లించే నిబంధనలు ఉన్నప్పటికీ.. కేవలం ఇక్కడ పాఠశాలల మధ్య వ్యత్యాసం 700 మీటర్లు మాత్రమే ఉన్నట్లు చూపడంతో.. ఆటో చార్జీల చెల్లింపు అవకాశం కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు తమ పిల్లలను ఎలా పంపాలని, దారిలో నడిచి వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. తమ గ్రామం నుంచి మొర్రాయిపల్లెకు ఆటో సౌకర్యం కూడా లేకపోవడంతో.. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని తెలిపారు. లేనిపక్షంలో ఇక్కడి నుంచి తమ పిల్లలను విలీన పాఠశాలకు పంపబోమని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. విద్యార్థులను పాఠశాలకు పంపబోమని తేల్చిచెప్పిన సిద్దారెడ్డిపల్లె గ్రామస్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు -
ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారో చెప్పాలి
అట్లూరు : కేంద్రంలో, రాష్ట్రంలో ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ప్రశ్నించారు. గురువారం బద్వేలు పట్టణంలోని సీపీఐ కార్యాలయం జేవీ భవన్లో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ మహాసభలలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే గొప్పలు చెప్పుకుంటూ ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు ఆచరణలో అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా సహాయ కార్యదర్శి పి.మస్తాన్, పట్టణ కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో కౌన్సిల్ హాలు తెరవాలి
కడప కార్పొరేషన్: ‘కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగే కౌన్సిల్ హాలులో ఏ మర్మం దాగి ఉందో ఎవరికీ తెలియడం లేదు.. నేను స్వయంగా కౌన్సిల్ హాలు తెరవాలని కోరినా కమిషనర్ స్పందించడం లేదు’ అని మేయర్ సురేష్బాబు అన్నారు. గురువారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తోందని, ఏడాది పాలనలో వారు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల్లను అక్రమంగా కై వసం చేసుకుందన్నారు. అందులో భాగంగానే కడప కార్పొరేషన్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్ధిని కనస్ట్రక్షన్స్ సంస్థ తనకు తెలియకుండా రిజిస్టర్ అయిందని, రిజిస్టర్ అయినప్పటి నుంచి ఆ సంస్థ చేసిన పనులు రూ.36 లక్షలలోపే అన్నారు. ఈ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని, నాణ్యతా లోపాలు కూడా లేవన్నారు. అయినా కోట్ల రూపాయలలో స్కాం జరిగిందంటూ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. కార్పొరేటర్లకు ఆహ్వానం పంపకుండా అవమానం కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం నిర్వహించే కౌ న్సిల్ హాలుకు తాళాలు వేశారని, తాళాలు తీసి ఓపె న్ చేయాలని తాను స్వయంగా అడిగినా కమిషనర్ స్పందించడం లేదన్నారు. సమావేశ మందరంలో ఏ మర్మం దాగి ఉందోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. నగరపాలక అధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని, తాళాలు ఎక్కడ ఉన్నాయో కమిషనర్ తెలపాలన్నారు. రెండు రోజుల్లో కౌన్సిల్ హాలు తెరవకపో తే మీడియా సమక్షంలో తామే తాళాలు ఓపెన్ చేస్తా మని హెచ్చరించారు. కడప కార్పొరేషన్లో పాలకవర్గంగా ఉన్న తమ మాట అఽధికారులు వినడం లేదని, అన్ని డివిజన్లలో కార్పొరేటర్లకు ఆహ్వానం పంపకుండా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టం ప్రకారం నడుచుకున్నాం గతంలో మేయర్గా తన విచక్షణాధికారాలను వినియోగించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిసియో సభ్యుల హోదాలో వేదికపై కుర్చీలు వేశామన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి అహంకార పూరిత వైఖరి చూశాక చట్టం ప్రకారం నడుచుకున్నామని, మేయర్కు తప్ప మరెవరికీ వేదికపై కుర్చీలు వేయలేదన్నారు. దీంతో గత రెండు సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవి నానా రచ్చ చేశారని, తాను మేయర్గా ఉంటే కార్పొరేషన్లో తనకు కుర్చీ ఉండదని గ్రహించి తనను ఎలాగైనా దించేయాలని కుట్ర పన్నారన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి పార్టీ మారేలా చేశారన్నారు. మిగతా వారు రాకపోవడంతో తన కుమారుడి కాంట్రాక్టు సంస్థను బూచిగా చూపి అనర్హత వేటు వేయాలని ప్రయత్నించారన్నారు. న్యాయసమ్మతం కాదు ఒక కాంట్రాక్టు సంస్థను మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని.. అయినా చేశారన్నారు. రూ.10 లక్షలలోపు పనులు తన దృష్టికి వచ్చే అవకాశమే లేదన్నారు. దీని ఆధారంగా తనపై అనర్హత వేటు వేయాలనుకోవడం న్యాయసమ్మతం కాదన్నారు. ఈ నెల 16న విచారణకు తప్పకుండా హాజరవుతానని, తన వివరణను ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాకా సురేష్, మల్లికార్జున, రామలక్ష్మణ్రెడ్డి, మగ్బూల్బాషా, డివిజన్ ఇన్చార్జులు శ్రీరంజన్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, సుబ్బరాయుడు, ఐస్క్రీం రవి పాల్గొన్నారు. కార్పొరేషన్కు ‘మహా’ నష్టంమహానాడు సందర్భంగా కడప కార్పొరేషనన్్ పరిధిలో ఎన్నో ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు కట్టారని, కానీ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ చెల్లించలేదన్నారు. దీనివల్ల నగరపాలక సంస్థకు లక్షల రూపాయల్లో నష్టం జరిగిందన్నారు. కార్పొరేషన్లో కమిషనర్ మనోజ్రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని, పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దౌర్భాగ్య పాలన లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. మేయర్గా తనకే ఇలాంటి దౌర్భాగ్య పరి స్థితులు ఉంటే కార్పొరేటర్లు, సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో మీడియా సమక్షంలో తెరుస్తాం నగరపాలక అధికారులుప్రొటోకాల్ పాటించడం లేదు మేయర్గా సురేష్ ఉంటే కుర్చీ ఉండదు..అనర్హత వేటు వేసి తొలగిస్తే అడ్డు ఉండదనే కుట్రలు కడప మేయర్ కె.సురేష్బాబు కీలక వ్యాఖ్యలు -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం
జమ్మలమడుగు : రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు పొగాకు, పత్తి పంటలను సాగు చేసుకోమని ప్రోత్సహించిందని, పంట చేతికి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం జమ్మలమడుగులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో పర్యటిస్తే ఆయనపై కూటమి నాయకులు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రతి పనికి కప్పం కట్టించుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితులు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడంతో వైఎస్సార్సీపీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపారన్నారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటుధరతోపాటు రైతులకు ఆర్బీకే సెంటర్ల ద్వార నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నేరుగా గ్రామాలలోనే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, రైతు నాయకులు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి -
దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు
ప్రొద్దుటూరు : దేవదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్తోపాటు ఈఓలకు ఈనెల 3వ తేదీన లోకాయుక్త నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో చోటు చేసుకున్న అవినీతిపై సమాధానం చెప్పాలని లోకాయుక్త కోరింది. గీతాశ్రమంలోని ఈఓ కార్యాలయంలో అటెండర్గా పని చేసిన బి.జనార్ధన్రెడ్డికి ఈఓ రామచంద్రాచార్యులు వేతన రూపంలో రూ.5 లక్షలు చెల్లించారు. గీతాశ్రమం నిర్వహణకు సంబంధించిన డబ్బును ఇందుకోసం వినియోగించారు. గతంలో ఇదే కార్యాలయంలో పని చేసిన జనార్ధన్రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్న గంగాధరానంద గిరి స్వామి తొలగించారు. 2021 జూలై నుంచి జనార్ధన్రెడ్డి విధులకు హాజరు కాకపోగా.. రోజూ కార్యాలయ పరిసరాలకు వచ్చి గూగుల్ ద్వారా ఫొటోలు తీసుకుని కోర్టును ఆశ్రయించాడు. తాను రోజు విధులకు హాజరవుతున్నానని తెలిపాడు. కోర్టు నోటీసు మేరకు గతంలో పని చేసిన దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్.. జనార్ధన్రెడ్డి ప్రవర్తన సరిగా లేని మాట వాస్తవమేనని, గంగాధరానందగిరి స్వామి ఇచ్చిన లేఖను సమర్పిస్తూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి జనార్ధన్రెడ్డికి, గీతాశ్రమానికి సంబంధాలు లేవు. కాగా ఇటీవల ఈఓ రామచంద్రాచార్యులు అతనికి లీజు బకాయిలు ఉన్నాయని చెప్పి రూ.5 లక్షలు చెల్లించడం జరిగింది. విధులకు రాని వ్యక్తికి రూ.5 లక్షలు దేవదాయ శాఖ సొమ్మును ఎలా చెల్లిస్తారని, దీనిపై విచారణ జరిపి ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని కోరుతూ పర్లపాడు గౌరీశంకర్ అనే వ్యక్తి లోకాయుక్తలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులకు లోకాయుక్త నోటీసులు అందాయి. ఏకంగా కమిషనర్ ఉత్తర్వులను కాదని ఈఓ రామచంద్రాచార్యులు అప్పనంగా జనార్ధన్రెడ్డికి డబ్బు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. జనార్ధన్రెడ్డిని తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులు, కమిషనర్ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ కాదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఇలా చేశారు. ఇది ఇలా ఉండగా ఈఓగా పని చేసిన రామచంద్రాచార్యులు గత నెలాఖరునే పదవీ విరమణ చెందారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. గీతాశ్రమానికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువలా ఉన్నా.. దేవదాయశాఖ అధికారులు ఇంకా నిద్రమత్తు వీడలేదు. శ్రీకృష్ణ గీతాశ్రమంలోని అవినీతిపై ఆరా రూ.5 లక్షల చెల్లింపుపై వివాదం కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కిన వైనం -
చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాలి
ప్రొద్దుటూరు రూరల్ : పిల్లలకు చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. గత నెల 23వ తేదీన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను గురువారం ప్రొద్దుటూరు మండలం అమృతానగర్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ పరామర్శించారు. హత్యకు గురైన చిన్నారి తల్లి స్నేహతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను పని వద్ద నుంచి ఇంటికి వచ్చే సరికి తన కూతురు గుండెలపై కూర్చొని ముద్దు ముద్దు మాటలతో నవ్విస్తూ ఉండేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి ఫొటోలను చైర్పర్సన్కు చూపించి స్నేహ విలపించారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ నిందితుడు తనకు తాను శిక్ష వేసుకున్నా హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తరపున రూ.4,12,500 చెక్కు అందించామని, మరో రూ.4.5 లక్షలు త్వరలోనే ఇస్తామన్నారు. కాగా చిన్నారి తండ్రి చెన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు కోరారు. ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు భావన, భవాని, తహసీల్దార్ గంగయ్య, ఐసీడీఎస్ రూరల్ సీడీపీఓ అరుణకుమారి పాల్గొన్నారు. -
చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిందేమీ లేదు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించింది ఏమీ లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. గురువారం కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా సూపర్ సిక్స్కు, ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. ఉచిత ప్రయాణంపై పండుగల పేరు చెప్పి కాలయాపన చేశారన్నారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలకు దిక్కులేదన్నారు. రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల కాలపరిమితికి సంబంధించిందని, ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇస్తూ 20 లక్షల మంది విద్యార్థులను మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ మోసమేనన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉండగా, కత్తెర పేరుతో 45 లక్షల మంది రైతులకు ఇస్తున్నారన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు సాధించిన ప్రగతి అప్పులు తీసుకోవడం, బీజేపీకి ఊడిగం చేయడమేనని ధ్వజమెత్తారు. బీజేపీని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు -
చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం
రాజంపేట టౌన్ : చదువుకోవాలన్న ఆసక్తి ఉండి కుటుంబ పరిస్థితులు అనుకూలించక నిత్యం, స్కూల్ లేక కళాశాలకు వెళ్లలేని వారికి ఓపెన్ స్కూల్ బాసటగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నామమాత్రపు ఫీజుతో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఏపీ ఓపెన్ స్కూల్) రాష్ట్ర ప్రభుత్వం దూర విద్యను అందిస్తుంది. రెగ్యులర్ చదువుతో సమానమైన ఈ కోర్సుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకునేందుకు అర్హులే. రెగ్యులర్గా చదివి టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వారు, చదువు మధ్యలో నిలిపేసిన వారు, తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు, గృహిణులు, ప్రజా ప్రతినిధులు ఇలా ఎవరైనా ఓపెన్ స్కూల్లో చేరవచ్చు. గతంలో ఈ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో చదువుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల.. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు ఈ ఏడాది జూలై 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్లో ప్రవేశానికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదివి వుంటే రికార్డు షీటు, ఆరవ తరగతి నుంచి ఆపై చదివి వుంటే టీసీ, టెన్త్ ఫెయిల్ అయివుంటే టీసీతో పాటు ఫెయిల్ అయిన మార్కుల మెమో కలిగి వుండాలి. ఇక ఏమీ చదవకుండా ఉంటే సంబంధిత అధికారులు జారీ చేసే జనన ధృవీకరణ పత్రం కలిగివుంటే టెన్త్లో ప్రవేశానికి అర్హులవుతారు. టెన్త్లో ఐదు సబ్జెక్ట్లు ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్గా హిందీని తీసుకోవచ్చు. ఇక టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులు. ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు తీసుకున్నా ఐదు సబ్జెక్టులు చదవాల్సి వుంటుంది. రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానం.. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్కు రెగ్యులర్ విద్యార్థుల సర్టిఫికెట్తో తత్సమానంగా ప్రాధాన్యత ఉంటుందో ఉండదో అని చాలా మందిలో అపోహ వుంది. అయితే అది అవాస్తవం. ఓపెన్ స్కూల్ సొసైటీ జారీ చేసే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సాధారణ పాఠశాల విద్య, కళాశాల విద్య సర్టిఫికెట్లతో సమానం. ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జిల్లాలో 41 స్టడీ సెంటర్లు.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో టెన్త్, ఇంటర్మీడియట్కు సంబంధించి 41 కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో స్టడీ సెంటర్లో టెన్త్లో 100 సీట్ల చొప్పున ఉంటాయి. అలాగే ఇంటర్లో నాన్ సైన్స్ గ్రూపులకు సంబంధించి 40 సీట్లు, సైన్స్ గ్రూపులకు సంబంధించి 100 సీట్లు ఉంటాయి. అడ్మిషనన్ పొందిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది. ప్రతి ఆదివారం, రెండవ శనివారం వంటి సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తారు. దాదాపు 30 కాంట్రాక్టు తరగతులను నిర్వహిస్తారు. ఇందులో 24 కాంట్రాక్టు తరగతులకు హాజరైన వారికి మాత్రమే పబ్లిక్ పరీక్షక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. విద్యార్థులు వెంటనే ఉత్తీర్ణులు కాకుంటే ఐదు సంవత్సరాల్లో తొమ్మిది మార్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చు. ఇంటర్లో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు.. ఇంటర్మీడియట్లో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ గ్రూపులు ఉంటాయి. ఇందులో విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపులో చేరవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా మీడియంలు ఉన్నాయి. వీటిలో విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. టెన్త్ ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే ఇంటర్ చేరితే ఇంటర్మీడియట్లో నాలుగు సబ్జెక్ట్లు మాత్రమే పరీక్ష రాసుకోవాల్సి వుంటుంది. ఆ తరువాత ఏడాది మరొక సబ్జెక్ట్ రాసుకోవాల్సి వుంటుంది. టెన్త్ ఉత్తీర్ణులైన తరువాత ఒక ఏడాది గ్యాప్ ఉంటే ఐదు సబ్జెక్ట్లు ఒకేసారి రాసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ :30–7–2025 200 రూపాయల అపరాధ రుసుముతో 1–8–2025 నుంచి 15–8–2025 వరకు ప్రవేశం పొందవచ్చు. ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వయసుతో సంబంధం లేకుండా చదువుకునేందుకు అందరూ అర్హులే టెన్త్, ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలికొత్త స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఏడాది కొత్తగా ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి గల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వివిధ కారణాల రీత్యా రెగ్యులర్గా టెన్త్, ఇంటర్మీడియట్ చదవలేని వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకోవడానికి ఇది చాలా చక్కటి అవకాశం. ఈ ఉత్తీర్ణత సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు వుంది. అందువల్ల ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి. – కొండూరు శ్రీనివాసరాజు, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
చింతకొమ్మదిన్నె : కడప నగరం సాక్షి సర్కిల్ నుంచి రాయచోటి సర్కిల్ వైపునకు వెళుతూ జయరాజ కల్యాణ మండపం సమీపంలో రింగు రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశాంత్ (23)కు తీవ్ర గాయాలవగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్సు ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు ప్రకాశం జిల్లాకు చెందిన వారని సమాచారం.కారు వ్యవహారంలో వ్యక్తి అరెస్టుప్రొద్దుటూరు క్రైం : కారు కొనుగోలు వ్యవహారంలో ఓ పాఠశాలలో పనిచేస్తున్న గణేష్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. గణేష్ రూరల్ పరిధిలోని ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం గుంటూరు జిల్లాలోని వినుకొండలో ఉంటున్న కోటేశ్వరరావు స్కార్పియో వాహనాన్ని అద్దె ప్రాతిపదికన తెచ్చుకున్నాడు. అద్దె డబ్బులను కారు కంతులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని రోజులు గణేష్ అద్దె చెల్లించాడు. తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో కొన్ని రోజుల క్రితం కోటేశ్వరరావు ప్రొద్దుటూరుకు వచ్చి పాఠశాల ఆవరణలో స్కార్పియో కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గణేష్ అడ్డుకొని బలవంతంగా అతన్ని బయటకి తోసేశాడు. దీంతో కోటేశ్వరరావు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం గణేష్ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. పట్టపగలే యువకుడి కిడ్నాప్కలకడ : పట్టపగలే యువకుడిపై దాడిచేసి కిడ్నాప్ చేసిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం కలకడ టౌన్లో జరిగింది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు.. కలకడ టౌన్ గుర్రంకొండ రోడ్డు సందువీఽధికి చెందిన పర్వీన్ను ఐదేళ్ల కిందట రాయచోటికి చెందిన ఖాజాకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఖాజా భార్య పర్వీన్ అన్నదమ్ములకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన నగదు ఇవ్వాలని నాలుగు సంవత్సరాలుగా కోరుతున్నా తిరిగి చెల్లించడం లేదని ఖాజా మంగళవారం మధ్యాహ్నం మరో ఆరుగురు అనుచరులతో కలకడకు వచ్చి తౌలిక్ ఆలీని కిడ్నాప్ చేశారు. కట్టి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. బుధవారం కిడ్నాప్కు గురైన తౌలిక్ అల్లి (లాలు)తల్లి షేక్ కౌషిక్ ఫిర్యాదు మేరకు ఖాజా, మరో ఆరుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు.ఏడుగురిపై కేసు నమోదు -
షర్మిల సమావేశాన్ని శాంతియుతంగా అడ్డుకుంటాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని ఐఎంఏ హాల్లో 12న జరగబోయే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమావేశాన్ని శాంతియుతంగా గాంధేయమార్గంలో అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎ.సత్తార్, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు నాసిర్ హుస్సేన్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ, పేర్కొన్నారు. నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనుకున్నామన్నారు. కానీ టీడీపీకి ఆమె కోవర్టుగా పనిచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారన్నారు. సీనియర్ నాయకులను దూరం చేస్తూ తనకు కావాల్సిన వారిని పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నజీర్అహ్మద్ను ఏఐసీసీ ఎన్నిక చేస్తే చివరి నిమిషంలో తెలంగాణకు చెందిన ఆర్థిక నేరగాడికి టికెట్ ఇచ్చారన్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎస్ఎ.సత్తార్, ఖాశీంఖాన్లకు ఇవ్వాలని బలపరిచినా కర్ణాటకకు చెందిన వ్యక్తికి కేటాయించి పార్టీకి నష్టం కలిగేలా చేశారన్నారు. షర్మిల నాయకత్వాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ్, నాసిర్ఖాన్, కర్నాటి చంద్రశేఖర్రెడ్డి, అన్వర్, జాన్బాషా, రత్నకుమారి పాల్గొన్నారు. -
హౌసింగ్ బోర్డు చోరీ కేసులో పురోగతి
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన చోరీ కేసులో టూటౌన్ పోలీసులు పురోగతి సాధించారు. బుధవారం రాత్రి సీఐ సదాశివయ్య కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలోని గోపిరెడ్డి శివశంకర్రెడ్డి ఇంట్లో ఈ ఏడాది మార్చి 15న చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో సుమారు 249 గ్రాముల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. ఈ కేసులోని నిందితులు జంగా వెంకటరావు, సుధాకర్లను ఇటీవల ఇతర జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై ఇద్దరినీ ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచి, కోర్టు అనుమతి మేరకు పోలీస్ కష్టడిలోకి తీసుకొని ఆభరణాలను రికవరీ చేశారు. వీటిలో కొంత బంగారాన్ని నిందితులు విక్రయించారు. బద్వేల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాచిన మిగిలిన 180 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నచౌక్ పరిధిలో జరిగిన చోరీకి సంబంధించిన బంగారు నగలను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన సీఐ సదాశివయ్య, ఎస్ఐలు ధనుంజయ, రాఘవేంద్రారెడ్డి, సిబ్బందిని ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ భావన అభినందించారు. -
నన్నే కారు తీయమంటావా..
పీలేరు రూరల్ : అడ్డంగా పెట్టిన కారు పక్కకు తీయాలని అడిగిన సెక్యూరిటీ గార్డుపై నన్నే కారు తీయమంటావా అంటూ ఓ టీడీపీ నాయకుడు విరుచుకుపడిన సంఘటన బుధవారం జరిగింది. బాధితుడి వివరాల మేరకు.. ఏరియా ఆస్పత్రిలో బుధవారం పట్టణానికి చెందిన తుమ్మల ధరణికుమార్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఆయన విధులు నిర్వర్తించే సమయంలో టీడీపీ నాయకుడు మహేష్ వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో రోడ్డుపై అడ్డంగా కారు పార్క్ చేశాడు. కారు పక్కకు తీయాలని అక్కడే ఉన్న ధరణీ కుమార్ కోరారు. దీంతో ఆవేశంగా నన్నే కారు తీయమంటావా.. అంటూ ధరణికుమార్పై మహేష్ దాడి చేశాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడతో దళిత సంఘాల నాయకులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు టిఎల్.వెంకటేష్, సుధాకర్ బాబు, సుభాష్, బోదేషా పాల్గొన్నారు. -
కొండను తవ్వేస్తూ.. మట్టిని తరలిస్తూ
అధికారం మాదే.. అడ్డెవరన్నట్లు ఓ కాంట్రాక్టర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోకుండా కొండను తవ్వేసి మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి తరలించేస్తున్నారు. ఇదంతా చూస్తున్న అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు : కల్వకుర్తి–నంద్యాల జాతీయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం మీదుగా ముద్దనూరు రహదారిలో కొత్త రోడ్డు వరకు ఈ దారి విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం నంద్యాల–కోవెల కుంట్ల మీదుగా నొస్సం వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. పెద్దముడియం మండలం గుల్లకుంట మీదుగా ఉప్పలపాడు, జమ్మలమడుగు, పెన్నానది మీద నుంచి పాలిటెక్నిక్ కళాశాల వెనుక వైపునా కొత్త రోడ్డు విస్తరణ పనులను ఎస్ఆర్సీప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికార పార్టీ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పెద్దముడియం మండలం నుంచి జమ్మలమడుగు కొత్త రోడ్డు వరకు 22 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పనులు చేపట్టిన గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా..అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా మట్టి తరలింపు రోడ్డు నిర్మాణానికి గుత్తేదారు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ముద్దనూరుకు వెళ్లే రహదారిలో కొండను పొక్లెయిన్ పెట్టి తవ్వేస్తున్నారు. టిప్పర్లు పెట్టి తరలిస్తున్నా.. ఆ వాహనాలన్నీ అధికారుల కళ్లెదుటే తిరిగినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా పనులు చేస్తున్న గుత్తేదారును అడ్డుకునేందుకు అధికారులు జంకుతున్న పరిస్థితి. తమదే అధికారం.. మాకు అడ్డు ఎవరు అంటూ కొండను పిండి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఎలాంటి అనుమతులు లేవు జాతీయ రహదారి కోసం కొండ తవ్వుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంత మట్టి తవ్వారో మొత్తం క్యూబిక్ మీటర్ల మేర కొలిచి చలానా కట్టిస్తాం. అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, జమ్మలమడుగు పొక్లెయిన్తో తవ్వి టిప్పర్లతో మట్టి తరలింపు అధికార పార్టీ గుత్తేదారు నిర్వాకం -
ఆటలకు బై.. పాఠాలకు సై
వేసవి సెలవులు ముగిశాయ్.. దాదాపు రెండు నెలలపాటు తోటి స్నేహితులతో ఆటలాడుతూ గడిపిన చిన్నారులు మళ్లీ టై కట్టి. బూట్లు వేసుకుని.. బడి బాట పట్టనున్నారు. విజ్ఞానం కోసం పలు శిక్షణ శిబిరాల్లో గడిపిన వారంతా ఇపుడు మళ్లీ పాఠాలు నేర్వడానికి సై అంటున్నారు. నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. సెలవుల నేపథ్యంలో నగరం, పట్టణాల్లోని పాఠశాలల్లో చదివే చిన్నారులు ఇంటి బాట పట్టారు. తిరిగి ఇపుడు బడిబాట పట్టి.. గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండులో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ చిన్నారులు గడిపిన క్షణాలు, బస్టాండులో పరిస్థితులపై దృశ్యాలివీ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన దాసరి పవన్ కుమార్(20) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాష్ నగర్కు చెందిన పవన్కుమార్ ప్రొద్దుటూరు సీబీఐటీ కాలేజ్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పి వస్తుండటంతో ఆ బాధను భరించలేక బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఎద్దు మృతికలసపాడు : మండలంలోని ఎగువరామాపురం గ్రామానికి చెందిన ఎనుముల అంకిరెడ్డికి చెందిన ఎద్దు ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృతిచెందింది. బుధవారం అంకిరెడ్డి ఎద్దులను పొలానికి తీసుకెళ్లి ఇంటికి వస్తున్నారు. గ్రామ సమీపంలో కాలువ దాటే క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లిన ఎద్దు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురైన అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఎద్దు విలువ రూ.70వేలు అని రైతు అంకిరెడ్డి తెలిపారు. యువకుడు అదృశ్యం జమ్మలమడుగు రూరల్ (మైలవరం): మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెల్లపు వేణు(32) అదృశ్యమైనట్లు తండ్రి చౌడప్ప మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్యాసుందర్రెడ్డి వివరాల మేరకు.. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెల్లపు వేణు డిగ్రీ పూర్తిచేశాడు. ఇతను ప్రొద్దుటూరు వాస్తు కాంప్లెక్స్లోని నారాయణ స్వామికి చెందిన హర్డ్వేర్ అంగడిలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6వతేదీన ఇంటి నుంచి వెళ్లిన అతడు తరువాత ఇంటికి తిరిగి రాలేదని ఎస్ఐ తెలిపారు. అచూకీ తెలిసిన వారు 9121100608 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
కడప, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఏసీఏ సౌత్ జోన్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టుపై కడప జట్టు ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జట్టులోని మురారి హృదయ్ 66 పరుగులు చేశారు. కడప జట్టులో నాగ కుల్లాయప్ప నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కడప జట్టు బ్యాటింగ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా అంపైర్లు ఓవర్లను కుదించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 37 ఓవర్లలో 164 పరుగుల టార్గెట్ నిర్ణయించారు. అనంతరం 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 30.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప జట్టులోని రోహిత్ వర్మ 68, రణధీర్ రెడ్డి 55 (నాటౌట్) పరుగులు చేశారు. విజయం సాధించిన నెల్లూరు జట్టు.. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం జట్టుపై మూడు వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 47.3 ఓవర్లలో 240 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ చెట్టులోని భువనేశ్వర్ 63, మనోజ్ కుమార్ 43 పరుగులు చేశారు. నెల్లూరు జట్టు బ్యాటింగ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా అంపైర్లు విజేడీ పద్ధతి ప్రకారం మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. 224 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 50, మన్విత్ 44 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సాయి ప్రతాప్ రెడ్డి 3, వీరారెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. -
ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలుకాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడంరెడ్డిబాబు కోరారు. కడప ప్రకాశ్నగర్లో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ టెక్నోల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం గాకముందే అడ్మిషన్లు చేయించుకుంటూ దోపిడీకి తెరతీస్తున్నారన్నారు. కనీస సదుపాయాలు లేకున్నాఇరుకుభవనాల్లో విద్యా సంస్థలను నడుపుతున్నారన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికల బాధలు వర్ణణాతీతం అన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చొరవ తీసుకుని విద్యా చట్టాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంక్షేమ చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓర్సు వీరభాస్కర్. ఎస్ఎండీ.యూసుఫ్బాషా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్.మణికుమార్ పాల్గొన్నారు.ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడంరెడ్డిబాబు -
విద్యుత్ షాక్తో రైతు మృతి
తొండూరు : గ్రామంలో అందరికీ సాయం చేస్తూ ఆదరణ పొందిన పల్లేటి రమేష్రెడ్డి(46) రైతు పల్లేటి రమేష్ రెడ్డి బుధవారం విద్యుత్తు షాక్తో మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. మండలంలోని క్రిష్ణంగారిపల్లెకు చెందిన రమేష్రెడ్డి, సర్పంచ్ రమణారెడ్డి బుధవారం స్థానిక తాగునీటి బోరు పనిచేయకపోవడంతో అక్కడికి వెళ్లారు. విద్యుత్తు మోటారు స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లి రమేష్రెడ్డి స్విచ్ ఆన్ చేయగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి ఈశ్వరరెడ్డి, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, మరొకరు హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. తొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జి వైఎస్.మధురెడ్డి, క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చేరుకుని రమేష్రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, రామమునిరెడ్డి, సురేష్రెడ్డి, శివశంకర్రెడ్డి, రమణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. బోరు వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం నివాళులర్పించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
● సంసిద్ధంగా లేని స్టూడెంట్స్ కిట్స్
గతంలో పాఠశాలలు పునః ప్రారంభం అంటేనే పుస్తకాలు, కిట్స్ రెడీగా ఉండేవి. ఈమారు కూటమి సర్కార్కు ముందు చూపు లేకపోవడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టూడెంట్స్ కిట్స్ అందుబాటులో లేవని పలువురు వాపోతున్నారు. మరోవైపు అయ్యవార్ల బదిలీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకో వైపు నాడు–నేడు పనులు నిలిచిపోయి తరగతి గదులు, టాయిలెట్స్ అసంపూర్తిగా ఉన్నాయి. విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగేందుకు ఆర్వో ప్లాంట్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా పాఠశాలలల్లో నిర్వహణ లేకపోవడంతో మరుగున పడ్డాయి. గ్రామీణ విద్య పట్ల, మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఇలాంటి ముందుచూపు కొరవడిందని విద్యావేత్తలు వివరిస్తున్నారు. -
చెరువును చెరబట్టారు!
● బుగ్గవంకనూ వదల్లేదు.. కడప నగరం మధ్యలో ప్రవహిస్తున్న బుగ్గవంకను కూడా టీడీపీ నాయకులు తమ అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకున్నారు. బుగ్గవంక బ్యూటిఫికేషన్ పేరు చెప్పి రూ.3.50 కోట్ల అత్యధిక మొత్తానికి టెండర్లు పిలిచి బుగ్గవంకలోని కంపచెట్లను తొలగించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు వంకలోని మట్టిని కూడా అమ్ము కొని సొమ్ము చేసుకుంటున్నారు. పాలెంపల్లె వద్ద బుగ్గవంకలోని మట్టిని జేసీబీ, హిటాచీలతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. నెలరోజులు గా ఇలాగే తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.500 చొప్పున విక్రయిస్తూ రోజుకు 600 ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నెలరోజుల్లో రూ.90లక్షల వరకూ ఆర్జించినట్లు తెలుస్తోంది. నిత్యం ట్రాక్టర్లు మట్టితో తిర గడం వల్ల పాలెంపల్లె, బుడ్డాయపల్లె గ్రామా ల్లోని రోడ్లు మట్టితో నిండిపోయాయి. వాహనాలు వెళ్లినప్పుడల్లా దుమ్ము,ఽ ధూళి పైకి లేచి ఇళ్ల నిండా దుమ్ము పేరుకుపోతోందని, ట్రాక్టర్ల శబ్దాలతో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కడప కార్పొరేషన్: కడప నగరానికి అతి సమీపంలో ఉన్న పాతకడప చెరువును టీడీపీ నేతలు చెరబట్టారు. చెరువులోని మట్టిని జేసీబీలు, హిటాచీలతో తవ్వి 15 టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు మట్టి సారవంతంగా ఉంటుంది కనుక చౌడు భూముల్లో సారవంతమైన ఈ మట్టిని వేస్తే పంటలు బాగా పండేందుకు ఆస్కారముంటుంది. అలాగే లో లెవెల్ ఏరియాలలో ఎత్తు పెంచడానికి ఈ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ.5వేలు, ఒక్కో ట్రాక్టర్ రూ.600 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక రోజుకు టిప్పర్లతో 100 ట్రిప్పులు, ట్రాక్టర్లతో 100 ట్రిప్పులు తోలినా రూ.5.50లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు తోలుకుంటే అన్ని లక్షల ఆదాయం అన్నమాట. పాత కడప రైతులమంటూ కొంతమంది విచ్చలవిడిగా దందా మట్టి రవాణా చేస్తూ చెరువును తవ్వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దర్జాగా మట్టి అక్రమ రవాణా చేస్తుంటే ఇరిగేషన్, మైన్స్ అండ్ జియాలజీ, పోలీసు అఽధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. మట్టి మాఫియాపై కొందరు అధికార పార్టీ నేతలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ అయినా స్పందించి చర్యలు తీసుకుంటారని వారు ఆశిస్తున్నారు. నివాస గృహాలకు దగ్గరగా బఫర్ జోన్లో మట్టి తవ్వడం వల్ల చెరువుకు నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఈతకు వెళ్తే లోతు తెలియక ఇరుక్కుపోయి చనిపోయే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాలు ఇదివరకు చాలానే జరిగాయి కూడా. అయినా ఇరిగేషన్ అఽధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి తోలడం వల్ల దేవుని కడప, పాత కడప ప్రాంతాలు దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత కడప చెరువులో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్న వైనం రెండు జేసీబీలు, పది టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా అక్రమ రవాణా -
పట్టాలు తప్పిన ప్రొటోకాల్!
రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రైల్వేస్టేషన్లో బుధవారం ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ హాల్టింగ్(అదనపుస్టాపేజ్) సభ నిర్వహణ విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్ను రైల్వేశాఖ పట్టాలు తప్పించిందనే ఆరోపణలు రైల్వే వర్గాల నుంచి వినిపించాయి. ప్లాట్ఫాంలో కడప వైపు ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖాన్ను పిలిచారు. తర్వాత ఆహ్వాన పత్రికలో పేర్కొన్న ప్రజాప్రతినిధులు పేర్లు కూడా కనీసం ఉచ్ఛరించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానించిన వారు కొన్ని అనివార్యకారణాల వల్ల రాలేకపోయినప్పటికీ, ప్రొటోకాల్ రీతిలో అధికారులు ప్రస్ఫుటించలేకపోవడం విమర్శలకు దారితీసింది. విధిలేని పరిస్థితిలో రైల్వే అధికారులు ప్రోటోకాల్ను పక్కనపెట్టేసి, బీజెపీ నేతలు సాయిలోకేశ్, రమేష్నాయుడు, టీడీపీ నేత చమర్తి జగన్మోహన్రాజును వేదికను ఎక్కించేశారు. అక్కడి నుంచి వేదిక పూర్తిగా కూటమిపార్టీ సభగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అందరి చేతికి పచ్చజెండాలు ఇచ్చేశారు. రైలును కదిలించారు. వేదిక సాక్షిగా సన్మానాలు, సత్కారాలు చేసేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. రైల్వేఅధికారులు అందరికి మాట్లాడే అవకాశం ఇస్తే ప్రొటోకాల్ రగడ రాజుకుంటుందని, ఒక్క మంత్రికే మాట్లాడే అవకాశం కల్పించడం గమనార్హం. ఢిల్లీ రైలు హాల్టింగ్కు పచ్చజెండా ఢిల్లీకి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్(12707/12708) రైలుకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈయనతోపాటు ఎమ్మెల్సీ జకియాఖాన్, గుంటూరు డీఆర్ఎం సుధేష్ణసేన్, డివిజన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజంపేట నుంచి దేశ రాజధానికి ప్రత్యక్ష అనుసంధాన్ని అందించే మొదటిరైలు ఇదే అని అనన్నారు. రాజంపేట స్టేషన్ నుంచి తిరుపతి, కాచిగూడ, నాగ్పూర్, బోఫాల్, ఢిల్లీ వంటి నగరాలకు ప్రయాణం సులభతరం చేస్తుందన్నారు. రైల్వేఅధికారులనుదారితప్పించిన పచ్చపెత్తనం ఢిల్లీ రైలుహాల్టింగ్ సభావేదికపై కూటమినేతలు -
ఎర్ర దొంగలకు మదనపల్లె రాచబాట?
మదనపల్లె: ఎర్రచందనం అక్రమ తరలింపునకు మదనపల్లె అటవీ రేంజి సురక్షిత ప్రాంతంగా స్మగ్లర్లు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉండటం, ఇక్కడ అటవీశాఖ తనిఖీలు, దాడులు పూర్తిగా లేకపోవడంతో ఇక్కడినుంచి తరలింపునకు అటంకం లేదని నిర్ధారించాక.. ఈ ప్రాంతం మీదుగా స్మగ్లింగ్ సాగుతున్న విషయం తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేశాక కాని వెలుగులోకి రాలేదు. ఈనెల 9న తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె వద్ద 48 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ములకలచెరువు, పెద్దమండ్యం, గుర్రకొండ మండలాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఎర్ర చందనం స్మగ్లింగ్ మదనపల్లె రేంజి పరిధిలో సాగుతోందన్న విషయం స్పష్టమైంది. గతంలో పట్టుబడిన ఎర్ర చందనం, నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. అయితే కొంతకాలంగా మదనపల్లె అటవీశాఖ నుంచి దాడులు, నిఘా లేకపోవడంతో ఈ వ్యవహారం ఇంతకాలం వెలుగులోకి రాలేదు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. స్మగర్లు ఎంచుకున్న మార్గాలు? జిల్లాలోని రాజంపేట లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలోని ప్రాంతాలకు తరలించేందుకు స్మగ్లర్లు మార్గాలుగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని గాలివీడు నుంచి పెద్దమండ్యం, సత్యసాయి జిల్లాలోని కదిరి మీదుగా.. మదనపల్లె రేంజిలోని ములకలచెరువు నుంచి బి.కొత్తకోట మీదుగా బెంగళూరు, చైన్నెలకు, పెద్దమండ్యం మండలంలోని పాపేపల్లె, దిగువపల్లె గ్రామాల మీదుగా, గాలివీడు మండలం గోరానిచెరువు నుంచి సరిహద్దు పాపేపల్లి పంచాయతీలోని గొర్లవానికుంట మీదుగా పెద్దమండ్యంలోకి, గుడిసివారిపల్లె మీదుగా పెద్దమండ్యం–తంబళ్లపల్లె మార్గం, గాలివీడు బస్టాండు నుండి దిగువపల్లె మీదుగా బండ్రేవు వద్ద పెద్దమండ్యం–తంబళ్లపల్లె మార్గం మీదుగా ములకలచెరువు, మదనపల్లె వైపు వెళ్తున్న మార్గం, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల మీదుగా.. సత్యసాయి జిల్లా కదిరి నుంచి ములకలచెరువు మీదుగా బి.కొత్తకోట, శంకరాపురం నుంచి కర్ణాటకకు, అలాగే ములకలచెరువు నుంచి మద్దయ్యగారిపల్లె మీదుగా కందుకూరు, కర్ణాటకలోని చేలూరు నుంచి బెంగళూరుకు, కదిరి నుంచి ములకలచెరువు మీదుగా మదనపల్లె, అక్కడినుంచి చీకలబైలు నుంచి కర్ణాటకలోకి స్మగ్లింగ్ సాగించేందుకు ఎలాంటి ఆటకం లేకపోవడం, రద్దీ ఉండని కారణంగా ఈ మార్గాలు ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. తొమ్మిదో తేదిన తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు మార్గంలోని అన్నగారిపల్లె వద్ద దుంగలు పట్టుబడ్డాయి. అంటే ఈ మార్గంలో ములకలచెరువు చేరుకుని అక్కడి నుంచి వారి గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నంగా తెలుస్తోంది. గుర్రంకొండ, పెద్దమండ్యం, మదనపల్లె మీదుగా చీకలబైలు మార్గం కూడా స్మగ్లింగ్కు సురక్షితంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రేంజిలో అధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే ఎర్ర చందనం కేసులు అధికంగా నమోదు కావడం విశేషం. చెక్పోస్టుల మూత మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు, తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని శంకరాపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను మూసివేశారు. ఇవి ఉన్నప్పుడు విధుల్లోని అటవీ సిబ్బంది తనిఖీలైనా చేసేవారు. ఇప్పుడు ఆ అవ కాశం కూడా లేదు. దీంతో ఈ మార్గాల్లో స్మగ్లింగ్ చేసుకునేందుకు అటంకం లేకుండాపోయింది. ఈ ప్రాంతం సేఫ్ జోన్గా స్మగర్ల కార్యకలాపాలు ఆగిపోయిన అటవీశాఖ నిఘా, దాడులు -
నేడు, రేపు స్టూడెంట్ పాసుల జారీ ఉండదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాండు కౌంటర్లలో విద్యార్థులకు బస్సు పాసులను గురు, శుక్రవారాల్లో జారీ చేయబోరని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. సెలవుల అనంతరం స్కూళ్లు, కళాశాలలు పునః ప్రారంభించే సమయంలో విద్యార్థులకు కొత్త బస్సు పాసులను ఈనెల 14 నుంచి జారీ చేస్తామన్నారు. బస్సు పాసులను పొందే విద్యార్థులు తమ వివరాలను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ బస్సుపాస్ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న తర్వాత జనరేట్ అయిన పిన్ నెంబరు కౌంటర్లో తెలియజేస్తూ బస్సు పాసుకోసం క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గుతుందన్నారు. నమోదు ప్రక్రియ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చని సూచించారు. కమనీయం..కల్యాణం ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో జేష్టమాసం పౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేవపూజ, కంకణ పూజ, యజ్ఞోపవీతధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తరించారు.రిమ్స్ సూపరింటెండెంట్గా కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావు కడప అర్బన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) సూపరింటెండెంట్గా డాక్టర్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావును నియమిస్తూ ఇటీవల డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. గతంలో కడప రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ అనంతపురం జీజీహెచ్కు వెళ్లారు. ప్రస్తుతం తిరిగి కడప రిమ్స్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. నేడో,రేపో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా దాసరి రమణయ్య కడప అర్బన్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మాజీ సైనిక సంఘం నూతన అధ్యక్షుడిగా సుబేదార్ దాసరి రమణయ్యను ఎన్నుకున్నారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద బుధవారం వైఎస్సార్ కడప జిల్లా మాజీ సైనికుల సంఘం (డీఈఎస్ఎంఏ) సమావేశం నిర్వహించారు. గతంలో మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న పువ్వాడ లక్ష్మీనారాయణ ఈ ఏడాది మార్చి 19న మరణించారు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ కెప్టెన్ ఎస్.ఎస్. రాముడు, మాజీ వారెంట్ ఆఫీసర్ బి.వి.రంగయ్య, ప్రధాన కార్యదర్శి బి.వి. గోపాల్రెడ్డి, ఇతర మాజీ సైనికులు పాల్గొన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నారాజంపేట: మామిడిరైతులకు గిట్టుబాటుధర కల్పించాలని బుధవారం రాజంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘంనేతలు పందికాళ్ల మణి, చిట్వేలి రవి మాట్లాడుతూ మామిడిరైతులను ఆదుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రైవేటు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు దాదాపు 200 ఉన్నాయ న్నారు. వారు సిండికేట్గా ఏర్పడి గతంలో ఉన్న ధరల కన్నా సగానికి తగ్గించి వేశారన్నారు. చిత్తూరు కలెక్టర్ తోతాపూరి కేజీ రూ. 12గా ధర నిర్ణయించారన్నారు. ఆ ధర అమలు కావడంలేదన్నారు. రూ.6తో కోనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో రూ.15వేల ఉన్న తోతాపురి కాయలు టన్ను రూ.6వేలకు కొనుగోలుచేశారన్నారు. ఈ ఏడాది మామిడికాపు తక్కువగా ఉందని, ధర పెరగాల్సి ఉందన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
కడప కార్పొరేషన్: వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ కె. గురవయ్య ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లోని సమావేశ భవనంలో డీఈలు, ఏఏఓలు, జేఏఓలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు పాతరిమ్స్లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు లేకుండా నాణ్యమైన సరఫరా చేయాలని, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ప్రధాన మంత్రి సౌర విద్యుత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంటి పైకప్పుపై సోలార్ ఫలకలు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకంలో బీసీలకు అదనంగా రూ.28వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను అరికట్టాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన వెంటనే సంస్థ ఖర్చులతో మరమ్మతులు చేయించాలన్నారు. ఇళ్లకు, వాణిజ్య సముదాయలకు, పరిశ్రమలకు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వాలన్నారు. 50 శాతం డెవలప్మెంట్ చార్జెస్ మాత్రమే చెల్లించి తమ అదనపు లోడ్ క్రమబద్ధీకరణ చేసుకునే పథకం ఈ నెల 30 తో ముగియనుందని దానిని ఉపయోగించుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ, ఈఈ హరిసేవ్యా నాయక్, టెక్నికల్ ఈఈ మధుసూదన్, డీఈఈలు, ఏఏఓలు, ఏఈలు, జేఏఓలు పాల్గొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ కె. గురవయ్య -
నిన్నటి దాకా ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు నేటి నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. నేడు బడి గంటలు మోగనున్నాయి. అందరూ బడి బాట పట్టనున్నారు. అయితే అనేక పాఠశాలల్లో చాలీ చాలని తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, కనీస వసతులు లేకపోవడం, స్టూడెంట్స్ కిట్లు అ
సాక్షి ప్రతినిధి, కడప: వేసవి సెలవులంతా ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక ఆటపాటలకు టాటా చెబుతూ చదువుల బాటకు వెల్కం చెబుతున్నారు. గురువారం నుంచి పిల్లలంతా బుద్ధిగా పుస్తకాల బ్యాగ్ను భుజాన వేసుకుని బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంకా పెండింగ్లో ఉంది. మరో రెండు రోజులు కౌన్సెలింగ్ కొనసాగించాల్సి ఉంది. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్టూడెంట్స్ కిట్స్ చేరలేదు. అలాగే కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసౌకర్యాల మధ్య ఆయా ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు పునః ప్రారంభించేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లాలో 2,816 విద్యాసంస్థలు.. వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 2816 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,05,330 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పేరుతో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు 2,042 ఉన్నాయి. వీటిల్లో 1,37,352 మంది విద్యార్థులున్నారు. అలాగే ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 774 ఉన్నాయి. వీటి పరిధిలో 1,67,978 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యాసంస్థలన్నీ గురువారం నుంచి ప్రారంభించి నూతన్య విద్యా సంవత్సరం కొనసాగించనున్నారు. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం జిల్లాలో తలుపులు తెరుచుకోనున్న 2,816 స్కూళ్లు బడిబాట పట్టనున్న 3,05,330 మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో చేరని స్టూడెంట్స్ కిట్లు చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి: డీఈఓ షంషుద్దీన్ జూన్ 12 నుంచి యధావిధిగా అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మెరుగైన విద్యా బోధన, వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో పుష్కలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు కార్పొరేట్ మోజు వీడి ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లల్ని చేర్పించాలి. కార్పొరేట్ పాఠశాలల్లో మూస పద్ధతిలో బట్టీ చదువులకు ప్రాధాన్యత ఉంటుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్రెడ్డి అన్నారు.మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు...కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. -
పల్లె నుంచి.. యునైటెడ్ కింగ్డమ్కు పూర్ణిమ
కడప సెవెన్రోడ్స్ : నగరానికి చెందిన విద్యార్థిని యూకూలో సీటు సాధించి భళా అనిపించింది. కడప నగరానికి చెందిన పూర్ణిమ నిమ్మకాయల యునైటెడ్ కింగ్ డమ్లోని ప్రపంచ ప్రఖ్యాత ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో సీటు సాధించి అందరినీ అబ్బుర పరిచారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామానికి చెందిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి, కె.అనితల కుమార్తె పూర్ణిమ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కడప వికాస్ హైసూ్కల్, 4 నుంచి 10వ తరగతి వరకు కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియేట్ హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోనూ చదివారు. ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీఎస్సీ(ఆనర్స్) చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్లోని ఎడెన్బర్గ్ యూనివర్శిటీలో ఎంఎస్ మేథమ్యాటికల్ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్కు దరఖాస్తు చేశారు. ఎడెన్బర్గ్ యూనివర్శిటీ యాజమాన్యం ఈ మేరకు ఆమెకు ఐడీ నెంబరు 2858866కు జారీ చేసి జులై 28న అడ్మిషన్ పొందాలని సమాచారం పంపింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో ఎడెన్బర్గ్ వర్శిటీ 27వ స్థానంలో ఉంది.చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్ గ్రహంబెల్, ప్రఫుల్ల చంద్రరే, ప్రకాశ్ కారత్, ఓలివర్ గోల్డ్స్మిత్, డేవిడ్ హ్యూమ్, వాల్టర్ స్కాట్ తదితర వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ యూనివర్శిటీలో చదివారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఐఈఎల్టీఎస్లో 8 పాయింట్లు సాధించి ప్రతిష్ఠాత్మక ఎడెన్బర్గ్ వర్శిటీలో పూర్ణిమ సీటు సాధించారు. అంతేగాక యూకేలోని బ్రిష్టల్ యూనివర్శిటీలోనూ ఎంఎస్లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ మేథమ్యాటిక్స్లోనూ, లండన్లోని కింగ్స్ కాలేజీలో ఫైనాన్షియల్ మేథమ్యాటిక్స్ అండ్ మేథమ్యాటిక్స్ ప్రవేశానికి కూడా పూరి్ణమ అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన ఆమెను పలువురు అభినందించారు. -
ఎస్జీటీలకు కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్ : సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జిటి) మ్యానువల్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డీఈఒ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో కడప శంకరాపురం స్కౌట్ హాల్లో కౌన్సెలింగ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో రాత్రి ఏడు గంటల వరకు ఎస్జీటీలు వేచి చూడాల్సి వచ్చింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంపీపీ మేనేజ్మెంట్కు సంబంధించి 2410, కడప కార్పొరేషన్ ఉర్దూ, పొద్దుటూరు మున్సిపాలిటి పరిధిలో మరో 130 పోస్టులకుగానూ ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంంది. మంగళవారం రాత్రి పొద్దపోయే వరకూ 360 మందికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల పక్రియ ఈ నెల 14వతేదీ నాటికి ముగుస్తుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.సాంకేతిక సమస్యలతో రాత్రి ఏడు గంటలకు ప్రారంభం -
గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ ఏర్పాటు
కడప సెవెన్రోడ్స్ : పుత్తడిపురి ప్రొద్దుటూరులో గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ (జీజేఎంసీ) ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రొద్దుటూరు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బంగారు వ్యాపారంలో రెండవ బాంబేగా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరులో జీజేఎంసీ ఏర్పాటయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన తయారీదారులు, పెట్టుబడి దారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాస మూర్తి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, ఎల్డీఎం జనార్దనం, డీటీసీ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ రంగరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ శారదమ్మ, ప్రొద్దుటూరు గోల్డ్ మర్చంట్స్ పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీస్
జమ్మలమడుగు : కుటుంబ కలహాలతో విసిగి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని వారించి రైల్వే పోలీసులు ప్రాణాలు కాపాడిన సంఘటన మంగళవారం జరిగింది. ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి పల్లెటి మునుస్వామి మంగళవారం ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల రైల్వే స్టేషన్కు వచ్చాడు. సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన రైల్వే స్టేషన్ మాస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఆర్థరాత్రి జీఆర్పీ ఆర్ఎస్ఐ రవిచంద్ర, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివకుమార్ కలమల్ల రైల్వే స్టేషన్కు వెళ్లి మునుస్వామిని విచారించారు. అతడిని వారించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి మునుస్వామిని భార్య, కుమారుల వెంట పంపించారు. -
కేటాయించిన లక్ష్యం అధిగమిద్దాం
కడప అగ్రికల్చర్ : జిల్లాలో కంపెనీలకు కేటాయించిన బిందు, తుంపర సేద్యం లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషిచేయాలని ఏపీ సూక్ష్మనీటి సాగు పథకం జిల్లా అధికారి వెంకటేశ్వరరెడ్డి సూచించారు.కడప ఏపీఎంఐపీ కార్యాలయంలో వివిధ కంపెనీల సిబ్బందికి మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి 15వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పథకం అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఐదెకరాల పొలం కలిగిన ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, పదెకరాలు కలిగిన రైతులకు 90 శాతం, 12.5 ఎకరాలున్న రైతులకు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. అర్హులైన రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మురళీమోహన్రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె..!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : చదువుతో పాటు చిన్నారులు క్రీడల్లోనూ రాణించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి నెలకొల్పిన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు వేళయింది. ఆయన హయాంలో కడప శివారులో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో నాటి నుంచి నేటి వరకూ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటారు. ఎంతోమంది ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి చేరారు. ఈ ఏడాది క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 4, 5వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందితే మంచి భవిష్యతు ఉంటుందని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను సిద్ధం చేస్తున్నారు. 19వ తేదీ వరకూ గడువు ఆన్లైన్ ద్వారా మే 31వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 4వ తరగతిలో 40 సీట్లకు గానూ బాలురు–20, బాలికలు–20, 5వ తరగతిలో మొత్తం 40 సీట్లకు గాను బాలురు–20, బాలికలు –20 మందికి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపికలు జరిగేవి. ఈ ఏడాది నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఎంపికలు నిర్వహించనున్నారు. 4వ తరగతి ప్రవేశానికి 01–04–2015–31–03–2017 మధ్య జన్మించిన వారు, ఐదో తరగతికి 01–04–2014 నుంచి 31–03–2016 మధ్య జన్మించిన వారు అర్హులవుతారు. వయస్సు ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుడి ఒరిజినటల్ డాక్యుమెంట్లు, వైద్య పరీక్షల తర్వాత జిల్లా స్థాయి ఎంపిక పరీక్షలలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. ఎంపికలు ఇలా..... జిల్లా స్థాయిలో ఈ ఏడాది జులై 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు కడప డీఎస్ఎ స్టేడియంలో చేపట్టనున్నారు. 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్ , స్టాడింగ్ బ్రాండ్ జంప్, మెడిసిన్ బాల్, షటిల్ రన్, ప్లెక్సీబిలిటీ టెస్ట్, 800 మీటర్ల పరుగు పందెం వంటివి నిర్వహిస్తారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాస్థాయిలో ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి శారీరక సామర్థ్య ఎంపికలను ఈ ఏడాది జులై 10, 11వ తేదీల్లో నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనపరిచిన వారు క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిలుస్తారు. జులై 24వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జులై 1 నుంచి జిల్లా స్థాయి ఎంపికలు దరఖాస్తు చేసుకోవాలి వచ్చే విద్యా సంవత్సరానికి కడప క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 19తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి. అర్హత ఉండి ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –జగన్నాథరెడ్డి, ఇన్చార్జ్ డీఎస్డీవో, వైఎస్ఆర్ కడప జిల్లా -
గొడ్డలితో దాడి
ముద్దనూరు : ఓ సంఘటనలో ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. దేనేపల్లెలో రామ్మోహన్ ఈ నెల 8న పెద్దమ్మ తల్లికి కొందరి సాయంతో యాటలు నిర్వహించాడు. అయితే గూనిగాండ్ల శివను దీనికి పిలవలేదు. దీంతో రామ్మోహన్ నీ కథ చూస్తా అంటూ గూనివాండ్లశివ బెదిరించాడు. అంతిటతోఆగ కుండా రామ్మోహన్ మంగళవారం తోటలో పనిచేయిస్తుండగా.. లక్షుమయ్య, శివశంకర్, నరసింహ, ఉత్తయ్యలతో వచ్చి.. శివ తన గొడ్డలితో రామ్మోహన్పై దాడిచేశాడు. గాయాలైన రామ్మోహన్ ఫిర్యాదు మేరకు గూనివాండ్లశివ, మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అసభ్య ప్రవర్తనపై కేసు నమోదు ముద్దనూరు : మండలంలోని దేనేపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి రామ్మోహన్ తోటలో కూలి పనులకు వెళ్లింది. పైపులు తేవాలంటూ తోట యజమాని రామ్మోహన్ ఆమెను పిలిచాడని, అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని, తప్పించుకోబోగా కులం పేరుతో దూషించాడని విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదో విధంగా తప్పించుకుని బయటపడినట్లు ఆరోపించింది. దీంతో రామ్మోహన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్యప్రొద్దుటూరు క్రైం : మైదుకూరు రోడ్డులోని ధారా అపార్ట్మెంట్ వెనుకవైపున గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకొని ఉండటంతో ఆ ప్రాంత వాసులు మంగళవారం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి సుమారు 65–70 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. నలుగురు తహసీల్దార్ల బదిలీ కడప సెవెన్రోడ్స్: జిల్లాలో నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులిచ్చారు. బ్రహ్మంగారిమఠంలో పనిచేస్తున్న డి.దామోదర్రెడ్డిని ఒంటిమిట్టకు, అక్కడ పనిచేస్తున్న ఏవీ.రమణమ్మను ఖాజీపేటకు బదిలీచేశారు. ఖాజీపేటలో ఉన్న డి.మహబూబ్బాషాను జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్ఆర్సీ విభాగానికి బదిలీ చేశారు. గోపవరం తహసీల్దార్ ఆర్.జీవన్ చంద్ర శేఖర్ను ముద్దనూరుకు బదిలీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నందున జీవన్ చంద్రశేఖర్ను జిల్లా కేంద్రంలోనే ఉంచాల్సి ఉంది. అయినా కడపలో కాకుండా ముద్దనూరుకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?
పులివెందుల టౌన్ : సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అక్రమ అరెస్టు, సాక్షి కార్యాలయాలపై దాడులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఆపాలంటూ పులివెందుల జర్నలిస్ట్ అసోసియేషన్ ర్యాలీ చేపట్టింది. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండు నుంచి మెయిన్ బజార్, పూలంగళ్ల సర్కిల్, కచేరి రోడ్డు మీదుగా అర్బన్ పోలీస్స్టేషన్కు మీడియా మిత్రులు ర్యాలీగా చేరుకుని ఏఎస్ఐ సిద్ధార్థ, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరెడ్డిలకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాత్రికేయుల అక్రమ అరెస్టులపై, దాడులు, దౌర్జన్యాలు జరగకుండా చూడాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కార్తీక్, రాజు, దామోదర్రెడ్డి, విష్ణువర్థన్రెడ్డి, ప్రవీణ్, కృష్ణకుమార్, చంద్రమోహన్రెడ్డి, రమణారెడ్డి, జయరామిరెడ్డి, విమన్, సుబ్బారెడ్డి, ప్రకాష్, రాము, రామ్మోహన్, శంకర్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముద్దనూరు : సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుకు నిరసనగా మండల పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ మైనుద్దీన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్(సాక్షి), ఏసు(ప్రజాశక్తి), బాలకృష్ణ(వార్త), సుధాకర్(విశాలాంధ్ర), శ్రీనివాసులు (ప్రజాభూమి)నందకుమార్(జ్యోతి), భాస్కర్బాబు(సాయంకాలం) పాల్గొన్నారు. అక్రమ అరెస్ట్పై మండిపడిన పాత్రికేయులు పోలీసులకు వినతి పత్రాలు -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం ఉదయం 9.30 గంటలకు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మర్ బాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీ్త్ర, పురుషులకు 100 మీటర్లు, 200 మీ., 400 మీ., 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్పుట్, డిస్కస్త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 14, 15వ తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. 18 ఏళ్లు నిండిన సీ్త్ర, పురుషులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని, మరిన్ని వివరాలకు 9949686586, 8019880995 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు. యువకుడి మృతివీరపునాయునిపల్లె : మండలంలోని వీరపునాయునిపల్లె ఎస్సీ కాలనీలో యువకుడు ప్రశాంత్(22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు ప్రశాంత్ తల్లి మృతి చెందడంతో మద్యానికి బానిసైన ప్రశాంత్ జులాయిగా తిరుగుతూ తరచూ తండ్రితో గొడవపడేవాడు. గతంలోనూ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఉందని ఎస్సై మంజునాథ్ తెలిపారు. రెండు రోజుల కిందట మళ్లీ తండ్రీ, కొడుకుల మద్య ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురై సోమ వారం రాత్రి ఇంట్లోనే ప్రశాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణంగోపవరం : మండలంలోని రాచాయపేట పంచాయతీ బెడుసుపల్లి దళిత వాడకు చెందిన అట్లూరు వెంకటయ్య(45) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నవరం నుంచి ద్విచక్ర వాహనంలో వెంకటయ్య బెడుసుపల్లెకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటయ్య మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఫల్యం కప్పిపుచ్చుకొనేందుకే దాడులు
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రజలకు వాక్ స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి.అంజద్బాషా ధ్వజమెత్తారు. కడపలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య జరిగితే దాని నుంచి ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఐదు దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఉన్నారని, పలు పత్రికల్లో, టీవీల్లో ఆయన పనిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొమ్మినేని డిబేట్ షోలకు ప్రజాదరణ ఉందని, ఆయనంటే చంద్రబాబుకు పడదన్నారు. 2014లో ఎన్టీవీ ప్రసారాలు బంద్ చేస్తామని బెదిరించి ఆయన్ను తొలగించేలా చేశారని గుర్తుచేశారు. టీవీల్లో డిబేట్లు జరిగినపుడు పాల్గొన్న విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటార న్నారు. ఇందులో భాగంగానే క్రిష్ణంరాజు అమరావతి పరిసరాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. క్రిష్ణంరాజుతోపాటు కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి ఛానెల్ కూడా క్షమాపణ కోరిందన్నారు. అయితే టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా సాక్షి ఛానెల్, వైఎస్ జగన్ను, వైఎస్ భారతిలను ఇందులోకి లాగడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా ఏ హామీలు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. ‘వెన్నుపోటు దినం’ విజయవంతం కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఓ కల్పిత ఉద్యమాన్ని సృష్టించి సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి, కొమ్మినేనిని అరెస్ట్ చేయించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీవీ5, ఏబీఎన్, మహా టీవీలలో సాంబశివరావు, వెంకటక్రిష్ణ, రాధాక్రిష్ణ, వంశీక్రిష్ణలాంటి వారు విషం కక్కుతూ ఎన్నో వ్యాఖ్యలు చేశారని, ఆ రోజున వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని ఇలా వేధించలేదన్నారు. ఫేక్ ఐడీలతో కిరాక్ ఆర్పీ, సీమరాజా వంటివారు బండబూతులు తిడుతున్నా వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దళిత మైనర్ బాలికను నెలల తరబడి గ్యాంగ్ రేప్చేసి హత్య చేయడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతిచ్చే వారిపై అక్రమ కేసులు బనాయించి, టీడీపీ నాయకులను కాపాడటానికే పోలీసు వ్యవస్థ ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, మున్సిపల్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, ౖషఫీ, జోన్ అధ్యక్షుడు తోటక్రిష్ణ, కంచుపాటి బాబు, అబ్దుల్ సుభాన్, డీజే అక్బర్, తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ అక్రమం టీడీపీ నేతలదంతా కల్పిత ఉద్యమం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
హామీలు అమలుచేయలేక డైవర్షన్ పాలిటిక్స్
జమ్మలమడుగు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎవరో చెప్పారంటూ.. ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్సార్సీపీ, సాక్షికి ముడిపెట్టి టీడీపీ నాయకులు ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు పక్కనపెట్టి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆందోళన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వచ్చిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక కెఎస్ఆర్ లైవ్షోలో జరిగిన అంశాన్ని అమరావతి ప్రజలందరికీ ఆపాదించడం తగదన్నారు. కెఎస్ఆర్ క్షమాపణ చెప్పినా పట్టించుకోకుండా, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరైందికాదన్నారు. ఈ రోజు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి జైలుకు పంపడమేగాక, చానెల్స్లో మాట్లాడటానికి వీలులేని భాషలో వైఎస్సార్సీపీ నాయకులపై కామెంట్లు చేస్తున్నారన్నారు. అధికారం కొల్పోయిన తర్వాత మీ పరిస్థితి ఎమిటో తెలుసుకోవాలని, కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటూ చెప్పే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి హామీలు గుప్పించి.. ఇపుడు చేతగాక చిన్న విషయాన్ని పట్టుకుని ప్రజల చూపు మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, పోరెడ్డిమహేశ్వరరెడ్డి, వేణుయాదవ్, విష్ణువర్థన్రెడ్డి, లక్షుమయ్య, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడులు సిగ్గుచేటు క్షమాపణ కోరినా దాడులు చేయడం దారుణం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
ఏసీఏ సౌత్జోన్ అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్–19 వన్డే క్రికెట్ మ్యాచ్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. కడప కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు, కడప జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 33.1 ఓవర్లలో 124 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 128 పరుగులు సాధించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని రణధీర్ రెడ్డి 54, రోహిత్ వర్మ 37 పరుగులు చేశారు. ఏడు వికెట్ల తేడాతో కర్నూలు జట్టు విజయం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు జట్టుపై కర్నూలు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 48.1 ఓవర్లలో 176 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని కిన్ను కిషన్ 50 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మహిత్ 3, నౌసూన్ కళ్యాణ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 34.0 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 180 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ చెట్టులోని విఖ్యాత్ 66 పరుగులు చేశాడు. -
షట్డౌన్ దిశగా అల్ట్రాటెక్!
పరిశ్రమ మూసేస్తే.. మా పరిస్థితి ఏంటి? సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, క్షేత్రస్థాయిలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు వెరసి అల్ట్రాటెక్ పరిశ్రమ యాజమాన్యం షట్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా? అని ప్రశ్నిస్తే ఔను అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 48 రోజులుగా అల్ట్రాటెక్లో సిమెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు, పర్మినెంట్ ఉద్యోగులను పరిశ్రమలోకి వెళ్లకుండా అడ్డుతగులుతున్నారు. స్వయంగా పోలీసు అధికారులు దగ్గరుండీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈక్రమంలో పరిశ్రమ నిర్వహణ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ● చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ యాజమాన్యం తలొగ్గి బతిమాలాడాలనే తలంపుతో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకోసం అధికార దుర్వినియోగం ఎలా చేయాలో అంతా సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఓవైపు అనుచరులు, మరోవైపు పోలీసులను కాపలాగా పెట్టి వలసపల్లె, కర్చుకుంటుపల్లె, తుమ్మలపల్లె, దేవగుడి గ్రామాలకు చెందిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడే తిష్టవేసి పర్మినెంట్ ఉద్యోగులను సైతం విధుల్లోకి వెళ్లనీయడం లేదని పలువురు వాపోతున్నారు. అదేమంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతోందని స్వయంగా పోలీసు అధికారులు అడ్డుతుగులుతున్నట్లు తెలుస్తోంది. ఆ సాకు చెబుతూ విధులకు హాజర కాకుండా అడ్డగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తమ సీఐ ఇరువురి మధ్య పరిష్కారం చూపుతారంటూ యర్రగుంట్ల సర్కిల్ కార్యాలయానికి చెందిన కింది స్థాయి పోలీసు అధికారులు చెబుతున్నట్లు యాజమాన్య ప్రతినిధులు వివరిస్తున్నారు. ఇది వరకు ముడిఖనిజం సరఫరా చేసే టిప్పర్లపై కేసులు నమోదు చేసి వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అధికారులు అలా ఎమ్మెల్యేకు అండగా సహకరిస్తుంటే, మరోవైపు ప్యాంకింగ్ ఫ్లాంట్ను దక్కించుకొని యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్యాకింగ్ ప్లాంట్ మూసివేశారు. వెరసి 48 రోజులుగా సిమెంటు ఉత్పత్తి ఆగిపోయింది. ‘రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే అన్నీ అనుమతులు ఇచ్చి రికార్డు టైమ్లో దాన్ని అమల్లోకి తెచ్చేందుకు బాధ్యత తీసుకుంటున్నాను. మీరంతా సమీప భవిష్యత్లో కనీసం ఒక్క వ్యాపారమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాలి.’ సీఎం చంద్రబాబు ఇటీవల సీసీఐ చర్చాగోష్టిలో పారిశ్రామికవేత్తలతో అన్నమాటలివి. నోటితో చెప్పడం నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మాటలకు, చర్యలకు పొంతన ఉండదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఊదాహరణగా చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ నిలుస్తోందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఉత్పత్తిలో పొలిటికల్ వాటాలు ఇవ్వాల్సిందేనని నిక్కచ్చిగా సీఎంఓ పేర్కొనడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పట్ల చిత్తశుద్ధి ఉంటే అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోతుందా? 48 రోజులుగా సిమెంటు ఉత్పత్తి నిలిచిపోతే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎవ్వరికీ పట్టకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబు సర్కార్లో రాజధాని నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎవరి వాటాలు వారికి దక్కించుకునేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. జమ్మలమడుగు : తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్యాకింగ్ యూనిట్లో పని చేస్తున్న కార్మికులు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ గేటు వద్ద వారం రోజుల నుంచి నిరసనలు తెలియజేస్తూ.. ఎవరూ లోనికి పోకుండా అడ్డుకుంటున్నారు. అయితే రెండు రోజుల నుంచి ఐసీఎల్ (అల్ట్రాటెక్) పరిశ్రమలో పని చేస్తున్న మెయింటెనెన్స్ కార్మికులు, ఇతర కార్మికులు తమ విధులకు హాజరు కావాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు తమ పని చేయడం కోసం పరిశ్రమ వద్దకు వెళ్లారు. నిరసన చేస్తున్న కార్మికులు.. లోనికి వెళ్లవద్దు అంటూ అడ్డుకున్నారు. తమని ఎందుకు అడ్డుకుంటున్నారు, తమ పని చేసుకోనివ్వండి పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలిపోతే మా పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్మికులు, నిరసన కారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. చెప్పేందుకే నీతులు కొనసాగుతున్న కూటమి ఎమ్మెల్యే వేధింపులు కార్మికులు పరిశ్రమలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ముప్పుతిప్పలు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువు -
చదువుకొనేదెలా..!
●పెరిగిన ధరలు ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక పాఠశాల బాట పట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ (గురువారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.ఈ ఏడాది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచినట్లు తెలిసింది. అదే విధంగా పుస్తకాల ధరలు భారీగా పెరిగాయి. 6వ తరగతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, బూట్లు, టై వంటికి గతేడాది 6 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ. 8 వేల దాకా అవుతోందని తల్లిదండ్రులు అంటున్నారు. వీటితోపాటు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, అట్టలు వంటి అదనపు ఖర్చులు మరింత భారం అవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇలా అన్ని కలిపి గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా రూ.5 వేలు నుంచి రూ.10 వేల దాకా ఖర్చు పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. కడప ఎడ్యుకేషన్: జూన్ నెలంటేనే పేద, మధ్య తరగతి ప్రజల గుండె గుబేల్మంటుంది. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్కరూ చదువులకు సంబంధించి పుస్తకాలు, స్కూల్ యానిఫాం, బూట్లు, టై, బెల్ట్, బ్యాగులు ఇలా అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలా జూన్ నెలలో అన్ని రకాల వస్తువులను ఒకే సారి కొనుగోలు చేయాల్సి రావడంతో.. ఒక్కసారిగా ఆర్థిక భారం పడుతోంది. నర్సరీ మొదలుకుని కళాశాల విద్య వరకు వేలాది రూపాయలు పోసి చదువులను కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని, అయినా కానీ అప్పోసప్పో చేసి పిల్లలను బడిలో చేర్పించాల్సి వస్తోందనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇవ్వకపోవడంతో మరింత ఆర్థిక భారం పడుతోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలు తెరిచేనాటికి పిల్లలకు తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ముందు నుంచే అడ్మిషన్లు ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీంతోపాటు వేసవి సెలవుల్లో తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి కూడా అడ్మిషన్లకు సంబంధించి లక్ష్యం విధించి వేధించారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళళన చేసినా.. పట్టించుకునే వారు కరువయ్యారు. వ్యాపార కేంద్రాలుగా.. సరస్వతీ నిలయాలుగా విరాజిల్లాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ఫలితంగా సగటు జీవి తన పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే గుండె గుబేల్మంటుంది. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను బాగా చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆశతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల చెవులు పిండి క్యాష్ చేసుకుంటున్నారు. అడ్మిషన్ ఫీజు మొదలుకుని టై, షూ, బెల్టులతోపాటు పుస్తకాల వరకూ అన్ని వారే సరఫరా చేస్తున్నారనే విమర్శలు మెండుగా ఉన్నాయి. కూలి పని చేసుకునే స్థాయి నుంచి.. కూలి పని చేసుకునే వాడి దగ్గరి నుంచి వ్యాపారం చేసుకునే వారి వరకు, అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కాన్వెంట్ చదువులను చదివించాలని ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఏటా ఫీజులు పెంచుతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన అధికారుల చేష్టలుడిగి ప్రవర్తించడంతో.. అది కాస్తా పేద, బడుగు, బలహీల వర్గాల వారికి పెనుభారంగా మారుతూ అప్పుల ఊబిలోకి వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమైనా... పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెత లాగా.. సామాన్య, మధ్య తరగతుల వారు కూడా తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్లో చదివించాలనే ఆశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయినా సరే తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు పంపేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన జరుగుతోంది. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల పుస్తకాల ధరలు: రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు 6 నుంచి 10వ తరగతి పుస్తకాలు: రూ. 8 నుంచి 12 వేల వరకు యూనిఫాం మూడు జతలు: రూ.1500 నుంచి 2 వేల వరకు షూ, టై, బెల్ట్ తదితర వస్తువులు: రూ.500 నుంచి 1000 వరకు మార్కెట్ ధరల కంటే అధికంగా.. విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో చేరిన తర్వాత విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు మొదలుకొని యూనిఫాం, టై, బెల్ట్, షూ వంటి వాటిని కచ్చితంగా కొనుగో లు చేయాల్సిందే. అదే అదునుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు సంబంధిత వస్తువులను వారి పాఠశాలలో ఏర్పాటు చేసుకుని బహిరంగ మార్కెట్ కంటే అధిక రేట్లతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. భయ పెడుతున్న బడి ఫీజు ప్రైవేటు, కార్పొరేట్లో భారీగా పెరిగిన వైనం తడిసి మోపెడు అవుతున్న స్కూల్ ఖర్చులు సామాన్యులకు భారంగా విద్య అయినా కాన్వెంటు వైపే మొగ్గు రేపు పాఠశాలలు పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది. అపారమైన అనుభవంతోపాటు అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ఇంగ్లిష్ మీడియం ఉంది. ప్రభుత్వం విద్యా సామగ్రి ఉచితంగానే అందిస్తుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఆర్భాటాలు చూసి తల్లిదండ్రులు మోసపోవద్దు. తమ ిపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ, అధికారి -
మత్స్యశాఖ ఏడీగా నాగయ్య
కడప అగ్రికల్చర్: మత్స్యశాఖ ఏడీగా నాగయ్య నియమితులయ్యారు. ఆయన విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏడీగా కడపకు వచ్చారు. ఇక్కడ ఏడీగా పని చేస్తున్న రెడ్డెయ్యను నంద్యాలకు బదిలీ చేశారు. డీసీఓగా వెంకటసుబ్బయ్య.. జిల్లా సహకారశాఖ అధికారిగా వెంకటసుబ్బయ్య నియమితులయ్యారు. ఈయన నంద్యాల జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రొద్దుటూరులోని జిల్లా సహకార శిక్షణా కేంద్రం అధ్యాపకుడిగా ఎన్టీఆర్ జిల్లాలో పని చేసే శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్లో చైర్పర్సన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్తోపాటు మొత్తం ఆరుగురు సభ్యుల నియామకానికి దరఖాస్తులను కోరుతున్నారన్నారు. మరిన్ని వివరాలకు 9440814416 నెంబరులో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా చంద్రానాయక్ కడప అగ్రికల్చర్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల పరంపర కొనసాగుతుంది. బదిలీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా వ్యవసాయ అధికారిగా చంద్రానాయక్ నియమితులయ్యారు. ఈయన అన్నమయ్య జిల్లా డీఏఓగా పని చేస్తూ వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. వైఎస్సార్ జిల్లా డీఏఓగా పని చేస్తున్న అయితా నాగేశ్వరావు గుంటూరు డీఏఓగా బదిలీపై వెళ్లారు. అలాగే జిల్లా లోని పలువురు ఏడీలతోపాటు ఏవోలు కూడా జి ల్లాలోని పలు ప్రాంతాలకు బదిలీలు అయ్యారు. జిల్లా ఉద్యానశాఖ అధికారిగా.. జిల్లా ఉద్యానశాఖ అధి కారి రవిచంద్ర బాబు నియమితులయ్యారు. ఈయన కూడా అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తూ వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తున్న సుభాషిణి అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిగా బదిలీపై వెళ్లారు. వీరితోపాటు జిల్లాలోని పలువురు మండల ఉద్యానశాఖ అధికారులు పలు మండలాలకు బదిలీ అయ్యారు. వీరితోపాటు జిల్లా హెడ్ఆఫీస్లో జిల్లా టెక్నికల్ హెచ్ఓగా పని చేస్తున్న జోతిర్మయి రాష్ట్ర హెడ్ఆఫీస్కు బదిలీకాగా ఆమె స్థానంలో హెడ్ఆఫీస్లో పని చేస్తున్న జీవన్ వస్తున్నారు. మార్కెటింగ్శాఖలో.. మార్కెటింగ్శాఖ డీడీగా లావణ్య బదిలీపై వచ్చారు. కడప మార్కెటింగ్శాఖ డీడీగా గతంలో పని చేస్తున్న శ్రీకాంత్రెడ్డిని కడప మార్కెట్యార్డు సెక్రటరీగా నియమించారు. -
‘సాక్షి’ కార్యాలయం వద్ద ఆందోళనపై ఫిర్యాదు
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చింతకొమ్మదిన్నె: కడప సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద జూన్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రజాస్వామికంగా ధర్నా చేయడం దారుణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ హరినాథ్రెడ్డి, కడప రిపోర్టర్ దుర్గాప్రసాద్, చింతకొమ్మదిన్నె రిపోర్టర్ నాగమల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో సీఐ శివశంకర్ నాయక్ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించి, క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడం దారుణం అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్షి కథనాలు ప్రచురిస్తుండటంతోనే కక్ష గట్టారని పేర్కొన్నారు. కడపలోని సాక్షి కార్యాలయం లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ దుండగులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు చేసిన హంగామా సీసీ కెమెరాలలో రికార్డు అయిందని, ప్రత్యక్ష సాక్షులు సైతం ఉన్నారని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతోపాటు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. దీనివల్ల సిబ్బంది ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోస్టల్ ఇన్సూరెన్స్ భళా!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రైవేట్ పాలసీలు ఎన్ని వస్తున్నా తపాలా పాలసీలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. తక్కువ చెల్లింపులతో ఎక్కువ బోనస్ ఇస్తారనే విశ్వాసం ఉంది. తపాలా శాఖలో పలు పాలసీలు ఉన్నా ప్రజల్లో అవగాహన ఆశించిన స్థాయిలో లేదు. జీవిత బీమా పథకం ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా దోహదపడుతోంది. 1884 ఫిబ్రవరి 1న కేవలం తపాలా శాఖలో ఉద్యోగం చేసే వారి కోసం ప్రారంభమైన పీఎల్ఐ(పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్)ను కాలక్రమేణా అందరికీ అందుబాటులోకి తెచ్చారు.తపాలా బీమా పాలసీలను 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు గలవారు తీసుకోవచ్చు. రూ.50 లక్షల వరకు తీసుకునే సౌకర్యం ఉంది. పాలసీలు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే సౌలభ్యముంది. ప్రధానంగా ఆరు రకాల పాలసీలు అమలవుతున్నాయి. వాటిలో సంతోష్, సువిధ, సుమంగళి, యుగళ్ సురక్ష, సురక్ష బాలాజీ పాలసీలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. దీనిపై తపాలా శాఖ అధికారులు సభలు, సమావేశం నిర్వహించి మరింత అవగాహన కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.పాలసీ వివరాలు..● ఎండోమెంట్ అస్యూరెన్స్(సంతోష్)ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత ఉంటుంది. ఏటా ప్రతి వెయ్యికి రూ. 52 చొప్పున బోనస్ లభిస్తుంది.● కన్వర్టబుల్ హోల్లైఫ్ అస్యూరెన్స్(సువిధ)ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు, పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం. ఐదు సంవత్సరాల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోత . ఏటా ప్రతి వెయ్యికి రూ. 72 చొప్పున బోనస్ లభిస్తుంది. ఐదు సంవత్సరాలు (ఆరు సంవత్సరాలు దాటరాదు) ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్లోకి మారవచ్చు. అప్పుడు బోనస్లు అదే పద్ధతిలో లభిస్తాయి. అయితే కన్వర్షన్ లేకపోతే అస్యూరెన్స్గా పరిగణిస్తారు.● యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ (సుమంగళ్)ఇది మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీకి 19 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. పాలసీ కాలపరిమితి 15–20 సంవత్సరాలు, 15 సంవత్సరాల పాలసీపై 6,9,12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్. 20 సంవత్సరాల పాలసీపై 8,12,16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్. ప్రతి ఏటా వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది.● జాయింట్ లైఫ్ అస్యూరెన్స్(యుగళ్ సురక్ష)21–45 సంవత్సరాల దంపతులు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. పాలసీ కాలపరిమితి 5–20 సంవత్సరాలు. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత, మరణానంతర ప్రయోజనాలు భాగస్వామికి లేదా వారి వారసులకు వెళ్తాయి. ప్రతి ఏటా వెయ్యికి రూ. 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో భార్యాభర్తల బీమా కవరేజీని పొడిగించుకోవచ్చు.● హోల్లైఫ్ అస్యూరెన్స్ (సురక్ష)ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. ప్రీమియం చెల్లించే వయస్సును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం. ఐదేండ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత. ఏటా ప్రతి వెయ్యికి రూ. 76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 59 ఏళ్ల దాకా ఈ స్కీమ్ను ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీల్లోకి మార్చుకోవడానికి వీలుంటుంది. పాలసీదారుకు వయసు 80 దాటితే లేదా పాలసీదారు చనిపోతే వారి వారసులకు బీమా సొమ్ము దానిపై బోనస్ ప్రయోజనాన్ని చెల్లిస్తారు.● చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా)పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకునే వెసులుబాటును కల్పించారు. పిల్లల వయస్సు తప్పనిసరిగా 5 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ. 3లక్షలు లేదా పాలసీదారు బీమా(సమ్ అస్యూర్డ్) ప్రకారం (ఏదితక్కువైతే అది) ఇస్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు (పిల్లల తండ్రి) వయస్సు 45 ఏళ్లు దాటరాదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వస్తాయి. రుణ సదుపాయం, సరెండర్ సౌకర్యం ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులే చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అయినప్పటికి వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి.పాలసీలు ఉపయోగకరం..తపాలాశాఖ ద్వారా అందే బీమా పాలసీలు ఎంతో ఉపయోగకరం. ఇతర బీమా సంస్థల నుంచి వచ్చే రాబడి కంటే మెరుగైన ఆదాయం వస్తుంది. అన్ని రకాల ఉద్యోగులు పీఎల్ఐ పాలసీలను అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చు.పాలసీలు తీసుకుంటే కుటుంబానికి భరోసా ఉంటుంది.– రాజేష్, తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలిపీఎల్ఐ పాలసీని ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పాలసీపై గ్రామాల్లో, నగరంలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పాలసీ తీసుకుంటే కుటుంబానికి జీవన రక్షగా ఉంటుంది.– మునాఫ్, పీఎల్ఐ డెవలప్మెంట్ మేనేజర్, కడప డివిజన్ప్రతి ఒక్కరి పాలసీ కుటుంబాలకు ఉపయోగకరంప్రజలు ప్రతి ఒక్కరు పాలసీలు తీసుకోవడం ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో మేలు చేకూరుతుంది. తపాలా శాఖ అందించే అనేక పీఎల్ఐ స్కీమ్లు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకొని పాలసీలు తీసుకోవాలి.–విజయ్ భాస్కర్, అసిస్టెంట్ తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్ -
స్టీల్ప్లాంట్ నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
మైలవరం : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. 2019 జనవరిలో మండల పరిధిలోని కంబాలదిన్నె గ్రామం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పద్మశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వేసిన శిలాఫలకం ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మాటలు చెబుతున్నారే తప్ప చేతల్లో మాత్రం ముందుకు రావడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాముల బ్రహ్మానందరెడ్డి, ఇర్ఫాన్ బాషా, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ ఉద్యమంలో ఆనాటి త్యాగధనుల జీవితాల నుంచి నేటి తరం స్ఫూర్తి పొందాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వీణా విజయరామరాజు ఎస్టీయూ భవన్లో వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా అధ్యక్షతన 79 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, వీణా విజయరామరాజు మరియు మఖ్దుం మొహిద్దీన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఏడు దశాబ్దాల ఉపాధ్యాయ ఉద్యమంలో వీణా విజయరామరాజు, మఖ్దుం మొహిద్దీన్, వి.పి. రాఘవాచారి, పెర్నా శ్రీరామ మూర్తి లాంటి నాయకులు ఉద్యమాల ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణను, ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా పెన్షన్, గ్రాట్యుటీ,క మ్యుటేషన్ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పొందే సౌకర్యాన్ని అందించారన్నారు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కె. సురేష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డిలు మాట్లాడుతూ నేటి నవతరం నాయకులు విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలన్నారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్, జిల్లా నాయకులు షేక్ సాజిత్, షేక్ సాదిక్, నాగేంద్రప్రసాద్, మహబూబ్ బాషా, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులు, బాలరాజు, కరీముల్లా, కస్తూరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య తోపులాట
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు వ్యతిరేకంగా నాయకులు నగరంలోని ఐఎంఎ హాలులో సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించంగా షర్మిల వర్గీయులు సమావేశం లోపలికి వచ్చి షర్మిల నాయక త్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ నాయకత్వం వర్థిల్లాలి అంటూ మరో వర్గం వారు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో నాయకుల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే వరకు వెళ్లింది. షర్మిల వర్గీయులు సుంకర పద్మశ్రీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు సుంకర పద్మశ్రీని సురక్షితంగా పంపించారు. -
‘షైనింగ్ స్టార్స్’తో ఉజ్వల భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘షైనింగ్ స్టార్స్–2025‘ అవార్డులు విద్యార్థుల ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో.. 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్–2025 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల నగదు బహుమతి, సత్కారం చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, ఎమ్మెల్సీలు ఎం.వి. రామచంద్రారెడ్డి, బి.రాంగోపాల్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ కో ఆపరేటివ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ జయప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కష్టం కాదని, లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రణాళిక ప్రకారం, దృఢ సంకల్పంతో అడుగులు వేయాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభీష్టాన్ని గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆత్మ విశ్వాసంతో లక్ష్యం వైపు అడుగేస్తే లక్ష్యం చేరుకోవడం కష్టం కాదని తెలిపారు. జేసీ అదితిసింగ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో.. లక్ష్యం వైపు అడుగులేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఆర్జేడీ ఎ. శ్రీనివాసులు, ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య, డీఈఓ షంషుద్దీన్ మాట్లాడారు. అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 266 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20వేలు చొప్పున మంజూరైన రూ.53,20,000 మెగా చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అతిథులతో కలిసి విద్యాశాఖ అధికారులు, విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రశంసా పత్రాలు, పతకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ -
భూ తగాదా కేసులో ఏడుగురి అరెస్టు
చాపాడు : గత నెల 27న రాజుపాళెం గ్రామ సమీపంలోని పెన్నానది పరివాహంలో గల ప్రభుత్వ బంజరు భూమి విషయమై తలెత్తిన ఘర్షణలో సోమవారం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పల్లెం శ్రీనివాసులు, నలసింగ్ పెద్ద కుళ్లాయప్ప వర్గీయుల మధ్య గత నెల 27న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాసులు వర్గీయులను అరెస్టు చేయగా, సోమవారం నలసింగ్ పెద్దకుళ్లాయప్పతో పాటు అతని వర్గీయులైన మధు, పవన్, గంగయ్య, కిషోర్, బాబు, కృష్ణయ్యలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయ మూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. తప్పిన పెను ప్రమాదంలింగాల : మండలంలోని లోపట్నూతల గ్రామానికి చెందిన వెంగళరెడ్డి సోమవారం తన బొలెరో వాహనంలో పులివెందుల నుంచి స్వగ్రామానికి వస్తుండగా, లింగాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బొలెరో వాహనం పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. లింగాలకు చెందిన ఆదినారాయణ రెడ్డి రోడ్డుపై స్కూటీని కుడివైపు తిప్పుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీ అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో, ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో వెంగళరెడ్డి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బొలెరో అదుపు తప్పి రోడ్డుమీద నుండి పొలంలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆదినారాయణరెడ్డికి స్వల్ప గాయాలు కాగా, ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంకడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 3వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స కోసం చేర్పించారు. అనంతరం 4వ తేదీన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు కోరారు. -
అంతుచిక్కని రహస్యం
కడప కార్పొరేషన్ : కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో ఏముంది...హాలు తాళాలు ఎవరి వద్ద ఉన్నాయి...కౌన్సిల్ హాలును తెరవకుండా ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంసమవుతున్నాయి. మేయర్ సురేష్ బాబు తన విచక్షణాధికారంతో వేదికపై ఉన్న కుర్చీలను తొలగించడంతో కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి గత రెండు సమావేశాల్లో రచ్చ రచ్చ చేసి హంగామా సృషించారు. తనకు మేయర్తో సమానంగా వేదికపై కుర్చీ వేసేవరకూ సమావేశాలు జరుగనివ్వనని హెచ్చరించారు. దీంతో ముజువాణి ఓటుతో మేయర్ అన్ని అంశాలను ఆమోదించారు. ఇప్పటికి సుమారు నాలుగు నెలలుగా నగరపాలక సర్వసభ్య సమావేశం జరగలేదు. కమిషనర్ మనోజ్రెడ్డి కౌన్సిల్ హాలులో ఎక్స్ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు ఏర్పాటు చేసి తాళాలు తన వద్ద ఉంచుకున్నారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గతంలోనే కౌన్సిల్ హాలును తెరిపించాలని కోరితే కమిషనర్ తన వద్ద తాళాలు లేవని చెప్పినట్లు సమాచారం. తాజాగా 3 నెలలు పూర్తయిన నేపథ్యంలో అత్యవసరంగా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరపాల్సిన ఆవశ్యకత ఉందని, కౌన్సిల్ హాలులో కనీస వసతుల కల్పనకు పరిశీలించాల్సి ఉన్నందున దానిని వెంటనే తెరిపించాలని మేయర్ సురేష్ బాబు స్వయంగా తన లెటర్ హెడ్లో కమిషనర్ను కోరారు. మేయర్ ఇచ్చిన లేఖను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సోమవారం కమిషనర్ మనోజ్రెడ్డికి అందజేశారు. అయితే కమిషనర్ సమావేశం జరిగే రోజునే కౌన్సిల్ హాలు తెరుస్తామని, అంతవరకూ తెరిచే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. కుర్చీ చుట్టూ తిరుగుతున్న రాజకీయం కడప నగరపాలక సంస్థలో ప్రజల ఓట్లతో గెలుపొందిన మేయర్, కార్పొరేటర్లకు తగిన గౌరవమిచ్చి వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా పాలన చేయాల్సిన కమిషనర్, ఇతర అధికారులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్. మాధవి ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలను కక్షసాధించడంలో కమిషనర్ భాగస్వాములైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏర్పాటు చేసుకున్న వాటర్ప్లాంట్లను తొలగించడం, ఆక్రమణల పేరిట ఆ పార్టీ నాయకుల షాపులను తొలగించడం, వార్డు సచివాలయాల్లో కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన కుర్చీలు, ఛాంబర్లను తొలగించడం వంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. కమిషనర్ ఆదేశాలతోనే ఇవన్నీ జరిగినట్లు కార్పొరేటర్లు భావిస్తున్నారు. మహానాడు సందర్భంగా కడపలో విచ్చలవిడిగా వారం రోజులపాటు ఫ్లెక్సీలు, హోర్డింగులు, వెలసినా కార్పొరేషన్కు మాత్రం రూపాయి ఆదాయం కూడా సమకూరలేదు. సామాన్య టీడీపీ నేతలు వినతులు ఇవ్వడానికి వస్తే లేచినిలబడి వినయ విధేయతలు చూపుతున్న కమిషనర్, కార్పొరేటర్లు వినతులు ఇవ్వడానికి పోతే కనీసం లేచి నిలబడలేదన్న విమర్శలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మేయర్కు తప్ప ఆయనతో సమానంగా ఎక్కడా ఎవరికీ కుర్చీలు ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రాల్లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే కడప నగరపాలక సంస్థలో అందుకు విరుద్దంగా మేయర్కు మాట మాత్రమైనా చెప్పకుండా... తనకే అన్ని విచక్షణాధికారాలు ఉన్నట్లు కమిషనర్ అత్యుత్సాహంతో మేయర్తో సమానంగా వేదికపై ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.కమిషనర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా అవేవీ ఆయన పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కమిషనర్ ఇలా చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే గనుక నిజమైతే దానిపై మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏ విధంగా స్పందిస్తారో...ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. సుమారు నాలుగు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ తాజాగా మున్సిపల్ కౌన్సిల్ హాలు తెరిపించాలని కోరిన మేయర్ అంగీకరించని కమిషనర్... సర్వత్రా విమర్శలు -
ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకుడు రఘనాథరెడ్డి కడప ఎడ్యుకేషన్ : ఎస్జీలటీకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వెబ్ కౌన్సెలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు అనే నినాదంతో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా 25 మంది నాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తన తీరు ఇప్పటికై నా మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతారన్నారు. పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో డీఈఓ కార్యాలయాల ముట్టడి జరిగినప్పటికీ ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కానీ ఎలాంటి చలనం రాకపోవడం దారుణం అని విమర్శించారు. కడప జిల్లా ఐక్యవేదిక నాయకుడు మోపురి వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆలోచించి రేపు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గుజ్జల తిరుపాల్, రమేష్బాబు, శంకర్రెడ్డి, ఇబ్రహీం, సంగమేశ్వర్రెడ్డి, కొండారెడ్డి, అబ్దుల్లా, ఖాదర్ బాషా, లెక్కల జమాల్ రెడ్డి, బత్తిని నాగేశ్వరరావు, అమరనాథరెడ్డి తదిరులు పాల్గొన్నారు. -
సాక్షిపై దాడి అప్రజాస్వామికం
కడప అర్బన్: కడప సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా, దాడి చేయడం అప్రజాస్వామికమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ హరినాథ్రెడ్డి, బ్యూరో ఇన్చార్జి బాలకృష్ణారెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ వెన్ను శ్రీనివాసరావు, స్టాఫ్ రిపోర్టర్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కడపలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎిస్పీ వెంకటేశ్వర్లును వారు కలిసి వినతి పత్రం అందజేశారు. సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడం దారుణమని అన్నారు. కడపలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ దుండగులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. టీడీపీ నాయకులు చేసిన హంగామా సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, ప్రత్యక్ష సాక్షులు సైతం ఉన్నారన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతో పాటు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఈక్రమంలో కడపలోని డీఎస్పీ కార్యాలయంలోకి కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతించారు. వినతిపత్రం ఇచ్చే సమయంలో ఫొటోను తీసుకునేందుకు కూడా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిబ్బంది అనుమతించకపోవడం గమనార్హం. సాక్షి కార్యాలయం వద్ద దాడులకు సంబంధించి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కార్యక్రమంలో సాక్షి దినపత్రిక సభ్యులు, సాక్షి టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు.కొవ్వొత్తులతో నిరసనసాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ కడపలోని కడప– పులివెందుల రహదారిలో చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సాక్షి యూనిట్ కార్యాలయం సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన చేపట్టారు.ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మంచిది కాదని, ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. -
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, పగలు కొన్ని రోజులు, చీకటి కొన్ని రోజులు ఉంటాయని, ఇచ్చిన హామీలు ఏడాది పూర్తయినా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, రాష్ట్రంలో మంత్రి లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పులివెందుల సబ్ జైలులో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూటమి నాయకులు ఎల్లో తోరణాలు కట్టడం దారుణమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు తోరణాలు కట్టారని వైఎస్సార్సీపీ నాయకులు డీఎస్పీ, కమిషనర్లనకు వినతి పత్రాలు కూడా అందజేశారన్నారు. అయినా కూడా పట్టించుకున్నా పాపానపోలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని ఇది అధికారులు గుర్తుపెట్టుకుని పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బ్యానర్లు, తోరణాలు తొలగిస్తే దానికి సంబంధించిన కేసు పెట్టకుండా 307 కేసు పెట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలోరాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకతీతంగా పనిచేసి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు చేసి ఉంటే ఎవరూ ఉండేవారు కాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సునీల్ కుమార్, వీరప్రతాప్రెడ్డి, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారమే కొమ్మినేని అరెస్ట్ కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారమే సాక్షి ఛానెల్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిందని వైఎస్సార్సీపీ జి ల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాక్షి ఛానెల్ డిబేట్లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వాటిని సాక్షి ఛానెల్కు, డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్కు అంటగట్టడం సరికాదన్నారు. దీనికి సాక్షి యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు, దాడులు చేయించి కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి -
అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై టీడీపీ దౌర్జన్యం
రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సాక్షి కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసి ‘సాక్షి’పై దాడులకు దిగుతుంది పచ్చపార్టీ. ఆ వ్యాఖ్యలతో సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అసత్య ఆరోపణలతో దాడులకు పాల్పడుతుంది పచ్చదండు. సాక్షిపై అసత్య ఆరోఫణలు అనేవి కేవలం దాడులు చేసేందుకే అనే విషయం తేటతెల్లమైంది. టీడీపీ గూండాల దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర బట్టబయలైంది. విజయవాడ సాక్షి మీడియా కార్యాలయం పై టిడిపి పార్టీ రౌడీల దాడుల పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదుసాక్షి మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్డీసీపీ సరితకు వినతిపత్రం అందించిన విజయవాడ బ్రాంచి మేనేజర్ యశోధరాజు, సాక్షి పేపర్, టీవీ ప్రతినిధులుకర్నూలు:సాక్షి పత్రిక మీడియా కార్యాలయంపై టీడీపీ రౌడీల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులురాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి మీడియా పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరిన జర్నలిస్టుల సంఘాల నేతలుకర్నూలు ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆచారికి వినతి పత్రాన్ని అందించిన సాక్షి మీడియా పాత్రికేయులు సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులు👉 ఏపీలో అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులు 👉టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులకు కుట్ర👉రాళ్లు, కర్రలతో దాడులు చేస్తన్న టీడీపీ గూండాలు👉దాడులకోసం ఉదయం నుంచి టీడీపీ మూకల మోహరింపు👉పథకం ప్రకారం ఆర్గనైజ్డ్గా సాక్షి కార్యాలయాలపై దాడులు👉విజయవాడ, మంగళగిరి, వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళంలో దాడులు👉సాక్షి బోర్డులు ధ్వంసం చేసి, ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నం👉అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు👉రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న అధికార పార్టీ👉రాష్ట్ర చరిత్రలో ఏ మీడియాపైనా జరగని రీతిలో టీడీపీ నేతల దాడులు మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ దౌర్జన్యం👉సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం👉మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యం👉. టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు కలిసి సాక్షి కార్యాలయం బోర్డు ధ్వంసం👉బోర్డున ధ్వంసం చేసిన మాదిగ కార్పోరేషన్ చైర్మన్ శిరీష్👉అడ్డుకునేందుకు పోలీసులు యత్నం, వాగ్వాదంఆందోళన పేరుతో విజయవాడ, మంగళగిరి, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. -
వైఎస్సార్ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులు ఇద్దరు పిల్లలను నాగసానీపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడి సోమవారం ఉదయం మృతి చెందారు. మృతులు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, పిల్లలు ఇద్దరు బతుకు దెరువు కోసం కాజీపేట నుండి చక్రాయపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నప్పుడే పిల్లల తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నారు. -
ఏపీ ఈఏపీ సెట్లో మెరిశారు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో గత నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తమ్మ ర్యాంకులు సాధించి పలువురి ప్రశంసలు పొందారు. ఇంజనీరింగ్ విభాగంలో... జిల్లాలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 13084 మంది రిజిస్టర్ చేసుకోగా 12554 మంది పరీక్షలు రాయగా ఇందులో 8545 మంది క్యాలిఫై అయ్యారు. ఇందులో బాలురు 4931 మంది, బాలికలు 3614 మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్,ఫార్మసీకి సంబంధించి... అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీకి సంబంధించి జిల్లాలో 3424 రిజిస్టర్ చేసుకోగా 2286 మంది పరీక్ష రాశారు. ఇందులో 2835 మంది క్వాలిఫై అయ్యారు. బాలురు 804 మందికాగా బాలికలు 2031 మంది ఉన్నారు. రాష్ట్రస్థాయిలో జశ్వంత్రెడ్డికి 16వ ర్యాంకు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో కడప భాగ్యనగర్ కాలనీకి చెెందిన మొలకల జశ్వంత్రెడ్డి మెరిశాడు. రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మొలకల రాజకిషోర్రెడ్డి, శ్రీలతల కుమారుడు జశ్వంత్రెడ్డి 1 నుంచి 5వ తరగతి వరకు కడప నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివాడు. 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ ఒలంపియాడ్లో చదివాడు.ఇంటర్మీడియట్ను విజయవాడ కానూర్లోని నారాయణలో పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్లో 211వ ర్యాంకు సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్లో 777వ ర్యాంకు సాధించాడు. దీంతోపాటు విట్లో 36వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్లో 38వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. జశ్వంత్రెడ్డి ర్యాంకు రావడంతో తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ రాజకిషోర్రెడ్డి సొంత గ్రామం వీరపునారయణపల్లె మండలం అనిమెల గ్రామం. అయితే ఆయన కడపలో స్థిరపడ్డారు. రాజకిషోర్రెడ్డి ప్రస్తుతం విజయవాడ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బండిరీ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నారు. మెరిసిన కృష్ణహర్షిత్ ఏపీ ఈఏసీ సెట్ పలితాల్లో కడప ఎన్జిఓ కాలనీకి చెందిన మంచాల కృష్ణ హర్షిత్ రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకును సాధించి మెరిశాడు. మంచాల ఈశ్వర్, రాధికల కుమారుడు కృష్ణహర్షిత్ చదువులో బాగా రాణిస్తూ ఇటీవల విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కూడా 197వ ర్యాంకును సాధించాడు. చైన్నె ఐఐటీలో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి.. సాప్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణ హర్షిత్ తండ్రి మంచాల ఈశ్వర్ సిద్దవటం మండలం మాధవరం జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. కృష్ణ హర్షిత్కు ర్యాంకు రావడం పట్ల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
టిడ్కో ఇళ్ల సమీపంలో పశువధ కేంద్రం గుర్తింపు
మదనపల్లె రూరల్ : మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ ఎర్రగానిమిట్ట వద్ద టిడ్కో ఇళ్లకు ఉత్తరం వైపున ఉన్న పాత కోళ్లఫారం షెడ్డులో రహస్యంగా పశువులను వధిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. శానిటోరియం వద్ద ఆవును వధిస్తున్నారనే సమాచారం మేరకు..స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కోళ్లఫారం షెడ్ వద్దకు చేరుకున్నారు. జంతు వధశాలను గుర్తించి సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశారు. వారి ఆదేశాలతో తాలూకా పోలీసులు అక్కడకు చేరుకుని వధించేందుకు సిద్ధంగా ఉన్న 6 కోడెదూడలు, 1 దేశవాళీ ఆవు, 4 జెర్సీ ఆవులను గమనించి, వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ లోపు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, వి.నారదరెడ్డి, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు షెడ్ వద్దకు చేరుకున్నారు. బక్రీద్ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో...డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ..గోవధ జరగకుండా చూస్తామని, దీనిని అరికట్టేందుకు డివిజన్ పరిధిలో మూడు చెక్పోస్ట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా గోవులను రహస్యంగా శానిటోరియం వద్దకు తరలించి, వధిస్తుంటే పోలీసులు ఎందుకు అరికట్టలేకపోయారని ప్రశ్నించారు. జంతు వధశాలలో స్వాధీనం చేసుకున్న గోవులను తీసుకువచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలపాలని బీజేపీ, వీహెచ్పీ, భజరంగదళ్ నాయకులు నిర్ణయించగా, పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పుంగనూరురోడ్డులోని నాగదేవత గోశాల ట్రస్ట్కు పశువులను తరలించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ కళా వెంకటరమణ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు సమీపంలో పశువధ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించగా కట్టివేసిన 10 పశువులను గుర్తించామన్నారు. పాత కోళ్లఫారం జాకీర్హుస్సేన్కి చెందినదిగా గుర్తించి, సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గోహంతకులను అరెస్ట్ చేయాలని ధర్నాకు పూనుకోవడంతో పోలీసులు బండి ఆనంద్, వి.నారదరెడ్డి, భగవాన్, మోహన్ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఆవులు, కోడెదూడలు గోశాలకు తరలింపు -
మాన్యువల్ విధానంలోనే బదిలీలు జరపాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ విధానంలోనే జరపాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశాయి. అలా కాని పక్షంలో ఎంతదూరమైనా పోవడానికి సిద్ధమని ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశాయి. జిల్లాలో ఎస్జీటీలకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యానువల్ ముద్దు అనే నినాదంతో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు.మాన్యువల్ కౌన్సెలింగ్ జరపాలనే ఏకై క నినాదంతో జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార విషయమై గతంలో సంఘాలు ధర్నాకు పిలుపును ఇచ్చినప్పుడు కమిషనర్ మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు మాట తప్పి ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని ప్రకటించడం సబబుగా లేదన్నారు. గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మోపురు శివారెడ్డి, ఇలియాస్బాష, నర్రెడ్డి సంగమేశ్వర్రెడ్డి, సురేష్ బాబు,గుజ్జల తిరుపాల్,బండి విశ్వనాథరెడ్డి,లక్ష్మి రాజా, పాలేం మహేష్, శ్యాంసుందర్ రెడ్డి, ఖాదర్ బాషా, చెన్నయ్య, కొండారెడ్డి, బత్తిని నాగేశ్వరరావు, రామాంజనేయులు, ప్రవీణ్ కిరణ్, శివశంకర్ రెడ్డి,సజ్జల రమణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఏబీ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ● ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నేడు డీఈఓ కార్యాలయ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని డీఈఓ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈఓ కార్యాలయం ముట్టడి -
బాబు మార్కు రాజకీయానికి.. ఆ ముగ్గురు బలి!
రాజంపేట : గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఓటమిపాలై, పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని..ఇన్చార్జి పదవి విషయంలో అధిష్టానం వెనకడుగు వేసిన తరుణంలో ఆయన ఆ పార్టీకి గుడ్బై చెప్పడంతో.. చంద్రబాబు రాజకీయంలో మరో నేత బలయ్యారనే వాదన ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు బాటలో సుగవాసి కూడా చేరిపోయారనేది ఇప్పుడు కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యూజ్ అండ్ త్రో పాలిట్రిక్స్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలానుగుణంగా రాజకీయాలు చేస్తారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. వాడుకోవడం పక్కన పెట్టడం, విభజించి పాలించడం లాంటి విధానాలతో రాజంపేట టీడీపీ వర్గ విభేదాలకు నిలయంగా మారిపోయిందని రాజకీయ పరిశీలకుల భావన. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న నేతలను తన కష్ట కాలంలో బాగానే ఉపయోగించుకున్నప్పటికి, అందలమెక్కిన తర్వాత వారిని డస్ట్బిన్లో వేసే విధానం పార్టీ ఆవిర్భావం నుంచి రాజంపేట టీడీపీలో కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. అయ్యో.. పసుపులేటి బ్రహ్మయ్య.. రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వెలుగు వెలిగిన నేత బలిజ సామాజికవర్గానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్య. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోపాటు చంద్రబాబునాయుడు పాలనలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అపార అనుభవం కలిగిన నేత. 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతారని తెలిసి కూడా, పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకురాకపోతే పసుపులేటి బ్రహ్మయ్య పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అన్ని విధాలుగా నష్టపోయారు. మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మయ్య గురించే పట్టించుకోలేదన్న అంశం బహిరంగ అంశం. ఆయన వర్గీయులు చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు. ఆయన తనయులకు రాజకీయంగా చంద్రబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది. రాజకీయ ప్రయోగంలో బత్యాల బలి.. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గాల్లో పట్టుకల్గిన నేత బత్యాల చెంగల్రాయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో బత్యాల చెంగల్రాయుడుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ పదవి తప్ప మరో పదవి రాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసే నాథుడు కరువైన దుస్థితిలో రైల్వేకోడూరు నుంచి బత్యాలను తీసుకొచ్చి రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బత్యాల రాజంపేట రాజకీయాలకు దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వేకోడూరుకే బత్యాలను పరిమితం చేశారు. అధిష్టానంపై సన్నగిల్లుతున్న నమ్మకం.. టీడీపీకి పనిచేసిన సీనియర్లకు, కార్యకర్తలకు అధిష్టానం వైఖరిపై నమ్మకం సన్నగిల్లుతోంది. తమను వాడుకోవడమే కానీ, తమకు చేసేదేమీలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పసుపులేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాల సుబ్రమణ్యంలు రాజకీయ వ్యవహారంలో సమిధలుగా మారిన తీరుతెన్నులను తమ్ముళ్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. రాజంపేటలో టీడీపీకి బలిజ సామాజికవర్గం అండగా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గనేతలకు జరుగుతున్న అన్యాయాన్ని బలిజలు దిగమింగుకోలేకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పార్టీ రాదన్న ఆందోళన, టీడీపీకి వస్తున్న ప్రజావ్యతిరేకతను చూసి తమ్ముళ్లు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్చార్జి ఫైనల్పై అధిష్టానం కసరత్తు.. టీడీపీ ఎన్నికల అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గుడ్బై చెప్పడంతో రాజంపేట టీడీపీ వర్గాలు కుదేలయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే టీడీపీకి షాక్ తగిలే సరికి అధిష్టానం ఉలిక్కి పడిందని కొందరు నేతలు అంటున్నారు. ఇన్చార్జి విషయంలో తేల్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చేసింది. ఇప్పటికే ఇన్చార్జి రేసులో చమర్తి జగన్మోహనరాజు, మేడా విజయశేఖర్రెడ్డి ఉన్నారు. తాజాగా బత్యాలకే ఇన్చార్జి ఇవ్వాలని, చమర్తి రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఎవరంతట వారు తమ నేతకే ఇన్చార్జి అని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇన్చార్జి కుర్చీ రెడ్డి సామాజికవర్గానికి అప్పగించాలని టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. యూజ్ అండ్ త్రో పాలిట్రిక్స్ రాజంపేటలో ఇన్చార్జి రగడ క్యాడర్లో అధిష్టానంపై సన్నగిల్లుతున్న నమ్మకం -
నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’
కడప సెవెన్రోడ్స్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విజ్ఞప్తి చేశారు నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్లో పనిచేస్తున్న కార్మికులకు ఆయా గ్రామ పంచాయతీల వారీగా పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే ఇవ్వాలంటూ స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనుంది.దీనిని జయప్రదం చేయాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం రూ. 10,000 అమలు చేయాలన్నారు. కార్మికులకు పని చేసేందుకు అవసరమైన పనిముట్లు, రక్షణ దుస్తులు అందించాలన్నారు. కాల్ సెంటర్ 1100 సేవలు వినియోగించుకోండి కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమ వారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునన్నారు. ‘ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. 1340 మెట్రిక్ టన్నుల యూరియా రాక కడప అగ్రికల్చర్: ఉమ్మడి కడపజిల్లాకు 1340 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు తెలిపారు. ఇందులో కడప జిల్లాకు 950 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 550 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు, 400 మెట్రిక్ టన్నులు మార్కె ఫెడ్కు కేటాయించి నట్లు తెలిపారు. అలాగు అన్నమయ్యజిల్లాకు 390 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 120 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు, 270 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్కు కేటాయించినట్లు ఆయన తెలిపారు. -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
చాపాడు : మండలంలోని బద్రిపల్లె గ్రామానికి చెందిన ఏనుగు సావిత్రి (40) ఆదివారం కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న సావిత్రి ఈ నెల 3న పురుగుల మందు తాగింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త లక్ష్మీరెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జర్మనీలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివిన పూర్వ విద్యార్థి భోగం హరీష్కుమార్ వరల్డ్ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈనెల 11వ తేదీన జర్మనీలో నీ కెమ్నిట్జ్లో వరల్డ్ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. భోగం హరీష్కుమార్ 83 కిలోల ఓపెన్ విభాగంలో పాల్గొననున్నారు. ఇతనికి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పవర్ లిఫ్టింగ్ కోచ్ బాల గోవిందు తివారి అభినందనలు తెలిపారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి కమలాపురం : మండల పరిధిలోని కొండాయపల్లెకు చెందిన ఉపాధి కూలీ చిట్టిబోయిన ఓబులేసు (62) వడదెబ్బతో మృతి చెందినట్లు ఏపీఓ పార్థ సారధి తెలిపారు. శనివారం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓబులేసు కళ్లు తిరుగుతున్నా యని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, వివాహిత కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు సాయినాథ శర్మ తనయుడు మణికంఠ శర్మ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యక్తి ఆత్మహత్య రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణానికి చెందిన కుతుబుద్దీన్ (40) అనే వ్యక్తి విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణం రవిహాల్ వెనుక భాగంలో నివాసం ఉండే కుతుబుద్దీన్ రోజు వారి కూలికి వెళతాడు. వచ్చిన కూలి డబ్బులతో పూటుగా మద్యం తాగేసి కుటుంబాన్ని పట్టించుకొనేవాడు కాదు. దీంతో చేసేది లేక అతని భార్య తన నలుగురు పిల్లలతో కలసి వేరుగా కాపురం ఉంటోంది. దీంతో మనస్థాపానికి గురై శనివారం రాత్రి మద్యంతో పాటు విషద్రావణం తాగి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఫీల్ట్ అసిస్టెంట్లకు తీవ్ర గాయాలు
అట్లూరు : కడప–బద్వేలు ప్రధాన రహదారిపై లింగాలకుంట మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు పోరుమామిళ్ల మండలం రౌతుపల్లె ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బత్తిన రమణయ్య, పోరుమామిళ్ల మండలం గానుగపెంటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రామమోహన్ ఇరువురు అట్లూరు మండలం కామసముద్రంలో జరిగే అంకాలమ్మ తిరునాలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా బద్వేలు వైపు నుండి కడపకు వెళ్తున్న కారు, ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. దీంతో ఇరువురు ఫీల్డ్ అసిస్టెంట్లు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
తంబళ్లపల్లె : తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 48 ఎర్రచందనం దుంగలు, ఒక మోటార్ సైకిల్ను స్వాఽధీనం చేసుకున్నారు. టాస్కుఫోర్సు పోలీసుల కథనం మేరకు వివరాలు.. టాస్కుఫోర్సు డీఎస్పీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులు, ఆర్ఎస్ఐ మురళీధర్రెడ్డి బృందంగా శనివారం అటవీశాఖ అధికారులు జయప్రసాదరావు, మోహన్రెడ్డి, సబీన్తాజ్ల సహకారంతో వేపూరికోట ఫారెస్టుబీట్ పరిధిలో డంపింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె సమపంలోని వంకగట్టు వద్ద అనుమానాస్పదంగా పారిపోతున్న వారిని వెంబండించారు. ములకలచెరువు మండలం సోంపల్లి ఆర్.సుధాకర్(43), రాజుగారిపల్లెకు చెందిన ఈ.లక్ష్మిపతినాయుడు (27), పెద్దమండ్యం మండలం కురవపల్లెకు చెందిన మల్లికార్జున(39) గుర్రంకొండ మండలం మఽధ్యాహ్నంవారిపల్లెకు చెందిన సురేందరరెడ్డి (39) నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాలు తనిఖీ చేయగా 48 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని దీంతో పాటు ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏరువమ్మ గుడిలో చోరీవీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి పంచాయతీ రాచపల్లి సమీపంలో ఉన్న ఏరువమ్మ దేవత గుడిలో శనివారం రాత్రి చోరీ చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి పూజలు చేసేందుకు వెళ్లగా ఆలయం తాళాలు పగులకొట్టి గుడిలో ఉన్న బీరువాను సైతం పగులగొట్టారు. 48 దుంగలు, మోటారు సైకిల్ స్వాధీనం -
చోరీ కేసుల్లో దొంగ అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను చిన్న చౌక్ పోలీసులు ఆదివారం కడప ఎయిర్పోర్ట్ వద్ద అరెస్టు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కడప మోచంపేటలోని చిలకల బావికి చెందిన షేక్ అక్బర్ ఆలీ ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడు. కడప నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై దాదాపు 20 కేసులకు పైగానే ఉన్నట్లు తెలిపారు. దొంగతనం కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో గోవా, ఢిల్లీ ప్రాంతాల్లో వెళ్లి తలదాచుకుంటూ తిరిగి మళ్లీ కడపకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఎన్జీవో కాలనీ, మత్యుంజయకుంట, అక్కాయపల్లెలో చోరీలకు పాల్పడి దొరికిన బంగారు నగ లు తీసుకొని పారిపోతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి సిబ్బందితో నిందితుడు అక్బర్ ఆలీని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 40.160 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : క్రమశిక్షణతో ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో టెన్త్, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలీయ విద్యార్థులకు నగదు, ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రమణ్యం మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. ఏ పనినైనా ఇష్టపడి చేయాలని సూచించారు. తమ బిడ్డలు ఉన్నత స్థానాల్లో నిలబడితే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవన్నారు. పద్మశాలీయ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అవ్వారు వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు అవ్వారు సుబ్బరాయుడు మాట్లాడుతూ పద్మశాలీయ విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించి భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో గత 19 సంవత్సరాలుగా నగదు ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎంసీ వెంకటసుబ్బయ్య, రాటాల గోపి, బీవీ సుబ్బారాయుడు, పుత్తా శివరామయ్య, బోడగల వెంకటరామయ్య, గొట్టుముక్కల వెంకటరమణయ్య, సోమా శంకర్, అవ్వారు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం -
11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ఈనెల 11న ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డిని ఆహ్వానించారు. ఆదివారం ఆకేపాటికి ఆహ్వానపత్రికను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాఽథరెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరామిరెడ్డి గోపాల్రెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, పీ.చంద్రశేఖర్రెడ్డి, శ్రీకాంత్. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, డిప్యూటీ చైర్మన్ జకియాఖాన్, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ రైలు స్టాపేజి కార్యక్రమానికి హాజరవుతరన్నారు. ఆకేపాటిని కలిసిన వారిలో గుంతకల్ రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి, కడప కమర్షియల్ సూపర్వైజరు జనార్ధన్ తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిపై మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంపర్ల చిన్న వెంకటసుబ్బయ్య (60) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మీదుగా నెల్లూరు వైపు వెళుతున్న లారీ గోపిరెడ్డిపల్లె సమీపంలో నెల్లూరు నుంచి ఇంటి సామానుతో వస్తున్న గూడ్స్ ఆటోను, అలాగే జీవీ సత్రం నుంచి మైదుకూరు వైపు వస్తున్న ప్రయాణికుల ఆటోను ఒకే సారి ఢీ కొంది. సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉప్పుగుంటపల్లెకు చెందిన వెంపర్ల చిన్న వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ నారాయణ, గూడ్స్ ఆటోలోని డ్రైవర్ మహమ్మద్ బాషా, షేక్షావలి, సింధూర మేషా అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ సీఐ కేవీ రమణారెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడి హత్య కేసులో మామ, మరో ముగ్గురి అరెస్టు
కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో జూన్ 1వ తేదీన సయ్యద్ చాంద్ బాషా అనే యువకుడిని తాళ్లతో కట్టేసి క్రూరంగా హత్య చేసిన కేసులో మృతుడి మామతో పాటు భార్య , అత్త, బావమరిదిని అరెస్టు చేశారు. మరొక బావమరిదిని జువైనల్ హోంకు పంపినట్లు చిన్న చౌక్ సీఐ జి.ఓబులేసు తెలిపారు. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో సీఐ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. చాంద్ బాషా అలియాస్ చాను హత్య అనంతరం పారిపోయిన నిందితులపై నిఘా ఉంచారు. ఆదివారం సాయంత్రం వాటర్ గండి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మృతుడి మామ షేక్ మహబూబ్ బాషా , భార్య ఆయేషా, అత్త షేక్ ప్యారి, బావమరిది షేక్ మొహమ్మద్ రఫీ ఉన్నారు. ఈ కేసులో మరొక బావమరిది బాలుడు కావడంతో అతనిని జువైనల్ హోమ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు సంతానమని తెలిపారు. 2016 ఆగస్టు 25న ఆయేషాతో వివాహం కాగా ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. దీంతో ఆయేషా గతంలో మృతుడిపై ఫిర్యాదు చేయడంతో గృహ హింస కేసు కూడా నమోదు చేశారు. రామకృష్ణ నగర్లో ఆయేషా పేరు మీద ఉన్న రేకుల షెడ్డును మృతుడు ఇతరులకు అమ్మడంతో మనస్పర్థలు తీవ్రమయ్యాయి. ఈ కారణంగా ఆయేషా కుటుంబ సభ్యులు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అశోక్ నగర్లో రసూల్ అనే వ్యక్తి ఇంటిలో శుభ కార్య ఉండగా అక్కడికి వస్తాడని తెలుసుకొని పథకం రచించారు. ఆ ప్రకారం వేచి చూసి రసూల్ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకు రాగానే అక్కడే వేచి ఉన్న నిందితులు చాన్బాషాను మెడ పట్టుకుని బలవంతంగా ఇంటిలోనికి తీసుకెళ్లి, రెండు చేతులు కాళ్లు కట్టేశారన్నారు. ఆ తర్వాత ఇంటిలోకి ఎవరిని రానీకుండా అడ్డుకొని బలమైన మచ్చు కత్తితో చాంద్బాషాను అతి ఘోరంగా మెడ మీద ఐదు చోట్ల బలంగా నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య కేసులోనిందితులను అరెస్టు చేసిన చిన్న చౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఖాదర్బాషా ,నాగరాజు, మాధవరెడ్డి, మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి, మహిళా హోంగార్డు జి.ప్రభావతిలను కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించినట్లు సీఐ తెలిపారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. జువైనల్ హోంకు ఒకరి తరలింపు కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు వెల్లడి -
భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ’యోగా’
కడప అర్బన్: యోగా భవిష్యత్తు తరాలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఓ అద్భుతమైన మార్గదర్శి, ’దిక్సూచి’ లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏ.ఆర్, సివిల్, ఇతర విభాగాలు, ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ’యోగాంధ్ర – 2025’ కార్యక్రమానికి జిల్లా ఎస్.పి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బంది అనారోగ్య సమస్యలు రాకుండా యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం తో జీవించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మానసిక దృఢత్వానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయుష్ విభాగం నుండి హాజరైన యోగా శిక్షకులు ప్రసాద్, జ్యోతి లకు జిల్లా ఎస్.పి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు డీఎస్పీ.భావన, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పులివెందుల డీఎస్పీ బి.మురళినాయక్, ఆయుష్ డి స్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ మురళి పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు క్రియాశీల పాత్ర పోషిస్తామని పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఆదివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని యోగాంధ్ర వేదికపై ఈగల్ (ఎలైట్ యాంటి–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్ మెంట్ ) ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవుతామంటూ’ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ -
వైఎస్సార్సీపీ నేతపై దాడి
పుల్లంపేట : పుల్లంపేట మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీసీపీ నాయకుడు, అనంతంపల్లి సహకార బ్యాంక్ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంటు సుదర్శన్రెడ్డిపై శనివారం రాత్రి పుల్లంపేట పోలీస్స్టేషన్ కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుల్లంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, కుమార్రెడ్డి, పుల్లంపేట సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు తదితరులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి నాయకులు దాడి చేయడం పరిపాటిగా మారింది. ప్రశాంతంగా ఉన్న పుల్లంపేట మండలంలో కూటమి నాయకులు దాడి చేయడంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట ఎస్ఐ తెలిపారు. -
ఉత్సాహంగా ఏసీఏ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ – 23 వన్డే క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగింది. శనివారం జరిగిన మ్యాచ్లో చిత్తూరు, అనంతపురం జట్లు విజయం సాధించాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కర్నూలు జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 44.4 ఓవర్లలో 208 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని సాయి సూర్య తేజ 80, యజ్ఞేశ్వర్ 51 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రెడ్డి ప్రకాష్ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. తేజ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 23.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీనారాయణ 86 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తేజ రెడ్డి 62 పరుగులు చేశాడు. వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో.. వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన వేరొక మ్యాచ్లో కడప జట్టుపై 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 35.2 ఓవర్లలో 151 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని ఎస్ఎండీ అయూబ్ 52, వాసు దేవరాజు 36 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 4, కామిల్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 22.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని అర్జున్ టెండూల్కర్ 78 పరుగులు చేశాడు. కడప జట్టులోని ఆదిల్ హుస్సేన్ 3 వికెట్లు తీసుకున్నాడు. -
నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నాం. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. – జె. ఉమామహేష్, మరియాపురం, కడప ఉచిత బస్సు ప్రయాణం హుళక్కేనా? 18–49 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా దాని గురించి పట్టించుకోవడం లేదు. అసలు ఇస్తారో, ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ఏ పథకం ఎప్పుడు ఇచ్చేది తేది ప్రకటించి మరీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పారు. అదీ చేయలేదు. – పత్తి రాజేశ్వరి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, కడప ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెలా ఆడ బిడ్డ నిధి పేరుతో రూ.1500 లు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన ఏడాది అయినా దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి నెలా రూ.1500 ఇస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో ఏడాది క్రమం తప్పకుండా రూ.45 వేలు వచ్చేది. ఇప్పుడేమో రూ.1500 లేదు, అప్పుడిచ్చే రూ.18 వేలు లేకుండా పోయింది. –కానాల విజయ, గృహిణి, ఎకోపల్లె గ్రామం, దువ్వూరు మండలం -
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వడం వల్లే మరణాలు
జమ్మలమడుగు : అధికారుల నిర్లక్ష్యంతో పెన్నానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో పెన్నాలో ఎక్కడ ఎంత లోతు ఉందో తెలియక నీటిలోనికి దిగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. పెన్నా నదిలో ఈతకు దిగి మృతి చెందిన వారి కుటుంబీకులను శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ పెన్నానదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిగాయన్నారు. ఇరవై అడుగుల లోతు వరకు కూడా ఇసుకను తవ్వేశారన్నారు. ప్రస్తుతం పెన్నానదిలో నీరు వచ్చి చేరిందని, ఎక్కడ ఎంత లోతు ఉందో ఎవరికి తెలియని పరిస్థితి ఉందన్నారు. పెన్నానది బ్రిడ్జి సమీపంలోనే గతంలో చాలా మంది మరణించారని గుర్తు చేశారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడ ప్రమాదానికి సంబంధించిన సూచిక బోర్డులు కూడా పెట్టకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా అధికారులు పెన్నానది ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంత లోతు గుంతలు ఉన్నాయో గుర్తించి అక్కడ ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సంఘటనను జిల్లా కలెక్టర్ శ్రీధర్కు ఫోన్ చేసి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వివరించారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే
కడప ఎడ్యుకేషన్ : ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఐక్య వేదిక నాయకులు సంగమేశ్వరరెడ్డి, శివారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు మాటిచ్చారు.. మాట నిలుపుకోండంటూ శనివారం కడప డీఈఓ కార్యాలయం ఎదట ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పిందన్నారు. మరి ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ అంటున్నారు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ఈనెల 8 వ తేదీన కడప డీఈఓ కార్యాలయ ముట్టడి చేయనున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–257, ఏపీటీఎఫ్ 1938, ఆపస్, వైఎస్సార్టీఎఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ సంఘం తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.కదం తొక్కిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక -
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా రెడ్డి ప్రసాద్
వల్లూరు (చెన్నూరు) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా తనను ఎంపిక చేసినట్లు చెన్నూరుకు చెందిన రెడ్డి ప్రసాద్ తెలిపారు ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రూ. కోట్ల విలువైన స్థలం ఆక్రమణ అట్లూరు : అధికార పార్టీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయం పక్కనే గుంతపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబరు 948లో 10.38 ఎకరాలు(పది ఎకరాల 38 సెంట్లు విస్తీర్ణం) ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి సెంటు సుమారు రూ.10 లక్షల వరకూ విలువ చేస్తుంది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేత అనుచరుడికి ఆ భూమిపై కన్ను పడింది. ఇంకేముంది అదును కోసం ఎదురు చూశాడు. శనివారం బక్రీద్ పండుగ సెలవు అలాగే ఆదివారం కూడా సెలవు దినం కావడం ఆయనకు కలిసి వచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి స్థలంలో సుమారు 50 సెంట్ల మేర అంటే ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే మేర స్థలంలో యంత్రాలతో చదును చేయించుకున్నాడు. ఎవరూ అడ్డు లేకపోవడంతో శనివారం ఆ స్థలంలో నిర్మాణం కోసం సామగ్రిని తరలించాడు. ఇంత విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలకు ఏర్పాట్లు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. హెచ్చరిక బోర్డును లెక్క చేయని వైనం.. గుంతపల్లి రెవెన్యూ పొలంలోని సర్వే నెంబరు 948లో 10.38 ఎకరాలు విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్టు తమకు కాదనుకున్నారేమో బోర్డును సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నేతలు ఆక్రమించడం గమనార్హం. చర్యలు తీసుకుంటాం.. సర్వే నంబరు 948లో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి అనుచరుడు కబ్జాకు పాల్పడిన విషయమై బద్వేలు తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజును వివరణ కోరగా నెల రోజులుగా తాను అందుబాటులో లేనని, నిన్ననే విధుల్లో చేరానని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్బాకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగర శివార్లలోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాల మూలంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు భద్రత కమిటీలోని ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసి ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో మాట్లాడి మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేయడమే లక్ష్యంగా గడిచిన ఐదేళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు పని చేసింది. కొనసాగించింది. కేలండర్ విడుదల చేసి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని తేదీలతో సహా బహిర్గతం చేసి.. సరిగ్గా ఆ తేదికి అమలు చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతమైంది. జిల్లాలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 9,82,554 మందికి రూ.8,857.42 కోట్లు వేశారు. సామాన్య కుటుంబాలకు కామధేనువులా వైఎస్ జగన్ సర్కార్ కాపాడింది. ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా అందిస్తామని సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశ పెట్టిన టీడీపీ ప్రజల్ని మభ్యపెట్టింది. చంద్రబాబు సర్కార్ కూడా ఆ పథకాలు ద్వారా చెల్లింపులు చేస్తారని భావించి మోసపోయారని విశ్లేషకులు వివరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ఊదరగొట్టారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యా రెంటీ’ అన్నారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నమ్మించారు. అధికారం కోసం ముఖానికి అబద్ధాల హామీల ముసుగు వేసుకున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మరోమారు సీఎం చంద్రబాబు చేతిలో దగాకు గురయ్యారు. ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. నాటి మాటలు నీటి మూటలేనని తేటతెల్లమైంది. తల్లికి వందనమంటూ చెప్పి.. శఠగోపం పెట్టారు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లనలా ఉండిపోయింది. కర్షకుల కన్నీరు తుడుస్తానంటూ పెట్టుబడి సాయం మాటే మర్చిపోయారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తామన్న మాట ఊసేలేదు. వెరసి నమ్మి మోసపోయామంటూ మహిళాలోకం ఆక్రోశం చెందుతోంది. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలంటూ.. ‘ప్రతి ఇంటికి ఉద్యోగం.. లేదంటే, నిరుద్యోగ భృతి రూ.3 వేలు తప్పకుండా ఇస్తాం ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ అని ఎన్నికల హామీల్లో ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఏడాదైంది, ఒక్కటంటే ఒక్క ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి ఇప్పటికీ ప్రభుత్వం రూ.36 వేలు బకాయి ఉన్నట్లే. దారిద్య్రరేఖకు దిగువనున్న వారు జిల్లా వ్యాప్తంగా 5,82,633 కుటుంబాలు ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాలకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువకులంతా నిరుద్యోగ భృతికి అర్హులే. అలాగే అమ్మఒడి పథ కం ద్వారా నాలుగేళ్లలో వైఎస్ జగన్ సర్కారు రూ. 1,337.4 కోట్లు చెల్లించారు. కాగా, ఆ స్థానంలో తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ వర్తింపజేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీగా ప్రకటించారు. ఏడాదిగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు శఠగోపం పెట్టారు. ఊరిస్తున్న ఉచిత బస్సు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళాలోకం ఇకపై ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చును’ అని హామీ ఇచ్చారు. ఇదిగో అదిగో సంక్రాంతి, ఉగాదికి అమలు చేస్తామని ఊరిస్తూ వచ్చారు. జిల్లాలో ప్రజారవాణాలో ఉన్న 590 బస్సుల ద్వారా ప్రతి రోజు 1.29 లక్షల మంది సరాసరిగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 30 శాతం మంది మహిళలు ప్రతి రోజు ప్రయాణిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే 38,700 మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఏడాదైనా వారికి ఉచిత బస్సు ప్రయాణం అవకాశం దక్కలేదు. మరోవైపు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనం రూ.5 వేల స్థానంలో రూ.10 వేలు చేస్తామని ప్రకటించారు. ఆపై ఉన్న ఉపాధి కూడా లేకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా 10,890 మంది సచివాలయ వ్యవస్థ పరిధిలో ఉన్న వలంటీర్లు నిరుద్యోగులయ్యారు. అలాగే మరో 366 మంది రేషన్బండ్ల ఆపరేటర్లు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ బిల్లులు బాదుడే.. బాదుడు అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచబోమని, తగ్గిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాగా, అసలు కంటే కొసరు అధికంగా ఉండేలా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ వాడకం కంటే డబుల్ బిల్లు వినియోగదారులకు వస్తోంది. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జెస్ట్మెంట్(ఎఫ్పీపీసీఏ) కింద జిల్లా ప్రజలపై కూటమి ప్రభుత్వం కోట్లలో భారం మోపింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతి నెలా వడ్డనకు ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కాలంలో సర్దుబాటు చార్జీలకు తోడుగా అక్టో బర్ నెల నుంచి ఏ నెలకు ఆనెల సర్దుబాటు పేరుతో యూనిట్కు 91 పైసల చొప్పున భారం వేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సుమారు రూ.15 కోట్లను వసూలు చేయనున్నట్లు విద్యుత్ అధికారుల గణాంకాలు వివరిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. అసలు కంటే కొసరు రూపంలో ముక్కుపిండి రాబట్టుతున్నారు. సామాన్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులకు మళ్లీ మోసం నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 2014–19లో కూడా ఇలాగే చెప్పి ఎన్నికల ముందు రెండు నెలలు ఇచ్చారు. –భూమిరెడ్డి భాస్కర్, బీఎస్సీ, బీఈడీ, నిరుద్యోగి, లింగాలదిన్నెపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూపులు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా ద్వారా మూడు విడతల్లో పంట సాగు సమయానికి డబ్బులు అందేవి. –సీవీ సుబ్బారెడ్డి, రైతు, పడమర అనంతపురం, చాపాడు మండలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంటే.. ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు ఎన్నికల హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు రైతు భరోసా పేరిట ఐదేళ్లలో రూ.1,191.03 కోట్లు నేరుగా అందించారు. కర్షకులకు అండగా నిలవాలన్న ఆలోచన చంద్రబాబు సర్కారు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2,10,481 మంది రైతులు సుఖీభవ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా రూ.420.96 కోట్లు రైతులకు అందించాల్సి ఉంది. పీఎం కిసాన్ సాయం నిధుల ద్వారా ఇప్పటికీ కేవలం రూ.2 వేల చొప్పున మాత్రమే రైతులకు నేరుగా లభించింది. అంటే కేవలం రూ.42.09 కోట్లు మాత్రమే వర్తించింది. దాదాపు రూ.380 కోట్లు ఇంకా లభించాల్సి ఉంది. ఆ దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేయడం లేదని కర్షకులు మండిపడుతున్నారు. పథకాల పేర్లు ఘనంగా పెట్టారు, కానీ అమలులో చిత్తశుద్ధి లేదని పలువురు వాపోతున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కూడా అదే పరిస్థితి. 18 ఏళ్లు నిండిన యువతి నుంచి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరువాడ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.18 వేలు బకాయి ఉన్నట్లేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మహిళలు ఆత్మభిమానంతో జీవించాలని మునుపటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు భావిస్తే, చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా పాలిస్తూ ఏకంగా మహిళలోకాన్ని వంచిస్తోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కడపలో బక్రీద్ సందేశం ఇస్తున్న ముఫ్తీ న్యామతుల్లా సాహెబ్, భక్తులతో కలిసి నమాజ్ చేస్తున్న పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ వైఎస్ జగన్ సర్కార్లో.. న్యూస్రీల్ అటకెక్కిన 50 ఏళ్లకే పెన్షన్ వాగ్దానం అందని ద్రాక్షలా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి విద్యుత్ చార్జీలు పెంచమంటూనే బాదుడే బాదుడు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మోసం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.15 వందలు ఉత్తిదే రైతుకు పెట్టుబడి సాయం ఊసేలేదు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు అమలు కాని సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు ఏడాది పాలనపైమండిపడుతున్న ప్రజలు, విపక్షాలు -
పంట కాలువ పూడ్చి.. ఆపై ఆక్రమించి!
సాక్షి టాస్క్ఫోర్స్ : చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో టీడీపీ వర్గీయులు రైతుల పొలాలకు నీటిని అందించాల్సిన పంట కాలువను పూడ్చి తమ పొలంలో కలిపేసుకున్నారు. ఈ ఆక్రమణను గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అద్దాలమర్రి గ్రామంలోని ఆయకట్టు భూములకు పాపాఘ్ని నది నుంచి పెద్ద కాలువ ద్వారా నీరు వస్తుండేది. ఈ కాలువ కుమార్లకాల్వ వద్ద నుంచి ఉండేది. అయితే అద్దాలమర్రికి చెందిన టీడీపీ వర్గీయులు కొందరు కాలువను పూడ్చి తమ పొలంలో కలుపుకుంటే విస్తీర్ణం పెరుగుతుంది.. పైగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఎవరు అడ్డు వచ్చినా తమకేమీ భయం లేదని భావించి ఏకంగా జేసీబీని రప్పించుకొని కాలువను పూడ్చేశారు. కొందరు రైతులు వెళ్లి ఇదేమి న్యాయం.. పూర్వ కాలం నుంచి గ్రామంలోని రైతులందరికీ సాగునీరు అందించే కాలువ ఎలా పూడుస్తారని నిలదీశారు. దీంతో తమకు రెవెన్యూ అధికారులు చెప్పడంతోనే పూడ్చేశాం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పోండి అంటూ ఎదురు దాడికి దిగుతున్నారని రైతులు వాపోయారు. ఈ విషయంపై పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు.చక్రాయపేట మండలంలో టీడీపీ వర్గీయుల ఆక్రమణ పర్వం -
టీడీపీని వీడిన సుగవాసి
సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గ నేతలను వ్యూహాత్మకంగా దూరం పెడుతోందా.. ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా చేస్తోందా అంటే ఔను అనే విశ్లేషకులు జవాబిస్తున్నారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యంలకు కరివేపాకు సామెతను వర్తింపజేశారు. యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేశారు. ఎన్నికల్లో వాడుకుని ఆపై ఏమీ పట్టనట్లు వదిలేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బలిజ సామాజిక వర్గ నేతలను క్రమేపీ దూరం చేశారు. ఆలోచనలు, వ్యూహం, ఎత్తుగడలు మీవే, ఆచరణలో మాత్రమే మేముంటామని చెప్పుకొచ్చి ఎన్నికల్లో వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లేకుండా చేశారు. వెరసి టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని దివంగత మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు బాల సుబ్రహ్మణ్యం తెంచుకు న్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ అంశం ఉమ్మడి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాడు చక్రం తిప్పి..జిల్లాలో బలిజ సామాజికవర్గాన్ని తెలుగుదేశం పార్టీ క్రమేపీ దూరం పెడుతోంది. ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలంతా కనుమరుగయ్యారు. మేధస్సు, సామాజిక బలంతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. ఎన్నికల్లో కోరి రామచంద్రయ్యను రప్పించుకున్నారు. ఎన్నికల తర్వాత విస్మరిస్తూ వచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో ఎందులోనూ రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఉనికి కోసం అన్నట్లుగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య అప్పుడప్పుడు కన్పించడం ఆరంభించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మనస్తాపం చెందిన సుగవాసి కుటుంబం తెలుగుదేశం పార్టీ వైఖరిపై సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మనస్తాపం చెందారు. సీఎం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సహచరుడిగా మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు ఉన్నారు. మునుపటి కాలంలో రాయచోటి ఎన్నికలంటే ప్రత్యక్ష యుద్ధం తెరపైకి వచ్చేది. 1978, 83, 99, 2004లో రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984–89 కాలంలో రాజంపేట ఎంపీగా పని చేశారు. అలాంటి రాజకీయ చరిత్ర ఉన్న పాలకొండ్రాయుడు అనారోగ్యంతో మృతి చెందితే.. ఆయన కుటుంబ పరామర్శకు రాలేదు. జిల్లాలో మహానాడు చేపట్టినా ఆ కుటుంబం వరకూ పోయి వద్దామనే ఆలోచన లేకపోయింది. మరోవైపు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేసి ఓడిపోతే, కనీసం ఇన్చార్జిగా కూడా కేటాయించలేదు. అటు అధిష్టానం వద్ద ఇటు స్థానికంగా మర్యాద లేకుండా పోయింది. పొమ్మనకుండా పొగబెట్టడంతో టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెంచుకోవాల్సి వచ్చిందని పలువురు వివరిస్తున్నారు. ● బత్యాల కనుమరుగు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో అన్నీ తానై నడిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఇటీవల కాలంలో పూర్తిగా కనుమరుగయ్యారు. రైల్వేకోడూరు, రాజంపేట సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గాన్ని అనువుగా మల్చుకునేందుకు ఎన్నికల ముందు బత్యాలకు ప్రాధాన్యత లభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెంగల్రాయుడును రాజకీయంగా దెబ్బకొట్టే చర్యలకు టీడీపీ వ్యవహరిస్తూ వస్తోంది. మరోవైపు సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట నుంచి తప్పించే క్రమంలో.. బత్యాలకు ప్రాధాన్యత లభించిందా అంటే అదీ లేదు. కాగా, పరిశీలకుడిగా కడపకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్రావును నియమించారు. దుర్గా ప్రసాద్ మీద ప్రేమతో వేశారంటే తప్పులో కాలేసినట్లేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2014లో కడప టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుర్గాప్రసాద్కు తర్వాత ఇన్చార్జి పదవి అప్పగించలేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పదవి ఆర్.శ్రీనివాసులరెడ్డికి అప్పగించారు. బలిజ సామాజిక వర్గనేతల్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బలిజ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సీఆర్సీ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల, సుగవాసి బ్రదర్స్కు అప్రాధాన్యత ఎన్నికల్లో ముందు పెట్టుకొని,ఆపై పక్కన పెట్టిన టీడీపీ నేతలు ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బాలసుబ్రహ్మణ్యం పాలకొండ్రాయుడు మృతి తర్వాత పరామర్శ లేకపోవడం రాజంపేట ఇన్చార్జి ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన వైనం -
విత్తన ఎంపికే కీలకం
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. ఇది పంటల దశ, దిశ మార్చడంతో పాటు మంచి దిగుబడులకు దోహదం చేస్తోంది. అలాగే మంచి విత్తన ఎంపిక జరిగితేనే చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడిని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక రైతులు విత్తన ఎంపిక, కొనుగోలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుని అటు వ్యవసాయ అధికారులతోపాటు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే పంట సాగు మొదలుకుని దిగుబడి వరకు పెట్టిన పెట్టుబడి ఖర్చుతో రైతుల కష్టం నేలపాలు అవుతుంది. దీంతో రైతన్నలు ఆర్థికంగా చితికిపోతారు. పంటలు సాగుచేసే ముందు విత్తన ఎంపిక తదితర విషయాల్లో రైతులు కచ్చితంగా వ్యవసాయ, శాస్త్రవేత్తల సలహాలను పాటించాల్సి ఉంది. ప్రారంభమైన ఖరీఫ్ సీజన్.. ఏడాది ముందస్తు రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,28,084 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కానున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీతో మంజూరు చేసింది. దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాలైన సిద్దవటం, చెన్నూరు. కమలాపురం, చాపాడు తదితర మండలాల పరిధిలో నీటి వసతి ఉన్న వారు వరినారు సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఎక్కడపడితే అక్కడ వరి, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగోలు చేసే రైతులు స్థానిక వ్యవసాయ అధికారులు సర్టిఫైడ్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే షాపు యజమాని లైసెన్సు ఉందా లేదా అని తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు కచ్చితంగా బిల్లులు కూడా అడిగి తీసుకోవాలి. తీసుకున్న విత్తన బిల్లులను పంట దిగుబడి చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలి. లేకుంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలను మనం పలు చోట్ల చూస్తునే ఉన్నాం. ఈ నేపథ్యంలో వరితోపాటు ఇతర విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు.. ● వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్ సంతకం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ● ఎక్కడ కూడా లూజు విత్తనాలు, గడువు దాటిన విత్తనాలను ఎలాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. ● కొనుగోలు చేసే విత్తనాల ప్యాకెట్ల నుంచి సంచిపైన సీల్ ఉందా, లేదా అని ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. ● రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు విక్రయదారులు ఇచ్చే కరపత్రాలను తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలు పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. ● విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ● మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. విత్తన కొనుగోలులో సరైన జాగ్రత్తలు పాటించాలి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లులు భద్రం ఖరీఫ్లో 1,28,084 హెక్టార్లలో సాగుమొలక శాతం పరీక్షించాలి.. రైతులు ఎవరైనా బయట డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో లైసెన్సులు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల మొలకశాతం చెక్ చేసుకోవాలి. మొలకశాతం తక్కువగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయవద్దు. మొలకశాతం బాగుంటేనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి. – డాక్టర్ వీరన్న, ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, కడపబిల్లులు కచ్చితంగా తీసుకోవాలి.. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసే రైతులు కచ్చితంగా బిల్లులు అడిగి తీసుకోవాలి. పంట దిగుబడి వచ్చే వరకు రైతులు బిల్లులను భద్రంగా దాచుకోవాలి. పంటలో పూత పిందె, దిగుబడిలో తేడా వస్తే స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ప్రాణం తీసిన ఈత సరదా
జమ్మలమడుగు : సరదాగా ఈత కొట్టేందుకు పెన్నా నదిలోని నీటిలోకి దిగిన తండ్రీ కొడుకులు దుర్మరణం చెందిన సంఘటన శనివారం జమ్మలమడుగు మండలంలో జరిగింది. వివరాలు ఇలా..తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుక చెందిన మనోహర్ (38), అతని కుమారుడు డియోల్ (17) పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సోదరి ప్రమీలా రాణి ఇంటికి వచ్చారు. శనివారం పర్యాటక కేంద్రమైన గండికోటను సందర్శించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ముద్దనూరు– జమ్మలమడుగు రహదారిలోని పెన్నానదిలో నీటిని చూసి ఈత కొట్టేందుకు దిగారు. బ్రిడ్జి సమీపంలో గుంత ఉన్న విషయం వారికి తెలియదు. తొలుత మనోహర్ నీళ్లలోకి దిగగానే అక్కడ పెద్ద గుంత ఉండటంతో అందులో పడిపోయాడు. గమనించిన కుమారుడు డియోల్ తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించి అతను కూడా అదే గుంతలో కూరుకుపోయి గల్లంతయ్యారు. తమ కళ్లెదుటే తండ్రీ కొడుకులు నీళ్లలో గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తండ్రి, కుమారుడి మృతదేహాలను బయటికి తీశారు. ఇద్దరి మృతదేహాలను చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లింగప్ప తెలిపారు.పెన్నానదిలో దిగి తండ్రీ తనయుల దుర్మరణం -
ఎల్ఎల్బీ సెమిస్టర్ల ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఎల్ఎల్బీ (3,5 సంవత్సరాల), 3 5, 7, 9 సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు, అకడమిక్ డీన్ ఆచార్య చంద్ర ఓబులరెడ్డి శుక్రవారం పరిపాలన భవనంలో విడుదల చేశారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ 81 శాతం, ఐదో సెమిస్టర్ 76, ఏడో సెమిస్టర్ 61, తొమ్మిదో సెమిస్టర్లో 91.67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సు 3వ సెమిస్టర్ లో 23.81 శాతం, 5వ సెమిస్టర్లో 88.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేసిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగాన్ని రిజిస్ట్రార్ అభినందించారు. శాంతియుతంగా బక్రీద్ను జరుపుకోండి కడప అర్బన్: మత సామరస్యానికి ప్రతీకై న వైఎస్సార్ కడప జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, సుఖశాంతులతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ సూచించారు. సమైక్యత, సమానత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పండుగ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తినట్లు తెలిపారు. పోలీస్ పికెట్లు, చెక్పోస్ట్లను ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ పార్టీలు, స్పెషల్ పార్టీ, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పుకార్లు, సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఫిర్యాదు కానీ, ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని వివరించారు. -
ఉరికి వేలాడుతూ వివాహిత మృతి
అత్త, భర్త వేధింపులతోనే చనిపోయిందని తల్లిదండ్రుల ఫిర్యాదు మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఉరికి వేలాడుతూ అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో వెలుగుచూసింది. బాధితుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం, బికేపల్లి కాలనీకి చెందిన శివకేశవ, రెడ్డమ్మ దంపతుల కుమార్తె తేజశ్రీ (23)ను మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరీనగర్కు చెందిన రఘుకు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి ఏడాది కుమారుడు ఆదిత్య ఉన్నాడు. రఘు చేనేత చీరలకు రంగులద్దుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా రఘు మద్యానికి బానిస కావడంతో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం తేవాలని, మనుమడు తేజశ్రీకి ఆభరణాలు చేయించాలని కొంతకాలంగా కోడలు అత్త చల్లమ్మ వేధిస్తోంది. ఈ క్రమంలో రఘు స్వగ్రామం తమిళనాడు రాష్ట్రం సేలంలో జాతరకు వెళ్లాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయినా రఘు ఇంటికి రాకపోవడంతో తేజశ్రీ భర్తకు ఫోన్ చేసింది. జాతరకు బయలుదేరాలి కదా.. త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. అయితే తనకు పని ఉందని, వేరే చోట పార్టీ ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన తేజశ్రీ ఇంట్లో తలుపునకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బిడ్డ ఆదిత్య ఏడుపు విన్న స్థానికులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అల్లుడి ఇంటి వద్దకు చేరుకున్న తేజశ్రీ తల్లిదండ్రులు విషయం తెలుసుకని ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే కుమార్తె మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చే గదికి తరలించారు. తమ కుమార్తె మృతికి భర్త, అత్త వేధింపులే కారణమని, ఒంటిపై గాయాలున్నాయని, అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి శివకేశవ, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
● ప్రస్తుతం కురుస్తున్న వానతో..
ప్రస్తుతం కురుస్తున్న వానలను రైతులు సద్వినియోగం చేసుకుని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. ముఖ్యంగా దుక్కులను లోతుగా, వాలుగా, అడ్డంగా దున్నుకోవాలి. వాలు, అడ్డం దున్నడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికి రాగానే.. పంట నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్తా చెదారం కాల్చివేయకుండా అలాగే వదిలేసి ఉంటారు. ఈ వర్షంతో లోతు దుక్కులు చేయడంతో నేలల్లో కలిసి పోయి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. లోతు దుక్కలు చేయడం వల్ల కలుపు నివారణ మొక్కలు కూడా నశించిపోతాయి. -
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
ఓబులవారిపల్లె : నగలు అమ్మి వైద్యం చేయించినా నయం కాకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోతోంది. లక్షల రూపాయలు చికిత్సకు ఇంకా కావాలని చెప్పడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. మండలంలోని చిన్నఓరంపాడు దళితవాడ గ్రామానికి చెందిన కోటపాడి ఉమామహేశ్వరరావు పెగలూరు మండల మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉమా మహేశ్వరరావుకు భార్య ఉమాకుమారి, ఇద్దరు కుమారులు జతిన్కుమార్, గణపతి ఉన్నారు. వీరు రైల్వేకోడూరులోని అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. ఉమా కుమారి కుట్టు మిషన్ కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు తిరుపతి ఆసుపత్రిలో చేర్పించారు. శరీరంలోని అవయవాలు పనిచేయడం లేదని.. చెప్పడంతో చికిత్స కోసం దాదాపు పది లక్షల రూపాయలు బంగారు అమ్మి, అప్పు చేసి చెల్లించారు. ఇంకా లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. భర్తకు వచ్చిన జీతాలు పోగా ఆస్తులు అమ్మి డబ్బు ఆసుపత్రికి కట్టినా ఇంకా నయం కాకపోవడంతో మరింత ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. దాతలు ఆర్థిక సహకారం అందించి తమ తండ్రి ప్రాణాలు కాపాడాలని కుమారులు కోరుకుంటున్నారు. -
లక్ష సౌర గృహాలే లక్ష్యం
కడప కార్పొరేషన్: జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చడమే లక్ష్యంగా పని చేయాలని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.రమణ అన్నారు. స్థానిక విద్యుత్ భవన్లోని తన చాంబర్లో బ్యాంకర్లు, అధికారులు, సంస్థాపన వెండర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు నిబంధనలు సులభతరం చేశామని, వీటిని ప్రజలకు తెలియజేసి అవగాహన పెంచాలన్నారు. సిబిల్ స్కోర్ను బట్టి బ్యాంకులు రుణాలు వేగ వంతం ఇస్తాయని తెలిపారు. ఒక్క కిలో వాట్ కెపాసిటీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 120 యూనిట్ల విద్యుత్తు, రెండు కిలోవాట్ల కెపాసిటీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 240 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందన్నారు. వినియోగదారులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పొంది సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంకర్స్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.జనార్దన్, నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ యల్లారెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మధుసూదన్, హరిసేవ్య నాయక్, భరణి క్రిష్ణ, ప్రసాద్రెడ్డి, డీఈఈ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఆన్లైన్ పరీక్ష శుక్రవారం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులంతా నిర్ణత సమయానికంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని అధికారులు కేంద్రం వెలుపలనే క్షుణంగా తనిఖీ చేశారు. ఒరిజినల్ హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిశీలించన తర్వాతే లోపలికి అనుమతించారు. మొదటి రోజు కడప, ప్రొద్దుటూరు కేంద్రాలలో ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్కు సంబంధించి 1781 మంది అభ్యర్థులకు గాను 1584 మంది హాజరు కాగా 197 మంది గైర్హాజరైనట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉదయం కడపలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం, అన్నమాచార్య, స్విస్ట్లతోపాటు ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 936 మంది అభ్యర్థులకు గాను 862 మంది హాజరు కాగా 74 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం కడపలో అన్నమాచార్య, కేఓఆర్ఎం, కేఎల్ఎంతోపాటు ప్రొద్దుటూరులో సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 845 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా 123 మంది గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలకు కేటాయించిన డిప్యూటీ కలెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ కడపలోని కేఎస్ఆర్ఎంతోపాటు స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలను తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని డీఈఓ తెలిపారు. -
వైభవం.. పల్నాటి అంకాలమ్మ బ్రహ్మోత్సవం
బి.కోడూరు : మండలంలోని రాజుపాళెంలో గల పల్నాటి అంకాలమ్మ దేవత బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చివరి ఘట్టమైన శుక్రవారం కంప తొక్కే కార్యక్రమాన్ని మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి దంపతులు హాజరై పూజలు జరిపారు. అనంతరం వారు సాంస్కతిక కార్యక్రమాలను తిలకించారు. డీసీ.గోవిందరెడ్డి మాట్లాడుతూ తిరునాలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని, ముళ్ల కంపలపై నడవడం విశేషంగా ఉంటుందని తెలిపారు. పవిత్ర కార్యక్రమాలను జరుపుకోవడం ఎంతో ఆనందమన్నారు. అనంతరం బండలాగుడు పోటీలను బద్వేల్ టీడీపీ ఇన్చార్జి రితీష్కుమార్ రెడ్డి, డీసీసీ బ్యాంకు ఛైర్మన్ ఎం.సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. విజేతలకు వారు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, మాధవరెడ్డి, ఓబుళరెడ్డి వెంకటరామిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, కొండా వెంకటరామిరెడ్డి, కొండా రమణారెడ్డి, దేవినేని సుబ్బరామిరెడ్డి, కొండా వెంకటసుబ్బారెడ్డి, బోరెడ్డిచెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోటార్ బైక్ దగ్ధం
వేంపల్లె : మంటలు చెలరేగి ఆటో రిక్షా అమర్చిన మోటార్ బైక్ దగ్ధమైంది. వేంపల్లెకు చెందిన రహంతు ల్లా మోటార్ బైక్కు రిక్షా బిగించుకుని మూటలు మో స్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి పులివెందుల రోడ్డులోని టీఎంఆర్ సూపర్మార్కెట్ వద్ద వాహనాన్ని నిలిపి ఉండగా, ఒక్కసారిగా మోటార్ బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుప్రక్కల వారు మంటలను అదుపుచేసేందుకు నీటిని చల్లడంతో ఆటో రిక్షా కాలిపోలేదు. అయితే అప్పటికే మోటార్ బైక్కాలిపోయింది. కూలి పనులు చేసుకునే తనకు మోటార్ బైక్ తెచ్చుకునే స్థోమత లేదని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని శివాలయం సెంటర్ సమీపంలోని మైదుకూరు రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. అతను శుక్రవారం రోడ్డుపై పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎస్ఐ ఆరా తీశారు. అతడికి సంబంధించిన వివరాలు లభించకపోవడంతో మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడికి సుమారు 35ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో డీ హైడ్రేషన్ కారణంగా అతను చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులుంటే టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. విద్యార్థిని అదృశ్యం బి.కొత్తకోట : స్థానిక జయశ్రీ కాలనీ చెందిన విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 19 ఏళ్ల విద్యార్థిని బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 4న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న విద్యార్థిని కనిపించలేదు. ఆచూకీ కోసం గాలించినా కనిపించలేదు. దీంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ మృతి రాజంపేట : రాజంపేట –రాయచోటి ఘాట్ రో డ్డులోని ఎస్ఆర్పాలెం సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ నాగరాజు(40) దుర్మరణం చెందారు. మృతుడు రాజంపేట పట్టణంలోని సుద్దగుంతలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆటో నడుపుకొని జీవిస్తున్న కుటుంబం ఇప్పుడు పెద్దదిక్కును కోల్పోయి కన్నీటిపర్యంతమవుతోంది. ఆటోను ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొందని, కేసుపై పోలీసులపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య సామిల్లు దగ్ధం రాజంపేట రూరల్ : నందలూరు మండలం ఎర్రిపాపయ్యగారిపల్లికి చెందిన పీ.హరికృష్ణ జీవనోపాధి కోసం డివిజనల్ సబ్ స్టేషన్ సమీపంలో సామిల్లు నడుపుకొంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఉన్నపాటుగా మిల్లులో మంటలు చెలరేగి కొయ్యలు దగ్ధమయ్యాయి. రాజంపేట అగ్నిమాపక అధికారి కే.మాబుసుభాన్, సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. జిల్లా అగ్నిమాపక అధికారి సునీల్కుమార్ శుక్రవారం ఆ స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారాణాలను ఆరా తీశారు. -
సమాజ సేవే ముఖ్యం
కమలాపురం : తమ పరిశ్రమ కేవలం వ్యాపారం మాత్రమే చేయడంలేదని, దాంతోపాటు సమాజ సేవలో ముందుందని భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(బీసీసీపీఎల్) సీఎంఓ సాయి రమేష్ తెలిపారు. స్థానిక క్రాస్ రోడ్డు వద్దగల ఆర్సీఎం ఆసుపత్రి భవనంలో పలువురికి శిక్షణ సర్టిఫికెట్లు శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీసీపీఎల్ ఆర్థిక సహకారంతో సంభవ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల పేదలకు ఆర్టీసీ ద్వారా ఉచితంగా 32 రోజుల శిక్షణ ఇచ్చి హెవీ లైసెన్స్ ఇప్పించారన్నారు. ఇప్పటికే పలు చోట బస్ షెల్టర్లు, నీటి శుద్ధి కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, డయాలసిస్, హిమో డయాలసిస్ సెంటర్లు, మరుగుదొడ్లు ఏర్పాటుచేశామన్నారు. దత్తత గ్రామాల పాఠశాలల్లో ఫర్నిచర్తోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు మెరుగుపరిచామన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకు శిక్షణ నిచ్చి హెవీ లైసెన్స్ ఇప్పించడంతోపాటు ఆర్టీసీలోనే ఉపాధి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ చీఫ్ మేనేజర్లు గోపాల్రెడ్డి, పేర్ల భార్గవ్ రెడ్డి, సీఎస్ఆర్ చీఫ్ నీతేశ్వర్, ఫౌండేషన్ జీఎం గిరిధర్ రెడ్డి, ఆర్టీసీ ట్రైనర్ జబ్బార్ వలి, సిబ్బంది పాల్గొన్నారు. భారతి సిమెంట్ సీఎంఓ సాయి రమేష్ -
చీనీ చెట్ల నరికివేత
కొండాపురం : మండలంలోని యనమలచింతల గ్రామానికి చెందిన మండ్ల ప్రసాద్ చీనీ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు 41 చెట్లు శుక్రవారం నరికేశారని తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండ్ల ప్రసాద్ చీనీ తోటలో 130 చీనీ మొక్కలు ఉన్నాయని, వాటిలో 41 మొక్కలను గురువారం నరికినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.గంజాయి విక్రేతల అరెస్టుప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దువ్వూరు రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన మేరకు.. గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సీవీ.సురేంద్రరెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.నీలకంఠేశ్వరరెడ్డి, సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడిలో హుస్సేన్ బాషా, సంతోష్, కార్తీక్లను అరెస్టు చేసి వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
అదును.. పదును
● జిల్లాలో కురుస్తున్న వర్షం ● లోతు దుక్కులతో భూసారం పెంపు ● చీడపీడలు, కలుపుమొక్కలకు చెక్ ● భూగర్భ జలాల నిల్వకు అవకాశం కడప అగ్రికల్చర్: ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల సాగులో రైతులకు కలుపు సమస్య దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కలుపు యాజమాన్య ప్రక్రియ వర్షం కురిసినప్పటి నుంచే చేపడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. వర్షం కురవగానే భూమిలోని కలుపునకు సంబంధించిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. తక్షణం లోతు దుక్కులను చేపడితే చాలా మటుకు కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. పంటల సాగు సమయానికి మీద మీద రెండు సార్లు దుక్కులు(సేద్యాలను) చేస్తే కలుపు మొక్కలు దాదాపు నివారించుకోవచ్చ. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,28,084 హెక్టార్లలో పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ అధికారులు నిర్దేశించారు. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వాతావరణ మార్పుతోపాటు రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఆరుతడి పంటలైన సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, ెపెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్ఫ్లవర్, సోయాబీన్ తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. మారిన వ్యవసాయ పద్ధతులతో వివిధ పంటల్లో కలుపు నివారించేందుకు రైతులు పలు రకాల మందులపై ఆధార పడుతున్నారు. విత్తనం వేశాక, పైరు పెరిగే దశలో మందుల వాడకంతో కలుపు నివారణ చేపడుతున్నారు. ఇలా కలుపు మందులను పిచికారి చేయడం ద్వారా భూమి సారవంతం కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కలుపు మందులపై ఆధార పడే ముందు రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంటల నూర్పిడి తరువాత.. పంటల నూర్పిడి తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. కావున ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో రైతులు పంటలు సాగు చేసుకునే సమయానికి లోతు దుక్కులను చేపడితే బోలెడు లాభాలు ఉన్నాయి. లోతు దక్కులు చేయడం వల్ల భూమి పైపొరలు కిందకి, కింద పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. అలాగే లోతు దుక్కలను చేపట్టడం వల్ల భూమిలో ఉండే పురుగులు, కలుపు మొక్కల నివారణ జరుగుతుంది. వేసవిలో చాలా మంది రైతులు పశువులు, ఆవులు, గొర్రెల పెంట, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం చేస్తారు. ప్రస్తుతం దున్నుతున్న దుక్కులతో అవన్నీ భూమిలో కలిసిపోయి భూమి సారవంతంగా మారుతుంది. దీంతోపాటు భూమి ఎక్కువకాలం తేమను కలిగి ఉంటుంది. రైతులు లోతు దక్కులు చేపట్టాలి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది. – అయితా నాగేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి పంటలు లేనప్పుడే.. వేసవిలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగు లు పంట కోత దశల్లో వాటి నిద్రావస్థ దశలో.. నేల, చెత్తాచెదారం, కోయ కాడల్లో ఎక్కవకాలం గడపుతాయి. అలాగే తెగుళ్లను కలుగ చేసే శిలీంద్రా లు భూమిలోపల ఆశ్రయం పొందుతా యి. వీటి శీలింద్ర భీజాలు భూ మిలో నిల్వ ఉంటాయి. ప్రస్తుతం కురిసిన వర్షంతో లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలోని చీడ పురుగు కోశా లు, గుడ్లు, లార్వాలు పక్షు లు, కొంగలు, కాకులు తిని నాశనం చేస్తాయి. దీంతోపాటు కులుపునకు సంబంధించిన విత్తనాలు కూడా చనిపోతాయి. -
బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో చేరండి
వేంపల్లె : ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో బ్రాహ్మణులందరూ సభ్యులుగా చేరాలని బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీఎస్వీ.ప్రసాదరావు ఓ ప్రకటనలో కోరారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా చేరి ముగ్గురితో గ్రూపు ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేస్తారన్నారు. వ్యక్తిగత రుణాలు తీసుకునే అవకాశం ఉందని, వ్యాపారం కోసం మొదట్లో రూ.2 లక్షలు రుణం పొందవచ్చునన్నారు. 18–60 ఏళ్ల లోపు బ్రాహ్మణులందరూ సభ్యత్వం పొందవచ్చునన్నారు.ఈ అవకాశాన్ని అర్హులైన బ్రాహ్మణులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీమ్డ్ యూనివర్శిటీగా ఆదిశంకర నెల్లూరు (టౌన్) : ఆదిశంకర గ్రూపు ఆప్ ఇన్స్టిట్యూట్కు డీమ్డ్ యూనివర్శిటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు లభించిందని ఆ విద్యా సంస్థల గ్రూపు చైర్మన్ వంకిపెంచలయ్య తెలిపారు. స్థానిక దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్లో డీమ్డ్ యూనివర్శిటీ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ జోన్లో డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది కేవలం ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల మాత్రమేనని చెప్పారు. 2001లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల నేడు 8వేల మంది విద్యార్థులతో ఉందన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం వద్ద కొత్తగా ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందు మధ్వాచార్య, ప్రొఫెసర్లు వేణుమాధవ్, ధనుంజయ, ఏఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. పది మూల్యాంకనంలో నిర్లక్ష్యం రాయచోటి జగదాంబసెంటర్ : పదో తరగతి ఫలితాల మూల్యాంకనంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చక్రధర్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్దాస్ అన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ డీఈఓ సుబ్రహ్మణ్యంను శుక్రవారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని, మూల్యాంకనంలో లోపాలతో అనుత్తీర్ణత సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ మార్కుల జాబితాపై అనుమానంతో ఉన్నారని, రీవాల్యుయేషన్కు ఎలాంటి ఫీజు లేకుండా అవకాశం కల్పించాలన్నారు. తుది ఫలితాలు వచ్చే వరకూ పది మార్కుల ఆధారంగా జరిగే అడ్మిషన్లను నిలిపివేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్రెడ్డి, మణికంఠారెడ్డి, యూసఫ్ఖాన్, లోకనాథం, శివకుమార్, మొఘల్ ఫైజాన్బేగ్, సయ్యద్ ఫైజాన్, జగదీష్, షేక్ ఒబైజ్, షేక్ మహమ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. 13న వెలిగల్లు ఉద్యానవనంలో యోగాంధ్ర గాలివీడు : ఈ నెల 13న వెలిగల్లు ఉద్యానవనంలో యోగాంధ్ర కార్యక్రమం ని ర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి హామీ పిడీ వెంకటరత్నం, టూరిజం అధికారి నాగ భూషణం తెలిపారు. మండల ఎంపీడీఓ జవహర్బాబుతో కలసి గాలివీడు మండలంలోని వెలిగల్లు ఉద్యానవన స్థలాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించగలరని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ హరిబాబు,తదితరులు పాల్గొన్నారు. మహల్లో బ్యానర్లకు చిచ్చు కలికిరి : మండలంలోని గుండ్లూరులో వెలసిన మూలస్థానమ్మ తిరునాల ప్రారంభం కానున్న నేపథ్యంలో అద్దవారిపల్లి పంచాయతీ పరిధిలోని మహల్ యర్రదొడ్డిపల్లి వైఎస్సార్సీపీ యువత బ్యానర్ ఏర్పాటుచేశారు. ఇది ఓర్వలేని టీడీపీ నాయకుడైన సతీష్రెడ్డి అనుచరుడు హరీష్ శుక్రవారం మధ్యాహ్యం 1.50గంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోలు బ్యానర్పై పోసి నిప్పంటించాడు. స్థానిక సీసీ కెమరాల్లో రికార్డవడంతో వైఎస్సార్సీపీ నాయకులు ప్రదీప్కుమార్రెడ్డి, రిజ్వాన్, యువత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు ఏర్పాటు చేసిన గుండ్లూరు మూలస్థానమ్మ జాతర బ్యానర్పై పెట్రోలు నిప్పటించడం హేయమైన చర్య అని పలువురు అసహనం వ్యక్తం చేశారు. -
● వలంటీర్ల సేవలు అమూల్యం
● హామీ ఇచ్చి.. విస్మరించి.. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే వలంటీర్లలో విద్యార్హతలను బట్టి తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత పొందేలా చర్యలు తీసుకుంటామంటూ ఊరూరా తిరిగి హామీలు ఇచ్చారు. అయితే ‘ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..’ అన్న చందంగా అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడారు. పైగా ప్రజల్లో జగన్ చేసిన మంచి పనులను లేకుండా చేయడం ద్వారా ఆయన ముద్ర చెరిపి వేసేందుకు సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే చర్యలకు సిద్ధం కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప సెవెన్రోడ్స్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టింది. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటు చేసింది. పాలనను ప్రజల ఇంటి ముగింటకు చేర్చింది. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ఉంటే.. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముద్ర చిరస్థాయిగా ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎలాగైనా ఆ ముద్ర చెరిపేయాలని కుట్ర పన్నుతోంది. ఇందుకోసం ఏకంగా ఆ వ్యవస్థల ఎత్తివేత దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. సచివాలయ వ్యవస్థను క్రమేణా కనుమరుగు చేయాలని చూస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ దూరమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విప్లవాత్మక మార్పు ఎన్టీ రామారావు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారు. అప్పట్లో అది ఓ విప్లవాత్మకమైన మార్పు. దాని కొనసాగింపుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి.. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన తీసుకు రావడం ద్వారా ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా నిలిచారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటి తలుపు తట్టాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవస్థ ప్రజలకు తప్పింది. ఏ చిన్న పనైనా వలంటీర్కు చెబితే ఇట్టే పరిష్కారమయ్యేది. మైఖేల్ క్రిమేర్, ఫ్రెంచ్–అమెరికన్ ఎకానమిస్ట్ ఈస్తర్ డఫ్లో వంటి నోబెల్ బహుమతి గ్రహీతలు సైతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాల తీరును పరిశీలించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా సచివాలయాలను కనుమరుగు చేసే చర్యలకు పాల్పడుతోంది. బాపూజీ కల సాకారం దిశగా... మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాాజ్య సాకారం కోసం 2020 అక్టోబరు 2వ తేదీన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లాలో 423 గ్రామ సచివాయాలు, 226 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ శాఖలకు చెందిన 536 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అత్యధిక సేవలు కేవలం 15 నిమిషాల నుంచి 72 గంటల్లోనే ప్రజలకు అందేవి. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను నియమించారు. వీరికి ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్లు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, లా నేస్తం, చేదోడు, చేయూత, ఈబీసీ నేస్తం, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కు సంబంధించిన సాయం, వివాహ రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ అప్డేషన్, ఇసుక బుకింగ్ వంటి అనేక సేవలు ప్రజలకు అందజేయడంలో వలంటీర్లు ఎంతో కీలకంగా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని తీసు కొచ్చినా.. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం మొదలు, వారితో దరఖాస్తు చేయించి లబ్ధి పొందేందుకు వలంటీర్లు ఎంతో సహకరించారు. వైఎస్సార్సీపీ హయాంలో గ్రామ స్వరాజ్యం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటు ఇంటి ముంగిటకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జగన్ ముద్ర చెరిపేసేందుకు కూటమి కుట్ర ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థకు మంగళం సచివాలయాల ఎత్తివేతకు పన్నాగం పేదల సంక్షేమంపై నీలినీడలు సచివాలయ, వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దనే అందడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తప్పిపోయింది. ఇందువల్ల తమ పనులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే అధికారులకు లంచాలు ఇచ్చే అవసరం తప్పింది. ప్రభుత్వం చేపట్టే ప్రతి ఇంటింటి సర్వే నిర్వహించడంలో వలంటీర్ల కృషి మరువలేనిది. ముఖ్యంగా కరోనా విజృంభించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో కూడా.. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వేతోపాటు పెన్షన్లు, ప్రభుత్వ ఆర్థికసాయం, మాస్క్లు, శానిటైజర్లు, మందులు వంటివి అందజేశారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కరోనా అంటే వణికిపోయినా.. ఆ రోజుల్లో ఇంటింటికీ తిరిగి అమూల్యమైన సేవలు అందించారు. వలంటీర్ల సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం వారిని సత్కరించి గౌరవించింది. -
పాత కక్షలతోనే ఆంజనేయులు హత్య
వీరపునాయునిపల్లె : పాత కక్షలతోనే అనిమెల ఆంజనేయులు హత్య జరిగిందని, ఆ కేసులో నిందితులను గురువారం సాయంత్రం అరెస్టు చేశామని పెండ్లిమర్రి సీఐ చల్లనిదొర తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వీరపునాయునిపల్లెకు చెందిన బెలుకూరు నవీన్, నరేష్లకు ఇంటి వద్ద గత పదేళ్లుగా తగాదా ఉండేదన్నారు. 2014లో అదే గ్రామానికి చెందిన బోగాధి చీనీ, నిమ్మ చెట్లను ఆంజనేయులు నరికి వేయగా, దీనిపై కేసు నమోదైందన్నారు. ఇటీవల నరేష్ కుటుంబీకులను ఆంజనేయులు బెదిరించడంతో అతడితోపాటు నవీన్, బోగాధి కలిసి ఆంజనేయులను హత్య చేయాలని భావించారు. బెలుకూరి రెడ్డిమహేష్ ఆంజనేయులు ఇంటికి వస్తున్న సమాచారాన్ని అందించాడు. దీంతో గత నెల 27న ఆంజనేయులు ఇంటికి వెళ్తుండగా.. కాపుకాసి రోకలిబండతో కొట్టి, పిడి బాకులతో పొడిచి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం 6.03 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకొని నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్ర వారం కమలాపురం కోర్టులో హాజరుపరచినట్లు తెలియజేశారు. ముగ్గురు నిందితుల అరెస్టు -
గుప్త నిధుల ముఠా విధ్వంసం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయసముద్రం చెరువు కట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి విధ్వంసం సృష్టించారు. నిమ్మకాయలతో మంత్రించిన అనంతరం క్షుద్ర పూజలు చేసి ఆంజనేయస్వామి విగ్రహాన్ని, బలమైన రాతి దూలాలు తొలగించారు. సొరంగాన్ని తలపించేలా లోతుగా తవ్వి ఆలయంబయట ధ్వజ స్థంభాన్ని పెకిలించారు. నిర్జన ప్రదేశంలో ఆలయాలు ఉండడంతో దుండగులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. చెరువు సంఘం అధ్యక్షుడు రమేష్బాబు, సర్పంచ్ రహ్మతుల్లా, సిబ్బంది ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కట్ట దిగువ ఉన్న పురాతన వేదగిరి లక్ష్మినరసింహస్వామి ఆలయంలోనూ గత ఏడాది గోపురం, ధ్వజ స్తంభాలు పెకిలించారు. గుప్త నిధుల ముఠా సభ్యుల సంచారంపై పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. హనుమాన్ విగ్రహం, ధ్వజ స్తంభం తొలగింపు సొరంగంలా తవ్వి వదలేసిన దుండగులు -
రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి
అనంతపురం సిటీ : అనంతపురం రైల్వే స్టేషన్లో కదిలే రైలు ఎక్కబోయి.. ప్రమాదవశాత్తూ అదుపు తప్పి పడిపోయిన దూదేకుల సంజీవరాయుడు(60) మరణించినట్లు జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు.. సంజీవరాయుడుకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. ఎర్రగుంట్లలోని చిన్న కొడుకు వద్ద ఉంటున్న రాయుడు హోటల్లో పనిచేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. తాగుడు అలవాటు ఉన్న రాయుడు.. యథావిధిగా హోటల్లో పని ముగించుకొని.. మందుకొట్టి గురువారం రాత్రికి వెళ్లాడు. దీంతో చిన్న కొడుకు తిట్టడంతో మనస్తాపానికి గురైన రాయుడు రాత్రికి ఇంటి నుంచి వచ్చేసి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయమే మచిలీపట్నం–ధర్మవరం రైలెక్కి వచ్చేశాడు. రైలు అనంతపురం చేరుకోగానే నీళ్ల కోసం దిగిన రాయుడు.. రైలు కదులుతుండడం చూసి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించారు. -
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్.. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో ఆయన పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్కు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
డీఎస్సీకి సర్వం సిద్ధం
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఈ నెల 30 వరకు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 43575 మంది అభ్యర్థులు రాయనున్నారు. రెండు విడతల్లో పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఉదయం సెషన్ 9.30 నుంచి 12 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యలో ఒక రోజు ఇంగ్లిష్ ప్రొిపిసెన్సీ టెట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కూడా రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 11 నుంచి 12.30 వరకు మధ్యాహ్న 4 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాల్లో.. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. కడపలో ఆరు, ప్రొద్దుటూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడపలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం, కేఎల్ఎం, శ్రీనివాస, స్విస్ట్, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తారు. వీటిలో 30,586 మంది అభ్యర్థులు రాయనున్నారు. ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెకా్నాలజీ, వాగ్దేవి, సీబీఐటి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 12989 మంది అభ్యర్థులు రాయనున్నారు. పర్యవేక్షణ: పరీక్ష పర్యవేక్షణకు ప్రతి కేంద్రంలో ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక డిపార్ట్మెంట్ అధికారి, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. వీరితోపాటు కడపకు కడప డివిజన్ డిప్యూటీ డీఈ రాజగోపాల్రెడ్డి, ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓ మీనాక్షిని నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు ఎస్ఏ సంస్కృతం – – 1 1 ఎస్ఏ తెలుగు 26 – – 26 ఎస్ఏ ఉర్దూ 6 – 1 7 ఎస్ఏ హిందీ 16 1 1 18 ఎస్ఏ ఇంగ్లిషు 78 1 2 81 ఎస్ఏ మ్యాథ్స్(టీఎం) 42 – 1 43 ఎస్ఏ మ్యాథ్స్(యూఎం) – 1 – 1 ఎస్ఏ పీఎస్(టీఎం) 28 – – 28 ఎస్ఏ పీఎస్(యూఎం) 2 – 1 3 ఎస్ఏ బీఎస్(టీఎం) 49 2 – 51 ఎస్ఏ బీఎస్(యూఎం) 2 – – 2 ఎస్ఏ ఎస్ఎస్(టీఎం) 58 1 1 60 ఎస్ఏ ఎస్ఎస్(యూఎం) 5 – – 1 ఎస్ఏ పీఈ 77 1 4 82 ఎస్జీటీ (టీఎం) 219 21 12 252 ఎస్జీటీ(యూఎం) 31 7 7 45 మొత్తం 639 35 31 705 గంట ముందే చేరుకోవాలి నిర్ణీత సమయం కంటే గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒరిజినల్ హాల్టికెట్తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట తీసుకుని రావాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను అను మతించరు. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి సబ్జెక్టు ప్రభుత్వ, జెడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం నేటి నుంచి ప్రారంభం కానున్న ఆన్లైన్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 30 వరకు.. 705 పోస్టులకు 43575 మంది దరఖాస్తు అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు -
ప్రజలే తిరగబడే రోజులొస్తున్నాయి
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలాగే కొనసాగిస్తూ పోతే.. ప్రజలు ఎదురుదాడి చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల ఆరో తేదీన పేకాట ఆడుతున్నారని 12 మందిపై ఖాజీపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం లక్ష్మినారాయణరెడ్డిని ఏ3గా చేర్చారన్నారు. రెడ్హ్యాండెడ్గా పోలీసులు పట్టుకోలేదని, పోలీస్స్టేషన్కు పిలిపిస్తే వారు వెళ్లారన్నారు. మూడు రోజులపాటు స్టేషన్లో చితక్కొట్టి 9వ తేదీన గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఇటీవల అతను జైలు నుంచి విడుదలై వచ్చి నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడన్నారు. లక్ష్మినారాయణరెడ్డి చాలా సున్నిత మనస్కుడని, అతనికి ఇది వరకు నేరచరిత్ర లేదన్నారు. పోలీసులు అసత్య సమాచారంతో తప్పుడు కేసు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఇలా హింసించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని, ఎవరి వత్తాసుతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తమ చేతగాక అవినీతి పోలీసులను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని, వారిపై ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చామన్నారు. లక్ష్మినారాయణరెడ్డి మృతదేహంతో పోలీస్స్టేషన్ వద్దే ఆందోళన నిర్వహించాలని అనుకున్నామని, జిల్లా ఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించుకున్నామని తెలిపారు. పోలీసులు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు : అంజద్బాషా లక్షల రూపాయలు ఇవ్వాలని లక్ష్మినారాయణరెడ్డిపై ఖాజీపేట పోలీసులు ఒత్తిడి చేశారని, అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆరోపించారు. ప్రజల బాగోగుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వారిని అవమానిస్తోందన్నారు. రోడ్డుపై పూలు అమ్ముకునే వ్యక్తిని లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా డబ్బుల కోసం తీవ్రంగా వేధించారన్నారు. వారి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సీఐపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవమానం జరిగాక బతికి ఉపయోగం లేదనే ఆత్మహత్య : రెడ్యం పోలీసులు గంజాయి కేసు పెట్టడంపై లక్ష్మినారాయణరెడ్డి తీవ్ర అవమానంగా భావించాడని, ఇంత అవమానం జరిగిన తర్వాత బతికి లాభం లేదనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. పోలీసులు అతన్ని పదే పదే స్టేషన్కు పిలిపించి కొట్టారని, పిలిపించిన ప్రతి సారీ డబ్బు రాబట్టారన్నారు. జైల్లో కూడా తీవ్ర అవమానాలకు గురయ్యాడన్నారు. మృతుడికి ఆరో తరగతి చదివే పిల్లలు ఉన్నారని, వారికి ఇప్పుడు భద్రత, రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. లక్ష్మినారాయణరెడ్డిని హింసించిన సీఐపై కేసు నమోదు చేయాలి లేనిపక్షంలో వైఎస్సార్సీపీఆధ్వర్యంలో ఆందోళనలు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హెచ్చరిక పార్టీ నేతలతో కలిసి ఎస్పీకి వినతిపత్రం -
● నా భర్త మృతికి బాధ్యత ఎవరిది?
ఖాజీపేట: పోలీసులు పెట్టిన తప్పుడు కేసు, ఆపై వేధింపులు.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నా యి. ఒక కుటుంబాన్ని వీధిన పడేలా చేశాయి. ఇద్దరు చిన్నారులను తండ్రిని కోల్పోయిన వారిగా మార్చా యి. పేకాట కేసులో తీసుకొచ్చిన వారిపై ఖాజీపేట పోలీసులు కేసులు నమోదు చేయకుండా.. డబ్బులు బేరసారాలు చేయడం, కుదరక పోవడంతో గంజాయి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన దుంపలగట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణమైంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీ సమీపంలో మే 6న పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేయడానికి వారు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. అక్కడికి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేశారు. సుమారు 12 మంది పేకాట ఆడేందుకు వస్తున్నట్లు అనుమానించారు. అందులో దుర్గం ఖాదర్ బాషా, సిద్దంగారి గురుమహేశ్వర్రెడ్డి, రెడ్యం శివలక్ష్మినారాణరెడ్డి, మాచుపల్లి గుర్రప్ప, ఇరగంరెడ్డి భరత్రెడ్డి, నాగూర్ బాషా, కమాల్బాషా, లక్ష్మిరెడ్డి, నాగేంద్రరెడ్డి, ఫరూక్, కుమార్రెడ్డి, లోకేష్రెడ్డిలు పేకాట ఆడేందుకు వెళ్తున్నట్లు అనుమానించారు. వారిని మే 6న ఖాజీపేట పోలీస్స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు. అయితే పేకాట ఆడలేదని వారిలో కొందరు చెప్పారు. దీంతో అప్పుడు కేసు నమోదు చేయకుండా పంపించారు. అనంతరం 7, 8వ తేదీల్లో పిలిపించారు. వారిలో కొందరిని డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. ఇవ్వక పోవడంతో 9న పేకాటతోపాటు గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు 12 మందిపై కేసు నమోదు చేశారు. 2.570 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు, రూ 20,500 నగదు, 52 పేక ముక్కలు దొరికినట్లు కేసు కట్టారు. అందులో 9 మందిని అరెస్ట్ చేసి కోర్డుకు పంపించారు. ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు కేసులో కనపరిచారు. రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్య ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డిని నిందితునిగా చేర్చి, అతనిపై గంజాయి కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మే 9న అరెస్టయిన అతను మే 29న కండీషన్ బెయిల్పై బయటికి వచ్చాడు. వచ్చిన తరువాత కూడా తనను పోలీసులు చేసిన చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులకు వివరించాడు. దెబ్బలను తన భార్య సుభాషిణికి చూపించాడు. తనకు ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారని భార్య వద్ద తీవ్ర మనోవేదన వ్యక్తం చేశాడు. దీనికి తోడు కండీషనల్ బెయిల్పై రావడంతో.. ప్రతి వారంలో రెండు సార్లు పోలీస్స్టేషన్కు వచ్చి సంతకాలు చేసి పోవాల్సి వచ్చింది. సంతకాలకు వెళ్లినప్పుడల్లా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు భార్య దగ్గర వాపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్లిన నారాయణరెడ్డి పుష్పగిరికి వెళ్లే రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. అప్పటికే వెతుకుతున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. అయినా వెంటనే చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. సీఐపై మృతుడి భార్య ఫిర్యాదు తన భర్త నారాయణరెడ్డి మృతికి ఖాజీపేట సీఐ మోహన్ వేధింపులే కారణం అని రెడ్యం సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6న రోడ్డుపై పూలు అమ్ముకుంటున్న తమ వద్దకు పోలీసులు వచ్చి తన భర్త గురించి అడిగారని చెప్పింది. స్టేషన్ వద్దకు వెళ్తే తన భర్తను విచక్షణా రహితంగా, దారుణంగా కొట్టారని తెలిపింది. తమ వద్ద లక్ష డబ్బు డిమాండ్ చేశారని పేర్కొంది. అలాగే బెయిల్పై వచ్చిన తరువాత సంతకాలకు వెళ్లినప్పుడు డబ్బులు డిమాండ్ చేశారని వాపోయింది. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తన భర్త చావుకు కారణమైన సీఐని శిక్షించాలని మైదుకూరు అర్చన్ సీఐకి ఫిర్యాదు చేసింది. ‘నా భర్త నారాయణరెడ్డి పోలీసుల వేధింపులతోనే చనిపోయాడు. మా కుటుంబానికి దిక్కు లేకుండా చేశారు. ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాకు ఉన్న పెద్ద దిక్కు లేకుండా చేశారు. ఇందుకు కారణం పోలీసులే.. ఇప్పుడు నా భర్త మృతికి బాధ్యత ఎవరు తీసుకుంటారు. నాకు న్యాయం చేయాలి’ అని నారాయణరెడ్డి భార్య గుండెలవిసేలా రోదించింది. ఆమె ఆవేదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది. విద్యుత్ తీగలు పట్టుకుని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కడప అర్బన్: దుంపలగట్టుకు చెందిన రెడ్యెం శివలక్ష్మినారాయణరెడ్డి గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడని.. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా అన్నారు. రిమ్స్ మార్చురీలో శివలక్ష్మినారాయణరెడ్డి మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మృతుడి భార్య సుహాసిని, పిల్లలు, బంధువులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సంఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. -
చిత్తూరు,అనంతపురం జట్ల విజయ ఢంకా
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ – 23 వన్డే క్రికెట్ టోర్నీ చిత్తూరు, అనంతపురం జట్లు వి జయ ఢంకా మోగించాయి. గురువారం వైయస్ రాజా రెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు జట్టుపై చిత్తూరు జట్టు 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 50.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీనారాయణ అద్భు తంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. 102 బంతులను ఎ దుర్కొని 10 బౌండరీలు, 3 సిక్సర్ల సహాయంతో 112 పరుగులు (సెంచరీ) చేశాడు. నికిత్ గౌడ్ 60 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని మాధవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 297 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెల్లూరు జట్టు 42.2 ఓవర్లలో 202 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని మన్విత్ రెడ్డి 52, అర్జున్ 37 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బాలాజీ 4, రెడ్డి ప్రకాష్ 3 ముఖేష్ 2 వికెట్లు తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో... కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్లో కర్నూలు జట్టుపై 3 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 38.1 ఓవర్లలో 196 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని నయీముల్లా 59, కనీష్ 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున 4, దీపక్ 2, షేక్ కామిల్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 34.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులోని మహేంద్ర రెడ్డి 67, అర్జున్ టెండూల్కర్ 40 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3, సాబ్జాన్ బాషా 2 వికెట్లు తీసుకున్నారు. -
ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోందని, నిన్న తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాలు విజయవంతమై ఈ విషయం స్పష్టమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం విజయవంతమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు బాధ, నిరాశ, నిస్పృహలతో ఉన్నారని, వారి ఆగ్రహం ఈ విధంగా వ్యక్తమైందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్, బీజేపీ నేతలు ఏ హామీలు ఇచ్చారో మర్చిపోయారని, ప్రజలు మాత్రం వాటిని బాగా గుర్తుంచుకున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ.1.56 లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ నిధులను దేనికి ఖర్చుపెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేసిందని, ఆ నిధులను డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు నేరుగా చేరవేయడం జరిగిందన్నారు. తల్లులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులకు ఈ ప్రభు త్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. ఆ హామీలను వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుఅబ్బా కొడుకులు తమ డబ్బా కొట్టుకోవడానికే ఏడాది కాలం గడిచిపోయిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై మక్కువతో పాలనను గాలికొదిలేశారన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్న విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితమే వెన్నుపోట్లతో మొదలైందన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని కై వసం చేసుకున్నారన్నారు. కడపలో మహానాడు నిర్వహించి కడప మా అడ్డా అంటూ డబ్బా కొట్టుకున్నారని, నేడు వెన్నుపోటు దినం విజయవంతంతో రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ అడ్డా అని రుజువైందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాగ్రహాన్ని అణిచివేయాలని చూసిన ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యిందన్నారు. చంద్రబాబు, లోకేష్లకు దమ్ముంటే ఏడాది పాలనపై సంబరాలకు పిలుపు ఇవ్వాలని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలను వడ్డీతో సహా చెల్లించే వరకూ తాము ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పులి సునీల్, పి.జయచంద్రారెడ్డి, జి.శ్రీనివాసులరెడ్డి, సీహెచ్ వినోద్, షేక్ షఫీ, మునిశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘వెన్నుపోటు దినం’ విజయవంతం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
12న షర్మిల రాక
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాకు ఈ నెల 12న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వస్తున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాభవన్లో పార్టీ కోఆర్డినేటర్లు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల ప్రెసిడెంట్లు, మైనారిటీ నాయకులతో ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపలోని ఐఎంఏ హాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ పదవులు పొందిన నాయకులతో వ్యక్తిగతంగా షర్మిల క్షేత్ర, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారని చెప్పారు. కష్టపడి పని చేసే నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిని కార్యాలయంలోకి కూడా అనుమతించరన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వన మహోత్సవానికి శ్రీకారం కడప ఎడ్యుకేషన్: ‘హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 5 నుంచి కార్తీక మాసం వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవాన్ని యోగివేమన యూనివర్సిటీ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ప్రారంభించారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, గౌరవ అతిథులుగా డీఎఫ్ఓ వినీత్ కుమార్ (టెరిటోరియల్), డీఎఫ్ఓ (సామాజిక వన్య అటవీ సంరక్షణ), కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మ, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, డీపీవో రాజ్యలక్ష్మి హాజరై అడవి జాతి మొక్కలు నాటి ‘హరితాంధ్ర ప్రదేశ్’ లక్ష్య సాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం గురించి వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో విశిష్టమైన సేవలు అందించిన మధుసూదన్రెడ్డి, (బోటనీ ప్రొఫెసర్), అంకాల్, మునెయ్య, ద్వారకా నాథరెడ్డి, లక్ష్మిరెడ్డిలు సమాజ హితం కోసం చేసిన సేవలను ప్రశంసిస్తూ వారికి అవార్డులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన యూనివర్సిటీ, అటవీశాఖ, డ్వామా, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య కారణాలతో ఎలక్ట్రీషియన్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో వెలుగు చూసింది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లుకు చెందిన హరి ప్రసాద్ (32) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య నాగవేణి రెండు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా హరిప్రసాద్ కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. వ్యాధులను బాగు చేసుకునేందుకు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. అయినా పరిస్థితి మెరుగు పడకపోగా నానాటికి క్షీణిస్తూ ఉండడంతో మానసికంగా కుంగిపోయాడు. వారం రోజుల క్రితం భార్య నాగవేణి కుమారుడిని, ఆమె పుట్టిల్లు అయిన చౌడేపల్లి మండలం చదళ్ల పంచా యతీ బోయపల్లెలో విడిచిపెట్టి వచ్చాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు విచారణ చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో.. మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, భార్య అనారోగ్యం, అప్పులు తదితర కారణాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ములకలచెరువు మండలంలో వెలుగు చూసింది. మండలంలోని మద్దినాయన పల్లె పంచాయతీ నాయనవారిపల్లెకు చెందిన పెద్ద రెడ్డప్ప కుమారుడు శంకర (39) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య రాధమ్మ స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తూ ఉంది. ఆరు నెలల క్రితం ప్రమాదం కారణంగా రాధమ్మకు కాలు విరిగింది. ఆమెకు చికిత్స చేయించడానికి పలువురి వద్ద శంకర, దాదాపు రూ 10 లక్షలు అప్పులు చేశాడు. ఇటీవల కొంతకాలంగా రుణ దాతల నుంచి ఒత్తిడి అధికం కావడం. దీనికి తోడు కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవలు జరుగుతుండడం, తదితర కారణాలతో మనస్తాపం చెంది, బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో ములకలచెరువు పోలీసులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జీవితంపై విరక్తితో.. లింగాల : మండలంలోని తాతిరెడ్డిపల్లె గ్రామంలో గురువారం గవిరెడ్డి శివారెడ్డి (60) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చాలా కాలం నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆలనా పాలనా చూసేందుకు భార్య లేకపోవడంతోపాటు గతంలోనే కుమారుడు మృతి చెందాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెంది తన పాత ఇంట్లో దంతెలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగాల పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు
వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పి.నరేన్రెడ్డి పెండ్లిమర్రి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేయడం, దాడులకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పి,నరేన్ రామాంజులరెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దౌర్జన్యాలను సహించేంది లేదని హెచ్చరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ రైతు సర్దార్ హుస్సేన్ భూమిలో కంచె, రేకుల షెడ్ తొలగించిన ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సర్దార్ హుస్సేన్కు చెందిన పట్టా భూమిలో, భూమి పక్కన తమ ఆధీనంలో ఉన్న స్థలంలో రేకులషెడ్డు, కంచె ఏర్పాటు చేసుకున్నాడన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు రైతుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా జేసీబీ యంత్రంతో తొలగించడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ అనురాధకు ఫోన్ చేసి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని అడిగితే తాను అక్కడికి వచ్చి పరిశీలిస్తానని ఆమె చెబుతున్నారన్నారు. ఇప్పడు పరిశీలిస్తే ఏమి లాభమన్నారు. రైతుకు దాదాపు రూ.2 లక్షలు నష్టం జరిగిందని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రైతుకు అధికారులు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ తరపున ఎంతటి పోరాటానికై నా సిద్ధమన్నారు. కూటమి నేతల ఆగడాలు, భూకబ్జాల విషయంలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ జోక్యం చేసుకొని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మాజీ మండల ఉపాధ్యక్షుడు నాగమల్లారెడ్డి, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సుబ్బారెడ్డి, శ్రీనువాసులురెడ్డి పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వీఆర్ఓ దుర్మరణం
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం మండలానికి చెందిన వీఆర్ఓ ఈశ్వరయ్య (59) మృతి చెందారు. టి.చదిపిరాళ్లకు ఇన్చార్జి వీఆర్ఓగా పని చేస్తున్న ఈశ్వరయ్య గురువారం జంగంపల్లెలో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు డీలర్ సతీష్ అలియాస్ నానిని తన బైక్లో ఎక్కించుకుని చదిపిరాళ్ల నుంచి బయలుదేరారు. మార్గ మధ్యంలో రామచంద్రాపురం వద్దకు రాగానే కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ ఈశ్వరయ్య బైక్ను ఢీ కొంది. ఈ ఘటనలో ఈశ్వరయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న నాని ఎగిరి పడటంతో కాలు విరిగింది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఈశ్వరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా మృతునికి భార్య, వివాహిత కుమార్తె ఉన్నారు. ఈశ్వరయ్య అందరితో కలివిడిగా ఉండటంతో ప్రజలు ఆసుపత్రికి తండోపతండాలుగా చేరుకున్నారు. ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఒత్తిడి, టార్గెట్ల కారణంగానే ఈశ్వరయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఇది ప్రభుత్వ హత్యే.. వీఆర్ఓ ఈశ్వరయ్యది ప్రభుత్వ హత్యే అని ప్రభుత్వ మాజీ ఉద్యాన సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాల కోసమే క్షేత్ర స్థాయి సిబ్బందిపై పని ఒత్తిడి పెంచారన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజనం కూడా తినకుండానే రేషన్ సరుకుల పంపిణీ కోసం ఫింగర్ వేయడానికి వెళ్లిన ఈశ్వరయ్య ఇలా మృత్యువాత పడటం విచారకరమన్నారు. వీఆర్ఓ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
త్యాగమయ జీవితం బక్రీద్ సందేశం
కడప కల్చరల్ : సృష్టి ఎంతో అద్భుతమైనది.. .సకల చరాచరాలతో నిండి ఉన్న దీన్ని ఏకేశ్వరుడైన అల్లాహ్ సృష్టించాడు. ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసేందుకు వెనుకాడకూడదని సందేశాన్నిచ్చే పండుగ బక్రీద్. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతి, సహనశీలత, రుజు వర్తనలను తెలుపుతుంది. మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం పక్షాన అవతరించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఐదు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన శ్రీదేవుడే సకల చరాచర సృష్టికి కారకుడని, ఆయన పట్ల భక్తి, శ్రద్ధలు ప్రకటించడం ద్వారా ముక్తిని పొందవచ్చని జాతికి పిలుపునిచ్చారు. ఈ పండుగలోని ముఖ్యాంశాలు పాఠకుల కోసం.. సమర్పణలో సంతృప్తి ఇస్లాంలో రంజాన్కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, బక్రీద్కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. శనివారం ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇస్తారు. మరో భాగాన్ని తమ కోసం వాడుకుంటారు. త్యాగమంటే ఇదే! బక్రీద్ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా పెద్దలు పేర్కొంటారు. దేవుడొక్కడే అన్న ఆయన వాదాన్ని వ్యతిరేకించిన వారు ఆయనపై కక్ష గట్టి ఆయనను శారీరక, మానసిక హింసలు పెట్టి, తుద ముట్టించేందుకు ఎన్నో యత్నాలు చేశారు. వృద్ధాప్యం వచ్చినా సంతానం లేకపోవడం ప్రవక్త ఇబ్రహీంను వేధించేది. మంచి సంతానాన్ని ప్రసాదించమని ఆయన నిరంతరం ఏకేశ్వరుడిని ప్రార్థించేవారు. 86 ఏళ్ల వయసులో ఆయనకు దైవం ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆనందంలో ఓలలాడుతున్న సమయంలో దైవం ఇబ్రహీం భక్తిని పరీక్షించదలిచారు. నీ ప్రియ పుత్రుడిని మానవ మాత్రలు సంచరించని ఎడారిలో వదిలేయమని ఆజ్ఞాపించారు. పుత్రునికంటే దైవం ఆదేశమే గొప్పదన్న విశ్వాసంతో ఇబ్రహీం తన సతీమణి బీబీ హాజిరాను, కుమారుడు ఇస్మాయిల్ను ఎడారిలో వదిలి పెట్టారు. తల్లీ బిడ్డ ఆకలి దప్పులతో అలమటించారు. అక్కడి సఫా కొండల మధ్య నీళ్ల కోసం వెదికారు. ఇస్మాయిల్ దాహంతో గిలగిల్లాడుతున్నప్పుడు అతడి కాలి మడమల మధ్య ఇసుకలో గుంత ఏర్పడి, ఆ ఎడారిలో నీటి ఊట ఏర్పడుతుంది. అదే సెలయేటిగా మారింది. ఆ నీటినే పవిత్రమైన ‘జమ్జమ్’ పానీ అంటారు. హజ్కు వెళ్లిన యాత్రికులు ఆ పవిత్ర ‘జమ్ జమ్’ జలాన్ని సేవించి తమ బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల కోసం కూడా తీసుకెళతారు. మరొక పరీక్ష ప్రవక్త ఇబ్రహీంకు దైవం మరొక కఠిన పరీక్ష పెట్టారు. కలలో అందిన సూచన మేరకు ఆయన తన కుమారు డిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు. కుమారుడు కూడా దైవాజ్ఞను శిరసావహించేందుకు అంగీకరిస్తాడు. తండ్రి ఇబ్రహీం కుమారుడిని ‘జుబాహ్’ చేశాడు. తీరా చూస్తే కుమారుడికి బదులు అక్కడ ఒక గొర్రె జుబాహ్ చేయబడి ఉంటుంది. దైవం పట్ల ప్రవక్త ఇబ్రహీంకు గల ఆచంచల భక్తి, విశ్వాసాలకు, త్యాగనిరతికి ప్రతీకగా ముస్లింలు యేటా ‘ఈద్–ఉల్– జుహా’ పండుగను నిర్వహించుకుంటున్నారు. రేపు ఈద్–ఉల్–జుహా (బక్రీద్)ఖుర్బానీ జంతువుల రక్త మాంసాలు అల్లాహ్కు చేరవు. కేవలం మీ భయభక్తులే భయ భక్తులు, విశ్వాసం, సమర్పణ గుణాలే చేరుతాయి – దివ్య ఖురాన్ -
పారదర్శకంగా పోలీసుల బదిలీలు
కడప అర్బన్ : పారదర్శకత, నిబంధనలే ప్రామాణికంగా తీసుకుని పోలీస్ సిబ్బంది సీనియారిటీ ఆధారంగా వారు కోరుకున్న చోటికే జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ బదిలీ చేశారు. గురువారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ముగ్గురు ఏఎస్ఐలు, 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 104 మంది కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగడంతో సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, డీటీసీ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ జ్యోతి, సూపరింటెండెంట్లు, సిబ్బంది, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సతీష్ రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం
వేంపల్లె : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిని గురువారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కలిశారు. వేంపల్లెలోని తన స్వగృహంలో ఉన్న సతీష్ రెడ్డితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం తమ బంధువుల వివాహా ఆహ్వాన పత్రికను సతీష్రెడ్డికి అందజేశారు. సతీష్ రెడ్డిని కలిసిన వారిలో కడప కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, అజ్మతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, వేంపల్లె మండల వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు మునీర్, షేక్షావలి, మాజీ ఉప సర్పంచ్ మునీర్, బాబా షరీఫ్, షామీర్ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణికుమారి (52) మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ39 ఏజెడ్ 2259 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు రాయచోటి వైపు నుంచి కడపకు వస్తుండగా ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొంది. ఇదే సమయంలో రాయచోటి వైపు నుంచి వస్తున్న ఏపీ 39 క్యూవీ 0525 నెంబర్ గల కారు వేగాన్ని అదుపుచేయలేక స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులో స్వయంగా వాహనాన్ని నడుపుతున్న కడప రాఘవేంద్ర టౌన్షిప్లో నివాసం ఉంటూ రామాపురం మండలం సరస్వతిపల్లె ఎంపీపీ స్కూలు ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న రాణికుమారి అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి వైపు నుంచి వస్తుండిన మరో కారులో ప్రయాణిస్తున్న రాయచోటి డిప్యూటీ డీఈఎంఓ అధికారి దేవశిరోమణితోపాటు కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన రాణికుమారికి భర్త పుల్లయ్య, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. రాణి కుమారి కారులో నుంచి హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ నరసింహులు బ్యాగులను స్వాధీనం చేసుకుని అందులోని సుమారు 50 తులాలకుపైగా బంగారు ఆభరణాలతో కూడిన రెండు బ్యాగులను చింతకొమ్మదిన్నె పోలీసులకు ఇచ్చారు. వారు వాటిని సంఘటన ప్రాంతంలోనే మృతురాలి బంధువులకు అప్పగించారు. గాయపడిన దేవశిరోమణి కడప నగరంలోని రాజారెడ్డి వీధి నివాసురాలు, ఈమె కారు డ్రైవర్ పెంచల బాబు కూడా కడపలోనే ఉంటున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోక పోవడం గమనార్హం. ఈ రోడ్డు ప్రమాదంపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాయచోటి డిప్యూటీ డీఈఎంఓ దేవశిరోమణికి తీవ్ర గాయాలు -
రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ విజేత కడప
కడప వైఎస్ఆర్ సర్కిల్ : గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజయం సాధించినట్లు కడప జర్నలిస్టు టీం మేనేజర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. గుంటూరు పోలీసు గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చిత్తూరు జట్టుపై భారీ విజయం సాధించి కప్పును కై వసం చేసుకుందన్నారు. నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జట్ల పైన విజయం సాధించారన్నారు. కడప టీం సభ్యుడు పఠాన్ సెంచరీ సాధించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. ఈ విజయం సాధించడం పట్ల కెప్టెన్ రామసుబ్బారెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ హర్హం వ్యక్తం చేశారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి విజేతలకు అభినందనలు తెలిపారు. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు, పోలీసులే కాదు.. ఆఖరికి ఆ పార్టీలకు కొమ్ముకాసే సోషల్ మీడియా యాక్టివిస్టులూ చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకూ అంతులేకుండాపోతోంది. పోలీసులు చేష్టలుడిగి చూడటం మినహా వీరినేమీ చేయలేకపోతున్నారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మన్నూరు చంద్రకాంత్ చౌదరి (సీమరాజా) ఇలాగే అధికారం అండతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. పైగా.. వాళ్లపై గంజాయి కేసు నమోదుచేయాలంటూ పోలీసుస్టేషన్లో నానాయాగీ చేశాడు. అన్నమయ్య జిల్లా చిట్వేల్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. సీమరాజా, మరికొందరు ఫుల్గా మద్యం తాగి కారులో పెనగలూరు నుంచి చిట్వేల్ బయల్దేరారు. అదే సమయంలో రాజంపేటలో సినిమా చూసి మోటారుసైకిల్పై షేక్ రసూల్, కె.పెంచలయ్య చిట్వేల్ మండలం గట్టుమీదపల్లె స్వగ్రామానికి వెళ్తున్నారు. గొల్లపల్లి వద్ద మోటారు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి సీమ రాజా కారు వచ్చింది. కారు హారన్ కొట్టినా వెంటనే తప్పుకోకపోవడంతో సీమరాజాకు కోపం వచ్చింది. దీంతో కారు ఆపి బైక్పై వెళ్తున్న వారిపై దాడిచేశాడు. ‘అన్నా మీరు మాకు తెలుసన్నా, యూట్యూబ్లో చూస్తున్నాం, మేమేం చేశామన్నా’.. అంటూ ప్రాథేయపడ్డా వినకుండా.. ‘కొడకుల్లారా’.. అంటూ బండబూతులు అందుకున్నాడు. దీంతో భయపడ్డ రసూల్, పెంచలయ్య పరిచయస్తుడు శంకరయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కొట్టారు. బయటికి వచ్చిన శంకరయ్యనూ సీమరాజా కొట్టాడు. ముగ్గురినీ కారులో చిట్వేల్ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీసుస్టేషన్లో ముగ్గురిపై గంజాయి కేసు పెట్టండని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ‘అన్నా మేమేం చేశామన్నా’.. అంటూ పోలీసుల సమక్షంలో ఆ ముగ్గురూ బతిమాలినా విన్పించుకోకుండా అక్కడా రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగడాలు..పెనగలూరు మండలం కట్టవారిపల్లెకు చెందిన మన్నూరు చంద్రకాంత్ చౌదరి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడుండగానే ‘సీమరాజా’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టాడు. అందులో వైఎస్సార్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసేది టీడీపీ కోసమేనని వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమరాజా అరాచకాలకు అంతులేకుండాపోయింది. చంద్రకాంత్ చౌదరి అత్యంత జులాయిగా వ్యవహరిస్తూ, మద్యం మత్తులో దాదాగిరి చేయడం అలవాటుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సీమరాజా వెకిలి వీడియోలపై వైఎస్సార్సీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.ఏమైందంటున్నా వినిపించుకోకుండా కొట్టారు నేను నిద్రపోతుండగా మా ఇంటి గేటు కొట్టారు. గేటు తీశాను. అంతే.. ఒక్క ఉదుటున నాపైనా దాడిచేశారు. వారు ఎవరన్నది నాకు తెలీదు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. ఏమైందని అడిగినా వినిపించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టారు.– కడియం శంకరయ్యఅకారణంగా కొట్టారు మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లె గ్రామం. నేను నా స్నేహితుడితో కలిసి రాజంపేట నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో వస్తుండగా మా వెనుక కారొచి్చంది. హారన్ కొట్టగా మీరు వెళ్లాలని చేయిచూపిస్తూ బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టారు. కారులో ఊరు బయటికి తీసువెళ్లి చెప్పుతో కూడా కొట్టారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని పచ్చిబూతులు తిడుతూ స్టేషన్లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినా చంపేస్తామని చిత్రహింసలు పెట్టారు. – షేక్ రసూల్పోలీస్ స్టేషన్లోనూ రెచ్చిపోయారుచిట్వేల్ మండలం కతిరోపల్లె వద్ద వెనుక వైపు నుంచి కారు హారన్ కొడుతూ వచ్చారు. దీంతో.. మీరు వెళ్లాలని సైగల ద్వారా చెప్పగానే కారు నిలబెట్టి బండ బూతులు తిడుతూ కొట్టాడు. గొంతు పట్టుకుని కొట్టాడు. పోలీసుస్టేషన్లో కూడా అలాగే రెచ్చిపోయాడు. – కె పెంచలయ్య -
మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీమరాజా మరికొందరు ఫుల్గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్ స్టేషన్కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.తాను వైఎస్సార్సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. -
వంచనపై గర్జన
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా కొనసాగించకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగింది శూన్యమని చంద్రబాబు ఏడాదికే విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరింది. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏఓ శంకరయ్యకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్ పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి జనం పోటెత్తారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీ‹Ùరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పాత ఆర్టీసీ బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ చేరింది. అనంతరం ఆర్డీఓ వెంకటేశంకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్ నుంచి మొదలైన ఈ ర్యాలీ శ్రీరాములుపేట మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరింది. అనంతరం కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ లక్షి్మదేవి, మాజీ ఆప్కాబ్ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ అంకాలమ్మ దేవాలయం మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఉదయభారతికి వినతి పత్రం సమరి్పంచారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ రాజగోపాల్రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ నారాపురం దేవాలయం, తేరు రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, ఎస్బీఐ, పాతబస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ ఆర్డీఓ సాయిశ్రీ కి వినతి పత్రం సమరి్పంచారు. అలాగే యర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సు«దీర్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. ఆయా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల నేతలు హృషికేశవరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. కమలాపురం పట్టణంలోని ఖాజీపేట రోడ్డులో ఉన్న గయాజ్ ఫిల్టింగ్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శివరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తమారెడ్డి, వీరారెడ్డి, జీఎన్ భాస్కర్రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అని రుజువు చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. సూపర్సిక్స్ పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోనికి వచ్చాక వాటి అమలు మరచిపోయారు. బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటి అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అంటూ రుజువు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 75 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి అభివృద్ధి అంటూ టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కమీషన్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఎంత మంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు వేయకుండా తల్లులకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ పథకం ఊసేలేదు. , రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు అన్నారు. వాలంటీర్లకు నెలకు పదివేల ఇస్తామన్నారు. ఇంత వరకు ఈ పథకాలను అమలు చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలందరికీ వెన్నుపోటు పొడవడం నైజంగా మారింది. పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. – పి.రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతులను నిండా ముంచారు.. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇవ్వలేదు. చంద్రబాబు , పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను మరచిపోయారు. జమ్మలమడుగు లో దాలి్మయా పరిశ్రమ వల్ల మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామాల ప్రజలకు న్యాయంజరిగిన తర్వాతే దాలి్మయా రెండోప్లాంట్ ప్రారంభం అవుతుందని ప్రజాభిప్రాయ సేకరణకు ముందు గ్రామాల్లో తిరిగి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట మార్చి సిమెంట్ పరిశ్రమకు మద్దతు పలికి గ్రామ ప్రజలను మోసం చేశారు. కూటమి నేతలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోనికి రాగానే వాటిని తుంగలోతొక్కారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. – రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీవెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలను వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్కకాదు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ముస్లిం మైనారీ్టలకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతిచ్చి మోసం చేశారు. హామీలు పక్కనబెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ.. అరాచక పాలన చేస్తున్నారు. చిన్నారులపై , మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధిని పక్కనబెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. – అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఏడాది పాలన నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కడపలో మహానాడు నిర్వహించారు. మహానాడు సందర్భంగానైనా ఈ జిల్లాకు ఏం చేస్తారో చెప్పలేదు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం, నగదు ఇచ్చి జనాన్ని మహానాడుకు తరలించారు. మేము నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి కూటమి నేతలు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. – సురేష్ బాబు, కడప మేయర్ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ.. ? కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు హామీల సంగతి ఏమైంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డీఏలను విడుదల చేసి పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయగా, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతూ ఇబ్బందులు పెడుతోంది. – ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
పేకాట జోరు.. బతుకు తారుమారు
టాస్క్ఫోర్స్ : కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించకపోయినా పేకాట క్లబ్బులు మాత్రం అన్నమయ్య జిల్లాలోని మంత్రి ఇలాకాలో మూడు పువ్వులు 36 కాయలుగా కనిపిస్తున్నాయి. జాకీ, క్విన్, కింగ్, ఆన్ అంటూ పేకాట స్థావరాలు విరాజిల్లుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఖాకీ, ఖద్దరులే కాపలాగా మారి పేకాట స్థావరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్క చిన్నమండెం మండల పరిధిలోనే రోజుకు కోటి రూపాయలకు పైగానే పేకాట జరుగుతున్న మాట అక్షర సత్యం, రాయచోటి పట్టణ పరిధిలోని శివారు ప్రాంతాలలో నూతనంగా నిర్వహిస్తున్న గృహాలు, గ్రామీణ ప్రాంతాలలోని మామిడి తోటలు, ఫామ్ హౌస్లలో పేకాట జోరుగా నడుస్తోంది. ఆట నిర్వహణ ద్వారా రోజుకు లక్షల రూపాయలు ఆదాయాన్ని నిర్వాహకులు గడిస్తున్నారు. వచ్చిన ఆదాయంలో మంత్రి అనుయాయులకు సగం డబ్బులు ముడుతున్నట్లు ప్రచారం ఉంది. ఆటలలో పాల్గొని వారి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ. 3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీటి నిర్వహణలో పోలీస్ శాఖలోని ఓ నిఘా అధికారి ఇటీవలనే పేకాట కారణంగా సస్పెండ్కు గురైనా పోలీసు హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు పక్కనే ఉన్న చిన్నమండెం మండలంలో పేకాట జోరుగా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూర్చున్న చోటనే సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొంతమంది జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆశకు వెళ్లి జీవితాలను చిన్నాభినం చేసుకుంటున్నారు. మంత్రి నియోజకవర్గమైన రాయచోటి, ఆయన సొంత మండలమైన చిన్నమండెం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో జాద శాలలు నడుస్తున్నాయి. ఎవరైనా పోలీసులకు సమాచారం ఇచ్చినా మంత్రి ఇలాకాలోని గ్రామాలలోకి పోలీసులు అడుగులు వేయలేకపోతున్నారు. ఒకవేళ దాడులు నిర్వహించినా స్టేషన్కు వెళ్లకుండానే పట్టుబడిన పేకాట రాయుళ్లు దర్జాగా ఇళ్లకు వెళ్తున్నారు. స్థానిక పోలీసుల నుంచి చర్యలు లేకపోవడంతో జిల్లా ఎస్పీ నేరుగా కొంతమంది సిబ్బందిని నియమించుకొని కఠిన చర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదన్న వాదనలు ఉన్నాయి. అనేక మంది వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ కుటుంబ సభ్యులు లక్షలు, కోట్ల రూపాయలు ఆస్తులు అమ్మి పేకాటలో పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇల్లు.. మామిడి తోటలే అడ్డాలు.. ఎవరికీ అనుమానం రాకుండా పేకాటరాయుళ్లు ఇల్లు, మామిడి తోటలు, ఫామ్ హౌసులు, అటవీ ప్రాంతాలలో ప్రత్యేక స్థావరాలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆట ఆడేవారికి మినహా మరెవ్వరికీ సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాల వద్దకు జనం చేరుకుంటున్నారు. చీకటి పడే వరకు ఈ ఆటలు కొనసాగుతున్నాయి. రోడ్ల వెంట సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్లను పెట్టుకొని జూద శాలలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి.. అన్నమయ్య జిల్లాలోని పేకాట స్థావరాలకు స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం, కర్ణాటక రాష్ట్ర ప్రాంతాల నుంచి జూదరులు వస్తున్నారు. గ్రామాల వారిగా పోలీసులకు బాధ్యతలు అప్పగించినా దాడులు చేసి వాటి నివారణ చర్యలు చేపట్టిన సంఘటనలు లేవనే చెప్పవచ్చు. పేకాట ఆడుతున్న సమయంలో ఎవరైనా పోలీసులు దాడులు చేస్తే చాలా మంది జూదరులు వారి కళ్లు గప్పి పారిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా.. మంత్రి ఇలాకాలో విచ్చలవిడిగా జరుగుతున్న పేకాట కారణంగా మంత్రి అనుయాయులకు రోజువారిగా సమకూరుతున్న ఆదాయాన్ని చూసి జిల్లాలోని మిగిలిన నేతలు కూడా పేకాట స్థావరాల నిర్వహణకు మెగ్గుచూపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసు శాఖలో పనిచేస్తూ సస్పెండ్కు గురైన కానిస్టేబుల్, కడపలో పోలీసులకే డాన్గా వ్యవహరిస్తున్న అశోక్ రెడ్డి, మదనపల్లికి చెందిన హేమంత్ రెడ్డి, చిన్నమండెంలోని నర్సరీ రమణ, మల్లూరు శేఖర్ రెడ్డి, నిఘా అధికారికి అత్యంత సన్నిహితుడైన డాబా అంజిలతోపాటు రాయచోటిలో మంత్రి ముఖ్య అనుచరుడు వీటి నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. అడ్డుకట్ట పడేది ఎలా. ? విచ్చలవిడిగా జరుగుతున్న పేకాటను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టడం అవసరం. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదని తెలుస్తోంది. పట్టుబడిన జూదరులు బయటకు వచ్చి మరలా పేకాట ఆడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్పా జూదానికి అడ్డుకట్ట పడేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాకీ, క్వీన్, కింగ్, ఆన్ అంటూ జిల్లాలో పేకాట స్థావరాలు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న మంత్రి అనుయాయులు రోజుకు టర్నోవర్ కోటి రూపాయలు పైబడే రాయచోటి, చిన్నమండెం కేంద్రాలుగా యథేచ్ఛగా జూదం అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న పేకాట -
రేషన్ పంపిణీలో అవకతవకలు తగదు
రాయచోటి టౌన్ : దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేయాలని రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ రేషన్ షాపు డీలర్లకు సూచించారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన రేషన్.. పరేషాన్ అనే కథనంపై ఆయన స్పందించారు. బుధవారం రాయచోటి పట్టణంలోని పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపుల వద్ద డీలర్లు పంపిణీ చేస్తున్న విధానంలో తేడాలు గమనించి వారిని హెచ్చరించారు. తూకాలలో మోసం చేయరాదని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్డుదారుడి వివరాలు గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద ఉన్న పెన్షన్ ఆధారంగా సరి చూడాలన్నారు. -
లారీ, చౌక బియ్యం స్వాధీనం
ఖాజీపేట : పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని అడ్డదారిలో తరలించుకు పోతున్న లారీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన తాటి శాంతి కుమార్కు చెందిన ఏపీ 39 యూఏ 3609 నంబరు గల వాహనంలో 233 చౌక బియ్యం బస్తాలను ఎక్కించారు. బుధవారం తెల్లవారుజామున ప్రొద్దుటూరు నుంచి కడపకు తీసుకెళుతుండగా పక్కా సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ శివన్న ఆయన బృందం వాహనాన్ని వెంబడించారు. ఖాజీపేట మండలం పాటిమీదపల్లె వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే వాహనం స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ పుట్టాల ఓబులేసు, దేవగుడి రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని ఖాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ పరిశీలించగా 1,417 కేజీలు బరువు గల 233 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనం ఢీకొని..ఖాజీపేట : రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొని పుల్లూరు బాలస్వామి (47) అనే వ్యక్తి మృతి చెందాడు. పుల్లూరు బంగ్లా వద్ద ఉన్న బాల స్వామి పని నిమిత్తం రావులపల్లె చెరువు వద్ద దిగి రోడ్డు దాటుతుండగా కడప నుంచి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి బంధువులు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలుపులివెందుల రూరల్ : తొండూరు మండలం సైదాపురం గ్రామ సమీపంలోని గోడౌన్ వద్ద ముద్దనూరు రోడ్డు వైపు వెళ్తున్న ఆటో టైర్ పగిలి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న నందిని, కళావతి, శివాని, సుహాసిని, శివజ్యోతి, ప్యారి, సరస్వతితో పాటు ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కడపకు సిఫార్సు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్ వాసి..
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ మొలకలదిన్నె వద్ద బీడీఎస్ ఫంక్షన్ హాల్లో జార్ఖండ్కు చెందిన సర్ఫరాజ్ (27) పనిచేస్తున్నాడు. అతనికి ప్రతిరోజు సాయంత్రం జిమ్కు వెళ్లే అలవాటు ఉండటంతో, బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో మదనపల్లెలోని జిమ్ సెంటర్కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని డ్రైవర్స్ కాలనీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై అధిక రక్తస్రావమై తీవ్ర గాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన తాలూకా పోలీసులు వాహనం అదుపుతప్పి కిందపడి గాయాలపాలై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొందా..? లేక వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
మద్యం మత్తులో తోసేయడంతో వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : మద్యం మత్తులో ఒక వ్యక్తి మరో వ్యక్తిని తోసేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామం రాజీవ్నగర్లో జరిగింది. పట్టణ ఎస్ఐ హేమలత ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెంచెరువు గ్రామంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన చెండ్రాయుడు (30) అదే కాలనీకి చెందిన నాగేంద్ర యాదవ్ కలిసి కాలనీలోని పెద్దమ్మ గుడి సమీపంలో మంగళవారం రాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో చెండ్రాయుడును నరేంద్ర యాదవ్ తోసేయడంతో పక్కన ఉన్న రాయి తలకు తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతనికి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు బేల్దార్ పనులు చేసుకొని జీవించేవాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉత్సాహంగా అండర్–23 క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్– 23 వన్డే క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. బుధవారం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చిత్తూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు 45.1 ఓవర్లలో 217 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 60, లోహిత్ లక్ష్మీనారాయణ 80 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 3, ప్రదీప్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 218 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 25.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని కే హెచ్. వీరారెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించి 125 పరుగులు (సెంచరీ) చేసి నాటౌట్గా నిలిచాడు. 69 బంతులను ఎదుర్కొని 14 బౌండరీలు, 7 బౌండరీ సిక్సులు సహాయంతో 125 పరుగులు చేశాడు. అర్జున్ టెండూల్కర్ 27 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని మహమ్మద్, రెడ్డి ప్రకాష్, డేనియల్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టుపై 13 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు 31.0 ఓవర్లలో 145 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ రెడ్డి 28, అఖిల్ సాలుంకే 26 పరుగులు చేశారు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ 4, చెన్నారెడ్డి 3, విజయ భావేంద్రారెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 146 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 37.4 ఓవర్లలో 132 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవి చూసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 32, షేక్ ఆదిల్ హుస్సేన్ 40 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సాత్విక్ 3, సయ్యద్ అతిక్ సల్మాన్ 3, మాధవ్ 2 వికెట్లు తీసుకున్నారు. -
భారీగా మొబైల్ఫోన్లు రికవరీ
రాయచోటి : పోలీస్ బృందం చేపట్టిన మొబైల్ ఫోన్ల రికవరీ సత్ఫలితాలను ఇస్తోంది. అన్నమయ్య జిల్లా పోలీసుల పరిధిలో ఏడో విడతగా 601 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఒక కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 601 మొబైల్ఫోన్లను రికవరీ చేసి బుధవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు చేతుల మీదుగా ఫోన్లు పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2024 నవంబర్ నుంచి మే నెల 2025 వరకు 1300 మొబైల్ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనంపై ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందం ద్వారా ఫోన్ల రికవరీ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను వాడుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్.మహమ్మద్అలీ, టెక్నికల్ అనాలిసిస్ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి.జాన్ జోసెఫ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైం సిబ్బంది మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సంయుక్తంగా పనిచేశాయన్నారు. ఇప్పటి వరకు రూ.3.16 కోట్ల విలువ గల 1627 మొబైల్ ఫోన్లను 7 విడతలలో రికవరీ చేశామని తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తామని చెప్పారు. మొబైల్ ఫోన్ పోతే.. మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీస్ ఎల్ఎంటీఎస్ వాట్సాప్ నెంబర్ 8688830012కు హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే మీరు ఒక గూగుల్ లింక్ను రిసీవ్ చేసుకుంటారన్నారు. ఆ లింకును క్లిక్ చేసి మీ వివరాలు, మీ మొబైల్ ఐఎంఈఐ నెంబర్లు మొదలగు వివరాలను తెలియపరుస్తూ ఆ మొబైల్ను కొన్న బిల్ పేపర్ లేదా మొబైల్ బాక్స్ను మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని వివరించారు. లేదా సీఈఐఆర్ httpr://w-ww/-c-e-ir.g-o-v.i n/H-o-me/i ndex.jr p లింకును నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సులభతరం చేశామని చెప్పారు. అపరిచితుల నుంచి ఫోన్లను కొనరాదు.. సెల్ఫోన్ దుకాణం నిర్వాహకులు అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయరాదని ఎస్పీ సూచించారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్సు ఉంటేనే కొనుగోలు చేయాలని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన వాటి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా మొబైల్ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ ఎస్.మహమ్మద్అలీ, టెక్నికల్ అనాలసిస్ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి.జాన్ జోసఫ్, సైబర్ క్రైమ్ సిబ్బంది, మొబైల్ రికవరీ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బందికి రివార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పి.రాజారమేష్, కె.రాజారెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ తులసీరామ్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు మధు, రాఘవరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరమల్లయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, పెద్దయ్య, ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూ.1.20 కోట్ల విలువ గల 601 మొబైల్ఫోన్లు అప్పగింత 7వ విడత మొబైల్ ఫోన్ల రికవరీ మేళా మీడియా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు -
టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పులివెందులలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఆదాయం కోసం ఇసుక, మట్టి, ముగ్గురాయి అనేక వనరులను కొల్లగొడుతున్న టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. అందులో భాగంగా వారం రోజుల క్రితం వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ జెండాలు, తోరణాలను వైఎస్సార్ విగ్రహం వద్ద తొలగించారు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించినందుకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసుల అత్యుత్సాహంతో హత్యాయత్నం కేసు దాదాపు 15మంది వైఎస్సార్సీపీ నాయకుల మీద నమోదు చేసిన విషయం విదితమే. అందులో ఎస్టీ కులానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చలపతిని కూడా కేసులో ఇరికించడంతో అతను పులివెందుల సబ్జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి 12గంటల ప్రాంతంలో నగరిగుట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీను మరికొంతమంది వ్యక్తులతో కలిసి చలపతి ఇంటికి చేరుకుని వారి ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేశారు. ఈ సందర్భంగా చలపతి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. దాడి జరిగిన విషయాన్ని మంగళవారం అర్థరాత్రి చలపతి కుటుంబ సభ్యులు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం మధ్యాహ్నం చలపతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే దాడి జరిగిన విషయాన్ని పులివెందుల సీఐకి ఫోన్ చేసి ఇప్పటికే అక్రమ కేసు పెట్టి చలపతిని జైలులో ఉంచారని, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులమీద కేసు నమోదు చేయాలని ఎంపీ గట్టిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వాటర్ ప్లాంటు వీరారెడ్డి, కోడి రమణ, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. బాధితులను పరామర్శించిన ఎంపీ కేసు నమోదు చేయాలని డిమాండ్ -
అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది. .. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘జేఈఈ’లో మెరిసిన కడప కుర్రాడు
కడప ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కడపలోని భాగ్యనగర్కు చెెందిన మొలకల జశ్వంత్రెడ్డి మెరిశాడు. ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మొలకల రాజకిషోర్రెడ్డి, శ్రీలత కుమారుడు జశ్వంత్రెడ్డి ఒకటి నుంచి 5వ తరగతి వరకు కడప నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివాడు. 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ ఒలింపియాడ్లో చదివాడు. ఆ తరువాత ఇంటర్మీడియెట్ను విజయవాడ కానూర్లోని నారాయణలో పూర్తి చేశాడు. ప్రస్తుతం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకును సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్లో 777వ ర్యాంకు సాధించాడు. దీంతోపాటు విట్లో 36వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్లో 38వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. డాక్టర్ రాజకిషోర్రెడ్డి సొంత గ్రామం వీరపునాయునిపల్లె మండలం అనిమెల అయితే కడపలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతం విజయవాడ డైరెక్టర్ ఆఫ్ యానియల్ హస్బెండరీలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నారు. ఆల్ ఇండియా స్థాయిలో 211వ ర్యాంకు -
బ్యాంకర్లతోనే ఆర్థిక వ్యవస్థ పటిష్టం
కడప అగ్రికల్చర్ : బ్యాంకర్లు సమర్థంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ –2047 దిశగా వైఎస్ఆర్ జిల్లాను కూడా ముందుకు నడిపించాలన్నారు. అందుకుగాను వైఎస్ఆర్ విజన్ యాక్షన్ ప్లాన్ 2024–29 ప్రకారం జిల్లాను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. పొదుపు సంఘాల మహిళలు, రైతులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులకు రుణాలు అందించి, ఆర్థిక చేయూత ఇవ్వాలన్నారు. అనంతరం 2025–26 జిల్లా క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, నాబార్డ్ ఏజీఎం విజయ విహారి, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ రాజేష్ కుమార్, కెనరా బ్యాంకు ఏజీఎం అరుణ జ్యోతి, ఎస్బీఐ ఏజీఎం కృష్ణ కిషోర్, యూబీఐ ఏజీఎం లక్ష్మి తులసి, ఏపీజీబీ ఏజీఎం శ్రీనివాస ప్రసాద్, కేడీసీసీ సీఈఓ రాజమ్మ, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, డీఐఏ జిల్లా కోఆర్డినేటర్ ఎస్వీ రమణ, వివిధ బ్యాంకుల జిల్లా మేనేజర్లు, ఆర్ఎంలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు ఎటువంటి అసౌర్యాలు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య, రవాణా శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆశోక్కుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పొలంలో బయల్పడిన వినాయక విగ్రహం
పెండ్లిమర్రి : మండలంలోని కొత్తగిరియంపల్లె గ్రామానికి చెందిన రైతు నడిపి సుబ్బారెడ్డి పొలంలో మంగళవారం వినాయక విగ్రహం బయల్పడింది. వెల్లటూరు గ్రామ రెవెన్యూ భూమిలోని భేతాళ ఆంజనేయస్వామి గుడి దగ్గరలోని పొలంలో.. ఆయన ట్రాక్టర్తో సేద్యం చేస్తుండగా గొర్రుకు పెద్ద రాయి తగిలింది. దానిని వెలికితీయగా వినాయక విగ్రహం కనిపించింది. దీంతో సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వినాయక విగ్రహానికి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. పూర్వం ఈ ప్రదేశంలో గుడి ఉండి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. విలువలతో కూడిన విద్య అందించాలి కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప జయనగర్ కాలనీలో బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజైన మంగళవారం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు చేరవేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ విజయభాస్కర్రెడ్డి, ఎస్సీఆర్టీ అబ్జర్వర్ బ్రహ్మానందరెడ్డి, డైట్ లెక్చరర్లు గిరిబాబు, రెడ్డెయ్య, స్టేట్ రీసోర్సు పర్సన్స్ సుబ్బానాయుడు, గంగాధర్, తిరుమల కొండ, సురేష్కుమార్రెడ్డి, కృష్ణానాయక్, బాబాసాహేబ్ తదితరులు పాల్గొన్నారు. 7న యోగాంధ్ర రాయచోటి : ఈనెల 7న తాళ్లపాక అన్నమయ్య సన్నిధిలో అత్యంత వేడుకగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 617 మందితో యోగాసనాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రజల్ని వంచింది. సీఎం చంద్రబాబు తన సహాజ ధోరణి వీడలేదు. ప్రజల్ని నిలువునా మోసగించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాజ్యాంగాన్ని విస్మరించి ఏకపక్ష పాలన సాగిస్తున్నారు. ఐదేళ్లు వైఎస్సార్పీపీ ప్రభుత్వంలో ఠీవిగా జీవించిన ప్రజలు అనేక కష్టనష్టాలు చవిచూస్తున్నారు. ఏడాదికే తీవ్రస్థాయి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన విజయవంతం చేయండి. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి బలంగా విన్పించాలి. – ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మోసం.. చంద్రబాబు నైజం ప్రజల్ని మోసగించడం, అబద్ధాలతో వంచించడం సీఎం చంద్రబాబు నైజం. సూపర్ సిక్స్ పథకాల పేర్లతో పక్కాగా మోసగించాడు. 1995 నుంచి 2025 వరకూ చంద్రబాబు చరిత్ర పరిశీలిస్తే విశ్వసనీయత అనేది లేదు. ఏ అవసరానికి అనుగుణంగా ఆ గొడుగు మార్చే రకం. ఎన్టీయార్ను మొదలుకొని తోడల్లుడు దగ్గబాటి వెంకటేశ్వరరావు, బామ్మర్ది హరికృష్ణ, తుదకు జూనియర్ ఎన్టీయార్లను వాడుకొని వదిలేశారు. ప్రజల్ని కూడా తన అవసరానికి అనుగుణంగా అబద్ధాలు చెప్పి మోసగించారు. ఏడాదిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదు. ఈ తరణంలో వైఎస్సార్సీపీ చేపడుతున్న ‘వెన్నుపోటు దినం’ జయప్రదం చేయాలి. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ -
మద్దుతు ధర.. అరకొర
వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఆశాజనకంగా లేవు. పెరుగుతున్న ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా నిర్ణయించడం లేదు. వివిధ పంటల సాగు, ఉత్పత్తి వ్యయాలకు.. మద్దతు ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఏటా కంటితుడుపుగా నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. ఆచరణలో చూపెట్టాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కింది స్థాయిలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు దళారులకు అందుతున్నాయి తప్ప సామాన్య రైతులకు అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల వల్ల రైతులకు కొంత వరకై నా ఉపశమనం కలగాలంటే కచ్చితంగా అమలు జరగాలి. – మోహన్రెడ్డి, రైతు, సుంకేసుల ఖర్చులకు అనుగుణంగా... ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత తక్కువ మద్దతు ధర పెంచడం ఏమాత్రం లాభం లేదు. అన్ని రకాల ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను ప్రకటించాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, రాష్ట్ర ఉద్యాన మాజీ సలహాదారు గిట్టుబాటు అయ్యే విధంగా లేవు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే విధంగా లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేళ్ల క్రితమే చెప్పిన కేంద్రం మద్దతు ధరలను అరకొరగానే పెంచుతోంది. మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – పోతిరెడ్డి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం కడప అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్లోని 14 పంటలకు ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, నూనెగింజ పంటలైన పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్తోపాటు మిల్లెట్స్ రకాలైన జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పెసలు, కంది, మినుములకు కనీస మద్దతు ధర పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలతోపాటు ఎరువులు, కూలీలు ఇలా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెరిగినఽ ధరలకు అనుగుణంగా పెంచి ఉంటే బాగుండేదని పలువురు రైతులు అంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి పంటకు గతేడాది కంటే ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే ధర పెంచడంపై అన్నదాతలు అంతగా సంతృప్తి చెందడం లేదు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే కొంత మంది వరి రైతులు ఈ మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటకు ఎంత మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు సంబంధించి వరి సాధారణ రకం క్వింటాలుకు రూ.2300 ఉండగా 2369కి పెంచారు. అలాగే గ్రేడ్–ఏ రకానికి 2320 ఉండగా 2389, జొన్న (హైబ్రీడ్) రూ.3371 ఉండగా 3699, జొన్న (మాల్థండి) రూ. 3421 ఉండగా 3749, సజ్జలు రూ.2625 ఉండగా 2775, రాగులు రూ.4290 ఉండగా 4866, మొక్కజొన్న రూ.2225 ఉండగా 2400, వేరుశనగ రూ.6783 ఉండగా 7263, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280 ఉండగా 7721, నువ్వులు రూ.9267 ఉండగా 9846, సోయాబీన్ రూ.4892 ఉండగా 5328, పెసలు రూ.8682 ఉండగా 8768, పత్తి (మధ్యరకం) రూ.7121 ఉండగా 7710, పత్తి (లాంగ్ స్టెపెల్) రూ.7521 ఉండగా 8110కి పెంచారు. పెరుగుతున్న సాగు ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర ప్రకటిస్తూనే ఉంది. అయితే అనుకున్న మేర మాత్రం పెంచడం లేదని పలువురు రైతులు అంటున్నారు. కంటి తుడుపుగా మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోందని, వీటితో రైతులకు గిట్టుబాటు కావడం లేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. 2018–19 నుంచి ఇప్పటి వరకు ఏటా సగటున వరిధాన్యంపై సరాసరిన రూ.100కు లోపే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు మాత్రం ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో రూ.13 వందల ఉండే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ఇప్పుడు రూ.18 వందలకు చేరింది. డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టరు యజమానులు సేద్యం ధరలను పెంచేశారు. కూలీలు, ఎరువులు, పురుగు నివారణ మందులు ఇలా అన్ని రకాల ధరలు భారీగా పెరిగాయి. మొత్తం మీద సాగు ఖర్చులు గతం కంటే 8 వేల నుంచి 10 వేల వరకు పెరిగాయి. కావున సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా మద్దతు ధరను పెంచాలని పలువురు రైతులు, రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. గతేడాది, ఈ ఏడాది పెరిగిన మద్దతు ధరల వివరాలు 2018 నుంచి వరికి కనీస మద్దతు ధర వివరాలు ఇలా (క్వింటాలుకు)... కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధర పెంపు స్వల్పంగా పెంచడంపై అన్నదాతల్లో అసంతృప్తి కంటితుడుపు చర్య అంటున్న రైతు సంఘాలు సాగు ఖర్చులకు అనుగుణంగా ప్రకటించాలని వినతి పంట 2024–25 2025–26 పెరిగిన ధర వరి సాధారణ 2300 2369 69 వరి ఏ గ్రేడ్ 2320 2389 69 జొన్న హైబ్రీడ్ 3371 3699 328 జొన్న (మల్థాని) 3421 3749 328 సజ్జలు 2625 2775 150 రాగులు 4290 4866 576 మొక్కజొన్న 2225 2400 175 కందులు 7550 8000 450 పెసలు 8682 8768 86 వేరుశనగ 6783 7263 480 పొద్దుతిరుగుడు 7280 7721 441 సోయాబీన్ 4892 5328 436 నువ్వులు 9267 9846 579 పత్తి 7121 7710 589 పత్తి 7521 8110 589 (లాంగ్ స్టేపుల్)సంవత్సరం సాధారణ ఏ గ్రేడు రకం రకం 2018–19 1750 1777 2019–20 1815 1835 2020–21 1865 1888 2021–22 1940 1960 2022–23 2020 2060 2023–24 2183 2203 2024–25 2300 2320 2025–26 2369 2389 -
వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి ప్రతినిధి, కడప : మారిన మనిషిగా అనుచరగణం కీర్తించారు, పథకాల పేర్లతో జనాన్ని నమ్మించారు. అధికారం కోసం అబద్ధాల హామీల ముసుగు వేసుకున్నారు. ఎన్నికల్లో నెగ్గారు, ఆపై నిజస్వరూపం బహిర్గతమైంది. ఏడాది కాలంలో హామీలు తుంగలో తొక్కేశారు. ప్రకృతి సంపద ఆధారంగా తెలుగు తమ్ముళ్లు దోపిడీ యథేచ్ఛగా తెరపైకి వచ్చింది. పౌరులకు రాజ్యంగం కల్పించిన హక్కులకు తిలోదాకాలు ఇచ్చారు. ‘నాడు–నేడు’ వెలుగు కరిగిపోయి, విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. తల్లికి వందనం ఊరిస్తోంది. ఆడబిడ్డ నిధి మాటే లేదు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఉండిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. ‘బాబు ష్యూరిటీ... భవిష్యత్కు గ్యారెంటీ’తో జనం మధ్యకు వచ్చారు. సీఎం చంద్రబాబు మాటల గారడీని నమ్మి మోసపోయామని ఆవేదన చెందడం ప్రజల వంతైంది. ఏడాది పాలనలో అవినీతి, మోసం, నయవంచన, కుట్ర, పగ, వెన్నుపోటు రాజ్యమేలుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఊరువాడ ప్రచారం ‘ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి రూ.3 వేలు తప్పకుండా ఇస్తాం’ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి భృతి చెల్లిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. ‘అమ్మ ఒడి’ పథకంలో సమూల మార్పులు తీసుకువస్తాం. ఎంత మంది విద్యార్థులంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15 వేలు చొప్పున చెల్లిస్తాం. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు చెల్లిస్తాం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘రైతులను ఆదుకుంటాం. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడికి ‘అన్నదాత సుఖీభవ పథకం’ ద్వారా రైతులకు రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు’ హామీ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన యువతి నుంచి 59 సంవత్సరాల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ చెల్లిస్తామని ఊరువాడా చెప్పుకొచ్చారు. మహిళలు ఎక్కడికెళ్లినా సరే ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఇప్పటికీ చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా అమలు చేయలేదు. ప్రజలను వంచించి ‘వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్’గా సీఎం చంద్రబాబు కీర్తి గడిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆశపడి ఆపై మోసపోయి.. సామాన్యులకు కామధేనువుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేయడమే లక్ష్యంగా ఐదేళ్లు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కొనసాగించింది. కేలండర్ విడుదల చేసి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని తేదీలతో సహా బహిర్గతం చేసి సరిగ్గా ఆ తేదీకి అమలు చేసిన చరిత్ర ఆయన సొంతమైంది. జిల్లాలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులు 9,82,554 మంది బ్యాంకు ఖాతాలకు రూ.8,857.42 కోట్లు వేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 9,72,388 మందికి రూ.3,279.10 కోట్లు చెల్లించారు. మొత్తంగా రూ.12,136.52 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి అందించి చరిత్ర సృష్టించారు. సామాన్యుల జేబులు డబ్బులతో గలగలు ఉండేవి. అంతకంటే ఎక్కువగా అందిస్తామని సూపర్ సిక్స్ పేరుతో పథకాలు ప్రవేశ పెట్టడంతో ఆశపడి టీడీపీ మాటలకు మోసపోయారు. ఏడాదైనా ఒక్క రూపాయి ప్రజలకు నేరుగా అందిన దాఖలాలు లేవు. కామధేనువులాంటి వైఎస్ జగన్ సర్కార్ను పోగొట్టుకొని, దున్నపోతు లాంటి చంద్రబాబు సర్కార్ తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన పడుతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలకు చంద్రబాబు మరోసారి మోసం ఊరిస్తున్న తల్లికి వందనం పథకం అందని ద్రాక్షలా నిరుద్యోగ భృతి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.15 వందలు ఉత్తిదే రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేల ఊసేలేదు సీ్త్రలకు ఉచిత బస్సు ప్రయాణం మాటే మర్చారు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో ఊదరగొట్టిన టీడీపీ నేతలు ఏడాదైనా అమలు కాని ‘సూపర్ సిక్స్’ పథకాలు నేడు వెన్నుపోటు దినంపై ఆందోళనలు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్సార్సీపీ మొదటి నుంచి గర్జిస్తోంది. జూన్ 4న, బుధవారం ‘వెన్నుపోటు దినం’ పాటిస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో నిరశన పాటించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మరోమారు చంద్రబాబు హామీలతో మోసపోయామని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అన్నీ ప్రాంతాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఆ పార్టీ సర్వసన్నద్ధమైంది. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
కడప అర్బన్ : డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని.. సమష్టి కృషితో డ్రగ్స్ను పారదోలుదామని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ’ఈగల్’ (ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ప్రత్యేక వ్యవస్థ పై ప్రజలకు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఈ టాస్క్ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా, సాగు, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టాస్క్ ఫోర్స్ నోడల్ ఇన్చార్జి ఆఫీసర్, ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎం.డి. రియాజ్ అహమ్మద్, సైబర్ సెల్ సి.ఐ. నాగరాజు, డీసీఆర్బీ ఎస్.ఐ. బీవీ క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
ఉజ్వల భవిష్యత్తుకు సోపానం
జవహర్ నవోదయలో విద్యాభ్యాసం..రాజంపేట టౌన్ : జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే చాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. అన్నమయ్య జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీలోని నారమరాజుపల్లెలో, మరొకటి మదనపల్లె మండలం వలసపల్లెలో ఉంది. ఒక్కో విద్యాలయంలో ఆరవ తరగతిలో 80 సీట్లను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను రాస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్య లభించి తద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రవేశ పరీక్షను రాయిస్తారు. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. పోటీకి తగ్గట్లు ప్రశ్నాపత్రం సరళి కూడా కొంత కఠినతరంగానే ఉంటుంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో చదివిన విద్యార్థులకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదివిన విద్యార్థులకు మదనపల్లెలోని నవోదయ విద్యాలయంలో సీట్ల కేటాయింపు ఉంటుంది. కాగా ఓ ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో కష్టపడి చదివితే సీటు సాధించడం పెద్దకష్టం కాదంటున్నారు విద్యావేత్తలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని దశాబ్దాల క్రితమే దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 1984వ సంవత్సరం మదనపల్లెలో, 1987వ సంవత్సరం రాజంపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మదనపల్లెకు చెందిన నవోదయ విద్యాలయం తొలుత హార్సిలిహిల్స్లో ఏర్పాటయింది. అనంతరం మదనపల్లె మండలం వలసపల్లెలో ఏర్పాటు చేశారు. క్రమశిక్షణతో మెరుగైన విద్యను అందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. 2026–2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ ఎం. గీత తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు వీరే ● ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. ● అలాగే ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదవ తరగతి తప్పని సరిగా చదివి ఉండాలి. ● ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా 2025–2026 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సీటు లభిస్తుంది. ● నోటిఫికేషన్లో పొందు పరిచిన విధంగా గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల వారికి సీట్లు కేటాయిస్తారు. ● గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 75 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది. ● గతంలో పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. ఇవీ ప్రయోజనాలు.. ● నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి సీటు పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు. ● మెరుగైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అన్ని ఉచితంగా కల్పిస్తారు. ● విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. ● విద్యాబోధన మాత్రం కంబైన్డ్ విధానంలో ఉంటుంది. ● కంప్యూటర్ కోర్సుతో పాటు ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, క్రాఫ్ట్, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సీట్ల కేటాయింపు ఇలా.. ● ఆరవ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల భర్తీకే ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. ● 80 సీట్లలో 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, 20 సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ సౌకర్యం ఇలా.. ● బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ● గ్రామీణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో 9 సీట్లను ఎస్సీలతో, ఐదు సీట్లు ఎస్టీలతో భర్తీ చేస్తారు. ● పట్టణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో మూడు సీట్లు దివ్యాంగులకు, మూడు సీట్లు ఎస్సీలకు, ఒక సీటు ఎస్టీలతో భర్తీ చేస్తారు. పరీక్షా విధానం ఇలా.. ● మొత్తం నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది. ● మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాప్స్ ఇలా మూడు విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. ● మెంటల్ ఎబిలిటీకి (మేధాశక్తి)కి సంబంధించి 50 మార్కులకు గాను 40 ప్రశ్నలు పది భాగాల్లో ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు డయాగ్రమ్స్ రూపంలో ఉంటాయి. ● గణితంకు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ● పేరాగ్రాప్స్కు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ● ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29–7–2025 ● ప్రవేశ పరీక్ష తేదీ – 13–12–2025 సీటు సాధిస్తే.. బంగారం లాంటి జీవితం ఆరవ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో చదివితే సీటు సొంతం జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలుఆరునెలలు ఆటలను కట్టిపెట్టాలి విద్యార్థులు ఆరునెలల పాటు ఆటలు కట్టి పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదితే నవోదయ విద్యాలయంలో సీటు సాధించవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. టెన్త్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదివిస్తే తప్పక సీటు లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సీటు సాధించాలంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. – కొండూరు రఘునాథరాజు, ఎంఈఓ, రాజంపేట -
చాపాడు మండలంలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ
చాపాడు : మండల పరిధిలోని సీతారామాపురం, కుచ్చుపాప, నరహరిపురం, అనంతపురం తదితర గ్రామాల పరిధిలోని పంట పొలాల్లో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో గత పది రోజులుగా మండలంలోని వివిధ గ్రామాలలోని పంట పొలాల్లో బోర్లు, ఫిల్టర్ల ద్వారా రిగ్గు వేసి లోపల ఉండే ఖనిజాలను అన్వేషిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలతో జరుపుతున్న ఈ పరిశోధనలో ఆయిల్, ఇతర ముడి ఖనిజాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎకరా పొలం పొడవునా 20 చోట్ల బోర్లు వేస్తూ అందులో అన్వేషణ చేసి వెంటనే వాటిని పూడ్చి వేస్తున్నారు. పంట పొలాల్లో జరుగుతున్న ఖనిజ అన్వేషణను స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే చెస్ రేటింగ్లను సాధించడం గర్వకారణమని జిల్లా చెస్ సంఘం కార్యదర్శి అనీస్ దర్బారి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ మైదుకూరుకు చెందిన రవి వసంత కుమార్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ అలాగే ఢిల్లీలో నిర్వహించిన రెండు ఫిడే క్లాసికల్ రేటింగ్ టోర్నమెంట్లలో పాల్గొని తన అద్భుతమైన ప్రదర్శనతో 1452 క్లాసికల్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ప్రస్తుతం ఆయన కాశినాయన మండలం, ఇటుకలపాడు జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన నదీమ్ సాహెబ్ గారి ముజమ్మిల్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఫిడే రాపిడ్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని 1491 రాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ఈ ఇద్దరు క్రీడాకారుల ఫిడే రేటింగులను ఫిడే అంతర్జాతీయ చెస్ సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో ఈ నెల 1వ తేదీన ప్రకటించిందన్నారు. -
ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి పేర్కొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీలో అచీవర్స్డే–2025ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేయాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్నారు. ప్లేస్మెంట్ అధికారి సునీల్ అల్లువాడ మాట్లాడుతూ ఎన్నో కంపెనీల్లో విద్యార్థులు ఎంపిక కావడమే కాకుండా, ఇంటర్న్షిప్లో కూడా పాల్గొన్నారన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిబద్ధత, మానవతా విలువలు గర్వించదగ్గవన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ ఖ్యాతి విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఇండ్రస్టియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ జేఎన్టీయూ (అనంతపురం) ప్రొఫెసర్ కిరణ్మయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ హేమకేశవులు, వివిధ విభాగాల డీన్లు, శాఖాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన స్నేహితులు ఫారూక్(20), చైతన్య(19) ద్విచక్ర వాహనంలో బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ కు వెళ్లేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న ఫారూక్కు, ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. చైతన్య గాయపడగా ఫారుక్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు బాధితులు ఇద్దరిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఫారుక్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అదేవిధంగా ములకలచెరువు పట్టణంలోని షాపులో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ (50) వ్యక్తిగత పనులపై కదిరి పట్టణానికి వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో ములకలచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని చీకటిమాను పల్లె వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా గాయపడగా, లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారు వేర్వేరు ఆసుపత్రులకు వెళ్లగా, లక్ష్మీనారాయణను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు పంపారు. ఏయూ అచీవర్స్డేలో చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి -
నీటి కుంటలో పడి కాడెద్దులు మృతి
వీరపునాయునిపల్లె : మండలంలోని యలంకూరుపల్లెలో మంగళవారం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి కాడెద్దులు మృతి చెందాయి. వివరాలిలా.. యలంకూరుపల్లె గ్రామానికి చెందిన యలంకూరు సాంబశివారెడ్డి ఎద్దులను పెట్టుకొని వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన డబ్బుతో బతుకుదెరువు కొనసాగించేవాడు. ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లి ఎద్దులకు నీటిని తాపించేందుకు బండితో సహా నీటి గుంత వద్దకు తీసుకెళ్లాడు. నీళ్లు తాగే సమయంలో బండి ముందుకు దొర్లడంతో ఎద్దులు రెండు నీటి గుంతలో పడి బురదలో ఇరుక్కు పోయి ఊపిరి ఆడక మృతి చెందాయి. రెండు ఎద్దులు మృతి చెందడంతో 2 లక్షల రూపాయలు నష్టపోవడంతో పాటు బతుకుదెరువు కోల్పోయామని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సహా యం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ‘బాబు’
కడప సెవెన్రోడ్స్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా ధ్వజమెత్తారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని విమర్శించారు. అందుకే ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఎన్నికల హామీలు తుంగలో..తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని అంజద్బాషా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద యేటా రూ. 20 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామి ఎక్కడికి పోయిందన్నారు. పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం లేదన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. సీ్త్ర శక్తి కింద 18+, 60 ఏళ్లలోపు మహిళలకు రూ. 15 వేలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇప్పటికి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వల్ల చాలామంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులుకు స్వస్తి చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పూర్తిగా రద్దు చేయడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తామన్న హామి ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల అరియర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసి పాత పద్దతిని పునరుద్దరించడం వల్ల పేదలు, మహిళలు రాత్రి 8.30 గంటల సమయంలో కూడా ఎఫ్పీ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సమావేశంలో వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభా గం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, కార్పొరేటర్ షఫీ, నాయకులు యానాదయ్య, వేణుగోపాల్ నాయక్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.అమరావతి తప్ప సీమ, ఉత్తరాంధ్ర పట్టడం లేదుముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమి పట్టడం లేదని అంజద్బాషా విమర్శించారు. తన కోటరీలో ఉన్న రియల్టర్లు, బాబు సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేసేందుకే అమరావతి నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే ఎంతో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించడం అన్యాయమన్నారు. టెన్త్ పరీక్షా ఫలితాలు వచ్చాక 66 వేల మంది విద్యార్థులు రీ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయడం మంత్రి లోకేష్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేది ఉదయం 10 గంటలకు కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
●అడ్డంగా బుక్కయ్యారు
టీడీపీ నాయకులు ఇష్టారీతిన కరెంటును అక్రమంగా వాడుకునేందుకు సాగిలపడి సహకరించిన విద్యుత్ అధికారులు...తాము చేసిన తప్పు మూడో కంటికి తెలియకూడదని అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 29వ తేదీ సాయంత్రానికి మహానాడు పూర్తికాగా, ఆగమేఘాలపై కదిలి యంత్రాంగాన్నంతా వినియోగించి 30వ తేదీ మధ్యాహ్నానికల్లా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, కాంక్రీట్ దిమ్మెలు వంటిి ఏ చిన్న ఆనవాళ్లు కూడా దొరక్కుండా పక్కాగా పథక రచన చేశారు. అయితే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...సాక్షికి అడ్డంగా దొరికిపోయారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను క్రేన్లతో తొలగించడం, విద్యుత్ సామాగ్రిని ట్రాక్టర్లలో తరలించడం వంటి దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. -
5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్
రాజంపేట : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న భారీ ప్లాంటేషన్ గ్రీన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ తెలిపారు. సోమవారం తన చాంబరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 28 విభాగాలతో జిల్లా వ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తామన్నారు. జిల్లాలో 50 శాతం పచ్చదనం సాధించాలనే ప్రధాన లక్ష్యంతో అటవీశాఖ, వివిధ శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అంతటా 4.5 లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఎస్ఆర్పాళెం నగరవనంలో జిల్లా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం, వేప, టేకు, నేరెడు, ఉసిరి, వెదురు, చింత, దానిమ్మ, ఎగసి, గంగరావి, మారేడు, సీతాఫలం, తాండ్ర, శ్రీగంధం, తెల్లమది, మునసంపెంగా, బహునీయతో పాటు మరికొన్ని మొక్కలను నాటుతామన్నారు. అన్నమయ్య హరిత విప్లవంలో భాగం కావాలని ఆయన కోరారు.జిల్లా అటవీ అధికారి జగన్నాథ సింగ్ -
పంటల సాగుపై రైతులకుఅవగాహన
సిద్దవటం: రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రైతు రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు.సిద్దవటంలోని ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సోమవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పీఎం కిసాన్ పథకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వరి, సజ్జ, చిరుధాన్యాల సాగు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు సాగు, విస్తీర్ణం పెంపు, ప్రకృతి వ్యవసాయ విధానాల వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వీరయ్య మాట్లాడుతూ వరిలో పచ్చిరొట్ట ఎరువుల పంట పూత దశలో ఉన్నపుడు కలియదున్నాలని, 2 కిలో లు సూపర్ వేసి దున్నితే త్వరగా కుళ్లుతుందన్నారు. విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఉధ్యానాధికారి జయభరత్రెడ్డి మాట్లాడుతూ మామిడిలో జూన్, జూలైలో ముదురు కొమ్మలను కత్తిరించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ శాస్త్రవేత్త ఖురేషి, శాస్త్రవేత్త మానస, జిల్లా వనరుల కేంద్రం ఏఓ పద్మజ, రైతులు పాల్గొన్నారు. -
5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) వర్కర్లకు 3 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించి సామాజిక భద్రతా చట్టంలో భాగంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు ఏఐటియూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరి కేసీ బాదుల్లా తెలిపారు.సోమవారం నగరంలోని హోచిమిన్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 300 మంది విద్యార్థులకు ఒక ఆయా ఉండటం వల్ల ఆయాలపైన విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని కోరారు. పాఠశాలలను, కళాశాలలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ (ఆయా) వర్కర్లు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఉద్దే మద్దిలేటి, ఆయాలు కుమారి, నాగలక్ష్మి, వెంకటేశ్వరి పాల్గొన్నారు. -
కమిషనర్ సారూ.. ఇదేం తీరు.!
కడప కార్పొరేషన్ : కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తీరు రోజురోజుకు వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే మాధవికి తొత్తుగా మారి పక్షపాత ధోరణి ప్రదర్శించడం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సోమవారం నాటి సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలుపొంది నగర పాలకవర్గ సభ్యులుగా ఉన్న పదిమంది కార్పొరేటర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్లి వినతి పత్రం ఇస్తే కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని వినతి పత్రం స్వీకరించారు. అదే రీతిలో ఎలాంటి ప్రొటోకాల్ లేని సామాన్య టీడీపీ కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అత్యంత వినయ విధేయతలతో నిలబడి వినతిపత్రం స్వీకరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మాటలకు, వారి సూచనలకు ఎంతటి విలువనిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి హోదాలో ఉన్న కమిషనర్ ఇలా దిగజారి ప్రవర్తించడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. ఇప్పటికై నా ఆయన వైఖరి మార్చుకోవాలని, ప్రజా సమస్యల పట్ల అందరితోనూ ఒకే రకంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. వారిలో మూడుసార్లు వరుసగా గెలుపొందిన సీనియర్ కార్పొరేటర్లు కూడా ఉండటం గమనార్హం. అధికార పార్టీ నేతలకు గులాంగిరి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి వెల్లువెత్తుతున్న విమర్శలు -
రానున్న కాలంలో రాష్ట్రమంతా జగన్ అడ్డానే
జమ్మలమడుగు : రాబోయే ఎన్నికల తర్వాత కడప సహా రాష్ట్రమంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాగా మారబోతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచిన ఏకై న నాయకుడుగా చరిత్ర కెక్కారన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇంతవరకు ఒక్కటి కూడా అమలు పరచలేక ఘోరంగా విఫలమైందన్నారు. మహానాడులో పరస్పరం పొగుడుకుంటూ కాలయాపన చేశారే తప్ప ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేదన్నారు. నారా లోకేష్ యువగళం పేరుతో పెద్దముడియం మండలంలో పర్యటించిన సమయంలో రాజోళి ముంపు వాసులకు రూ.12 లక్షలు కాకుండా రూ.24 లక్షలు ఎకరాకు ఇస్తామని ప్రకటించారన్నారు. ఇంత వరకు దాని ఊసే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అలాగే దాల్మియా పరిశ్రమ ద్వారా ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం ఇప్పించడంతోపాటు వారి భూములను సైతం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు లక్షుమయ్య, కౌన్సిలర్ పోచిరెడ్డి, బడిగించల జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
జయలక్ష్మిపై దాడికి ఎస్ఐదే బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కొండాపురం మండలం తిరుమలాయపల్లె గ్రామానికి చెందిన బండారు జయలక్ష్మీపై ఎలాంటి దాడి జరిగినా అందుకు తలమంచిపట్నం పోలీసు స్టేషన్ ఎస్ఐదే బాధ్యత అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ తెలిపారు. సోమవారం బాధిత మహిళ జయలక్ష్మితో పాటు మహిళా ఐక్య వేదిక నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ జయలక్ష్మికి 17 ఏళ్ల క్రితం మైలవరం మండలం గంగుల నారాయణ పల్లె గ్రామానికి చెందిన మైల శ్రీనివాసులుతో వివాహమైందన్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో పదేళ్ల క్రితం విడిపోయారన్నారు. అయితే జయలక్ష్మి ఇచ్చిన కట్నం, భరణం తిరిగి ఇవ్వడానికి తన వద్ద డబ్బులు లేవని మైల శ్రీనివాసులు సర్వే నెంబరు 1241లో తనకున్న 2 ఎకరాల 11 సెంట్ల వ్యవసాయ భూమిని జయలక్ష్మి పేరు మీద 2015లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడన్నారు. ఆ తర్వాత బాధితురాలు జయలక్ష్మి తిరుమలాయపల్లెలో తన పుట్టింటిలో ఉంటూ ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమికి ధర రావడంతో ఆమె మాజీ భర్త, అతని రెండవ భార్య కృష్ణవేణి, అతని అన్న కలిసి ఆ భూమిని తిరిగి ఇవ్వాలని, లేకుంటే చంపుతామని జయలక్ష్మిని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో కూడా ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కొండాపురం సీఐని కలవగా బాధితురాలి మాజీ భర్త మైల శ్రీనివాసులును పిలిపించి మందలించారన్నారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న అతను తిరిగి ఆమె వెంట పడుతూ భూమి దగ్గరికి వస్తే అక్కడే చంపి పూడ్చి పెడతా అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 వ తేదీన వారు ముగ్గురు కలిసి దౌర్జన్యంగా బాధితురాలి భూమిని దున్నుతుండగా, ఆ విషయం తెలుసుకున్న జయలక్ష్మి పోలీసులను ఆశ్రయించిందన్నారు. తర్వాత తలమంచిపట్నం ఎస్ఐని కలిసి బాధితురాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, మైలవరం మండల తహసీల్దార్ ఇచ్చిన నివేదిక చూపించగా ఇవి ఎందుకూ పనికిరావని, ఇలాంటివి 100 డాక్యుమెంట్లు పుట్టించవచ్చు అంటూ ఎస్ఐ ఎగతాళిగా మాట్లాడారని చెప్పారు. బాధితురాలి తరపున భూమిని గుత్తకు తీసుకున్న పెద్దరంగడిని కూడా ఎస్ఐ బెదిరించారన్నారు. భవిష్యత్తులో జయలక్ష్మికి ఏ హాని జరిగినా అందుకు తలమంచిపట్నం ఎస్ఐనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాధితురాలి తరపున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. -
సెల్ఫోన్ లాక్కొని పరారైన దొంగ
లింగాల : మండలంలోని లోపట్నూతల గ్రామంలో సోమవారం సునీత తన కుమార్తె నైనికతో కలిసి పోస్టాఫీస్ వద్దకు వెళ్లి డబ్బులు కట్టి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి నైనిక చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని కొండలోకి పరారయ్యాడు. వెంటనే సునీత గట్టిగా అరవగా అక్కడ ఉన్న వాళ్లు సెల్ఫోన్ లాక్కొని పారిపోతున్న వ్యక్తిని వెంబడించగా కనబడకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా సెల్ఫోన్ దొంగ దొరకలేదు. దీంతో బాధితురాలు సునీత లింగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నలుగురిపై కుక్కల దాడికమలాపురం : కమలాపురం నగర పంచాయతీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం రాత్రి పొద్దుపోయాక పట్టణంలోని ఎస్బీఐ వెనుక వైపు ఉన్న కాలనీలో సుహానా అనే బాలికతో సహా నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కలతో పాటు పిచ్చి కుక్క కూడా సంచరిస్తున్నట్లు పట్టణ వాసులు తెలిపారు. నగర పంచాయతీ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు అంజద్, ప్రసాద్, రమేష్, నరసింహ ఫర్హాన్ తదితరులు కోరుతున్నారు. అల్లాడుపల్లె అర్చీ వద్ద రోడ్డు ప్రమాదంచాపాడు : మండల పరిధిలోని మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు, ఆల్విన్ లారీ ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం వద్ద జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని లక్ష్మీపేటకు భూమిరెడ్డి చంద్రఓబుళరెడ్డి అనే వ్యక్తి పిల్లలను తీసుకుని కారులో వెళుతుండగా క్రాస్ రోడ్డు వద్ద మైదుకూరు వైపు నుంచి వస్తున్న ఆల్విన్ లారీ ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతినింది. మద్యం షాపులో చోరీసిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ కృష్ణ మద్యం షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగిందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మద్యం షాపు యజమాని రామసుబ్బారెడ్డి తమ షాపులో రూ. 30 వేలు విలువచేసే మద్య బాటిళ్లు, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 5వేలు నగదును అహపరించారని ఫిర్యాదు చేశారన్నారు. -
నెల్లూరు, చిత్తూరు జట్ల ఘన విజయం
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –23 వన్డే క్రికెట్ టోర్నీలో నెల్లూరు, చిత్తూరు జట్లు ఘన విజయం సాధించాయి. సోమవారం వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో నిర్వహించిన మ్యాచ్లో కర్నూలు జట్టుపై 225 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 49.4 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. నిఖిలేశ్వర్ రెడ్డి 83, జి. మన్విత్ రెడ్డి 67, సోహన్ వర్మ 62 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. కనీష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. పి. సాబ్జాన్బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 388 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 36.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలయింది. ఆ జట్టులోని పి. కనిష్ 60, పి. సాబ్జాన్ బాషా 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్. భార్గవ్ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. ఎస్ అఖిల్ సాలుంకే 2, సయ్యద్ అతిక్ సల్మాన్ 2 వికెట్లు తీసుకున్నారు. కేఎస్ఆర్ఎం మైదానంలో.. కేఎస్ఆర్ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కడప జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 50.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఏ. శివకేశవ రాయల్ 63, సి. విజయ్ రామిరెడ్డి 35 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మహమ్మద్ 4, పి. అచ్యుతానంద 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 262 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 49.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ 84, నికిత్ గౌడ్ 54 పరుగులు చేశారు. కడప జట్టులోని ఏ. నాగ కుళ్లాయప్ప 3, షేక్ ఆదిల్ హుస్సేన్ 2 వికెట్లు తీసుకున్నారు.